breaking news
YS Jagan Mohan Reddy
-
పులివెందులలో YS జగన్ ప్రజా దర్బార్
-
కల్తీ పాల మరణాలపై YS జగన్ రియాక్షన్
-
రేపటి నుంచి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. రేపటి(మంగళవారం) నుంచి పులివెందులలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు పులివెందులలోనే ఉండి ప్రజదర్బార్ సహా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ రేపు(మంగళవారం) పులివెందుల చేరుకున్నారు. ఈ క్రమంలో పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్భార్లో పాల్గొంటారు. అలాగే, ఎల్లుండి(బుధవారం) వేంపల్లి మండలం నందిపల్లికి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. నందిపల్లిలో నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో ఆయన పాల్గొంటారు. అనంతరం, మధ్యాహ్నం పులివెందుల క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్కు వైఎస్ జగన్ హాజరు అవతారు. -
కల్తీ పాల ఘటన.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి నలుగురు మృతి చెందిన ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్..‘ కల్తీ పాలు తాగి ఇప్పటికే నలుగురు మృతి చెందడం, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురి కావడం విచారకరం. ఆహార భద్రతపై నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకే ముప్పు ఏర్పడిండి. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి అత్యుత్తమ వైద్యసేవలు అందేలా చూడాలని, వారి ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. వైద్య ఆరోగ్యశాఖ ఈ ఘటనపై తక్షణమే దృష్టి సారించి, బాధితులకు సమగ్ర వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే నిపుణుల బృందాలను నియమించాలని సూచించారు. అలాగే, మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
జగన్ వర్సెస్ డర్టీ డజన్!
ఒక లక్ష్యం, దాన్ని సాధించడానికి అనుసరించే మార్గం... ఈ రెంటినీ చెట్టూ, విత్తుతో పోల్చారు మహాత్మాగాంధీ. మంచి విత్తు నాటితే ఆరోగ్యకరమైన చెట్టు ఎదుగుతుంది. విషపూరిత విత్తనం నాటితే ఆ చెట్టూ విషపు కాతే కాస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీ ప్రధాన లక్ష్యమైనా అధికార సాధనే కావచ్చు. దాన్ని సాధించే ప్రయత్నం కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే ఉండాలి. అడ్డదారిలో అధికారాన్ని అందుకునే ప్రయత్నాలను సహిస్తే కుక్క మూతి పిందెల పాలన చవిచూడవలసిన పరిస్థితి దాపురిస్తుంది. ఇప్పుడీ దౌర్భాగ్యానికి ఆంధ్రప్రదేశ్ కంటే పెద్ద ఉదాహరణ ఇంకేదీ లేదు!అప్పటివరకూ తాము బండబూతులు తిట్టిన రాజకీయపక్ష నేతల చరణకమలాలనే కళ్లకద్దుకొని అవకాశవాద కూటమిని ఏర్పాటు చేసుకున్న సంగతి ప్రజలందరికీ తెలిసిందే. అంతటితో ఆగలేదు. అమలు చేయడం సాధ్యం కాదని తెలిసికూడా మోస పూరిత హామీలతో ‘సూపర్సిక్స్’ మేనిఫెస్టో ప్రకటించడం, ప్రజలను నమ్మించడం కోసం వీధివీధినా, గడపగడపనా గారడీ విద్యలు ప్రదర్శించడం కూడా తెలిసిన విషయాలే. వీటికంటే ఇంకో అతి భయంకరమైన విషయం కూడా ఉన్నదనే ఆరోపణలు, సహేతుకమైన అనుమానాలు క్రమక్రమంగా వెలుగు చూస్తున్నాయి.ఓట్ల పండుగ నాటి నిశిరాత్రి చీకటిలో ప్రజాస్వామ్యంపై క్రూరమైన అత్యాచారం జరిగిందనడానికి తార్కికమైన ఆధారా లను ఎన్నికల సంఘం సమాచార స్రవంతిలో నుంచే విశ్లేషకులు వెలికి తీస్తున్నారు. పోలింగ్ రోజు ప్రకటించిన ఓట్ల శాతం కంటే ఆ తర్వాత అసాధారణంగా ఓట్ల శాతం పెరగడంలోని అసంగతత్వాన్ని ‘వోట్ ఫర్ డెమోక్రసీ’ (వీఎఫ్డీ) అనే స్వచ్ఛంద సంస్థ అప్పుడే ప్రశ్నించింది. ఈ ఓట్ల తేడా అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా 12.5 శాతంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉండటాన్ని గురించి కూడా ప్రశ్నించింది. అంతేకాదు, మరో స్వచ్ఛంద సంస్థ ‘అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్’ (ఏడీఆర్)తో కలిసి ఢిల్లీలో ఒక సెమినార్ను కూడా నిర్వహించి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది.‘ఓట్ చోరీ’ అనే పేరుతో అడపాదడపా ప్రతిపక్ష పాత్ర పోషించే రాహుల్ గాంధీ కూడా వీఎఫ్డీ సమాచారంతో ఒకటి రెండుసార్లు హడావిడి చేశారు. అయితే ఆయన ‘పోరాటం’ నుంచి ఏపీని మాత్రం మినహాయించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాహుల్ గాంధీకి బలమైన బంధం ఉన్న కారణంగానే ఆయన ఓట్ చోరీ ఉద్యమంలోంచి ఏపీని డిలీట్ చేసి ఉంటారనే బలమైన అభిప్రాయం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి బద్ధశత్రువైన బీజేపీ కూటమిలో భాగస్వామిగా కొనసాగుతూనే కాంగ్రెస్ అధినేతతో చుట్టరికం కొనసాగిస్తూ అవకాశవాదాన్ని కొత్త శిఖరాలకు చేర్చిన వ్యక్తి చంద్రబాబు.వీఎఫ్డీ వెలికి తీసిన పోలింగ్ నాటి విడ్డూరాలపై ప్రముఖ రాజకీయ–ఆర్థిక వ్యవహారాల నిపుణుడు పరకాల ప్రభాకర్ మరింత లోతైన అధ్యయనం చేశారు. ఆయన పరిశీలనలో వెల్లడైన దిగ్భ్రాంతికరమైన అంశాలతో ‘ది వైర్’ అనే స్వతంత్ర వెబ్సైట్కు ఒక వ్యాసం రాశారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ వ్యాసాన్ని బలపరిచే విధంగా ప్రఖ్యాత జర్నలిస్ట్ కరణ్ థాపర్ అదే వెబ్సైట్ కోసం పరకాల ప్రభాకర్ను ఇంటర్వ్యూ చేశారు. తాను ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటనల్లోంచి తీసుకున్న సమాచారం ఆధారంగానే ఆనాటి ఎన్నికల విజయం సందేహాస్పదమైనదనే నిర్ధారణకు వచ్చినట్లు ప్రభాకర్ చెప్పారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ ఎన్నికల సంఘా నికి లేఖ రాసినప్పటికీ అక్కడ నుంచి ఎటువంటి స్పందనా కనిపించలేదని ఆయన వెల్లడించారు.పరకాల ప్రభాకర్ విశ్లేషించిన విషయాలు ఇలా ఉన్నాయి. 2024 మే 13వ తేదీన ఏపీలోని 25 లోక్సభ స్థానాలకు, 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పది గంటల వ్యవధిలో 68.04 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. 6 గంటలకు పోలింగ్ గడువు ముగిసింది. ఈ లోపల అంటే 5 గంటల 59 నిమిషాలు, అంతకంటే ముందే పోలింగ్ కేంద్రం ప్రాంగణంలో క్యూలైన్లో నిలబడిన వారికి స్లిప్పులు ఇచ్చి ఓటు ఓసే అవకాశాన్ని కల్పిస్తారు. రాత్రి 8 గంటల వరకు 68.12 శాతానికి పోలింగ్ పెరిగిందని ఈసీ ప్రకటించింది. ఇది 0.08 శాతం పెరుగుదల! ఓట్ల సంఖ్యలో చూస్తే 33,064 ఓట్లు. సాధారణంగా రాత్రి 8 గంటల తర్వాత ప్రకటించిన ఓట్ల శాతం దాదాపుగా ఫైనల్గా ఉంటుంది. మహా అయితే ఒకటీ, అర శాతం ఓట్ల పెరుగుదలతో మరుసటి రోజు ప్రకటించేవాళ్లు. కానీ, ఐదూ, ఎనిమిది గంటల మధ్య మహా మందకొడిగా అతి స్వల్పంగా ఓట్లు నమోదైనప్పటికీ ఇంకా పోలింగ్ కొనసాగుతున్నదని ఈసీ ప్రకటించింది.రాత్రి 11.45 నిమిషాల వరకు ఓట్ల శాతం 76.50 శాతానికి పెరిగినట్టు చెప్పారు. అంటే, 8.38 శాతం. 34,63,767 ఓట్లు. ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూలైన్లో ఉన్నప్పుడు 8 గంటల లోపల ఓట్లు వేయకుండా ఏ ముహూర్తం కోసం ఎదురుచూసి ఒకేసారి ఎగబడ్డారో ఎన్నికల సంఘం వివరించలేదు. ఇంకా విడ్డూరమేమిటంటే ఆ తర్వాత కూడా 3,500 పోలింగ్ బూతుల్లో ఓటర్లు బారులు తీరి ఉన్నారట! ఒక్కో నియోజక వర్గానికి 20 బూత్ల చొప్పున లెక్క వేసుకొని ఓటర్లు బారులుతీరి నిలబడ్డారనుకోవాలి. ఈ బూత్లలో చివరి ఓటు 2 గంటలకు రికార్డయిందట! రెండు గంటల 15 నిమిషాల వ్యవధిలో 17,19,482 మంది ఓటేశారట! ఈ ఓటర్లందరూ సాయంత్రం 6 గంటలలోపే పోలింగ్ కేంద్రంలోకి వచ్చి ఉండాలి. ఆ తర్వాత అనుమతించరు కనుక!ఆ లెక్కన చివరి ఓటర్లు ఒకపూట ఉపవాసాన్ని పాటిస్తూ లఘుశంక కూడా తీర్చుకోకుండా 8 గంటలపాటు నడిరాత్రివేళ నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరి వీరి వివరాలనూ, ఫొటోలనూ విడుదల చేసి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని రగిలించేందుకు ఎన్నికల సంఘం ఎందుకు ప్రయత్నించలేదో తెలియదు. చివరి రెండు గంటల పదిహేను నిమిషాల పాటు పోలింగ్ జరిగిన 3500 పోలింగ్ బూత్లలో సగటున 491 ఓట్లు పోలయ్యాయి. మొత్తం అన్ని బూత్లలో చూసుకుంటే సగటున 892 ఓట్లు పడ్డాయి. ఈ బూత్లలో నాలుగు వందల మంది ఓటర్లు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11.45 నిమిషాల మధ్యన ఓటు హక్కు వినియోగించుకుని 16 గంటల 45 నిమిషాల వ్యవధిలో ఓట్లు వేస్తే, 491 మంది మాత్రం నడిరేయి దాటిన తర్వాత రెండు గంటల పదిహేను నిమిషాల్లోనే ఓటేశారు. ఈ గారడీ లెక్కల్ని చూసిన తర్వాత కూడా ఎన్నికలు సక్రమంగానే జరిగాయని విశ్వసిద్దామా?సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పది రోజుల్లోనే వీవీ ప్యాట్లను ఎందుకు ధ్వంసం చేసినట్టు? ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటలదాకా, 11.45 వరకు, కొన్నిచోట్ల రాత్రి 2 గంటల వరకూ పని చేసినా కూడా వోటింగ్ మిషన్ల బ్యాటరీ కౌంటింగ్ రోజున 90 నుంచి 99 శాతంగా ఎందుకు మిగిలినట్టు? ఈ సందేహాలపై స్పందించకుండా ఎన్నికల సంఘం ఎందుకు మడి కట్టుకున్నట్టు? భారత ప్రజాస్వామ్యానికి అతి ప్రమాదకర మైన మంత్రాంగం ఏదో ఆనాటి అర్ధరాత్రి ప్రధానంగా ఏపీలోనే కేంద్రీకృతమై నడిచిందనడానికి ఇవన్నీ ఆధారాలు.ఈ మంత్రాంగానికి సూత్రధారులు, పాత్రధారులు ఎవరై నప్పటికీ లబ్ధిదారులు మాత్రం ఏపీ కూటమి పార్టీలే! ఆ విషయం కూటమి నేతలకు స్పష్టంగా తెలుసు. ఆ రోజు రాత్రి 8 గంటల తర్వాత పోలైన 51,83,249 ఓట్లను 175 నియోజక వర్గాల నడుమ సమానంగా విభజిస్తే ఒక్కో సీటుకు 29,618 ఓట్లవుతాయి. ఇంతకంటే తక్కువ ఓట్ల తేడాతో వైసీపీ దాదాపు 80 సీట్లను కోల్పోయింది. వీటికి తోడు గెలిచిన సీట్లు 11. అన్ని నియోజక వర్గాల్లో ఇలా సమాన విభజన జరిగి ఉండకపోవచ్చు. అగ్ర నాయకులకు భారీ మెజారిటీల కోసం కొన్నిచోట్ల ఎక్కువ ఓట్లు, బాగా నమ్మకమున్న సీట్లలో తక్కువ ఓట్లు పడి ఉండ వచ్చు. సీట్లు తక్కువైనా సరే, స్ట్రయిక్ రేట్ ఎక్కువ వుండా లనుకున్న సీట్లను కూడా దృష్టిలో పెట్టుకొని ఉండవచ్చు. మొత్తంగా ఈ గణాంకాలు చెప్పేదేమిటంటే కూటమి నేతలు ప్రచారం చేసుకుంటున్నట్టుగా వారికి ప్రజలు చరిత్రాత్మకమైన విజయాన్ని కట్టబెట్టలేదనీ, వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా తిరస్కరించలేదనీ! సందేహాలు నివృత్తి చేసే బాధ్యత నుంచి ఎన్నికల సంఘం తప్పించుకోవడం అనుమానాలకు మరింత ఆజ్యం పోస్తున్నది.తాము ఓటమిని రుద్దినప్పటికీ జనంలో జగన్ మోహన్రెడ్డి బలంగానే ఉంటాడన్న అంచనాతోనే అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే కూటమి సర్కార్ ఒక త్రిముఖ వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఇందులో పాయింట్ నెంబర్ వన్ – జగన్ మోహన్రెడ్డి వ్యక్తిత్వ హననం. ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే ఆటోమేటిక్గా పార్టీ బలహీనపడుతుందని ఈ వ్యూహం. ఆయన పార్టీ పెట్టిన తొలిరోజు నుంచి గడచిన పదిహేనేళ్లుగా దీన్ని అమలు చేస్తూనే ఉన్నారు. రెండో అంశం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు. దీని ద్వారా పార్టీ నాయకత్వం, కార్యకర్తల నైతికబలాన్ని దెబ్బతీసే ప్రణాళిక. ఈ ఇరవై మాసాల్లో రెండు డజన్ల మంది పార్టీ అభిమానులు రాజకీయ హత్యలకు గురయ్యారు. కీలక నాయ కులతో సహా అనేక డజన్ల మంది జైళ్లకు వెళ్లారు. అనేకమంది పోలీసుల టార్చర్కు గురయ్యారు. వందలాది మంది అక్రమ కేసులను ఎదుర్కొంటున్నారు. ‘సాక్షి’ మీడియా సైతం నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నది.ఇక మూడో అస్త్రం – మతాన్నీ, దేవుడినీ రాజకీయ అవస రాలకు వాడుకొని మెజారిటీ ఓటర్లను జగన్కు దూరం చేయాలనే దిక్కుమాలిన ఎత్తుగడ. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలకు సరఫరా చేస్తూ అక్కడి నాణ్యతా పరీక్షలో విఫలమై వెనక్కు వెళ్లిన నెయ్యి ట్యాంకర్లను మళ్లీ రప్పించి వాటి శాంపిళ్ల ఆధారంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ నెయ్యి వాడారని చేసిన అతి తెలివి ప్రచారం నెమ్మదిగా జనానికి అర్థమైంది. టీటీడీకి స్వయంగా నాణ్యతను పరీక్షించే యంత్రాంగం ఉన్నదనే సంగతి తెలిసినా, ఆ పరీక్షలో నెగ్గితేనే ట్యాంకర్లను అనుమతిస్తారని తెలిసినా రాజకీయ ప్రయోజనం కోసం పవిత్రమైన తిరుమల లడ్డూను వివాదా స్పదం చేశారు. మరీ దారుణంగా పంది కొవ్వు కలిసిందనే నీతిబాహ్య ప్రచారానికి పాల్పడ్డారు. వ్యూహం బెడిసికొట్టింది. బాణం ఎదురు తిరిగి ముఖ్యమంత్రి ‘హెరిటేజ్’ కాంపౌండ్లోకే వెళ్లింది. ఇంకేయే విషయాలు బయటపడతాయో చూడాలి. దైవదూషణ ఫలితం మామూలుగా ఉండదు కదా! ముంబైలో కూడా ఏవో ‘హెరిటేజ్’ పేలుళ్లు వినబడుతున్నాయి.జగన్ మీద ఈ త్రిముఖ వ్యూహ దుష్ప్రచారంలో మూడు కూటమి పార్టీలు, ఒక పెంపుడు కాంగ్రెస్, నాలుగు ఛానెళ్లు,రెండు పత్రికలు, ఒక పెయిడ్ సోషల్ మీడియా, ఒక పేటీఎమ్ విశ్లేషణ బృందం చురుగ్గా పాల్గొంటున్నాయి. ఈ పన్నెండు శక్తుల దాడులను జగన్మోహన్ రెడ్డి నిబ్బరంగా ఎదుర్కొంటున్న తీరు వైసీపీలో నూతనోత్తేజాన్ని నింపుతున్నది. రెండు గంటలైనా సరే, అంతకంటే ఎక్కువైనా సరే! ఎక్కడా అలసట లేకుండా తొట్రుపడకుండా డాక్యుమెంటరీ సాక్ష్యాలతో కూటమి కుట్రలను ఆయన తుత్తునియలు చేయగలుగుతున్నారు. మొన్న ఒక్కరోజే త్రిముఖ వ్యూహపు పన్నాగాలతో పాటు బడ్జెట్ డొల్లతనాన్ని, మేనిఫెస్టో మోసాన్ని ఆయన ఎండగట్టారు. ఈమధ్య లడ్డూ బాణం ఎదురు తిరిగిన తర్వాత యావత్తు మంత్రిమండలి కొలువు తీరి ఏర్పాటుచేసిన మీడియా సమా వేశంలో కనిపించిన విషణ్ణవదనాలను, ఆత్మవిశ్వాసంతో కూడిన జగన్ ప్రెస్మీట్లతో జనం పోల్చి చూస్తున్నారు. ఈ పోలిక చాలు... రాష్ట్ర రాజకీయాలు ఏ దిశలో పరుగు తీస్తున్నాయో తెలుసుకోవడానికి!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
వెరీ షేమ్.. కాంగ్రెస్ నేతలపై జగన్ ఫైర్
-
Bengaluru: నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్
-
నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీస్సులు
సాక్షి, బెంగళూరు: ఏపీఐఐసీ మాజీ ఛైర్మన్, వైఎస్సార్సీపీ నేత శ్రీఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం (రాజమహేంద్రవరం) కుమారుడి వివాహ వేడుకకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. బెంగళూరులోని ది లీలా భారతీయ సిటీ(తిరుమేనహళ్ళి)లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు నాగ ఉమా యజ్ఙిత, యశ్వంత్లను వైఎస్ జగన్ ఆశీర్వదించారు. -
ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ వ్యవహార శైలి.. వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ఏఐ సమ్మిట్లో నిన్న(శుక్రవారం, ఫిబ్రవరి 20) యూత్ కాంగ్రెస్ వ్యవహార శైలిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తల తీరు మనందరినీ సిగ్గుపడేలా చేసిందంటూ ట్వీట్ చేశారు. ‘‘అసలు మన రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి?. ఎవరూ మన దేశాన్ని ఎప్పుడూ కించపరచకూడదు. మన మధ్య రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నా.. ప్రపంచం ముందు అందరం ఐక్యంగా ఉండాలి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.కాగా, ఇండియా కృత్రిమ మేధ(ఏఐ) ఇంపాక్ట్ సదస్సులో ఎగ్జిబిషన్ హాల్ నంబర్–5 వద్ద యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలపడం కలకలం సృష్టించింది. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పదుల సంఖ్యలో కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. హఠాత్తుగా టీ–షర్టులు విప్పేసి తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు. భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఆయా టీ–షర్టులపై ముద్రించి ఉన్నాయి.Yesterday at the AI Summit, the Youth Congress made us all feel ashamed. Where is our politics heading! No one should ever demean our country. Whatever our political differences may be, we should always present a united face to the world.— YS Jagan Mohan Reddy (@ysjagan) February 21, 2026అంతేకాకుండా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫొటోలు కూడా ఉన్నాయి. ‘ఎప్స్టీన్స్ ఫైల్స్’, ‘మోదీ రాజీపడ్డారు’అనే వాక్యాలు కూడా ముద్రించారు. నిరసన తెలియజేస్తున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను సదస్సుకు హాజరైన కొందరు ప్రతినిధులు ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. -
మేకపాటి గౌతమ్ని స్మరించుకున్న వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వర్థంతి నేడు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. తన మిత్రుడు మేకపాటి గౌతమ్ని స్మరించుకున్నారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘మన స్నేహం, ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఒక స్నేహితుడిగా, సోదరుడిగా గుర్తుండిపోతారు’ అంటూ పోస్టు చేశారు. I will always cherish the fond memories of our friendship and camaraderie, dear Goutham. A friend and brother, you will always be remembered. pic.twitter.com/7IQQejf8gS— YS Jagan Mohan Reddy (@ysjagan) February 21, 2026 -
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం.. వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. మన మాతృభాష తెలుగును కాపాడుకుందాం.. మన సంస్కృతిని భావి తరాలకు అందిద్దాం’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు.మన మాతృభాష తెలుగును కాపాడుకుందాం.. మన సంస్కృతిని భావి తరాలకు అందిద్దాం.— YS Jagan Mohan Reddy (@ysjagan) February 21, 2026 -
Vijayawada : జగన్ని కలిసిన బ్రహ్మానందం
-
నన్ను రాత్రి 2 గంటలకు నిద్రలేపి ఇద్దరు కానిస్టేబుల్ లు వచ్చి సంచలన నిజాలు బయటపెట్టిన అంబటి
-
జగనన్న బయట అడుగుపెడితే .. అనితకు చెంపచెళ్లుమనిపించిన వరుదు కళ్యాణి
-
వైఎస్ జగన్ను కలిసిన ప్రముఖ నటుడు బ్రహ్మానందం
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కలిశారు. గన్నవరం విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం బ్రహ్మానందాన్ని వైఎస్ జగన్ ఆత్మీయంగా పలకరించారు. కొంత సమయం పాటు సరదాగా మాట్లాడుకున్న వారిద్దరూ కలిసి ఫోటో దిగారు. View this post on Instagram A post shared by Ysrcpchief (@ysrcpchief) -
జగన్ ను కలిసిన అంబటి రాంబాబు
-
పబ్లిసిటీ పీక్.. పెర్ఫామెన్స్ వీక్.. ఏపీ బడ్జెట్ పై YS జగన్ రియాక్షన్
-
వైఎస్ జగన్ను కలిసిన అంబటి రాంబాబు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ మంత్రి అంబటి రాంబాబు కలిశారు. తాడేపల్లిలోని నివాసంలో వైఎస్ జగన్ను కలిసి అంబటి మాట్లాడారు. అయితే, అక్రమ కేసులో అరెస్ట్ అయిన అంబటి రాంబాబు.. గురువారం బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు.. తనపై టీడీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, టీడీపీ రౌడీ మూకలు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరు, హత్యాయత్నం, పోలీసుల నిర్లిప్త వైఖరి, కొంతమంది పోలీసు అధికారుల ఓవర్ యాక్షన్ వంటి అంశాలను వైఎస్ జగన్కు వివరించారు. ఈ క్రమంలో తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసు అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజల పక్షాన, ప్రజల తరపున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులు ధీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుద్దామని, పార్టీ నాయకులు, కేడర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ భేటీలో అంబటితో పాటు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఉన్నారు. -
TTD డిస్ క్వాలిఫై చేసిన ఇందాపూర్ కి.. 3 నెలల్లోనే అర్హత కల్పించిన చంద్రబాబు
-
చంద్రబాబుదే కల్తీ పాపం.. కల్తీ నెయ్యి సరఫరా జరిగింది, వినియోగించింది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
-
సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్
సూపర్ సిక్స్లో అతి ముఖ్యమైన హామీ.. 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తానన్నారు. దీనికి ఆడబిడ్డ నిధి అని పేరు పెట్టారు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను వంచించారు. 50 ఏళ్లకే పింఛన్ అంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మోసం చేశారు. ఇలా సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లలో మూడు ప్రధాన హామీలకు ఈ మూడు బడ్జెట్లలో అతీగతి లేదు. సున్నా బడ్జెట్. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా చూపిస్తూ చంద్రబాబు సూపర్ సిక్స్ సూపర్ హిట్.. అంటూ ఏ రకంగా సంబరాలు చేసుకోమని చెబుతాడు? మీరే చెప్పండి. ఇది ధర్మమేనా.. న్యాయమేనా? అలాగే స్త్రీ శక్తి అంటూ ఉచిత బస్సు పథకానికి పేరు పెట్టారు. అమ్మవారు పేరు పెట్టి మోసం చేయగలిగే వ్యక్తి ఈ ప్రంపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే.ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క పింఛన్ ఇవ్వలేదు. కొత్త వాటికి కనీసం దరఖాస్తులు తీసుకోవడం లేదు. ప్రభుత్వం వద్ద ఇప్పటికే 2.50 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అదే మా హయాంలో ఆర్నెల్లకోసారి ఏటా జూన్, డిసెంబర్లలో అర్హులను గుర్తించి కొత్త పింఛన్లు ఇచ్చేవాళ్లం. కానీ ఈరోజు పరిస్థితి రివర్స్ అయ్యింది. 2014లో చంద్ర బాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 39 లక్షల పింఛన్లు ఉంటే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి అంటే 2024 మార్చి నాటికి 66 లక్షల పింఛన్లకు పెంచగలిగాం. కానీ చంద్రబాబు వచ్చిన రెండేళ్లకే 66 లక్షల నుంచి 60 లక్షలకు ఆ సంఖ్య తగ్గిపోయింది.చంద్రబాబు ఉద్దేశ పూర్వకంగా వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. అన్నీ మానవ తప్పిదాలే (మ్యాన్మేడ్ బ్లండర్స్). ఆయన సృష్టించిన ఈ సంక్షోభం వల్ల ఒక పద్దతి ప్రకారం ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యమై పోయింది. ఈ క్రాప్ లేకుండా పోయింది. పద్దతి ప్రకారం దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు. ఉచిత పంటల బీమాను తీసేశారు. ఏ ఒక్క రైతుకూ గిట్టుబాటు ధర లేదు. మా హయాంలో కోవిడ్ సంక్షోభ సమయంలో కూడా రైతులను చేయిపట్టి నడిపించాం. ఈ క్రాప్ ద్వారా రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమాను అమలు చేశాం. ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోగా పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసేవాళ్లం. పైగా పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ అర్హుల జాబితాలను ఆర్బీకేలలో ప్రదర్శించే వాళ్లం. - వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : ‘అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డులు బద్దలు కొడుతున్న చంద్రబాబు ప్రజలకు ఏమైనా లబ్ధి చేకూరుస్తున్నారా అంటే ఏమీ లేదు. ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంతా మోసమే. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులే ఇందుకు నిదర్శనం. మరో వైపు చేస్తున్న అప్పులన్నీ దోచుకో.. పంచుకో.. తినుకో.. అన్నట్టుగా కాజేస్తున్నారే తప్ప ప్రజలకు ఎలాంటి మేలు చేయడం లేదు’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. మేనిఫెస్టో ద్వారా ఇచ్చిన హామీలు నీటి మీద రాతలు, మోసాలు కాకూడదన్నారు. మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలని చేసి చూపించామని చెప్పారు. కోవిడ్ లాంటి మహా సంక్షోభం ఉన్నప్పటికీ మనసా, వాచా, కర్మణా ఇచ్చిన హామీలు అమలు చేసి మేనిఫెస్టోకు ఒక పవిత్రతను తీసుకొచ్చామని తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.‘మేనిఫెస్టో అమలులో తొలిసారి సంస్కరణలు తీసుకొచ్చాం. ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చి ప్రజల దగ్గరకు గర్వంగా చిక్కటి చిరునవ్వుతో వెళ్లగలిగేలా చేశాం. కానీ చంద్రబాబు మేనిఫెస్టోకు ఇచ్చే విలువ ఏమిటో తెలుసా? గడిచిన రెండు బడ్జెట్లు, ఈ ఏడాది ప్రవేశ పెట్టిన మూడో బడ్జెట్లో కేటాయింపుల ద్వారా మేనిఫెస్టో అంటే తనకు ఎప్పటికీ ఒక చిత్తు కాగితమే అని రుజువు చేశాడు’ అని అన్నారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. బాండ్లు పంచి పెట్టి మరీ వంచించారు » నిజంగా ఎన్నికలకు ముందు ఈ పెద్దమనిషి ఇంటింటికి వెళ్లి తానిచ్చిన హామీల అమలు కోసం ఏకంగా బాండ్లు పంచిపెట్టాడు. ప్రతి ఇంటికి ఏ పథకం కింద ఎంత వస్తుందో లెక్కలు గట్టి మరీ చూపించి ఓట్లు వేయించుకున్నాడు. ఇప్పుడు ప్రతీ కుటుంబాన్ని మోసగిస్తున్నాడు. సూపర్ 6.. సూపర్ 7 హామీలతో పాటు మేనిఫెస్టోలో వాళ్లిచ్చిన హామీలను వాళ్ల కరపత్రికలో ఏ విధంగా ప్రకటనలు ఇచ్చుకున్నారో మీరే చూడండి. ఈ మాఫియా ముఠా అంతా కలిసి ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో చెప్పడానికి ఈ ప్రకటనలే నిదర్శనం. » ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, యువగళం పేరిట ప్రతి నెలా ప్రతి నిరుద్యోగికి రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి, ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేల ఆరి్థక సాయం. ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు, పాఠశాలకు వెళేŠాల్ల పిల్లలున్న తల్లులకు.. ఎంత మంది పిల్లలుంటే అంతమందికి ప్రతీ పిల్లాడికి రూ.15 వేలు, ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించేందుకు ఉచిత బస్సు ప్రయాణం.. ఇలా తానిచ్చిన హామీలకు సంబంధించి ప్రతి ఇంటికి వెళ్లి బాండ్లు ఇచ్చారు. (వీడియో ప్రదర్శించి చూపారు). నిత్య మోసగాడు.. నిత్య వంచకుడు » సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను కరపత్రాల రూపంలో పంచి పెట్టడమే కాదు.. తమ భజన పత్రికల్లో ప్రకటనల ద్వారా ప్రచారం చేసుకున్నారు. ఈ పథకాలకు ఈ మూడు బడ్జెట్లలో ఏ మేరకు నిధులు కేటాయించారు.. ఏ మేరకు ఖర్చు చేశారో చెప్పమని చంద్రబాబును అడుగుతున్నా. యువగళం పేరిట ప్రతి నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ.3 వేల చొప్పున ఇస్తానన్న నిరుద్యోగ భృతి కోసం ఈ మూడు బడ్జెట్లలో కించిత్ ప్రస్తావన ఎక్కడైనా ఉందా? » నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు ఇవ్వాలి. ఇందుకు ఈ మూడేళ్లలో బడ్జెట్లో రూ.21,600 కోట్లు కేటాయించాలి. కానీ తొలి రెండు బడ్జెట్లలో కేటాయించింది సున్నా.. ఈ మూడో బడ్జెట్లో ఇచ్చిందీ సున్నా. ఏడాదికి రూ.36 వేలు చొప్పున ఈ మూడేళ్లలో రూ.1.08 లక్షల చొప్పున ప్రతీ నిరుద్యోగికి బాకీ పడ్డాడు. నిరుద్యోగ భృతి అంటూ హామీ ఇవ్వడం, చెత్త బుట్టలో వేయడం ఇదేమీ తొలిసారి కాదు.. 1999, 2014 ఎన్నికల మేనిఫెస్టోలలో కూడా కన్పిస్తుంది. ఇలా ప్రతిసారి ప్రతి ఎన్నికల్లో ఈ హామీతో ఓట్లు వేయించుకోవడం, నిస్సిగ్గుగా ఎగ్గొట్టడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. అందుకే యువత పట్ల చంద్రబాబు నిత్య మోసగాడు, నిత్య వంచకుడు. బాండ్లపై ఇదీ వాళ్ల ప్రతిజ్ఞ ఇంటింటికీ పంపిణీ చేసిన బాండ్లపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫొటోలు, సంతకాలు, పైగా ప్రతిజ్ఞ.. ఏమని చేశారో తెలుసా? (మాజీ మంత్రి కురసాల కన్నబాబు చదివి విన్పించారు)బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారంటీ.. ‘చంద్రబాబు అనే నేను.. రాష్ట్ర ప్రజలు నా పై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భవిష్యత్కు గ్యారంటీగా ఉండే వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్రాభివృద్ధికి, ఉన్నతికి పునరంకితమవుతా’. ‘పవన్ కల్యాణ్ అనే నేను.. రాష్ట్ర ప్రజలు మా సమష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టు కుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ–జనసేన పార్టీలు సంయుక్తంగా అధికారంలోకి వచ్చిన తర్వాత భవిష్యత్కు గ్యారంటీగా ఉండే వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి, సహృదయంతో, సమన్వయంతో, సహకారంతో సమిష్టిగా కృషి చేస్తాను.’ప్రతి నెలా 25 వేల పింఛన్లు కట్» మిగిలిన పథకాల అమలు తీరు కూడా అరకొరే. ప్రతి నెలా పింఛన్ల పంపిణీనే చూడండి. చంద్రబాబు పబ్లిక్ మీటింగ్లు పెడుతూ ప్రతి నెలా పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రతి మీటింగ్కు 25 వేల పింఛన్లు కట్ చేస్తున్నాడు. 2024 ఎన్నికల నాటికి అంటే మార్చి నాటికి రాష్ట్రంలో పింఛన్ల సంఖ్య 66,34,372 కాగా, 2026 ఫిబ్రవరిలో 60,96,108 మందికి ఫించన్లు ఇచ్చారు. అంటే ఏకంగా 5,38,634 మందికి పింఛన్లు కట్ చేశాడు. » ఇంకా ఆశ్చర్యమేమిటంటే ఫిబ్రవరిలో ఇచ్చిన పింఛన్లకు ఇచ్చిన సొమ్ము రూ.2,632 కోట్లు. ఈ లెక్కన ఈ ఏడాది బడ్జెట్లో 12 నెలలకు రూ.31,554 కోట్లు కేటాయించాలి కదా.. కానీ కేవలం రూ.27,719 కోట్లు మాత్రమే పెట్టారు. ఈ లెక్కన ఈ మొత్తం 53,50,115 పింఛన్లకు మాత్రమే సరిపోతుంది. అంటే ఈ ఏడాది మరో 7,45,993 పింఛన్లు కట్ చేయడానికి సిద్దపడినట్లు చంద్రబాబు చెప్పకనే చెబుతున్నాడు.తల్లికి వందనం కాదు.. తల్లికి వంచన » తల్లికి వందనం పథకాన్ని కాస్తా తల్లికి వంచన పథకంగా మార్చేశారు. బడికి వెళ్లే ప్రతి పిల్ల వాడికి ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఇస్తామన్నారు. రాష్ట్రంలో యూడీఐఎస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) ప్రకారం 2023–24 నాటికి బడికి పోయే పిల్లలు 87,41,885 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి ఏటా రూ.15 వేల చొప్పున రూ.13,112 కోట్లు ఖర్చు అవుతుంది. » 2024–25లో ఈ పథకానికి ఒక్క రూపాయి ఇవ్వలేదు. 2025–26లో రెండో ఏడాది బడ్జెట్లో రూ.8,349 కోట్లు మాత్రమే కేటాయించారు. పైగా యూడైస్ డేటా ప్రకారం 20 లక్షల మంది పిల్లలకు ఎగరగొట్టేశాడు. చివరకు 67.27 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. అది కూడా కొందరికి రూ.8 వేలు.. రూ.9 వేలు.. రూ.10 వేలు, మరి కొంత మందికి రూ.13 వేలు ఇచ్చారు. తాజాగా బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో రూ.9,668 కోట్లు ఖర్చు చేస్తామని చూపించారు. కానీ కేటాయించింది మాత్రం రూ.8,456 కోట్లు మాత్రమే. అంటే ఈ ఏడాది కూడా భారీగా పిల్లలకు కోత పడుతుందని చెప్పకనే చెప్పారు. ఉచిత గ్యాస్.. ఉచిత బస్సు అంతా మోసం » కడప నుంచి వైజాగ్కు పోవచ్చు.. శ్రీకాకుళం వాళ్లు తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు.. మధ్యలో కనకదుర్గమ్మను కూడా దర్శనం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఫ్రీ అన్నారు. ఏపీఎస్ ఆరీ్టసీలో 16 రకాల సర్వీసులుంటే.. కేవలం ఐదు సర్వీసులకు మాత్రమే పరిమితం చేశారు. ఈ పథకం అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్లు ఖర్చు చేయాలి. మొదటి ఏడాది ఈ స్కీమ్ ఎగరగొట్టేశాడు. » రెండో ఏడాది ఆర్నెల్ల తర్వాత ఆగస్టులో అరకొరగా మొదలు పెట్టారు. చేసిన ఖర్చు రూ.1,040 కోట్లు. ఈ స్కీమ్ కోసం ఈ బడ్జెట్లో కేటాయించిన మొత్తం రూ.1,420 కోట్లు. అంటే మూడేళ్లలో రూ.9,600 కోట్లకు గాను రూ.2,460 కోట్లు కేటాయించారు. అంటే రూ.7,140 కోట్లు బాకీ పడ్డారు. » సూపర్ సిక్స్లో ఉచిత గ్యాస్ చిన్న హామీ. ఇక్కడా మోసాలే. రాష్ట్రంలో యాక్టివ్గా ఉన్న గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 1.59 కోట్లు. వీటికి ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. సిలెండర్ ధర రూ.855 చొప్పున మూడు సిలెండర్లకు ఏడాదికి రూ.3,990 కోట్లు కేటాయించాలి. మొదటి ఏడాది కేవలం రూ.786 కోట్లు, రెండో ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం బడ్జెట్లో రూ.2,199.99 కోట్లు కేటాయించారు. 2026–27లో బడ్జెట్లో ఈ పథకానికి పెట్టింది రూ.2,601 కోట్లు. అంటే మొత్తంగా రూ.6,143 కోట్లు బాకీ పడ్డారు. అన్నదాత సుఖీభవ పేరిట అన్నదాతలకు టోకరా » ప్రతి రైతు కుటుంబానికి పీఎం కిసాన్ (కేంద్రం ఇచ్చేది) కాకుండా అన్నదాత సుఖీభవ పేరుతో పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు ఇస్తానని చంద్రబాబు స్పష్టంగా చెప్పాడు. (వీడియో ప్రదర్శించారు). » ఈ లెక్కన 2023లో మా హయాంలో లబ్ధి పొందిన 53.58 లక్షల మందికి లెక్కిస్తే ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున ఏడాదికి రూ.10,717 కోట్లు ఇవ్వాలి. తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండేళ్లు కలిపి గతేడాది రూ.40 వేల చొప్పున ఇవ్వాలి. కానీ అప్పుడొక రూ.5 వేలు, అప్పుడొక రూ.5 వేలు చొప్పున రూ.10వేలు ఇచ్చాడు. అంటే రూ.30 వేలు ఎగరగొట్టాడు. » వైఎస్సార్సీపీ హయాంలో 53.58 లక్షల మందికి రైతులకు ఇస్తే, చంద్రబాబు హయాంలో 46.85 లక్షల మందికి రూ.4,685 కోట్లు మాత్రమే ఇచ్చాడు. అంటే ఏడు లక్షల మందికి ఎగనామం పెట్టాడు. పైగా ఈ పథకం కింద రూ.6,309 కోట్లు ఇచ్చేశామని అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు పచ్చి అబద్ధాలు చెప్పాడు. ఏడాదికి రూ.10,717 కోట్లు చొప్పున రెండేళ్లకు రూ.21,434 కోట్లు ఇవ్వాలి. కానీ ఇచ్చింది కేవలం రూ.4,685 కోట్లు. » అంటే ఈ ఒక్క స్కీమ్ ద్వారానే రైతులకు ఈ రెండేళ్లకే రూ.16,749 కోట్లు బాకీ పడ్డారు. ప్రతి రైతుకు రూ.30 వేలు బాకాయి పడ్డాడు. కౌలు రైతులకైతే మొండి చేయి చూపించారు. మూడు బడ్జెట్లలో కూడా జీరో. మా హయాంలో రైతు భరోసా కింద రూ.13,500 చొప్పున కౌలు రైతులకు ఇచ్చి ఆదుకున్నాం. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు పట్టాలివ్వడమే కాకుండా రైతు భరోసా కూడా ఇచ్చాం. ఇప్పుడు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు మూడు బడ్జెట్లలోనూ సున్నా. ఉచిత పంటల బీమాకు మంగళం » చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 17 సార్లు తుపానులు, అల్పపీడనాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. చంద్రబాబు పుణ్యమా అని ఉచిత పంటల బీమా పథకం అటకెక్కింది. » పంటల బీమా కోసం 2024–25లో బడ్జెట్లో పెట్టింది రూ.60 లక్షలు.. ఖర్చు చేసింది సున్నా. 2025–26లో రూ.1,023 కోట్లు.. రైతులకు ఇచ్చిన పరిహారం సున్నా. ఈఏడాది బడ్జెట్లో పెట్టింది కేవలం రూ.250 కోట్లు. » 2023–24 ఖరీఫ్కు సంబంధించి 2024 జూన్లో ప్రభుత్వం కట్టాల్సిన రూ.834 కోట్లు ప్రీమియం బకాయిలు కట్టక పోవడంతో రైతులు రూ.1,324 కోట్ల మేర బీమా పరిహారాన్ని నష్టపోయారు. 2023–24 రబీలో ప్రీమియం సొమ్ములు కట్టిందా అంటే అదీలేదు. 2023–24, 2024–25 వ్యవసాయ సీజన్లకు సంబంధించి సుమారు రూ.3,500 కోట్ల మేర రైతులు నష్ట పోయారు. కిందా మీద పడి ప్రీమియం చెల్లించిన రైతులు సైతం రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన తమ వాటా ప్రీమియం కట్టకపోవడం వల్ల నష్టపోవాల్సి వచ్చింది. » వైఎస్సార్సీపీ హయాంలో రైతుల తరఫున కూడా ఏటా వారు చెల్లించాల్సిన ప్రీమియం ప్రభుత్వమే కట్టి ఐదేళల్లో 54.55 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్ల బీమా లబ్ధి చేకూర్చాం. ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కూడా రైతులు ఇలానే ఇబ్బంది పడుతున్నారు. 2025–26లో మోంథా, దిత్వా తుపాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. 2025–26 బడ్జెట్లో ఇన్పుట్ సబ్సిడీ కోసం కేటాయించింది సున్నా. రైతులకు ఇచ్చింది సున్నా. గతేడాది మోంథా తుపాను వల్ల 15 లక్షల ఎకరాల్లో నష్టం జరిగితే దాన్ని 4 లక్షల ఎకరాలకు కుదించారు. మొత్తంగా రూ.900 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఉన్నాయి. ధరల స్థిరీకరణ నిధి పేరిట దగా » చంద్రబాబు హయాంలో ఏ ఒక్క పంటకు ఏ ఒక్క రైతుకు గిట్టుబాటు ధర దక్కిన పాపాన పోలేదు. కనీసం మద్దతు ధర కూడా దక్కడం లేదు. ధాన్యం క్వింటాకు మద్దతు ధర రూ.2,369 కాగా, ప్రతి రైతు.. క్వింటా రూ.300 నుంచి రూ.400 తక్కువకు అమ్ముకున్నారు. గత ప్రభుత్వంలో ప్రతి రైతుకు మద్దతు ధర దక్కేలా చేయడమే కాదు.. గన్నీ బ్యాగ్, రవాణ, లేబర్ ద్వారా ప్రతి ఎకరాకు, ప్రతి క్వింటాకు అదనంగా రూ.252 చొప్పున మేలు జరిగేలా చేశాం. చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.961 కోట్ల ధాన్యం బకాయిలను మేము అధికారంలోకి వచ్చాక చెల్లించాం. » ఈ ప్రభుత్వం దారుణంగా రైతుల జీవితాలతో ఆడుకుంటోంది. ఇప్పుడు శనగకు కనీస మద్దతు ధర రూ.5,875 కాగా, రూ.5 వేలకు అమ్ముకుంటున్నారు. మా హయాంలో రూ.8 వేల ధర లభించేలా చేసి రైతులకు మేలు చేశాం. » ధరల స్థిరీకరణ నిధి కోసం 2024–25లో రూ.300 కోట్లు కేటాయించి, ఖర్చు చేసింది మాత్రం రూ.50.28 కోట్లే. 2025–26లో రూ.300 కోట్లు.. కానీ రివైజ్డ్ ఎస్టిమేట్లలో రూ.340 కోట్లు ఖర్చు చేసినట్టుగా చూపిస్తున్నారు. నిజంగా ఖర్చు చేశారో లేదా ఆ దేవుడికే తెలియాలి. 2026–27 బడ్జెట్లో పెట్టింది రూ.500 కోట్లు.. కానీ మా హయాంలో రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఐదేళ్లలో రూ.7,756 కోట్లు ఖర్చు పెట్టాం. మార్కెట్లో పోటీ తీసుకొచ్చి రైతులకు మద్దతు ధర దక్కేలా మేలు చేశాం. ఆర్బీకేలు, ఏం యాప్ ద్వారా ధరలను పర్యవేక్షించే వాళ్లం. చంద్రబాబు సష్టించిన సంక్షోభమే» చంద్రబాబు ఉద్దేశ పూర్వకంగా వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. అన్నీ మానవ తప్పిదాలే (మ్యాన్మేడ్ బ్లండర్స్). అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఇవ్వాల్సిన రూ.40 వేలకు గానూ రూ.30 వేలు ఎగ్గొట్టారు. 2025లో చంద్రబాబు లెక్కల ప్రకారమే 393 మంది రైతులు, 2,472 రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారని కార్యదర్శుల సమావేశంలో ప్రభుత్వమే ప్రకటించింది. నమోదు కానీ మరణాలు ఇంకెన్ని ఉన్నాయో చెప్పలేం.» దురదృష్టవశాత్తు ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు గతంలో రూ.2 లక్షలున్న పరిహారాన్ని మా హయాంలో రూ.7 లక్షలకు పెంచి ఆ రైతు కుటుంబాలకు అండగా నిలిచాం. ఎక్కడైనా రైతు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి నెలకొంటే.. మరుసటి రోజే కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ నేరుగా ఆ రైతు కుటుంబం వద్దకు వెళ్లేవారు. విచారణ జరిపి 48 గంటల్లోనే ఆ కుటుంబం చేతిలో రూ.7 లక్షలు చెక్ పెట్టేవాళ్లు. ఇలా మా హయాంలో 1,323 రైతు కుటుంబాలను ఆదుకున్నాం. అంతేకాదు చంద్రబాబు హయాంలో 474 రైతు కుటుంబాలకు కూడా రూ.5 లక్షల చొప్పున పరిహారం మేము ఇచ్చాం.ప్రతి అక్కా చెల్లెమ్మకు రూ.54 వేలు బాకీ » సూపర్ సిక్స్లో మరో అతి ముఖ్యమైన హామీ.. 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తానన్నారు. రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడి, 60 ఏళ్లలోపు ఉన్న మహిళలు ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం కోటి 80 లక్షల మంది ఉన్నారు. » వీరికి నెలకు రూ.1500 అంటే సంవత్సరానికి రూ.18 వేల చొప్పున ప్రతి ఏటా రూ.32,400 కోట్లు చొప్పున బడ్జెట్లో కేటాయించాలి. ఈ పథకం కింద మొదటి రెండు బడ్జెట్లలో ఈ అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది సున్నా. మూడో బడ్జెట్లోనూ ఇచ్చేది సున్నా. మూడేళ్లకు కలిపి అక్కచెల్లెమ్మలకు బాకీపడ్డ సొమ్ము అక్షరాలా రూ.97,200 కోట్లు. ఈ స్కీమ్ కింద ఈ మూడేళ్లలో అక్కచెల్లెమ్మలకు రూ.54 వేల చొప్పున బాకీ పడ్డారు.50 ఏళ్లకే పింఛన్ అంటూ వంచన సూపర్ సిక్స్లో ఇచ్చిన మరో హామీ 50 ఏళ్లకే పింఛన్. ప్రతి నెలా రూ.4 వేలంటూ హామీ ఇచ్చారు. అంటే సంవత్సరానికి ఒక్కొక్కరికి రూ.48 వేలు ఇవ్వాలి. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు దాదాపు 20 లక్షల మందికి పైగానే ఉన్నారు. వాళ్లకు నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లవుతుంది. ఈ లెక్కన మూడేళ్లలో రూ.28,800 కోట్లు కేటాయించాలి. కానీ మూడు బడ్జెట్లలో కేటాయించింది సున్నా.» ప్రతి ఒక్కరికి నెలకు రూ.4 వేలు చొప్పున ఏడాదికి రూ.48 వేలు. అంటే మూడేళ్లకు రూ.1.44 లక్షలు బాకీ పడ్డారు. -
త్రిశంకుస్వర్గంలో ఉన్నత విద్య
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పిల్లల చదువులపై చిత్తశుద్ధి లేకుండా చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తోందని అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలపై స్పష్టత లేకుండా చేసి చదువులను త్రిశంకు స్వర్గంలో పెట్టారని నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్మెంట్ను ఒక త్రైమాసికం ముగిసిన వెంటనే మరో త్రైమాసికంలో తల్లుల ఖాతాల్లో వేసేవాళ్లం. 2024 జనవరి–మార్చి త్రైమాసికానికి సంబంధించి ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో నిధులు విడుదల చేసేవాళ్లం. అయితే 2024 మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది.మే 13 పోలింగ్ జరిగింది. అంతే, అక్కడితో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు ప్రక్రియ నిలిచిపోయింది. ఈ ఏడాది మార్చి నాటికి 9 త్రైమాసికాలకు విద్యా దీవెనకు రూ.6,300 కోట్లు చెల్లించాలి. ప్రతి ఏప్రిల్లో వసతి దీవెన కింద రూ.1,100 కోట్లు ఇచ్చేవాళ్లం. ఎన్నికల పుణ్యంతో అది కూడా ఆగిపోయింది. 2024–2025 ఏప్రిల్ వరకు కలిపి రూ.2,200 కోట్లు వసతి దీవెన చెల్లించాలి. విద్యా దీవెన, వసతి దీవెన కలిపితే రూ.8,500 కోట్లు ఇవ్వాల్సి ఉంటే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1,771 కోట్లు మాత్రమే విడుదల చేశారు.ఇప్పుడు అసెంబ్లీ జరుగుతోందని మరో రూ.1,200 కోట్లకు బీఆర్వోలు ఇచ్చారు. బీఆర్వో ఇచ్చిన వెంటనే పేమెంట్ ఇచ్చినట్టు కాదు. కాలేజీల ఖాతాల్లో కేవలం రూ.300 కోట్లు మాత్రమే పడ్డాయి. అంటే రెండేళ్లలో బాబు ఇచ్చింది రూ.2,071 కోట్లే. ఇంకా రూ.6,428 కోట్లు బాకీ పడ్డారు’ అని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..రూ.35,209 కోట్లతో ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు ⇒ అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 21 లక్షల ఇళ్లు మంజూరు చేయించి 10 లక్షల ఇళ్లు పూర్తి చేశాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు తన మేనిఫెస్టోలో పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మూడు బడ్జెట్లలోనూ గజం స్థలం కొనడానికి పైసా కేటాయించ లేదు. ఒక్కరికి కూడా సెంటు భూమి పట్టా ఇవ్వలేదు. ⇒ పైగా మా హయాంలో 10 లక్షల ఇళ్లు పూర్తి చేసిన తర్వాత మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉంటే, వాటిని కూడా తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తున్నాడు. 2024–25లో రూ.4,012 కోట్లు బడ్జెట్ పెట్టి రూ.1,548 కోట్లు ఖర్చు చేశారు. 2025–26లో రూ.6,300 కోట్లు (రివైజ్డ్ అంచనాలు) పెడితే రూ.1,928 కోట్లు ఖర్చు చేసినట్టు చూపిస్తున్నారు గానీ, వాస్తంగా ఖర్చు చేసింది రూ.200 కోట్లు మాత్రమే. ⇒ వైఎస్సార్సీపీ హయాంలో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.3 వేల కోట్లతో కలిపి మొత్తం రూ.35,209 కోట్లు ఖర్చు పెట్టి అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు, ఇళ్లు కట్టించి ఇచ్చి లక్షాధికారులను చేశాం. నాడు–నేడుకు ఉరి ⇒ ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమం ద్వారా మేము దేశంలోనే రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తే దానికి చంద్రబాబు ఉరి వేశారు. తొలి విడతలో 15,713 స్కూళ్లలో పనులు చేస్తే, రెండో విడతలో 22,312 స్కూళ్లలో దాదాపు పూర్తి చేసే దశకు తీసుకొచ్చాం. నాడు–నేడుకు రూ.8,524 కోట్లు మా ప్రభుత్వ హయాంలో ఖర్చు చేశామని చంద్రబాబు ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. ⇒ మరో రూ.4–5 వేల కోట్లు ఖర్చు పెడితే నాడు–నేడు పనులు అయిపోతాయి. కానీ, చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని మూలన పడేశారు. ఆయన సుపుత్రుడి శాఖలో నాడు–నేడు కోసం 2024–25లో రూ.285 కోట్లు ఖర్చు చేస్తే, 2025–26లో రూ.1,500 కోట్లు కేటాయించి రూ.259 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఈ బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయించారు గానీ, ఎంత ఖర్చు చేస్తారో చూడాలి. ⇒ ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్సీ, ఐబీ, టోఫెల్ నిలిపివేసినట్టు ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఇప్పటికే ఇంగ్లిష్ మీడియం, ట్యాబులు, నాడు–నేడు ఎగిరిపోయాయి. సబ్జెక్టు టీచర్ విధానానికి మంగళం పాడేశారు. గోరుముద్ద పిల్లలు తినకుండా చేస్తున్నారు. కలుషిత నీరు తాగి, నాణ్యత లేని ఆహారం తిని 900 మంది పిల్లలు ఆస్పత్రుల్లో చేరారని జాతీయ పత్రికల్లోనూ వార్తలొస్తున్నాయి. ఇంత దారుణంగా విద్యా రంగాన్ని నడుపుతున్నారు.ఆరోగ్యశ్రీ నడపాలంటే నెలకు రూ.330 కోట్లు చొప్పున ఏడాదికి రూ.4 వేల కోట్లు వ్యయం చేయాలి. 2024–25, 2025–26 రెండేళ్లకు రూ.8 వేల కోట్లు వెచ్చించాలి్సన చోట చంద్రబాబు 2024–25లో రూ.2,259 కోట్లు, 2025–26లో రివైజ్డ్ అంచనాలు ప్రకారం రూ.3 వేల కోట్లు ఇచ్చినట్టు చెబుతున్నారు. కానీ, నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ మాత్రం రూ.2,600 కోట్లే ఇచ్చినట్టు చెబుతోంది. ఇంకా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.3,141 కోట్ల బకాయిలు పెట్టింది. 2026–27లో రూ.4 వేల కోట్లతో కలిపితే మొత్తం రూ.7,200 కోట్లు ఆర్యోశ్రీకి అవసరం. వీళ్ల బడ్జెట్ చూస్తే పేదలను బతికించేలా కనిపించట్లేదు. 2026–27 విద్యా సంవత్సరంలో నాలుగు త్రైమాసికాలకు (త్రైమాసికానికి రూ.700 కోట్లు) రూ.2,800 కోట్లతో పాటు వచ్చే ఏప్రిల్లో వసతి దీవెనకు రూ.1,100 కోట్లు కలిపి రూ.3,900 కోట్లు వ్యయం చేయాలి. దీనికి రూ.6,428 కోట్ల బకాయిలు కలిపితే రూ.10,328 కోట్లు నిధులు కావాల్సి ఉంది. అయితే బడ్జెట్లో పెట్టింది మాత్రం రూ.2,766 కోట్లు మాత్రమే. ఇలాగైతే పిల్లల చదువులు ఎలా సాగుతాయి? అసలు చదివే పరిస్థితి ఉంటుందా?వైఎస్సార్సీపీ హయాంలో ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా భూముల కొనుగోలు కోసం రూ.11,871 కోట్లు, ఇళ్ల నిర్మాణాలకు రూ.20,338 కోట్లు ఖర్చు చేశాం. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.3 వేల కోట్లతో కలిపి మొత్తం రూ.35,209 కోట్లు ఖర్చు పెట్టి అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు, ఇళ్లు కట్టించి ఇచ్చి లక్షాధికారులను చేశాం. ఇదే విషయంపై సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం డిసెంబర్లో లోక్సభ సమావేశాల్లో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది. – వైఎస్ జగన్మహిళలకు రుణ పరపతిలో క్షీణత ⇒ డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకి మూడు బడ్జెట్లలో అతీగతి లేదు. చంద్రబాబు తన మేనిఫెస్టోలో స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని ప్రకటించి ఇవ్వకపోగా.. ఇంతకు ముందు ఇచ్చేది కూడా ఆపేశారు. వైఎస్సార్సీపీ హయాంలో కోటి మంది మహిళలకు వడ్డీ లేని రుణాల కింద రూ.4,969 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ చేయూత ద్వారా 26,98,931 మందికి రూ.19,189 కోట్లు, ఆసరా కింద 78,94,169 మందికి రూ.25,570 కోట్లు, కాపు నేస్తం కింద 3,58,613 మందికి రూ.2,029 కోట్లు, ఈబీసీ నేస్తం కింద 4,95,269 మందికి రూ.1,876 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. ⇒ స్త్రీలను శక్తిమంతులను చేసేలా వారి సాధికారత కోసం వైఎస్సార్సీపీ హయాంలో చర్యలు చేపట్టాం. మేము అక్కచెల్లెమ్మల బాగు కోసం పరితపించి వారిని నిలబెట్టే కార్యక్రమం చేస్తే, చంద్రబాబు ప్రభుత్వంలో విచిత్రంగా పొదుపు సంఘాల పరపతి తగ్గిపోయింది. నాబార్డ్ డేటా చూస్తే.. 2023–24లో మహిళలకు రూ.49,626 కోట్లు పొదుపు రుణాలు ఉంటే, చంద్రబాబు హయాంలో 2025–26 పది నెలల్లో (డిసెంబర్ వరకు) రూ.30,698 కోట్లకు పడిపోయింది. దానికి ముందు ఏడాది 2024–25లో రూ.41 వేలుగా ఉంది. మహిళలకు బ్యాంకులు రుణాలు ఇవ్వక పోవడంతో పరపతి తగ్గిపోతోంది.స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామంటూ చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీఉద్యోగులకు పైసా జీతం పెరగలేదు ⇒ చంద్రబాబు ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామన్నారు. మెరుగైన పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పారు. మూడు బడ్జెట్లు పెట్టినా ఉద్యోగులకు ఒక్క పైసా జీతం పెరగలేదు. గతంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇచ్చాం. ఆ తర్వాత పీఆర్సీ కమిషన్ వేసి చైర్మన్ను నియమిస్తే వీళ్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చైర్మన్ను తీసేశారు. ⇒ ఆయన త్వరగా రిపోర్టు ఇస్తే వెంటనే జీతాలు పెంచాలనే భయంతో, ఒకవైపు ఐఆర్ ఇవ్వకుండా మరో వైపున పీఆర్సీ చైర్మన్ తొలగించి, కొత్త పీఆర్సీని నియమించకుండా ఉద్యోగులను త్రిశంకు స్వర్గంలో పెట్టారు. ఇప్పటికీ నాలుగు డీఏలు పెండింగ్, ఐఆర్ లేదు, పీఆర్సీ లేదు, ఒకటో తేదీ జీతాల ముచ్చట ఒక నెలతోనే అయిపోయింది. ⇒ జీపీఎఫ్, ఏపీజీఎస్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవుల కింద దాదాపు రూ.35 వేల కోట్లు ఉద్యోగులకు బకాయిలు పడ్డారు. 2024–25లో ఉద్యోగుల జీతాలు రూ.62,806 కోట్లు అయితే, 2025–26 రివైజ్డ్ అంచనాల ప్రకారం రూ.61,111 కోట్లు. అంటే జీతాలు పెరగాల్సింది పోయి తగ్గాయి. కొద్దో గొప్పో ఉద్యోగులు రిటైర్ అయ్యి ఉంటారు. హెచ్ఆర్ఏ 2024–25లో రూ.4,614 కోట్లు ఉంటే ఇప్పుడు రూ.4,600 కోట్లకు తగ్గింది. మెడికల్ రీయింబర్స్మెంట్ రూ.124 కోట్ల నుంచి రూ.121 కోట్లకు పడిపోయింది. అలవెన్సులు, ఈఎల్, ఎస్టీసీ, ఓవర్టైమ్ అలవెన్స్లు రూ.2,415 కోట్లు అయితే ఇప్పుడు రూ.1,316 కోట్లకు క్షీణించింది. ఉద్యోగుల బేసిక్ పే రూ.35,671 కోట్లు ఉంటే ఇప్పుడు రూ.35,345 కోట్లుగా మాత్రమే ఉంది. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ, ఐఆర్, అలవెన్స్ చెల్లింపు తదితరాలపై మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన హామీలు.. -
అంకెలతో మోసం.. ప్రతి అడుగులో పతనం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అవే పచ్చి అబద్ధాలు.. తప్పుడు లెక్కలు.. చంద్రబాబు భజన.. బడ్జెట్ అంతా మోస మే..! అని టీడీపీ కూటమి సర్కారుపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి మండిపడ్డారు. ఇప్పటివరకు ప్రవేశ పెట్టిన మూడు బడ్జెట్ల ద్వారా రాష్ట్రానికి, ప్రజల కు చంద్రబాబు చేసిన మంచి ఎక్కడా కనిపించద ని.. అంతా మోసమేనని దుయ్యబట్టారు. సూపర్ సిక్స్, సెవెన్ హామీలను అమలు చేయలేక.. అట్టర్ ప్లాప్ అయినా, సూపర్ హిట్ అంటూ నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘మోసానికి షర్టు, ఫ్యాంట్ వేస్తే అది చంద్రబాబు. అబద్ధాలకు రెక్కలు కడితే అవి చంద్ర బాబు మాటలు’’ అని విమర్శించారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్లో అంకెల గారడీ, ప్రజలను మోసగిస్తున్న తీరును నిలదీశారు. కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికలో పొందుపరిచిన గణాంకాలను ఉటంకిస్తూ బడ్జెట్ అంచనాలు, సవరించిన అంచనాల్లో తప్పుడు లెక్కలను ఎండగట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..ఫ్యాబ్రికేటెడ్ అంకెలతో డప్పు..ప్రజలను వరుసగా వెన్నుపోటు పొడిచి వంచిస్తూ చంద్రబాబు ప్రభుత్వం మూడో బడ్జెట్ ప్రవేశపెట్టింది. తాను ఇస్తానన్న సూపర్ సిక్స్, సెవెన్, మ్యానిఫెస్టో హామీలు గాలికి ఎగిరిపోయాయి. అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ పెట్టిన బడ్జెట్ ఇది. రాష్ట్ర ప్రగతి, ఆర్థిక వ్యవస్థ గురించి చంద్రబాబు మాటలేమో కోటలు దాటుతాయి.. వాస్తవ లెక్కలు చూస్తే మాత్రం గడప కూడా దాటని పరిస్థితి కని పిస్తుంది. చంద్రబాబు పాలనంతా పబ్లిసిటీ పీక్, ఫెర్మామెన్స్ వీక్. 2024–25లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు (జీఎస్డీపీ) 11.75 శాతంగా చంద్రబాబు చెప్పుకొస్తారు. దేశ జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటు 9.8% మాత్రమేనని.. దేశం కంటే రాష్ట్రం ఆర్థిక వృద్ధిలో దూసుకుపోతోందంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటారు. ఇక 2025–26 రాష్ట్ర జీఎస్డీపీ గ్రోత్రేటు 10.75 శాతంగా తన ఆఫీసులో కూర్చుని అంకెలు రాసుకుంటారు. ఇదే సమయంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 8 శాతమేనని.. దేశం కంటే ఆర్థిక వృద్ధిలో రాష్ట్రం దూసుకెళ్తోందంటూ తన డబ్బా తానే మోగించడం మొద లుపెడతారు. ఫ్యాబ్రికేటెడ్ (మోసపూరిత) అంకెలతో తన డప్పు తానే కొట్టుకోవడం మనకంతా కనిపిస్తూనే ఉంది. అసమర్థ ఆర్థిక నిర్వహణకు ఇది సాక్ష్యం కాదా?రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధిరేటులో ఉంది అంటే.. రాష్ట్రంలోని అన్ని రంగాలు పురోగతి సాధిస్తున్నాయని అర్థం. వ్యవసాయం, తయారీ, సేవలు రంగాలు వేగంగా పరిగెడుతున్నాయని దాని అర్థం. మరి చంద్రబాబు చెప్పిన ఆ లెక్కలు నిజమే అయితే.. జీఎస్డీపీ ఆ విధంగా పెరిగి ఉంటే అది ప్రజల తలసరి ఆదాయంలో కూడా ప్రతిబింబించాలి కదా? అదే రీతిలో తలసరి ఆదాయం పెరిగి ఉండాలి కదా? తలసరి ఆదాయం నిజంగానే పెరిగి ఉంటే.. తద్వారా ప్రజల కొనుగోళ్ల శక్తి కూడా పెరిగి ఉండాలి కదా? తద్వారా ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయాలు కూడా పెరిగి ఉండాలి కదా? ఇదంతా ఒక సైకిల్! మరి వాస్తవంగా ఇది జరిగిందా..? అని ఒకసారి పరిశీలిస్తే.. చంద్రబాబు అధికారం చేపట్టిన తొలి సంవత్సరం 2024–25లో రాష్ట్ర సొంత ఆదాయం రూ.1,19,927 కోట్లు వస్తుందని బడ్జెట్లో చెప్పారు. కానీ ఆ ఏడాది వాస్తవంగా వచ్చిన ఆదాయం రూ.94,937 కోట్లు మాత్రమే. ఆశ్చర్యం ఏమిటంటే.. 2023–24 వైఎస్సార్సీపీ ప్రభుత్వం చివరి సంవత్సరంలో రాష్ట్ర సొంత ఆదాయం రూ.93,084 కోట్లతో పోలిస్తే.. పెరుగుదల కేవలం 1.99 శాతం మాత్రమే. అంటే బడ్జెట్లో చంద్రబాబు లెక్కలేసిన రూ.1,19,927 కోట్లు గాలికి ఎగిరిపోయాయి. ఇక 2025–26లో కూడా వాస్తవంగా రూ.94,937 కోట్లు వచ్చినట్లు కనిపిస్తుంటే.. బడ్జెట్ గారడీతో రాష్ట్ర సొంత ఆదాయాలు రూ.1,27,703 కోట్లుగా చంద్రబాబు చూపించారు. కానీ.. పది నెలలకు సంబంధించి కాగ్ విడుదల చేసిన డేటా చూస్తే 2025–26లో రాష్ట్ర సొంత ఆదాయం రూ.75,964 కోట్లు మాత్రమే వచ్చింది. అదే అంతకుముందు పది నెలల కాలానికి (2024–25) వచ్చింది రూ.72,864 కోట్లు. అంటే.. పెరుగుదల కేవలం 4.25 శాతం మాత్రమే. పది నెలల కాలానికి రూ.75,964 కోట్ల ఆదాయం వస్తే.. బడ్జెట్లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం ఏకంగా రూ.1,27,703 కోట్లు వస్తుందని చూపించారు. మరో రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా వాస్తవాలు చెప్పకుండా.. ఇంకా మోసం చేస్తూ దాన్ని రూ.1,12,349 కోట్లుగా సవరించారు. అంటే.. మిగిలిన రెండు నెలల కాలంలో ఏకంగా రూ.36,385 కోట్ల మేర ఆదాయాలు వస్తాయని గారడీ లెక్కలు చూపించారు. 2025–26లో రాష్ట సొంత పన్నుల ఆదాయం నెలకు సగటున రూ.7,596 కోట్లే. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే ఈ ఏడాది మొత్తం మీద రూ.95,000 కోట్లు వస్తే గగనం. కానీ ఈ పెద్ద మనిషి మళ్లీ 2026–27లో రాష్ట్ర సొంత ఆదాయాలు ఏకంగా రూ.1,37,320 కోట్లు వస్తాయని చూపిస్తున్నారు. అంటే రాష్ట్ర సొంత ఆదాయంలో దాదాపు 45 శాతం పెరుగుదల!! అది సాధ్యమేనా? గత బడ్జెట్లో కూడా ఇలాగే చూపిస్తే వచ్చిన వృద్ధి రేటు కేవలం 3.4 శాతమే. దేశంలో చిట్ట చివరి నుంచి రెండో స్థానం..నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) మొదటి తొమ్మిది నెలలు రాష్ట్ర సొంత పన్నుల ఆదాయాలను మా ప్రభుత్వ హయాంలో 2023–24 తొమ్మిది నెలల ఆదాయాలతో పోలిస్తే సగటు వృద్ధిరేటు 1.97 శాతం మాత్రమే. ఈమధ్య కాగ్ 23 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను విడుదల చేసింది. ఈ రెండేళ్లలో సొంత పన్నుల ఆదాయాల వృద్ధిని పరిశీలిస్తే సగటున 1.97 శాతంతో మన రాష్ట్రం దేశంలో 23 రాష్ట్రాల్లో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. బాబు అసమర్థత ఆర్థిక నిర్వహణకు ఇది సాక్ష్యం కాదా? -
ఏపీలో రోడ్లు అధ్వానం టీడీపీ ఎమ్మెల్యే బాబుకు షాక్
-
దేవుడితో పెట్టుకున్నాడు చుక్కలు చూస్తున్నాడు
-
Tirumala : రెండు కాదు ఏడు కొండలే.. అసలు నిజాలు బయటపెట్టిన జగన్
-
జగనన్న కాలనీల కోసం.. అక్కచెల్లెమ్మలకు ఏకంగా 35,210 కోట్లు ఇచ్చాం
-
పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఉరి.. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఇక దేవుడికే తెలియాలి
-
ఏమయ్యా అచ్చెన్న.. 6,309 కోట్లు ఇచ్చావా ..? సిగ్గుందా కొంచెమైనా..!
-
YS Jagan: ఒక్క 2025 లోనే 2685 మంది రైతులు ఆత్మహత్య
-
ఉద్యోగులకు భారీ మోసం.. రెండేళ్లుగా జీతాలు పెరగలేదు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. రెండేళ్లుగా ఉద్యోగులకు జీతాలు పెరగలేదన్నారు. పాఠశాలల్లో నాడు-నేడును గాలికి వదిలేయడంతో కలుషిత నీరు తాగి 900 మంతి పిల్లలు ఆసుపత్రుల్లో చేరారని తెలిపారు. చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాల పరపతి తగ్గిందని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి ఏడాదికి రూ.4000 కోట్లు అవసరం. రెండేళ్లలో ఆర్యోగ్రశ్రీకి రూ.3,141 కోట్లు బకాయిలు పడ్డారు. మేము పీఆర్సీ చైర్మన్ను నియమిస్తే.. బాబు తీసేశారు. రెండేళ్లుగా ఉద్యోగులకు జీతాలు పెరగలేదు. ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్.. ఐఆర్, పీఆర్సీ లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు రూ.35వేలు బకాయి పడ్డారని అన్నారు. ఏపీలో ప్రభుత్వ సూల్స్లో నాడు-నేడుకు చంద్రబాబు ఉరేశారు. స్కూల్స్లో నాడు-నేడు కింద మేము రూ.8,524 కోట్లు ఖర్చు చేశాం. కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం 2024-25లో ఖర్చు చేసింది రూ.285 కోట్లు మాత్రమే. 2025-26లో బాబు ఖర్చు చేసింది రూ.259 కోట్లు మాత్రమే ఉంది. నాడు-నేడును గాలికి వదిలేయడంతో కలుషిత నీరు తాగి 900 మంతి పిల్లలు ఆసుపత్రుల్లో చేరారు. జాతీయ మీడియా ఈ కథనాలను ప్రచురించింది.మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్నాడు. రూ.3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతామన్నాడు. ఇప్పుడు వడ్డీలేని రుణాల ప్రస్తావనే లేదు. మా హయాంలో వైఎస్సార్ ఆసరా కింద రూ.25,570 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ కాపు నేస్తం కింద రూ.2229 కోట్లు ఇచ్చాం. ఈబీసీ నేస్తం కింద రూ.1876 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ చేయూత కింద రూ.19,198 కోట్లు ఇచ్చాం. మేము లక్షలాది అక్కాచెల్లమ్మలకు ఇళ్ల పట్టాలిచ్చాం. 21లక్షలకు పైగా ఇళ్లు మంజూరు చేశాం. ఇళ్ల నిర్మాణం కోసం రూ.35210 కోట్లు ఖర్చు చేశాం. చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాల పరపతి తగ్గింది. మా హయాంలో పొదుపు సంఘాల రుణాలు 49,926 కోట్లకు పోతే.. చంద్రబాబు హయాంలో 30,698 కోట్లకు పడిపోయింది’ అని చెప్పుకొచ్చారు. -
బాబు మీటింగ్ అంటే.. 25000 పెన్షన్లు కట్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వంలో పెన్షన్దారులను భారీగా తొలగిస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. కొత్త పెన్షన్లకు దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదన్నారు. అలాగే, ఈ ఏడాది కూడా తల్లికివందనం పథకంలో భారీగా కోత విధించబోతున్నారని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. యువగళం పేరుతో నిరుద్యోగ యువతను మభ్యపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను దారుణంగా మోసం చేస్తున్నారని తెలిపారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ఎన్నికల సమయంలో ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు. 20 లక్షల మందికి లక్షా 44వేల కోట్లు బాకీ పడ్డారు. సూపర్ ఫ్లాప్ సినిమా చూపిస్తూ.. బాబు హిట్ అంటున్నాడు. చంద్రబాబు ప్రతీ మీటింగ్కు 25వేల పెన్షన్లు కట్. మా ప్రభుత్వంలో మేము 66,34,372 మందికి పెన్షన్లు ఇచ్చాం. బాబు ప్రభుత్వంలో 18 నెలల్లోనే 5,38,636 పెన్షన్లు కట్ చేశారు. ఈ ఏడాది 7,45,993 పెన్షన్లు కట్ చేసేందుకు సిద్ధమయ్యారు. కొత్త పెన్షన్లకు దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు. ఇప్పటికే రెండు లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆరు నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు అప్డేట్ అయ్యేవి. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి 39 లక్షల పెన్షన్లు మాత్రమే ఉండేవి. 2024 నాటికి మేము 66 లక్షలకు పైగా పెన్షన్లు ఇచ్చాం.తల్లికివందనంలో మోసమే.. యూడీఐఎస్ఈ డేటా ప్రకారం మేము దిగిపోయే నాటికి ప్రభుత్వ స్కూల్స్లో 87,41,885 మంది పిల్లలున్నారు. ప్రతీ పిల్లాడికి చంద్రబాబు 15000 చొప్పున ఇస్తానన్నాడు. బడ్జెట్ ప్రకారమే రూ.13,112 కోట్లు ఇవ్వాలి. 2024-25లో తల్లికి వందనం పూర్తిగా ఎగ్గొట్టారు. 2025-26లో కొందరికే ఇచ్చారు. అది కూడా పూర్తిగా కాదు. ఇప్పటి బడ్జెట్లో రూ.8456 కోట్లు మాత్రమే తల్లికి వందనానికి చూపించారు. అంటే ఈ ఏడాది కూడా భారీగా కోత విధించబోతున్నారు.మహిళలకు వంచనే..మహిళకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ఎన్ని సిలిండర్లు ఇచ్చారు?. మహిళలు ఎక్కడికి వెళ్లినా ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. అందులో కూడా షరతులు పెట్టారు. చంద్రబాబు ప్రవేశ పెట్టిన మూడు బడ్జెట్లలో సూపర్ 6, సూపర్ 7పై కించిత్ ప్రస్తావనలేదు. యువగళం పేరుతో నిరుద్యోగ యువతను మభ్యపెట్టారు. ఇలా హామీల పేరుతో ప్రజల్ని మోసం చేయడం చంద్రబాబుకు అలవాటు. అలా మోసం చేసిన వారిలో ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే అని ఎద్దేవా చేశారు.రైతులకు 20వేలు ఎక్కడ?ఎన్నికల సమయంలో ప్రతీ రైతుకు చంద్రబాబు రూ.20వేలు ఇస్తానన్నాడు. కేంద్రం ఇచ్చింది కాకుండా రూ.20వేలు ఇస్తానని చెప్పాడు. 2024-25లో పూర్తిగా ఎగ్గొట్టాడు. రెండేళ్లకు కలిసి 40వేలకు బదులుగా రూ.పది వేలే ఇచ్చాడు. మా ప్రభుత్వ హయాంలో 53,58,000 మందికి రైతుభరోసా ఇస్తే చంద్రబాబు మాత్రం ఏడు లక్షల మంది రైతులకు కట్ చేశాడు. ఏడాదికి రూ.10,717 కోట్లు ఇవ్వాలి. రెండేళ్లకు కలిపి 21431 కోట్లకు గాను ఇచ్చింది 4000 వేల కోట్లు మాత్రమే. ప్రతీ రైతుకు చంద్రబాబు 30వేలకు పైగా బాకీ పడ్డాడు. మేము కౌలు రైతులకు కూడా రైతుభరోసా ఇచ్చాం. పట్టాలిచ్చి మరీ గిరిజనులకు రైతుభరోసా ఇచ్చాం’ అని వెల్లడించారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు.. ఎంఎస్పీ లేదు...ఉచిత పంటల బీమాతో మేము రైతులకు తోడుగా ఉన్నాం. చంద్రబాబు మాత్రం 2024-25 బడ్జెట్లో 60 లక్షలే పెట్టారు. 2025-26లో 1023 కోట్లు పెట్టారు. ఇచ్చింది మాత్రం సున్నా. 2026-27 బడ్జెట్లో రూ.250 కోట్లు మాత్రమే పెట్టారు. ఐదేళ్ల కాలంలో మేము 7802 కోట్లు ప్రీమియం కట్టాం. రైతులపై మేము ఎలాంటి భారం పడనివ్వలేదు. మోంథా తుపానులో 10 లక్షల ఎకరాలు నష్టపోతే చంద్రబాబు మాత్రం నాలుగు లక్షల ఎకరాలే చూపించారు. బాబు పాలనలో రైతులకు గిట్టుబాటు ధర లేదు.. ఎంఎస్పీ లేదు. మేము గతంలో ఆర్బీకేలతో రైతులకు తోడుగా నిలబడ్డాం. ఆర్బీకేలతో మేము ఎప్పటికప్పుడు పంటను కొనుగోలు చేశాం. 21 రోజులలోపే రైతుకు డబ్బు జమ చేసే వాళ్లం. ధరల స్థిరీకరణ కోసం మేము రూ.7756 కోట్లు ఖర్చు చేశాం. చంద్రబాబు మాత్రం 900 కోట్లే బడ్జెట్లో పెట్టారు. దానిలో ఎంత ఖర్చు పెట్టారు అనేది దేవుడికే తెలియాలి. ఆర్బీకే, ఈక్రాప్ను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. దళారీ వ్యవస్థను తీసుకొచ్చి రైతుల పొట్ట కొడుతున్నారు. చంద్రబాబు లెక్కల ప్రకారం.. 2025లో 393 మంది రైతులు, 2472 మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవి కాకుండా రికార్డుల్లో నమోదు కాని ఆత్మహత్యలు ఎన్నో ఉన్నాయి. -
50 ఏళ్లకే పెన్షన్.. అవ్వను పట్టుకోని ఫోటో దిగి..! జగన్ మాస్ ర్యాగింగ్
-
ఇంటింటికీ వెళ్లి..! రెండు బాండ్లు.. రెండు ఫోటోలు.. 6 గ్యారెంటీలపై జగన్ సెటైర్లు
-
బాబు అప్పుల చిట్టా..! ఆధారాలతో బట్టబయలు చేసిన జగన్
-
నిరుద్యోగులకు 3000, మహిళలకు 1500.. బడ్జెట్లో సున్నా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితం అంటూ ఘాటు విమర్శలు చేశారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. ఎన్నికలకు ముందు బాండ్లు ఇచ్చి మరీ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి, ప్రతీ మహిళలకు నెలకు 1500 ఏమైంది? అని ప్రశ్నించారు. అప్పులు తెచ్చిన డబ్బు అంతా ఎక్కడికి పోతుంది?. సూపర్ సిక్స్ సక్సెస్ అని ఎలా చెబుతున్నారు అంటూ మండిపడ్డారు. పథకానికి అమ్మవారి పేరు పెట్టి మహిళల్ని మోసం చేసి ఘనత చంద్రబాబుదే అని విమర్శించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘చంద్రబాబు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను నెరవేర్చలేదు. సూపర్ సిక్స్ సూపర్ అని గోబెల్స్ ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారు. బాబు పాలనలో ప్రతీ అంశంలోనూ మోసమే కనిపిస్తుంది. మోసానికి ప్యాంట్, షర్టు వేస్తే అది చంద్రబాబు. బాధ్యత గల పదవిలో ఉండి బాబు అబద్ధాలు ఆడుతున్నారు. ప్రతీ దాంట్లో చంద్రబాబు మోసాలే కనిపిస్తున్నాయి. అప్పుల్లో చంద్రబాబుది ఆల్టైమ్ రికార్డు. కానీ, ప్రజలకు మాత్రం సంక్షేమ పథకాలు లేవు. ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు. దోచుకో.. పంచుకో.. తినుకో అన్నట్టుగా బాబు పాలన ఉంది. కోవిడ్ వంటి సంక్షోభం లోనూ మేము మేనిఫెస్టో అమలు చేశాం. మా మేనిఫెస్టోలో 99 శాతం హామీలు నెరవేర్చాం. చంద్రబాబుకు మాత్రం మేనిఫెస్టో అంటే చిత్తు కాగితం. ఎన్నికలకు ముందు బాండ్లు ఇచ్చి మరీ ప్రజలను మోసం చేశారు. అప్పులు తెచ్చిన డబ్బు అంతా ఎక్కడికి పోతుంది?. ఎన్నికల హామీల్లో భాగంగా ఇప్పటికీ నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావనే చేయలేదు. నెలకు 3000 చొప్పున ఏడాదికి 36000 ఇస్తామన్నారు. కానీ, మూడు బడ్జెట్లో పెట్టింది మాత్రం సున్నా. నిరుద్యోగులకు రూ.21,600 కోట్లు బకాయి పడ్డారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం ఇదే తొలిసారి కాదు. ప్రతీ మహిళలకు నెలకు 1500 ఇస్తానన్నాడు.. ఏమైంది? అని ప్రశ్నించారు. 18-60ఏళ్ల లోపు మహిళలు కోటి 80 లక్షల మంది ఉన్నారు. ఈ మూడేళ్లలో మహిళలకు 97వేల 200 కోట్లు బకాయి పడ్డారు. ఇప్పటి వరకు ప్రతీ మహిళకు రూ.54వేలు చంద్రబాబు బకాయి ఉన్నారు’ అని చెప్పుకొచ్చారు. 2014 కల్లా అప్పులు రూ.లక్షా 47వేల 717 కోట్లు. చంద్రబాబు దిగిపోయే నాటికి మూడు లక్షల 90వేల 247 కోట్లు. మేము ఐదేళ్లలో చేసిన అప్పులు మూడు లక్షల 31వేల 671 కోట్లు. కానీ, చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల్లో చేసిన అప్పులు మూడు లక్షల 17వేల 448 కోట్లు. కూటమి అప్పులను చంద్రబాబు పారదర్శకంగా చూపించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు 35వేల కోట్లు బకాయిలున్నాయి. జీతాలు పెంచకుండా ఉద్యోగులతో గేమ్ ఆడుతున్నారు’ అంటూ విమర్శలు చేశారు. -
కొలంబో పోయి మ్యాచ్ చూడాలా? టీవీలో కనపడదా?
-
దేశంలోనే 22 స్థానంలో ఏపీ... దూసుకుపోతుంది అంటా..! ఎవరి చెవిలో పువ్వు
-
పబ్లిసిటీ పీక్.. పెర్ఫామెన్స్ వీక్..! ఏపీ బడ్జెట్పై YS జగన్ రియాక్షన్
-
లోకేష్.. జల్సాల కోసం ప్రత్యేక విమానాలా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ జల్సాలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. వీరంతా ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని అన్నారు. క్రికెట్ మ్యాచ్ చూడటానికి మంత్రి లోకేష్.. కొలంబోకు వెళ్లాలా? అని ప్రశ్నించారు. రాష్ట్రం అప్పులతో దివాళా తీస్తుంటే వీరు మాత్రం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో ఎంజాయ్ చేస్తున్నారని విమర్శలు చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబుకు ఒక ప్రత్యేక విమానం, హెలికాప్టర్. మంత్రి నారా లోకేష్కు కూడా ప్రత్యేక విమానం, హెలికాప్టర్. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కూడా ఒక ప్రత్యేక విమానం, హెలికాప్టర్. సీఎం కొడుకు లోకేష్ ఒకపూట విజయవాడలో ఉంటే మరోపూట హైదరాబాద్లో ఉంటాడు. క్రికెట్ మ్యాచ్ కోసం కొలంబో వెళ్లాడు. ఉదయమే మళ్లీ విజయవాడకు వచ్చాడు. వీరంతా ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారు.చంద్రబాబు తీరు కుక్క తోక వంకర లాంటిది. దేశంలో బాధ్యాతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఎవరైనా జల్సాలు చేశారా?. టీవీల్లో చూస్తే మ్యాచ్ కనపడదా?. నేను కూడా టీవీలోనే మ్యాచ్ చూశాను. రాష్ట్రం అప్పులతో దివాళా తీస్తుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం డబ్బులను వృథా చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం రాష్ట్రం దూసుకుపోతోందని చెబుతున్నారు. చంద్రబాబు చెప్పేవి అన్ని అబద్ధాలే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఏపీ బడ్జెట్లో తప్పుడు లెక్కలు, చంద్రబాబు భజనే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో మూడు బడ్జెట్ల్లో ప్రజలకు చంద్రబాబు చేసిన మేలు ఏంటి? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. ఈ బడ్జెట్లో కూడా పచ్చి అబద్దాలు, తప్పుడు లెక్కలు, చంద్రబాబు భజనే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. స్టేట్ రెవెన్యూ పురోగతిలో దేశంలో 23 రాష్ట్రాల్లో ఏపీ 22వ స్థానంలో ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు అని ఘాటు విమర్శలు చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘చంద్రబాబు.. ప్రజలకు కూడా వరుసగా వెన్నుపోటు పొడుస్తున్నారు. సూపర్ సిక్స్, సెవెన్ కూడా గాలికి ఎగిరిపోయాయి. చంద్రబాబు పబ్లిసిటీ పీక్.. పర్ఫామెన్స్ వీక్. తప్పుడు లెక్కలతో తన డప్పు తాను కొట్టుకుంటున్నాడు. గ్రోత్ రేట్ పెరిగితే.. తలసరి ఆదాయం కూడా పెరగాలి కదా?. తలసరి ఆదాయం పెరిగితే కొనుగోళ్లు కూడా పెరిగుండాలి కదా?. కొనుగోలు శక్తి పెరిగితే ప్రభుత్వ ఆదాయం కూడా పెరగాలి కదా?. 2024-25లో లక్షా 19వేల 927 కోట్లు ఆదాయం వస్తుందన్నారు. కానీ, వచ్చిన ఆదాయం 94వేల 937 కోట్లు మాత్రమే. పది నెలల కాలంలో రాష్ట్ర ఆదాయం రూ.75వేల 964 కోట్లు. పెరుగుదల కేవలం 4.25 శాతం మాత్రమే. చంద్రబాబు చెప్పేవన్నీ గారడీ లెక్కలే. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. ఈ బడ్జెట్లో కూడా పచ్చి అబద్దాలు, తప్పుడు లెక్కలు, చంద్రబాబు భజనే కనిపిస్తుంది. చంద్రబాబు మూడు బడ్జెట్ల్లో ప్రజలకు చేసిందేమిటి?. 2026-27కు లక్షా 37వేల 320 కోట్లు ఆదాయం వస్తుందంటున్నారు. ఇప్పటి కన్నా 45 శాతం అధికంగా చూపిస్తున్నారు. ఇది సాధ్యమా?. స్టేట్ రెవెన్యూ పురోగతిలో ఏపీ 22వ స్థానంలో ఉంది. దేశంలో చివరి నుంచి రెండో స్థానంలో ఏపీ ఉంది. చంద్రబాబు అసమర్థతకు ఇది నిదర్శనం. ఆదాయంలో కేంద్రం పురోగతి 9.64 శాతం ఉంటే ఏపీ పురోగతి మాత్రం 1.97 శాతం మాత్రమే. జీడీపీ, జీఎస్డీపీపై చంద్రబాబు చెప్పేవన్నీ తప్పుడు లెక్కలే. చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి ఆదాయాలు రావడం లేదు. మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో తగ్గుతున్నాయి. రాష్ట్ర ఆదాయాలు బాబు అండ్ కో జేబుల్లోకి వెళ్తున్నాయి’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
Watch Live: వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్
-
నేడు తాడేపల్లిలో YS జగన్ ప్రెస్ మీట్
-
నేడు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం మీడియా సమా వేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై వైఎస్ జగన్ మాట్లాడే అవకాశం ఉంది. -
రేపు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ రేపు(గురువారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై వైఎస్ జగన్ మాట్లాడే అవకాశం ఉంది. -
ఇవాళ అద్భుతమైన రోజు.. క్రైస్తవులు, ముస్లింలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
-
తలసిల రఘురాం తండ్రికి వైఎస్ జగన్ నివాళులు
-
క్రైస్తవులు, ముస్లింలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
తాడేపల్లి,సాక్షి: క్రైస్తవులు, ముస్లింలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. క్రైస్తవులకు ఆరాధ్యమైన లెంట్, ముస్లింల పవిత్ర రంజాన్ నెల ఈరోజే ప్రారంభం కావటంపై హర్షం. ఈరోజు అద్భుతమైన ఆధ్యాత్మిక సమానత్వానికి ఇది నిదర్శనం. అందరూ సుఖ సంతోషాలు వర్ధిల్లాలి. ఉపవాసాలు, ప్రార్ధనలు, దానధర్మాలతో పండుగలను జరుపుకోవాలి’ అని పేర్కొన్నారు. Today marks a beautiful spiritual coincidence as our Christian brothers & sisters begin the holy season of #Lent and our Muslim brothers & sisters begin the sacred month of #Ramadan.May this period of fasting, prayer, and self-reflection bring peace, health, and prosperity to…— YS Jagan Mohan Reddy (@ysjagan) February 18, 2026 -
ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ని పరామర్శించిన వైఎస్ జగన్
సాక్షి,విజయవాడ : ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఇవాళ ఉదయం రఘురామ్ తండ్రి చంద్రశేఖరరావు కన్నుమూశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ స్వయంగా తలశిల రఘురామ్ ఇంటికి వెళ్లి, ఆయన తండ్రి చంద్రశేఖరరావు భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం రఘురామ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
తలశిల రఘురాం తండ్రి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ తండ్రి తలశిల చంద్రశేఖరరావు మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం వైఎస్ జగన్.. విజయవాడ గొల్లపూడిలోని తలశిల రఘురామ్ నివాసానికి వెళ్లి చంద్రశేఖరరావు భౌతిక కాయానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
ఇకనైనా కళ్లు తెరువు..! చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
-
చంద్రబాబూ ఇకనైనా మేలుకో! : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘మదనపల్లె పరిధిలో ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి జరిపి, ఆపై హత్యచేసి, నీటి డ్రమ్ములో కుక్కిన దారుణమైన ఘటన మీకు, మీ ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా?’ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. బాలిక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు కాపాడలేకపోయారని నిలదీశారు. ఇకనైనా మేలుకుని తక్షణమే శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టి మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించి.. వారి ప్రాణాలు కాపాడటంపై దృష్టి పెట్టాలని చంద్రబాబుకు హితవు పలికారు. ఈ మేరకు సోమవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. ‘నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రిలో తొమ్మిదేళ్ల గిరిజన బాలిక, వైఎస్సార్ కడప జిల్లా మైలవరం మండలం ఎ.కంబాలదిన్నెలో మూడేళ్ల బాలిక, తిరుపతి జిల్లా వడమాలపేటలో మూడున్నరేళ్ల చిన్నారి లైంగిక దాడికి గురై, ఆపై హత్యకు గురయ్యారు. ఇలా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక బాలికలు, మహిళలపై ఎన్నో దారుణమైన ఘటనలు జరిగాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ ఘటనలను తేలిగ్గా తీసుకుందనేది వాస్తవమన్నారు. ఎల్లో మీడియాలో హడావుడి ప్రకటనలు చేయడం, అనంతరం ఆ విషయాన్ని వదిలేయడం సహజంగా మారిందన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే, ప్రశ్నించిన వారు మాజీ మంత్రులైనా వారి ఇళ్లమీద పోలీసులను వాడుకుని ఒక వ్యూహంతో దాడులు చేయించి, ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు హత్యాయత్నాలు చేయించడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో బాలికలు, మహిళలకు రక్షణ కల్పించడంపై చంద్రబాబుకు లేదని మండిపడ్డారు. శాంతిభద్రతలపై హోం మంత్రి బాధ్యత వహించరని, చంద్రబాబు కుమారుడు ఆయన శాఖలను నీరుగారుస్తూ.. అందరి శాఖల్లో వేలుపెడతారని విమర్శించారు. ఏ మంత్రీ దేనికీ బాధ్యత వహించరన్నారు. ‘ముఖ్యమంత్రిగా మీకు ప్రచారం తప్ప మరేమీ పట్టదు. సొంత జేబులు నింపుకోవడం, పబ్లిసిటీ చేసుకోవడమే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నవారి పనిగా మారిపోయింది. మరి ఇలాంటి దారుణాలపై ఎవరు దృష్టిపెడతారు?’ అని చంద్రబాబును ప్రశ్నించారు. ‘చంద్రబాబు సృష్టించిన పొలిటికల్ గవర్నెన్స్తో, రెడ్బుక్ రాజ్యాంగంతో పోలీసు సహా వ్యవస్థలను కలుషితం చేస్తే ఇక లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది? ఎలా బతుకుతుంది? చిన్నారులకు, మహిళలకు రక్షణ ఎక్కడ నుంచి లభిస్తుంది? మీ పాలనా వైఫల్యాలకు, అసమర్థతకు అభం శుభం తెలియని బాలికలు, మహిళలు బలైపోవాలా? ప్రతిరోజూ భయంతో బతకాలా? పైగా అన్యాయం జరిగిందని ఎవరైనా పోలీస్స్టేషన్కు వెళ్తే, బాధితులపైనే ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా జైళ్లకు పంపుతున్నారు’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం రంగాపురంలో ఓ టీడీపీ నాయకుడు మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేస్తే కేసు కట్టి అరెస్టు చేయాల్సిన పోలీసులు మూడు రోజులు స్టేషన్ చుట్టూ తిప్పి, చివరకు టీడీపీ నేతల ఒత్తిడితో తమపైనే హత్యాయత్నం కేసు పెట్టి జైళ్లకు పంపారని ఆ బాలిక కుటుంబ సభ్యులు వాపోతున్నారని వెల్లడించారు. ఈ లెక్కన రాష్ట్రంలో ఎవరికి న్యాయం జరుగుతుందని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.Shame on you, @ncbn garu!మదనపల్లి జిల్లా నీరుగట్టువారిపల్లిలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారంచేసి, ఆపై హత్యచేసి, డ్రమ్ములో కుక్కిన దారుణమైన ఘటన మీకు, మీ ప్రభుత్వానికి సిగ్గు చేటు కాదా. బాలిక కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఎందుకు ఆ చిన్నారిని కాపాడలేకపోయారు? నంద్యాల జిల్లా… pic.twitter.com/QcR3jyWo0I— YS Jagan Mohan Reddy (@ysjagan) February 17, 2026 -
JEE టాపర్స్ కు YS జగన్ అభినందనలు
-
జేఈఈ టాపర్స్కు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి,తాడేపల్లి: జేఈఈ పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించి టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కఠినమైన పోటీ పరీక్ష అయిన జేఈఈలో ప్రతిభ కనబరిచి ఉన్నత ర్యాంకులు సాధించడం విద్యార్థుల ప్రతిభ, తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకత్వానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా వారికి మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు.రాష్ట్రానికి కీర్తి తీసుకువచ్చిన ఈ ప్రతిభావంతులైన విద్యార్థులు భవిష్యత్తులో దేశ అభివృద్ధికి కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తూ, వారి విద్యాభ్యాసం, భవిష్యత్తు ప్రయాణం విజయవంతంగా కొనసాగాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్ర యువత ఇలాగే ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు -
KCRకు YS జగన్ జన్మదిన శుభాకాంక్షలు
-
కేసీఆర్కు వైఎస్ జగన్ బర్త్ డే విషెస్
సాక్షి,తాడేపల్లి: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో జీవించాలంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Heartiest birthday greetings to former CM Telangana, Shri K. Chandrashekar Rao Garu. Praying for your health, peace, and long life. pic.twitter.com/KLHCpcZEGx— YS Jagan Mohan Reddy (@ysjagan) February 17, 2026 -
తిరుమల పవిత్రతను పెంచిన YS జగన్
-
ఐలాపురం వెంకయ్య మృతిపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
తాడేపల్లి : ప్రముఖ బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఇలాపురం వెంకయ్య మృతపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఐలాపురం వెంకయ్య ప్రజలకు, సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. వారి మరణం కుటుంబ సభ్యులకు మాత్రమే కాక సమాజానికే తీరని లోటన్నారు. వెంకయ్య ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని కోరుకుంటూ, వెంకయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఇలాపురం వెంకయ్య.. ప్రముఖ బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ, శనివారం (ఫిబ్రవరి 14)న మరణించారు. ఆయన మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. విజయవాడలో ఆయన వ్యాపార, రాజకీయ, సామాజిక సేవా రంగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. -
సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా YS జగన్ నివాళులు
-
సేవాలాల్ మహారాజ్కి వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: సేవాలాల్ మహారాజ్కి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘బంజారా ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతుడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్. సమాజ సేవే ఉన్నతమైన ధర్మమని చాటి చెప్పిన ఆ మహనీయుడి ఆశయాలు నేటి తరానికి ఆదర్శనీయం. నేడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.బంజారా ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతుడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్. సమాజ సేవే ఉన్నతమైన ధర్మమని చాటి చెప్పిన ఆ మహనీయుడి ఆశయాలు నేటి తరానికి ఆదర్శనీయం. నేడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/Ri9SX9FW7V— YS Jagan Mohan Reddy (@ysjagan) February 15, 2026 -
మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్
-
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘పరమశివుడి లింగోద్భవానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండగ.. పరమభక్తికి నిదర్శనం. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఆచరించే ఉపవాసం, జాగరణ నిష్టాగరిష్టతను చాటుతాయి’ అని వైఎస్ జగన్ అన్నారు.ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మల్లన్న స్వామివారి ఆలయం కొలువై ఉన్న పవిత్ర ప్రదేశం మన రాష్ట్రమని అభివరి్ణంచారు. మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం, జాగరణ చేసే భక్తులు భక్తి శ్రద్ధలతో శివార్చన, పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించిన వైఎస్ జగన్.. రాష్ట్ర ప్రజలందరిపై ఆ పరమశివుడి అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు.‘‘నియమ నిష్టలు, భక్తి శ్రద్ధలు, జాగరణతో పరమశివుడిని ఆరాధించే ఈ పవిత్ర మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ కూడా చేశారు. ‘‘ఆ మల్లికార్జునుడి ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఓం నమః శివాయ!’’ అని వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.నియమ నిష్టలు, భక్తి శ్రద్ధలు, జాగరణతో పరమశివుడిని ఆరాధించే ఈ పవిత్ర మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఆ మల్లికార్జునుడి ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.ఓం నమః శివాయ !#Mahashivratri— YS Jagan Mohan Reddy (@ysjagan) February 15, 2026 -
'భృతి' లేదు.. గతి లేదు
దేశానికి ఆయువుపట్టు యువశక్తి. ఏపీలో ఉండే యువతను ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తా. పరిశ్రమలు తెస్తా. ఉద్యోగాలు ఇస్తా. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. యువతకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తా. ఇప్పుడు చెప్పండి యువతను నిర్వీర్యం చేసిన పార్టీ ఏదీ? మిమ్మల్ని ఆదుకునే పార్టీ ఏదీ?.. – మే 28, 2023న రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడులో చంద్రబాబు దగాకోరు మాటలుటీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తికావస్తోంది. ముచ్చటగా మూడో బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయినా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. పరిశ్రమలూ తేలేదు. నిరుద్యోగ భృతి ఊసేలేదు. జాబ్ క్యాలెండర్ అడ్రస్సే లేదు. నోటిఫికేషన్లకు అసలే దిక్కులేదు. ‘‘ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. రికార్డు చేసుకో.. డేటు, టైము రాసుకో.. జగన్లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను.’’ – 2024 ఫిబ్రవరి 13న యువగళం సభలో మంత్రి నారా లోకేశ్ బీరాలుసాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు మరోసారి నిరుద్యోగ యువతను నిండా ముంచేసింది. ముచ్చటగా మూడో బడ్జెట్లోనూ మొండి చెయ్యి చూపించింది. ఎన్నికల సమయంలో అధికార పీఠం కోసం నిరుద్యోగ యువతను నమ్మించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లు నయ వంచనకు గురి చేశారు. ఆయువుపట్టుపై దెబ్బకొట్టారు. తాజాగా 2026–27 బడ్జెట్లోనూ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ‘సూపర్ సిక్స్లో.. బాబుమార్క్’ దగాకోరు రాజకీయాన్ని ప్రదర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మూడు వార్షిక బడ్జెట్లలోనూ నిరుద్యోగుల ఊసే లేకుండా చేశారు. ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు, లేకుంటే ఉద్యోగం వచ్చే వరకు ప్రతి ఒక్కరికీ నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని అటకెక్కించేశారు. రెండేళ్ల చంద్రబాబు సర్కారు ఒక్కో నిరుద్యోగికి ఏడాదికి రూ.36 వేల చొప్పున రెండేళ్లలో రూ.72 వేలు ఇవ్వకుండా మోసం చేసింది. ఇలా 20 లక్షల మందికి చూస్తే దాదాపు రెండేళ్లలో రూ.14,400 కోట్లు బకాయిపడింది. ఈ ఏడాది బడ్జెట్లో అసలు నిరుద్యోగ భృతి ప్రస్తావన లేకపోవడంతో మరో రూ.7,200 కోట్ల చెల్లింపులకు ఎగనామం పెట్టింది. అంటే, చంద్రబాబు ఎన్నికల హామీల్లో భాగంగా నిరుద్యోగులకు రూ.21,600 కోట్లు ఇవ్వకుండా మోసానికి పాల్పడ్డారని స్పష్టమవుతోంది.ఇంకెంతకాలం ఈ మోసం బాబూ!2014 ఎన్నికల ముందు నిరుద్యోగులను బుట్టలో వేసుకుని రూ.2 వేలు నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి, నాలుగున్నరేళ్లకుపైగా ఆ ఊసే ఎత్తేలేదు. 2017–18లో రూ.500 కోట్లు కేటాయించినా.. పైసా కూడా ఖర్చు చేయలేదు. నిరుద్యోగ భృతి ఇచ్చే వారి సంఖ్యను తొలుత 12 లక్షలు అని చెప్పి, చివరికి 2.10 లక్షల మందే అర్హులన్నారు. తీరా 1.62 లక్షల మందికే ఇస్తామని, ఈ–కెవైసీ లింక్ పెట్టారు. చివరకు అందులోనూ కొంత మందికే నిరుద్యోగ భృతి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు మొత్తానికి బరితెగించి ఇవ్వను పొమ్మని నిరుద్యోగులను బెదిరిస్తున్నారు. బాబు పాలనలో ఉద్యోగాల భర్తీ ఊసే లేదుబాబు పాలనలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై వివాదాలు సృష్టించడం, వాటిని అడ్డంపెట్టుకుని భర్తీ నిలిపివేయడం పరిపాటి. ఈసారీ అదే సూత్రాన్ని సర్కారు పాటిస్తోంది. గతంలో జారీ అయిన నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్న దాదాపు 10 లక్షల మంది అభ్యర్థుల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడుతోంది. దాదాపు 21 నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి 2024 డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఇచ్చిన నోటఫికేషన్లలో 19 నోటిఫికేషన్ల ఫలితాలు పెండింగ్లో ఉన్నాయి. కొత్తగా 150 గ్రూప్–1 పోస్టులు సృష్టిస్తున్నట్టు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో పేర్కొంది. ఇప్పటికే ఇచ్చిన గ్రూప్–1 నోటిఫికేషన్లో పోస్టులు భర్తీ చేయకుండా, ఆయా శాఖల్లో కేడర్ ఖాళీలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోకుండా 150 పోస్టులు, మరో 4,300 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తామనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ జగన్ హయాంలో ఉద్యోగాల విప్లవం » వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో ఉద్యోగాల విప్లవం సృష్టించారు. » గ్రామ/వార్డు సచివాలయాలను ప్రవేశపెట్టి 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలు కొత్తగా కల్పించారు. 2.66 లక్షల వలంటీర్లను గత ప్రభుత్వంలో నియమించారు. » ఆప్కాస్ ద్వారా 96వేల ఉద్యోగాలు భర్తీ చేశారు. » ఆర్టీసీ విలీనం ద్వారా 58వేల ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేశారు. » మొత్తం ఐదేళ్లలో 6,31,310 ఉద్యోగాలిచ్చారు. » చంద్రబాబు కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు విడుదల చేసిన 2023–24 సామాజిక ఆర్థిక సర్వేలో పేర్కొన్న ప్రకారమే.. లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో 1.02 లక్షల మందికి , ఎంఎస్ఎంఈ రంగంలో 32,79,970 మందికి వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో ఉద్యోగాలు ఇచ్చినట్లు స్పష్టంగా ఉంది. » గవర్నమెంట్, లార్డ్ అండ్ మెగా, ఎంఎంఎస్ఈ సెక్టార్లో 40,13,552 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. -
ప్రజలందరిపై పరమశివుడి అనుగ్రహం ఉండాలి
సాక్షి, అమరావతి: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘పరమశివుడి లింగోద్భవానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండగ.. పరమభక్తికి నిదర్శనం. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఆచరించే ఉపవాసం, జాగరణ నిష్టాగరిష్టతను చాటుతాయి’ అని వైఎస్ జగన్ అన్నారు. 'ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మల్లన్న స్వామివారి ఆలయం కొలువై ఉన్న పవిత్ర ప్రదేశం మన రాష్ట్రమని అభివరి్ణంచారు. మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం, జాగరణ చేసే భక్తులు భక్తి శ్రద్ధలతో శివార్చన, పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించిన వైఎస్ జగన్.. రాష్ట్ర ప్రజలందరిపై ఆ పరమశివుడి అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు. -
ఎనిమిది లక్షల పింఛన్లకు కోత?
సాక్షి, అమరావతి: బాబు సర్కార్ బడ్జెట్ ప్రకారం 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది లక్షల పింఛన్లకు కోత పడే పరిస్థితి నెలకొంది. గత 20 నెలలుగా గొప్పగా ప్రచారం చేసుకుంటున్న పింఛన్ల పథకానికీ ప్రభుత్వం బడ్జెట్లో తగిన నిధులు కేటాయించకపోవడం దీనికి కారణం. 2026 ఫిబ్రవరిలో ప్రభుత్వం పింఛన్ లబ్ధిదారులకు రూ.2,632.04 కోట్లు (రూ. 2,724.09 కోట్లు పంపిణీ చేస్తామని ముందు ప్రకటించింది) పంపిణీ చేసింది. ఈ లెక్కన ఏడాదికి రూ. 31,584 కోట్లు నిధుల అవసరం ఉంటుంది. తాజా బడ్జెట్లో కేవలం 27,719 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే అవసరానికన్నా 4 వేల కోట్లు తక్కువ. దీంతో ఇప్పుడు పింఛన్లు తీసుకుంటున్న లబ్ధిదారుల సంఖ్య ఇకపై 8 లక్షలు తగ్గితేనే ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులు సరిపోతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 50 ఏళ్లకే పింఛన్.. ‘హామీకే సరి’ఎన్నికలప్పుడు చంద్రబాబు ఇచ్చిన ‘50 ఏళ్లకే పింఛన్’ హామీ.. కేవలం ప్రకటనలకే పరిమితమని బడ్జెట్ కేటాయింపులు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం 60 ఏళ్లు దాటిన వారు వృద్ధాప్య పింఛన్లకు అర్హులు. అయితే చంద్రబాబు ఎన్నికల ముందు ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్లు అన్న హమీని ప్రకటించారు. తాజా కేటాయింపులు చూస్తే ఈ హామీ అమలు లేనట్లేనని తేలిపోయింది. కొత్త పింఛన్లకు ఆన్లైన్ ప్రక్రియ నిలిపివేత» చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత 20 నెలల్లో 60 ఏళ్లు నిండిన నిరుపేదలకు, వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు కాకపోగా, కనీసం పింఛన్కు దరఖాస్తు చేసుకునే అవకాశమూ లేకుండా పోయింది.» కొత్త పింఛన్ల మంజూరు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియ నిలిచిపోయింది. » గత జగన్ ప్రభుత్వ హయాంలో అర్హులు ఏడాదిలో ఏ రోజైన తమ ఊరిలోని గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండేది. » ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని గ్రామ,వార్డు సచివాలయాల్లో ఆ సేవలు నిలిచిపోయాయి. సచివాలయాల్లో గానీ, మండల కార్యాలయాల్లో గానీ నేరుగా దరఖాస్తు అందజేయాలన్నా వీలుకాని పరిస్థితి. » 2024 జనవరి ఆరంభంలోనూ అప్పటి ప్రభుత్వం అర్హులైన అవ్వాతాతలకు కొత్త పింఛన్లు మంజూరు చేసింది. » ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వరకు సైతం ఆన్లైన్ వెబ్పోర్టల్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త పింఛన్ల మంజూరు దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. » అప్పట్లో ప్రభుత్వానికి అందిన రెండున్నర లక్షల మంది పింఛన్ దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పటికే ఐదున్నర లక్షల పింఛన్లు కోతవైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇవ్వగా.. చంద్రబాబు ప్రభుత్వం వాటిలో ఇప్పటికే ఐదున్నర లక్షలకు పైగా కోతవేసింది. జగన్ ప్రభుత్వంలో దేశంలో మరే రాష్ట్రంలో లేనట్టుగా అత్యధికంగా 66,34,742 మంది లబ్ధిదారులు పింఛన్ పొందారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో ఈ సంఖ్య ప్రతి నెలా తగ్గుతూనే ఉంది. ఈ ఫిబ్రవరిలో పంపిణీ జరిగిన 60.19 లక్షలు చూస్తే, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఏకంగా ఐదున్నర లక్షల దాకా పింఛన్ల సంఖ్య తగ్గిపోయినట్టు అర్థమవుతోంది. లక్ష వరకు దివ్యాంగుల పింఛన్లు కోత పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘రీ వెరిఫికేషన్’ నిర్వహిస్తోందన్న విమర్శలున్నాయి. -
అణగారిన వర్గాల ఆశలకు ప్రతీక దామోదరం సంజీవయ్య : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: అణగారిన వర్గాల ఆశలకు ప్రతీకగా నిలిచిన నాయకుడు, దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు.ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ..‘పేదల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య గారు. ఆ మహనీయుడి సేవలను స్మరించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా నివాళులు’ అని పేర్కొన్నారు. అణగారిన వర్గాల ఆశలకు ప్రతీకగా నిలిచిన నాయకుడు, దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు. పేదల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ఆయన. ఆ మహనీయుడి సేవలను స్మరించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/BLmsad1bHQ— YS Jagan Mohan Reddy (@ysjagan) February 14, 2026 -
20 నెలల్లో కొత్తగా ఒక్క పింఛన్ ఇవ్వలేదు
సాక్షి, అమరావతి: అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ల విషయంలోనూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దగా అసెంబ్లీ సాక్షిగా బయటపడింది. కొత్తవి ఇవ్వక పోగా, ఉన్న పింఛన్లలో కూడా కోత విధిస్తున్న తీరును తప్పు పట్టిన ప్రతిపక్షంపై దారుణంగా విరుచుకు పడిన చంద్రబాబు కూటమి.. చివరకు దిగొచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇరవై నెలల్లో కొత్తవారికి ఒక్కరికి కూడా పింఛను మంజూరు చేయలేదని అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే శుక్రవారం శాసన సభలో వెల్లడించారు. అసెంబ్లీలో శుక్రవారం జరిగిన ప్రశ్నోత్తరాల్లో పలువురు సభ్యులు మాట్లాడుతూ కొత్తగా పింఛన్లు ఇవ్వడంలేదని, దీనివల్ల క్షేత్రస్థాయిలో బాధితులు నిలదీస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఒక్కరికి కూడా పింఛన్ ఇవ్వలేదని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కుండబద్దలు కొట్టారు. త్వరగా కొత్త పింఛన్లు ఇవ్వాలని కోరారు. మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, సంప్రదాయ చర్మకారుల్లో పింఛన్ పొందుతూ మరణించిన వారి భార్యలకు వెంటనే పింఛన్ ఇవ్వాలని నవంబర్ 2024న స్పౌజ్ ఆప్షన్ ఇచ్చామని మంత్రి చెప్పగా.. ఎక్కడా ఇది అమలు కావడంలేదని సభ్యులు స్పష్టం చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్లు ఇవ్వడానికి వెళ్లినప్పుడు పింఛన్ రాని వారి నుంచి దాడి ఎక్కువగా ఉంటోందని ఉప సభాపతి రఘురామకృష్ణరాజు చెప్పారు. ఈ సమస్య చాలా తీవ్రంగా ఉందన్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ 2024 సెప్టెంబర్కు ముందు భర్తలను కోల్పోయిన మహిళలు పింఛన్ రావట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రజాదర్బార్ వినతుల్లో ఎక్కువగా ఇవే వస్తున్నాయన్నారు. దీనిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ.. ఆర్టీజీఎస్ ద్వారా సర్వే చేస్తే 3 లక్షల మంది గతంలో పింఛన్ తీసుకున్న వ్యక్తులు చనిపోతే వారి భార్యలకు పింఛన్ రావట్లేదని తేలిందని అన్నారు. వీరిలో 1.10 లక్షల మంది అర్హులుగా గుర్తించామని, త్వరలోనే వారికి పింఛన్లు మంజూరుకు చర్యలు చేపడతామన్నారు.భూ సమస్యల అర్జీలన్నీ పరిష్కరించామని చెప్పొద్దుఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూ సంబంధిత అర్జీలు లక్షల్లో పేరుకుపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు అధికార పార్టీ సభ్యులు ధ్వజమెత్తారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలన్నీ పరిష్కరించామని చెప్పడం సరికాదని ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ప్రజలు సమస్యలు పరిష్కారం కాక చెప్పులరిగేలా తిరుగుతున్నారని చెప్పారు. భూ వివాదాలకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. రెవెన్యూ సిబ్బంది కుమ్మకై భూములు కబ్జా చేసి వేరే వాళ్లకు మ్యూటేషన్లు చేస్తున్నారని, సర్వేల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. అర్జీల పరిష్కారానికి ఓ విధానమంటూ లేదని ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో 14.42 లక్షల ఫిర్యాదులొస్తే వాటిలో 8.90 లక్షలు రెవెన్యూకు సంబంధించినవేనని మంత్రి అనగాని బదులిచ్చారు. రికార్డులు ట్యాంపరింగ్ చేసే వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నందున సీఎం సమక్షంలో రాష్ట్రస్థాయిలో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేస్తే కొన్ని సమస్యలైనా పరిష్కారమవుతాయని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. సరైన సదుపాయాలు లేక మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారని, దీనికి చెక్ పెట్టేందుకు తీర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రశ్నోత్తరాలలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ.. గుజరాత్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రతి 10–15 కిలోమీటర్లకు ఫిషింగ్ హార్బర్, జెట్టీ, ఫిష్ల్యాండింగ్ సెంటర్, పోర్టులలో ఏదో ఒకటి ఉంటుందని, మన రాష్ట్రంలో సువిశాల సముద్ర తీరం ఉన్నప్పటికీ ఈ తరహా సౌకర్యాలు లేవన్నారు. సామాన్యుడికి దొరికేదంతా కల్తీ ఆహారమే..ఆహారంలో కల్తీ ఎక్కువగా ఉందని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు. దీనిపై మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఆహార కల్తీని అడ్డుకునేందుకు తమ వద్ద తగినంత సిబ్బంది లేరని చెప్పారు. 723 మంది సిబ్బందికిగాను 144 మంది మాత్రమే ఉన్నారని, 577 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.పింఛన్లను 39 లక్షల నుంచి 66.34 లక్షలకు పెంచిన వైఎస్ జగన్2019 ఎన్నికలకు నెలల ముందు కూడా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నెలనెలా పింఛన్లు ఇచ్చింది 39 లక్షల మందికే. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెంచారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛను అందించారు. అర్హులు గ్రామ, వార్డు సచివాలయాల్లో లేదా వలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకొనేందుకు ప్రత్యేక పోర్టల్ నిరంతరం పనిచేసేది. అర్హులకు ఎప్పటికప్పుడు పింఛన్లు మంజూరు చేశారు. దీంతో వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో పింఛన్ లబ్ధిదారుల సంఖ్య 66.34 లక్షలకు పెరిగింది. 2024లో చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పింఛన్ల సంఖ్య తగ్గిపోయింది. ఈ నెల (ఫిబ్రవరి) 1న జరిగిన పింఛన్ల పంపిణీలో 60,96,108 మందికే ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఈ 20 నెలల్లో కొత్తగా ఒక్కరికి కూడా పింఛను ఇవ్వకపోగా, 5 లక్షలకు పైగా పింఛన్లు తగ్గిపోవడం గమనార్హం. కొత్త పింఛన్ల మంజూరు పూర్తిగా నిలిచిపోయింది. కనీసం అర్హులు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఆన్లైన్ పోర్టల్ నిలిచిపోయింది. దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లలోనూ కోత విధించి, రకరకాల వైద్య పరీక్షల పేరుతో వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ అని హామీ ఇచ్చిన చంద్రబాబు.. దానినీ అమలు చేయకుండా ఆ వర్గాలను కూడా వంచించారు. పైపెచ్చు పింఛన్లు తగ్గింపు, కొత్తగా పింఛన్లు మంజూరు చేయకపోవడంపై ప్రశ్నించిన విపక్ష నేతలపై చంద్రబాబు, ఆయన కూటమి నేతలు విరుచుకు పడుతుండటం గమనార్హం. -
మంత్రి లోకేష్కు బొత్స సవాల్.. దద్దరిల్లిన మండలి..
సాక్షి, విజయవాడ: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు శాసన మండలిలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై వైఎస్సార్సీపీ సభ్యులు.. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బకాయిలు ఎందుకు చెల్లించడంలేదని సభ్యులు నిలదీశారు. దీంతో, వైఎస్సార్సీపీ సభ్యులకు సమాధానం చెప్పలేక మంత్రులు నారా లోకేష్, డోలా బాల వీరాంజనేయులు ఎదురుదాడికి దిగారు.ఈ క్రమంలో మంత్రి లోకేష్.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాలుగు వేల కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు. స్కూల్స్లో మౌళిక సదుపాయాలు లేవని.. కూటమి ప్రభుత్వంలో సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లోకేష్కు దమ్ముంటే బకాయిలు ఉన్నట్టు నిరూపించాలని బొత్స సవాల్ విసిరారు. గత టీడీపీ పాలనలో పాఠశాలను పట్టించుకున్న పరిస్థితే లేదన్నారు. దీంతో, మంత్రి లోకేష సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోయారు.అనంతరం, మండలిలో బొత్స మాట్లాడుతూ..‘మేం మీలాగా ఈనాడు, ఎన్టీఆర్ భవన్ లెక్కలు చెప్పడం లేదు. విద్యావ్యవస్థను ఈ ప్రభుత్వం భ్రష్టుపట్టించింది. ఈ ప్రభుత్వంలో విద్యావ్యవస్థ మనుగడ సాగిస్తుందని ప్రజలకు విశ్వాసం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్ మెంట్ రెండు వాయిదాలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. నేను రికార్డుల్లో లెక్కల ప్రకారమే మాట్లాడుతున్నాను. సత్యదూరమైన మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీకు వీలైతే అధికారులను పిలిపించండి.. ఇక్కడే వాస్తవాలు తేలుతాయి. ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్ని ప్రైవేట్ జూనియర్స్ కాలేజీలు వచ్చాయో లెక్కలు తీయండి. కొత్తగా ఒక్క ప్రభుత్వ జూనియర్ కాలేజీ తీసుకురాలేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వంలో 8500 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలున్నాయి. ఇప్పటికి కేవలం 700 కోట్లు మాత్రమే కూటమి ప్రభుత్వం చెల్లించింది. ఇంకా 7800 కోట్లు ఫీజు బకాయిలున్నాయి. వైఎస్ జగన్ హయాంలో ఎప్పటి బకాయిలు అప్పుడే చెల్లించారు. కూటమి ప్రభుత్వంలో బకాయిలున్నాయి పేరుకుపోయాయని అన్నారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాడు, నేడుతో రూపరేఖలు మార్చాం. అధునాతన స్థాయిలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశాం. గత ప్రభుత్వ హయాంలో మధ్యలో ఆగిపోయిన పనులు ఎక్కడివి అక్కడే ఆపివేశారు. కొత్త స్కీమ్స్ ద్వారా పెండింగ్లో ఉన్న పనులు పూర్తిచేయాలి అని డిమాండ్ చేశారు. -
మండలిని గట్టిగా వాడుకోండి.. MLCలకు జగన్ దిశానిర్దేశం
-
ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి, ప్రజా సమస్యలపై గొంతెత్తాలి... వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం
-
వైఎస్ జగన్పై ఈర్ష్య.. ‘సచివాలయం’ పదం తొలగింపు
సాక్షి, అమరావతి: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ప్రజల ముందుకు తెచ్చేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను నీరుగార్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు మరో అడుగు ముందుకేశారు. సచివాలయం అనే పదాన్ని తొలగిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామ సచివాలయాన్ని ‘స్వర్ణ గ్రామ’గా, వార్డు సచివాలయాన్ని ‘స్వర్ణ వార్డు’గా మార్పు చేశారు. అదేవిధంగా గ్రామ, వార్డు సచివాలయ శాఖను సైతం స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు శాఖగా మార్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ బిజినెస్ రూల్స్లో మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత 2019 అక్టోబర్ 2న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఆ పరిధిలోని ప్రజలకు ప్రభుత్వ సేవలన్నింటినీ వారి ఇంటి వద్దనే అందించారు. గ్రామ, వార్డు సచివాలయాల పేరును కొనసాగిస్తే వైఎస్ జగన్ గుర్తుకు వస్తారనే ఈర్ష్య తోనే చంద్రబాబు సర్కారు పేర్లను మార్చిందనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం పేరు మార్చినప్పటికీ ప్రజలందరూ గ్రామ, వార్డు సచివాలయాలనే పిలుస్తారని, పేరు మార్చినంత సులభంగా ప్రజల మనసుల నుంచి ఆ ముద్రను తొలగించలేరని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేశారనేది రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేశాయి. చంద్రబాబు గత ప్రభుత్వం పెట్టిన పేర్లను రద్దు చేయడం లేదా మార్పు చేయడం తప్ప ఆ పథకాలను అమలు చేయడం లేదనే విషయం ప్రజలు గుర్తించారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి: వైఎస్ జగన్
ఎన్నికలప్పుడు ఇంటింటికీ ఇచ్చిన హామీలతో కూడిన బాండ్ల గురించి ప్రశ్నించే వారిపై దాడులు, తప్పుడు కేసులు.. అన్ని రంగాలూ తిరోగమనం.. విద్యార్థులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావట్లేదు.. కూటమి ప్రభుత్వం స్కామ్ల మయంగా మారింది.. ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడీ సాగుతోంది.. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొత్త నినాదం వినిపిస్తోంది. అదే ‘క్యాషూ.. సూట్ కేసూ.. రాజేషు.. లోకేషు..’ అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ అంశాలన్నింటిపైనా సభలో గట్టిగా గొంతు వినిపించాలి. గట్టిగా పోరాడాలి. – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: శాసనసభలో ప్రజల తరఫున మన గొంతు వినిపించకూడదని ప్రభుత్వం కుట్ర చేస్తోందని, అందుకే ఏకైక ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కౌన్సిల్ (శాసన మండలి)లో మనకు మంచి సంఖ్యా బలం ఉందని, ప్రజా సమస్యలపై గొంతెత్తి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. ‘అందరూ యుద్ధంలో ఉన్నారు. నా కంటే మీకే ఇంకా బాగా తెలుసు. అందుకే మీరు కూడా సమర్థవంతంగా పోరాడతారు. మనకు శాసనసభలో బలం తక్కువ. అక్కడ మన గొంతు వినపడకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. సభలో ఉన్న ఏకైక ప్రతిపక్షం వైఎస్సార్సీపీ మాత్రమే. అయినా ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదు. ఎందుకంటే, మనకు ఆ గుర్తింపును ఇస్తే, విపక్ష నేతకు కూడా సీఎంకు ఎంత సమయం ఇస్తారో దాదాపుగా అంతే సమయం మాట్లాడే అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టే, మన పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యలపై గొంతెత్తలేం కాబట్టి, ఇక్కడ మీడియాతో మాట్లాడుతున్నాం. ఆధారాలతో సహా, అన్నీ వివరిస్తున్నాం’ అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి మండలిలో గట్టిగా నిలదీద్దాంకౌన్సిల్లో మనకు బలం ఉంది. కాబట్టి మనకు మాట్లాడే అవకాశం వస్తుంది. మనకు మైక్ ఇస్తారు కాబట్టి, ప్రజల సమస్యలను గట్టిగా వినిపించే వీలుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీకు తెలుసు. సబ్జెక్టుల వారీగా పూర్తి అవగాహన పెంచుకోండి. అప్పుడే మనం గట్టిగా మాట్లాడగలం. దేనికైనా మంచి ప్రిపరేషన్ అవసరం. అవగాహన పెంచుకుంటే బాగా మాట్లాడగలుగుతాం. ఏ అంశంపై మాట్లాడినా తగిన ఆధారాలు, సాక్ష్యాలు చూపి మాట్లాడాలి. అప్పుడే మన గొంతు బలంగా పోతుంది. లడ్డూ వ్యవహారంపై ప్రశ్నించడాన్ని బాబు తట్టుకోలేకపోతున్నారు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు ఒక అబద్ధాన్ని çసృష్టించి దానికి రెక్కలు కట్టారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకర్రెడ్డిలపై దాడులు కానీ, కాకాణి గోవర్ధన్రెడ్డిపై అక్రమ కేసులు.. ఇవన్నీ తిరుమల లడ్డూ వ్యవహారంలో ప్రశ్నించడాన్ని తట్టుకోలేక చంద్రబాబు చేసినవే. చివరకు చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని మనం గుళ్లలో పూజలు చేసినా, చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ఏకంగా భౌతిక దాడులు చేస్తున్నారు. ఒక అబద్ధం సృష్టించి, దానికి రెక్కలు కట్టి ప్రచారం చేయడం తొలిసారి చూస్తున్నాం. అసలు కల్తీ నెయ్యి సరఫరాకు, వైఎస్సార్సీపీకి ఏమాత్రం సంబంధం లేదు. టీటీడీలో నెయ్యి సరఫరాకు ఒక పక్కా విధానంటీటీడీలో నెయ్యి సేకరణకు ఒక నిర్ధిష్టమైన పటిష్ట విధానం ఉంది. నెయ్యి తెచ్చిన ట్యాంకర్లు కేంద్ర ప్రభుత్వం అక్రిడేటెడ్ ల్యాబ్ నుంచి సర్టిఫికెట్ తీసుకురావాలి. అలా వచ్చిన ట్యాంకర్లోని నెయ్యిని మళ్లీ టీటీడీ కూడా పరీక్షిస్తుంది. ఆ రిపోర్టు కూడా పాజిటివ్గా ఉంటేనే లోపలికి పంపిస్తారు. ఇదే పద్ధతిలో నాణ్యత లేక మన హయాంలో 18 సార్లు ట్యాంకర్లు వెనక్కు పంపాం. అంతకు ముందు చంద్రబాబు హయాంలో కూడా 2014–19 మధ్య 15 ట్యాంకర్లు వెనక్కు పంపారు. మరి ఇలాంటి పద్ధతి ఉన్నప్పటికీ కూడా దొడ్డిదారిన రిజెక్ట్ చేసినవి, తిరిగి టీటీడీకి వచ్చాయంటే, దానికి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే కదా? మరి వీటన్నింటినీ మన పార్టీకి, మన ప్రభుత్వ కాలానికి ఆపాదించి రోజూ బురద చల్లుతున్నారు. వాస్తవానికి సీబీఐ చార్జిషీటులో అభియోగాలు ఎదుర్కొంటున్న కంపెనీలే 2014–19 మధ్య కూడా నెయ్యిని సరఫరా చేశాయి. ప్రీమియర్ డెయిరీ 2016, 2017, 2018లో కూడా నెయ్యి సరఫరా చేసింది. కానీ, కేవలం మన ప్రభుత్వానికి ఆపాదించి కుట్రలు చేస్తున్నారు.హామీలన్నీ గాలికి..సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారు. ఇవన్నీ అమలు చేస్తామంటూ ఎన్నికలప్పుడు ఇంటింటికీ బాండ్లు ఇచ్చారు. అప్పుడు చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? దారుణంగా మోసాలు చేస్తున్నారు. వాటి గురించి ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. అక్రమ కేసులు పెడుతూ పోలీస్స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. మొత్తం వ్యవస్థలన్నీ నీరుగారిపోయాయి. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలు తిరోగమనంలో పయనిస్తున్నాయి. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం యూరియా కూడా దొరకని పరిస్థితి. ఉచిత పంటల బీమాను ఎత్తివేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పొదుపు సంఘాలన్నీ ఢమాల్ అంటున్నాయి. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. కూటమి ప్రభుత్వం స్కామ్ల మయంగా మారింది. ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. రూ.5 వేల కోట్ల విలువైన 54 ఎకరాల భూమిని గీతమ్ వర్సిటీకి ఇచ్చేశారు. ఏ ముఖ్యమంత్రీ తన సొంత బంధువులకు ఇలా ఇచ్చుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొత్త నినాదం వినిపిస్తోంది. అదే ‘క్యాషు.. సూట్కేసు.. రాజేష్.. లోకేష్..’ అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ అంశాలన్నింటిపైనా సభలో గట్టిగా గొంతు వినిపించాలి. గట్టిగా పోరాడాలి. చిత్తశుద్ధితో కష్టపడి పని చేయండి. కళ్లు మూసి తెరిచేలోపు మూడేళ్లు గడుస్తాయి. వచ్చేది మన ప్రభుత్వమే. ఇప్పుడు కష్టపడి పని చేస్తున్న వారందరికీ, తగిన గుర్తింపు ఉంటుంది. పనితీరు ఆధారంగా మీకు మీ పదవులు తిరిగి వస్తాయి. అలాగే ఇంతకన్నా మంచి పదవులు కూడా దక్కే అవకాశం ఉంది.’ఈ పాపం చంద్రబాబుదే⇒ లడ్డూ వ్యవహారానికి సంబంధించిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే. లెంపలేసుకోవాల్సిందీ చంద్రబాబే. ఒకసారి జరిగిన తీరు చూస్తే, రాష్ట్రంలో 2024 మార్చి 16న ఎన్నికల కోడ్ వస్తే, మే 13న పోలింగ్ జరిగింది. మే 15న టీటీడీలో నెయ్యి సరఫరాకు సంబంధించిన టెండర్లు ఓకే చేసి, ఏఆర్ డెయిరీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వం మారింది. చంద్రబాబు సీఎం అయిన తర్వాతనే నెయ్యి సరఫరా ప్రారంభమైంది.⇒ జూన్ 12న మొదటి ట్యాంకర్ వచ్చింది. ఆ తర్వాత జూన్ 20, 25వ తేదీల్లో, జూలై 4న మొత్తం నాలుగు ట్యాంకర్లలో ఏఆర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. అవన్నీ ల్యాబ్ పరీక్షల్లో పాస్ అయ్యాయి. ఆ తర్వాత జూలై 6, 12వ తేదీల్లో వచ్చిన నాలుగు ట్యాంకర్ల నెయ్యి నాణ్యత పరీక్షలో ఫెయిల్ అయింది. జూలై 23న ల్యాబ్ రిపోర్టు రావడంతో, జూలై 25న వాటిని వెనక్కు పంపించారు.⇒ అయితే అవే ట్యాంకర్లను జూలై 27న శ్రీకాళహస్తిలో వైష్ణవి డెయిరీకి సమీపంలో పార్క్ చేశారు. ఆ తర్వాత అవే ట్యాంకర్లను మరో డెయిరీ పేరుతో ఆగస్టు, సెప్టెంబర్లో తిరిగి టీటీడీకి పంపారు. ఆ తర్వాతే సీఎం హోదాలో చంద్రబాబు లడ్డూపై తీవ్ర ఆరోపణలు చేశారు. ⇒ వెనక్కు పంపిన ట్యాంకర్లు తిరిగి టీటీడీలోకి వస్తే.. జరిగిన పరిణామాలు, జరిగిన తేదీలు చూస్తే మొత్తం ఇవన్నీ కూడా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతే జరిగాయి. మరి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే కదా? ⇒ నిజానికి 2014ృ19 మధ్య ప్రీమియర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. ఆ కంపెనీ 2019లో సరఫరా ఆపేసింది. కానీ, దాన్ని కేవలం మన ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు. అంతకు ముందు సరఫరాకు సంబంధించి ప్రస్తావించడం లేదు. అసలు 2014-2019 మధ్య సరఫరా అయిన నెయ్యిపై కూడా విచారణ జరగాలి. ⇒ ఇప్పుడు చెప్పండి.. ఎవరి హయాంలో ఆ ట్యాంకర్లు వచ్చాయి? ఎవరి హయాంలో టీటీడీ వాటిని అడ్డుకుంది? ఎవరి హయాంలో నెయ్యి శాంపిళ్లు తీసుకున్నారు? వెనక్కు పంపిన ట్యాంకర్లను తిరిగి తీసుకున్నది ఎవరి హయాంలో? ఇవన్నీ కూడా టీడీపీ హయాంలోనే జరిగాయి. ఇదంతా సీబీఐ సిట్ చార్జిషీట్లోనే ఉంది. మరి దీన్నంతటినీ వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఆపాదించడం దుర్మార్గం కాదా? -
మండలిలో మంచి సంఖ్యా బలం ఉంది: వైఎస్ జగన్
-
మా ప్రభుత్వ హయాంలో ఎలాంటి తప్పు జరగలేదు: లేళ్ల అప్పిరెడ్డి
-
Tadepalli: చిన్నారికి YS జగన్ అక్షరాభ్యాసం
-
చిన్నారికి వైఎస్ జగన్ అక్షరాభ్యాసం
సాక్షి, తాడేపల్లి: చిన్నారికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్షరాభ్యాసం చేశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ను కలిసి తమ కుమారుడికి అక్షరాభ్యాసం చేయాలని శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం దండు గోపాలపురం వైఎస్సార్సీపీ కార్యకర్త లెనిన్ వివేక్, కుటుంబ సభ్యులు కోరారు.తల్లిదండ్రుల కోరిక మేరకు వారి కుమారుడు భార్గవ్ ప్రకాష్కు అక్షరాభ్యాసం చేసి.. ఆశీస్సులు అందజేశారు. తమ కుమారుడికి వైఎస్ జగన్ చేతుల మీదుగా అక్షరాభ్యాసం జరిగినందుకు సంతోషం వ్యక్తం చేసిన వివేక్ కుటుంబ సభ్యులు.. గతంలో తమ కుమార్తెకు కూడా జగన్ అన్నప్రాసన చేశారని లెనిన్ కుటుంబం గుర్తుచేసుకున్నారు. -
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో YS జగన్ కీలక సమావేశం
-
‘అసెంబ్లీలో మన గొంతు వినిపించకూడదని కుట్ర’
సాక్షి,తాడేపల్లి: శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన మండలి సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..:అందరూ యుద్దంలో ఉన్నారు. నా కంటే మీకే ఇంకా బాగా తెలుసు. అందుకే మీరు కూడా బెటర్గా పోరాడతారు. మనకు అసెంబ్లీలో బలం తక్కువ. అక్కడ మన గొంతు వినపడకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. సభలో ఉన్న ఏకైక ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అయినా ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదు. ఎందుకంటే, మనకు ఆ గుర్తింపును ఇస్తే, విపక్షనేతకు కూడా సీఎంకు ఎంత సమయం ఇస్తారో దాదాపుగా సమయం మాట్లాడే అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టే, మన పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యలపై గొంతెత్తలేం కాబట్టి, ఇక్కడ మీడియాతో మాట్లాడుతున్నాం. ఆధారాలతో సహా, అన్నీ వివరిస్తున్నాం.మండలిలో బలం ఉంది కాబట్టి..:కౌన్సిల్లో మనకు బలం ఉంది. కాబట్టి మనకు మాట్లాడే అవకాశం వస్తుంది. మనకు మైక్ ఇస్తారు కాబట్టి, ప్రజల సమస్యలను గట్టిగా వినిపించే వీలుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీకు తెలుసు. సబ్జెక్టుల వారీగా పూర్తి అవగాహన పెంచుకొండి. అప్పుడే మనం గట్టిగా మాట్లాడగలం. దేనికైనా మంచి ప్రిపరేషన్ అవసరం. అవగాహన పెంచుకుంటే బాగా మాట్లాడగలుగుతాం. ఏ అంశంపై మాట్లాడినా తగిన ఆధారాలు, సాక్ష్యాలు చూపి మాట్లాడాలి. అప్పుడే మన గొంతు బలంగా పోతుంది.లడ్డూ వ్యవహారంపై ప్రశ్నించడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు:అంబటి రాంబాబు, జోగిరమేష్ ఇళ్లపై దాడులు, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకర్రెడ్డిపై దాడులు కానీ, కాకాణి గోవర్థన్రెడ్డిపై అక్రమ కేసులు.. ఇవన్నీ కూడా లడ్డూ వ్యవహారంలో ప్రశ్నించడాన్ని తట్టుకోలేక చంద్రబాబు చేసినవే. చివరకు చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని మనం గుళ్లలో పూజలు చేసినా, చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ఏకంగా భౌతిక దాడులు చేస్తున్నారు. ఒక అబద్ధం సష్టించి, దానికి రెక్కలు కట్టి ప్రచారం చేయడం తొలిసారి చూస్తున్నాం. అసలు కల్తీ నెయ్యి సరఫరాకు, వైయస్సార్సీపీకి ఏమాత్రం సంబంధం లేదు.చేసిన తప్పులకు క్షమాపణ చెప్పాల్సింది చంద్రబాబే:లడ్డూ వ్యవహారానికి సంబంధించిన పరిణామాలను ఒకసారి చూస్తే.. ఈ వ్యవహారంలో ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే. లెంపలేసుకోవాల్సిందీ చంద్రబాబే. ఒకసారి జరిగిన తీరు చూస్తే, రాష్ట్రంలో మార్చి 16, 2024న ఎన్నికల కోడ్ వస్తే, మే 13న, పోలింగ్ జరిగింది. మే 15న టీటీడీలో నెయ్యి సరఫరాకు సంబంధించిన టెండర్లు ఓకే చేసి, ఏఆర్ డెయిరీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. జూన్ 4, ఎన్నికల ఫలితాలు వచ్చాయి, ప్రభుత్వం మారింది. చంద్రబాబు సీఎం అయిన తర్వాతనే నెయ్యి సరఫరా ప్రారంభమైంది. జూన్ 12, 20, 25 జూలై 4న మొత్తం నాలుగు ట్యాంకర్లను ఏఆర్ డెయిరీ సరఫరా చేసింది. అవన్నీ ల్యాబ్ పరీక్షల్లో పాస్ అయ్యాయి.ఆ తర్వాత జూలై 6, 12 తేదీల్లో వచ్చిన నాలుగు ట్యాంకర్లు నెయ్యి నాణ్యత పరీక్షలో ఫెయిల్ కావడంతో వెనక్కి పంపారు. జూలై 23న ల్యాబ్ రిపోర్టు రావడంతో, జూలై 25న నాలుగు ట్యాంకర్లను వెనక్కు పంపించారు. అయితే ఆ ట్యాంకర్లను జూలై 27న శ్రీకాళహస్తిలో వైష్ణవి డెయిరీకి సమీపంలో పార్క్ చేశారు. ఆ తర్వాత అవే ట్యాంకర్లు మరో డెయిరీ పేరుతో ఆగస్టు, సెప్టెంబరులో తిరిగి టీటీడీకి పంపారు. అలా వచ్చిన నెయ్యిని వాడారని, సీబీఐ ఛార్జ్షీట్లో కూడా రాసింది.వెనక్కి పంపిన ట్యాంకర్లు తిరిగి టీటీడీలోకి వస్తే, జరిగిన పరిణామాలు, జరిగిన తేదీలు చూస్తే మొత్తం ఇవన్నీకూడా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతనే జరిగాయి. మరి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే కదా? నిజానికి 2014–19 మధ్య ప్రీమియర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. ఆ కంపెనీ 2019లో సరఫరా ఆపేసింది. కానీ, దాన్ని కేవలం మన ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు. అంతకు ముందు సరఫరాకు సంబంధించి ప్రస్తావించడం లేదు.టీటీడీలో నెయ్యి సప్లైపై ఒక పక్కా విధానం:టీటీడీలో నెయ్యి సేకరణకు టీటీడీలో ఒక పటిష్ట విధానం ఉంది. నెయ్యి తెచ్చిన ట్యాంకర్లు కేంద్ర ప్రభుత్వం అక్రిడిటెడ్ ల్యాబ్ నుంచి సర్టిఫికెట్ తీసుకురావాలి. అలా వచ్చిన ట్యాంకర్లోని నెయ్యిని మళ్లీ టీటీడీ కూడా పరీక్షిస్తుంది. ఆ రిపోర్టు కూడా పాజిటివ్గా ఉంటేనే, లోపలికి పంపిస్తారు. ఇదే పద్ధతిలో నాణ్యత లేక మన హయాంలో 18 సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపాం. అంతకు ముందు చంద్రబాబు హయాంలో కూడా 2014–19 మధ్య 15 ట్యాంకర్లు వెనక్కి పంపారు. మరి ఇలాంటి పద్ధతి ఉన్నప్పటికీ కూడా దొడ్డిదారిన రిజెక్ట్ చేసినవి, తిరిగి టీటీడీకి వచ్చాయంటేం, దానికి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే కదా? మరి వీటన్నింటినీ మన పార్టీకి, మన ప్రభుత్వ కాలానికి ఆపాదించి రోజూ బురదజల్లుతున్నారు.2014–19 మధ్య కూడా అభియోగాలు ఎదుర్కొంటున్న కంపెనీలు నెయ్యి సరఫరా:సీబీఐ ఛార్జిషీటులో అభియోగాలు ఎదుర్కొంటున్న కంపెనీలు 2014–19 మధ్య కూడా సప్లై చేశాయి. ప్రీమియర్ డెయిరీ 2016, 2017, 2018 లో కూడా నెయ్యిని సప్లై చేసింది. కానీ, కేవలం మన ప్రభుత్వానికి ఆపాదించి కుట్రలు చేస్తున్నారు.కూటమి ప్రభుత్వం.. స్కామ్ల మయం:మరోవైపు కూటమి ప్రభుత్వం స్కామ్ల మయంగా మారింది. ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడి చేస్తున్నారు. రూ.5 వేల కోట్ల విలువైన భూమి 54 ఎకరాలు గీతమ్ వర్సిటీకి ఇచ్చేశారు. ఏ ముఖ్యమంత్రీ తన సొంత బంధువులకు ఎవరూ ఇలా ఇచ్చుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొత్త నినాదం వినిపిస్తోంది. అదే ‘క్యాష్.. సూట్కేసు.. రాజేష్.. లోకేష్.’. ఇది బాగా వినిపిస్తోంది.ఈ అంశాలన్నింటిపైనా సభలో గట్టిగా గొంతు వినిపించాలి. పోరాడాలి. చిత్తశుద్ధితో కష్టపడి పని చేయండి. కళ్లు మూసి తెరిచేలోపు మూడేళ్లు గడుస్తాయి. వచ్చేది మన ప్రభుత్వమే. ఇప్పుడు కష్టపడి పని చేస్తున్న వారందరికీ, తగిన గుర్తింపు ఉంటుంది. పనితీరు ఆధారంగా మీకు మీ పదవులు తిరిగి వస్తాయి కూడా. అలాగే ఇంతకన్నా మంచి పదవులు కూడా దక్కే అవకాశం మీకు ఉందని వైఎస్ జగన్ వివరించారు. -
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో YS జగన్ సమావేశం
-
నేడు వైఎస్సార్సీపీ శాసనసభా పక్ష సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు పార్టీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. మధ్యాహ్నం మూడు గంటలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై దిశానిర్దేశం చేస్తారని పేర్కొంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చించనున్నట్లు పార్టీ తెలిపింది. -
ఉన్నత విద్యకు ఉరి!
