-
వచ్చేస్తోంది కొత్త ఐఫోన్
శాన్ ఫ్రాన్సిస్కో: త్వరలో కొత్త ఐఫోన్ వెర్షన్ను ప్రవేశపెట్టనుందన్న వార్తలకు ఊతమిస్తూ టెక్ దిగ్గజం యాపిల్ వచ్చే నెల 10న సిలికాన్ వేలీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అధికారికంగా ఇన్విటేషన్లు పంపింది. సాధారణంగా ఏటా క్రిస్మస్ షాపింగ్ సీజన్కు ముందు.. ఇలాంటి కార్యక్రమంలోనే యాపిల్ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తూ వస్తోంది. ఈసారీ సెప్టెంబర్ 10న జరిగే కార్యక్రమంలో ’ఐఫోన్ 11’ హ్యాండ్సెట్స్ను కూడా ఆవిష్కరించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తం మూడు ఐఫోన్ 11 మోడల్స్ను ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్ని అప్గ్రేడ్ చేసి ఎక్స్ఎస్, ఎక్స్ఆర్ మోడల్స్ను కొత్త రూపంలో ఆవిష్కరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఐఫోన్ ఎక్స్ఎస్ సిరీస్ స్థానంలో వచ్చే కొత్త ఐఫోన్ 11 మోడల్లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉండవచ్చన్న అంచనాలు ఉన్నాయి. -
బంపర్ ఆఫర్: ఐఫోన్లపై భారీ తగ్గింపు
2018 కొత్త ఐఫోన్ మోడల్స్... ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్ఆర్ లాంచింగ్ సందర్భంగా, పాత ఐఫోన్ వేరియంట్లపై భారీగా ధరలు తగ్గించింది ఆపిల్. దేశీయ మార్కెట్లోనూ, గ్లోబల్గా కూడా వీటి ధరలు తగ్గాయి. దేశీయ మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 6ఎస్ 32జీబీ వేరియంట్ ధర రూ.29,900కే లభ్యమవుతుంది. ఐఫోన్ 6ఎస్ ప్లస్ బేస్ వేరియంట్ ధర కూడా 34,900 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్ కొత్త ధరలను ఆపిల్ తన వెబ్సైట్లో అప్డేట్ చేసింది. అయితే ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్, ఐఫోన్ 10 లను అమెరికాలో నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. కానీ భారత్లో కేవలం ఐఫోన్ ఎస్ఈ నే నిలిపివేసింది. మిగతా మూడు ఐఫోన్లను తక్కువ ధరలకు అందుబాటులోకి తెచ్చింది. ఐఫోన్ మోడల్ కొత్త ధర పాత ధర ఐఫోన్10 (256 జీబీ) రూ.1,06,900 రూ.1,08,930 ఐఫోన్10 (64 జీబీ) రూ.91,900 రూ.95,390 ఐఫోన్ 8 (64జీబీ) రూ.59,900 రూ.67,940 ఐఫోన్ 8 (256జీబీ) రూ.74,900 రూ.81,500 ఐఫోన్ 8 ప్లస్ (64జీబీ) రూ.69,900 రూ.77,560 ఐఫోన్ 8 ప్లస్ (256జీబీ) రూ.84,900 రూ.91,110 ఐఫోన్ 7 (32జీబీ) రూ.39,900 రూ.52,370 ఐఫోన్ 7 (128జీబీ) రూ.49,900 రూ.61,560 ఐఫోన్ 7 ప్లస్ (32జీబీ) రూ.49,900 రూ.62,840 ఐఫోన్ 7 ప్లస్ (128జీబీ) రూ.59,900 రూ.72,060 ఐఫోన్ 6ఎస్ (32జీబీ) రూ.29,900 రూ.42,900 ఐఫోన్ 6ఎస్ (128జీబీ) రూ.39,900 రూ.52,100 ఐఫోన్ 6ఎస్ ప్లస్ (32జీబీ) రూ.34,900 రూ.52,240 ఐఫోన్ 6ఎస్ ప్లస్ (128జీబీ) రూ.44,900 రూ.61,450 -
షాకింగ్ : ఆన్లైన్లో నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం
ఆన్లైన్లో స్మార్ట్ఫోన్లను కొంటున్నారా? అయితే కాస్త చూసి కొనుగోలు చేయండని పలు హెచ్చరికలు జారీ అవుతున్నాయి. తాజాగా వడోదరలో భారీ ఫేక్ మొబైల్ హ్యాండ్సెట్ రాకెట్ వెలుగుచూసింది. ఈ రాకెట్లో కీలక సూత్రధారి అయిన ఓ వ్యక్తిని వడోదర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తి నకిలీ హ్యాండ్సెట్లను తయారుచేసి, వాటిని ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా విక్రయిస్తున్నట్టు పోలీసులు కనుగొన్నారు. అంతేకాక ఈ వ్యక్తి నుంచి రూ.24 లక్షల విలువైన నకిలీ మొబైల్ హ్యాండ్సెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ హ్యాండ్సెట్లపై తాము ఇప్పటికే పలు ఫిర్యాదులను అందుకున్నామని, కాపీరైట్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. నకిలీ మొబైల్ హ్యాండ్సెట్ల రాకెట్లో కీలకదారి అయిన ఈ వ్యక్తి దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు నకిలీ యూనిట్లను అమ్మినట్టు విచారణలో తేలింది. నకిలీ డివైజ్లలో ముఖ్యంగా ఐఫోన్ ఎక్స్, శాంసంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్ఫోన్లు ఉన్నట్టు తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. రూ.50వేలకు పైన ఖరీదు ఉన్నవాటినే నకిలీలు రూపొందించి, ఆన్లైన్ కస్టమర్లకు అమ్మినట్టు తేల్చారు. అయితే కస్టమర్లు తాము కొనుగోలు చేయాలనుకునే స్మార్ట్ఫోన్ అసలైనదా? కానిదా? తెలుసుకునేందుకు ప్రతి ఫోన్పై ఐఎంఈఐ నెంబర్ను చెక్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. *#06# నెంబర్కు డయల్ చేసినా కూడా ఐఎంఈఐ నెంబర్, సంబంధిత మొబైల్ కంపెనీదా? కాదా? అని తెలిసిపోతుందన్నారు. -
ఐఫోన్ ఎక్స్ అద్దె రూ.4,299
ఫర్నీచర్, ఎలక్ట్రానిక్స్, వెహికిల్స్ను అద్దెకు తీసుకుని వాడుకోవడం తెలిసే ఉంటుంది. కానీ స్మార్ట్ఫోన్ అద్దెకు తీసుకోవడం మాత్రం ఇదే తొలిసారి. కన్జ్యూమర్ రెంటల్ వెబ్సైట్ రెంటోమోజో, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్స్, వెహికిల్స్తో పాటు స్మార్ట్ఫోన్లను అద్దెకు ఇవ్వడం ప్రారంభించింది. ఈ ప్లాట్ఫామ్ ఫ్లాగ్షిప్ డివైజ్లు ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8, గూగుల్ పిక్సెల్ 2, శాంసంగ్ గెలాక్సీ ఎస్9, శాంసంగ్ గెలాక్సీ నోట్ 8లను ఆరు నెలలకు, ఏడాదికి, రెండేళ్లకు అద్దెకు ఇవ్వడం ఆఫర్ చేస్తోది. ఈ స్మార్ట్ఫోన్ల అద్దె నెలకు రూ.2,099 నుంచి ప్రారంభమై, రూ.9,299 వరకు ఉంది. రెండేళ్ల అద్దె తర్వాత ఆ స్మార్ట్ఫోన్ యూజర్లు తమ సొంతం కూడా చేసుకునే ఆప్షన్ను రెంటోమోజో ఆఫర్ చేస్తోంది. రెంటోమోజో వెబ్సైట్లో ఐఫోన్ ఎక్స్ అద్దె నెలకు 4,299 రూపాయలుగా ఉంది. ఒకవేళ 24 నెలలు పాటు అద్దెకు దీన్ని బుక్ చేసుకోవాలంటే 4,299 రూపాయలను నెల నెలా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆరు నెలలకు దీన్ని అద్దెకు తీసుకోవాలనుకుంటే, నెలకు రూ.9,299ను చెల్లించాలి. ఎక్కువ కాలం పాటు అద్దెలు, వినియోగదారులకు ఎక్కువ ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నాయి. ఒకవేళ 24 నెలల తర్వాత ఈ ఐఫోన్ ఎక్స్ మీకు కావాలంటే అదనంగా రూ.15,556ను చెల్లించాలి. తొలుత రీఫండబుల్ డిపాజిట్గా 9,998 రూపాయలను కూడా రెంటోమోజో తీసుకుంటోంది. అత్యంత తక్కువ అద్దె గూగుల్ పిక్సెల్ 2 స్మార్ట్ఫోన్పై ఉంది. 24 నెలల కాలానికి నెలవారీ 2,099 రూపాయలను చెల్లించాలి. ఆరు నెలలకు దీని అద్దె నెలవారీ 5,398 రూపాయలుగా ఉంది. గూగుల్ పిక్సెల్ 2 స్మార్ట్ఫోన్కు కూడా రూ.5,398 రీఫండబుల్ డిపాజిట్ చెల్లించాలి. అలాగే ఐఫోన్ 8, శాంసంగ్ గెలాక్సీ ఎస్9, గెలాక్సీ నోట్ 8లు కూడా అద్దెకు అందుబాటులో ఉన్నాయి. రెంటోమోజో అద్దెకు ఉంచిన డివైజ్లన్నీ ఖరీదైనవే. కొంత కాలమైనా ఆ ఫోన్లను వాడాలనే ఆశ కలిగి వారికి, రెంటోమోజో ఈ బంపర్ కానుకను అందిస్తుంది. -
ఐఫోన్ ఎక్స్పై భారీ ఆఫర్
ఆకర్షణీయమైన క్యాష్బ్యాక్లు, మార్కెటింగ్ ఆఫర్లతో పేటీఎం మాల్ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దీనిలో భాగంగా ఈ సంస్థ ‘ఫ్రీడం క్యాష్బ్యాక్ సేల్’ను నిర్వహిస్తోంది. ఆగస్టు 8 నుంచి ప్రారంభమైన ఈ సేల్, ఆగస్టు 15 వరకు కొనసాగనుంది. ఈ ఫ్రీడం క్యాష్బ్యాక్ సేల్లో భాగంగా ఐఫోన్ అభిమానుల కోసం ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన ఐఫోన్ ఎక్స్(64జీబీ)ను కేవలం 67,298 రూపాయలకే విక్రయిస్తోంది. దీని అసలు ధర 92,798 రూపాయలుగా ఉంది. ఫ్రీడం క్యాష్బ్యాక్ సేల్లో ఐఫోన్ ఎక్స్పై ఫ్లాట్ 10వేల రూపాయల క్యాష్బ్యాక్ను ఆఫర్ చేస్తోంది. దీంతో ఐఫోన్ ఎక్స్(64జీబీ) పేటీఎం మాల్లో రూ.82,798కి అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు తమ క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే అదనంగా మరో 1,250 రూపాయల క్యాష్బ్యాక్ ఇస్తోంది. పాత ఫోన్ల ఎక్స్చేంజ్లో ఈ స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఐఫోన్ ఎక్స్ ధర మరో రూ.14,250 తగ్గుతోంది. దీంతో మొత్తంగా ఐఫోన్ ఎక్స్ 64జీబీ వేరియంట్ ధర 67,298 రూపాయలకు దిగొస్తోంది. మరోవైపు పేటీఎం మాల్ నిర్వహిస్తున్న సేల్లో ల్యాప్టాప్లపై ఏకంగా 20 వేల రూపాయల వరకు ధర తగ్గించింది. ఇంటెల్ కోర్ ఐ3, 4జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ స్పేస్, ఏడాది పాటు యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కలిగిన లెనోవో ఐడియాప్యాడ్ 320 ధర పేటీఎం మాల్లో రూ.22,490కు తగ్గింది. అదేవిధంగా ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ స్పేస్ కలిగిన డెల్ వోస్ట్రో 3578 ల్యాప్టాప్పై ఫ్లాట్ 6000 వేల రూపాయల వరకు క్యాష్బ్యాక్ లభిస్తోంది. ఎంఎస్ఐ జీఎల్63 8ఆర్ఈ-455ఐఎన్ గేమింగ్ ల్యాప్టాప్పై రూ.20వేల క్యాష్బ్యాక్ను పేటీఎం మాల్ తన కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది. 13 శాతం తగ్గింపు, 11000 రూపాయల క్యాష్బ్యాక్ ఆపిల్ మ్యాక్బుక్ ఎయిర్ ఎంక్యూడీ42హెచ్ఎన్/ ల్యాప్టాప్పై కస్టమర్లకు అందుతుంది. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రొ కోర్ ఐ5 ల్యాప్టాప్పై 10 వేల రూపాయల క్యాష్బ్యాక్ అందుబాటులో ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
కాన్వాయ్ స్లో చేసి అంబులెన్స్కు దారిచ్చిన సీఎం జగన్ (ఫొటోలు)
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
ఎల్లో శారీలో హీరామండి హీరోయిన్ సంజీదా షేక్ లుక్స్.. ఫోటోలు
ఇంటింటి ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి (ఫొటోలు)
జగన్ పాటకే భయపడ్డారు!
‘ప్రియాంక గాంధీ కాంగ్రెస్కు రెబల్గా మారనుంది’
భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement