-
జూన్ 4న దేశం గెలుస్తుంది: ప్రధాని మోదీ.
సాక్షి,హైదరాబాద్: జూన్ 4న దేశం గెలుస్తుందని, 140 కోట్ల మంది సంకల్పం గెలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ‘కాంగ్రెస్కు ఓటు వేయడమంటే పాత రోజులను ఆహ్వానించినట్లే.. దేశం ఉగ్రవాదుల చేతిలోకి వెళ్లకూడదు.2012లో దిల్సుఖ్నగర్లో జంట పేలుళ్లు జరిగాయి. ఎంతో మంది అమాయకులు కాంగ్రెస్ పాలనలో బలయ్యారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం వచ్చాకే బాంబు పేలుళ్లు ఆగాయి. అందుకే మోదీని దించాలని చాలామంది చూస్తున్నారు. కాంగ్రెస్ వద్దు, బీఆర్ఎస్ వద్దు. మజ్లిస్ వద్దని తెలంగాణ అంటోంది. బీజేపీ కావాలంటోంది. లూటీ లూటీ లూటీ, వారసత్వ రాజకీయాలు ఇవే కాంగ్రెస్ ట్రాక్ రికార్డు. మీ సంపదను లాక్కునే వాళ్లు కావాలా.. మీ సంపదపై మీ పిల్లలకు హక్కుఉండాలా వద్దా. రాముడికి పూజ చేయడం తప్పా. నాకు హైదరాబాద్ చాలా ప్రత్యేకం. యువరాజుకు ట్యూషన్ చెప్పే నేత రామ నవమి చేసుకోవడం తప్పన్నారు. కాంగ్రెస్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు కోత పెట్టి ముస్లింలకు కోటా ఇచ్చింది. ఇదీ కాంగ్రెస్ పార్టీ మోడల్. తెలంగాణకు ఎయిమ్స్, వందేభారత్ రైళ్లు ఇచ్చిందెవరో చెప్పాలి’అని మోదీ ప్రసంగించారు. -
కాంగ్రెస్ హామీలన్నీ అబద్ధాలే: ప్రధాని మోదీ
సాక్షి,నారాయణపేట: మోదీ గ్యారెంటీ అంటే అభివృద్ధికి గ్యారెంటీ అని కాంగ్రెస్ అన్నీ అబద్ధపు హామీలిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం(మే10) నారాయణపేటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ‘దేశ భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికలివి. రాబోయే ఐదేళ్లలో మూడు కోట్ల ఇళ్ల నిర్మాణానికి మోదీ గ్యారెంటీ. పదేళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. తెలంగాణకు లక్షల కోట్లు పంపించాం. ఆ డబ్బును బీఆర్ఎస్, కాంగ్రెస్ లూఠీ చేస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నో అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. తెలంగాణప్రజలు డబుల్ ఆర్ ట్యాక్స్ గురించి ఆలోచించాలని నేను చెప్పాను. అందులో ఎవరి పేరు చెప్పలేదు. కానీ ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్పై మాట్లాడాడు. అంటే డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లిందో మీరు అర్థం చేసుకోండి. కాంగ్రెస్ దేశానికి ఇప్పటివరకు చేసిందొక్కటే నమ్మకద్రోహం. కాంగ్రెస్ నేతలు ఎన్నికలు వచ్చాక దేశాన్ని విభజించేలా మాట్లాడుతున్నారు. యువరాజు గురువు దక్షిణాది వారిని ఆఫ్రికన్లలా ఉన్నారంటాడు. యువరాజు ఎన్నికల ముందు ప్రేమ దుకాణం తెరుస్తాడు. కాంగ్రెస్ హిందువులను సొంత దేశంలోనే హిందువులను రెండవ తరగతి పౌరులను చేస్తోంది. నేను గుడికి వెళ్లడాన్ని కూడా తప్పు పడుతున్నారు. రామనవమికి మీరు గుడికి వెళ్లరా. పసిపిల్లలు నాపై చూపే ప్రేము కూడా కాంగ్రెస్ నేతలకు ఇబ్బంది కలిగిస్తోంది. కాంగ్రెస్కు దేశంలోని హిందువుల పట్ల ప్రేమ లేదు. కాంగ్రెస్ది హిందువుల పట్ల వ్యతిరేక భావన. 2014లో కేసీఆర్ను మీరు ఎన్నుకుంటే ఆయన మిమ్మల్ని మరిచిపోయాడు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తోంది’అని మోదీ విమర్శించారు. -
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: మాజీ సీఎం కేసీఆర్పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న సంజయ్.. బోయిన్పల్లి వినోద్ కుమార్ ఓడిపోతే బీఆర్ఎస్ను మూసేసి రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని సవాల్ విసిరారు. సీఆర్ లాంటి గలీజు లీడర్ ఇంకొకరు లేరని మండిపడ్డారు. హిందువులను కేసీఆర్ కించపరుస్తున్నారని, ఆయనకు తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.సిరిసిల్లలో శుక్రవారం బండి సంజయ్ మాట్లాడుతూ.. తనను ఓడిచేందుకు ముస్లింలంతా ఒక్కటి కావాలంటూ కేసీఆర్ పిలుపునిచ్చారని అన్నారు. హిందువుల ఓట్లు నీకు అక్కర్లేదా అని కేసీఆర్ను ప్రశ్నించారు. తన వెనక 80శాతం హిందువులున్నారని అన్నారు. 20 శాతం ఓట్లు కోసం 80 శాతం హిందువులను కించపరుస్తావా అని మండిపడ్డారు. బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్కు బుద్ది చెప్పాలని తెలిపారు.'కేటీఆర్ నోటి నుంచి జై శ్రీరాం మాటే రాదు. కరీంనగర్ వేదికగా మత చిచ్చు పెట్టేందుకు కేసీఆర్ చేస్తున్న కుట్ర ఇది. ఓట్ల కోసం సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన సైనికులనే అవమానిస్తవా?. కేసీఆర్ లాంటి గలీజు లీడర్ ఇంకొకరు లేరు. కేసీఆర్ లాంటి ఎమోషనల్ బ్లాక్ మెయిలర్ ఈ ప్రపంచంలోనే లేరు. రూ.లక్ష కోట్ల అవినీతి బయటపడుతుందనే భయంతో కాళేశ్వరంపై డీపీఆర్ ఇవ్వకుండా జాతీయహోదా పేరుతో కేంద్రాన్ని బదనాం చేయాలనుకునే మోసగాడు. ఎందుకూ పనికిరాకుండా పోయిన కాళేశ్వరం ప్రాజెక్టును చిన్న సమస్యగా చిత్రీకన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చ ర్చకు సిద్ధమా?తెలంగాణకు కేంద్రం రూ.10 లక్షల కోట్లకు పైగా నిధులిచ్చిన చరిత్ర మోదీదే. కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా?.చర్చకు సిద్ధమైతే... పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో ఆధారాలు నిరూపిస్తాం. కేసీఆర్తో కుమ్మక్కైన కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చేందుకు కాంగ్రెస్ యత్నం. ఇవన్నీ ప్రశ్నిస్తుంటే.. నన్ను ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నన్ను ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నయ్. ఓటుకు రూ.5 వేలు ఒకరు. రూ.2 వేల చొప్పున మరొకరు పంచుతున్నయ్. అయినా కరీంనగర్ ప్రజలంతా నావైపే ఉన్నారు..సిరిసిల్ల నేతన్నల చావులకు కారణం మీరే కదా.. బతుకమ్మ బకాయిలివ్వకుండా అరిగోస పెడుతున్నది మీరే కదా?. విద్యుత్ బిల్లుల్లో, యార్న్ పై సబ్సిడీ ఇవ్వకుండా సాంచాలు మూతపడేలా చేసింది మీరే కదా? రైతులు పంట నష్టపోతే పరిహారం కూడా ఇవ్వలేని మీరా మాట్లాడేది? తెలంగాణకు కేంద్రం నుండి నిధులు తెచ్చే బాధ్యత మాది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివ్రుద్ధి చేసే బాధ్యత నాది. కేటీఆర్ సభలో ప్రశ్నించిన హిందుత్వ వాదుల అరెస్ట్ను ఖండిస్తున్నా’ అని మండిపడ్డారు బండి సంజయ్. -
ఆయన రాహుల్ గాంధీ కాదు.. ‘రాంగ్’ గాంధీ: హరీశ్రావు
సాక్షి, సిద్ధిపేట జిల్లా: రైతుల ఉసురు పోసుకుందంటూ.. బీజేపీని కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీగా అభివర్ణించారు మాజీ మంత్రి హరీష్రావు. బడా బడా కార్పొరేట్ సంస్థల గురించి మాత్రమే బీజేపీ ఆలోచించిందని.. 14 లక్షల కోట్లు మాఫీ చేసిందన్నారు. పేదలకు ఒక్క రూపాయి మాఫీ చేయలేదని విమర్శించారు.హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ, బీజేపీ పంచిన బొమ్మలను చూసి ఓటు వేస్తే కడుపు నిండుతుందా? అంటూ ప్రశ్నించారు.అయోధ్య రామాలయం బీజేపీ కట్టలేదు.. ట్రస్ట్ కట్టింది.ఆలయ నిర్మాణానికి తానుకూడా 2 లక్షలు ఇచ్చానని చెప్పారు.నిన్న హైదరాబాద్లో రాహుల్ గాంధీ సభ తుస్సు మంది. 30 వేల కుర్చీలు వేస్తే 3 వేల మంది రాలేదు. కాంగ్రెస్ వాళ్లు వచ్చి ఓటు అడిగితే ఐదు నెలల 12,500 ఇచ్చిన తర్వాతే ఓటు వేస్తామని అక్క చెల్లెళ్లు చెప్పండి. ప్రియాంక గాంధీ గెలిచాక ఇస్తామని హామీ ఇచ్చిన మెడికల్ కాలేజీ హుస్నాబాద్కు వచ్చిందా? రేవంత్ రెడ్డి కంటే రాహుల్ గాంధీ ఎక్కువ అబద్ధాలు మాట్లాడున్నాడు, ఆయన రాహుల్ గాంధీ కాదు రాంగ్ గాంధీ’’ అంటూ హరీశ్ ఎద్దేవా చేశారు.‘‘ఈ కాంగ్రెస్ పాలన వచ్చాక కల్యాణ లక్ష్మి ఖతమయ్యింది. తులం బంగారం తుస్సు మంది. బండి సంజయ్ బొమ్మలు పంచి ఓట్లు వేయమంటున్నాడు. బండి సంజయ్ కి ఓటు వేస్తే అంతా వృధా అయిపోతుంది. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ మూడోస్థాలో ఉంది. అది గెలిచే ప్రసక్తే లేదు’’ అని హరీశ్రావు పేర్కొన్నారు. -
డబుల్ డిజిట్ పక్కా: అమిత్ షా
సాక్షి, యాదాద్రి: ‘దేశంలో కుటుంబ పాలనకు, భార తీయ కుటుంబానికి మధ్య పోటీ జరుగుతోంది. ఈ ఎన్నికలు మోదీ, రాహుల్కు మధ్య జరుగుతు న్నాయి. మోదీ దేశం కోసం.. వారు కుటుంబాల సంక్షేమం కోసం పని చేస్తారు. ‘ఓట్ ఫర్ జిహాద్ వర్సెస్ ఓట్ ఫర్ డెవలప్మెంట్.. రాహుల్ పిల్ల చేష్టల గ్యారంటీ వర్సెస్ మోదీ అభివృద్ధి గ్యారంటీ’ మధ్య ఎన్ని కలు జరుగుతున్నాయి..’అని కేంద్ర హోం మంత్రి అమిత్షా అన్నారు. 2019లో తెలంగాణలో బీజేపీ 4 స్థానాల్లో గెలిచిందని, రేవంత్రెడ్డీ చూస్కో.. ఈసారి 10 కంటే ఎక్కువ సీట్లలో బీజేపీ గెలవబోతోంది అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో డబుల్ డిజిట్ స్కోర్ బీజేపీని 400 స్థానాల్లో గెలిపించేందుకు మార్గం సుగ మం చేస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారిందని, రాహుల్ గ్యారంటీలు చెల్లే పరిస్థితి లేదని చెప్పారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రైతులకు ఏటా రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయం అమలు కాలేదన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో భువనగిరి లోక్సభ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్కు మద్దతుగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం ‘నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పదేళ్లు తమ కుటుంబం బాగు కోసమే పని చేసింది. ఇప్పుడు కాంగ్రెస్కు ఐదేళ్లు అవకాశం ఇచ్చారు. కానీ ఆ పార్టీ తెలంగాణను ఏటీఎంలా మార్చుకుంటోంది. అబద్ధాలతో ఈ ఎన్నికలు గెలవాలని ఆ పార్టీ చూస్తోంది. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కానీ మోదీ పదేళ్లుగా ఫుల్ మెజార్టీతో అధికారంలో ఉండి కూడా రిజర్వేషన్లు తొలగించలేదనే విషయం గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీయే తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లలో కోత విధించి ముస్లింలకు 4 శాతం అందిస్తోంది. మేం ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేస్తాం. తెలంగాణలో బీజేపీని కనీసం పది సీట్లలో గెలిపించండి. దేశంలోనే నంబర్ వ¯న్గా తెలంగాణను మార్చుతాం..’అని అమిత్ షా హామీ ఇచ్చారు. ఏబీసీలు మూడూ ఒక్కటే ‘తెలంగాణలో ఏబీసీలు (ఏ అంటే అసద్, బీ అంటే బీఆర్ఎస్, సీ అంటే కాంగ్రెస్) మూడూ ఒక్కటే. మూడూ ట్రయాంగిల్ లాంటివి. షరియత్, ఖురాన్ ప్రకారం పాలన కొనసాగించాలని చూస్తున్నారు. బుజ్జగింపు రాజకీయాలుచేస్తున్న వీరు హైదరాబాద్లో శ్రీ రామ నవమి ఊరేగింపుపై ఆంక్షలు విధించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు అనుమతివ్వలేదు. సీఏఏను వ్యతిరేకిస్తున్నారు. మళ్లీ ట్రిపుల్ తలాక్ తీసుకురావాలనుకుంటున్నారు. రామ మందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లు ఆపింది. కానీ మోదీ ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఐదేళ్లలో రామమందిరానికి భూమి పూజ చేయడంతో పాటు ఆలయ నిర్మాణం, బాల రాముని ప్రాణ ప్రతిష్టను పూర్తి చేశారు. దేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని మోదీ అంతం చేశారు. నక్సలైట్ సిద్ధాంతాన్ని సమాప్తం చేశారు. 370 ఆర్టీకల్ రద్దుతో కశ్మీర్ మనదే అని తేలిపోయింది. కొత్త టెక్స్టైల్ విధానంతో 8 లక్షల మంది చేనేత కార్మీకులకు ఉపాధి లభించింది. రూ.1,500 కోట్లతో ఈ విధానం అమల్లోకి తెచ్చాం. మోదీ చేనేత పాలసీ తీసుకువచ్చారు..’అని వివరించారు. నర్సయ్యగౌడ్కు ఓటు వేస్తే మోదీకి, అభివృద్ధికి వేసినట్లే అని అన్నారు. ఈ సమావేశంలో నర్సయ్యగౌడ్తో పాటు గూడూరు నారాయణరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అమరావతి అభ్యర్థి (సిట్టింగ్ ఎంపీ) నవనీత్ కౌర్.. గతంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడిన మాటలు ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలకు, ఎంఐఎం అధినేత, హైదరాబాద్ లోక్సభ మజ్లిస్ అభ్యర్ధి అసదుద్దీన్ ఒవైసీ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. పాతబస్తీలో బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన నవనీత్ కౌర్.. దాదాపు పన్నెండేళ్ల కిందట అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ‘పోలీసులు 15 నిమిషాలు పక్కకు తప్పుకుంటే లెక్కలు సరిచేస్తామని చిన్నోడు అన్నాడని, కానీ వాళ్లకు 15 నిమిషాలేమో..మాకు 15 సెకన్లు చాలు..’అంటూ వ్యాఖ్యానించారు. కాగా గురువారం పాతబస్తీలో ఎన్నికల ప్రచారం చేస్తున్న అసద్ వద్ద.. నవనీత్ కౌర్ వాఖ్యలను మీడియా ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఆయన తీవ్రంగా స్పందించారు. దమ్ముంటే చేసి చూపించండి ‘నరేంద్ర మోదీజీ 15 సెకన్లు కాదు.. గంట.. 15 గంటలు సమయం ఇవ్వండి.. అధికారం మీ చేతిలో ఉంది...ముస్లింలను ఏం చేస్తారో చేయండి.. మీలో మానవత్వం మిగిలి ఉందా? లేదా? అని మేము కూడా చూడాలని అనుకుంటున్నాం..అంతా మీదే.. అధికారం మీదే అయినప్పుడు ఎవరు ఆపుతున్నారు? మేం భయపడేది లేదు.. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం... దుమ్ముంటే చేసి చూపించాలి..’అంటూ అసదుద్దీన్ సవాల్ చేశారు. హైదరాబాద్ ప్రజలు పశువులు కాదు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు హైదరాబాద్ను ఎంఐఎంకు లీజుకు ఇచ్చాయంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై కూడా అసదుద్దీన్ స్పందించారు. హైదరాబాద్ ప్రజలు పశువులు కాదని, వారు పౌరులని, రాజకీయ పార్టీల ఆస్తులు కాదని వ్యాఖ్యానించారు. నలభై ఏళ్లుగా హైదరాబాద్ హిందుత్వ దుష్ట భావజాలాన్ని ఓడిస్తూ ఎంఐఎంకు అప్పగిస్తోందన్నారు. హిందుత్వం మళ్లీ ఓడిపోతుందని చెప్పారు. ముస్లింలను ద్వేషించడమే ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానమని, అందుకే మరోమారు బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. -
భారత్ ఆత్మపై బీజేపీ దాడి: రాహుల్గాంధీ
సాక్షి, హైదరాబాద్/ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ‘తాము గెలిస్తే భారతదేశ రాజ్యాంగాన్ని మారుస్తామని, రద్దు చేస్తామని, ఖతం చేస్తామని బీజేపీ, ఆర్ఎస్ఎస్ స్పష్టంగా చెప్పాక జరుగుతున్న తొలి ఎన్నికలివి. భారత రాజ్యాంగం మామూలు పుస్తకం కాదు. దేశ పేదల గొంతుక, వారి గుండెచప్పుడు. ప్రజలకు రిజర్వేషన్లు, హక్కులు రాజ్యాంగంతోనే లభించాయి. అలాంటి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని, మారుస్తామని అనడం ద్వారా బీజేపీ నేతలు పేద ప్రజలపైనే కాకుండా భారతదేశ ఆత్మపై దాడి చేస్తున్నారు..’ అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అంబేడ్కర్, మహాత్మాగాం«దీ, నెహ్రూ లాంటి వారు పోరాడి, ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గి, తమ రక్తం, చెమటను ధారపోశారు. ఆ మహానీయుల కర్మ ఫలాలకు నష్టం కలిగించాలని ఇప్పుడు బీజేపీ వాళ్లు అనుకుంటున్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేయడం ప్రపంచంలోని ఏ శక్తికీ సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, రాహుల్ గాం«దీ, ఖర్గే, దేశ ప్రజలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, గిరిజనులు, రైతులు, కూలీలు కలిసి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం..’ అని ఆయన స్పష్టం చేశారు. ఇండియా కూటమి ఆధ్వర్యంలో కేంద్రంలో పేదలు, వెనుకబడిన, దళిత, ఆదివాసీల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. అధికారంలోకి రాగానే ఒక్క దెబ్బతో దేశంలో ఉన్న పేదరికాన్ని రూపు మాపుతామని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్, హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించిన జన జాతర సభల్లో ఆయన మాట్లాడారు. మేం కోట్లాదిమందిని లక్షాధికారుల్ని చేస్తాం ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టల రిజర్వేషన్లను తొలగించేందుకే మోదీ సర్కారు పబ్లిక్ సెక్టార్ సంస్థలను ప్రైవేటీకరిస్తోంది. పెట్టుబడిదారీ వ్యవస్థను పెంపొందించడం ద్వారా రిజర్వేషన్లను తొలగించాలని చూస్తోంది. ఈ ఎన్నికలు రిజర్వేషన్లు తొలగించాలంటున్న వారికి.. రిజర్వేషన్లు పెంచాలని కోరుతున్న వారికి మధ్య పోరు. ప్రధాని మోదీ గత పదేళ్లలో ఓ 22 మంది కోసమే ప్రభుత్వాన్ని నడిపారు. అదానీ, అంబానీ లాంటి వాళ్ల కోసమే అన్నీ చేశారు. దేశ ప్రజలు, రైతులు, శ్రామికుల కోసం కొద్దిగా కూడా పని చేయలేదు. మోదీ 22–25 మందికి సంబంధించిన రూ.16 లక్షల కోట్ల అప్పులు మాఫీ చేశారు. ఆ విధంగా ఆయన 24 ఏళ్ల పాటు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసేందుకు సరిపడా డబ్బులను వారికి ఇచ్చారు. బీజేపీ సర్కారు 22 మందిని కుబేరుల్ని చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది మందిని లక్షలాధికారుల్ని చేస్తుంది. పేదల జాబితా తయారు చేస్తాం కాంగ్రెస్ పార్టీ, సోనియాగాందీ, ఖర్గే, నేను, రేవంత్ రెడ్డి, తెలంగాణ నేతలందరం ఓ నిర్ణయానికి వచ్చాం. ఎన్నికల తర్వాత మా ప్రభుత్వం రాగానే దేశంలోని పేద కుటుంబాల జాబితా తయారు చేస్తాం. ప్రతి కుటుంబంలోని ఒక మహిళ పేరును ఎంపిక చేసి ఆమె బ్యాంకు ఖాతాలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏటా రూ.లక్ష జమ చేస్తుంది. నెలకు మరో రూ.8,500 వేస్తుంది. ఈ డబ్బులతో దేశంలోని పేద కుటుంబాల జీవితాలు బాగుపడతాయి. విద్య, వైద్యం పొందుకోవడంతో పాటు పేదలు అనుకుంది ఏదైనా ఈ డబ్బులతో చేయగలుగుతారు. మోదీ సర్కారు రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసినప్పుడు నోరు విప్పని మీడియా, ఇప్పుడు మేము పేదలకు డబ్బులిస్తామంటే.. వారి అలవాట్లను చెడగొడుతున్నామని విమర్శిస్తోంది. అదానీ మనుషులూ.. మీరేం చేసుకుంటారో చేసుకోండి. పేదల ఖాతాల్లో మేము రూ.కోట్లు వేయబోతున్నాం..’ అని రాహుల్ స్పష్టం చేశారు. రైతులకు చట్టబద్ధంగా మద్దతు ‘దేశంలో వరి, పత్తి, చెరుకు రైతులకు మద్దతు ధర లభించడం లేదు. నరేంద్ర మోదీ నల్ల చట్టాలు తెచ్చి వారి ధనాన్ని లాక్కోవడానికి ప్రయత్నించారు. కానీ మేము రైతుల కోసం జబర్దస్త్ పని చేయబోతున్నాం. మేనిఫెస్టోలో రెండు హామీలు పొందుపరిచాం. మా సర్కారు రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తాం. వారికి చట్టబద్ధంగా కనీస మద్దతు ధరను అందిస్తాం. రైతుల కష్టానికి తగిన ఫలితం లభించని రోజులు ఇక ఉండవు. పక్కాగా తొలి కొలువు మోదీ పెద్ద సంఖ్యలో నిరుద్యోగులను తయారు చేశారు. నోట్ల రద్దు, తప్పుడు జీఎస్టీ, అగ్నివీర్ పథకాల ద్వారా నిరుద్యోగ్యాన్ని పెంచారు. నిరుద్యోగులకు అప్రెంటిస్íÙప్ హక్కు కల్పిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొస్తాం. దేశంలోని పట్టభద్రులు, డిప్లొమా చేసినవారందరికీ ఈ హక్కుఇవ్వబోతున్నాం. దేశంలోని పబ్లిక్, ప్రైవేటు సెక్టార్లలో సుమారు 30 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఆగస్టు 15లోపు ఈ ఉద్యోగాలను ఇండియా కూటమి ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ వర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలు, ఆస్పత్రుల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాం. ఒక ఏడాది కాలం పక్కాగా తొలి ఉద్యోగం లభిస్తుంది. ఉత్తమ శిక్షణ లభిస్తుంది. కోట్లాది మంది నిరుద్యోగులకు ఏడాదికి రూ.లక్ష నగదు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. నెలకు రూ.8,500 వేస్తాం. ఇప్పుడు ఉపాధి హామీ కూలీలకు లభిస్తున్న రోజువారీ కూలీని రూ.250 నుంచి రూ.400కు పెంచుతాం. ఆశా, అంగన్వాడీ మహిళల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం..’ అని రాహుల్ ప్రకటించారు. కులగణనతో రాజకీయాల్లో శాశ్వత మార్పు ‘నరేంద్ర మోదీ ఎంపిక చేసిన వ్యక్తుల కోసం పనిచేశారు. మా ప్రభుత్వం పేద, బలహీన, వెనకబడిన వర్గాల కోసం పనిచేస్తుంది. తెలంగాణ తరహాలో మేము దేశ వ్యాప్తంగా కులగణనకు శ్రీకారం చుట్టబోతున్నాం. దేశంలోని పేద, వెనుకబడిన, దళిత, గిరిజన, పేద ఉన్నత కులాలు, మైనారిటీలకు జనాభాలో వారి దామాషా తెలిసిపోతుంది. ప్రజలకు వాస్తవాలు తెలిసిపోతాయి. ఈ విప్లవాత్మక చట్టం అమల్లోకి వచ్చాక దేశ రాజకీయాలు శాశ్వతంగా మారిపోతాయి..’ అని ఏఐసీసీ నేత అన్నారు. రేవంత్ బృందం బాగా పనిచేశారు ‘రేవంత్, తెలంగాణ బృందం బాగా పనిచేశారు. 30 వేల మంది యువతకు ఉద్యోగాలు లభించాయి. రూ.500కే గ్యాస్ సిలిండర్, రూ.10 లక్షల ఆరోగ్య బీమా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తున్నారు. తెలంగాణ తరహాలోనే దేశంలో కూడా ఈ పథకాలను అమలు చేస్తాం. మోదీ ఎంత డబ్బు కుబేరులకు ఇచ్చారో అంతే డబ్బును దేశ, తెలంగాణ పేదలకు ఇస్తాం. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి. నేను తెలంగాణ ప్రజల కోసం ఢిలీల్లో సైనికుడిలా పనిచేస్తా. తెలంగాణకు ఏది అవసరమైనా ఆ పని చేసేందుకు నేను ఢిల్లీలో సిద్ధంగా ఉంటా..’ అని రాహుల్ హామీ ఇచ్చారు. ఈ సభల్లో ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, నేతలు మధుయాష్కీ, మహేందర్రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, లక్ష్మారెడ్డి, రంజిత్ రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డి, చామల కిరణ్కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నగరం ఓటెత్తాలని..