భారతదేశ చరిత్రలో ఇచ్చిన మాట నిలుపుకుని, హామీలు నెరవేర్చామని చెప్పుకునే వారు కొందరు.. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండానే అన్నీ చేసేశామని చెప్పుకునే వారు ఇంకొందరు.. ఇందులో మొదటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి అయితే, రెండో వ్యక్తి చంద్రబాబునాయుడు.. అయితే తండ్రిని మించిన తనయుడిగా మంత్రి లోకేశ్ మరో నాలుగడుగులు ముందుకేసి ఉత్తుత్తి ఆదేశాలతో ప్రజలను మభ్యపెడుతుండటం విస్తుగొలుపుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వో) ఇచ్చి.. అంటే బిల్లు పెట్టుకోవచ్చని ఇచ్చే అత్యంత సాధారణ ఉత్తర్వు. దీనిపై పండుగ చేసుకోండంటూ ప్రచారం చేసుకోవడం విస్తుగొలుపుతోంది. రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులందరినీ తామే ఉద్దరిస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవడం లోకేశ్కే చెల్లింది. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సకాలంలో ఫీజు డబ్బులు చెల్లించడం తమ బాధ్యత అంటూ ‘ఎక్స్’ వేదికగా చాటుకోవడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుందని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ ఉన్నత విద్యకు ఉరితాడు బిగిస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుల్లో నక్కజిత్తులు ప్రదర్శిస్తూ విద్యార్థులను నిలువునా మోసం చేస్తోంది. కొండలా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తీర్చలేక కాగితాలపై కుయుక్తులు పన్నుతోంది. ఏ ప్రభుత్వంలోనైనా సంక్షేమ పథకాలకు నిధులు ఇచ్చాకే ప్రచారం చేసుకుంటారు. కానీ, దేశ చరిత్రలో తొలిసారిగా కేవలం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వో) ఇచ్చి, పండగ చేసుకోమని చెప్పిన ఏకైక సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు విద్యా శాఖ మంత్రి లోకేశ్ మాత్రమేనని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థుల్లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. స్వేచ్ఛగా కళాశాలలకు వెళ్లలేని దుస్థితిలో చదువు దినదిన గండంగా మారిపోయింది. ఒకవైపు ప్రభుత్వం ఫీజులు చెల్లించట్లేదు. మరోవైపు ఫీజులు కట్టకుంటే కళాశాలలు పరీక్షలు రాయనివ్వట్లేదు. ఒకవేళ ఎలాగోలా పరీక్షలు రాసినా, సర్టిఫికెట్లు విడుదల చేయట్లేదు. గత రెండేళ్లుగా ఉన్నత విద్యా రంగంలో ఇదే తంతు నడుస్తోంది. తమ బిడ్డల చదువుల కోసం ఎందరో పేదింటి తల్లులు పుస్తెలు తాకట్టుపెట్టి, ఫీజులు కట్టిన ఉదంతాలు కోకొల్లలు. ఇలాంటి తరుణంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై విద్యార్థులను, కళాశాలలను మభ్య పెడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరికొన్ని నెలల్లో ఈ విద్యా సంవత్సరం కూడా ముగుస్తుండగా.. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూ.6,300 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. ఇందులో ఇచ్చింది కేవలం రూ.700 కోట్లే. ఇంకా రూ.5,600 కోట్లు బకాయిలున్నాయి. పైగా పేదింటి విద్యార్థులకు హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీల కింద చెల్లించాల్సిన రూ.2,200 కోట్ల ఊసే ఎత్తట్లేదు. మొత్తంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉన్నత విద్యలో రూ.7,800 కోట్లు బకాయిలు ఉంటే.. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంగళవారం రాత్రి రూ.1,200 కోట్లు విడుదల చేయొచ్చంటూ బీఆర్వో ఇచ్చి విద్యా వ్యవస్థను ఉద్ధరించినట్టు ప్రచారం చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెప్పిందొకటి.. చేస్తున్నది మరొకటి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేయడం మొదలు పెట్టింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో కరోనా విలయ తాండవం చేసినప్పటికీ, సమర్థవంతంగా ఐదేళ్లూ ఈ పథకాన్ని కొనసాగిస్తే.. చంద్రబాబు మాత్రం పాతరేసేశారు. అంత్యంత పారదర్శకంగా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు జమ చేసే విధానానికి స్వస్తి పలికి, కళాశాలల ఖాతాల్లో నేరుగా వేస్తామని నమ్మబలికారు. తీరా చూస్తే 20 నెలల పాలనలో ఉన్నత విద్యా కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద అరకొర నిధులు విదిల్చి మమ అనిపించారు. పైగా షెడ్యూల్ ప్రకారం ప్రతి త్రైమాసికానికి ఇవ్వాల్సిన నిధులను ఆపేసి, ఏడాదికి రెండుసార్లు చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చి ఎగ్గొట్టారు. ఫలితంగా రూ.7,800 కోట్ల బకాయిల కొండ దర్శనమిస్తోంది. వసతి దీవెన ఎగ్గొట్టి తీరని అన్యాయం చంద్రబాబు కర్కశ పాలన పేదింటి విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దూర ప్రాంతాల నుంచి చదువుల కోసం వచ్చే విద్యార్థులు హాస్టళ్లలో జీవనం సాగిస్తుంటారు. అలాంటి విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా గత వైఎస్ జగన్ ప్రభుత్వం వసతి దీవెన పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇందులో హాస్టల్ మెయింటెనెన్స్ కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని క్రమం తప్పకుండా జమ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పథకం ఊసే ఎత్తడం లేదు. ఇప్పటిదాకా మూడు విడతలకు గాను రూ.2,200 కోట్లు బకాయిపెట్టి, విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తోంది. కాగా, అధికారమే పరమావధిగా ఎన్నికలప్పుడు చంద్రబాబు.. ప్రైవేటు కళాశాలల్లో పీజీ చేసే విద్యార్థులకు సైతం ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక వరుసగా రెండు దఫాల్లోనూ ముఖం చాటేశారు. ఇప్పుడు మూడోసారి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వచ్చినా, ఫీజు రీయింబర్స్మెంట్ అమలుపై మాత్రం నోరు మెదపట్లేదు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, సుస్థిరత దిశగా పాలన సాగించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం అప్పులు, వడ్డీల లెక్కలతో కాలం గడిపేస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ వర్సిటీలనే కాదు ప్రైవేటు విద్యా సంస్థలను సైతం నట్టేట ముంచేసే కార్యక్రమాలకు ఒడిగట్టింది. ఇప్పటికే కొండలా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఆర్థికంగా కుదేలయ్యాయి. అతికష్టంపై నెట్టుకొస్తున్న దుస్థితి. ఈ క్రమంలో తప్పించుకునేందుకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి ప్రైవేటు యాజమాన్యాలకు ఈ విద్యా సంవత్సరం చివరి వరకు మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని, అయితే అందుకయ్యే వడ్డీని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు భరించాలని ప్రతిపాదించింది. తీరా, బ్యాంకుల దగ్గరకు వెళ్లేసరికి అప్పు పుట్టక పోవడంతో ప్రభుత్వం ముఖం చాటేసింది.విశ్వవిద్యాలయాల నిధులు దారి మళ్లింపు» ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు సంస్థలతో పాటు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను తీవ్రంగా దెబ్బ తీసింది. ప్రభుత్వ వర్సిటీలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోగా, వర్సిటీ నిధులను దారిమళ్లించి వాటి మనుగడపై కోలుకోలేని దెబ్బకొట్టింది. ఉన్నత విద్యా మండలితో పాటు విశ్వవిద్యాలయాల నుంచి ఏకంగా రూ.1,200 కోట్ల వరకు నిధులు పక్కదారి పట్టించింది. వాటిని రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్కు బదిలీ చేయించి, తద్వారా ఇతర అవసరాలకు వినియోగిస్తోంది. » ఉన్నత విద్యా మండలి ఖజానా నుంచి రూ.10 కోట్ల వరకు ప్రభుత్వం వాడేసుకోవడం గమనార్హం. ఇందులో ముఖ్యంగా చినబాబు ఆ్రస్టేలియా పర్యటన సందర్భంగా ఏకంగా రూ.3.60 కోట్లు ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డుకు దారి మళ్లించేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కోవిడ్ను అధిగమించి వర్సిటీలకు నూతన జవసత్వాలు అందించే ప్రయత్నం విస్తృతంగా జరిగింది. మళ్లీ చంద్రబాబు సర్కార్ రాకతో ప్రభుత్వ వర్సిటీలకు గడ్డుకాలం దాపురించింది. నేడు అరకొర.. నాడు ఫుల్ బడ్జెట్» చంద్రబాబు ఉన్నత విద్యకు అరకొర బడ్జెట్ కేటాయించడం తప్ప ఒరగబెట్టిందేమీ లేదు. ప్రతి విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.2,800 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చుల కింద రూ.1,100 కోట్లు కలిపి రూ.3,900 కోట్లు వెచ్చించాలి. కానీ, 2025–26 బడ్జెట్లో కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే కేటాయింపులు చూపించింది. ఆ మేరకు నిధులు విడుదల చేసిందా అంటే అదీ లేదు. ఈ ఏడాది భారీగా పేరుకుపోయిన బకాయిలను తీర్చడానికి బడ్జెట్ కేటాయింపులను పెంచడంతో పాటు ఆ మేరకు విడుదల చేయాల్సి ఉంది. » వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో జగనన్న విద్యా దీవెన కింద ప్రతి త్రైమాసికానికి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు సకాలంలో విడుదల చేసింది. పైగా గత చంద్రబాబు ప్రభుత్వంలోని రూ.1,778 కోట్ల బకాయిలు సైతం చెల్లించింది. మొత్తంగా ఐదేళ్లలో రూ.12,609.68 కోట్లు క్రమం తప్పకుండా ఇచ్చింది. జగనన్న వసతి దీవెన కింద రూ.4,275.76 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో వేసింది. ఇలా మొత్తం ఐదేళ్లలో గత ప్రభుత్వం ఉన్నత విద్యపై ఏకంగా రూ.18,663.44 కోట్లు ఖర్చు చేసింది. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించి ఏప్రిల్లో పరిగణనలోకి తీసుకుని మే నెలలో నిధులు విడుదల చేయాల్సి ఉండగా, మార్చిలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రెడ్బుక్పై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదా? మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపాటు సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్లు రెడ్ బుక్ రాజ్యాంగంపై పెడుతున్న శ్రద్ధ విద్యార్థులపై చూపించట్లేదని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు రూ.7,800 కోట్లున్నా నిమ్మకు నీరెత్తి¯] ట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇతర శాఖల్లో వేలు పెట్టే లోకేశ్.. తన శాఖలో విద్యార్థుల కష్టాలను తీర్చలేని అసమర్థ మంత్రిగా నిలిచిపోయారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ప్రతి త్రైమాసికానికి ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేసి, తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసేవారన్నారు. ఫలితంగా విద్యార్థులు హాయిగా చదువుకునే వారని గుర్తు చేశారు. చంద్రబాబు సర్కార్ ఫీజులు చెల్లించక పోవడంతో కళాశాలలు విద్యార్థులను పరీక్షలకు కూడా అనుమతించట్లేదని దుయ్యబట్టారు. విజయవాడ సమీపంలోని ఎనికేపాడులోని విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ కళాశాలలో ఫార్మసీ చదువుతున్న విద్యార్థినులను ఫీజు పెండింగ్ ఉందనే కారణంతో రీసెర్చ్ రివ్యూ మీటింగ్కు అనుమతించక పోవడం దారుణం అన్నారు.బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
శాంతిభద్రతలను కాపాడండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలను కాపాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఎదుట నినదించింది. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని రంగాల్లో చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ ఎన్నికల ముందు హామీలు ఇచ్చి మోసం చేశారని మండిపడింది. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం ప్రజలూ సంతోషంగా లేరని నిప్పులు చెరిగింది. బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఉదయం ర్యాలీగా అసెంబ్లీకి చేరుకున్నారు. ‘ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు.. ప్రజల గొంతు వినిపించనివ్వరు.. ప్రతిపక్ష హోదా ఇవ్వరు.. రైతు సమస్యలు వినిపించనివ్వరు.. కుప్పకూలిన శాంతి భద్రతలపై నిలదీయనివ్వరు’ అనే నినాదంతో కూడిన బ్యానర్లతో పాటు ప్ల కార్డులను ప్రదర్శిస్తూ.. నినాదాలు చేస్తూ నాలుగో నంబర్ గేటు ద్వారా సభ్యులు సభలోకి వచ్చారు. ‘ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు.. కుప్పకూలిన శాంతి భద్రతలపై నిలదీయనివ్వరు’ అనే ప్లకార్డును వైఎస్ జగన్ స్వయంగా పట్టుకుని లోపలకు ప్రవేశించారు. వైఎస్ జగన్ తన స్థానంలో ఆశీనులవ్వగానే సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. ‘రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి.. హామీలిచ్చారు.. అమలు మరిచారు.. అర్హులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించుకోవాలి.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం..’ అని నినదిస్తూ ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్దకు వెళ్లారు. వైఎస్సార్సీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నప్పటికీ, గవర్నర్ ప్రసంగం కొనసాగింది. ఈ నేపథ్యంలో మార్షల్స్ పోడియం వద్దకు చేరుకుని వైఎస్సార్సీపీ సభ్యులు ముందుకు వెళ్లకుండా వలయంగా నిలబడ్డారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వ పని తీరును ఎండగడుతూ నినాదాలు చేశారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. -
ధైర్యంగా ఉండండి.. న్యాయ పోరాటం చేద్దాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం కొత్త నారికేళ్ళపల్లి (కేఎన్ పల్లి) వైఎస్సార్సీపీ స్ధానిక నాయకులు కలిశారు. టీడీపీ మూకలు బరితెగించి అర్ధరాత్రి తమ ఇళ్ళపై దాడి చేశారని, తలుపులు బద్దలు కొట్టి ధ్వంసం చేసి బంగారం, నగదు దోచుకున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.చుండూరు మండలం కొత్తనారికేళ్ళపల్లిలో వైఎస్సార్సీపీ బీసీ నేత, సర్పంచ్ అంగిరేకుల నాగేశ్వరరావు ఇంటిపై టీడీపీకి చెందిన రౌడీషీటర్ బాలకోటిరెడ్డి పచ్చమూకలతో కలిసి దాడిచేశాడని.. వైఎస్ జగన్కు వేమూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ వరికూటి అశోక్ బాబు వివరించారు. కేఎన్పల్లిలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులను టార్గెట్గా చేసుకుని బాలకోటిరెడ్డి తరుచూ మారణాయుధాలతో మూకుమ్మడి దాడులు చేస్తున్నాడని, గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఉన్నా తమను కాపాడడం లేదంటూ వైఎస్ జగన్ వద్ద కేఎన్ పల్లి వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, నాయకులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయంపై బాపట్ల కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినా తమ కుటుంబాలకు, ప్రాణాలకు రక్షణ కరువైందని, ప్రాణభయంతో కంటిమీద కునుకు లేకుండా జీవిస్తున్నామన్న బాధిత కుటుంబాలు. టీడీపీ ప్రభుత్వంపై నమ్మకం లేక, ఆత్మహత్యకు అనుమతివ్వాలని కలెక్టర్ కార్యాలయంలో కోరిన విషయాన్ని వైఎస్ జగన్ దృష్టికి నాయకులు తీసుకొచ్చారు. వైఎస్సార్సీపీ క్యాడర్ ఎవరూ భయపడొద్దని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చిన వైఎస్ జగన్.. టీడీపీ గూండాల దాడులు, దౌర్జన్యాలను ధీటుగా ఎదుర్కొందామని, పార్టీ లీగల్ సెల్ అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని వెల్లడించారు. వ్యవస్ధలు దిగజార్చేలా వ్యవహరిస్తున్న పోలీసుల తీరును వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుబట్టారు.వైఎస్ జగన్ను కలిసిన వారిలో గాదె శివరామిరెడ్డి (మాజీ జెడ్పీటీసీ), రఘురామిరెడ్డి (చుండూరు మండల పార్టీ అధ్యక్షుడు), అంగిరేకుల నాగేశ్వరరావు, శివమ్మ, విష్ణు, ఊరుబండి కోటేశ్వరరావు, బాలాజీ నాయక్, స్వప్న, అంగిరేకుల తిరుపతమ్మ, శ్రీను, ఉయ్యూరు రవిశంకర్రెడ్డి, మోహన్రెడ్డి (వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సభ్యుడు) ఉన్నారు. -
ప్లకార్డులతో జగన్ నిరసన
-
YSRCP నేతల నిరసనలతో మారుమోగిన అసెంబ్లీ
-
వైఎస్సార్సీపీ నిరసనలతో దద్దరిల్లిన సభ
సాక్షి, విజయవాడ: ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అయితే, గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్దాలు, అసత్యాలు ఉన్నాయని.. కూటమి ప్రభుత్వం కావాలనే గవర్నర్తో తప్పుడు ప్రసంగం చేయిస్తోందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ అరాచక పాలనను ప్రశ్నిస్తూ.. ప్రతిపక్ష నేతలు, వారి ఇళ్లపై జరుగుతున్న దాడులను సభ వేదికగా ఖండించారు. ఏపీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కూటమి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సహా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ వద్ద నిరసనలు తెలిపారు. ఫ్లకార్డులు పట్టుకుని వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కూటమి పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజల తరపున ప్రశ్నిస్తామనే కారణంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రజల తరఫున గళం విప్పేందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనన్నారు. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోందని.. రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై కచ్చితంగా గళం వినిపిస్తామన్నారు. అనంతరం, సభలో గవర్నర్ ప్రసంగంపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్దాలేనని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్తో కూడా అబద్ధాలు చెప్పించడం బాధాకరమని అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు, రాష్ట్రంలో కుప్పకూలిన శాంతి భద్రతలపై నిలదీయనివ్వరు.. అంటూ నినాదాలు చేశారు. తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం, సభ్యుల హక్కులను కాపాడాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ.. నినాదాలు తెలిపారు. ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ను గవర్నర్ చదువుతున్నారు. తన ప్రసంగంలో చదువుతున్నది వాస్తవమా కాదా అని కూడా గవర్నర్ చూడటం లేదు. 3.2 లక్షల కోట్లు అప్పులు చేసి ఎవరికిచ్చారు? అని ప్రశ్నించారు. ఈ క్రమంలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏపీలో అశాంతి, అశ్లీల నృత్యాల పాలన సాగుతోందని.. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ది లేదన్నారు. మహిళా సాధికారత కొరవడింది.. రైతులకు గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఉందన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకపోవడం వల్ల విద్యార్ధులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలపై పోరాటం కొనసాగిస్తామని అన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ పాలనా వైఫల్యాలను ఎండగడతామన్నారు. ఉద్యోగులపై ఈ ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి తెస్తోంది. ప్రభుత్వం తెచ్చే ఒత్తిడితో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఉద్యోగులకు బకాయిలు చెల్లించకుండా వేధిస్తోంది. వాలంటీర్లకు హామీలిచ్చి ఈరోజు రోడ్డున పడేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని మాటతప్పారు. ఉద్యోగాలిస్తామని మాయమాటలు చెప్పి యువతను మోసం చేశారు. దేశంలోనే గవర్నెన్స్లో ఏపీ అట్టడుగు స్థానంలో ఉందని గుర్తు చేశారు. ఇవన్నీ గవర్నర్ ప్రసంగంలో ఎందుకు చేర్చలేదని నిలదీశారు. అనంతరం, సభను వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు. -
ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించాలని YSRCP డిమాండ్
-
పాలన ‘కమ్మ’దనంపై స్వపక్షం పెదవివిరుపు!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటు వెళుతున్నాయి? రాష్ట్రంలో పాలన ‘కమ్మ’గా ఉందంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్య పొలిటికల్ ఆటంబాంబుగా మారింది. కూటమిలో తెలుగుదేశం పార్టీ, ఒక సామాజికవర్గం పెత్తనంపై వ్యతిరేకత పెరిగిపోయిందనేందుకు ఇదో సూచిక. ముఖ్యమంత్రి చంద్రబాబేమో.. కుమారుడు లోకేశ్కు పట్టం కట్టే ప్రయత్నాల్లో తలమునకలై ఉంటే.. పాలన అధ్వాన్నంగా మారిందన్న అంచనాలు బలపడుతున్నాయి. అదే సమయంలో టీడీపీ రాజకీయ కక్షసాధింపులు, తిరుపతి లడ్డూ ప్రసాదం వ్యవహారంలో చేసిన రచ్చ కూడా కూటమి భాగస్వాములు బీజేపీ, జనసేనల అసంతృప్తికి, వ్యతిరేకతకు కారణమవుతోంది. దీన్నే ఆదినారాయణ రెడ్డి తనదైన రీతిలో బయటపెట్టారు. ఇంకొంరు బీజేపీ, జనసేన ఎమ్మెల్యేల భావన కూడా ఇదే అయినప్పటికీ ఆ పార్టీల అధినేతలు చంద్రబాబు పట్ల విధేయతగా ఉండడంతో తగ్గి ఉంటున్నారు. టీడీపీలో నిజంగానే ఒక సామాజికవర్గం అధికారం చెలాయిస్తోందా? అవుననే అంటున్నారు చాలామంది. ఆది నారాయణ రెడ్డి ‘కమ్మ’గా ఉందన్న కామెంట్కు సమావేశంలో పాల్గొన్న బీజేపీ నేతలంతా చప్పట్లు కొట్టడం కూడా ఒక సంకేతమే. కమ్మ సామాజికవర్గం నాయకత్వం ఎలా ఉన్నా.... మిగిలిన వారిని కూడా కలుపుకొనిపోవాలని ఆయన సలహా ఇచ్చారు. బీజేపీ లేనిదే టీడీపీ, జనసేనలకు ఉనికి ఉండదని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు లడ్డూ ప్రసాదం అంశంలో ఎంతో కష్టపడి ప్రచారం చేస్తున్న కుట్ర థియరీ గాలి కూడా ఆదినారాయణ తీసేశారు. లడ్డూ అంశంలో వైఎస్సార్ కాంగ్రెస్దే పైచేయి అని స్పష్టం చేశారు. ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్లో ఉన్న ఆదినారాయణ రెడ్డి ఆ తరువాత టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు మంత్రివర్గ సభ్యుడు కూడా. 2019లో టీడీపీ ఓటమి తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తిరిగి ఎమ్మెల్యే అయ్యారు. పార్టీలో ఆయనకు చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరుపొందిన అనకాపల్లి ఎంపీ సీ.ఎం. రమేష్కు మధ్య వర్గపోరు కూడా సాగుతోంది. ఇదో కోణమైతే ప్రభుత్వంలో చంద్రబాబు కంటే ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్ మాటకే అధిక ప్రాధాన్యం లభిస్తోందని టీడీపీతోపాటు బీజేపీ, జనసేనల్లోనూ బలంగా నమ్ముతున్నాయి. లోకేశ్ సొంత కోటరీతో షాడో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆయా అంశాలలో అహంకార పూరితంగా ప్రవర్తిస్తూ, గిట్టని వారిపై రెడ్బుక్ ప్రయోగిస్తూ అరాచకాలు చేయిస్తున్నారని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. ఇతర పక్షాల్లోనూ ఇదే అభిప్రాయం ఉంది. చంద్రబాబు సీనియర్ నేత, ముఖ్యమంత్రి కనుక ఆయన వద్దకు వెళ్లి ఏ సమస్య అయినా మాట్లాడవచ్చు. కాని లోకేశ్ వద్దకు వెళ్లడం మిత్రపక్షాలకు అంతగా ఇష్టం ఉండదు. కాకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల రాగం ఆలపిస్తుండడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు,ఇతర నేతలు మౌనంగా ఉంటున్నారు. తాజాగా తిరుపతి జనసేన ఎమ్మెల్యే శ్రీనివాసులు లడ్డూ ప్రసాదంలో కల్తీ లేదని చెప్పడం గమనించదగిందే. అలాగే బీజేపీ నేతలపై కూడా చంద్రబాబు ఒత్తిడి చేసి తనకు అనుకూలంగా మాట్లాడాలని కోరుతున్నారు. లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ఇంత గందరగోళం చేస్తున్నా బీజేపీ కేంద్ర పెద్దలు పెద్దగా పట్టించుకోవడం లేదు.రాష్ట్ర బీజేపీ అద్యక్షుడు మాధవ్ను తన అవసరార్థం పిలిపించుకుని లడ్డూపై ఉమ్మడి సమావేశంలో పాల్గొనేలా చేశారు. ఇవన్ని చూస్తే కూటమిలో అంత సవ్యత లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. క్రెడిట్ ఉంటే చంద్రబాబు, లోకేశ్లే తీసుకుంటున్నారని, నెగిటివ్ వచ్చినప్పుడే తాము కావల్సి వస్తున్నామని మిత్రపక్షాలలో ముఖ్యంగా బీజేపీలో ఉందట. ఆదినారాయణ రెడ్డి ఇదే సంగతిని పరోక్షంగా వెల్లడించారు. మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసులు పెట్టి జైలుకు పంపడాన్ని ఆక్షేపించారని వార్తలు వచ్చాయి. అంతకుముందు తాడేపల్లి గూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు తమ పార్టీ పరిస్థితిని పూసగుచ్చినట్లు వివరించారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో కూడా అతను చేసిన కీచక పర్వం ఒక ఎత్తు అయితే, కేవలం ఒక డమ్మీగా స్థానిక టీడీపీ నేత రూపానందరెడ్డి పెత్తనంలో ఉండాల్సి రావడం కూడా గమనించవలసిన అంశం. జనసేనకు సంబంధించి కనీసం పది మంది అంతకుముందు టీడీపీలో ఉన్నవారే. చంద్రబాబు వారిని జనసేనలోకి పంపించి ఆ పార్టీ టిక్కెట్లు ఇప్పించారు. ఆ రకంగా పవన్ కళ్యాణ్ను మొదటి నుంచి బలహీనుడిగానే నిలబెట్టారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు అనేకమంది చేస్తున్న దందాలు ఉండనే ఉన్నాయి. వాటిలో జనసేన, బీజేపీలకు పెద్దగా గిట్టుబాటు కావడం లేదు. ఆ అసంతృప్తి కూడా ఉంది. రాష్ట్రంలో 95 శాతం మద్యం షాపులు, బెల్ట్ షాపులు టీడీపీ వారికే దక్కాయి. పైకి టీడీపీతో కలిసి ఉంటున్నప్పటికీ, ఈ సంగతులు తెలియని స్థితిలో మిత్రపక్షాలు ఉండవు కదా! అందులోను బీజేపీ జాతీయ పార్టీ.ఆ పార్టీ అండతోనే టీడీపీ గెలవగలిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారం, ఎన్నికల సంఘం కూటమికి అనుకూల నిర్ణయాలు చేయడం వంటివి ఎన్నికల సమయంలో కనిపించాయి. కేంద్రంలో ప్రధాని మోడీని, హోం మంత్రి అమిత్ షాలను పొగుడుతూ, రాష్ట్రంలో మాత్రం తమ పెత్తనాన్ని చంద్రబాబు సాగించుకుంటున్నారన్నది బీజేపీలో ఒక అభిప్రాయంగా ఉంది.కులపరంగా చూస్తే ఎంత కాదన్నా టీడీపీని కమ్మ సామాజికవర్గం తమ సొంత పార్టీగా భావిస్తుంటుంది.మంత్రివర్గంలో వారికి ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. పార్టీ అధిష్టానానికి సన్నిహితంగా ఉండేవారిలో ఎక్కువ మంది ఆ వర్గంవారే అంటారు. ఇతర వర్గాల వారి మాట పెద్దగా చెల్లడం లేదన్నది రాజకీయ వర్గాలలో ఉన్న అభిప్రాయం. ఇక జనసేన పార్టీ కాపు సామాజికవర్గంపై ఎక్కువగా ఆధారపడిన పార్టీ అన్నది తెలిసిందే. ఆ వర్గాన్ని ఆకర్షించడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ను ఉపయోగించుకోగలిగారు. అయినా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం లేదన్న విషయం అర్థమైన తర్వాత ఆ వర్గంలో అసంతృప్తి పెరుగుతోంది. దానికితోడు కాపు వర్గానికి జగన్ టైమ్లో లభించిన పథకాలు కూటమి ప్రభుత్వంలో రావడం లేదు. మాజీ మంత్రి, కాపు నాయకుడు అంబటి రాంబాబుపై కేసులు పెట్టి జైలుకు పంపడం, ఇంటిపైకి వెళ్లి విధ్వంసకాండ సృష్టించిన వారు టీడీపీ గూండాలైనా అందులో కూడా కమ్మ సామాజికవర్గానికి చెందిన కొందరు ముఖ్య పాత్ర పోషించారన్న ప్రచారం, అంబటిని దూషించిన ఒక కమ్మ సామాజికవర్గ మహిళపై కేసు పెట్టకపోవడంపై కూడా చర్చించుకుంటున్నారు. బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కూడా చంద్రబాబుతో ఉన్న బంధుత్వం కారణంగా అంబటినే తప్పుపట్టారని, అదే అంబటిని తీవ్రగా దూషించిన వారిని ఖండించలేదని, ఇది కుల ప్రభావమేనని కాపు సామాజికవర్గం భావిస్తోంది. అంబటి కుమార్తె మౌనిక మాట్లాడిన పద్దతి కూడా ఆ వర్గాన్ని ఆకట్టుకుంది. ఇక బీసీ నేత జోగి రమేష్ ఇంటిపై ఏకంగా పెట్రోల్ బాంబులు విసిరి నిప్పుపెట్టడం, అలా చేసిన టీడీపీ వారిపై చిన్న కేసులు పెట్టి సరిపెట్టడం బీసీ వర్గాలలో కూడా ఆందోళన కనిపించింది. దళిత వర్గాలపై ఈ ప్రభుత్వంలో జరిగినన్ని దాడులు గతంలో ఎప్పుడూ జరిగి ఉండవు. దాంతో ఆ వర్గంలో తీవ్ర అసమ్మతి ఉందని చెబుతున్నారు. ఇక రెడ్డి సామాజికవర్గానికి చెందిన పలువురు ప్రముఖులపై కక్షతో తప్పుడు కేసులు పెట్టించిన తీరుతో ఆ వర్గం కూడా టీడీపీకి దూరం అవుతోందని చెబుతున్నారు. లడ్డూ ప్రసాదం వివాదాన్ని చంద్రబాబు ప్రచారం చేస్తున్న తీరుపై బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయి. సిట్ నివేదిక వచ్చిన తర్వాత కూడా లడ్డూలో జంతుకొవ్వు, బాత్ రూమ్ కెమికల్స్ వంటివి ఉన్నాయని చంద్రబాబు, పవన్, లోకేశ్లు చెప్పడం పట్ల వారు మండిపడుతున్నారు. తమకు లడ్డూ ప్రసాదం తీసుకోవాలంటేనే బెరుకుగా ఉంటోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ చేసిన వ్యాఖ్య దీనికి నిదర్శనం. పైగా టీడీపీ వాళ్లు ఫోన్ పోన్ ఫ్రొఫెసర్ నాగేశ్వర్ను తిట్టడం, బెదిరించడం కూడా బాగా ప్రభావం చూపుతోంది. నిజానికి గత ఎన్నికల సమయంలో ఈ వర్గాలలో మెజార్టీ భాగం కూటమికే మద్దతిచ్చాయి. అయినా ప్రస్తుతం పరిస్థితి కేవలం ఒక సామాజికవర్గానికే అనుకూలంగా ఉందన్న భావన ప్రజలలో నెలకొంది. దానికి తోడు టీడీపీ పత్రికలుగా పేరొందిన మీడియా యజమానులు కూడా అదే సామాజికవర్గంగా ఉండడం, కూటమి ప్రభుత్వం చేసే అకృత్యాలకు సైతం మద్దతు ఇచ్చేలా కథనాలు రాయడం ఏపీ సమాజం గమనిస్తోంది. ఈ కారణాల రీత్యా ఆదినారాయణరెడ్డి వంటి నేతలు ఈ విషయాన్ని పరోక్షంగా చెప్పి ప్రభుత్వానికి హెచ్చరికలు పంపుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే 2014 టర్మ్లో కూడా టీడీపీ ఇలాగే ఆయా సామాజిక వర్గాలను దూరం చేసుకుంది. ఈసారి మరింత ముందుగానే ఆ పరిస్థితి తెచ్చుకుందన్న భావన వివిధ రాజకీయ పక్షాలలో నెలకొంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ప్రజల గొంతుకగా ఒక్కటైన ప్రతిపక్షం!
-
మేం ప్రతిపక్షం... మాది ప్రజాపక్షం.. అసెంబ్లీ వద్ద కదం తొక్కిన వైఎస్సార్సీపీ (ఫొటోలు)
-
Watch Live: అసెంబ్లీకి వైఎస్ జగన్
-
‘గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్దాలే.. ప్రజా వ్యతిరేకం’
ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్.. శాసనమండలి మీడియా పాయింట్ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్..గవర్నర్ ప్రసంగం పూర్తిగా నిరుత్సాహ పరిచిందిగత బడ్జెట్లో చెప్పించిన మాదిరిగానే ఈ బడ్జెట్ లోనూ అబద్ధాలు చెప్పించారురాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్తో కూడా అబద్ధాలు చెప్పించడం బాధాకరం3.2 లక్షల కోట్లు అప్పులు చేసి ఎవరికిచ్చారు?.అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసం చేశారుఏపీలో అశాంతి, అశ్లీల నృత్యాల పాలన సాగుతోందిగతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇంత చెత్తగా పాలన సాగలేదువైఎస్ జగన్ ఐదేళ్లలో సంక్షేమ పాలన అందించారుకానీ కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ది లేదుకూటమి నేతలు మహిళలను వంచిస్తున్నారుమహిళా సాధికారత కొరవడిందిరైతులకు గిట్టుబాటు ధర లేని పరిస్థితివిద్యా ప్రమాణాలు పడిపోవడం వల్ల ఆరు లక్షల మంది బడికి దూరమయ్యారుఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకపోవడం వల్ల విద్యార్ధులు తీవ్రంగా నష్టపోతున్నారుప్రభుత్వ భూములను కారుచౌకగా తమ మనుషులకు దోచిపెడుతున్నారుగీతం సంస్థకు వేల కోట్ల భూములు కట్టబెడుతున్నారుసంక్షేమ హాస్టల్స్ లో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారురాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలన్నింటినీ ఎందుకు గవర్నర్తో చదివించ లేదుప్రజల తరపున ప్రశ్నిస్తామనే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదుప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలపై మేం పోరాటం కొనసాగిస్తాంచంద్రబాబు, లోకేష్, పవన్ పాలనా వైఫల్యాలను ఎండగడతాం.ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి కామెంట్స్..సభలో గవర్నర్ మాట్లాడిందంతా ప్రజా వ్యతిరేక ప్రసంగంఈ ప్రభుత్వంలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారువాస్తవాలను పక్కన పెట్టి గవర్నర్తో అసత్యాలు చదివించారుఈ ప్రభుత్వంలో అన్ని వర్గాలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారుఉద్యోగులపై ఈ ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి తెస్తోందిప్రభుత్వం తెచ్చే ఒత్తిడితో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారుఉద్యోగులకు బకాయిలు చెల్లించకుండా వేధిస్తోందివాలంటీర్లకు హామీలిచ్చి ఈరోజు రోడ్డున పడేశారునిరుద్యోగులకు భృతి ఇస్తామన్నారు మాటతప్పారుఉద్యోగాలిస్తామని మాయమాటలు చెప్పి యువతను మోసం చేశారుదేశంలోనే గవర్నెన్స్ లో ఏపీ అట్టడుగు స్థానంలో ఉందిఏపీలో శాంతి భద్రతలు లోపించాయి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కామెంట్స్..రాష్ట్రంలో మూడు పార్టీలు ఒకవైపు ఉంటే వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన ఉందిప్రజల ఆకాంక్షలను సభలో వినిపించాలంటే ప్రతిపక్ష హోదా కావాలికానీ ప్రజల గొంతు వినిపించకుండా మూడు పార్టీలు అడ్డుపడుతున్నాయిదేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తోందిఏపీలో మాత్రం లోకేష్ రాజ్యాంగం నడుస్తోందిలోకేష్ రాజ్యాంగంలో శాంతి భద్రతలు క్షీణించాయిమాజీ మంత్రుల ఇళ్ల పై దాడులు చేస్తున్నారుమెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేశారుప్రజలకు ఇచ్చిన ఒక్క వాగ్ధానాన్ని కూడా నెరవేర్చడం లేదుఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ను గవర్నర్ చదువుతున్నారుతన ప్రసంగంలో చదువుతున్నది వాస్తవమా కాదా అని కూడా గవర్నర్ చూడటం లేదునిస్సిగ్గుగా ఈ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందిసంక్షేమం, అభివృద్ధి లేదుఈ రాష్ట్రంలో నడుస్తోంది దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యంమూడు పార్టీల నేతలు పందికొక్కుల్లా మారి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారుఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కామెంట్స్..రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీమా పార్టీకి ప్రతిపక్ష హోదా ఒక హక్కుటీడీపీ తెలుగు దొంగల పార్టీగా మారి దోచుకుంటోందిటీడీపీ దేవుళ్లను మోసం చేసే పార్టీగా మారిందిపచ్చ పార్టీ గూండాలు మాజీ మంత్రుల ఇళ్లపై పెట్రోల్ బాంబులు వేస్తున్నారుగత వైఎస్సార్సీపీ హయాంలో ఏనాడైనా ఇలా జరిగిందా?.175 నియోజకవర్గాల ప్రజల ఆకాంక్షలు సభలో ఎవరు వినిపిస్తారువైఎస్ జగన్కు సభలో మాట్లాడే హక్కు కావాలిఈ ప్రభుత్వం నియంత పోకడలు అనుసరిస్తోందిపీఏసీ ఛైర్మైన్ను కొట్టేసిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదుఏపీలో 3.2 లక్షల కోట్లు అప్పులు చేశారువిద్యార్ధులకు ఫీజు బకాయిలు చెల్లించలేదుప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనే భయంతోనే హోదా ఇవ్వడం లేదు ప్రతిపక్షహోదా వైఎస్సార్సీపీ హక్కుప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ఎక్కడా లేదుమాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేనప్పుడు టీడీపీ ఆ పాత్ర పోషిస్తుందా?ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు కామెంట్స్..గవర్నర్ ప్రసంగం అంతా అబద్ధాలు పుట్టగవర్నర్ తోనూ అబద్ధాలను పలికించారుపీఏసీ మీరే తీసుకున్నారుప్రతిపక్ష హోదా ఇవ్వరుఇక ప్రజల ఆకాంక్షలను సభలో చర్చించేవారు ఎవరు?.అప్పు చేసిన 3.2 లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయిఈ 20 నెలల్లో ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా?.మూడేళ్లు ఇదేవిధంగా పబ్బం గడుపుకుందామని చూస్తున్నారుమూడేళ్ల తర్వాత వచ్చేది మా ప్రభుత్వమేవిశాఖలో భూములు కబ్జా చేశామని చెప్పుకోవడానికి టీడీపీఈ ఎంపీకి సిగ్గులేదా?. కౌన్సిల్లో ఈ ప్రభుత్వ తప్పిదాలను ఎండగడతాంఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ కామెంట్స్..తిరుపతి లడ్డూపై తప్పుడు ప్రచారం చేశారులడ్డూలో ఎలాంటి కొవ్వు కలవలేదని సీబీఐ రిపోర్టు ఇచ్చిందిలడ్డూ అంశాన్ని డైవర్షన్ చేయడం కోసం మాజీ మంత్రులపై దాడులు చేస్తున్నారుచంద్రబాబు ఇప్పటికైనా ఇలాంటి చర్యలను మానుకోవాలిమీరు చేసే దుర్మార్గాలకు త్వరలోనే ప్రజలు మీకు బుద్ధి చెబుతారుఎమ్మెల్సీ ఇసాక్ బాషా కామెంట్స్..గవర్నర్ ప్రసంగంలో సూపర్ సిక్స్ అమలు చేశారని చెప్పారుసూపర్ సిక్స్ ఎక్కడ అమలు చేశారో సమాధానం చెప్పాలిప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారుహత్యాయత్నం చేసిన వారికి స్టేషన్ బెయిల్బాధితులకు రిమాండ్ వేయడమేనా మీ పాలనరాయలసీమకు మీ వల్ల అన్యాయం జరుగుతోంది రాబోయే బడ్జెట్ ఎంత నిస్సారంగా ఉంటుందో అర్ధమైపోయింది 👉ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా.. 👉 ఏపీ అసెంబ్లీ నుంచి వైఎస్సార్సీపీ సభ్యులు వాకౌట్.వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన..అసెంబ్లీలో వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన.గవర్నర్ ప్రసంగిస్తుండగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ సభ్యులుఏపీలో శాంతిభద్రతలు కాపాడాలని నినాదాలు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ సభ్యుల నినాదాలు.ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్. సభ్యుల హక్కులను కాపాడాలని నినాదాలు.నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే రద్దు చేయాలని డిమాండ్.వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళన, నినాదాల మధ్యే కొనసాగుతున్న గవర్నర్ ప్రసంగం. 👉 ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ 👉 ప్రారంభమైన ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు 👉 14న బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం 👉 నెలరోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం 👉 వైస్సార్సీపీకి ప్రజల పక్షాన నిలుస్తోంది: అప్పిరెడ్డి 👉 ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించకుండా చేయాలని ప్రభుత్వం కుట్రపన్నుతుంది 👉 వైస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించాలి: లేళ్ల అప్పిరెడ్డి 👉 ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని వైఎస్సార్సీపీ నేతల డిమాండ్.👉 ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అసెంబ్లీ పరిసరాల్లో వైఎస్ జగన్ నిరసన ప్రదర్శన చేపడుతున్నారు.👉వైఎస్ జగన్ కొద్ది సేపటి క్రితమే అసెంబ్లీకి చేరుకున్నారు. మరికాసేపట్లో అసెంబ్లీ సెషన్స్ ప్రారంభంకానున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి సమావేశాల్లో పాల్గొననున్నారు.👉నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమవేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు ఇరు సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హాజరు కానున్నారు. అలాగే, అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం హాజరు కానున్నారు. 👉వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో ఉదయం 10 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత సభను వాయిదా వేసి బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశం నిర్వహించి సభ ఎన్ని రోజులు జరపాలి, ఏ అంశాలపై చర్చించాలనే విషయాలు ఖరారు చేయనున్నారు.👉14న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. మార్చి 12 వరకూ సమావేశాలు జరుగుతాయని ఇప్పటికే స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. మొత్తం 19 పని దినాల్లో సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. బీఏసీ సమావేశంలో చర్చించి దీనికి ఆమోదం తెలపనున్నారు. -
అసెంబ్లీకి జగన్.. టెన్షన్ లో టీడీపీ
-
శివ భక్తులపై పోలీసుల లాఠీఛార్జ్.. వైఎస్ జగన్ ఫైర్
-
‘విజనరీ’ పాలనలో కల్పిత గణాంకాలు
‘‘11.09 శాతం భారీ జీఎస్డీపీ వృద్ధిని చూపిస్తున్న మన రాష్ట్రం... పన్ను ఆదాయాల్లో మాత్రం కేవలం 1.97 శాతం వృద్ధి సాధించడం ప్రపంచంలోని ఆర్థిక నిపుణులందరికీ ఆశ్చర్యంగా అనిపించకమానదు. ‘విజనరీ’ నాయకత్వంలో తయారు చేసిన కల్పిత గణాంకాల వల్లే ఇలాంటి అంకెలు సాధ్యమవుతాయి’’ - ‘ఎక్స్’లో వైఎస్ జగన్ ట్వీట్సాక్షి, అమరావతి: ‘పన్నుల ఆదాయం వృద్ధిలో మన రాష్ట్రం.. దేశంలో చిట్టచివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఇదీ చంద్రబాబు 22వ ర్యాంక్ విజన్..!’ అంటూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలలకు సంబంధించి కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) విడుదల చేసిన గణాంకాలను ఉటంకిస్తూ.. సీఎం చంద్రబాబు కల్పిత గణాంకాలతో చెబుతున్న అవాస్తవాలను ఎండగడుతూ.. కూటమి సర్కారు ఆర్థిక విధానాలను కడిగిపారేశారు. చంద్రబాబు నాయకత్వంలో అప్పులు, అవినీతి, రాజకీయ కక్ష సాధింపు చర్యలు, దుష్ప్రచారం చేయడం లాంటి అంశాల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి స్థానం సాధించగలిగిందంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతూ తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ మంగళవారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..ప్రచారం ఎక్కువ.. పని తక్కువ..అబద్ధాలు, మోసాలు.. ఇదీ బాబు 22వ ర్యాంక్ విజన్» రాష్ట్రం తీవ్ర ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోందనేందుకు ప్రభుత్వ ఆదాయాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కానీ చంద్రబాబునాయుడు ప్రభుత్వం కల్పిత జీఎస్డీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి) గణాంకాలతో ప్రజలను మభ్యపెట్టి, రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందనే తప్పుడు భావన కలిగిస్తోంది.» 2024–25లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 11.75 శాతం (నామినల్ జీఎస్డీపీ)గా ఉందని, జాతీయ వృద్ధిరేటు 9.8 శాతం మాత్రమేనని.. అలాగే 2025–26లో రాష్ట్ర వృద్ధి 10.75 శాతంగా ఉంటుందని, జాతీయ వృద్ధిరేటు 8.0 శాతం మాత్రమేనని చంద్రబాబు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దీని ప్రకారం 2023–24 నుంచి 2024–25 మధ్య రెండేళ్ల కాలానికి సగటు వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) 11.09 శాతంగా చూపిస్తోంది. అంతేకాదు.. వాస్తవ (రియల్) జీఎస్డీపీ వృద్ధి పరంగా ఈ ఏడాది రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో ఉందని కూడా ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇవేవీ స్వతంత్ర సంస్థలు విడుదల చేసిన గణాంకాలు కావు. ఇవి పూర్తిగా చంద్రబాబు కార్యాలయంలో తయారు చేసిన అంకెలే. వాటినే వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారు. » ఆ గణాంకాలే నిజమైతే ప్రభుత్వ ఆదాయాల్లోనూ అదే స్థాయి వృద్ధి కనిపించాలి. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి 9 నెలలకు కాగ్ గణాంకాలు చూస్తే వాస్తవ పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నాయో స్పష్టమవుతోంది. ఆశ్చర్యకరంగా రెండేళ్ల కాలంలో ప్రభుత్వ పన్ను ఆదాయాల వృద్ధి (సీఏజీఆర్) కేవలం 1.97 శాతం మాత్రమే ఉంది. 11.09 శాతం భారీ జీఎస్డీపీ వృద్ధిని చూపిస్తున్న రాష్ట్రం.. పన్ను ఆదాయాల్లో మాత్రం కేవలం 1.97 శాతం వృద్ధి సాధించడం ప్రపంచంలోని ఆర్థిక నిపుణులందరికీ ఆశ్చర్యంగా అనిపించక మానదు. ‘విజనరీ’ నాయకత్వంలో తయారుచేసిన కల్పిత గణాంకాల వల్లే ఇలాంటి అంకెలు సాధ్యమవుతాయి. » ఇంకా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి 9 నెలల పాటు 23 రాష్ట్రాల పన్నుల ఆదాయాలను కాగ్ విడుదల చేసింది. పన్ను ఆదాయాల వృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ను ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అత్యంత ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 23 రాష్ట్రాల్లో పన్ను ఆదాయాల వృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో ఉంది. అంటే చివర నుంచి రెండో స్థానంలో ఉంది. » అదే కాలంలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయాలు 9.64 శాతం పెరిగితే, ఆంధ్రప్రదేశ్ పన్ను ఆదాయాలు మాత్రం 1.97 శాతం మాత్రమే పెరిగాయి. అయినా కూడా చంద్రబాబు ప్రకారం ఆర్థిక రంగంలో ఆంధ్రప్రదేశ్ పనితీరు కేంద్ర ప్రభుత్వానికంటే మెరుగైనదట! చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఏదైనా విషయంలో మొదటి స్థానం సాధించగలదంటే... అది కేవలం ప్రభుత్వ అప్పులు, అవినీతి, రాజకీయ కక్ష సాధింపు చర్యలు, విషప్రచారం లాంటి విషయాల్లో మాత్రమే!! -
శివ భక్తులపై లాఠీచార్జి దుర్మార్గం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ పాలనలో శ్రీశైలంలో శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు విచక్షణరహితంగా లాఠీచార్జ్ చేయడం దుర్మార్గం, బాధాకరమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన రూపంలో ప్రభుత్వ యంత్రాంగం ఘోర వైఫల్యం బయటపడిందన్నారు. దురదృష్టవశాత్తూ చంద్రబాబు నీచ రాజకీయాలు పవిత్ర ఆలయాల ప్రాంగణాల్లోకే చొరబడుతున్నాయని ఎత్తిచూపారు. తిరుమల లడ్డూనూ పదే పదే వివాదాల్లోకి లాగి, రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేయడంతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని.. ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగిందని.. ఈ ధోరణి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలకూ వ్యాపిస్తోందని వివరించారు.శ్రీశైలంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడి, చివరకు పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికీ.. సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు, మౌనం వహిస్తే, బాధ్యత ఎవరు తీసుకుంటారు? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారని ‘ఎక్స్’లో తన ఖాతాలో వైఎస్ జగన్ మంగళవారం పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..‘‘ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పాలనలో శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయడం బాధాకరం. చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు వెళ్లే భక్తులు భయకంపితులవుతున్నారు. ఒకప్పుడు భక్తితో, నమ్మకంతో తీర్థయాత్రలు చేసిన భక్తులు, ఇప్పుడు ఆందోళనతో, అనిశ్చితితో ఆలయాలకు వస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబుగారి పాలనలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలు, వైఫల్యాలు అత్యంత బాధ కలిగిస్తున్నాయి. నివారించగలిగిన ఘటనలు అయినప్పటికీ, ప్రభుత్వం విఫలంకావడం వ్యవస్థలపై భక్తులకున్న విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తోంది. ఇంత జరిగినా టీడీపీ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు దారుణంగా ఉంది.కేవలం ప్రచార విన్యాసాలు, ఘటన తర్వాత జరిగే రొటీన్ సమీక్షలకే ప్రభుత్వం పరిమితమవుతోంది. జవాబుదారీతనం, బాధ్యత అన్నవి ఈ ప్రభుత్వంలో ఎక్కడా కనిపించడం లేదు. శ్రీశైలం ఆలయంలో, శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ రూపంలో ప్రభుత్వ యంత్రాంగంలో ఘోరమైన వైఫల్యం బయటపడింది. సంవత్సరాలుగా మహాశివరాత్రి సమయంలో పాదయాత్రగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఇస్తున్న సమయాన్ని ఏడు రోజులకు కుదించారు. దీనివల్ల పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులకు ముందే తెలిసినా, సరైన ఏర్పాట్లు చేయలేదు. 🚨 🚨 Hello India 👋🏻 👋🏻👋🏻Shiva Mala Dharana devotees were lathi charged by Andhra Pradesh Police under TDP governance.Devotees across Andhra Pradesh are living with growing fear when they step into temples under the TDP coalition government led by N. Chandrababu Naidu.… pic.twitter.com/kBILeAwLOY— YS Jagan Mohan Reddy (@ysjagan) February 10, 2026తాగునీరు, క్యూల నిర్వహణ, వైద్య సదుపాయాలు అన్నీ లోపించాయి. తమ పిల్లాపాపలతో ఆలయానికి వచ్చిన కుటుంబాలు గంటల తరబడి దారుణమైన పరిస్థితుల్లో వేచి చూడాల్సి వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్లకు వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారు. భక్తులకు ఉపశమనం ఇవ్వాల్సిన చోట, పోలీసులు బలప్రయోగానికి దిగారు. దర్శనానికి వచ్చిన భక్తులను లాఠీలతో కొట్టి తరిమారు. రాష్ట్రంలో తిరుపతి సహా అనేక ఆలయాల్లో గతంలో జరిగిన విషాద ఘటనల తరువాత కూడా, భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 2025లో ఆంధ్రప్రదేశ్లో ఆలయాల్లో జరిగిన విషాదాలు చూస్తే..: ⇒ తిరుపతిలో జనవరి 8, 2025న వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం క్యూలో ఉన్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో 6గురు భక్తులు మృతి చెందారు. టీటీడీ చరిత్రలో ఇలాంటి దుర్ఘటన జరగడం ఇదే తొలిసారి.⇒ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, సింహాచలంలో ఏప్రిల్ 30, 2025న చందనోత్సవం సమయంలో నూతనంగా నిర్మించిన నాసిరకం గోడ కూలిపోవడంతో ఏడుగురు భక్తులు మృతి చెందారు.⇒ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 1, 2025న కార్తీక ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందారు. ఇవికాకుండా ఆలయాల్లో అనేక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.⇒ జాగ్రత్తపడాల్సిన, తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను వరుసగా జరుగుతున్న ఘటనలు ఎత్తి చూపుతున్నప్పటికీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంలో కూరుకుపోయింది. ⇒ దురదృష్టవశాత్తూ ఇప్పుడు చంద్రబాబు గారి నీచ రాజకీయాలు పవిత్ర ఆలయ ప్రాంగణాల్లోకే చొరబడుతున్నాయి. తిరుమల లడ్డూను పదే పదే వివాదాల్లోకి లాగి, రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేయడంతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగింది. ఈ ధోరణి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలకూ వ్యాపిస్తోంది.⇒ భక్తులు తీవ్ర ఇబ్బందులు పడి, చివరకు పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికీ.. సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు, మౌనం వహిస్తే, బాధ్యత ఎవరు తీసుకుంటారు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు’’ -
శివభక్తులపై లాఠీచార్జ్ బాధాకరం: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: శ్రీశైలం మల్లన్న ఆలయంలో శివ స్వాములపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడంపై వైఎస్సార్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు చంద్రబాబు పాలనలో ఏపీలో నెలకొన్న పరిస్థితులను తెలుపుతూ ట్వీట్ చేశారు.‘ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పాలనలో, శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడం బాధాకరం. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంలో, ఆలయాలకు వెళ్లే భక్తులు భయకంపితులవుతున్నారు. ఒకప్పుడు భక్తితో, నమ్మకంతో తీర్థయాత్రలు చేసిన భక్తులు, ఇప్పుడు ఆందోళనతో, అనిశ్చితితో ఆలయాలకు వస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.చంద్రబాబు పాలనలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలు, వైఫల్యాలు అత్యంత బాధకలిగిస్తున్నాయి. నివారించగలిగిన ఘటనలు అయినప్పటికీ, ప్రభుత్వం విఫలంకావడం వ్యవస్థలపై భక్తులకున్న విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తోంది. ఇంత జరిగినా టీడీపీ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు దారుణంగా ఉంది. కేవలం ప్రచార విన్యాసాలు, ఘటన తర్వాత జరిగే రొటీన్ సమీక్షలకే ప్రభుత్వం పరిమితమవుతోంది.జవాబుదారీతనం, బాధ్యత అన్నవి ఈ ప్రభుత్వంలో ఎక్కడా కనిపించడం లేదు. శ్రీశైలం ఆలయంలో, శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ రూపంలో ప్రభుత్వ యంత్రాంగంలో ఘోరమైన వైఫల్యం బయటపడింది. సంవత్సరాలుగా మహాశివరాత్రి సమయంలో పాదయాత్రగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఇచ్చే సమయాన్ని ఏడు రోజులకు కుదించారు.దీనివల్ల పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులకు ముందే తెలిసినా, సరైన ఏర్పాట్లు చేయలేదు. తాగునీరు, క్యూల నిర్వహణ, వైద్య సదుపాయాలు అన్నీ లోపించాయి. తమ పిల్లాపాపలతో ఆలయానికి వచ్చిన కుటుంబాలు గంటల తరబడి దారుణమైన పరిస్థితుల్లో వేచి చూడాల్సి వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భక్తులకు ఉపశమనం ఇవ్వాల్సిన చోట, పోలీసులు బలప్రయోగానికి దిగారు.దర్శనానికి వచ్చిన భక్తులను లాఠీలతో కొట్టి తరిమారు. రాష్ట్రంలో తిరుపతి సహా అనేక ఆలయాల్లో గతంలో జరిగిన విషాద ఘటనల తరువాత కూడా, భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది2025లో ఆంధ్రప్రదేశ్లో ఆలయాల్లో జరిగిన విషాదాలు చూస్తే..తిరుపతిలో జనవరి 8, 2025న వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం క్యూలో ఉన్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో 6గురు భక్తులు మృతి చెందారు. టీటీడీ చరిత్రలో ఇలాంటి దుర్ఘటన జరగడం ఇదే తొలిసారిశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, సింహాచలంలో ఏప్రిల్ 30, 2025న చందనోత్సవం సమయంలో నూతనంగా నిర్మించిన నాసిరకం గోడ కూలిపోవడంతో 7గురు భక్తులు మృతి చెందారుశ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 1, 2025న కార్తీక ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందారు. ఇవికాకుండా ఆలయాల్లో అనేక ఘటనలు జరుగుతూనే ఉన్నాయిజాగ్రత్తపడాల్సిన, తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను వరుసగా జరుగుతున్న ఘటనలు హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంలో కూరుకుపోయింది. దురదృష్టవశాత్తూ ఇప్పుడు చంద్రబాబు నీచ రాజకీయాలు పవిత్ర ఆలయ ప్రాంగణాల్లోకే చొరబడుతున్నాయి. తిరుమల లడ్డూను పదే పదే వివాదాల్లోకి లాగి, రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేయడంతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగింది. ఈ ధోరణి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలకూ వ్యాపిస్తోందిభక్తులు తీవ్ర ఇబ్బందులు పడి, చివరకు పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికీ సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్లు మౌనం వహిస్తే, బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు’ అని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. 🚨 🚨 Hello India 👋🏻 👋🏻👋🏻Shiva Mala Dharana devotees were lathi charged by Andhra Pradesh Police under TDP governance.Devotees across Andhra Pradesh are living with growing fear when they step into temples under the TDP coalition government led by N. Chandrababu Naidu.… pic.twitter.com/kBILeAwLOY— YS Jagan Mohan Reddy (@ysjagan) February 10, 2026 -
‘రేపు వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తారు’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్రస్టేషనలో ఉన్నారని, ఆయన ఏదోదో చేద్దామనుకుంటున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈరోజు( మంగళవారం, ఫిబ్రవరి 10వ తేదీ) తాడేపల్లి నుంచి మీడియాతో మాట్లాడిన బొత్స.. రాష్ట్రంలో పాలనను చంద్రబాబు గాలికొదిలేశారని మండిపడ్డారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయని. రేపు వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తారని స్పష్టం చేశారు. అదే సమయంలో చంద్రబాబు పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బొత్స. ‘ రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగాలేవు. ప్రజలు అర్ధాకలితో ఉంటే పట్టించుకోవటం లేదు. రాష్ర్టంలో పాలన గాలికి వదిలేశారు. లడ్డూలో జంతువుల కొవ్వు లేదని సీబిఐ చెప్పింది. ఇక దాని గురించి మాట్లాడి టైం వేస్ట్ ఎందుకు?, సిట్ నివేదిక ఇచ్చాక ఇంకా కమిషన్ వేయటం ఎందుకు?, అసలు ఆ కమిషన్కి చట్టబద్ధత ఉంటుందా?, చంద్రబాబు సిట్ నివేదికను బయట పెట్టాలి. ఎల్లుండి శాసనసభా పక్ష సమావేశం జరుగుతుంది. అన్ని విషయాలు అందులో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని బొత్స తెలిపారు. -
22 వ స్థానానికి పడిపోయిన ఏపీ.. పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ
-
చంద్రబాబు తప్పుడు లెక్కలపై వైఎస్ జగన్ ఫైర్
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వంలో పబ్లిసిటీ ఎక్కువ, పనితీరు తక్కువ అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. చంద్రబాబు తప్పుడు లెక్కలపై వైఎస్ జగన్ ఫైరయ్యారు. రాష్ట్రంలో పన్నుల రాబడి, ఆర్ధిక స్థితిగతులపై చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారంపై ఎక్స్ వేదికగా స్పందించారు. ‘పన్నుల రాబడిలో ఏపీ దేశంలోనే 22 వ స్థానానికి పడిపోయింది. రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వ లెక్కలే దీనికి నిదర్శనంగా నిలిచాయి. కాని చంద్రబాబు ప్రభుత్వం కల్పిత జీఎస్డీపీ (GSDP) లెక్కలతో ప్రజలను మభ్యపెడుతోంది. రాష్ట్రం శర వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు ప్రజలను భ్రమ కల్పిస్తున్నారు.2024–25లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 11.75% గా ఉందననీ.. జాతీయ వృద్ధిరేటు 9.8% మాత్రమేనని చంద్రబాబు ప్రకటించారు. అలాగే 2025–26లో రాష్ట్ర వృద్ధి 10.75%గా ఉంటుందనీ..జాతీయ వృద్ధిరేటు 8.0% మాత్రమేనని ప్రకటించారు. దీని ప్రకారం 2023–24 నుంచి 2024–25 మధ్య రెండేళ్ల కాలానికి సగటు వార్షిక వృద్ధిరేటు 11.09%గా చూపిస్తోంది. ఈ ఏడాది రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో ఉందని కూడా ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇవేవీ స్వతంత్ర సంస్థలు విడుదల చేసిన గణాంకాలు కావు. ఇవి పూర్తిగా చంద్రబాబు కార్యాలయంలో తయారుచేసిన అంకెలే. వాటినే వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారు.ఈ గణాంకాలు నిజమైతే, ప్రభుత్వ ఆదాయాల్లోనూ అదే స్థాయి వృద్ధి కనిపించాలి. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి 9 నెలల కాగ్ నివేదికలు చూస్తే వాస్తవ పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నాయో తెలుస్తుంది. నిజానికి ఈ రెండేళ్ల కాలంలో ప్రభుత్వ పన్ను ఆదాయాల వృద్ధి కేవలం 1.97% మాత్రమే. 11.09% వంటి భారీ జీఎస్డీపీ వృద్ధిని చూపిస్తున్న రాష్ట్రం.. పన్ను ఆదాయాల్లో మాత్రం కేవలం 1.97% వృద్ధిని సాధించడం ప్రపంచంలోని ఆర్థిక నిపుణులందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయకత్వంలో తయారుచేసిన కల్పిత గణాంకాల వల్లే ఇలాంటి అంకెలు సాధ్యమవుతాయి23 రాష్ట్రాల్లో పన్ను ఆదాయాల వృద్ధి విషయంలో ఏపీ 22వ స్థానంలో ఉంది. అంటే చివర నుంచి రెండో స్థానంలో ఉంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయాలు 9.64% పెరగ్గా.. ఏపీ పన్ను ఆదాయాలు మాత్రం 1.97% మాత్రమే పెరిగాయి. అయినప్పటికీ ఏపీ పనితీరు కేంద్ర ప్రభుత్వానికంటే మెరుగైనదట!. చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీ ఏదైనా విషయాల్లో మొదటి స్థానం సాధించిందంటే.. అది కేవలం ప్రభుత్వ అప్పులు, అవినీతి, రాజకీయ కక్షసాధింపు చర్యలు, తప్పుడు ప్రచారాల్లోనే’ అంటూ దుయ్యబట్టారు.𝗖𝗕𝗡'𝘀 𝗧𝗵𝗲 𝟮𝟮𝗻𝗱 𝗥𝗮𝗻𝗸 𝗩𝗶𝘀𝗶𝗼𝗻: 𝗛𝗶𝗴𝗵 𝗼𝗻 𝗛𝘆𝗽𝗲, 𝗟𝗼𝘄 𝗶𝗻 𝗣𝗲𝗿𝗳𝗼𝗿𝗺𝗮𝗻𝗰𝗲- 𝗟𝗜𝗘𝗦 𝗮𝗻𝗱 𝗗𝗘𝗖𝗘𝗜𝗧 𝗰𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲 𝗨𝗻𝗮𝗯𝗮𝘁𝗲𝗱At a time when State is confronting a worrying economic slowdown, very clearly evident from the Government… pic.twitter.com/lkeEp84jOQ— YS Jagan Mohan Reddy (@ysjagan) February 10, 2026 -
జగన్పై కుట్ర.. కేంద్ర హోంశాఖకు YSRCP లేఖ
-
మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై ఆందోళన
సాక్షి, అమరావతి: అమిత జనాదరణ గల నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం విమర్శించారు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన వైఎస్ జగన్ ఇటీవల పర్యటనలో చోటు చేసుకున్న భద్రతా లోపాలపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సోమవారం ఆయన లేఖ రాశారు. ఆ లేఖను ఆయన ఇక్కడ మీడియాకు విడుదల చేశారు. ఫిబ్రవరి 6న తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నానికి మాజీ సీఎం వైఎస్ జగన్ వెళ్లిన సందర్భంలో తీవ్ర స్థాయిలో భద్రతా లోపాలు కనిపించాయని లేఖలో పేర్కొన్నారు.సాధారణంగా కేవలం 22 కిలోమీటర్ల దూరం ఉన్న మార్గాన్ని పక్కనపెట్టి, విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో దాదాపు 47 కిలో మీటర్ల పొడవైన ప్రత్యామ్నాయ మార్గానికి ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా రూట్ మ్యాప్ మార్చారని పేర్కొన్నారు. అధికారులు సూచించిన మార్గాన్నే అనుసరించినా, తిరుగు ప్రయాణంలో మరింత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని లేఖలో వివరించారు. భద్రతా బృందానికి గానీ, పార్టీ ప్రతినిధులకు గానీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా తిరుగు మార్గాన్ని అకస్మాత్తుగా మార్చారన్నారు.ఆ మార్గం అత్యంత రద్దీగా ఉందని, ఈ మార్గం జెడ్ ప్లస్ కేటగిరీ వీవీఐపీకి ఏమాత్రం అనుకూలం కాదని తలశిల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధమైన అనూహ్య రూట్ మార్పులు భద్రతా ప్రొటోకాల్స్ను బలహీనపరుస్తాయని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు వీవీఐపీ ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు భద్రతా అంచనా లేకుండా, రాతపూర్వక సమాచారం లేకుండా తీసుకున్న ఈ నిర్ణయాలు తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఒక్క ఘటన మాత్రమే కాదని, గతంలో కూడా వైఎస్ జగన్ భద్రతలో పలు లోపాలు చోటు చేసుకున్నాయని లేఖలో గుర్తు చేశారు. ⇒ 2025 ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చి యార్డ్ను సందర్శించినప్పుడు పూర్తి స్థాయిలో జెడ్ప్లస్ భద్రత కల్పించలేదని, బాధ్యత వíßæంచాల్సిన అధికారులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ⇒ 2025 ఏప్రిల్లో శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి పర్యటన సందర్భంగా కూడా తీవ్ర భద్రతా లోపాలు జరిగాయని పేర్కొన్నారు. హెలిప్యాడ్ వద్ద జరిగిన దాడిలో హెలికాప్టర్ విండ్ïÙల్డ్ దెబ్బతిని వీవీఐపీ ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిందన్నారు. అయినప్పటికీ అధికారుల వైఫల్యాన్ని అంగీకరించకుండా పార్టీ నేతలపై కేసులు పెట్టారని లేఖలో పేర్కొన్నారు. తరచూ నిబంధనలు నీరుగారుస్తున్న పోలీసులు తరచూ జరుగుతున్న ఇలాంటి ఘటనల ద్వారా జెడ్ ప్లస్ భద్రతా నిబంధనలను పదేపదే పోలీసులు నీరుగారుస్తున్నారని తలశిల మండిపడ్డారు. ఇది కేవలం ఒక వ్యక్తి భద్రతకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా వీఐపీ భద్రతా వ్యవస్థల విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రూట్ మార్పులపై తక్షణం విచారణ చేపట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇక నుంచైనా రాజకీయాలకతీతంగా జెడ్ ప్లస్ భద్రతా ఎస్ఓపీలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోం శాఖను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వైఎస్ జగన్ భద్రతపై స్వతంత్ర సమీక్ష జరపాలని డిమాండ్ చేశారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. -
వైఎస్ జగన్ సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలు
-
కుటుంబ వివాహ వేడుక.. తమిళనాడు ప్రముఖులకు వైఎస్ జగన్ ఆత్మీయ పలకరింపు (ఫొటోలు)
-
తండ్రి బాటలో జగన్..
-
కర్ణాటకలో ఏపీ కూలీల మృతి.. జగన్ దిగ్భ్రాంతి
-
వివాహ వేడుకలో ఒకే వేదికపై సీఎం స్టాలిన్, జగన్, విజయ్
-
బొలెరో బోల్తా పడి ముగ్గురు కూలీల దుర్మరణం
మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా నుంచి కర్ణాటకకు చింతకాయల కోత పనులకు వెళ్లిన కూలీల్లో ముగ్గురిని ప్రమాదం బలితీసుకుంది. బొలెరోలో వెళ్లినవారు పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా ఆ వాహనం బోల్తాపడడంతో ఈ విషాదం నెలకొంది. కర్ణాటకలోని శ్రీనివాసపురం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధిత కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు.. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంబకూరు గ్రామంలోని పూలకుంట్లపల్లెకు చెందిన 15 మంది కూలీలు బొలెరో వాహనంలో కర్ణాటకలోని శ్రీనివాసపురం వద్ద చింతకాయలు కోయడానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా శ్రీనివాసపురం వద్ద బ్రేక్ ఫెయిలవడంతో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది.ఈ ప్రమాదంలో శ్రీనివాసులు (25), మునెప్ప (65) అక్కడికక్కడే మృతిచెందారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఏడుగురిని వేర్వేరు వాహనాల్లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు చికిత్స చేసేలోపే వెంకటమ్మ (60) మృతిచెందింది. ఆరుగురు మదనపల్లెలోను, మరో ఆరుగురు శ్రీనివాసపురంలో చికిత్స పొందుతున్నారు. కూలి పనులకు వెళ్లిన ముగ్గురు ప్రాణాలు కో ల్పోవడంతో పూలకుంట్లపల్లెలో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంపై శ్రీనివాçసపురం పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి : కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు కూలీలు మృత్యువాత పడడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్ణాటక శ్రీనివాసపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన కూలీలు మరణించడం విషాదకరమన్నారు. మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. -
జగన్పై బురద చల్లాలని చంద్రబాబు నీచ రాజకీయాలు
కాకినాడ రూరల్: ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తప్పుపట్టాలని, ఆయనపై బురద చల్లాలనే తప్పుడు ప్రయత్నాలతో చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో–ఆర్టినేటర్, మాజీమంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. అందులో భాగంగా కలియుగదైవం శ్రీవేంకటేశ్వరస్వామి కీర్తికి, పవిత్రతకు అపఖ్యాతి కలిగించాలని నిరంతరం అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. కాకినాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాధ్యతాయుత స్థానంలో ఉన్నవారు ఆధారాలతో మాట్లాడాలని, భక్తులు, ప్రజల మనోభావాలతో ఆటలాడటం మంచిదికాదని సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టి సిట్ వేసిందన్నారు.సీబీఐతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడిన ఈ సిట్ పెద్ద ఎత్తున పరిశోధన చేసి, చంద్రబాబు నియమించిన టీటీడీ అధికారులు, ఈవోల వాంగ్మూలాలను రికార్డు చేసి, లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో ఎలాంటి జంతుకొవ్వులు కలవలేదని నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు. అయినా చంద్రబాబు తప్పుడు ప్రచారం కొనసాగిస్తున్నారన్నారు. మొన్నటివరకు జంతుకొవ్వు అన్నారని, ఇప్పుడు ఏకంగా బాత్రూములు కడిగే హారి్పక్, కెమికల్స్ కలిపేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్పై ఉక్రోషంతో చంద్రబాబు హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారని, హిందూధర్మాన్ని బలిపెట్టే స్థితికి తీసుకొచ్చారని చెప్పారు. హెరిటేజ్ ఉత్పత్తుల్లో కల్తీ హరియాణలో విక్రయిస్తున్న హెరిటేజ్ పెరుగులో నాణ్యతలేదంటూ ఎఫ్ఎస్ఎస్ఏఐ నివేదిక ఇచ్చి, రూ.లక్ష పెనాల్టీ విధించి, సెబీకి నివేదించిందని చెప్పారు. అంతకుముందు మరో రాష్ట్రంలో ఈ ఉత్పత్తులను బ్యాన్ చేశారన్నారు. చంద్రబాబు సొంతసంస్థ హెరిటేజ్ ఉత్పత్తుల్లోనే కల్తీ జరుగుతోందని, అసలు జరగనివాటిలో జంతుకొవ్వు కల్తీ అంటూ రాజకీయాలు, కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. లడ్డూ రాజకీయాలు తప్ప చంద్రబాబు సాధించిందేమీ లేదన్నారు. కనీసం కేంద్ర బడ్జెట్లో కూడా నిధులు రాబట్టలేకపోయారని విమర్శించారు. ఎన్ని అబద్ధాలు ఆడినా వాస్తవాలను కప్పిపుచ్చలేరని కన్నబాబు పేర్కొన్నారు. -
కర్ణాటక రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: కర్ణాటకలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన నలుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని శ్రీనివాసపురం వద్ద ఈ ప్రమాదం జరగ్గా.. ఏపీకి చెందిన నలుగురు కూలీలు మరణించడం విషాదకరమని వైయస్ జగన్ అన్నారు. మృతులంతా అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందినవారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు కూడా. మృతుల కుటుంబాలకు జగన్.. ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. -
జననేత వైఎస్ జగన్తో టీవీకే అధినేత విజయ్
-
జన నాయకుడు జగన్తో 'జన నాయగన్'
వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ కలిశారు. చెన్నైలో జరిగిన జగన్ సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలో విజయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్, విజయ్ పక్కపక్కనే కూర్చొని ఉన్న వీడియో విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో జన నాయకుడు వైఎస్ జగన్తో జన నాయగన్ విజయ్ అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.TVK Chief Thalapathy #Vijay With YSRCP Chief Political SuperStar #YSJagan🔥pic.twitter.com/UU49hP6JaP— cinee worldd (@Cinee_Worldd) February 8, 2026 -
వివాహ వేడుకలో వైఎస్ జగన్.. జననేతకు ఆత్మీయ పలకరింపులు (ఫొటోలు)
-
సీఎం స్టాలిన్, హీరో సూర్యతో వైఎస్ జగన్
-
పెళ్ళిలో హీరో సూర్య, కార్తీ తో వైఎస్ జగన్
-
వైఎస్ జగన్ను కలిసిన స్టార్ హీరోలు.. వీడియో వైరల్
వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ కలిశారు. చెన్నైలో జరిగిన సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలీవుడ్ హీరోలు కార్తీ, సూర్య వైఎస్ జగన్ను ఆత్మీయంగా పలకరించారు. పెళ్లి వేడుకలో హీరోలు కార్తీ, సూర్యతో వైఎస్ జగన్తో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు అటు రాజకీయాలతో పాటు ప్రజల్లోనూ ఆసక్తికర చర్చలకు దారి తీసింది. View this post on Instagram A post shared by Sakshi (@sakshinews) -
రాజు ఎక్కడున్నా రాజే.. చెన్నైలో వైఎస్ జగన్ ప్రభంజనం
-
చెన్నైలోనూ వైఎస్ జగన్ ప్రభంజనం
చెన్నై: చెన్నైలోనూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్రేజ్ మాములుగా లేదు. తన బంధువు కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు వైఎస్ జగన్ చెన్నై వెళ్లారు. వైఎస్ అనిల్రెడ్డి (వైఎస్ జగన్ పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి కుమారుడు) కుమారుడు సాహిల్ వివాహం సందర్భంగా జరుగుతున్న వేడుకలో పాల్గొనేందుకు వైఎస్ జగన్ చెన్నై వచ్చారు.రేపు ( ఫిబ్రవరి 8, ఆదివారం) ఉదయం సాహిల్, వేదికల వివాహం జరగనుంది. ఇంజంబాక్కం విజిపీ లేఅవుట్లో వైఎస్ జగన్ను కలిసేందుకు పెద్ద ఎత్తున వచ్చిన అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. వారికి వైఎస్ జగన్ అభివాదం చేశారు. -
Ibrahimpatnam Tour: జగన్ భద్రతను గాలికొదిలేసిన పోలీసులు
-
వరల్డ్ కప్ దుమ్మురేపిన కుర్రాళ్లు వైఎస్ జగన్ ప్రశంసలు
-
టీమిండియా యువ జట్టుపై వైఎస్ జగన్ ప్రశంసలు
సాక్షి, తాడేపల్లి: అండర్-19 ప్రపంచకప్లో భారత యువ జట్టు చారిత్రక విజయం సాధించడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జట్టు సభ్యులకు అభినందనలు తెలుపుతూ.. మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.‘‘మన అండర్-19 జట్టు ప్రపంచకప్ విజయం సాధించినందుకు హృదయపూర్వక అభినందనలు. మైదానంలో మీరు చూపిన పట్టుదల, క్రమశిక్షణ చూసి దేశం ఎంతో గర్వించింది. ఈ యువ క్రీడాకారులు భారతదేశ భవిష్యత్తుకు వెలుగులు నింపే ప్రతిభావంతులు. ఈ విజయంతో మీరు మరిన్ని మైలురాళ్లు చేరుకోవాలని, కొత్త విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. మొత్తం జట్టుకు నా శుభాకాంక్షలు’’ అంటూ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారాయన. Heartiest congratulations to our U-19 team on their spectacular World Cup victory. Your grit, discipline, and passion on the field have made the entire nation proud. These young champions represent the bright future of India!May this triumph continue to inspire you in setting… pic.twitter.com/n9Pr6fjtN2— YS Jagan Mohan Reddy (@ysjagan) February 7, 2026 -
చంద్రబాబుకు కాపుల రిటర్న్ గిఫ్ట్..
-
కాన్వాయ్ దారి మళ్లింపు.. 45 కిమీ తిప్పించారు
-
జంగిల్రాజ్పై ప్రశ్నిస్తున్నందుకే గూండా దాడులు... ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కారు అరాచకాలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
-
జగన్నాథ రథచక్రాల కింద నలిగిపోయిన కూటమి కుట్రలు
-
YS Jagan: రూటు మారినా తగ్గని జన సునామీ
సాక్షి, విజయవాడ : సర్కారు ఎన్ని కుయుక్తులు పన్నినా, రూటు మార్చినా జననేత పర్యటనకు జనం సునామీలా తరలివచ్చారు. 17 కిలోమీటర్ల దూరం 47 కిలోమీటర్లకు పెరిగినా ఇసుకేస్తే రాలనంతగా ప్రజలు పోటెత్తారు. ఎన్టీఆర్ జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జననేతను దగ్గర్నుంచి చూడాలని, పలకరించాలని, కుదిరితే కరచాలనం చేయాలనే ఆసక్తితో అడుగడుగునా పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. దారి పొడవునా పూలు చల్లుతూ ఆత్మీయంగా స్వాగతం పలికారు. సీఎం.. సీఎం.. జై జగన్.. జైజై జగన్ నినాదాలతో పర్యటన ఆద్యంతం మార్మోగింది. ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి, బీసీ నేత జోగి రమేష్ ఇంటిపై ఇటీవల తెలుగుదేశం పార్టీ గూండాలు దాడి చేసి.. పెట్రోల్ బాంబులు విసిరి దగ్ధం చేయటానికి కుట్రలు చేసిన నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు శుక్రవారం ఉదయం వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు. ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా, ఉదయమే తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం వద్దకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. వైఎస్ జగన్.. నివాసం నుంచి బయటకు రాగానే అక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు జై జగన్ అంటూ నినదించారు. కాన్వాయ్ భరతమాత సెంటర్ వద్దకు వచ్చేసరికి రోడ్డుపై మహిళలు, అభిమానులు భారీగా ఉండడంతో.. వైఎస్ జగన్ వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అక్కడి నుంచి పాతూరు క్రాస్రోడ్ వరకు కారులో నుంచి పలుమార్లు బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేశారు. భారీగా అభిమానులు రావడంతో అనుకున్న సమయానికి అనుకున్న ప్రదేశానికి చేరుకునే సరికి ఆలస్యమైంది. అయినా ప్రజలు రోడ్డుపై ఉండి ఆయన కోసం ఎదురు చూశారు. కాజ వద్ద గ్రామస్తులు భారీగా స్వాగతం పలికారు. 2029లో జగనే ముఖ్యమంత్రి అంటూ నినాదాలు చేశారు. కాజ టోల్గేటు వద్ద కూడా అదే పరిస్థితి. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించి, ప్రజల్ని అడ్డుకున్నా వైఎస్ జగన్ను కలిసేందుకు జనం పోటీ పడ్డారు. దారిపొడవునా బస్సుల్లో నుంచి ప్రజలు అభివాదం చేశారు. చినకాకాని వెస్ట్ బైపాస్ ప్రారంభంలో ఒక దివ్యాంగుడు వేచి ఉండటం గమనించి వైఎస్ జగన్ కారు దిగి, అతనితో కరచాలనం చేశారు. వెస్ట్ బైపాస్లో ఎక్కడా రోడ్డుపైకి వచ్చేందుకు అవకాశం లేకపోయినా బైపాస్ వెంబడి పలుచోట్ల ప్రజలు జగన్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో బారులుతీరారు. వెంకటపాలెం టోల్ గేటు వద్ద 10 నిమిషాల పాటు జగన్ కాన్వాయ్ ఆపి.. అక్కడికొచ్చిన మాజీ ఎంపీ నందిగం సురేష్తో పాటు అందరినీ ఆప్యాయంగా పలకరించారు. పర్యటనను నీరుగార్చే కుట్ర భగ్నంవైఎస్ జగన్ ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లేందుకు మాజీ ముఖ్యమంత్రి హోదాలో పోలీసు శాఖకు తన పర్యటన వివరాలను ముందుగానే పంపించారు. అయితే ఆయన పర్యటనను నీరుగార్చేందుకు, ప్రజలు ఆయన్ను కలవకుండా చేసేందుకు ప్రభుత్వం పోలీసు శాఖ ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేసింది. ముందు ప్రకటించిన రూట్లో కాకుండా మంగళగిరి మీదుగా కాజ టోల్గేటు వద్దకు వెళ్లి.. అక్కడి నుంచి వెస్ట్ బైపాస్ మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లాలని గురువారం రాత్రి నోటీసులు జారీ చేసింది. దాంతో పార్టీ క్యాడర్లో కొంత గందరగోళం నెలకొంది. అయినా శుక్రవారం ఉదయం వైఎస్ జగన్ వస్తున్న రూట్ వివరాలను తెలుసుకొని తదనుగుణంగా పార్టీ శ్రేణులు, ప్రజలు జగన్ పర్యటించే మార్గంలో ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. పోలీసుల కుట్రలను భగ్నం చేసి, పర్యటనను విజయవంతం చేశారు.వాహనాలను అడ్డుకున్న పోలీసులు వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకోవటానికి పోలీసు శాఖ తీవ్ర స్థాయిలో ప్రయత్నించింది. ఇందులో భాగంగా అడుగడుగునా ఆంక్షలు విధించింది. పార్టీ నేతలను పోలీసు అధికారులు భయభ్రాంతులకు గురి చేయటమే కాకుండా, పలు చోట్ల వాహనాలను అడ్డుకున్నారు. తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి వస్తున్న వాహనాలను ఎక్కడికక్కడ ఆపేశారు. ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్తోపాటు, జిల్లా వ్యాప్తంగా పలువురు నాయకులు ర్యాలీగా వెళ్లకూడదంటూ నోటీసులు జారీ చేశారు. నేతల వెంట జనం ఉండకూడదని హెచ్చరించారు. నోటీసులను ధిక్కరిస్తే కేసులు పెడతామని భయపెట్టేందుకు ప్రయత్నించారు. అయినా పార్టీ శ్రేణులు వేలాదిగా ఎవరికి వారుగా స్వచ్ఛందంగా కార్యక్రమానికి తరలివచ్చారు. వైఎస్ జగన్ అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగారు. ఇలా అడుగడుగునా అభిమానం పోటెత్తడంతో తాడేపల్లి నుంచి ఉదయం 11 గంటలకు బయలు దేరిన జగన్.. ఇబ్రహీంపట్నం చేరుకునే సరికి సాయంత్రం 5 గంటలైంది.ఇలా ఏకంగా ఆరు గంటల సమయం పట్టింది. గొల్లపూడి నుంచి జోగి రమేష్ ఇల్లు చేరుకునేందుకు మూడు గంటలకు పైగా సమయం పట్టిందంటే జనాభిమానం ఏమేరకు ఉందో ఇట్టే తెలుస్తోంది. దారిపొడవునా తన కోసం వేచి ఉన్న ప్రజలకు వైఎస్ జగన్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వేలాదిగా బైక్లపై తరలివచ్చిన యువతపార్టీ శ్రేణులు, అభిమానులు, యువత వేలాదిగా తరలివచ్చారు. ఉదయమే తాడేపల్లి కార్యాలయానికి చేరుకొని వైఎస్ జగన్ను అనుసరించారు. ఎక్కడికక్కడ పోలీసులు వాహనాలను అడ్డుకొని వేరు మార్గాల వైపు తరలించినా, అభిమానులు అంతకంతకూ పెరిగారు. వేలాది మంది ద్విచక్ర వాహనాలపై తరలి వచ్చి, తమ అభిమాన నేత జగన్మోహన్రెడ్డి పర్యటనలో పాల్గొన్నారు. పలువురు న్యాయవాదులు వైఎస్ జగన్కు సంఘీభావం తెలిపారు. బైపాస్ నల్లకుంట నుంచి ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి వరకు రోడ్డుపై జనం ఇసుక వేస్తే రాలనంతగా నిండిపోయారు. జోగి రమేష్ కుటుంబానికి భరోసాఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. దాడి జరిగిన తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. ఎంతసేపు దాడి జరిగింది.. మారణాయుధాలతో ఎలా భయపెట్టారు.. పెట్రోల్ బాంబులు ఎలా విసిరారు.. తదితర విషయాలను జోగి రమేష్ కుటుంబ సభ్యులు వివరించారు. దాడి జరిగిన సమయంలో వారు ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను జననేతకు చెప్పుకున్నారు. ఇలాంటి దాడులకు భయపడొద్దని, తాను అండగా ఉంటానని వారికి జగన్ భరోసా కల్పించారు. పార్టీ అండగా ఉంటుందన్నారు. రానున్న కాలంలో దాడి చేసిన వారిని చట్టపరంగా న్యాయస్థానంలో నిలబెడతామని చెప్పారు. కాగా, వైఎస్ జగన్తో పాటు పలువురు నేతలు జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు. మాజీ మంత్రి ఆర్కే రోజా, జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎన్టీఆర్ జిల్లా పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్రావు, కైలే అనిల్కుమార్, అన్నాబత్తుల శివకుమార్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్కుమార్, ఎండి రుహుల్లా, వరుదు కళ్యాణి, జగ్గయ్యపేట ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు, తిరువూరు ఇన్చార్జ్ నల్లగట్ల స్వామి దాసు, పెనమలూరు ఇన్చార్జి దేవభక్తుని చక్రవర్తి, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, డిప్యూటీ మేయర్ అవుతు శైలజ రెడ్డి, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన మహేష్, నాయకులు ఏ రవిచంద్ర, పుణ్యశీల, వేముల తిరుపతిరావు, వంగవీటి నరేంద్ర తదితరులు జోగి రమేష్ను కలిశారు. గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:జగన్ రాకతో జన జాతరను చూశారా? -
పవిత్ర లడ్డూపై దుష్ప్రచారం ఆపి.. క్షమాపణ చెప్పాలి
సీబీఐ సిట్ చార్జ్షీట్ వేసిన తర్వాత అయినా చంద్రబాబు చేయాల్సిన పని ఏంటంటే.. శ్రీ వేంకటేశ్వరస్వామి ముందు లెంపలేసుకుని ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. కనీసం మానవత్వం ఉన్న మనిషైతే చంద్రబాబు అలాంటి పని ఎందుకు చేయడం లేదు?సీబీఐ సిట్ చార్జ్షీట్లో పొందుపరిచిన వాస్తవాలను చూపించి ఎవరైనా చంద్రబాబుని ప్రశ్నిస్తే.. ఆయన అసహనంతో మా నాయకుల మీద దాడులు చేయించే నీచ స్థాయికి దిగజారిపోయాడు. అందులో భాగంగానే వరుసపెట్టి మా నాయకులు విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకరరెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డి మీద దాడి చేయడమే కాకుండా అంబటి రాంబాబు ఇంటి మీద కూడా దాడి చేశారు.అసలు చంద్రబాబుకు చిప్ సరిగ్గా ఉంటే ఇలాంటి పనులు చేయిస్తారా? తిరుమల లడ్డూ విషయంలో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినా.. ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్లు ఎలాంటి జంతు కొవ్వు లేదని ధ్రువీకరించినా.. చంద్రబాబు, పవన్కల్యాణ్,లోకేశ్ తమ తీరు అస్సలు మార్చుకోవడం లేదు.తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న కూటమి నేతల ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు వక్రబుద్ధి, అబద్ధాలపై వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ సిట్ను ఏర్పాటు చేసింది. ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా సీబీఐ దాఖలు చేసిన చార్జ్షీట్ను ఎవరూ తప్పుపట్టలేరు. సుప్రీంకోర్టు కన్నా చంద్రబాబు పదవి పెద్దది కాదు. ఇవాళ చంద్రబాబు తన స్వార్థం కోసం వన్మ్యాన్ కమిషన్ను ఏర్పాటు చేస్తున్నారు. వాటికి ఎలాంటి ప్రామాణికత ఉండదు. తనకు అనుకూలంగా రిపోర్టు రాకపోవడంతో మళ్లీ కొత్త కమిషన్ ఏర్పాటు చేసుకుని, తనకు అనుకూలమైన రిపోర్టు కోసం కుట్ర చేస్తున్నాడు. - వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘చంద్రబాబు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని సీబీఐ చార్జ్షీట్లో తేల్చి చెప్పింది. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ కలవలేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ చంద్రబాబు అన్యాయంగా ఇంకా దుష్ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు. చంద్రబాబు సీఎం కాక ముందు వరకు ఎవరైనా తిరుమల ప్రసాదం ఇస్తే కళ్లకు అద్దుకుని తినేవారు. కానీ ఇప్పుడు ఆ ప్రసాదం పవిత్రతను చంద్రబాబు దిగజార్చాడు. ఒక అబద్ధాన్ని సృష్టించి రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకున్న దుర్మార్గుడు చంద్రబాబే. లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు లేదని ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్ల నివేదికలు స్పష్టం చేసినా చంద్రబాబు ఇంకా ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం దారుణం..’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. అబద్ధాన్ని సృష్టించి రెక్కలు కట్టి దుష్ప్రచారం చేశారని, కానీ చంద్రబాబువి అబద్ధాలని సీబీఐ చార్జ్షీట్ తేల్చేసిందని వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో టీడీపీ మూకల దాడిలో దెబ్బతిన్న జోగి రమేష్ ఇంటిని శుక్రవారం వైఎస్ జగన్ పరిశీలించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. కక్షగట్టి దాడులుచంద్రబాబు అబద్ధాలను ప్రశ్నిస్తున్నందుకు చిప్ పని చేయక పోవడం వల్లే కక్షగట్టి దాడులకు దిగుతున్నారు. చేసిన తప్పు ఒప్పుకుని, లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారు. ఇప్పుడు వన్మ్యాన్ కమిషన్ అంటూ అనుకూల నివేదిక కోసం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ఆ కమిషన్కు ఏ మాత్రం విలువ ఉండదు. టీడీపీ గూండాలు గుంటూరులో అంబటి రాంబాబు ఇంట్లో ఐదు కార్లు «ధ్వంసం చేయడంతోపాటు ఇల్లు, ఆఫీసులో విధ్వంసం సృష్టించి ఆఫీస్కు నిప్పుపెట్టారు. ఆ మర్నాడు ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు జోగి రమేష్ ఇంటిపై ఏకంగా యాసిడ్ బాటిళ్లతో, పెట్రోల్ బాంబులతో వి«ధ్వంసం సాగించారు. అక్కడ అంబటి రాంబాబు.. ఇక్కడ జోగి రమేష్ తండ్రిపై హత్యాయత్నం జరిగింది. పోలీసుల సమక్షంలోనే రెండు చోట్లా దాడులు జరిగాయి. టీడీపీ గూండాలకు వారు అండగా ఉంటున్నారు. నాగరిక సమాజం తల దించుకునేలా చంద్రబాబు రాష్ట్రంలో జంగిల్రాజ్ కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేస్తున్నారు. నాగరిక సమాజం తల దించుకునేలా చంద్రబాబు సర్కారు చర్యలు ఉన్నాయి. తప్పులు చేస్తున్న ఎవరినీ వదిలిపెట్టబోం. సుప్రీంకోర్టు తలుపు కూడా తడతాం. మరో మూడేళ్లలో వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ఇప్పుడు తప్పులు చేస్తున్న అందరినీ బోనులో నిలబెడతాం. వారికి శిక్ష తప్పదు. నాగరిక సమాజం తలదించుకునేలా.. రాష్ట్రంలో జంగిల్రాజ్ పరిపాలన సాగుతోంది. నాగరిక ప్రపంచం తలవంచుకునేలా చంద్రబాబునాయుడు చేశారు. గుంటూరులో అంబటి రాంబాబు ఇంట్లో 5 కార్లను ధ్వంసం చేసి ఇంట్లోకి చొరబడ్డారు. అద్దాలను పగలగొట్టారు. ఇంట్లో ఆడవాళ్లను దుర్భాషలాడారు. ఇంటి పక్కనే ఉన్న ఆఫీసులోకి చొరబడి విధ్వంసానికి దిగి ఆఫీసును తగలబెట్టారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలో జరగటాన్ని అంతా చూశాం. అక్కడ సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు దహనకాండ జరిగింది. ఆ మర్నాడే ఇక్కడ కూడా సాయంత్రం అదే పరంపర కొనసాగింది. జోగి రమేష్ ఇంటిపైనా దారుణంగా దాడి చేశారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలని సీబీఐ తేల్చింది చంద్రబాబునాయుడు నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నాడని, ప్రజలను తప్పుదోవ పట్టించాడని సాక్షాత్తూ సీబీఐయే తేటతెల్లం చేస్తూ చార్జ్షీట్ దాఖలు చేసింది. చంద్రబాబు నాయుడు ఆరోపించినట్లుగా తిరుమలలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, గొడ్డు కొవ్వు కానీ, పందికొవ్వు కానీ, చేప నూనె కానీ కలపలేదని సీబీఐ స్పష్టం చేసింది. శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు దు్రష్పచారం చేశాడు. ప్రతిష్టాత్మక ల్యాబ్లూ అదే నిర్ధారించాయి తిరుమలలో వాడిన నెయ్యిపై చంద్రబాబు చెబుతున్నవి అబద్ధాలని దేశంలోనే ప్రతిష్టాత్మకమైన నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ), నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) ల్యాబ్లు నిర్ధారించాయి. ఆ మేరకు నివేదికలు ఇచ్చాయి. అవి రెండూ కేంద్ర ప్రభుత్వ సంస్థలు. వారు పరీక్షించిన నెయ్యి శాంపిల్స్ అన్నీ కూడా చంద్రబాబు సీఎంగా ఉండగా, ఆయన మనిషి టీటీడీ ఈవోగా ఉండగా సేకరించినవే. సీబీఐ ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీకి ఆ శాంపిల్స్ పంపారు. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని, గొడ్డు కొవ్వు లేదని, పందికొవ్వూ లేదని, ఎలాంటి చేపనూనె కూడా కలవలేదని ఆ ల్యాబ్లు ధ్రువీకరించాయి. ఆ రిపోర్టులను సీబీఐ కూడా సరి్టఫై చేసింది. సీబీఐ సిట్ ఆ మేరకు చార్జ్షీట్ దాఖలు చేసింది. భూమన, వైవీకి సీబీఐ క్లీన్చిట్.. ఆ చార్జ్షీట్లో సీబీఐ మరో విషయం కూడా చెప్పింది... గతంలో టీటీడీ చైర్మన్లుగా వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి ఉన్నప్పుడు వాళ్లు ఎలాంటి తప్పూ చేయలేదని, అన్యాయమైన పనులు చేయలేదని స్పష్టం చేసింది. అందుకే వారి పేర్లు చార్జ్షీట్లో పెట్టలేదు. వారిలో ఎవరినీ అరెస్టు చేయలేదు. అంటే సీబీఐ వారికి క్లీన్చిట్ కూడా ఇచ్చింది. ఇదొక్కటే కాదు.. ఆ చార్జ్షీట్లో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. (పేజీ నెం 62 ప్రస్తావించారు) చంద్రబాబు సీఎం అయిన తర్వాత 2024 జూలై 25న నెయ్యిలో నాణ్యత లేదని టీటీడీ 4 ట్యాంకర్లను రిజెక్ట్ చేసింది (ఆ రిపోర్టు చదివి వినిపించారు. చార్జ్షీట్లోని పేజీ నెం 64, 44 అంశాలను చదివి వినిపించారు). కానీ ఆ రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్లీ ఇదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే దొడ్డిదారిన వేరేవాళ్ల పేరుతో తిరిగి వస్తే వాటిని టీటీడీ ఆమోదించింది. అవే ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ తయారీకి వాడారని స్వయంగా సీబీఐ వెల్లడించింది. అలా చంద్రబాబు ప్రభుత్వం మీద, వాళ్లు చేసిన తప్పుల మీద, వాళ్లు చేసిన అన్యాయంపై చార్జ్షీట్లో రాశారు. పాపం చేసింది ఎవరు బాబూ..? ఏకంగా సీబీఐనే చంద్రబాబు ప్రభుత్వం మీద ఈ మాదిరిగా చార్జిషీట్లో రాసిన తర్వాత అసలు పాపం చేసిన వాళ్లు ఎవరు? అని చంద్రబాబును, ఆయన కుమారుడిని, కూటమిలో ఉన్న పవన్కల్యాణ్ను ప్రశ్నిస్తున్నా. టీటీడీ నెయ్యిలో చేప నూనె, గొడ్డు కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందని ఎవరు చెప్పారు..? సీబీఐ చెప్పిందా..? ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్టులు చెప్పాయా..? చంద్రబాబు, లోకేష్, పవన్కల్యాణ్తో పాటు రోజూ వారి పల్లకి మోస్తున్న ఎల్లో మీడియా (ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5) ప్రచారం చేయడం మినహా ఎవరైనా చెప్పారా? ఒక అబద్ధానికి రెక్కలు కట్టి దు్రష్పచారం చేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం కన్నా హేయమైన చర్య ఇంకోటి ఉంటుందా? చంద్రబాబుకు ఇకనైనా బుద్ధి రావాలి.. అనిల్ సింఘాల్ను చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే టీటీడీ ఈవోగా నియమించారు. మా ప్రభుత్వం ఆయన్ను కొనసాగించింది. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన్నే తెచ్చారు. శ్యామలరావును టీటీడీ ప్రక్షాళన కోసం తెచ్చానని చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక చెప్పారు. ప్రక్షాళనకు ముందే ఆయన్ను ఎందుకు టీటీడీ ఈవోగా తొలగించారు? శ్యామలరావు ఈవోగా ఉన్నప్పుడు కొన్ని నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి. అవే ట్యాంకర్లు.. మళ్లీ టీటీడీకి మరో డెయిరీ పేరుతో తిరిగి వచ్చినట్లు సీబీఐ సిట్ ధ్రువీకరించింది. మరి పాపం చేసింది ఎవరు చంద్రబాబూ? చంద్రబాబుకు ఇకనైనా బుద్ధి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. పూజలు చేయడం తప్పా..? మానవత్వం లేని చంద్రబాబుని ప్రశ్నిస్తూ.. ఆయనకు దేవుడు జ్ఞానోదయం కలిగించాలని ప్రార్థిస్తూ మా నాయకులు ఆలయాల్లో పూజలు చేశారు. ఆయనతోపాటు లోకేశ్, పవన్కల్యాణ్తో సహా ఇతర నాయకులకు బుద్ధి, జ్ఞానం కలగాలని, వారి చిప్ రిపేర్ చేయాలని మా నాయకులంతా గుళ్లల్లో పూజలు చేశారు. ఒక అబద్ధానికి రెక్కలు కట్టి దు్రష్పచారం చేస్తూ శ్రీవారి ప్రతిష్టను మంట కలిపేస్తుంటే మావాళ్లు గుళ్లలో పూజలు చేయడం తప్పా? ఇది హత్యాయత్నం కాదా..? లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ఆరోపణలు పచ్చి అబద్ధమని అంత స్పష్టంగా, అన్ని విధాలుగా తేలిన తర్వాత కూడా ఈ పెద్ద మనిషి ఫ్లెక్సీలు కట్టి తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా దు్రష్పచారం చేయడం ధర్మమేనా? ఆ ఫ్లెక్సీల్లో అన్యాయమైన మాటలు రాసి దు్రష్పచారం చేయడం న్యాయమేనా? చంద్రబాబు, లోకేశ్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రశ్నిస్తూ మా నాయకుడు జోగి రమేష్.. మీ చిప్ రిపేర్ చేసుకోమని సలహా ఇచ్చాడు. దానికి ఇంత అన్యాయమైన పని చేయడం ధర్మమేనా? సలహా ఇవ్వడం మినహా జోగి రమేష్ ఏమీ చేయలేదు. దానికే చంద్రబాబుకి అసహనం ఏస్థాయిలో వచ్చింది అంటే.. ఏకంగా యాసిడ్ బాటిల్స్, పెట్రోల్ బాంబులతో జోగి రమేష్ ఇంటి మీద దాడులు చేయించాడు. ఆ యాసిడ్ పడిన ప్రాంతంలో బండలు తీవ్రంగా కాలిపోయాయి. గోడల నిండా యాసిడ్ మరకలు కనిపిస్తున్నాయి. యాసిడ్ పడి డోర్లు కాలిపోయాయి. ఆ పక్కనే ఉన్న స్విచ్ బోర్డుల మీద పడి షార్ట్ సర్క్యూట్ అయితే పెద్ద ఘోరం జరిగి ఉండేది. ఇంట్లో ఉన్న కర్టెన్లు, ఉడెన్ ఫర్నీచర్లు కాలిపోతే పరిస్థితి తీవ్రరూపం దాల్చేది. ఇంట్లో 80 ఏళ్ల వయసున్న జోగి రమేష్ నాన్న నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇది హత్యాయత్నం కాదా? బీసీ నాయకుడిగా జోగి రమేష్ ఎదుగుతుంటే, ప్రభుత్వ తప్పులపై ఆయన వాయిస్ బలంగా వినిపిస్తుంటే.. ఆ గొంతు నొక్కే కుట్రలో భాగంగానే చంద్రబాబు ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలతో దాడులు చేయిస్తున్నాడు. పోలీసులతో కలిసి టీడీపీ కుట్ర..జోగి రమేష్ ఇంటి మీద సాయంత్రం ఐదు గంటలకు దాడి జరిగితే.. ఆ దాడికి సంబంధించి పోలీసులు, తెలుగుదేశం పార్టీ వ్యక్తులు ఏ రకంగా కుట్రలు చేశారనే దానికి ఈ ఫొటోనే సాక్ష్యం (పోలీసులతో టీడీపీ నాయకులు మంతనాలు జరుపుతున్న ఫొటోను చూపారు). ఇదే సర్కిల్లో డీసీపీ రామకృష్ణ, ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్తో టీడీపీ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు దాడులకు సంబంధించి వ్యూహరచన చేశాడు. జోగి రమేష్ను హత్య చేసి, ఇంటి మీద దాడి చేసి వారి ఆస్తులను ధ్వంసం చేసే కుట్రలకు ఇక్కడే పోలీసులతో టీడీపీ నాయకుడు మంతనాలు జరిపాడని క్లియర్గా తెలిసిపోతోంది. హత్యా యత్నం ఎలా చేయాలి? ఆ దాడికి పోలీసులు ఎలా సహకరించాలో పథక రచన చేశారు. ఏకంగా పోలీసులే టీడీపీ నాయకులతో కలిసి మధ్యాహ్నం 2 గంటల సమయంలో మంతనాలు జరిపారు. ఆ తర్వాత టీడీపీ నాయకులు ఏకంగా పోలీసులనే వెంటబెట్టుకుని కలసికట్టుగా జోగి రమేష్ ఇంటిపై దాడికి దిగారు.ఈ పాపాలు ఎవరివి బాబూ?» నాలుగు నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేసి.. మళ్లీ అదే నెయ్యి ట్యాంకర్లు మరో పేరుతో వస్తే ఆమోదించింది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే కదా.» అవే ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ తయారీకి వాడారని స్వయంగా సీబీఐ చెప్పింది. » చంద్రబాబు ప్రభుత్వం తప్పులు, వాళ్లు చేసిన అన్యాయాన్ని చార్జ్షీట్లో సీబీఐ రాసింది » టీటీడీ ఈవోగా అనిల్ సింఘాల్ను తీసుకొచ్చింది ఎవరు? » ప్రక్షాళన కోసం తెచ్చామన్న శ్యామలరావును తప్పించింది ఎవరు?ఇవిగో పచ్చి నిజాలు... సాక్ష్యాలుటీడీపీ నాయకుడు ఫతావుల్లా ఏకంగా యాసిడ్ బాటిల్, పెట్రోల్ బాంబులతో దాడి చేశాడు. దాడికి ముందు వాటితో ఉన్న ఫొటోల్లో క్లియర్గా చూడవచ్చు. పోలీసుల సమక్షంలోనే జోగి ఇంటిపైకి పెట్రోల్ బాంబులు విసిరి నిప్పంటించాడు. ఫతావుల్లాతోపాటు ఆశా అనే టీడీపీ కార్యకర్త కూడా జోగి రమేష్ ఇంటి మీద పోలీసుల సమక్షంలోనే రాళ్ల దాడి చేసింది. ఆశా కుమార్తె పెళ్లికి చంద్రబాబు కూడా హాజరయ్యాడు. (చంద్రబాబు, లోకేశ్, హోంమంత్రితో వారు దిగిన ఫొటోలు, ఆశా కుమార్తె పెళ్లికి హాజరైన చంద్రబాబు ఫొటోలు చూపించారు. పోలీసులతోనే కలసి వచ్చి వారి సమక్షంలోనే టీడీపీ నాయకులు దాడికి దిగిన వీడియోలు కూడా చూపారు). టీడీపీ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు, డీసీపీ, సీఐ మంతనాలు జరుపుతున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసులతో కలిసి టీడీపీ శ్రేణులు వస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. (టీడీపీ నాయకుడు బాటిల్ ఎగరేస్తూ పోలీసులతో కలిసి జోగి రమేష్ ఇంటి వద్దకు వచ్చిన వీడియో క్లిప్పింగ్స్ను మీడియాకు చూపారు). మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా? లేక జంగిల్ రాజ్లో ఉన్నామో చెప్పేందుకు ఈ వీడియోలే సాక్ష్యం. కల్తీ లిక్కర్ కేసుకు సంబంధించి తంబళ్లపల్లె కోర్టుకు హాజరయ్యేందుకు జోగి రమేష్ వెళ్తుండగా ఇక్కడ ఇబ్రహీంపట్నంలోని తన ఇంటిపై దాడి జరిగినట్లు ఆయనకు సమాచారం వచ్చింది. ఈ విషయంపై విజయవాడ సీపీకి ఫిర్యాదు చేసేందుకు జోగి రమేష్ ఫోన్ చేసినా స్పందించలేదు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి సమయంలోనూ ఇలాగే జరిగింది. అన్ని ఆధారాలున్నాయ్.. ఎవరినీ వదిలిపెట్టం.. దాడులు, విధ్వంసాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఎన్హెచ్ఆర్సీ నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రతి గడప తొక్కుతాం. న్యాయ పోరాటం చేస్తాం. రాష్ట్రంలో సాగుతున్న జంగిల్రాజ్ పాలనను దేశానికి తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వానికి ఇప్పటికే రెండేళ్లు పూర్తయ్యాయి. ఇక మిగిలింది మూడేళ్లే. ఆ తరువాత వచ్చేది మా ప్రభుత్వమే. ఇవాళ మా పార్టీ నాయకుల ఇళ్లపై గూండాగిరీ చేసిన ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెడతాం. ప్రతి ఒక్కరికీ శిక్ష తప్పదు.బీసీలంటే చంద్రబాబుకు చులకన.. తంబళ్లపల్లిలో టీడీపీ తరఫున పోటీ చేసిన వ్యక్తి నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశాడు. కమీషన్ల పంపకాల్లో తేడా రావడంతో ఆ వ్యవహారం బయటపడింది. ఆ కేసులో జయచంద్రారెడ్డిని అరెస్టు చేయాల్సింది పోయి సంబంధం లేని జోగి రమేష్ను కేసులో చేర్చారు. చంద్రబాబు రాజ్యంలో జోగి రమేష్ లాంటి వ్యక్తి నకిలీ లిక్కర్ తయారు చేయగలడా? ఆ లిక్కర్ను బెల్ట్ షాపుల్లోకి సరఫరా చేయగలరా? జోగి రమేష్ పై చంద్రబాబు ప్రభుత్వం 12 కేసులు పెట్టింది. చేయని నేరానికి 83 రోజులు జైలులో పెట్టారు. ఆయన కుమారుడు రాజకీయంగా యాక్టివ్ అవుతున్నాడని చిన్న పిల్లాడిపై ఏడు కేసులు పెట్టారు. జోగి రమేష్ భార్యపై పోలీసులే దౌర్జన్యం చేసి తిరిగి ఆమెపైనే కేసులు పెట్టారు. బీసీలపై చంద్రబాబుకు ఉన్న చులకన భావానికి జోగి రమేష్పై నమోదైన కేసులే నిదర్శనం. -
వైఎస్ జగన్ భద్రతపై వైఎస్సార్సీపీ ఆందోళన
సాక్షి,తాడేపల్లి: పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రపై వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల టీడీపీ గూండాల దాడికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని శుక్రవారం వైఎస్ జగన్ పరామర్శించారు. జోగి రమేష్ వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అయితే, తిరుగు ప్రయాణంలో జగన్ భద్రతను పోలీసులు పట్టించుకోలేదు. గ్రామాలు, ఇరుకైన రోడ్ల మీదుగా వైఎస్ జగన్ కాన్వాయ్ను మళ్లించారు. జగన్ భద్రతా సిబ్బందికి సైతం సమాచారం ఇవ్వలేదు. పూర్తి నిర్లక్ష్యం ఖాకీలు రెగ్యులర్ రహదారి మీదుగానే తీసుకువెళ్తున్నామని చెప్పి, చివరికి ఇరుకైన రోడ్ల మీదుగా కాన్వాయ్ను మళ్లించారు. ఈ ఉదయం పోలీసుల విజ్ఞప్తి మేరకు వైఎస్సార్సీపీ సహకరించింది. విజయవాడ ప్రధాన రహదారుల మీదుగా కాకుండా, పోలీసులు సూచించినట్టుగానే వెస్ట్రన్ బైపాస్ మీదుగా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటికి వెళ్లారు. కానీ తిరుగు ప్రయాణంలో ఎటు వెళ్తున్నామో పోలీసులు చెప్పలేదు. జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కలిగిన మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతను పోలీసులు గాలికి వదిలేయడం బాధాకరమని వైఎస్సార్సీపీ తీవ్రంగా విమర్శించింది. ఈ నిర్లక్ష్యాన్ని కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్లి, తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది. -
అబద్ధాన్ని సృష్టించి.. దానికి రెక్కలు కట్టి మరీ దుష్ప్రచారం చేశారు: వైఎస్ జగన్
విజయవాడ: వరుసగా వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ గూండాలు చేస్తున్న దాడులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు.అక్కడ(గుంటూరులో) అంబటి రాంబాబు ఇంట్లోకి చొరబడి విధ్వంసం.. ఇక్కడ జోగి రమేష్( విజయవాడ, ఇబ్రహీంపట్నం) ఇంటిపై పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాటిళ్లతో దాడులు చేయడం కూటమి ప్రభుత్వం అరాచక పాలనకు నిదర్శనమంటూ మండిపడ్డారు వైఎస్ జగన్. ఈరోజు(శుక్రవారం, ఫిబ్రవరి 06) జోగి రమేష్ ఇంట్లో దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన వైఎస్ జగన్.. ఆపై కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం,వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అంబటి రాంబాబు ఇంట్లో కొనసాగించిన జంగిల్ రాజ్ పరంపరను జోగి రమేష్ విషయంలో కూడా కొనసాగించారని ధ్వజమెత్తారు. ‘గుంటూరులో అంబటి రాంబాబు అన్న ఇంటిని.. ఇక్కడ జోగి రమేష్ అన్న ఇంటిని ధ్వంసం చేశారు. అంబటి రాంబాబు ఇంట్లోకి చొరబడ్డారు.. విధ్వంసం సృష్టించారు. అంబటి కుటుంబ సభ్యులపై దుర్భాషలాడారు. పక్కనున్న అంబటి ఆఫీస్ను కూడా తగలబెట్టారు. అంబటి ఇంట్లో, ఆఫీస్లో జరిగిన జంగిల్ రాజ్ను.. జోగి రమేష్ విషయంలో కూడా కొనసాగించారు. అసత్య ప్రచారం చేస్తున్న మీ చిప్ సరి చేసుకోమన్నందుకే జోగిరమేష్పై దాడి చేశారు. చిప్ సరిగ్గా లేకనే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేశారు. చిప్ సరిగ్గా లేకనే సీబీఐ రిపోర్టుపై అసత్య ప్రచారం చేశారు’ అంటూ వైఎస్ జగన్ విమర్శించారు.రెక్కలు కట్టి మరీ దుష్ప్రచారం...చంద్రబాబు అబద్ధాలను సీబీఐయే తేటతెల్లం చేసింది. తిరుమల లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదని సీబీఐ స్పష్టం చేసింది. జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసం కానీ ఎటువంటి పంది కొవ్వు కలపలేదని సీబీఐ రిపోర్ట్లో పేర్కొంది. శ్రీ వెంకటేశ్వరస్వామిని అగౌరపరిచిన, అవమానపరిచిన వ్యక్తి చంద్రబాబు. ఒక అబద్ధాన్ని సృష్టించి.. దానికి రెక్కలు కట్టి మరీ దుష్ప్రచారం చేశారు. లడ్డూలో జంతువుల కొవ్వు అంటూ విష ప్రచారం చేశారు. చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, చంద్రబాబు హయాంలో సేకరించిన నమూలను కేంద్ర సంస్థలైన ఎన్డీడీబీకి, ఎన్డీఆర్ఐకి పంపింది. ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పాయి. సీబీఐ ఇంకొకటి కూడా చెప్పింది. టీటీడీ చైర్మన్లుగా పని చేసిన తమ నేతలు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డిలు సమయంలో ఎటువంటి తప్పు జరగలేదని సీబీఐ క్లీన్చిట్ కూడా ఇచ్చింది. సీబీఐ ఇచ్చిన చార్జ్షీట్లో.. పేజ్ నం 62లో వాళ్లు మెన్షన్ చేసింది ఏమిటంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా జూలైలో టీటీడీ వాళ్లు నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు. అవే ట్యాంకర్లను దొడ్డిదారిని మళ్లీ టీటీడీకి రప్పించి, వాటినే వాడారని సీబీఐ చెప్పింది. మరి ఇప్పుడు పాపం చేసింది ఎవరు అనేది ప్రశ్నిస్తున్న చంద్రబాబుని. కూటమి నేతల్ని కూడా ప్రశ్నిస్తున్న తప్పు ఎవరు చేశారు? పాపం ఎవరు చేశారు? అని, జంతువుల కొవ్వు ఉందని గొడ్డుమాంసం ఉందని ఏ ల్యాబ్ రిపోర్ట్లు చెప్పాయి. ఎవరూ చెప్పలేదు. అది చంద్రబాబు సృష్టి. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబే సృష్టించారు’ అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అరాచకాన్ని నిలదీస్తే.. దాడులు చేస్తారా? ఒక అబద్ధాన్ని స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు సృష్టిస్తే.. దానికి ఆయన తనయుడు లోకేష్, పవన్ కళ్యాణ్లు వంత పాడారు. వీరికి ఎల్లో మీడియానే ఈ విషయాన్ని పదే పదే విష ప్రచారం చేశాయి. దుష్ప్రచారం చేసి దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు. ఆ దుష్ప్రచారం తప్పు అని చెప్పినప్పుడు.. చంద్రబాబు ఏం చేయాలి. క్షమించమని లెంపలు వేసుకోవాలి. తప్పుడు ప్రచారం చేశారు కాబట్టి వారి చిప్లు బాగు చేయమని గుడుల్లోకి పూజలు చేయడం తప్పా?, సీబీఐ క్లీన్చిట్ ఇచ్చినప్పడు.. తప్పుడు ఫ్లెక్సీలు కట్టి దుష్ప్రచారం మొదలుపెట్టారు. దాన్ని నిలదీస్తే.. ఈ అరాచకం మొదలుపెట్టారు. ఈ జంగిల్ రాజ్ పరిపాలన ఆరంభించారు’ అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.పోలీసులతో కలిసి టీడీపీ గూండాలు స్కెచ్దీన్ని ప్రశ్నించే వారిపై ఎటాక్ చేశారు. అంబటి రాంబాబు ఇంటిపై ఆపై జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేశారు. రమేష్ ఇంటిపై పెట్రోల్, యాసిడ్లతో దాడులు చేశారు. ఓ పెద్దాయన(జోగి రమేష్ తండ్రి) ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చేయడం హత్యాయత్నం కాదా? అని అడుగుతున్నా. జోగి రమేష్ ఇంటిపై దాడిక జరగకమునుపు.. కుట్ర చేశారు. నాలుగు గంటల ప్రాంతంలో దాడి జరిగితే.. రెండు గంటలకు ఓ స్కెచ్ వేశారు. పోలీసులే.. టీడీపీ నాయకులతో కలిసి స్కెచ్ వేశారు( జోగి రమేష్ ఇంటిపై దాడికి ముందస్తు పన్నాగం ఎలా చేశారో పలు దృశ్యాలను చూపిస్తూ) వైఎస్ జగన్ తూర్పూరాబట్టారు.. ఆశ. ఫతుల్లా, సుబ్బారావులు కలిసి పెట్రోల్ బాంబులతో జోగి రమేష్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. వీరంతా టీడీపీ నేతలే అనడానికి ఇవే రుజువులు అంటూ కొన్ని క్లిప్పింగ్స్ చూపించారు వైఎస్ జగన్. ఆశ కూతురు పెళ్లికి చంద్రబాబు వెళ్లడం, ఫతుల్లాకి లోకేష్కి సన్నిహిత సంబంధాలను వైఎస్ జగన్ మీడియా సాక్షిగా చూపించారు. దాడులకు సంబంధించి అన్నిఆధారాలున్నాయని, దీనిపై ఎన్హెచ్ఆర్సీ, సుప్రీంకోర్టులను ఆశ్రయిస్తామన్నారు వైఎస్ జగన్. మీకు చిత్తశుద్ధి లేదనడానికి ఇది నిదర్శనం కాదా?తాము తప్పు చేసి ఉంటే, తమ హయాంలో పని చేసిన అనిల్ సింఘాల్ను మళ్లీ టీటీడీ ఈవోగా ఎందుకు తెచ్చావ్ చంద్రబాబూ అని ప్రశ్నించారు వైఎస్ జగన్. ‘ గత చంద్రబాబు హయాంలో అనిల్ సింఘాల్ టీటీడీ ఈవోగా పని చేశారు. మేము ఆయన్ను మా హయాంలో కూడా కొనసాగించాము. ఇప్పుడు అదే అనిల్ సింఘాల్ను మళ్లీ టీటీడీ ఈవోగా చంద్రబాబు తెచ్చుకున్నారు. మరి ఇందులో అర్థమేమిటి చంద్రబాబు. అంటే చంద్రబాబు చేసే ఆరోపణలకు చిత్తశుద్ధి లేదు అనడానికి ఇది నిదర్శనం కాదా? అని అడుగుతున్నా. అదే సమయంలో టీటీడీ ఈవోగా చేసిన శ్యామలరావును తొలగించడానికి కారణాలను కూడా వైఎస్ జగన్ ప్రశ్నించారు. ‘ మీరు అధికారంలోకి రాగానే టీటీడీ ప్రక్షాళన అంటూ శ్యామలరావును తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ఆయన్ను తీసేశారు. టీటీడీ ప్రక్షాళన జరిగిందా చంద్రబాబు?అని వైఎస్ జగన్ నిలదీశారు. అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, అదే శ్యామలరావు టీటీడీ ఈవో ఉండగానే నాలుగు నెయ్యి ట్యాంకర్లు తిరుమలకు వచ్చాయని, వాటిని రిజెక్ట్ చేసి పంపితే మళ్లీ దొడ్డిదారిన అవి మళ్లీ అక్కడకే వచ్చాయనేది సీబీఐ చెబుతున్న నేపథ్యంలో ఇది చంద్రబాబు ప్రభుత్వానికి మచ్చ కాదా? అని ప్రశ్నించారు జగన్. -
జోగి రమేష్ ఇంటి వద్ద వైఎస్ జగన్ ప్రెస్ మీట్
-
దమ్మున్నోడి దెబ్బ.. ఒక్కడిని ఎదుర్కోవడానికి 9 మంది ప్రెస్ మీట్
-
జగన్ రాకతో జన జాతరను చూశారా? (ఫొటోలు)
-
జగన్ కోసం ఎదురుచూస్తున్న వల్లభనేని వంశీ
-
జగనన్న పాటకు డ్యాన్స్ లు వేసిన జనం
-
పిల్లాడిని ముద్దాడిన జగన్..
-
హైవే మధ్యలో కాన్వాయ్ అపి.. జనంతో జగన్ మమేకం
-
జగన్ పై పూల వర్షం.. అభిమానుల ఫుల్ జోష్!
-
అభిమానుల అంతులేని ప్రేమ.. జగన్ రియాక్షన్ చూడండి
-
జోగి రమేష్ ఇంటికి బయల్దేరిన జగన్ కాన్వాయ్...
-
ఏపీ కూటమి ప్రభుత్వానికి ఇదో గట్టి హెచ్చరిక!
మూలకు నెట్టేసి కొట్టే ప్రయత్నం చేస్తే పిల్లి కూడా పులిలా తిరగబడుతుందట. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూడా ఇప్పుడు పులుల్లా తిరగబడే పరిస్థితి వచ్చేసింది. అణచివేతలు, అడుగుఅడుగునా నిర్బంధాలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టడం తాజా తార్కాణం. టీడీపీ అరాచక శక్తుల దాడి బాధితుడైన వైసీపీ నేత అంబటి రాంబాబును పరామర్శకు ఈ స్థాయిలో జనాదరణ లభిస్తుందని ఎవరూ ఊహించలేదు. కేవలం 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఆరేడు గంటల సమయం పట్టిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు. పైగా ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న కూటమి ప్రభుత్వం ఈ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని శతధా ప్రయత్నించింది. జగన్ టూర్లో పాల్గొనడానికి వెళుతున్నారనుకుంటే చాలు.. ప్రజలను స్టేషన్లకు తరలించారన్న వార్తలొస్తున్నాయి. వైసీపీ కార్యకర్తలను, నేతలను ఇళ్లకే పరిమితం చేసేందుకూ ప్రయత్నాలు జరిగాయి. ఇళ్లపై నోటీసులు అతికించడం, కొందరిని గృహ నిర్బంధంలో ఉంచడం కూడా తెలియవచ్చింది. కానీ.. ఇవన్నీ జనాదరణ ముందు వెలవెలబోయాయి. జగన్ను చూసేందుకు, ఆయన వెంట నడిచేందుకు జనం ఉరకలెత్తారు. ఏడాదిన్నరగా మభ్యపెట్టేందుకు కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నం.. రెడ్బుక్ పేరిట సాగిస్తున్న దమనకాండలకు విసుగెత్తిన ప్రజలు ఇక చాలన్నట్టుగా రోడ్లపైకి వచ్చారు. జగన్తోనే మేము అన్న స్పష్టమైన సంకేతం ఇచ్చారు. తమ అసహనాన్ని తెలియచేశారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శిస్తానని మాత్రమే వైఎస్ జగన్ చెప్పారు. జనం తరలి రావాలన్న పిలుపు ఎక్కడా ఇవ్వలేదు. అయినా ఆయన పర్యటన అంటే చాలు.. రహదారులు జన సంద్రమవుతున్నాయి. జగన్ కార్యక్రమాలలో ఆయన ప్రసంగం ఒక ఎత్తయితే ఆయన కోసం తరలివచ్చే జన తరంగాలు ఇంకో ఎత్తు. ఇది కేవలం అభిమానం ఒక్కటితోనే సాధ్యమయ్యేది కాదు. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ, ఇష్టారాజ్య ధోరణలు కుదరవని ప్రజలిస్తున్న స్పష్టమైన సందేశం. జెన్-జీ నేతృత్వంలో నేపాల్లో జరిగిన తిరుగుబాటు లాంటిదన్నమాట. టీడీపీ గూండాలు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటిపై జరిపిన దాడి, మరో మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై పెట్రోలు బాంబులు విసరడం వంటి ఘటనలు సామాన్యులను సైతం ఆలోచించేలా చేశాయనడంలో సందేహం లేదు. శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వమే అరాచకశక్తులకు అండగా నిలబడటమూ వారిని కలవరానికి గురి చేసింది. ఏడాదిన్నర కాలంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడం కంటే.. వైసీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమాలకు పాల్పడటంపైనే ఎక్కువ దృస్టి పెట్టిందన్న సత్యం కూడా ప్రజలకు బోధపడినట్టు ఉంది. రెడ్బుక్ అమలు సంగతి సరేసరి. జగన్ గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. అంబటి టీడీపీ వారి బూతులకు స్పందించారే మినహా తనంత తాను దూషించలేదని స్పష్టం చేశారు. ఇదే విషయమై అంబటి వివరణ కూడా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీ మహిళా ఎమ్మెల్యే దంపతులు అంబటి ఇంటిపై దాడి చేయించి విధ్వంసం సృష్టించి, పార్టీ ఆఫీస్ను దగ్దం చేసిన ఘటనను విశ్లేషించి దీనంతటి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, వారి రెడ్ బుక్ అని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు విషపు విత్తనాలు నాటుతున్నారని, అవి పెరిగి చెట్లుగా మారితే టీడీపీకే నష్టమని కూడా హెచ్చరించారు. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు లేదని సీబీఐ స్పష్టం చేసినా కులమతాలను రెచ్చగొట్టేలా కూటమి నేతలు ఫ్లెక్సీలు కట్టడం ఏమిటని నిలదీశారు. జగన్ ప్రశ్నలకు ఇప్పటివరకూ సమాధానం లేదు. పైగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్లు లేని ఆరోపణలు మళ్లీ, మళ్లీ చేసి తిరుమల ఆలయానికి తీరని అపచారం చేస్తున్నారని, అప్రతిష్ట తెస్తున్నారని భక్తులు బాధపడుతున్నారు. అయినా వారు ఆ దిశగా ఆలోచించకుండా ఏదో కొత్త కమిటీ అంటూ మరో డ్రామాకు తెరదీస్తున్నారు. వారికి ఎల్లో మీడియా వంతపాడుతూ ప్రజల మనసులను కలుషితం చేయడానికి విశ్వయత్నం చేస్తోంది. అయితే ప్రజలు విజ్ఞతతో ఆలోచిస్తున్నారన్న విషయం నిఘా నివేదికలలో బయటపడుతోంది. ఈ నేపధ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఏకాంత మంతనాలు జరిపి తర్జనభర్జన పడినట్లు కనిపిస్తుంది.ఎల్లో మీడియా ద్వారా జగన్ కుట్రలు చేస్తున్నారని, దీనిపై జనంలోకి వెళ్లాలని వారు భావించారని రాయించారు. నిజానికి జంతు కొవ్వు ఆరోపణ మొదలు, నెయ్యి కల్తీ అంటూ ఫ్లెక్సీలు పెట్డడం, వైసీపీ నేతలపై,వారి ఇళ్లపై దాడులు చేయించడం వరకు కుట్రలు చేస్తున్నది టీడీపీ వారైతే, ఎల్లో మీడియా మాత్రం వైసీపీ అంటూ చంద్రబాబు పాటను ప్రజలలోకి తీసుకువెళ్లాలని చూస్తూ రోజురోజుకు దిగజారుతోంది. జాతీయ మానవ హక్కుల సంఘం, హైకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి గుణపాఠం కలగాలి. ఏపీలో జంగిల్ రాజ్ అంటే ఆటవిక పాలన సాగుతున్న తీరును వైసీపీ ఎంపీలు సాక్ష్యాధారాలతో చూపించగలిగారు. దాంతో ఫ్యాక్ట్ కమిటీని వేస్తామని కమిషన్ ఛైర్మన్ రామసుబ్రహ్మణ్యం చెప్పారని వార్తలు వచ్చాయి. అలాగే సాల్మన్ అనే వైసీపీ కార్యకర్త టీడీపీ వారి చేతిలో హత్యకు గురవడం, దళితులను గ్రామంలోకి రానివ్వకుండా టీడీపీ వారు అడ్డుకుంటున్న వైనంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసిందన్న సమాచారం వచ్చింది. ఇక ఏపీ పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వైసీపీ కార్యకర్తలను రోడ్డుపై నడిపిస్తూ అవమానిస్తున్న తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ వారు ఎంత పెద్ద నేరాలు చేసినా, పట్టించుకోకపోగా, కొన్నిచోట్ల వారికి పోలీసులే అండగా ఉంటున్న వైనం ప్రజలందరికి తెలిసిపోయింది.కూటమి ఇచ్చిన హామీలను విస్మరించి జనాన్ని మభ్య పెట్టడానికి పూనుకోవడం, విశాఖలో రూ.ఐదు వేల కోట్ల విలువైన భూమిని తమ బంధువైన లోక్సభ సభ్యుడు శ్రీభరత్ కాలేజీకి కట్టబెట్టడానికి సిద్దపడడం, ఇలా అనేక అంశాలలో ప్రజలకు కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోంది.నేరుగా స్పందించలేని పరిస్థితి ఉంది కనుక, తమ వద్దకు వచ్చిన జగన్పై అభిమానం కనబరచడమే కాకుండా, తమ మద్దతు ఇవ్వడం ద్వారా ప్రభుత్వంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారని భావించవచ్చు.ఇప్పటికైనా చంద్రబాబు సర్కార్ కళ్లు తెరుస్తుందా?ఇంకా కుట్రలనే నమ్ముకుంటుందా?,, :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జంగిల్రాజ్పై ఆగ్రహం.. జగన్ పర్యటనల్లో జనవాహిని
ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగంతో కూటమి ప్రభుత్వపు ఆటవిక పాలన కొనసాగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా.. తప్పుడు ప్రచారాలు, దాడులు, అరెస్టులతో ప్రతీకార రాజకీయాలు నడిపిస్తోంది. జనం ఈ జంగిల్రాజ్పై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ క్రమంలోనే జగన్ వెంట నడుస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ వెళ్లిన ప్రతీ చోటకు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. కూటమిని నమ్మి మోసపోయామని వాపోతున్నారు. మంచి ప్రభుత్వమంటూ ముంచేస్తోందని, పైగా శాంతి భద్రతలు ఘోరంగా దెబ్బ తిన్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ పోరాటాలకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఇది సాధారణంగానే కూటమి ప్రభుత్వానికి సహించడం లేదు. అందుకే జనాలను జగన్ దగ్గరగా వెళ్లకుండా.. శతవిధాల ప్రయత్నిస్తోంది. మొన్న గుంటూరు.. ఇవాళ ఇబ్రహీంపట్నం.. మొత్తం పోలీసుల ఆంక్షల వలయమే. కేవలం జగన్ వస్తున్నారని.. వైఎస్సార్సీపీ శ్రేణులు తరలి రాకూడదనేది వాళ్ల కూటమి ఆలోచన. కానీ, ఆ కుట్రను భగ్నం చేస్తూ జనాలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఎంతలా అంటే.. జగన్ను దగ్గరుండి వాళ్లే ముందుకు తీసుకెళ్లేలా!.జగన్ పర్యటనలతో కూటమి ప్రభుత్వం వణుకుతోంది. చివరి నిమిషంలో రూట్ మార్చమని నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు ఆదేశించినంత మాత్రాన పోలీసులు అత్యుత్సహాం ప్రదర్శించడం ఎందుకు?. జగన్ పర్యటనకు జనం స్వచ్ఛందంగా తరలి వస్తారు అని జోగి రమేష్ అన్నారు. జగన్ పర్యటనకు రూట్మ్యాప్ ముందే సమర్పించాం. అయినా చివరి నిమిషంలో కావాలనే రూట్మ్యాప్ మార్చమని నోటీసులు ఇచ్చారు. వైఎస్ జగన్కు వచ్చే జనాదరణను ఆపాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని ప్లాన్లు వేసినా.. జనాన్ని ఆపలేరు. జగన్ అభిమానుల్ని ఆపే శక్తి ప్రభుత్వానికి లేదు అని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. జగన్ పర్యటనకు జనం రాకుండా చేయాలని కూటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ప్రయోగిస్తోంది. కానీ, అది జరిగే పని కాదు. ఏం జరిగినా.. జగన్ వెంటే జనం ఉంటారు అని జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. -
జోగి రమేష్ ఇంటికి YS జగన్
-
ఇబ్రహీంపట్నంకు వైఎస్ జగన్
-
సుప్రీం కోర్టు కన్నా చంద్రబాబు గొప్పేంకాదు: వైఎస్ జగన్
వైఎస్ జగన్ పర్యటనపై చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది. అకస్మాత్తుగా రూట్ మార్చాలంటూ పోలీసుల నోటీసులు ఇచ్చారు. గుంటూరు జన ప్రభంజనం దెబ్బకి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. నేడు జోగి రమేష్ నివాసానికి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. కనకదుర్గ వారధి మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లనున్నారు. రెండు రోజుల కిందటే వైఎస్సార్సీపీ.. రూట్ మ్యాప్ ఇవ్వగా.. హఠాత్తుగా వైఎస్ జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. విజయవాడలోకి జగన్ని రానీయకుండా కుట్రలు పన్నుతున్నారు. -
జనాదరణకు బెంబేలెత్తి.. జగన్ పర్యటనపై ఆంక్షల కత్తి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న జనాదరణ చూసి చంద్రబాబు కూటమి ప్రభుత్వం బెంబేలెత్తుతోంది. జగన్ పర్యటనలప్పుడు ఎక్కడికక్కడ పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజాభిమానాన్ని నియంత్రించాలని చూస్తున్నా, సర్కారు కుయుక్తులు పారడం లేదు. బారికేడ్లు, చెక్ పోస్టులు, ఇతరత్రా అడ్డంకులను అధిగమించి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తుండటంతో చంద్రబాబు సర్కారుకు దిక్కుతోచడం లేదు. ఇలాగే వదిలేస్తే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత అత్యంత తీవ్రంగా ఉందనే సంకేతాలు వెళతాయని ఆందోళన చెందుతోంది. బుధవారం గుంటూరు పర్యటనలో వైఎస్ జగన్ ప్రజా ప్రభంజనాన్ని చూసి, శుక్రవారం పర్యటనకు మరింత అడ్డంకులు కలిగించేలా కుట్రకు తెరలేపింది. శుక్రవారం కనదుర్గ వారధి, ఆర్టీసీ బస్టాండు, భవానిపురం, గొల్లపూడి మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లి, టీడీపీ మూకల దాడిలో దెబ్బతిన్న మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసాన్ని వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. జోగి రమేశ్ను పరామర్శించునున్నారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రెండు రోజుల క్రితమే రూట్ మ్యాప్ను విడుదల చేసింది. అయినప్పటికీ గురువారం రాత్రి రూట్ మ్యాప్ మార్చుకోవాలంటూ విజయవాడ సీపీ రాజశేఖరబాబు ద్వారా నోటీసులు ఇప్పించడం ప్రభుత్వ కుట్రకు అద్దం పడుతోంది. బెజవాడలో బ్రహ్మరథం పడతారని.. జననేత పర్యటన విజయవాడ మీదుగా సాగనున్న నేపథ్యంలో ఎలాగైనా అడ్డుకోవాలని ప్రభుత్వం పోలీసులను పావులుగా వాడుకుంటోంది. బెజవాడలోనూ జననేత వైఎస్ జగన్కు ప్రజలు బ్రహ్మరథం పట్టే అవకాశం ఉందని పసి గట్టిన ప్రభుత్వం, రూట్ మ్యాప్ మార్చడం ద్వారా జనాభిమానాన్ని అడ్డుకోవచ్చుననే ఎత్తుగడకు తెరలేపిందని పరిశీలకులు చెబుతున్నారు. పరామర్శకు వెళ్తున్న వారిని మీరు ఆ రూట్లో వెళ్లకండి, ఈ రూట్లో వెళ్లండి అని పోలీసులు సూచించడం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే భావన వ్యక్తమవుతోంది. పోలీసులూ పెద్ద బాస్ చెప్పిందే తడవుగా, ఆయన వద్ద మార్కులు కొట్టేందుకు నోటీసులు జారీ చేశారనే చర్చ సాగుతోంది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నప్పుడూ పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. దాడిలో పాల్గొన్న వారిపై నామమాత్రం కేసులు పెట్టి, తిరిగి బాధితులపైనే తీవ్ర కేసులు నమోదు చేసి స్వామి భక్తి ప్రదర్శించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో పోలీసులు అభాసుపాలయ్యారు. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ రద్దీ సాకుతో.. ఇదిలా ఉంటే ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కనకదుర్గ వారధి మీదుగా కాకుండా వెస్ట్ బైపాస్ మీదుగా జోగి రమేశ్ ఇంటికి వెళ్లాలని వైఎస్ జగన్కు నోటీసు అందించినట్లు ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖరబాబు ప్రకటన ద్వారా తెలిపారు. -
నేడు జోగి రమేష్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన బీసీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం పరామర్శించనున్నారు. వైఎస్ జగన్ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి చేరుకుంటారు. టీడీపీ గూండాలు దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించి, జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం వైఎస్ జగన్ తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. -
వైఎస్ జగన్ పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్ర
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడ పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్రకు తెరలేపింది.వైఎస్ జగన్ శుక్రవారం విజయవాడ ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లనున్నారు. జోగిరమేష్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించనున్నారు. ఇప్పటికే ఇందుకోసం అవసరమైన అనుమతులు తీసుకున్నారు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా రూట్ మార్చాలని పోలీసుల నోటీసులు జారీ జారీ చేశారు. విజయవాడ సీపీ స్వయంగా వైఎస్ జగన్కు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. టీడీపీ గూండాల దాడితో భయాందోళనకు గురవుతున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబసభ్యుల్ని బుధవారం వైఎస్ జగన్ పరామర్శించారు. ఇందుకోసం తాడేపల్లి నివాసం నుంచి గుంటూరు పట్టాభిపురంలో అంబటి నివాసానికి వైఎస్ జగన్ వెళ్లారు. నిన్నటి వైఎస్ జగన్ గుంటూరు పర్యటనకు కదలి వచ్చిన జన ప్రభంజనాన్ని చూసి కూటమి ప్రభుత్వ కుట్రకు తెరలేపిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేపు మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లనున్న జగన్.. కనకదుర్గ వారధి మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోనున్నారు. రెండు రోజుల కిందటే పార్టీ రూట్ మ్యాప్ ఇచ్చినా, హఠాత్తుగా పోలీసులు ఆంక్షలు విధించడంతో పర్యటనపై కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు మరోసారి బయటపడ్డాయి. -
నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
-
రేపు జోగి రమేష్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, అమరావతి: టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన మాజీమంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 6న పరామర్శించనున్నారు. ఆ రోజు ఉ.10.30 కు తాడేపల్లి నివాసం నుంచి జగన్ ఇబ్రహీంపట్నం బయల్దేరుతారు.కనకదుర్గ వారధి, ఆర్టీసీ బస్టాండ్, భవానీపురం, గొల్లపూడి, గుంటుపల్లి, తుమ్మలపాలెం మీదుగా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. వైఎస్ జగన్ మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
అపోలో హాస్పిటల్స్ ప్రతాప్రెడ్డికి వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: అపోలో ఆస్పత్రుల గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డికి ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఒక సాధారణ డాక్టర్ స్థాయి నుండి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందేలా సాగిన మీ ప్రయాణం స్ఫూర్తిదాయకం. మీరు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. Warmest birthday wishes to Dr. Prathap C. Reddy Garu. Your journey from a professional physician to a global healthcare pioneer has been exemplary. Wishing you good health and happiness always. pic.twitter.com/qYgaPHxb06— YS Jagan Mohan Reddy (@ysjagan) February 5, 2026


