-
‘సూపర్ సీఎం’ పాండియన్!
వి.కార్తికేయన్ పాండియన్. వయసు 49. వదులు చొక్కా, సాదాసీదా ప్యాంటు, కాళ్లకు చెప్పులు. అత్యంత నిరాడంబరమైన ఆహార్యం. కానీ ఒడిశా సీఎం, బిజూ జనతాదళ్ చీఫ్ నవీన్ పటా్నయక్ తర్వాత రాష్ట్రమంతటా ఆ స్థాయిలో మారుమోగుతున్న పేరు. నవీన్ వెనుక ఆయనే ప్రధాన చోదక శక్తి. అత్యంత నమ్మకస్తుడు కూడా. ఇటీవలే ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి బీజేడీలో చేరారు. ప్రభుత్వాధికారిగా ‘సూపర్ సీఎం’ అని, పారీ్టలో చేరాక ‘నంబర్ టూ’అని ముద్రపడ్డారు. పటా్నయక్ సలహాదారుగా, ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ 5టీ చైర్మన్గా కేబినెట్ హోదాలో ఉన్నారు. బీజేడీ ప్రధాన ప్రచారకర్తగా దూసుకుపోతున్నారు. ప్రధాని మోదీ మొదలుకుని రాహుల్గాంధీ దాకా పాండియన్నే లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తున్నారంటే ఒడిశా ఎన్నికలను ఆయన ఎంతగా ప్రభావితం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు! పటా్నయక్ రాజకీయ వారసునిగా కూడా పాండియన్ పేరు మారుమోగుతోంది... పాండియన్ది తమిళనాడులోని మదురై. 2000 బ్యాచ్ పంజాబ్ కేడర్ ఐఏఎస్ అధికారి. ఒడిశాకు చెందిన ఐఏఎస్ అధికారి సుజాత రౌత్ను పెళ్లాడారు. అలా 2002లో ఒడిశా కేడర్కు మారడం ఆయన కెరీర్లో కీలక మలుపు. ధర్మగఢ్ సబ్ కలెక్టర్గా ఒడిశాలో కెరీర్ ప్రారంభించారు. సీఎం సొంత జిల్లా మయూర్భంజ్, గంజాం కలెక్టర్గా చేశారు. 2011 నుంచి 12 ఏళ్లు పటా్నయక్ వ్యక్తిగత కార్యదర్శిగా చేశారు. ఆయనకు అత్యంత నమ్మకస్తునిగా మారారు. ఒడియా అనర్గళంగా మాట్లాడుతూ పలు కార్యక్రమాల ద్వారా ప్రజలకూ చేరువయ్యారు. 2023లో వీఆర్ఎస్ తీసుకుని బీజేడీలో చేరారు. నాటినుంచి పార్టీ నిర్ణయాలన్నింట్లోనూ ఆయనదే కీలక పాత్ర. 2014, 2019ల్లోనూ పటా్నయక్ ఎన్నికల వ్యూహాల్లో తెరవెనుక పాత్ర పాండియన్దే. ప్రభుత్వానికి, ప్రజలకు వారధి ఒడిశాలో నవీన్ ప్రజాదరణకు మూల కారణమైన ఫ్లాగ్షిప్ కార్యక్రమాలన్నింటి వెనకా ఉన్నది పాండియనే. సాధారణంగా యంత్రాంగంపై రాజకీయ ఆధిపత్యం దేశమంతటా ఉండే సమస్య. ఒడిశా మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం నుంచి వాటిపై స్పందన తెలుసుకునే దాకా అంతా ఐఏఎస్ల మయం. ఇందుకోసం పాండియన్ సారథ్యంలో ఐఏఎస్ల బృందమే పని చేసింది! ఒడిశాలో బజ్ వర్డ్గా మారిన 5టీ (బృంద కృషి, సాంకేతికత, పారదర్శకత, పరివర్తన, సమయం) సూత్రధారి కూడా పాండియనే. 2019 నుంచి అధికారులకు, ప్రాజెక్టులకు ఇదే మార్గదర్శి! దీనిలో భాగంగా నాలుగేళ్లలో ఏకంగా 460 రకాల ప్రభుత్వ సేవలు ఆన్లైన్లోకి వచ్చాయి. హెలికాప్టర్ వివాదం.. ప్రభుత్వ వ్యవహారాలతో పాటు రాజకీయంగానూ బీజేడీలో అడుగడుగునా పాండియన్దే జోక్యం. 2019 ఎన్నికల్లో పార్టీ వ్యూహాలు, ఎత్తుగడల నుంచి టికెట్ల పంపిణీ దాకా అన్నింటా ఆయనదే ప్రధాన భూమిక! అధికారిగా ఉంటూ ప్రభుత్వ హెలికాప్టర్లో 30 జిల్లాల్లోనూ పాండియన్ సుడిగాలి పర్యటన చేయడం తీవ్ర వివాదం రేపింది. ఇవి బీజేడీ ర్యాలీల్లా ఉన్నాయంటూ విపక్షాలు దుయ్యబట్టాయి. ఆలిండియా సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆయనపై కేంద్రానికి బీజేపీ ఫిర్యాదు కూడా చేసింది! పాండియన్ పెత్తనంపై బీజేడీలోనూ అసమ్మతి మొదలైంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన సీఎం పక్కనే ఉండటమే గాక ఒక్కరే సమావేశాలూ నిర్వహించడం, మంత్రులను కూడా పక్కకు పెట్టడం తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. అయినా పటా్నయక్ పట్టించుకోలేదు. పైగా పాండియన్ను విమర్శించినందుకు బీజేడీ ఉపాధ్యక్షురాలు, ఎమ్మెల్యే సౌమ్య రంజన్ను పదవి నుంచి తొలగించారు! నవీన్ వారసుడు...?! నవీన్ పూర్తిస్థాయిలో ‘ఒడియా అస్తిత్వ’ నినాదాన్ని ఎత్తుకునేలా చేసింది పాండియనే. దాంతో విపక్షాల విమర్శలకు ఆయనే లక్ష్యంగా మారారు. ‘‘పాండియన్ వల్ల ఒడియా ఉనికే ప్రమాదంలో పడింది. సమీప భవిష్యత్తులో బయటి వ్యక్తి ఒడిశా పాలకుడుగా మారే ప్రమాదముంది’’ అంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. బీజేపీ కూడా బీజేడీని ఎదుర్కోవాలంటే పాండియన్ను ఎదుర్కోవాలన్న ఆలోచనకు వచి్చంది. అందుకే ఆయన ‘బయటి వ్యక్తి’ అంటూ ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలంతా పదేపదే విమర్శిస్తున్నారు. ‘‘ఒడియా అస్మిత (ఆత్మగౌరవం) ప్రమాదంలో పడింది. ప్రజలు దీన్ని ఎక్కువ కాలం సహించబోరు’’ అని మోదీ ఇటీవల స్థానిక ప్రచార సభలో అన్నారు. పాండియన్ మాత్రం వీటిని తేలిగ్గా తోసిపుచ్చుతున్నారు. ‘‘నవీన్ పటా్నయక్ విలువలకు నేను సహజ వారసుడిని. ఒడిశా నా కర్మభూమి. పాతికేళ్లుగా ఇక్కడే పని చేస్తున్నా. నా భార్య, పిల్లలూ ఇక్కడివాళ్లే. ఒడిశా ప్రజలు నన్ను తమ వ్యక్తిగా ప్రేమిస్తున్నారు’’ అంటారు! – సాక్షి, న్యూఢిల్లీ -
ఏనుగుల గుంపు సంచారం
రాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్ అటవీ రేంజ్ పరిధి పొట్టంగిపొదొరొ, బొడొడెంగిలెలి అటవీ ప్రాంతాల్లో నాలుగు ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలియజేశారు. ఈ గ్రామాల్లోని పనస, మామిడి, పసుపు, అల్లం పంటలను ఏనుగులు మంగళవారం ధ్వంసం చేసినట్లు గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రేంజర్ చందన్ గొమాంగో ఆదేశాల మేరకు అటవీ సిబ్బంది ఆయా ప్రాంతాలకు వెళ్లి పరీక్షించగా నాలుగు ఏనుగులు సంచరిస్తున్నట్లు తెలిసింది. ఏనుగులను తరిమేందుకు చర్యలు చేపడుతున్నామని గ్రామస్తులు రాత్రి సమయంలో బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. దీంతొ ఏ క్షణంలొ ఏం జరుగుతుందోనన్న భయాందోళనకు గురవుతున్నారు. -
ఇసుక ట్రాక్టర్ ఢీ: బాలిక మృతి
రాయగడ: ఇసుక ట్రాక్టర్ ఢీకొని బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన చందిలి పొలీస్స్టేషన్ పరిధి కొత్తపేట–కొధొమల్లిగాం ప్రధాన రహదారిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకోగా.. కొంధొమల్లిగాం గ్రామానికి చెందిన లిప్సా దలాయ్ (12) దుర్మరణం చెందింది. విద్యార్థిని లిప్సా దలాయ్ ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో కొత్తపేట–కొంధొమల్లిగాం ప్రధాన రహదారి వద్ద ఎదురుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన బాలికను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదానికి కారణంగా భావిస్తున్న ట్రాక్టర్ను సీజ్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
ఈనెల 10న పీఎం మోదీ పర్యటన
● మాస్టర్ క్యాంటిన్ నుంచి రోడ్ షో భువనేశ్వర్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 10వ తేదీన భువనేశ్వర్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాస్టర్ క్యాంటీన్ కూడలి నుంచి వాణీవిహార్ వరకు జనపథ్ మార్గంలో రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధానమంత్రి భారీ ప్రచారం కమిషనరేట్ పోలీస్కు పెను సవాలు. ఈ నేపథ్యంలో భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేసేందుకు అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారు. కమిషనరేట్ పోలీసులతో పాటు ప్రధాని భద్రతను నిర్వహిస్తున్న ప్రత్యేక రక్షణ బృందం ఎస్పీజీ రోడ్ షో భద్రతా ఏర్పాట్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రధాని భద్రతకు సంబంధించిన ఎస్పీజీ బృందం రోడ్ షో స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించింది. కమిషనరేట్ పోలీసు, రోడ్లు భవనాలు శాఖ, భువనేశ్వర్ నగర పాలక సంస్థ బీఎంసీ అధికారులు ఎస్పీజీ బృందంతో కలిసి రామాలయ వీధి సమీపంలో సమగ్ర సన్నద్ధత ప్రక్రియను సమీక్షించారు. ఇరువైపులా బారికేడ్లు మాస్టర్ క్యాంటిన్ నుంచి వాణీ విహార్ వరకు రహదారికి ఇరువైపులా బలమైన బారికేడ్లు ఉంటాయి. అందువల్ల రహదారికి ఇరువైపులా ఉన్న అన్ని పెద్ద భవనాలు, షాపింగ్ మాల్స్, ఇతర మార్కెట్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రోడ్ షో సమయంలో వాటిని భద్రతా వలయం పరిధిలో ఉంచుతారు. షాపుల ముందు పోలీసు సిబ్బంది, మాల్ వద్ద సెక్యూరిటీ గార్డులు కాపలా ఏర్పాటు చేస్తారు. మార్కెట్ కాంప్లెక్స్ను పోలీసు క్యాంపు కనుసన్నల్లో ఉంచనున్నారు. కమిషనరేట్ పోలీస్లోని ట్రాఫిక్ వింగ్, సెక్యూరిటీ వింగ్, ఇంటెలిజెన్స్ వింగ్, కార్కేడ్ అధికారులు హాజరై భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన బ్లూ ప్రింట్ను సిద్ధం చేశారు. రోడ్ షోలో బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గోననున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారిస్తున్నారు. రోడ్ షో సందర్భంగా రోడ్డు వినియోగదారుల కోసం వాహనాల దారి మళ్లింపు ఏర్పాటు చేసి ప్రజలకు ముందుగానే సమాచారం అందించనున్నారు. ప్రధానమంత్రి భద్రతకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి తనిఖీ చేయబడుతోందని డీసీపీ ప్రతీక్ సింగ్ తెలిపారు. బ్లూ బుక్ నిబంధనల ప్రకారం భారీ బందోబస్తుతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్ షో మొత్తం సీసీ కెమెరాల నిఘాలో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటిస్తారు. -
పిప్పిలిలో బీజేడీకి షాక్..!
● స్వతంత్ర అభ్యర్థిగా రుద్ర మహారథి భార్య నామినేషన్ భువనేశ్వర్: పూరీ లోక్సభ నియోజకవర్గం పరిధి పిప్పిలి శాసనసభ నియోజకవర్గంలో అధికార బిజూ జనతా దళ్కు విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఈ నియోజకవర్గం నుంచి బీజేడీ అభ్యర్థిగా రుద్ర మహారథి త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ దాఖలు గడువు ముగిసే చివరి క్షణంలో ఆయన భార్య జాగృతి పండా స్వతంత్ర అభ్యర్థిగా పిప్పిలి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీకి నామినేషన్ దాఖలు చేయడం కలకలం రేపింది. బీజేడీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రుద్ర మహారథి పిప్పిలి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయన దివంగత బీజేడీ నాయకుడు, మాజీ మంత్రి ప్రదీప్ మహారథి కుమారుడు. తండ్రి మరణానంతరం జరిగిన ఉప ఎన్నికలో పోటీచేసి, 2021 సంవత్సరంలో శాసనసభకు ఎన్నికయ్యారు. ఈసారి పూర్తిస్థాయి ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోరుకు దిగిన తరుణంలో ఆయనపై పోటీకి భార్య స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగడం రాజకీయ వాతావరణం అకస్మాతుగా పలు మార్పులకు గురవుతోంది. పెదవి విప్పని జాగృతి ఈ పరిస్థితిపై జాగృతి పండా పెదవి కదపకుండా చాకచక్యంగా దాటవేశారు. అలాగే ఆమె భర్త, బీజేడీ అభ్యర్థిగా బరిలో ఉన్న రుద్ర మహారథి దీనిని తేలికగా పరిగణిస్తున్నట్లు హావభావాలు వ్యక్తం చేసి అలజడి నివారించారు. రాష్ట్రంలో ఈసారి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో పలు చోట్ల కుటుంబీకులు పోటీ చేస్తున్నారు. అదే తరహాలో ఇదొకటిగా పరిగణిస్తే తప్పేమి ఉందని పరోక్షంగా వ్యాఖ్యానించారు. జాగృతి పండా నామినేషను దాఖలు వాస్తవ ముఖ చిత్రం కొద్ది రోజుల్లో తేటతెల్లమైపోతుందని విశ్లేషకుల భోగట్టా. పోటీ నుంచి వైదొలిగేందుకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఆమె బరిలో ఉంటే తదుపరి రాజకీయ పరిణామాలపై చర్చ రసవత్తరంగా మారుతుందని ఈ వర్గం అభిప్రాయపడింది. ఆమె భర్తతో తలపడేందుకు చివరివరకు బరిలో కొనసాగుతుందా, లేనిది గురువారంతో తేలిపోతుంది. మొత్తం మీద పిప్పిలి నియోజకవర్గం వైపు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. నామినేషను దాఖలు వరకు ఎటువంటి అలికిడి లేకుండా అకస్మాతుగా జాగృతి పండా నామినేషను దాఖలుతో తెరపైకి ఎక్కడం చర్చనీయాంశమైంది. పూరీ పార్లమెంటరీ నియోజకవర్గంలో పిప్పిలి అసెంబ్లీ సెగ్మెంటు అత్యంత కీలకమైనది. ఈ నెల 25న ఈ నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. జాగృతి పండా ఆరంగేట్రం బీజేడీకి ఊహాతీత పరిణామం. సుమారు మరో 24 గంటల్లో ఆమె తుది నిర్ణయం స్పష్టం కానుంది. ఈ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
జోరుగా ఎన్నికల ప్రచారం
● బరంపురం బీజేడీ అభ్యర్థి భారీ రోడ్డు షో ● పాల్గొన్న కార్తీకేయ పాండ్యాన్ బరంపురం: ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తోంది. దీంతో అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. ఎన్నికల వేడి నింగిని తాకుతోంది. బరంపురం అసెంబ్లీ నియోజకవర్గం బీజేడీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా డాక్టర్ రమేష్చంద్రచావ్ పట్నాయక్ తరఫున టీ–5 కార్యదర్శి, రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వ్యక్తిగత కార్యదర్శి కార్తీకేయ పాండ్యాన్ బుధవారం బరంపురం నగరంలో నిర్వహించిన భారీ రోడ్డు షోలో పాల్గొన్నారు. ఫస్ట్గెట్ జంక్షన్ నుంచి ప్రారంభమైన రోడ్డు షో అస్కా రోడ్, గేట్ బజార్, కార్పొరేషన్ రోడ్డు, గిరిజ జంక్షన్, పాతబస్టాండ్, కోమ్మపల్లి జంక్షన్ మీదుగా లంజిపల్లి స్టేషన్ రోడ్, గుసానినువాగం, బెజ్జిపూర్ మీదుగా సాగింది. కార్తీకేయ పాండ్యాన్ ప్రజలకు అభివాదం చేస్తూ ఆకట్టుకున్నారు. డాక్టర్ రమేష్చంద్రచావ్ పట్నాయక్కు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో నగర మేయర్ సంఘమిత్ర దోళాయితో పాటు పలువురు పార్టీ నాయకులు, అధికసంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. -
ఘనంగా ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం
జయపురం: ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని జయపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుదవారం ఘనంగా నిర్వహించారు. విద్యాలయ జూనియర్ రెడ్క్రాస్ జయపురం శాఖ నిర్వహించిన ఈ ఉత్సవానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రకాశ్ చంద్ర పట్నాయక్ అధ్యక్షత వహించారు. ఈ ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవంలో జూనియర్ రెడ్క్రాస్ అధికారి యజ్ఞేశ్వర పండ ముఖ్య వక్తగా పాల్గొని రెడ్క్రాస్ పితామహుడు హెనరీ డునాండ్ జీవనాన్ని, రెడ్క్రాస్ ఏర్పాటు ప్రధాన లక్ష్యాలను తెలియజేశారు. మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో నిస్సహాయులకు, ప్రకృతి విపత్తులలో బాధితులకు అందిస్తున్న సేవలను వివరించారు. జూనియర్ రెడ్క్రాస్ పరామర్శదాత శుభలక్ష్మీ సాహు మాట్లాడుతూ జూనియర్ రెడ్క్రాస్, రెడ్క్రాస్ల ప్రధాన లక్ష్యాలను, ఆశయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో హరిహర చరడి, సొంబురు జాని, డుంబురు జాని, క్షీరసింధు సాహు, మహావీర ప్రధాన్ తదితరులు ప్రసంగించారు. పాఠశాల ప్రాంగణంలో గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రెడ్క్రాస్ పితామహుడు హెనరీ డునాండ్ విగ్రహానికి పూలమాలలు వేశారు. మల్కన్గిరిలో.. మల్కన్గిరి: మల్కన్గిరి కాలేజ్లో ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా అటవి సంరక్షణాధికారి మన్సున్ ఖేముండు హాజరయ్యారు. ఈ రెడ్క్రాస్ సంస్థ ఎంతోమంది ప్రాణాలు కాపడిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేద్బ్ర్ ప్రధన్, మల్కన్గిరి కాలేజ్ ప్రిన్సిపాల్ లింగరాజ్ మిశ్రో, ఆశోక్ సోడాంగి, తదితరులు పాల్గొన్నారు. -