జీహెచ్ఎంసీ సిబ్బంది బస్తీలు, కాలనీల్లోని ఇళ్లకు వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి మీకు ఓటుందా అని అడిగి.. ఒకవేళ ఓటు ఉంటే.. తప్పకుండా ఓటేయాలంటూ పోలింగ్ కేంద్రం వైపు అడుగులేసేలా వారిని ఒప్పిస్తున్నారు. బంజారాహిల్స్లోని జీవీకే వన్మాల్లో ఇటీవల ఓ ఫ్లాష్మాబ్లో భాగంగా మోడరన్, శాస్త్రీయ నృత్యాలూ ప్రదర్శించారు. ఎందుకిదంతా అని చూస్తే ‘నా ఓటు–నా హక్కు’ నినాదాలతో ప్లకార్డులు పట్టుకొని కనిపించారు. జీహెచ్ఎంసీలోని సెల్ఫ్హెల్ప్ గ్రూపుల సభ్యులు, రిసోర్స్పర్సన్స్ వారి పిల్లలతో నిర్వహించిన ఈ కార్యక్రమం మాల్కు వచ్చిన వారిని ఆకట్టుకుంది. ఓటుపై ఆలోచనలో పడేసింది. పరమపద సోపానం (వైకుంఠపాళి) ఆటలో స్వర్గానికి చేరుకునేందుకు మెట్లెక్కించే నిచ్చెనలు, పాతాళానికి పడిపోయేలా మింగేసే పాములు ఉండటం తెలిసిందే. ఆ ఆటలో ఎప్పుడు పాము మింగుతుందో, ఎప్పుడు నిచ్చెన ఎక్కుతామో తెలియదు కానీ.. ప్రజాస్వామ్యానికి కీలకమైన ఓటును సద్వినియోగం చేసుకోకపోతే మాత్రం భవిష్యత్ అంధకారమవుతుంది అని చెబుతూ ఏ పనులు చేస్తే నిచ్చెన ఎక్కవచ్చో, ఏవి చేస్తే పాతాళానికి పడిపోతారో తెలియజేసేలా ఖైరతాబాద్ సర్కిల్లో పరమపద సోపానం ఆటతోనూ అవగాహన కల్పించారు.సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్షరాస్యతశాతం ఎక్కువగా ఉన్నా.. ఎన్నికలకు సంబంధించి నిరక్షరాస్యులుగా వ్యవహరిస్తూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం లేదు. తమ భవిష్యత్కు తగిన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఎన్నికల అక్షరాస్యులుగానూ మలిచేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 287 ఎన్నికల అక్షరాస్యత క్లబ్లు ఏర్పాటు చేశారు. ఈ క్లబ్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కూలీనాలీ చేసుకునే ప్రజలు, ప్రైవేట్ వ్యాపారాలు సాగిస్తున్న వారితోపాటు ఉద్యోగుల్లో సైతం ఇదే వైఖరి ఉంది. అందుకే వారికి కూడా అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు చెందిన ఉద్యోగులతో 158 ఓటర్ అవేర్నెస్ ఫోరమ్స్ ఏర్పాటు చేసి వివిధ కార్యాలయాల్లో అవగాహన కల్పిస్తున్నారు. వీటితోపాటు 584 పోలింగ్ బూత్ల పరిధిలో అవేర్నెస్ గ్రూపులు ఏర్పాటు చేశారు. తమ బూత్ పరిధిలోని వారిని పోలింగ్ కేంద్రాల దాకా అడుగేసేలా చేయడం ఈ గ్రూపుల పని. ‘వాక్ టు పోలింగ్ స్టేషన్’ పేరిట కార్యక్రమాలు చేపడుతూ పోలింగ్ శాతం పెరిగేందుకు పనిచేస్తున్నాయి.ఇంకా ఏం చేస్తున్నారంటే.. 18 ఏళ్లలోపు విద్యార్థులకు పెయింటింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులందజేస్తున్నారు. ఓటరు చైతన్యం కోసం రూపొందించే వీడియోల్లో ఉత్తమమైన పది వీడియోలకు రివార్డులివ్వనున్నారు. బూత్లెవెల్ అధికారులు తమ బూత్లో పోలింగ్శాతాన్ని గతంలో కంటే పదిశాతం పెంచితే రూ. 5 వేలు రివార్డుగా ఇచ్చే యోచనలో ఉన్నారు. ఆదివారం నగరవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 5కే రన్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో తాము ఓటు వేస్తామంటూ ప్రతిజ్ఞలు చేయిస్తున్నారు. ప్రజలు గుమికూడే ప్రాంతాల్లో పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. డిజిటల్ బోర్డులపై ఎన్నికల సమాచారం తెలియజేస్తున్నారు. ఓటరు అవగాహనకు నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను ఎక్స్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ వెబ్సైట్లోనూ ఎన్నికలకు సంబంధించిన సమాచారం పొందుపరుస్తున్నారు. వారానికోమారు ఓటు వేయాల్సిందిగా సూచిస్తూ ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద నగరంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయ్లెట్ల వద్ద ఓటరు అవగాహన బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇంటింటి నుంచి చెత్త సేకరించే స్వచ్ఛఆటోల మైకుల ద్వారానూ ప్రచారానికి సిద్ధమయ్యారు.ఇప్పటి వరకు..» స్వీప్(సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) కింద నా ఓటు హక్కును వినియోగించుకుంటాను అనే ప్రతిజ్ఞతో ప్రసాద్స్ ఐమాక్స్లో, కొన్ని పార్కుల్లో భారీ తెరలపై సంతకాల సేకరణ చేపట్టారు. » జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులతో, పాతబస్తీలోని మక్కా మసీదులోనూ ఓటర్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. » ఓటు వేస్తాననే సంకల్ప పత్రాలను విద్యార్థులకు అందజేస్తూవాటిపై వారి తల్లిదండ్రులు సంతకాలు చేశాక తిరిగి తీసుకుంటున్నారు. ఇప్పటివరకు అలా దాదాపు రెండు లక్షల సంకల్ప పత్రాలు సేకరించారు. » ఓటుహక్కు గురించి బస్తీల్లో, కాలనీల్లో క్విజ్లు, మెహందీలు, రంగోలి వంటి పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీల్లో విజేతలకు బహుమతులందజేస్తూ ఆసక్తి కల్పిస్తున్నారు. » ఒక ఆదివారం హెరిటేజ్ వాక్ నిర్వహించిన సందర్భంగా దారుల్షిఫా నుంచి ఉస్మానియా ఆస్పత్రిలోని చింతచెట్టు వరకు ఓటు హక్కుకు సంబంధించిన బ్యానర్లు, పోస్టర్ల స్టాండ్లు ఏర్పాటు చేశారు. » పార్కులు, బస్స్టేషన్లు, గోడలపై రాతల ద్వారానూ, రేషన్షాపులు, సిటిజె¯న్ సర్వీస్ సెంటర్లు, కూరగాయల మార్కెట్లు తదితర ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. » ఓట్’ అనే అక్షరాల్లా కనిపించేలా విద్యార్థులతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.ఎన్నికల దాకా..ఎన్నికలు జరిగేంత వరకు ఇలా వివిధ ప్రాంతాల్లో, వివిధ రూపాల్లో స్వీప్ కార్య క్రమాలు నిర్వహించనున్నట్టు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు. బొటానికల్ గార్డెన్ వద్ద ఇప్పటికే నిర్వహించిన 2కే రన్లో సీఈఓ వికాస్రాజ్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు రాహుల్గాంధీ క్షమాపణ చెప్పాలి
జహీరాబాద్ (సంగారెడ్డి)/సిద్దిపేటజోన్: కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహూల్గాంధీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు. హామీల అమలులో విఫలమైనందుకు రాష్ట్ర ప్రజలకు రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఏం ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వచ్చారని హరీశ్రావు ప్రశ్నించారు. అక్కా చెల్లెళ్లకు రాహూల్గాంధీ రూ.8,500 ఇస్తానంటున్నారని, మళ్లీ ఎవరి చెవులో పువ్వు పెడతారని నిలదీశారు.సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో గురువారం బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్కుమార్కు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ..కరెంటు కోతలు పెడుతున్న కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో వాతలు పెట్టాలన్నారు. ఆరు గ్యారంటీ పథకాలు వచ్చిన వారు కాంగ్రెస్కు ఓటు వేయాలని, రాని వారంతా బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్కుమార్, ఎమ్మెల్యే కె.మాణిక్రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై.నరోత్తం, బేవరేజస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు కిజర్యాఫై పాల్గొన్నారు.బీజేపీతో కొట్లాడినందుకే కవితకు జైలుబీజేపీతో కొట్లాడేది ఒక్క కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీయేనని ఆ పోరాటం ఫలితంగానే ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లాల్సి వచ్చిందని హరీశ్రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన ముస్లిం, మైనార్టీ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్లు ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీతో బీఆర్ఎస్ కలిసి ఉంటే కవిత అరెస్ట్ అయ్యేవారా..? అని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ప్రధాని మోదీతో జత కట్టారని, చాలాసార్లు బహిరంగంగానే ప్రధానిని పొగిడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రేవంత్రెడ్డి, బీజేపీ మిలాఖత్ అయి రాష్ట్రంలో బీఆర్ఎస్ను లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. -
నేటి మోదీ సభ తెలంగాణకు కీలకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ఎల్బీస్టేడియం సభవేదికగా ఎన్నికల సందేశం ఇస్తారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు జి.కిషన్రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఎల్బీస్టేడియంలో జరిగే బహిరంగసభ తెలంగాణకు కీలకమని పేర్కొన్నారు. ‘ఐదుగురు బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఈ సభలో పాల్గొంటారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు, యువత సభకు రావాలి. మోదీకి మనమంతా అండగా నిలబడాల్సిన అవసరముంది. దీనికంటే ముందు నారాయణపేటలో జరిగే బహిరంగసభలో ప్రధాని పాల్గొంటారు’అని కిషన్రెడ్డి చెప్పారు. గురువారం ఎల్బీస్టేడియంలో సభా ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లపై రాహుల్గాంధీ డైరెక్ట్ చేసిన సినిమా ఫ్లాప్ ‘అండర్ కరెంట్, ఓపెన్ కరెంట్ ఉంది.. ప్రజలు బీజేపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ఎన్నికల జిమ్మిక్కులు చేస్తూ బట్టకాల్చి మొహం మీద పడేసే ప్రయత్నం కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్నాయి’అని కిషన్రెడ్డి మండిపడ్డారు. ‘కేసీఆర్ మాటలు ప్రజలు సీరియస్గా తీసుకోవడం లేదు. నవ్వుకుంటున్నారు. గాడిద గుడ్డు ప్రచారానికే కాంగ్రెస్ పరిమితమైంది. తెలంగాణ ప్రజలెవరూ దాన్ని పట్టించుకోవడం లేదు. బీజేపీ హైకమాండ్ ఆదేశాలతో మేము 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రజలను కలిశాం. ఏ ఫ్రంట్ కూడా మోదీకి ప్రత్యామ్నాయంగా లేదు. కాంగ్రెస్కు విమర్శించడానికి ఏం లేదు. కాబట్టి దుష్ప్రచారం చేస్తుంది. రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేసింది. రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి మాటలను ఏ ఒక్కరూ సీరియస్గా తీసుకోవడం లేదు. రిజర్వేషన్ల అంశంపై డైరెక్ట్ చేసిన రాహుల్గాంధీ సినిమా ఫ్లాప్ అయ్యింది. సెకండ్, థర్డ్ ప్లేస్ వస్తుందని రేవంత్ రిజర్వేషన్ల అంశాన్ని ప్రచారం చేస్తున్నారు. సబ్కాసాత్.. సబ్ కా వికాస్ అనే నినాదంతో ముందుకు వెళుతున్నాం’అని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. -
బీఆర్ఎస్ ఎంపీలతోనే తెలంగాణకు బలం!
అల్వాల్/ కంటోన్మెంట్ (హైదరాబాద్)/ నిర్మల్: బీఆర్ఎస్ ఎంపీలతోనే తెలంగాణకు బలమని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడేది తామేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు గెలిస్తే.. ఢిల్లీ పాలకుల గల్లాపట్టి నిలదీసే ధైర్యం ఉండదని స్పష్టం చేశారు. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు కుట్రలు సాగుతున్నాయని.. అది ఆగాలంటే తెలంగాణ నుంచి కేసీఆర్ సైనికులు పార్లమెంట్లో ఉండాలని చెప్పారు.గురువారం మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్ వీబీఆర్ గార్డెన్లో, కంటోన్మెంట్ పరిధిలోని సిఖ్ విలేజ్ ఇంపీరియల్ గార్డెన్స్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో.. నిర్మల్ జిల్లా కేంద్రంలో, భైంసాలో నిర్వహించిన రోడ్ షో, కార్నర్ మీటింగ్లలో కేటీఆర్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘పార్లమెంట్ ఎన్నికలు కదా బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలని కొందరు అంటున్నారు. పార్లమెంట్లో తెలంగాణ ప్రజల గళం వినిపించడానికి కేసీఆర్ సైనికులు ఉండాలి. 2004లో ఐదుగురు ఎంపీలతో పార్లమెంట్లో అడుగుపెట్టిన కేసీఆర్.. 32 పార్టీలను ఒప్పించి, మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. రాహుల్ గాంధీని, నరేంద్ర మోదీని ఎదిరించే దమ్ము కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు లేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంటే అక్కడ బీజేపీ వాళ్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని అలవోకగా పడగొట్టారు. అదే కేసీఆర్, మమతా బెనర్జీ, హేమంత్ సోరేన్, స్టాలిన్, కేజ్రీవాల్ ప్రభుత్వాలను పడగొట్టే ప్రయత్నాలు చేసినా విఫలమయ్యారు. బలమైన లీడర్లు ఉన్నచోట బీజేపీ ఆటలు సాగలేదు. అందుకే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి బలం ఇవ్వాలి.బీజేపీ ముందు తల వంచేది లేదుబీఆర్ఎస్, బీజేపీ ఒకటేనంటూ అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్, ఈటల, రఘునందన్రావు, సోయం బాపూరావు వంటి బడా లీడర్లను ఓడించింది బీఆర్ఎస్ వాళ్లేనని గుర్తుంచుకోవాలి. మేం తల నరుక్కుంటాం కానీ.. బీజేపీ ముందు తల వంచేది లేదు.రేవంత్ ఊసరవెల్లిలా ప్రవర్తిస్తున్నారుకాంగ్రెస్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే చెప్పాం. ఆ పార్టీ అబద్ధపు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను ఇబ్బంది పెడుతోంది. గత ఐదు నెలల్లో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయింది. రేవంత్ చిల్లర మాటలు మాట్లాడటం తప్ప మరేమీ జరగలేదు. ఊసరవెల్లి రంగులు మార్చినట్టు హామీల అమలు గురించి నెలలు, తారీఖులు చెప్తున్నారు. కొడుకుల్లారా, పేగులు తీసి మెడలో వేసుకుంటా అంటూ రేవంత్ మాట్లాడుతున్నారు. ఆయన ముఖ్యమంత్రా.. బోటీ కొట్టేవాడా? మన ఖర్మకాలి ముఖ్యమంత్రి అయ్యిండు. పిచ్చోడి చేతిలో రాయిలా తెలంగాణ మారింది.బీజేపీ హైదరాబాద్ను యూటీ చేస్తుందిరిజర్వేషన్లను రద్దుచేసి అగ్రవర్ణాలకు మేలు చేసేలా బీజేపీ కుట్ర చేస్తోంది. ఇందుకోసం రాజ్యాంగాన్ని కూడా మార్చాలని ప్రయత్నిస్తోంది. ప్రధాని మోదీ పదేళ్ల క్రితం ఇచ్చిన హామీలకే గ్యారంటీ లేదు, ఇప్పుడు కొత్తగా చెప్పే మాటలకు గ్యారంటీ ఏముంది? జూన్ 2వ తేదీతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతుంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు ముగుస్తుంది. దీంతో కేంద్రం హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది.అదే జరిగితే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. మల్కాజిగిరిలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ఇద్దరూ నాన్ లోకల్, బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పక్కా లోకల్ అన్నారు. ఎంపీగా లక్ష్మారెడ్డిని, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో నివేదిత సాయన్నను గెలిపించాలని పిలుపునిచ్చారు.భైంసాలో కేటీఆర్పై ఉల్లిగడ్డలు.. జైశ్రీరాం నినాదాలుభైంసా/ భైంసాటౌన్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లా భైంసాలో గురువారం సాయంత్రం కేటీఆర్ నిర్వహించిన రోడ్ షోలో.. కొందరు ఉల్లిగడ్డలు, చిన్నపాటి రాళ్లు విసిరారు. కార్నర్ మీటింగ్ నిర్వహించిన ప్రాంతానికి హనుమాన్ స్వాములు, మరికొందరు చేరుకున్నారు. కేటీఆర్ ఖబడ్దార్ అంటూ ముద్రించిన ప్లకార్డులను చూపుతూ.. జైశ్రీరాం అంటూ నినాదాలు చేశారు.కేటీఆర్ ప్రసంగిస్తున్నంత సేపు ఆయన వాహనంపైకి ఉల్లిగడ్డలు విసిరారు. ఈ సమ యంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకారులవైపు దూసు కెళ్లే ప్రయత్నం చేయడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు చాలా కష్టపడి ఇరువర్గాలను అదుపుచేశారు. నిరసనకారులు విసిరిన ఉల్లిగడ్డలు, చిన్నరాళ్లతో ఓ యువకుడి తలకు స్వల్పంగా గాయమైంది.దేవుడిని అడ్డంపెట్టుకుని రాజకీయాలా?భైంసాలో తనపై ఉల్లిగడ్డలు, రాళ్లు విసిరినవారిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కావాలనే యువకులను రెచ్చగొట్టి ఇలా పంపిస్తుంటారని, కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. ‘‘కేసీఆర్ తెలంగాణలో యాదాద్రి సహా ఎన్నో మందిరాలు నిర్మించారు. ఏమీ చేయనివారే దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారు.రాముడు ఎంతో ఆదర్శవంతుడు. మేం కూడా జైశ్రీరాం అంటాం. మరి రాముడు ఎదుటివారిపై రాళ్లు విసరాలని చెప్పాడా? మా పని మేం చేసుకుంటున్నాం. మీ పని మీరు చేసుకోండి. కానీ చిల్లర పనులు చేయవద్దు. ఇలాంటి వాటికి భయపడబోం’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.‘మత’ ముష్కరులపై పోరాటం కొనసాగుతుంది: ‘ఎక్స్’లో కేటీఆర్‘‘భైంసా పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో నాపై కొందరు బీజేపీ గూండాలు రాళ్లతో దాడి చేసిన ఘటనతో అనేక మంది ఫోన్లు చేసి నా యోగక్షేమాలు అడుగుతున్నారు. నేను క్షేమంగా ఉన్నాను. మతం పేరిట విద్వేషాన్ని వ్యాప్తి చేస్తూ విషాన్ని చిమ్మే ఈ ముష్కరులపై నాపోరాటం కొనసాగుతుంది’’ అని ‘ఎక్స్’లో కేటీఆర్ పేర్కొన్నారు. -
వికసిత్ భారత్ కాదు.. విఫల భారత్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ‘‘పదేళ్ల పాలనలో ప్రధాని మోదీ చేసిన ఏ వాగ్దానం కూడా నెర్చలేదు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అన్న మోదీ.. దేశ్ కా సత్యనాశ్ చేసిండు. వికసిత భారత్ అంటూ దేశాన్ని విఫల భారత్గా చేసిండు..’’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. నోటికొచ్చిన హామీలిచ్చి రాష్ట్రంలో గద్దెనెక్కిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయలేక నాలుగైదు నెలల్లోనే తెలంగాణను ఆగమాగం చేసిందని విమర్శించారు. కేసీఆర్ గురువారం కరీంనగర్లో రోడ్ షో నిర్వహించి.. తెలంగాణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..‘‘పదేళ్ల కింద మోదీ ప్రధాని అయినపుడు 150 హామీలిచ్చి ఒక్కటైనా నెరవేర్చలేదు. అచ్చేదిన్ అన్నారు.. సచ్చేదిన్ వచ్చింది. అంతా గ్యాస్.. ట్రాష్..! మాట్లాడితే పాకిస్తాన్, పుల్వామా అంటారు. పాకిస్తాన్ చిన్న దేశం. వాడిని చూపించి డ్రామా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దేశం నుంచి ఎగుమతులు నిలిచినయ్. విదేశీ మారకాలు తగ్గినయ్.. కొలువుల భర్తీలేదు. కార్పొరేట్లకు రూ.15 లక్షల కోట్లు రుణమాఫీ చేశారే తప్ప పేదలకు రుపాయి ఇవ్వలేదు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వలేదు. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు.బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఏం చేశారు?పోయినసారి మంచికో చెడుకో రాష్ట్రంలో నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచారు. వారు నాలుగు రూపాయల పనైనా చేశారా. మత విద్వేషాలు పెంచడం తప్ప ఏమీ చేయలేదు. అసలు ఇక్కడి ఎంపీ బండి సంజయ్కు సరిగా మాట్లాడటం వస్తదా? అతన్ని పార్లమెంటుకు పంపుదామా? విద్యావంతుడైన వినోద్కుమార్ను పంపుదామా? ఆలోచించాలి.మహిళలకు రూ.2,500 సాయం ఏది?అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మహిళలకు రూ.2,500 ఇస్తామన్నరు, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్నరు. ఏవి? రుణమాఫీ, పింఛన్ల పెంపు ఏవి? మహిళలకు ఫ్రీ అని చెప్పి బస్సులు సరిగా వేయకపోతే.. మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకోవాల్సి వస్తోంది. 9 ఏళ్లపాటు రెప్పపాటు పోని కరెంటు ఇప్పుడు ఎక్కడికి పోయింది? మిషన్ భగీరథ నీళ్లు ఏవి? మహిళలు మళ్లీ బిందెలు పట్టుకుని నీళ్ల కోసం పోవడం చూసి నా కళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. నాలుగైదు నెలల్లోనే తెలంగాణ ఎందుకింత ఆగమైంది? ముస్లింలంతా కాంగ్రెస్కు ఓటేస్తే.. బీజేపీ గెలుస్తుంది. బీజేపీకో హఠానా చాహియే.. ఆ పని బీఆర్ఎస్తోనే సాధ్యం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. -
మాది పేగు బంధం: ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కేసీఆర్
కేసీఆర్ రాష్ట్ర సాధకుడు, ఒక చరిత్ర. తెలంగాణతో నాది పేగు బంధం. నాడు ఆశలు అడుగంటిన సమయంలో పట్టుమని పది మంది కూడా లేకున్నా తెలంగాణ పోరాటం మొదలుపెట్టా. అనేక కష్టనష్టాలకోర్చి రాష్ట్రాన్ని సాధించా. నా గుండె ధైర్యం ఎన్నడూ చెక్కు చెదరదు. కోడి రెక్కల కింద పిల్లలను దాచుకున్నట్లు తెలంగాణ ప్రజలను కాపాడుకున్నాం. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభూత కల్పనలు సృష్టిస్తే.. మేం చేసింది కూడా చెప్పుకోలేక పోయాం. పదేళ్లు సీఎంగా నేను ఏం మాట్లాడానో, వాళ్లేం మాట్లాడుతున్నారో ప్రజలు చూస్తున్నారు. బీఆర్ఎస్ జాతీయ కార్యకలాపాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తెలంగాణలో ఓడిపోకపోతే మహారాష్ట్రలో 20, 30 ఎంపీ సీట్లు వచ్చేవి. ఏడాదిలోగా గ్రామస్థాయి మొదలుకుని మొత్తం బీఆర్ఎస్ కార్యవర్గాలను పునర్వ్యవస్థీకరిస్తాం.(కల్వల మల్లికార్జున్రెడ్డి) కాంగ్రెస్ను నమ్మి మోసపోయామని తెలంగాణ ప్రజలు గుర్తించారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం గురించి సీఎం రేవంత్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉందన్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసు నుంచి రేవంత్ తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు 12కుపైగా లోక్సభ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమే అధికారంలోకి వస్తుందని, అందులో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న కేసీఆర్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలంగాణతో తమది పేగు బంధమని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్ ఒక్కటేనని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రజలు కాంగ్రెస్ను నమ్మి మోసపోయారు కాంగ్రెస్ ఇచ్చిన అడ్డగోలు హామీలతో ప్రజలు ఆశకు పోయి మోసపోయారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాతి పరిణామాలతో.. కాంగ్రెస్ను నమ్మి తినే అన్నంలో మన్నం పోసుకున్నామనే భావన జనంలో మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో మేం పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. కేవలం 1.8శాతం ఓట్ల స్వల్ప తేడాతో అధికారం కోల్పోయాం. మాకు కొన్ని వర్గాలు దూరం అయ్యాయనేది ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి పుట్టిన విచిత్రమైన కథ. మాకు ఏ ఒక్క వర్గం కూడా దూరం కాలేదు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమిదే అధికారం మోదీ ఏమైనా మొనగాడా? రాహుల్ సిపాయా? ఎన్డీయే, ఇండియా కూటమి ఏదీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల తర్వాత మోదీ, ఎన్డీయే దుర్మార్గ పాలన అంతమవుతుంది. దక్షిణాదిలోని 139 సీట్లలో బీజేపీకి 9 కూడా రావు. అధికారం వచ్చే పరిస్థితి కాంగ్రెస్కు లేదు. బలంగాఉన్న ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే కూటమికే వాళ్లు మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఎవరి మద్దతు తీసుకోవాలో అందరం కలసి నిర్ణయం తీసుకుంటాం. ప్రాంతీయ పార్టీల కూటమి వస్తే బీఆర్ఎస్కు ఒకట్రెండు కేంద్ర మంత్రి పదవులు కూడా వస్తాయి. మోదీ మేనియా అంతా గ్యాస్ ఎన్డీయే ట్రాష్,. మోదీ మేనియా గ్యాస్ అని తేలిపోయింది. ఆయన నినాదాలన్నీ డొల్ల, మోదీ పాలనలో ఒక్క రంగం కూడా బాగుపడలేదు. కార్పొరేట్లకు రుణమాఫీ చేశారు. ఎగవేతదారులను లండన్లో పెట్టి మేపుతున్నారు. మోదీ రాజకీయంగా అనేక దుర్మార్గాలు చేశారు. 700కుపైగా ఇత ర పార్టీల ప్రజాప్రతినిధులను చేర్చు కుని ప్రభుత్వాలను కూల్చివేశారు. గతంలో 111 మంది ఎమ్మెల్యేలు ఉన్న మా ప్రభుత్వాన్ని కూడా కూల్చాలని చూశారు. అలాంటి పరిస్థితి రాకుండా.. మేం నైతిక పద్ధతుల్లో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నాం.