‘స్టార్ క్యాంపెయినర్లతో నేను..’ వారెవ్వా.. ఇది కదా జగనన్న అంటే!
కర్నూలు, సాక్షి: ‘‘నాకు వాళ్లలా మీడియా సంస్థల అండదండలు లేవు. నా తరఫున ప్రచారం చేయడానికి పొరుగు రాష్ట్రం నుంచి తెచ్చుకున్న స్టార్ క్యాంపెయినర్లు లేరు. నేను నమ్ముకుంది పైన ఉన్న ఆ దేవుడ్ని.. కింద ఉన్న మిమ్మల్ని’’ అంటూ ప్రజల్ని ఉద్దేశించి ప్రతీసారి ప్రసంగిస్తుంటారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అందుకు తగ్గట్లే సామాన్య ప్రజలు.. సంక్షేమ లబ్ధిదారులు.. అందునా పేద ప్రజలే తన స్టార్ క్యాంపెయినర్లు అని ప్రకటించేసుకున్నారాయన. మరి..
అలాంటి స్టార్ క్యాంపెయినర్లను పరిచయం చేయాల్సిన అవసరం ఉందా? లేదా?.. తాజాగా తన స్టార్ క్యాంపెయినర్లతో ఆయన ఫొటోలు దిగారు. ఆ ఫొటోలను సంతోషంగా ఆయన తన ఎక్స్ ఖాతాలో స్వయంగా పంచుకున్నారాయన.
మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేపట్టిన సీఎం జగన్.. మూడో రోజు కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో యాత్ర కొనసాగిస్తున్నారు. దారి పొడవునా జనం తన కోసం ఎదురు చూస్తున్న కొందరు అవ్వా, అక్కాచెల్లెమ్మలను చూసి.. బస్సు దిగి వచ్చి ఆప్యాయంగా పలకరించారు. వాళ్లలో కొందరు సాయం కోరగా.. అందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని పక్కనే ఉన్న అధికారుల్ని ఆదేశించారాయన.
With my star campaigners from Day-3 of the Memantha Siddham Yatra. #MemanthaSiddham#VoteForFan pic.twitter.com/8tLvQPjxeM
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 29, 2024