బీజేడీ విజయం ఖాయం
● బీజేపీ కుతంత్రాలు పనిచేయవు ● పార్టీ 5టీ చైర్మన్ వి.కె.పాండ్యన్ భువనేశ్వర్: రానున్న ఎన్నికల్లో బిజూ జనతా దళ్ క్లీన్ స్వీప్ చేయనుందని ఆ పార్టీ వ్యూహకర్త, 5టీ చైర్మన్ వి.కె.పాండ్యన్ బుధవారం విలేకర్ల సమావేశంలో తెలిపారు. ఎన్నికల తర్వాత చీలిక సూత్రంతో బీజేడీలో వైరి భావాల్ని భారతీయ జనతా పార్టీ ప్రేరేపిస్తోందని భవిష్యత్ కుతంత్రం గూర్చి వివరించారు. అతి తక్కువగా 60 శాసన సభ స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపేందుకు బీజేపీ నానా తంటాలు పడుతోందన్నారు. ఎన్నికల్లో గెలవడం ఆ పార్టీ ధ్యేయం కాదని, రాష్ట్రంలో 50 నుంచి 60 సీట్లు గెలవడం కోసం ఆరాటపడుతుందన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటకలలో ఇతర పార్టీలతో చేసిన విధంగా వారు బిజూ జనతా దళ్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉందన్నారు. ఇది వారు అంతర్గతంగా పన్నుతున్న వ్యూహమన్నారు. బీజేపీ జాతీయ నాయకులు వరుసగా 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో ప్రచారం చేశారని, వారి ప్రచారం ఎన్నికల ఫలితాలపై పెద్దగా ప్రభావం చూపలేదన్నారు. ఒడిశా ప్రజలు నవీన్ పట్నాయక్ను ఎక్కువగా విశ్వసించారన్నారు. ప్రత్యర్థులకు రాష్ట్ర ప్రజలు గతంలో తగిన సమాధానం ఇచ్చారన్నారు. ఓ వైపు నవీన్ పట్నాయక్ ... మరోవైపు విపక్షాల భారీ సైన్యం ఉందని, ఈసారి కూడా అవే ఫలితాలు ఉంటాయన్నారు. జూన్ 9న వరుసగా 6వ సారి ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ ప్రమాణ స్వీకారం చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. తొమ్మిది మంది చొప్పున లోక్ సభ అభ్యర్థులను ప్రకటించిన పార్టీకి 9వ సంఖ్య ప్రాముఖ్యతను ఆయన వెల్లడించారు. ఇది మూఢనమ్మకం కాదు, గ్రంథాల ఆధారంగా, హిందూ మతంలో 9కి ఉన్న ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి మీరు గూగుల్ చేయవచ్చని సూచించారు. ఈ ప్రయత్నం నవీన్ పట్నాయక్కు మరింత బలంగా ఆశీర్వదించి పట్టం కడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 13న ఒడిశాలో జరిగే తొలి రౌండ్ ఎన్నికల్లో పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. అలాగే తన బలం మరింత మెరుగుపరుచుకోనుందన్నారు. అవిభక్త కొరాపుట్ జిల్లాలో కాంగ్రెస్తో పోరు జోరుగా ఉంటుందని, కలహండిలో 2 నుంచి 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ కొంత ఉనికిని చాటుకుంటుందన్నారు. ముఖ్యమంత్రిపై ప్రజలకు అపారమైన విశ్వాసం, అమితమైన ప్రేమ ఉన్నందున గంజాంలో ఏకపక్ష పోరుకు సాక్షిగా బీజేడీ నిలుస్తుందన్నారు. సమగ్రంగా రాష్ట్రంలో జరగనున్న నాలుగు రౌండ్లలో బీజేడీ క్లీన్ స్వీప్ చేస్తుందని జోష్యం చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు – 2024 బిజూ జనతా దళ్ ప్రచారానికి నవీన్ పట్నాయక్ నాయకత్వం వహిస్తున్నారని, మేమంతా అతని జట్టులో ఉన్నామని, ఒడిశాను అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి పోరాడుతున్నామన్నారు. కొందరు ముందంజలో, ఇంకొందరు మధ్యలో, మరికొందరు వెనుకవైపు ఉంటూ సార్వత్రిక ఎన్నికల ఆటలో ఆద్యంతం ధీటైన పోటీకి నిలిచి తుది ఫలితాల్లో విజేతగా నిలుస్తామని తెలిపారు. ఈ ఆటలో అట్టడుగు కార్యకర్తతో సహా ప్రతి ఆటగాడు ముఖ్యమేనని పేర్కొన్నారు. -
13 పింక్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
జయపురం: ఈ నెల 13 వ తేదీన జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జయపురం మున్సిపాలిటీ పరిధిలో మహిళల కోసం 13 పింక్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జయపురంలో 90 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పింక్ పోలింగ్ కేంద్రాల్లో కేవలం మహిళలు మాత్రం ఓటు వేస్తారని మున్సిపాలిటీ కార్యనిర్వాహక శాఖ అధికారి సిద్ధార్థ పట్నాయక్ బుధవారం వెల్లడించారు. ఈ కేంద్రాల్లో మహిళా సివిల్ అధికారులు, ఉద్యోగులు మాత్రమే ప్రిసైడింగ్, పోలింగ్ సిబ్బందిగా వ్యవహరిస్తారు. ఎన్నికలకు మూడు రోజుల ముందు అన్ని పోలింగ్ బూత్లను శుభ్రపరచి అవసరమైన సౌకర్యాలు పరిశీలిస్తామని తెలిపారు. మహిళా ఓటర్లను ప్రోత్సహించేందుకు, ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక బూత్ను ఏర్పాటు చేశామన్నారు. అప్పర్ కొలాబ్ ఇరిగేషన్ కాలనీలో గల ఇరిగేషన్ ప్రాజెక్టు ఉన్నత పాఠశాలలో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూడు బూత్లు, పాయిక వీధి ప్రభుత్వ మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలలో రెండు బూత్లు, ప్రభుత్వ సెంట్రల్ ప్రాథమిక పాఠశాలలో రెండు బూత్లు, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో మూడు, మహారాణిపేట ప్రాథమిక పాఠశాలలో ఒకటి పింక్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆరు పర్యావరణ అనుకూల బూత్లను ఏర్పాటు చేశామని, వాటిలో ఇరిగేషన్ ప్రాజెక్టు ఉన్నత పాఠశాలలో ఒకటి, జయనగర్ ప్రాథమిక సేవా కేంద్రంలో మూడు, జేఈఎల్సీ హైస్కూల్ సెంటర్లో రెండు బూత్లు ఉంటాయన్నారు. పట్టణంలో గల అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లకు తాగునీరు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, తదితర మౌలిక సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. -
గంజాంలో సీఎం పర్యటన నేడు
బరంపురం: గంజాం జిల్లాలోని ఎన్నికల ప్రచారం నిమిత్తం సీఎం నవీన్ పట్నాయక్ గురువారం పర్యటించారు. దీనిలో భాగంగా గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లోని నవీన్ నివాస్ నుంచి బిజూ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకొని ప్రత్యేక హెలీకాప్టర్లో గంజాం జిల్లా బరంపురం నగరానికి దగ్గర రొంగయిలొండా పరిఽధిలోని పాలురు హిల్స్లో దిగుతారు. అక్కడకి దగ్గర కొరపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ప్రత్యేక హెలీకాఫ్టర్లో అస్కా వెళ్లనున్నారు. అక్కడ కూడా పార్టీ బహిరంగ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం కొందమాల్ జిల్లా పుల్భణికి చేరుకొని ప్రసగించనున్నారు. తిరిగి పుల్భణి నుంచి ప్రత్యేక హెలీకాఫ్టర్లో రాష్ట్ర రాజధాని భువనేశ్వర్కి పయనమవుతారు. యువకుడి నుంచి తుపాకీ స్వాధీనం జయపురం: సబ్ డివిజన్ పరిధి కుంద్రా సమితిలో ఒక యువకుడి వద్ద కుంద్రా పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం రాజకుంద్రా జంక్షన్ వద్ద ఆ యువకుడి వద్ద తుపాకీ కనుగొన్నట్లు పోలీసు అధికారి వెల్లడించారు. పట్టుబడిన వ్యక్తి జయపురం సమితి కొరాపుట్కు చెందిన రాజేష్ హరిజన్(25) అని వెల్లడించారు. రాజేష్ హరిజన్కి గతంలో అనేక నేరాలతో సంబంధం ఉన్నట్లు తమ వద్ద సమాచారం ఉన్నట్లు వెల్లడించారు. అతడిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించామని పేర్కొన్నారు. వారాంతపు సంతలే ప్రచార వేదికలురాయగడ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రచారానికి కొద్దిరోజులు మాత్రమే గడువు ఉండడంతో తక్కువ సమయంలో ఎక్కువ ప్రచారం జరిగేలా ప్రధాన పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాలో జరిగే వారాంతపు సంతలపై ప్రచారానికి అధిక దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని బిసంకటక్ శాసనసభ నియోజకవర్గం నుంచి మూడోసారి వరుసగా పోటీ చేస్తున్న రాష్ట్ర ఆదివాసీ, హరిజన సంక్షేమ శాఖ మంత్రి జగన్నాథ సరక నియోజకవర్గం పరిధిలోని డుకుం వారపు సంతలో ప్రచారాన్ని బుధవారం కొనసాగించారు. ఆయనతో పాటు బీజేడీ రాష్ట్రశాఖ సాధారణ కార్యదర్శి సుధీర్ దాస్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సరక మాట్లాడుతూ రెండుసార్లు ఈ నియోజకవర్గం నుంచి మరోసారి అవకాశం కల్పిస్తే నియోజకవర్గంలోని పెండింగ్ పనులను పూర్తి చేయనున్నట్లు తెలియజేశారు. నవీన్ పట్నాయక్ మరోసారి ముఖ్యమంత్రిగా గెలుస్తున్నారని దీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ నియోజకవర్గం అభివృద్ధి దిశగా పయనిస్తోందని పేర్కొన్నారు. 3.77 కేజీల బంగారం స్వాధీనం ● నలుగురు అరెస్టు భువనేశ్వర్: స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.2.79 కోట్ల విలువైన 3.77 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) బుధవారం తెలిపింది. ఈ నెల 6న దుబాయ్ నుంచి భువనేశ్వర్ చేరుకున్న నలుగురు అనుమానిత ప్రయాణీకులను నిఘా ఆధారంగా గుర్తించారు. వారిని విచారించగా.. పురీషనాళంలో దాచి పేస్ట్ రూపంలో అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించినట్లు తేలింది. దర్యాప్తులో పేస్ట్ రూపంలో ఉన్న బంగారం మొత్తం 12 బిస్కెట్లు బయటపడ్డాయి. ప్రత్యేక ప్రక్రియతో వీటి నుంచి 3.77 కిలోల బరువున్న బంగారం తీశారు. నలుగురు నిందిత ప్రయాణికులను కస్టమ్స్ చట్టం, 1962 నిబంధనల ప్రకారం అరెస్టు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని డీఆర్ఐ తెలిపింది. డుకుం సంతలో మాట్లాడుతున్న మంత్రి సరక -
కలెక్టర్పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేస్తాం
● పర్లాకిమిడి ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు పర్లాకిమిడి: గజపతి జిల్లా కలెక్టర్ అధికార పార్టీ బిజేడీ అభ్యర్థికి కోమ్ముకాస్తూ ఈ ఎన్నికల్లో పక్షపాతి వైఖరి అవలంభిస్తున్నారని, దీనిపై ఎలక్షన్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని పర్లాకిమిడి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోడూరు నారాయణరావు అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడారు. కాశీనగర్లో బీజేడీ పార్టీ అభ్యర్థితో పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అధికారి జాకబ్ గోమాంగో తిరుగుతుండటంతో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, ఆయనను జిల్లా పంచాయతీ కార్యాలయానికి తరలించారన్నారు. జాకబ్ గోమాంగో గుమ్మా బ్లాక్ అధ్యక్షురాలు సునేమీ గోమాంగో భర్త కావడంతో కలెక్టర్ అనుకూలంగా మార్చుకున్నారన్నారు. గుసాని సమితి పాటికోట పంచాయతీ సెక్రటరీ అడపా వెంకటరావు కూడా బహిరంగంగా బీజేడీ అఽభ్యర్థితో కలిసి ప్రచారం చేస్తున్నా.. కలెక్టర్ ఎటువంటి ఎన్నికల క్రమశిక్షణ చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. పర్లాకిమిడిలో పలువురు డీలర్లు జమ్మిదార్ పట్నాయక్ తదితరులు ఎన్నికల్లో బీజేడీ తరఫున బహిరంగంగా ప్రచారం చేస్తున్నారన్నారు. మంగళవారం గజపతి స్టేడియానికి అనధికారంగా ఒక హెలికాప్టర్తో డబ్బు సంచులు వచ్చినట్టు సమాచారం ఉందని ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. న్యాయవాది, బీజేపీ ప్రతినిధి పృధ్వీరాజ్ చౌహాన్, ఛిత్రి సింహాద్రి పాల్గొన్నారు. -
ఆలూ లేదు.. చూలు లేదు..!
● రాష్ట్రంలో ఇంకా మొదలవ్వని పోలింగ్ ● అప్పుడే ప్రమాణ స్వీకారాలకు పిలుపులు ● జూన్ 9న బీజేడీ, 10న బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన సరికొత్త శైలి భువనేశ్వర్: ఆలూ లేదు.. చూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అన్నట్లు మారింది రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల పరిస్థితి. రాష్ట్రంలో ఇంకా పోలింగ్ ప్రక్రియ మొదలవ్వకముందే ప్రమాణ స్వీకారాలకు పిలుపులు అంటూ హడావుడి చేస్తున్నాయి. కొత్త ప్రభుత్వాల ఏర్పాటుకు ముహూర్తాలు ఖరారు చేసి రాష్ట్ర ప్రజలకు సోషల్ మీడియా వేదిక నుంచి ఆహ్వానాలు పంపాయి. ఇంకా ఓటరు నాడి తెలియక ముందే పార్టీలు ఈవిధంగా పిలుపునివ్వడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ● సుమూహూర్తాలు ఖరారు జూన్ 9వ తేదీ ఉదయం 11.30 గంటలకు భువనేశ్వర్లోని జనతా మైదాన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని బిజూ జనతా దళ్ ప్రకటించింది. అదేవిధంగా జూన్ 10న రాష్ట్రంలో తొలిసారిగా డబుల్ ఇంజిన్ సర్కారు బీజేపీ నేతృత్వంలో ఏర్పాటు అవుతుందని, ఆ రోజున రాజధాని భువనేశ్వర్లో బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ కార్యక్రమాలకు ప్రజలంతా ఆహ్వానితులేనని ఇరుపార్టీల నేతలు పిలుపునిచ్చారు. ● పగటి కలలు కంటున్నారు: సీఎం నవీన్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఆ పార్టీ పెద్దలు పగటి కలలు కంటున్నారని సీఎం నవీన్ పట్నాయక్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని అనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. మరోసారి రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు అందజేయడానికి బీజేడీ ప్రభుత్వమే ఏర్పడుతుందని దీమా వ్యక్తం చేశారు. ●బీజేడీ కథ ముగుస్తుంది: పీఎం మోదీ ఈ సార్వత్రిక ఎన్నికలతో రాష్ట్రంలో బీజేడీ కథ ముగుస్తుందని పీఎం నరేంద్ర మోదీ అన్నారు. జూన్ 4తో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం గద్దె దిగడం తథ్యమన్నారు. బీజేపీ ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టడం ఖాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలంతా ఆహ్వానితులేనని సభాముఖంగా పిలుపునిచ్చారు. ● బీజేడీ ఉలికిపాటు నిజానికి పీఎం మోదీ ప్రకటనతో బీజేడీ ఉలికిపాటుకు గురైంది. ప్రచార సభ వేదిక నుంచి మోదీ బహిరంగ ప్రకటనపై బీజేడీ అకస్తాతుగా ప్రతిస్పందించింది. సాంఘిక ప్రసార (ఎక్స్ హ్యాండిల్) మాధ్యమంలో బీజేపీ దీమాని ఖండించే సందేశంతో ఓటరుని కిర్రెక్కించింది. మోదీ ప్రకటన పేర్కొన్న నేపథ్యంలో బిజూ జనతా దళ్ (బీజేడీ) సోషల్ మీడియాలో వినూత్న ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వరుసగా ఆరోసారి నవీన్ పట్నాయక్ ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేడీ అధికార ప్రతినిధి డాక్టర్ సస్మిత్ పాత్రో సాంఘిక మాధ్యమంలో ప్రకటించి ప్రజలకు ఆహ్వానం పలికారు. ●అధికారంపై ఆశలు సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలతో సరికొత్త రికార్డులు నెలకొలుపుతామని ఉభయ బిజూ జనతా దళ్, భారతీయ జనతా పార్టీ ఆశలు పెట్టుకున్నాయి. దీర్ఘకాలిక ముఖ్యమంత్రిగా రికార్డు కోసం బీజేడీ, చారిత్రాత్మకంగా తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ ఘంటాపథంగా చెబుతున్నాయి. వరుసగా ఆరోసారి ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ రాష్ట్రంలో బీజేడీ సర్కారు ఏర్పాటు చేసి దీర్ఘకాలిక ముఖ్యమంత్రిగా జాతీయ రికార్డు నెలకొలుపుతామని అధికార పక్షం ఆశల పల్లకిలో ఊరేగుతోంది. దీర్ఘ కాలిక నవీన్ సర్కారుని గద్దె దించి తొలిసారిగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి సరికొత్త చరిత్ర ఆవిష్కరిస్తుందని బీజేపీ ఊహల పల్లకిలో తేలియాడుతోంది. ఈసారి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో సరికొత్త శైలి ఓటరు వర్గాన్ని ఆలోచింపజేస్తోంది. ఎన్నికల్లో గెలిచేందుకు ఓటరుని అభ్యర్థించే సంప్రదాయం దారి మల్లింది. సర్కారు ఏర్పాటు చేయడం తథ్యమని ఓటరు నిర్ణయాన్ని ముందస్తుగా నిర్ధారించి ఓటరుని పరోక్షంగా ఉభయ అధికార బీజేడీ, ప్రధాన విపక్షం బీజేపీ బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజాతంత్ర వ్యవస్థలో ఓటరు నిర్ణయాత్మక శక్తిని క్రమంగా నీరు గారించే కుతంత్ర సంస్కృతి బీజం నాటుకుంటుంది. ఈ పరిస్థితిపై సగటు ఓటరు విచక్షణతో ఓటుహక్కు అధికారాన్ని శక్తివంతంగా ప్రయోగించే ప్రజాస్వామ్య సంప్రదాయ పరిరక్షణ దిశలో అడుగు వేయాల్సిన సమయం ఆసన్నమైనట్లు గుర్తించాల్సి ఉంది. -
మూడుకు చేరిన వడదెబ్బ మృతుల సంఖ్య
భువనేశ్వర్: రాష్ట్రంలో ఇప్పటివరకు 3 మంది వడదెబ్బ కారణంగా మృతి చెందినట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ధ్రువీకరించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 786 వడదెబ్బ కేసులు నమోదయ్యాయి. విచారణ, సంయుక్త విచారణ మరియు పోస్ట్మార్టం ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇప్పటివరకు వడదెబ్బ కారణంగా మూడు మరణాలు నిర్ధారించబడ్డాయి. మరో 17 కేసులు పరిశీలనలో ఉన్నాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ బిజయ్ కుమార్ మహాపాత్రో తెలిపారు. గత రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ తగ్గడంతో పరిస్థితి మెరుగుపడిందని, ప్రస్తుతానికి ఎలాంటి సమస్య లేదని పేర్కొన్నారు. -
పట్టాలు తప్పిన బీజేడీ పాలన
● ఒడిశాలో రామరాజ్యం తీసుకొస్తాం ● కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ ● రాయగడలో ఎన్నికల ప్రచారం రాయగడ: ఎంతో నమ్మకంతో ఒడిశా రాష్ట్ర ప్రజలు బీజేడీ పార్టీని నమ్మారు. వారి అమాయకత్వాన్ని ఆసరగా తీసుకున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలం పాటు పరిపాలించారు. అయితే ఆయన పాలన పట్టాలు తప్పింది. ప్రజలకు సుస్థిర పాలన అందించడం మాట అటుంచితే వారి నమ్మకాలను వమ్ము చేశారని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆయన బుధవారం రాయగడకు వచ్చి బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. స్థానిక జీఐఏసీఆర్ మైదానంలో విజయసంకల్ప సమావేశం పేరిట నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పొశారు. ఆర్థిక రంగంలో ఒడిశా రాష్ట్రం చాలా వెనుకబడిందని అన్నారు. గత 25 ఏళ్ల బీజేడీ పాలనలోప్రజలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఆదివాసీ, హరిజన తెగలకు చెందిన వారి ఆర్థిక, సామాజిక రంగాల్లో ప్రగతి జాడలు కనిపించలేదని రాజ్నాథ్ సింగ్ అన్నారు. రాష్ట్రంలో రామరాజ్యం ఖాయం త్వరలొ జరగనున్న ఎన్నికల్లో ఒడిశా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అశాభావాన్ని వ్యక్తం చేశారు. బీజేపీకి ప్రజలు మద్దతు పలికితే రామరాజ్యం అంటే ఏమిటో చూపిస్తామని చెప్పారు. కేంద్రంలో నరేంద్రమోదీ సర్కార్ మరోసారి అధికార పగ్గాలు చేపట్టనున్న నేపథ్యంలో ఒడిశాలో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తే డబల్ ఇంజిన్ సర్కార్ పనితీరు ఎలా ఉంటుందో చూపిస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక, సామాజిక రంగాల్లో పురోగతిని చూపిస్తామని, రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యే శ్రద్ధ కనబరుస్తామని భరోసా ఇచ్చారు. వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కేలా తగుచర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులే దేశానికి వెన్నెముక అన్న నానుడికి సరైన అర్థాన్ని చూపిస్తామని పేర్కొన్నారు. ఆధునిక, సాంకేతిక పరంగా రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తామని చెప్పారు. కొత్త పరిశ్రమలకు బాటలు వేసి నిరుద్యోగ సమస్యను నిర్మూలించేందుకు మార్గాలను అన్వేషిస్తామన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అధికార బీజేడీ పాలనలో విసుగెత్తిన ప్రజలు మార్పు కొరుకుంటున్నారని రాజ్నాథ్ సింగ్ వివరించారు. ప్రచార సభలకు ఎక్కడికి వెళ్లినా ప్రజలు గళమెత్తి చెబుతున్నారని అన్నారు. దీనిబట్టి చూస్తే ఈసారి ఒడిశాలో మార్పు అనివార్యంగా కనిపిస్తోందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ పొటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. అగ్రరాజ్యాల్లో భారత్కు ప్రత్యేక గౌరవం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపొయిందని రాజ్నాథ్ అన్నారు. ముఖ్యంగా అగ్రరాజ్యాల్లో భారతదేశం ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోగలిగిందని చెప్పారు. ఆర్థిక రంగంలో పెనుమార్పులు తీసుకువచ్చిందని అన్నారు. పేదరిక నిర్మూలనకు విశేషంగా కృషిచేసినట్టు వివరించారు. సుమారు 25 కోట్ల మంది పేదిరికం నుంచి బయటపడేలా మోదీ సర్కార్ ప్రత్యేక శ్రద్ధను తీసుకుందన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు పేలకు వరాలుగా మారాయన్నారు. సుమారు 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని భ్రష్టుపట్టించిందని విమర్శించారు. కాంగ్రెస్ వంటి పాలనకు మద్దతు పలికితే మరో 60 ఏళ్లు దేశం వెనుకబడటం ఖాయమని అన్నారు. ఆధునిక, సాంకేతిక రంగాల్లో దూసుకుపొతున్న దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలంటే ఈసారి కూడా మోదీసర్కార్ అనివార్యమని చెప్పారు. ప్రజలు దీన్ని గమనించి సరైన నిర్ణయాన్ని తీసుకోవాలని సూచించారు. కరోనా సమయంలో.. కరోన వంటి విపత్కర సమయంలో దేశం అతలాకుతలం అయిందన్నారు. అయితే ఈ మహమ్మారిని తరిమికొట్టే విషయంలో మన వైజ్ఞానికులు ఎంతో శ్రమించారని కొనియాడారు. మన దేశంలో కనిపెట్టిన కరోన నిరోధక వ్యాక్సిన్లు ఇతర దేశాలకు పంపించడంలో సత్తాచాటుకున్నామన్నారు. మన దేశం వైజ్ఞానిక పరంగా మరింత ముందుకు దూసుకుపోతోందన్నారు. భారతదేశం అంటే ప్రపంచ దేశాల్లో మంచి గుర్తింపును తీసుకువచ్చిన ప్రధాని మోదీని మరోసారి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ పక్కా గృహాలు కూడు, గూడు, గుడ్డ వంటి మౌలిక సౌకర్యాలను ప్రజలకు అందేలా బీజేపీ సర్కార్ ఎన్నో సంస్కరణలను తీసుకువస్తుందని అన్నారు . మరో ఐదేళ్ల పాలనలో అర్హులైన అందరికీ పక్కా గృహాలను నిర్మించి ఇవ్వడమే ధ్యేయమని చెప్పారు. ఈ ఎన్నికల్లో రాయగడ జిల్లాలోని మూడు అసెంబ్లీ, కొరాపుట్ లొక్సభ స్థానాలకు బీజేపీ తరఫున పొటీ చేస్తున్న అభ్యర్థులు యువకులని వారిని గెలిపించాలని కోరారు. రాజ్నాథ్కు ఘన సన్మానం బహిరంగ సభకు హాజరైన రాజ్నాథ్ సింగ్ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ పట్నాయక్, పార్టీ సీనియర్ నాయకులు గొవింద్ జైన్, కార్యకర్తలు గజమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం రాయగడ మజ్జిగౌరి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. జిల్లాలోని కల్యాణసింగుపూర్ సమితి పర్శాలిలోని డొంగిరియా తెగకు చెందిన ఆదివాసీ మహిళలు స్వయంగా రూపొందించిన సాల్ను కేంద్ర మంత్రి రాజ్నాథ్కు అందజేశారు. కేంద్ర మంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసి ఫొటో దిగారు. -
ఆదివాసీలకు కార్పొరేట్ వైద్యం
● ఏరియా ఆస్పత్రిగా సామాజిక ఆస్పత్రి అప్గ్రేడేషన్ ● రూ.19 కోట్లతో అదనపు భవనాల నిర్మాణం ● అందుబాటులో స్పెషలిస్టు డాక్టర్లు ● ఎక్స్రే, స్కానింగ్ ఏర్పాటు ● నెలకు 100 నుంచి 120 ప్రసవాలు ● 37 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు ● రూ.50 కోట్లతో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం సీతంపేట: టీడీపీ ప్రభుత్వం హయాంలో గగనమైన వైద్యసేవలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మెరుగుపడ్డాయి. సీతంపేటలోని సామాజిక ఆస్పత్రిని పట్టించుకోకుండా అప్పటి ప్రభుత్వం గాలికి వదిలేయగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి చొరవతో రూ.19 కోట్లతో అదనపు భవనా ల నిర్మాణం చేపట్టారు. సీహెచ్సీని ఏరియా ఆస్పత్రిగా మార్పు చేశారు. రూ.50 కోట్లతో మల్టీ సూప ర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. ఉన్న పీహెచ్సీలను నాడు–నేడు ద్వారా అభివృద్ధి చేశారు. ఆదివాసీలకు కార్పొరేట్ తరహా వైద్యం అందివ్వాల నే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పానికి అనుగుణంగా ఇక్కడ వైద్య సేవలు అందుతున్నాయి. స్థానికంగా మల్టీసూపర్స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం పూర్తయి ప్రారంభిస్తే పాలకొండ, భామిని, వీరఘట్టం, సీతంపేట అలాగే ఒడిశా సరిహద్దున ఉన్న గ్రామాలతో పాటు శ్రీకాకుళం జి ల్లా పరిధిలోని కొత్తూరు, హిరమండలం, మెళియాపుట్టి, పాతపట్నం తదితర మండలాల గిరిజనుల వైద్యసేవలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికే స్థానిక ఏరియా ఆస్పత్రిలోని ఒక విభాగంలో పనులు పూర్తయ్యాయి. ఈ ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు ఉండడంతో సీతంపేటతో పాటు ఇతర మండలాల నుంచి రోగుల తాకిడి పెరిగింది. ఆరోగ్యశ్రీ సేవలు.. ఆరోగ్యశ్రీ ఎంప్యానల్మెంట్లో సీతంపేట ఏరియా ఆస్పత్రి రాష్ట్రంలో మూడో స్థానం దక్కించుకుంది. ఆరోగ్యశ్రీలో కొత్తగా ఈఎన్టీ, ఆర్థో శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. వార్డులో 37 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశారు. అలాగే ఎక్స్రే, గైనిక్ స్కానింగ్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల రక్తపరీక్షలు ఇక్కడే చేస్తున్నారు. మందులన్నీ అందుబాటులో ఉన్నాయి. జనరల్ మెడిసిన్, గైనిక్, ఈ ఎన్టీ,ఆర్థో, పిడియాట్రిక్, డెంటిస్ట్ సేవలకు వైద్యాధికారులు ఉన్నారు. రెగ్యులర్ సిబ్బంది 28 మంది, కాంట్రాక్ట్ సిబ్బంది 20 మంది, అవుట్ సోర్సింగ్లో 16 మంది పనిచేస్తున్నారు. నెలకు 100 నుంచి 120 వరకు ప్రసవాలు ఆస్పత్రిలోనే జరుగుతున్నాయి. శిశువులకు ఎస్ఎన్సీయూ.. స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్ ద్వారా అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు ప్రత్యేక వైద్యం అందుతోంది. ఫొటోథెరపీ, సీప్యాప్, వార్మర్లు, వెంటిలేట ర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. పోషకాహార లోపం కలిగిన చిన్నారులకు న్యూట్రిషియన్ రిహ్యాబిలిటేష న్ సెంటర్ ద్వారా పోషకాహారాన్ని అందిస్తున్నారు. బరువు తక్కువ ఉన్న చిన్నారులను ఇక్కడ చేర్పించి సరైన పోషకాహారం ఇవ్వడం ద్వారా పిల్లలకు ఆరో గ్యాన్ని అందజేస్తున్నారు. అలాగే ఈ ఆస్పత్రిలో పిజియోథెరఫీ యూనిట్ను ఏర్పాటు చేయడం ద్వారా అవసరమైన సేవలు అందుతున్నాయి. సక్రమంగా వైద్యసేవలు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన రోగులకు సక్రమంగా వైద్యసేవలు అందుతున్నాయి. ఏరియా ఆస్పత్రికి వచ్చిన వెంటనే స్పందిస్తున్నారు. –ఎస్.సరోజిని, రాజన్నగూడ గిరిజనుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద గిరిజనుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. గతంలో కంటే వైద్యసేవలు పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. రిఫరల్ కేసులు కూడా లేవు. అందరు డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. –ఎన్.కాంతారావు, గిరిజన నాయకుడు, దేవనాపురం -
రావాలి జగన్.. కావాలి జగన్..
విజయనగరం: వైఎస్సార్సీపీ విజయనగరం నియోజకవర్గం ఆధ్వర్యంలో తలపెట్టిన బైక్ ర్యాలీకి అనూహ్య స్పందన లభించింది. మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన ర్యాలీలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వైఎస్సార్సీపీ అభ్యర్థులకు మద్దతుగా నినాదాలు చేశారు. మహిళలు చేపట్టిన ర్యాలీతో ప్రధాన రహదారులు జనసంద్రంగా మారాయి. జై జగన్.. జైజై జగన్.. రావాలి జగన్.. కావాలి జగన్ వంటి నినాదాలు హోరెత్తాయి. కోలగట్ల వీరభద్రస్వామి నివాసం నుంచి ప్రారంభమైన మహిళా బైక్ ర్యాలీ ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, కోట జంక్షన్, దాసన్నపేట, ఖాదర్నగర్, ప్రేమ సమాజం, మూడు లాంతర్లు, కన్యకా పరమేశ్వరి ఆలయం, సీఎంఆర్ జంక్షన్, రైల్వేస్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, అంబేడ్కర్ జంక్షన్ మీదుగా కోలగట్ల నివాసానికి చేరింది. బైక్ ర్యాలీని ప్రారంభించిన వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోలగట్ల వీరభద్ర స్వామితోనే సాధ్యమని చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నేతృత్వంలో సంక్షేమ, అభివృద్ధి పాలన సాగుతోందన్నారు. ఎన్నికల హామీలు శతశాతం అమలు చేశారని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమ పాలన చూసి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు అక్కసుతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయాలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. మహిళా సాధికారతకు కృషి చేసిన జగన్ మోహన్రెడ్డికి రెండు ఓట్లను రాఖీలుగా భావించి బహుమతిగా ఇస్తామని తెలిపారు. ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ను, ఎమ్మెల్యేగా కోలగట్ల వీరభద్రస్వామిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముచ్చు లయా యాదవ్, ఏఎంసీ చైర్పర్సన్ శశిభార్గవి, మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ లెంక వరలక్ష్మి, బీసీ నాయకురాలు గదుల సత్యలత, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు , మహిళ నాయకులు, కార్యకర్తలు, కోలగట్ల అభిమానులు పాల్గొన్నారు. నినాదాలతో హోరెత్తిన విజయనగరం వైఎస్సార్సీపీ మహిళా బైక్ ర్యాలీకి అనూహ్య స్పందన చంద్రబాబు నీచ రాజకీయాలకు చరమగీతం పాడండి: డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి -
చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి
భోగాపురం: మండలంలోని అమటాం రావివలస పంచాయతీ దల్లిపేట గ్రామానికి చెందిన దల్లి అప్పలరాములు (60) విజయనగరం ప్రభత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు హెచ్సీ పీవీఎస్ఎన్ఎన్ మూర్తి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. దల్లిపేటకు చెందిన దల్లి అప్పలరాములు భార్య ఏడాది కిందట అనారోగ్యంతో చనిపోయింది. ఉన్న ఇద్దరు కుమారులు బతుకుదెరువు కోసం విశాఖపట్నం వెళ్లిపోయారు. అప్పటినుంచి మద్యానికి బానిసైన అప్పలరాములు మంగళవారం ఉదయం అనుకోకుండా ఫినాయిల్ తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ సమయంలో ఇంటికి వచ్చిన ఆయన చెల్లి నరసయ్యమ్మ అన్న పరిస్థితి చూసి స్థానికుల సహాయంతో విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు దల్లి ఆదినారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్సీ పీవీఎస్ఎన్ఎన్ మూర్తి తెలిపారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి● ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు గరుగుబిల్లి: ప్రజలు ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఇందుకు అనుగుణంగా పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలని ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన గరుగుబిల్లి మండలంలోని తోటపల్లిలో సాగుచేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. అలాగే రెడ్క్రాస్ దినోత్సవం సందర్భంగా పలువురు మహిళలు, రైతులకు హైజెనిక్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయ విధానాల ద్వారా పంటలను సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపాలని కోరారు. ప్రకృతి వ్యసాయం వల్ల వ్యవసాయ ఖర్చులు తగ్గడంతోపాటు నాణ్యమైన ఆహార ఉత్పత్తులు తయారవుతాయన్నారు. దీనివల్ల ప్రజలకు రోగాల బారినుంచి విముక్తి కలుగుతుందని చెప్పారు. రెడ్క్రాస్ సంస్థ ద్వారా ప్రజలకు వివిధ రకాల సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ సంస్థ చైర్మన్ మంచిపల్లి శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ మాజీ కౌన్సిలర్పార్వతీపురం టౌన్: కొన్ని సంవత్సరాలుగా టీడీపీకి సేవలు అందిస్తూ పార్వతీపురం పట్ట ణంలోని 17వ వార్డు టీడీపీ కౌన్సిలర్గా పనిచేసిన తాతపూడి వెంకట్రావు బుధవారం వైఎ స్సార్సీపీలో చేరారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ పార్వతీపురం ఎమ్మెల్యే అభ్యర్థి అలజంగి జోగారావు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయనతో పాటు బొత్స దుర్గ(సుబ్బు), పతివాడ మురళి, పతి వాడ శ్రీనులు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిగతా తమ అనుచరులతో మాట్లాడి 17వ వార్డులో టీడీపీకి కార్యకర్త లేకుండా ప్రతి ఒక్కరిని వైఎ స్సార్సీపీలో చేర్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వారందరికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే జోగారావు హామీ ఇచ్చారు. పాలిసెట్– 2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల ● జిల్లా ఉత్తీర్ణత శాతం: 87.68 ● బాలికలు 90.35 శాతం, బాలురు 85.84 శాతం ఉత్తీర్ణత విజయనగరం రూరల్: పాలిసెట్–2024 ప్రవేశ పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 87.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. గత నెల 27న జిల్లా వ్యాప్తంగా 24 కేంద్రాల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు రికార్డు స్థాయిలో 7,786 మంది హాజరుకాగా బుధవారం ప్రకటించిన ప్రవేశ పరీక్షా ఫలితాల్లో 6,827 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వరుసగా మూడో ఏడాది ఉత్తీర్ణత శాతంలో బాలికలే పైచేయి సాధించి సత్తాచాటారు. ఈ ఏడాది ప్రవేశ పరీక్షకు 4,604 మంది బాలురు హాజరుకాగా, 85.84 శాతంతో 3,952 మంది ఉత్తీర్ణత సాధించగా, బాలికల్లో 3182 మంది హాజరై 90.35 శాతంతో 2,875 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన వడ్డి త్రినయిణి రాష్ట్ర స్థాయిలో 155 ర్యాంకు, టీవీఎస్ శ్రీనిథ్అపూర్వ్కు జిల్లా స్థాయిలో రెండో ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 272 ర్యాంకు, తొత్తడి శైలేష్ జిల్లా స్థాయిలో మూడో ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 285వ ర్యాంకు సాధించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పాలిసెట్ ఫలితాలను పీవోఎల్వైసీఈటీఏపీ.ఎన్ఐసీ.ఐఎన్, ఎంఎఎన్ఏబీఏడీఐ.సీవో.ఐఎన్ (మనబడి) వెబ్సైట్లలో పరిశీలించుకోవచ్చని జిల్లా కన్వీనర్, ఎంఆర్ఏజీఆర్ విజయనగరం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ జె.ఆశారమణి తెలిపారు. -
ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు
● ఎస్పీ ఎం. దీపిక భోగాపురం: ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్చలు తప్పవని ఎస్పీ ఎం. దీపిక హెచ్చరించారు. ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మండలంలోని ముక్కాంలో ఆమె వివిధ పార్టీలకు చెందిన నాయకులతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఓటర్లను ఎవరైనా ప్రలోభాలకు, భయభ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్చలు తప్పవన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. తప్పుడు సమాచారాన్ని సామాజిక మధ్యమాల ద్వారా వ్యాప్తి చేయరాదని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఆర్. గోవిందరావు, సీఐ రవికుమార్, ఎస్సైలు సూర్యకుమారి, తాతారావు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. -
అధికారంలోకి వస్తే ధాన్యానికి మద్దతు ధర
● ఛత్తీస్గడ్ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్ సాయి ● కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాల్లో ఎన్నికల ప్రచారం కొరాపుట్: ఒడిశా రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ధాన్యానికి మద్దతు ధర ప్రకటిస్తామని ఛతీస్గడ్ రాష్ట్ర బీజీపీ నాయకులు హామీ ఇచ్చారు. కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థుల తరఫున ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్య నాయకులు బుధవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి నబరంగ్పూర్ జిల్లా ఉమ్మర్ కోట్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని హఠబరండి బహిరంగ సభలో ప్రసంగించారు. తమ పార్టీ ఛత్తీస్గఢ్లో అధికారంలోకి వచ్చిన వెంటనే క్వింటా ధాన్యానికి రూ. 3,100 మద్దతు ధర ప్రకటించామన్నారు. ఒడిశాలో కూడా అధికారం ఇస్తే వెంటనే అదే మద్దతు ధర ఇస్తామని ప్రకటించాు. అనంతరం కొరాపుట్ జిల్లా కుంద్రాలో పర్యటించారు. బీజేపి నబరంగ్పూర్ లోక్సభ అభ్యర్థి బలభద్ర మజ్జి, ఉమ్మర్కోట్ అసెంబ్లీ అభ్యర్థి నిత్యానంద గొండోలను కమలం గుర్తుపై ఓటువేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఛతీస్గఢ్ రాష్ట్ర బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్దేవ్ కొరాపుట్ జిల్లాలో రోడ్ షోలో పాల్గొన్నారు. కొట్పాడ్, లక్ష్మీపూర్, పుడాఘడ్లలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. -
ప్రముఖ కంపెనీ మాజీ హెచ్ఆర్ హెడ్.. ఒడిశా అభ్యర్థుల్లో రిచెస్ట్
ఆదిత్య బిర్లా గ్రూప్ మాజీ హెచ్ఆర్ హెడ్, ప్రస్తుత లోక్సభ ఎన్నిలల్లో కటక్ నుంచి బీజేడీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంతృప్త్ మిశ్రా సుమారు రూ. 461 కోట్ల ఆస్తులను ప్రకటించారు. ఈ లోక్సభ ఎన్నికల్లో ఒడిశా అభ్యర్థుల్లో ఈయనే అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు.సంతృప్త్ మిశ్రా ఆదిత్య బిర్లా గ్రూప్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న తర్వాత గత ఫిబ్రవరిలో బీజేడీలో చేరారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఆయన ఆదాయపు పన్ను రిటర్న్స్ 2021-22లో రూ. 76.23 కోట్లు, 2022-23లో రూ. 66.21 కోట్లుగా ఉన్నాయి. నామినేషన్ దాఖలు సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్లో రూ.408 కోట్ల విలువైన చరాస్తులు, రూ.4 కోట్ల బ్యాంకు డిపాజిట్లు సహా రూ.53 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని వెల్లడించారు.మ్యూచువల్ ఫండ్స్, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, బాండ్లు, షేర్లలో మిశ్రా పెట్టుబడి మొత్తం ప్రస్తుత విలువ దాదాపు రూ. 308 కోట్లు. రూ.2.3 కోట్లకు పైగా విలువైన విలాసవంతమైన కార్లు ఆయనకున్నాయి. ఇక మిశ్రా భార్య చరాస్తుల విలువ రూ. 11.72 కోట్లు అని నివేదిక పేర్కొంది. ఒడిశాలో ఎటువంటి స్థిరాస్తి లేనప్పటికీ, మిశ్రాకు మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో వ్యవసాయ భూమి, హైదరాబాద్, ముంబైలలో ఫ్లాట్లు ఉన్నాయి.కాగా ఒడిశాలో 21 లోక్స్థానాలు, 147 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అన్నింటికీ ఏక కాలంలో నాలుగు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సంతృప్త్ మిశ్రా పోటీ చేసే కటక్ లోక్సభ స్థానానికి మే 25న ఆరో దశలో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. -
ప్రచార వాహనాలకు అనుమతి తప్పనిసరి
పర్లాకిమిడి: ఎన్నికల ప్రచారానికి వినియోగించే వాహనాలు, మైకుల కోసం అధికారుల నుంచి విధిగా అనుమతి తీసుకోవాలని గంజాం, గజపతి జిల్లాల ఎన్నికల ఖర్చు పరిశీలకుడు చంద్రికా గార్గ్ స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్లో పర్లాకిమిడి, మోహానా, దిగపోహాండి నియోజికవర్గాల అభ్యర్థులకు చెందిన ఎన్నికల ఖర్చుల రిజిష్టరు, ఖాతాలను మంగళవారం పరిశీలించారు. ఆమెతో పాటు జిల్లా ఎన్నికల అధికారి స్మృతిరంజన్ ప్రధాన్, డీఆర్డీఏ అధికారి గుణనిధి నాయక్, ఇతర ఎన్నికల సిబ్బంది ఈనెల ఒకటి నుంచి ఏడో తేదీ వరకూ జరిగిన అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల సహాయ అధికారి గుణనిధి నాయక్ మాట్లాడుతూ.. అభ్యర్థులు ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా మైక్ సౌండింగ్ ప్రచారంలో వాడుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. వాహనాల కోసం విధిగా ఆన్లైన్లో రిజిష్టరు చేసుకొని ఎన్నికల అధికారుల అనుమతి పొందాలన్నారు. వాహనాల ఖర్చుల వివరాలను అభ్యర్థుల తరఫున ఏజెంట్లు విధిగా పొందుపరచాలని సూచించారు. ఎన్నికల పరిశీలకులు చంద్రికా గార్గ్ -
భీకర గాలులు–నేలకొరిగిన చెట్లు
పర్లాకిమిడి: అల్పపీడన ద్రోణి ప్రభావంతో పర్లాకిమిడి, కాశీనగర్ సమితిల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీకర గాలులతో భారీ వృక్షాలు పలుచోట్ల నేలకొరిగాయి. సోమవారం సాయంత్రం నుండి రాత్రి వరకూ కురిసిన పెనుగాలి వర్షానికి డోలాట్యాంకు రోడ్డులో దండుమాలవీధి చర్చి వద్ద రెండు చెట్లు విరిగిపడ్డాయి. కాశీనగర్ సమితి సిద్ధమణుగు గ్రామంలో పెద్ద చెట్టు రోడ్డుకు అడ్డంగా పడటంతో పర్లాకిమిడి, గుణుపురం, రాయగడ, కోరాపుట్కు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. చెట్లను జిల్లా ప్రకృతి వైపరీత్యాల నివారణ సిబ్బంది తొలగించి రోడ్డును క్లియర్ చేశారు. పెనుగాలులకు పర్లాకిమిడిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
ఎన్నికల కంట్రోల్ రూమ్ పరిశీలన
భువనేశ్వర్: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు పురస్కరించుకుని తొలి విడత పోలింగ్ సమీపిస్తోంది. ఈ తరుణంలో ఎన్నికల నిర్వహణ, నియంత్రణ, పర్యవేక్షణ కార్యకలాపాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల పర్యవేక్షకుడు యోగేంద్ర త్రిపాఠి (మాజీ ఐఏఎస్), పోలీసు పర్యవేక్షకుడు రంజినికాంత మిశ్రా (మాజీ ఐపీఎస్), వ్యయ పరిశీలకురాలు హిమాలినీ కశ్యప్ (మాజీ ఐఆర్ఎస్) బృందం రాష్ట్ర స్థాయిలో నియంత్రణ కార్యకలాపాల కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను మంగళవారం పరిశీలించారు. ఈ కార్యాలయంలో వాస్తవ పనితీరు, కచ్చితమైన ఏర్పాట్లను పర్యవేక్షించినట్లు తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ స్థానిక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీఈఓ కార్యాలయంలో పని చేస్తుంది. -
మళ్లీ బీజేడీదే అధికారం
● మంత్రి అతాన్ సవ్యసాచి నాయక్ రాయగడ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈసారి కూడా రాష్ట్రంలో బీజేడీ పార్టీ అధికారంలోకి రానుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, రాయగడ జిల్లా ఎన్నికల పరిశీలకులు అతాన్ సవ్యసాచి నాయక్ జోష్యం చెప్పారు. స్థానిక బీజేడీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతిచోటా ప్రజాదారణతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. ముఖ్యంగా రాయగడ జిల్లాలో గల గుణుపూర్, రాయగడ, బిసంకటక్ శాసనసభలతోపాటు కొరాపుట్ లోక్సభ స్థానాల్లో కూడా తమ పార్టీ అభ్యర్థులు అధిక మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు మెచ్చిన పథకాలు . ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలు ప్రజలు మెచ్చినవి కావడంతో బీజేడీ పాలనపై నమ్మకం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రజల బాగోగులతో పాటు వారికి సుస్థిర పాలనను అందించే ఏకై క పార్టీగా బీజేడీ ఆవిర్భవించిందన్నారు. సంక్షేమ పథకాలే పార్టీ విజయానికి నాంది పలుకుతున్నాయన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళల ఆర్థిక అభివృద్ధికి అమలు చేసిన మిషన్ శక్తి, స్వయం సహాయక బృందాలు, మమత తదితర పథకాలు విజయవంతం కావడంతో బీజేడీకి ఆదరణ పెరిగిందన్నారు. దానికి అనుగుణంగా వారికి అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తుండటం పార్టీ అభివృద్ధికి మరో మైలు రాయిగా నిలిచిందన్నారు. విభేదాలు లేవు.. పార్టీలో ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవని, అందరూ కలిసి పార్టీ విజయానికి కృషి చేస్తున్నారని ఒక ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. జిల్లాలో నెక్కంటి భాస్కరరావు, కృష్ణ మహాపాత్రో వంటి సీనియర్ నాయకులు పార్టీ విజయానికి నిరంతరం పని చేస్తున్నారన్నారు. వారి నాయకత్వంలో పార్టీ మరింత అభివృద్ధి చెందిందని కొనియాడారు. ఈ సమావేశంలొ రాయగడ శాసనసభ నియోజకవర్గం నుంచి పొటీ చేస్తున్న అనసూయా మాఝి, బీజేడీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు జగదీష్ పాత్రో తదితరులు పాల్గొన్నారు. . -
కాంగ్రెస్లోకి బీజేపీ నాయకుడు దాస్ భొత్ర
జయపురం: బొరిగుమ్మ సమితి మాజీ సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత దాస్ భొత్ర మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బొరిగుమ్మలో గల కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో దాస్ భొత్రను జయపురం నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తారాప్రసాద్ బాహిణీపతి సాదరంగా ఆహ్వానించారు. భొత్రకు నువాగుడ, పాతబొరిగుమ్మ, జిలిమిలి, ఖుడిగుడ తదితర గ్రామాల్లో మంచి పేరున్న నాయకుడని, అతడి వెంట వందలాది మంది కార్యకర్తలు ఉన్నారని, అతడి పట్ల భొత్ర సంప్రదాయ ప్రజలకు ఆదరణ ఉందని, కాంగ్రెస్లో కలవటం వల్ల తమ పార్టీకి మేలు కలుగుతుందని కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి దేవేంద్ర బాహిణీపతి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా తాను బీజేపీలో ఉంటూ బొరిగుమ్మలో ఆ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేశానని, కొంత కాలంగా బీజేపీ తనను విస్మరించిందని దాస్ ఆరోపించారు. ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి బొరిగుమ్మ సమితిలో శాంతిభద్రతలు పరిరక్షించేందుకు, సారా ప్రవాహాన్ని అరికట్టేందుకు చేపట్టి ఉద్యమాలకు, సమితి అభివృద్ధికి చేసిన కృషి తనను ఆకర్షించడంతో కాంగ్రెస్లో చేరినట్లు వెల్లడించారు. పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Pagination
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
బజరంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ వేటు
Lok Sabha Election 2024: ఎలక్షన్ టూరిజం జోరు!
జ్యోతి యర్రాజీకి స్వర్ణం
కృష్ణమ్మ నదిలో మలుపుల్లా...
నేడు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ఇలా..
కన్నప్ప సెట్స్లో...
Lok Sabha Election 2024: పెరిగేదే లే!
ప్రభుత్వానిది నియంతృత్వ ధోరణి అనడం దుర్మార్గం
అవకాశవాది, అబద్దాలకోరు, కుట్రదారు చంద్రబాబే
క్యాంపస్ సెలక్షన్స్లో టాప్
తప్పక చదవండి
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ జగనే రావాలి
- Kishori Lal Sharma: నేను గెలిస్తే గాంధీలు గెలిచినట్లే
- ప్రజలకు రాహుల్గాంధీ క్షమాపణ చెప్పాలి
- నన్ను చంపాలని చూశారు.. ఇది చంద్రబాబు కుట్రే: ఆర్.కృష్ణయ్య
- Lok Sabha Election 2024: జేడీయూ వర్సెస్ జేడీయూ!
- Lok Sabha Election 2024: నువ్వా నేనా?!
- Lok Sabha Election 2024: ఎలక్షన్ టూరిజం జోరు!
- ప్రభుత్వానిది నియంతృత్వ ధోరణి అనడం దుర్మార్గం
Advertisement