పెట్రోల్ ‘చార్ సౌ’ దాటుతుంది కేంద్రంలో బీజేపీ, మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే.. వారి సీట్లేమోగానీ పెట్రోల్ ‘చార్ సౌ’ దాటడం పక్కా. ప్రధాని మోదీ దుర్మార్గుడు. మత విద్వేషాలు మినహా దేశ ప్రగతి ఆయనకు పట్టదు. రాష్ట్రాలను మున్సిపాలిటీల కంటే అధ్వానంగా దిగజార్చారు. మోదీ మూలంగా మతపిచ్చి వాళ్ల దేశమనే ముద్ర పడుతోంది. కవిత, కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా, జర్మనీ వంటి ప్రజాస్వామ్య దేశాలు కూడా ప్రతిస్పందించాయి.రేవంత్ తప్పించుకోలేడుప్రధాని మోదీని రేవంత్ బడేభాయ్ అనడం వంటి వాటిపై కాంగ్రెస్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రేవంత్ ఒకవేళ బీజేపీలోకి వెళ్తే.. తాము 30 మందిమి రెడీగా ఉన్నామని, కలిసి పనిచేద్దామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు బీఆర్ఎస్ నేతలతో చెప్తున్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన రేవంత్ దాన్నుంచి తప్పించుకోలేడు. ఆయన అరెస్టు అయితే రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి వస్తుందని అంతా అనుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమానికి రేవంత్కు సంబంధమే లేదు. ఉద్యమకారుల మీదికి తుపాకీతో వచ్చిన ఆయన తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంది. గుజరాత్తో తెలంగాణకు ఫైనల్ మ్యాచ్ అనేది బుద్ధిలేని వాదన.బీజేపీకి వ్యతిరేకంగా నిలవడం వల్లే కవిత అరెస్టు అవినీతికి పాల్పడాల్సిన అవసరం, ఖర్మ నా కూతురుకు లేవు. ఆమె నిర్దోíÙ, అమాయకురాలు. విచారణకు సహకరించినా అరెస్టు చేశారు. ఇలా చేస్తారని నాకు ముందే తెలుసు. రాజకీయ కక్ష సాధింపులకు బలి కాబోతున్నావు, నేరం చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉండు అని కవితకు చెప్పా. బీజేపీ వాళ్లు దుర్మార్గాలకు పాల్పడుతారని వివరించా. నేను, కేజ్రీవాల్ ఇద్దరం బీజేపీకి వ్యతిరేకంగా బలంగా నిలబడటం వల్లే ఇది జరుగుతోంది. న్యాయ వ్యవస్థ మీద నమ్మకముంది. కవిత బెయిల్ కోసం నేను బీజేపీతో రాజీ పడ్డాననడం అర్థ రహితం.నిఘా నుంచి సమాచారం మాత్రమే కోరాం.. ఫోన్ ట్యాపింగ్ అంటూ.. బాకా, కాకా మీడియాలో వస్తున్న వార్తలన్నీ ట్రాష్. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ప్రభుత్వానికి గూఢచార వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ఎలా సమాచార సేకరణ జరిపిందనేది మాకు అనవసరం. సీఎం, మంత్రులకు అందులో ఏం పాత్ర ఉంటుంది. ఫోన్ ట్యాప్ చేయాలని ఏ సీఎం కూడా ఆదేశించరు. ప్రభుత్వ పనితీరు, శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిఘా వ్యవస్థల నుంచి సమాచారం మాత్రం అడుగుతాం.జగన్ మళ్లీ సీఎం అవుతారు వైఎస్ జగన్ ఏపీలో రెండోసారి సీఎం అవుతారనే సమాచారం నాకు ఉంది. షర్మిల వంటి వ్యక్తులతో ఏదీ సాధ్యం కాదు. ఒకవేళ ఎవరైనా షర్మిల వంటి వారిని అడ్డుపెట్టుకుని ఇబ్బంది పెట్టాలని చూసినా అవి ఫలించవు.మోదీ ఉల్లంఘనలు కనిపించట్లేదా? ప్రధాని మోదీ ఏం మాట్లాడినా అడిగేవారు లేక ‘బారా ఖూన్ మాఫ్’ అన్నట్టుగా తయారైంది. మతం పేరిట ప్రధాని రెచ్చగొడుతున్నా చర్యలు లేవు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి శివ లింగం మీద నీళ్లు పోస్తూ ఓట్లు అడిగితే ఉల్లంఘన కాదా? ఎన్నికల సంఘం నాపై మాత్రం 48 గంటల నిషేధం విధించింది. అది బీజేపీ అనుబంధ సంస్థగా మారింది. ధరణి, ల్యాండ్ టైటిల్ వంటివి ఉత్తమ విధానాలు చాన్నాళ్లుగా భూములను చిక్కుల్లో పెట్టి, రైతులను రాచి రంపాన పెట్టి.. ఎవరి భూములు ఎవరివో తెలియకుండా కన్ఫ్యూజన్లో పెట్టి.. లక్షలు, కోట్ల రూపాయలు దండుకున్నారు. ఎవరైనా సీఎం సాహసం చేసి దానిని సరిదిద్దాలని ప్రయత్నిస్తే.. కొన్ని ప్రతీపశక్తులు ప్రజల్లో భయాందోళన కలిగించే ప్రయత్నాలు చేస్తాయి. ధరణితో తెలంగాణలో ప్రజలకు మేలు జరిగింది. ఏపీలో సీఎం జగన్ కూడా ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేశారు. భూములను ఎవరూ లాక్కోకుండా ఉండేందుకే ధరణి, ల్యాండ్ టైటిల్ వంటి ఉత్తమ విధానాలు ఉపయోగపడతాయి. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ఉత్తమ విధానాలు లేవు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బద్నాం చేసే ఉన్మాదం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ను బద్నాం చేయాలనే ఉన్మాదం కాంగ్రెస్లో కనిపిస్తోంది. భారీ ప్రాజెక్టుల్లో బాలారిష్టాలు సహజం. ఒక బ్యారేజీ పిల్లర్లలో వచ్చిన సమస్యను సాకుగా చూపి పంటలను ఎండబెట్టారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికలోనూ ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. తక్షణమే మరమ్మతులు చేపట్టి నీళ్లు వినియోగించుకోవాలని సూచించింది. జ్యుడీషియల్ కమిషన్కు ఇంజనీరింగ్ విధానాల గురించి ఏం తెలుసు? మహానది, గోదావరి, కృష్ణా, కావేరి నదులను అనుసంధానించాలని 50 ఏళ్ల క్రితం అనుకున్నారు. మహానది విషయంలో ఒడిశా దుడ్డుకర్ర పట్టుకుంది. దాంతో గోదావరి నుంచి అనుసంధానం మొదలు పెడతామని మోదీ అంటున్నారు. గోదావరిలో రెండు తెలుగు రాష్ట్రాల వాటా తేల్చిన తర్వాతే అనుసంధానం గురించి మాట్లాడాలి.ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ జర్నలిజానికే మచ్చ కేసీఆర్ ప్రజాస్వామ్యయుతంగా ఉండరనేది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి కొందరు విషం చిమ్మేవాళ్లు చేసే తప్పుడు ప్రచారం. రాధాకృష్ణ జర్నలిస్టేనా? ఆయన కక్కేది విషం. దానికి వలువలు, విలువలు లేవు. కొత్త పలుకుఅంటూ చెత్త రాస్తారు. ఆయన సొంత అభిప్రాయాలు, కోరికలను చెప్తూ.. ఎదుటి వాళ్ల మీద విషం కక్కుతుంటారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి వంటివి జర్నలిజం పరువు తీసి బజారులో నిలబెట్టాయి. కాకా, బాకా ఊది గెలిపిస్తామని అనుకుంటున్న వీళ్లు.. గతంలో చంద్రబాబును ఏపీలో గెలిపించగలిగారా? రాధాకృష్ణ లాంటి వాళ్లు జర్నలిజానికి మచ్చ.పుస్తకాలు చదువుతున్నా.. పాటలు వింటున్నా సర్జరీ తర్వాత మెల్లగా కోలుకుంటున్నా. కొంత సమయం దొరికినప్పుడు పుస్తకాలు చదువుతున్నా. కిషోర్కుమార్, లతా మంగేష్కర్, ముఖేశ్ పాటలు చాలా ఇష్టం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సమయం దొరకదు. సీఎం బాధ్యతల నుంచి తప్పుకున్నాక ఎన్నికలు, పార్టీ కార్యకలాపాలపై దృష్టి పెట్టాను. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు చూస్తే.. ప్రశాంతంగా ఉండలేకపోతున్నా.. -
కేసీఆర్ రాష్ట్రాన్ని నంబర్వన్గా నిలిపారు
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల పాలనలో తెలంగాణ సీఎంగా కేసీఆర్ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్వన్గా నిలిపారని, అందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన గణాంకాలే సాక్ష్యాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆర్బీఐ విడుదల చేసిన నివేదికను చూస్తే తెలంగాణ సాధించిన ప్రగతి కళ్లకు కడుతుందని, కేసీఆర్ ఈ రాష్ట్రానికి ఏం చేశారన్న మాటలకు ఆర్బీఐ లెక్కలే సమాధానమని అన్నారు. ఈ మేరకు ఆయన ఆర్బీఐ నివేదికను ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ, వివరాలు వెల్లడించారు. బలమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించడంతో పాటు నీటిపారుదల, వ్యవసాయం, అభివృద్ధి, పన్ను వసూళ్లు, మహిళా సాధికారత, వైద్యవిద్య మొదలైన రంగాల్లో టాప్గా నిలిపినట్లు వివరించారు. 2022–2023 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ తలసరి ఆదాయం (ఎన్ఎస్డీపీ) రూ. 3.08 లక్షలకు చేరిందని, దేశంలోని అన్ని ప్రధాన రాష్ట్రాలను తలదన్ని తెలంగాణ ముందుందని తెలిపారు. తెలంగాణలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లలో 40 శాతం వాటా మహిళలదేనని, జాతీయ సగటు 20 శాతంతో పోల్చితే రెట్టింపుతో మహిళా సాధికారతలోనూ మనమే ముందున్నామన్నారు. వైద్యవిద్య విషయంలో తెలంగాణలో ప్రతి 4,460 మందికి సగటున ఒక ఎంబీబీఎస్ సీటు అందుబాటులో ఉందని, దేశంలో సగటున 12,851 మంది విద్యార్థులకు ఒక సీటు మాత్రమే అందుబాటులో ఉందని తెలిపారు. పన్ను వసూళ్లలోనూ ఆదర్శంగా నిలిచామని, 2021–22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ తలసరి ఎస్జీఎస్టీ పన్ను వసూళ్లు రూ. 7,665గా ఉందని, దేశ సగటు రూ. 4,461 మాత్రమేనని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పాలిత ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి ప్రగతిని చూపించే దమ్ముందా అని కేటీఆర్ సవాల్ విసిరారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే తెలంగాణ వచ్చి పోతున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఈ గణాంకాలు చూసి పరిపాలన నేర్చుకోవాలని హితవు పలికారు. ఒక రాజకీయ నాయకుడు తరువాతి ఎన్నికల్లో గెలవటం కోసం మాత్రమే ఆలోచిస్తాడని, కానీ కేసీఆర్ లాంటి రాజనీతిజ్ఞుడు మాత్రమే తరువాత తరం కోసం ఆలోచిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు.ఆరు గ్యారంటీలు ఇవే: కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలపై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తుంచుకోండి. ఆరు గ్యారంటీలైన ఇన్వర్టర్లు, చార్జింగ్ బల్బులు, టార్చ్ లైట్లు, కాండిళ్లు, జనరేటర్లు, పవర్ బ్యాంకులు సమకూర్చుకుని నిలువ చేసుకో వాలని నా సహ తెలంగాణ పౌరులను కోరుతున్నా’అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘మోదీ చెప్తున్న ప్రకారం అదానీ, అంబానీ వ్యాన్ల కొద్దీ నోట్ల కట్టలను స్కాంగ్రెస్ (కాంగ్రెస్)కు పంపుతుంటే ఆయన ప్రియమైన భాగస్వాములు ఈడీ, ఐటీ, సీబీఐ ఎందుకు మౌనంగా ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు అనేది విఫలమైందని మోదీ అంగీకరిస్తున్నట్లేనా’అని కేటీఆర్ మరో పోస్ట్ చేశారు. -
విశ్వ నగరంలో విషం చిమ్ముతున్నారు
సాక్షి, హైదరాబాద్/ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: విశ్వ నగరం హైదరాబాద్లో బీజేపీ నేతలు విషం చిమ్ముతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ మహిళా నేత ఒకరు (నవనీత్ రాణా) మాట్లాడుతూ 15 సెకన్లు సమయమిస్తే మైనార్టీలను తుద ముట్టిస్తామని అన్నారని, ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన ఆమెపై కేసు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆమె విద్వేష పూరిత మాటలను బీజేపీ నేతలు సమర్థించని పక్షంలో పార్టీ నుంచి ఆమెను బహిష్కరించాలని అన్నారు. తాము అన్ని పండుగలు చేసుకుంటున్నామని, తమకు హిందూత్వం గురించి బీజేపీ వాళ్ళు నేర్పాలా? అని ప్రశ్నించారు. ప్రజలు కూడా దీనిపై ఆలోచన చేయాలని కోరారు. గురువారం నర్సాపూర్, సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించిన జనజాతర సభల్లో ఆయన మాట్లాడారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే కాంగ్రెస్ను గెలిపించాలి ‘లోక్సభ ఎన్నికలు మనకు జీవన్మరణ సమస్య. దేశ రాజ్యాంగం ప్రమాదంలో పడింది. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే కాంగ్రెస్ను గెలిపించాలి. రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది. రిజర్వేషన్లను కాపాడుకోవడం కోసం ఇండియా కూటమి అధికారంలోకి రావాలి. ఎన్నికలు రాగానే బీజేపీకి రాముడు, హన్మాన్ జయంతి.. బీఆర్ఎస్కు బతుకమ్మ పండగ గుర్తుకొస్తాయి. బిచ్చగాళ్లు అడుక్కున్నట్లుగా ఓట్లు అడుక్కునేందుకు రాముడిని, హనుమంతుడిని వాడుకుంటున్న బీజేపీని ఆ దేవుడు కూడా క్షమించడు. కేసీఆర్ను ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావు. బీఆర్ఎస్ పార్టీకి మెదక్లో ఒక్క మొనగాడు కూడా దొరక్క కరీంనగర్కు చెందిన వ్యక్తిని తీసుకువచ్చి మెదక్లో పోటీ చేయిస్తున్నారు. మెదక్పై ఇందిరకుప్రత్యేక మమకారం దివంగత ప్రధాని ఇందిరాగాం«దీకి మెదక్ అంటే ప్రత్యేక మమకారం ఉండేది. ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించినప్పుడే ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. బీడీఎల్, బీహెచ్ఈఎల్, ఓడీఎఫ్ వంటి ఫ్యాక్టరీలు వచ్చాయి. కానీ 1999 నుంచి 2024 వరకు మెదక్ నియోజకవర్గం బీజేపీ, బీఆర్ఎస్ చేతుల్లో మగ్గి పోయింది. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు వెంకట్రామ్రెడ్డి, రఘునందన్రావులను ఈ ఎన్నికల్లో ఓడించాలి. రాష్ట్రంలో 14 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి. దేశంలో ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావాలి. పేద ప్రజల కోసం రాహుల్ గాంధీ జీవితాన్ని అంకితం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చి ఆంధ్రలో, దేశంలో అధికారాన్ని త్యాగం చేసింది..’అని రేవంత్ అన్నారు. -
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే
మధిర: రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును గెలిపిస్తే కేంద్ర మంత్రి అవుతారని ఇటీవల ఖమ్మం సభలో మాజీ సీఎం కేసీఆర్ చెప్పడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ గురువారం రాత్రి ఖమ్మం జిల్లా మధిర, ఎర్రుపాలెంలో జరిగిన కార్నర్ మీటింగ్లో భట్టి మాట్లాడారు. ఎన్నికల కోడ్ పూర్తి కాగానే తాము ఇచ్చిన అన్ని హామీలన్నీ అమలు చేస్తామని తెలిపారు. పీఎం నరేంద్ర మోదీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జైల్లో ఉన్న కవితను బయటకు తీసుకురావాలనే బీఆర్ఎస్ బీజెపీతో కలిసి పనిచేస్తోందని భట్టి విమర్శించారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో 12 ఎంపీ స్థానాలు గెలవడం కాదని, దమ్ముంటే 12 చోట్ల డిపాజిట్లు తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. తప్పుడు ప్రచారం చేయడానికి కేసీఆర్కు సిగ్గు లేదా అని ప్రశ్నించారు. -
తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు బీజేపీ చేసిందేమీలేదని రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి కెప్టెన్.ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. నిజంగా తెలంగాణకు బీజేపీ చేసిందేదైనా ఉంటే ఫలానా పనిచేశానని మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మతోపాటు హుజూర్నగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. గాం«దీభవన్లో గురువారం ఉత్తమ్తో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్మున్షీలు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహా్వనించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంకరమ్మతో కలిసి ఉత్తమ్ మాట్లాడుతూ శ్రీకాంతాచారి తెలంగాణ కోసం తన ప్రాణాలను త్యాగం చేశాడని, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ చాలా కాలం బీఆర్ఎస్లో పనిచేసినా ఆమెకు న్యాయం చేయలేదన్నారు. తనపై శంకరమ్మ పోటీ చేసినా, ఎప్పుడూ తాము వ్యక్తిగత వైరాలకు వెళ్లలేదని, శంకరమ్మ చేరికతో హుజూర్నగర్లో బీఆర్ఎస్ ఖాళీ అయ్యిందని చెప్పారు.లోక్సభ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి గెలవాలని బీజేపీ, బీఆర్ఎస్లు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికలు కాగానే కొత్త రేషన్కార్డులు ఇస్తామని, అర్హులైన వారందరికీ ఇళ్లు కట్టిస్తామని భరోసా ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 13 చోట్ల గెలుపొందుతుందని, 3 చోట్ల బీజేపీతో, ఒక చోట ఎంఐఎంతో కాంగ్రెస్కు పోటీ ఉందన్నారు. నాకు అన్యాయం జరిగింది: శంకరమ్మ శంకరమ్మ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో తమకు అన్యాయం జరిగిందని చెప్పారు. శ్రీకాంతాచారి మరణం చూసిన సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, రానున్న లోక్సభ ఎన్నికల్లో అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఆమె కోరారు. -
మీలా ట్యాపింగ్ డబ్బులతో ఓట్లు కొనేవాడిని కాను
హుస్నాబాద్: ‘నన్ను బిచ్చగాడు అని విమర్శిస్తున్నారు.. అవును.. ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లడిగే బిచ్చగాడిని, మీ లెక్క ఫోన్ ట్యాపింగ్ పైసలతో ఓట్లు కొనేటోడిని కాదు’అని బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిప్పులు చెరిగారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో గురువారం రాత్రి ఆయన కార్నర్ మీటింగ్లో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. శ్రీరాముడిని, ప్రసాదాన్ని హేళన చేసి మాట్లాడుతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్లో నేను పక్కాలోకల్ కనుకే రూ.12 వేల కోట్లకు పైగా నిధులు తెచ్చి అభివృద్ధి చేశానని చెప్పారు. ‘ఆరు గ్యారంటీల హామీలపై నేను చర్చకు సిద్ధం.. కాంగ్రెస్ సిద్ధమా’అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలపై ప్రశి్నస్తే తనపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని అన్నారు. హుస్నాబాద్ సాక్షిగా చెబుతున్నానని, రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తి లేదన్నారు. కాంగ్రెస్కు ముస్లింల రిజర్వేషన్లను అమలు చేయబోమని ప్రకటించే దమ్ముందా అని సవాల్ విసిరారు. రాజకీయ గురువు చొక్కారావును ఓడించిన జగపతిరావు కొ డుకును వెంటవేసుకొని తిరుగుతూ గురువుకే పంగనామాలు పెట్టిన పొన్నం ప్రభాకర్ తనపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని బండి అన్నా రు. ఈ సందర్భంగా పలు పారీ్టల నాయకులు బీజేపీలో చేరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్రెడ్డి, రాంగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శ్రీరామనవమి, హనుమాన్ జయంతి మనం చేయలేదా?: రేవంత్
సాక్షి, హైదరాబాద్: దేశంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. అధికారంలోకి రాగానే పేదల లిస్ట్ అంతా తయారు చేసి, ప్రతి పేద ఇంటిలో ఒక మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తామని తెలిపారు. దేశంలో సంపదకు కొదవలేదని అన్నారు. ఇన్ని రోజులు ప్రజల డబ్బులను మోదీ పెట్టుబడిదారులకు పంచారు. తాము పేదలకు పంచుతామని పేర్కొన్నారు.హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో గురువారం కాంగ్రెస్ ప్రచార సభ నిర్వహించింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలను అమలు చేస్తామని చెప్పారు. విద్యార్ధులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాల కల్పన చేస్తామని పేర్కొన్నారు. తప్పుడు నిర్ణయాలతో మోదీ నిరుద్యోగం పెంచారు.తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైన పాలన కొనసాగిస్తుందని, తెలంగాణ లాంటి ఈ పాలన దేశవ్యాప్తంగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు.‘బీజేపీ గెలిస్తే రాజ్యాంగం రద్దు చేస్తారు. భారత రాజ్యాంగం కేవలం పుస్తకం కాదు. అది పేద ప్రజల చప్పుడు. రిజర్వేషన్లు వచ్చింది మన రాజ్యాంగం వల్లే. ప్రజలకు అధికారం ఇచ్చింది రాజ్యాంగం. ఈ రాజ్యాంగం కోసం అంబేద్కర్, గాంధీ, నెహ్రూ లాంటి వాళ్ళు తమ చెమటను, రక్తాన్ని దారపోశారు. రాహుల్, రేవంత్ లాంటి వాళ్ళం రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. అదానీ, అంబానీ లాంటి 22 మంది కోసం మోదీ రాజ్యాంగాన్ని నడిపారు. ప్రజలకు చెందిన లక్షల కోట్లను 22 మంది పెట్టుబడి దారులకు మోదీ పంచారు’ అని ధ్వజమెత్తారు.మతాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. విశ్వనగరంలో బీజేపీ విషం చిమ్ముతోందని మండిపడ్డారు. 15 సెకన్ల సమయం ఇస్తే ముస్లింలను తుదిముట్టిస్తామని బీజేపీ ఎంపీ అంటోందని విమర్శించారు. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి మనం చేయలేదా? మనకా వీళ్ళు హిందుత్వం నేర్పేదని ప్రశ్నించారు. అక్షింతలు పంపి ఓట్ల బిచ్చం ఎత్తుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు.‘ఈ ఎన్నికలు మన జీవన్మరణ సమస్య. రాజ్యాంగం ప్రమాదంలో పడింది. మేం ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నారు. రిజర్వేషన్లపై దాడి చేయాలని మోదీ, అమిత్ షా కంకణం కట్టుకున్నారు. రాజ్యాంగం సంక్షోభంలో పడే సమయంలో ఇందిరాగాంధీ మెదక్ నుండి పోటీ చేసింది. ఇందిరా మనమడు, సోనియా కొడుకు రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపాడడానికి తెలంగాణ గడ్డపైకి వచ్చి యుద్ధం ప్రకటించారు.తెలంగాణ బిడ్డలు రాహుల్ గాంధీ వైపు నిలబడాలి. రిజర్వేషన్లు కాపాడే పోరాటంలో మనమంతా రాహుల్ తో కలిసి నడవాలి. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు మత సామరస్యం పెంపొందించాం కాబట్టే వేల కోట్ల పెట్టుబడులు హైదారాబాద్కు వచ్చాయి. బీజేపీ మత ఉచ్చులో పడకండి. 15 సెకన్లలో ముస్లింలను తుదముట్టిస్తామని చెప్పిన బీజేపీ ఎంపీ పై అమిత్ షా, మోదీ స్టాండ్ ఏంటో చెప్పాలి. మోదీ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చాడు’ -
ఆ ఓటర్లే కీలకం..!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం లోక్సభ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు రాబట్టడంపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. ఓ వైపు ఉధృతంగా ప్రచారం చేస్తూనే.. ఏయే వర్గాల నుంచి ఓట్లు వచ్చే అవకాశముందనే అంశంపై లెక్కలు వేస్తున్నారు. గత ఎన్నికల్లో పోలైన ఓట్లు, అందులో పార్టీల వారీగా పోలైనవి, ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపై అభ్యర్థులు ఆరా తీస్తున్నారు. అయితే, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్న నేపథ్యాన అతివలే కేంద్రంగా ప్రధాన పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నా యి. అలాగే, కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న యువతను ఆకట్టుకునేలా నేతలు ప్రసంగిస్తు న్నారు. ఇక పోస్టల్, హోం ఓటింగ్ వేసే వారిపైనా దృష్టి సారించి.. సాధారణ పోలింగ్ కన్నా ముందుగానే ఎక్కువగా ఓట్లు సాధించాలనే ఉద్దేశంతో పార్టీలు పనిచేశాయి.పోస్టల్, హోం ఓటింగ్ కీలకం..రాజకీయ పార్టీల అభ్యర్థులు ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, హోం ఓటింగ్ ఈనెల 3న ప్రారంభమై బుధవారం ముగు స్తుందని తొలుత ప్రకటించినా 10వతేదీ వరకు పొడి గించారు. ఇప్పటికే తమ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు వేయించాలనే లక్ష్యంతో నేతలు పనిచేయగా మిగిలిన సమయంలోనూ ఎక్కువ ఓట్లు రాబట్టేలా ఉద్యోగు లను కోరేందుకు సిద్ధమవుతున్నారు.కాగా, బుధవా రం నాటికి ఉద్యోగులు 7,203మంది, వయోవృద్ధులు 2,713 మంది ఓటు వేశారు. ఇక ప్రచారానికి మరో మూడు రోజుల సమయమే ఉండడం.. అగ్రనేతల ప్రచారం ముగియడంతో ఓటర్లను నేరుగా కలి సేందుకు అభ్యర్థులు, నాయకులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంటింటి ప్రచారాన్ని ఉధృతం చేస్తూ తమ పార్టీకే ఓటు వేయాలని కోరుతున్నారు.పోలింగ్ శాతం పెరగాల్సిందే..ప్రచారం చేస్తూనే పోలింగ్ శాతం పెంపుపైనా పార్టీ లు దృష్టి సారించాయి. 2014 ఎన్నికలతో పోలిస్తే 2019 ఎన్నికల్లో తక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో 82.13 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2019లో 75.30 శాతం పోలింగ్ జరిగింది. కానీ ఈసారి అది పెరిగేలా.. తద్వారా ఎక్కువ మంది ఓటర్లను తమ వైపు ఆకర్షించుకునేలా నేతలు పనిచేస్తున్నారు. మరోపక్క ఎన్నికల సంఘం కూడా పోలింగ్ పెంపునకు ప్రచా రం చేస్తోంది. వివిధ మాధ్యమాల ద్వారా ఓటు ప్రాముఖ్యతను వివరి స్తూనే షాపింగ్ మాల్స్ వద్ద సెల్ఫీ పాయింట్లు సైతం ఏర్పాటుచేశారు.యువ ఓటర్లకు గాలం!ఈసారి నూతనంగా ఓటు హక్కు సాధించిన 18 ఏళ్ల నుంచి 19 ఏళ్లలోపు యువ ఓటర్లకు గాలం వేసేలా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. వీరు మొదటిసారి ఓటు వేయనుండడంతో ఆకట్టుకునేలా ప్రచారం చేయడమే కాక యువతకు చేస్తున్న మేలును కూడా ప్రచారంలో నేతలు ప్రస్తావిస్తున్నారు. ప్రత్యేకంగా యువ ఓటర్లను కలుసుకునేందుకు సమ్మేళనాలు సైతం నిర్వహిస్తున్నారు.ఈ సమావేశాల్లో నిరుద్యోగ సమస్య, ఉద్యోగ నియామకాల అంశాలను వివరిస్తూ ఓట్లు రాబట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఖమ్మం లోక్సభ పరిధిలోని మొత్తం 16,31,039 మంది ఓటర్లలో 18 నుంచి 19 ఏళ్లలోపు వయస్సు ఓటర్లు 50,747 మంది ఉన్నారు. వీరిలో 26,775 మంది యువకులు, 23,967 మంది యువతులు ఉండగా.. మొదటిసారిగా ఓటు వేసే వీరిని ప్రసన్నం చేసుకోవడంలో పార్టీల అభ్యర్థులు నిమగ్నమయ్యారు.ఆమే.. అధికం!ఈ ఎన్నికల్లో మహిళల ఓట్లే కీలకం కానున్నాయి. గత ఎన్నికల్లోనూ వీరే ఎక్కువ మంది ఓటు వేసినా పూర్తిస్థాయిలో ఓటింగ్ నమోదు కాలేదు. దీంతో ఈసారి ఎలాగైనా పోలింగ్ బూత్లకు రప్పించేలా పార్టీల నాయకులు కసరత్తు చేస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో 7,73,428 మంది మహిళా ఓటర్లు ఉండగా.. చాలా తక్కువ మంది ఓటు వేశారు.ఈసారి మొత్తం ఓటర్లు 16,31,039 మందికి పురుషులు 7,87,160 మంది, మహిళలు 8,43,749 మంది ఉన్నారు. అంటే పురుషుల కన్నా మహిళలు 56,589 మంది ఎక్కువగా ఉన్న నేపథ్యాన గత ఎన్నికల మాదిరి కాకుండా అందరినీ పోలింగ్ బూత్ల వద్దకు రప్పించేందుకు పార్టీల నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంటింటి ప్రచారంలో మహిళలపైనే దృష్టి సారిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు తమ హయాంలో కరెంట్ కోతలు లేవని, నీటి కొరత ఎదురుకాలేదని చెబుతుండగా.. కాంగ్రెస్ నేతలు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు గ్యాస్ సిలిండర్ అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఇక బీజేపీ సైతం మహిళా ఓటర్లే లక్ష్యంగా ప్రచారం కొనసాగిస్తోంది. -
వరంగల్ జనసభలో.. మోదీ నినాదం!
సాక్షి, వరంగల్: వరంగల్ నగరం కాషాయ జెండాలతో రెపరెపలాడింది. వరంగల్, మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థులు అరూరి రమేశ్, సీతారాంనాయక్ను గెలిపించాలంటూ గ్రేటర్ వరంగల్ పరిధిలోని మామునూరు తిమ్మాపూర్ క్రాస్రోడ్డు లక్ష్మీపురం మైదానంలో బుధవారం నిర్వహించిన ఓరుగల్లు జనసభలో ప్రధాని నమో నినాదం మార్మోగింది. సభలో ఎక్కడ చూసినా నమో బొమ్మలతో కూడిన ప్లకార్డులు కనిపించాయి. భారీ ఆకృతి లో ఉన్న ఫ్లెక్సీలు సభా ప్రాంగణంలో ప్రజలు పట్టుకొని ఉండడం చూసి మోదీ ఫిదా అయ్యారు.ఓరుగల్లు అంటే అభిమానమంటూ..‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు.. నా అదృష్టం ఏమిటంటే నేను పనిచేసినటువంటి అహ్మదాబాద్ అధిష్టాత్మి దేవత కూడా భద్రకాళి. ఆ భద్రకాళి అమ్మవారికి, ఆమె చరణాలకు నేను ప్రణామం చేస్తున్నా. ఇక్కడినుంచి కొంచెం దూరంలో ఉన్న రామప్ప మందిరానికి కూడా నేను నమస్కారాలు చేస్తున్నా. ఈ ప్రాంతం కాకతీయుల విజయ గౌరవ పతాకకు ప్రతీక.మూడో దశ పోలింగ్ను కూడా పూర్తి చేసుకొని ఇక్కడకు వచ్చి మీ ఆశీర్వాదం తీసుకునేటువంటి అదృష్టాన్ని పొందా’ అంటూ మోదీ ప్రసంగం ప్రారంభించడంతో సభికులు పెద్దపెట్టున మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేశారు. ‘నా దృష్టిలో వరంగల్ చాలా ముఖ్యమైనటువంటి చోటు. 40 సంవత్సరాల క్రితం బీజేపీకి ఇద్దరంటే ఇద్దరు ఎంపీలు ఉన్నప్పు డు అందులో ఒకరు మన హనుమకొండ నుంచి దివంగత నేత జంగారెడ్డి. బీజేపీ మీ అభిమానాన్ని, ఆశీర్వాదాన్ని, స్నేహాన్ని ఎప్పటికీ మరిచిపోలేదు.మాకు ఎప్పుడు కష్టం వచ్చినా వరంగల్ ప్రజానీకం వెన్నంటి నిలిచారు. అందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇనుపగుప్పిటనుంచి వరంగల్ను బయటకు తీసేందుకు బీజేపీ సర్వప్రయత్నాలను చేయబోతోంది’ అని వ్యాఖ్యలు చేశారు. ‘కేంద్రం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది. వరంగల్లో మేం టెక్స్టైల్ పార్కు ఏర్పాటుచేశాం. కానీ, పార్కు నిర్వహణ విషయంలో సమస్యలు వచ్చేలా ప్రయత్నిస్తున్నారు.తెలంగాణకు నష్టం చేస్తున్నటువంటి, ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి వాళ్లకు జవాబు చెప్పాల్సిన సమయం వచ్చింది. మీ అందరిని కోరుతున్నాను. వరంగల్ నుంచి అరూరి రమేశ్, మహబూబాబాద్ నుంచి సీతారాంనాయక్ను లోక్సభకు పంపించండి. మోదీకి బలం చేకూర్చండి అంటూ సభికులను ఆయన అభ్యర్థించారు. ఇంకోవైపు కళాకా రులు నిర్వహించిన కళానృత్యాలు అందరినీ అలరించా యి. మోదీ పాటలకు సభకు హాజరైన కొందరు స్టెప్పులేయడం కనిపించింది.వేదికపై అగ్రనేతలు.. అభ్యర్థులు..వేదికపై మోదీకి ఒకవైపు మహబూబాబాద్, వరంగల్ ఎంపీ అభ్యర్థులు సీతారాంనాయక్, అరూరి రమేశ్ ప్రజలకు నమస్కరిస్తూ కనిపించారు. మురళీ ధర్గౌడ్, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి అధ్యక్షతన సభ జరగగా. మోదీ ప్రసంగాన్ని హైదరాబాద్కు చెంది న రాక సుధాకర్ అనువదించారు.ప్రధాన వేదికపై నాయకులు పొంగులేటి సుధాకర్రెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్రావు, చందుపట్ల కీర్తిరెడ్డి, పార్టీ వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, జనగామ జిల్లాల అధ్యక్షులు గంట రవికుమార్, రావు పద్మ, నిశిధర్రెడ్డి, దశమంతరెడ్డితో పాటు నాయకులు కుమారస్వామి, మార్తినేని ధర్మారావు, గరికపాటి మోహన్రావు, కొండేటి శ్రీధర్, డాక్టర్ రాజేశ్వర్రావు, స్వాతిరెడ్డి, రావుల కోమల, జలగం అనిత, డాక్టర్ కాళీప్రసాద్, డాక్టర్ విజయరామారావు, అల్లం నాగరాజు, జలగం రంజిత్రావు, మాదిరెడ్డి దేవేందర్రెడ్డి, మల్లాడి తిరుపతిరెడ్డి కూర్చున్నారు. -
‘వీటిని స్టాక్ పెట్టుకోండి’.. కాంగ్రెస్పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చురకలు అంటించారు. ప్రస్తుతం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమని.. బీఆర్ఎస్ కాదని ప్రజలు గుర్తుంచుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రస్తుత కాలంలో ప్రజలంతా.. కొన్ని ఉత్పత్తులను నిల్వ చేసుకోవాలని అభ్యర్థించారు. అందులో... 1. ఇన్వర్టర్. 2. ఛార్జింగ్ బల్బులు. 3. టార్చ్ లైట్లు. 4. కొవ్వొత్తులు. 5. జనరేటర్లు. 6. పవర్ బ్యాంకులను నిల్వ ఉంచుకోవాలని ప్రజలను కోరుతూ కాంగ్రెస్పై సెటైర్లు వేశారు. వీటీనే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలుగా హామీ ఇచ్చిందని ఎద్దేవా చేశారు. గ్యారంటీల హామీ ఇచ్చి.. వాటీని స్టాక్ పెట్టుకోవల్సిన పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. అందుకే మే 13 లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు తెలివిగా ఆలోచించి ప్రజలంతా ఓటు వేయాలన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ ప్రజలను కోరారు.Request all fellow citizens to stock up on the following products Six Guarantees 😄1. Inverter2. Charging bulbs3. Torch lights4. Candles5. Generators6. Power BanksRemember it’s the Congress Govt, Not BRS’Vote wisely on 13th May 🙏#Vote4Car #KCRForTelangana— KTR (@KTRBRS) May 9, 2024 కాగా, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘ప్రధాని మోదీజీ.. అదానీ, అంబానీ స్కాంగ్రెస్(కాంగ్రెస్)కు టెంపోల నిండా డబ్బు పంపిస్తుంటే.. ఆయన అభిమాన మిత్రులైన ఈడీ, ఐటీ, సీబీఐ ఎందుకు మౌనంగా ఉన్నాయి?. డీమోనిటైజేషన్ వైఫల్యం అని కూడా ఆయన ఒప్పుకుంటారా?’ అని కామెంట్స్ చేశారు. As per PM Modi, if Adani & Ambani have been sending Tempoes full of cash to Scamgress, why did his favourite allies ED, IT & CBI stay mum?Is he also admitting that Demonetisation was a failure ?#JustAsking— KTR (@KTRBRS) May 9, 2024 -
వరంగల్.. ట్రయాంగిల్
సాక్షిప్రతినిధి, వరంగల్: తొలి నుంచి తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన గడ్డ. విప్లవ రాజకీయాలు, సామాజిక ఉద్యమాలకు నెలవు. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ కేంద్రంగా ఉన్న ప్రాంతం. రాజకీయ చైతన్యానికి మారుపేరైన వరంగల్ సెగ్మెంట్ను బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్..ఆ తర్వాత టీడీపీకి కంచుకోటగా ఉన్న వరంగల్ (హనుమకొండ) పార్లమెంట్ నియోజకవర్గంపై టీఆర్ఎస్ పట్టు బిగించింది. 2009 పునర్విభజనలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంగా ఏర్పడింది. 1952 నుంచి 2019 వరకు మూడు ఉపఎన్నికలు కలుపుకొని మొత్తం 20 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఏడుసార్లు కాంగ్రెస్, రెండుసార్లు కాంగ్రెస్(ఐ) అభ్యర్థులు విజయం సాధించగా, టీడీపీ ఐదు, టీఆర్ఎస్ నాలుగు, టీపీఎస్, పీడీఎఫ్ పార్టీలు ఒక్కోసారి గెలుపొందాయి. జనరల్ స్థానంగా ఉన్నప్పుడు సైతం మూడుసార్లు ఇక్కడ ఎస్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కడియం కావ్య (కాంగ్రెస్)నాన్న తోడు.. పార్టీ బలమే గెలిపిస్తుందన్న ధీమా లోక్సభ ఎన్నికల ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన కడియం కావ్య.. తండ్రి కడియం శ్రీహరి, కాంగ్రెస్ పార్టీకున్న బలాన్ని నమ్ముకున్నారు. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు ఘన విజయం ఇచ్చారు. ఈ పార్లమెంట్ పరిధిలోని వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరింటిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. స్టేషన్ఘన్పూర్ నుంచి గెలుపొందిన కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్లో చేరడం, ఆయన కూతురు కావ్యనే అభ్యర్థి కావడం అనుకూలంగా మారింది. డాక్టర్గా, స్వచ్ఛంద సంస్థల ఏర్పాటు ద్వారా చేసిన ప్రజాసేవకుతోడు కాంగ్రెస్ పార్టీ బలం, యువ నాయకురాలిగా ప్రజలు ఆదరిస్తారనే ధీమాలో కడియం కావ్య ఉన్నారు. అయితే కడియం కావ్య స్థానికేతరురాలని, ఆంధ్రా ప్రాంతానికి చెందిన ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుందన్న ప్రత్యర్థుల ఆరోపణలు ఇబ్బందికరంగా మారాయి. ఎన్నికల షెడ్యూల్ సమయాన బీఆర్ఎస్లో ఉన్న కావ్య.. ఆ తర్వాత తండ్రితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరి అభ్యర్థి అయ్యారు. పార్టీ ఫిరాయింపులతో పాటు వీటన్నింటిపై ప్రతిపక్షాలు విమర్శనా్రస్తాలు సంధిస్తున్నాయి.అరూరి రమేశ్ (బీజేపీ)మోదీ చరిష్మా.. పాలకుల వైఫల్యాలే కలిసి వస్తాయంటూ.. 2014, 2018 ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ సాధించిన అరూరి రమేష్.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అదే సెగ్మెంట్ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరిన ఆయనకు ప్రధాని నరేంద్రమోదీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారన్న సానుభూతికితోడు జాతీయస్థాయిలో మోదీ అనుకూల పవనాలు తనకు కలిసివస్తాయని భావిస్తున్నారు. గతంలో వరంగల్(హనుమకొండ)లో ఒకసారి బీజేపీ అభ్యర్థి ఎంపీగా గెలిచారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రాబోతుందన్న ప్రచారం కూడా అనుకూలమే. మామునూరు ఎయిర్పోర్టు, టెక్స్టైల్ పార్కు, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, మెట్రోరైలు సహా అనేక పథకాలకు మోక్షం కలుగుతుందని చెబుతున్నారు. బీజేపీ శ్రేణులు అరూరి రమేష్ గెలుపులో ఏమేరకు పాలు పంచుకుంటారన్న చర్చ ఓ వైపు జరుగుతుండగా.. ప్రధాని మోదీ వరంగల్ పర్యటన విజయవంతం, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ప్రచారంతో పాటు ప్రజలతో తనకున్న సంబంధాలతో గెలుస్తానని చెబుతున్నారు.సుదీర్కుమార్ (బీఆర్ఎస్)కేసీఆర్ చేసిన అభివృద్ధే గెలిపిస్తుందన్న ఆశ తెలంగాణరాష్ట్ర సమితి ఏర్పాటు నుంచి ఆ పార్టీలో పనిచేస్తున్న డాక్టర్ మారెపెల్లి సు«దీర్కుమార్ మొదటిసారి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ ఆవిర్భావం నుంచి ఎంపీటీసీగా, ఎంపీపీగా, జెడ్పీ వైస్ చైర్మన్, హనుమకొండ జెడ్పీ చైర్మన్ వరకు అనేక పదవులు చేపట్టారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఓరుగల్లుకు చెందిన పలువురు బీఆర్ఎస్ ముఖ్యనేతలు పార్టీ మారారు. ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్లో చేరగా, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ బీజేపీలో చేరి ఎంపీ అభ్యర్థి కాగా, మేయర్ గుండు సు«ధారాణి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవిందర్రావు తదితరులు సైతం బీఆర్ఎస్ను వీడారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ విప్ దాస్యం వినయ్భాస్కర్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, డా.టి.రాజయ్యలతో పాటు పలువురు పనిచేస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు, తొలి సీఎంగా కేసీఆర్ ఈ రాష్ట్రానికి చేసిన మేలును చూసి ప్రజలు గెలిపిస్తారన్న ధీమాలో బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్కుమార్ ఉన్నారు. ముగ్గురిదీ బీఆర్ఎస్ బ్యాక్గ్రౌండే.. అందరూ మొదటిసారే వరంగల్ నుంచి పోటీ చేసేందుకు అన్ని పార్టీలకన్నా ముందు బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కావ్యను ప్రకటించింది. తర్వాత ఆమె హస్తం గూటికి చేరడంతో జరిగిన పరిణామాలతో బీఆర్ఎస్కు అభ్యరి ఎంపిక కత్తిమీద సాములా మారింది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ తొలుత తాను బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపి.. ఆ తర్వాత బీజేపీలో చేరి బరిలో నిలిచారు. కాంగ్రెస్లో చేరిన కావ్యకు పోటీచేసే అవకాశం దక్కడంతో ఇక బీఆర్ఎస్ నుంచి హనుమకొండ జెడ్పీ చైర్మన్ డాక్టర్ ఎం.సు«దీర్కుమార్ను పోటీలోకి దింపారు. కాగా డాక్టర్ మారేపల్లి సు«దీర్కుమార్ ఆయుర్వేద వైద్యుడు కాగా, కడియం కావ్య సైతం వైద్యురాలే. బీఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ ముగ్గురు కూడా ఎంపీ ఎన్నికల బరిలో నిలవడం మొదటిసారి. ప్రభావితం చూపే అంశాలు » ఎంపీ సెగ్మెంట్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ. వారి మొగ్గు ఎటువైపు ఉంటుందో.. » దళితుల ఓట్లూ కీలకమే» నగర ఓటర్లు, విద్యావంతులూ ఎక్కువే» బలమైన తెలంగాణవాదం2019 లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఇలా..» పసునూరి దయాకర్ (టీఆర్ఎస్) 6,12,498 » దొమ్మాటి సాంబయ్య (కాంగ్రెస్) 2,62,200 » చింతా సాంబమూర్తి (బీజేపీ) 83,777 -
పదేళ్లు పీఎంగా చేసినాఓట్లకు రాముడే దిక్కా?
సాక్షి, హైదరాబాద్: పదేళ్లు ప్రధానిగా పనిచేసిన నరేంద్ర మోదీకి ఈసారి ఎన్నికల్లో చెప్పుకునేందుకు ఏమీ లేక రాముడే దిక్కయ్యాడని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. ఈసారి మోదీ గెలిస్తే దేశంలో ఇకఎన్నికలు ఉండవని, చైనా, రష్యా తరహాలో నియంతృత్వ రాజరిక పాలన వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్లో మరో 20 ఏళ్ల వరకు కాంగ్రెస్ కోలుకునే పరిస్థితి లేదని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఏపీలో ఒక్కసీటు కూడా రాదన్నారు. అందరి ఆమోదంతోనే సీఎంగా రేవంత్రెడ్డి కొనసాగుతున్నారని, ఈ ఐదేళ్లే గాక మరో ఐదేళ్లు కూడా రేవంత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పారు. హైదరాబాద్ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే...ప్రధానిగా ఉండి ఒక మతాన్ని టార్గెట్ చేస్తారా? దేశ జనాభాలో 25 కోట్ల మంది ఉన్న ముస్లిం జనాభాను ప్రధాని మోదీ టార్గెట్ చేశారు. ఈ ఎన్నికల్లో మోదీకి చెప్పుకునేందుకు ఏమీలేదు. అందుకే మతాన్ని, రామున్ని ముందుకు తెచ్చారు. మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని భయపెడుతున్నారు. బీజేపీ ఓట్ల కోసం మతాల వారీగా జనాభాను విభజించి ఈ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోంది. అక్కడ కాంగ్రెస్ నాశమవుతుందని తెలిసినాతెలంగాణ ఇస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నాశనమ వుతుందని తెలిసి కూడా ప్రజలకిచ్చిన మాట ప్రకా రం సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు. అను కున్నట్టే ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకు పోయింది. 20 ఏళ్ల వరకు అక్కడ కాంగ్రెస్ కోలుకోదు. 2014, 2019లో ఒక్కసీటు రాలేదు. ఈ సారి కూడా ఒక్కసీటూ అక్కడ కాంగ్రెస్ గెలవదు.నేను సీఎం పదవి అడగలేదునేను సీఎం పదవి అడగలేదు. నన్ను ఎమ్మెల్యేల క్యాంపులో ఉండమంటే మూడు రోజులు రూం నుంచి కూడా బయటకు రాలేదు. సీఎం రేవంత్.. ఉత్తమ్కుమార్ రెడ్డి వంటి సీనియర్లతో పాటు అందరి అభిప్రాయాలను గౌరవిస్తున్నారు. అందరం కలిసి అధ్వానంగా మారిన రాష్ట్రాన్ని బాగు చేసే పనిలో ఉన్నాం. ఈ ఎన్నికల్లో 15 సీట్లు మా టార్గెట్. 14 సీట్లు అయినా గెలుచుకుంటాం.జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ ఉండదుజూన్ 4 తరువాత తెలంగాణ భవన్ మూతపడు తుంది. జూన్ 5న 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజ కవర్గ పునర్విభజనలో రాష్ట్రంలో 154 సీట్లు ఉండబోతున్నాయి. అందులో 125 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది. ఆగస్టు 15 నాటికి రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం. -
ఇక్కడ బీజేపీకి డబుల్ డిజిట్ పక్కా
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ సీట్లు సాధించడం ఖాయమని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందనే సీఎం రేవంత్రెడ్డి, ఇతర విపక్షాల వ్యతిరేక ప్రచారాన్ని ప్రజలు నమ్మక పోవడంతో అది తమకు అనుకూలంగా మారిందని వ్యాఖ్యానించారు. బీజేపీని ఇరుకున పెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ చేసిన ‘రిజర్వేషన్’ ప్రచారం విఫలమైందన్నారు. ఆ ఫలాల లబ్ధిదారులే బీజేపీపై విశ్వాసంతో మద్దతు పలుకుతున్నారని ఆయన చెప్పారు. దీంతో రేవంత్రెడ్డిలో అభద్రతాభావం, అసహనం పెరగగా, కాంగ్రెస్ పార్టీలో మరింత కలవరం పెరిగిందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని డబ్బులు పంచినా.. ప్రజలు ఓట్లు మాత్రం బీజేపీకే వేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రైతు భరోసాను కేంద్ర ఎన్నికల సంఘం ఆపితే బీజేపీ నిలిపేసిందని రేవంత్రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు వస్తాయని ముందే తెలిసి నా.. రైతుభరోసా ఎందుకివ్వలేదో రేవంత్రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్ధాల ప్రచారంలో కల్వకుంట్ల కుటుంబానికి, రేవంత్కు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చునని ఎద్దేవాచేశారు.ఆర్ఆర్ టాక్స్ వసూళ్లు తప్ప రేవంత్కేమీ తెలియదు‘రేవంత్రెడ్డి బాధ్యతారహిత విమర్శలు చేస్తున్నారు. బూతులు మాట్లాడటం, కోతలు కోయడం తప్ప హామీల అమలు చేతల్లో చూపించే సోయి లేదు. ఆర్ఆర్ టాక్స్ వసూలు చేయడం తప్ప వేరే విషయం తెలియదు. రీసెర్చ్ టీం పెట్టుకుని.. ఏ తిట్లు తిట్టాలి, ఏ వీడియో ఫేక్ చేయాలనే దానిపై ఆలోచన చేస్తున్నారు. కేంద్రంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.’ అని కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. ‘‘కేంద్రంతో బీఆర్ఎస్ ఘర్షణ పడ్డందుకే తెలంగాణకు అన్యాయం జరిగిందని గతంలో రేవంత్ అన్నారు... కేంద్రంతో సఖ్యతతో ఉంటా అని చెప్పి ఇప్పుడు గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నారు. ఎన్నికలు రాగానే ఏం రోగం పుట్టిందో.. స్వార్థం కోసం తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు’ అని తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పదేళ్లలో కేంద్రం చేసిన దానిపై సీఎం రేవంత్రెడ్డితో ఎన్నికల తరవాత కూడా తాను చర్చకు సిద్ధమని చెప్పారు. ‘ఎక్కడ ప్రచారా నికి వెళ్ళినా ఆ అభ్యర్థిని కేంద్ర మంత్రి చేస్తా అని సీఎం అంటున్నారు... పోర్ట్ఫోలియోలు కూడా ఇస్తున్నారు. అసలు కాంగ్రెస్ ఎన్ని సీట్లలో పోటీ చేస్తోంది... ప్రధాని ఎవరు ?’ అని ఎద్దేవా చేశారు.కేసీఆర్ తప్పిదాలతో తెలంగాణకు నష్టం‘మాజీ సీఎం కేసీఆర్ తప్పు వల్లనే కృష్ణా జలాల్లో తెలంగాణ నష్టం పోయింది. కేటీఆర్ చిల్లర గాని లెక్క మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రిగా తెలంగాణకు కేంద్రం ఎంత ఇచ్చిందో చర్చకు నేను సిద్ధం. హైదరాబాద్ డబ్బులు అదిలాబాద్లో ఖర్చు పెట్టొద్దా? అలాంటి వారికి ఏమి చెపుతాము’ అని వ్యాఖ్యానించారు. ‘కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. భువనగిరి కోట అభివృద్ధికి కేంద్రం ఏం చేసిందో టూరిజం శాఖను అడిగి తెలుసుకో లేదంటే మంత్రి జూపల్లి కృష్ణారావును అడిగి తెలుసుకోవాలి.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారి మాటలకు నేను సమాధానం చెప్పను. మా పార్టీ అధికారప్రతినిధులు మాట్లాడుతారు’ అని విలేకరుల ప్రశ్నలకు కిషన్రెడ్డి బదులిచ్చారు. ’’రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు శామ్ పిట్రోడావి జాత్యంహకార వ్యాఖ్యలు. దేశ ప్రజల పట్ల కాంగ్రెస్ దురహంకార వైఖరికి ఈ వ్యాఖ్యలు అద్దం పడతాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ప్రత్యేక పోలింగ్ కేంద్రాలిక్కడే..
వేసవిలోనూ నిరంతరం మంచినీటి సరఫరా
‘రిజర్వేషన్ల వ్యతిరేక బీజేపీని ఓడించాలి’
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీకి విద్యార్థుల ఎంపిక
ఐటీఐలో కొత్త కొర్సులు
ఎట్టకేలకు వీడిన ఉత్కంఠ
అంగన్వాడీల రిటైర్మెంట్..!
● నేటి సాయంత్రం 4గంటల వరకే అనుమతి ● బంద్ కానున్న ఎన్నికల ప్రచార మోత
ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement