-
Banaganapalle: ఓటమి భయంతో దాడులకు తెగబడిన బీసీ జనార్ధన్రెడ్డి
కోవెలకుంట్ల: ఓ వైపు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటం.. మరో వైపు ప్రజల్లో సరైన ఆదరణ కనిపించకపోవడంతో టీడీపీ అభ్యర్థుల్లో ఓటమి భయం వెంటాడుతోంది. ఈ క్రమంలో బనగానపల్లె నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బీసీ జనార్ధన్రెడ్డి ఎలాగైనా ఓటర్లను నయానో.. భయానో తమ వైపు మళ్లించుకునేందుకు ప్రధాన అస్త్రాలను బయటకు తీస్తున్నాడు. ఇప్పటికే రెండు నెలల నుంచి విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నాడు. వీటి ద్వారా గెలుపుసాధ్యం కాదని భావించి తాజాగా భౌతిక దాడులకు దిగాడు. మంగళవారం బనగానపల్లె పట్టణంలో కూరగాయల మార్కెట్ వద్ద బీసీ జనార్ధన్రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ సమక్షంలో టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. రౌడీయిజం ప్రదర్శిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులపై కర్రలు, రాడ్లతో దాడిచేశాయి. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎన్నికల వేళ ఓటమి భయంతో బరితెగింపు చర్యలకు పాల్పడటంతో ఓటర్లు భయాందోళన చెందుతున్నారు. వ్యాపారవేత్తగా భూకబ్జాలతో కోట్లాది రూపాయలు గడించిన బీసీ జనార్దన్రెడ్డి 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ ప్రవేశం చేశాడు. ఈ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. మొదటిసారి ఎమ్మెల్యే కావడంతో నియోజకవర్గంలోని వివిధ వర్గాల ప్రజలపై విశ్వరూపం చూపాడు. ప్రభుత్వ ఉద్యోగులకు నరకం చూపించాడు. ఐదేళ్లపాటు నీరు– చెట్టుపేరుతో కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును దోచుకున్నాడు. దీంతో 2019 ఎన్నికల్లో నియోజకవర్గ ఓటర్లు బీసీకి బుద్ధి చెప్పి ఓడించారు. ఈ నెల 13వ తేదీన 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉండటంతో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో డబ్బులు, ప్రలోభాలు, భౌతిక దాడులను ఎన్నికల అ్రస్తాలుగా ఎంచుకున్నాడు.ప్రజా బలం లేక.. 2019లో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమం, అభివృద్ధితో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసి నవరత్న పథకాల్లో మహిళలకే అధిక ప్రాధాన్యత కలి్పంచి పేదరిక నిర్మూలను కృషి చేశారు. పేదలు, పెత్తందారుల మధ్య జరుగుతున్న ఎన్నికల్లో పెత్తందారులు టీడీపీ వైపు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల పక్షాన పోరాటం చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్సార్సీపీ బనగానపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రామిరెడ్డికి గ్రామాల్లో వస్తున్న ఆదరణను ఓర్వలేక ఈ ఎన్నికల్లో మరలా ఓటమి తప్పదని భావించాడు. ఎలాగైనా గెలవాలన్న కుతంత్రంతో బరి తెగింపు చర్యలకు పాల్పడుతున్నాడు. నియోజకవర్గంలో ఆ పారీ్టకి ప్రజాబలం లేకపోవడంతో డబ్బును ప్రధాన అస్త్రం చేసుకుంది. అరకొరగా నిర్వహిస్తున్న ప్రచారానికి సైతం అద్దె కార్యకర్తలపై ఆధార పడాల్సి రావడంతో ఆ పార్టీ శ్రేణులను కలవర పరుస్తోంది. సొంత నేతలకు వడ్డీ లేని రుణాలు..ఓటర్లకు టోకెన్లు ఎన్నికలు సమీపిస్తుండంతో గెలుపుకోసం బీసీ కుయుక్తులకు తెరలేపాడు. పారీ్టలో చేరిన వైఎస్సార్సీపీ గ్రామ నాయకులకు కేడర్ను బట్టి రూ. 3 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు డబ్బులు ముట్టజెప్పాడు. ఇందులో ఎక్కువభాగం కొలిమిగుండ్ల మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ నాయకులకు డబ్బులు అందజేశాడు. అలాగే టీడీపీలో కొనసాగుతున్న నాయకులకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నాడు. ఒక్కో నాయకుడికి రూ. 5 లక్షల నుంచి రూ. 20 లక్షలవరకు వడ్డీలేని రుణాలు ఇచ్చాడు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఓటర్లకు ఓటరుస్లిప్లు అందజేస్తున్నారు. ‘బాబు ష్యూరిటీ– భవిష్యత్ గ్యారెంట్’ పేరుతో ఓటరు స్లిప్కు మరోవైపు టోకన్ ముద్రించిన స్లిప్లు పంపిణీ చేశారు. త్వరలో పట్టణ ప్రాంతాల్లో ఓటుకు రూ. 3 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 2 వేల చొప్పున డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. డబ్బులు పంపిణీ చేసే రోజు ఓటర్స్లిప్కు ఉన్న టోకెన్ చూపించిన వారికి డబ్బులు అందజేయనున్నారు. టీడీపీ సానుభూతి పరులైన ఓటర్లు, తటస్ట ఓటర్లకు స్లిప్లు పంపిణీ చేశారు. హత్యాయత్నం కేసులో జైలు..మొదటి నుంచి బీసీ జనార్ధన్రెడ్డికి క్రూరస్వభావం ఉంది. ప్రతి చిన్న విషయంలో జోక్యం చేసుకుని అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెట్టే నైజం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఆ పారీ్టకి అనుకూలంగా ఉన్నాడన్న నెపంతో బనగానపల్లె పట్టణానికి చెందిన ఎస్టీ వర్గానికి చెందిన కోనేటి దుర్గ అనే వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ కేసులో బీసీ నెల రోజులపాటు కటకటాలపాలైన విషయం తెలిసిందే. ఆ క్రూరత్వాన్ని మళ్లీ ప్రదర్శిస్తున్నాడు. సామ, వేద, దండోపాయాలు ప్రదర్శించి ఎన్నికల్లో గెలవాలని కుతంత్రం చేస్తున్నాడు. ఎన్నికలకు ముందే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న బీసీ రాబోయే రోజుల్లో మరెంత బరి తెగిస్తాడని బనగానపల్లె ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వ్యక్తికి త్వరలో జరగబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఓటర్లు నిర్ణయించుకున్నారు. -
Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
అనకాపల్లి: మూడు పార్టీలు కలిసినా అనకాపల్లిలో ఎదురీత తప్పలేదు. 15 సంవత్సరాలు ప్రజలకు దూరంగా ఉన్న కొణతాల రామకృష్ణను చాలామంది గుర్తు పట్టడం లేదు. దీనికితోడు ఆనాటి ఆయన సోదరుల ఆగడాలు గుర్తుకు తెచ్చుకొని.. ఆ తలనొప్పి మాకొద్దు బాబోయ్ అంటున్నారు. 2004లో కొణతాలను గెలిపించి మూడు శాఖల మంత్రిని చేసిన వైఎస్సార్ అభిమానులను పక్కన పెట్టి తన సోదరుల సంపద సృష్టికే పరితపించిన కొణతాల.. 2009 ఎన్నికల్లో పరాజయం పాలై అనకాపల్లిని వదిలి విశాఖకు మకాం మార్చేశారు. తనను నమ్ముకున్న క్యాడర్ను గాల్లో వదిలేశారు. ఆనాటి కొణతాల వర్గమంతా వైఎస్సార్సీపీలో చేరి ఇప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ తదితర పదవుల్లో ఉన్నారు. 2019లో గుడివాడ అమర్నాథ్ వెంట నడిచిన వీరంతా ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ గెలుపునకు కృషి చేస్తున్నారు. 15 ఏళ్ల తర్వాత ప్రజల్లోకొచ్చిన కొణతాల జనసేన పార్టీలో చేరి, టీడీపీ, బీజేపీ పొత్తుతో అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగారు. కానీ క్యాడర్ కరువై విలవిల్లాడుతున్నారు. తమ పాత వర్గమంతా కొణతాల గెలుపు కోసం పనిచేయాలని ఆయన సోదరుడు పెదబాబు కోరినప్పటికి ప్రయోజనం లేకపోయింది. దీంతో కనీసం కొణతాలకు వ్యతిరేకంగా చురుగ్గా పనిచేయకుండా గమ్మున కూర్చోవాలని ఆయన తెరవెనుక బెదిరింపులకు దిగుతున్నారట. కొందరు నాయకులకు ఫోన్లు చేసి అసభ్య పదజాలంతో మాట్లాడుతూ.. మీ సంగతి చూస్తానంటూ దురుసుగా మాట్లాడుతున్నారట. మీ బెదిరింపులకు ఎవరు భయపడతారని, మా మీద మీ పెత్తనమేమిటని వారంతా ఎదురుతిరగడంతో చేసేది లేక పెదబాబు మిన్నకుండిపోయారట. కొణతాల రామకృష్ణ మంత్రిగా ఉన్న కాలంలో అనకాపల్లికి చేసిందేమీలేదు. ప్రజలు ఆయన్ను కలిసి సమస్యలు చెప్పుకునే పరిస్ధితి ఏనాడూ లేదు. నియోజకవర్గంలో పాలన, అధికారం మొత్తం ఆయన సోదరులు పెదబాబు, రఘుబాబులదే. వ్యాపారులను బెదిరించి నెలవారీ మామూళ్లతో దోచుకున్నారు. సమస్యలపై వస్తే గంటలపాటు నిల్చోబెట్టేవారు. వారి ఆగడాలతోనే కొణతాల పరాజయం పాలయ్యారని అనకాపల్లిలో అందరూ చెప్పేమాట. తాను గెలిస్తే వారి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తానని, రాజకీయాల్లో వారి పాత్ర లేకుండా చేస్తానని మద్దతిస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు కొణతాల ఇచ్చిన హామీ పెదబాబు బెదిరింపులతో మూలకు చేరింది. -
ప్రతి ఇంటికీ ఆడబిడ్డనయ్యా
సాక్షి, పార్వతీపురం మన్యం: ఏజెన్సీలో గిరిజన ప్రజలందరికీ నేను ఆత్మబంధువును. నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ ఆడబిడ్డనయ్యాను. పదేళ్లుగా పాలకొండ నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరిస్తూ అండగా నిలుస్తున్నారు. ఈ ప్రేమాభిమానాలు మున్ముందూ ఇలాగే సాగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. నియోజకవర్గంలోని 102 సచివాలయాల పరిధిలోని దాదాపు 78 వేల గడపల వద్దకు వెళ్లి వారందరితో మమేకమయ్యా. కష్టసుఖాలు తెలుసుకున్నా. ఇన్ని వేల కుటుంబాలను నాకు ఇచ్చింది జగనన్నే.’’ అని పాలకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థిని విశ్వాసరాయి కళావతి అన్నారు. పాలకొండ నియోజకవర్గంలో ఇంతవరకు చేసిన అభివృద్ధి, ఇంకా చేయబోయే పనులు..కూటమి దుష్ప్రచారం తదితర అంశాలను ‘సాక్షి’తో ముఖాముఖిలో ఆమె వివరించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ప్రజల కోసమే..పదవిమా కుటుంబంలో చాలామంది ఎమ్మెల్యేలున్నారు. నేను రెండుసార్లు గెలిచాను. పదవులు మాకు ము ఖ్యం కాదు. విలువలతో కూడిన ఎదుగుదల మా పెద్దల నుంచి నేర్చుకున్నా. అందుకే ఎప్పుడూ నిరా డంబరంగా ఉంటా. మా ప్రజల ప్రతి కష్టసుఖంలో నూ తోడుగా ఉంటా. వారితో కలిసిపోతాను. ఎప్పు డూ ప్రజల్లోనే ఉండాలని మా అధినేత జగన్మోహన్రెడ్డి చెబుతుంటారు. అందుకే అందరూ నన్ను ఆశీర్వదిస్తూ, వారి బిడ్డగా చూసుకుంటారు. ఇప్పు డు ప్రచారానికి వెళ్లినప్పుడు కూడా ఎక్కడికక్కడ బ్రహ్మరథం పడుతున్నారు. మళ్లీ వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో మరింతగా ప్రజలకు సేవ చేసుకుంటాం.ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అయితేనే తమకు మేలు చేస్తాడన్న నమ్మకం, భరోసా గిరిజనులందరిలోనూ ఉందని వైఎస్సార్సీపీ పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వాస రాయి కళావతి అన్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో వివిధ సంక్షేమ పథకాల కింద దాదాపు రూ.1,300 కోట్ల మేర నియోజకవర్గంలోని పేదలకు అందించామని చెప్పారు. నాన్ డీబీటీ కింద సుమారు రూ.218 కోట్ల మేర వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులు పొందారని వివరించారు. గడిచిన 59 నెలల కాలంలోనే ఇదంతా సాధించామని చెప్పారు. ఎన్నికలొచ్చాయని ప్రజల ముందుకు బూటకపు హామీలతో వస్తున్న విషపు కూటమి నేతలను ఎవరూ నమ్మవద్దని హితవు పలికారు.సంపూర్ణంగా మహిళా సాధికారత2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అమలు చేసిన నవరత్నాల పథకాలు ప్రతి ఇంటికీ అందాయి. జీవితాలను బాగు చేశాయి. గతంలో ఏ ప్రభుత్వమూ ఇన్ని పథకాలను విజయవంతంగా 99 శాతం అమలు చేసింది లేదు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ ఒడి పథకాన్ని రూ.17 వేలకు పెంచుతున్నాం. రైతులకు ఇచ్చే భరోసా మొత్తం రూ.16 వేలు అవుతుంది. దీనివల్ల రైతుకు మరింత సాయం అందించేవారమవుతాం. మహిళల సాధికారత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే సాధ్యమైంది. ప్రతి పథకం మహిళలకే అందుతోంది. చేయూత పథకం ద్వారా ఎంతో మంది స్వయం ఉపాధి పొందారు. కొందరు భూములు, బంగారం కొనుగోలు చేసుకుని భవిష్యత్తు అవసరాలకు ఉంచుకున్నారు.నిన్ను ఎలా నమ్ముతారు బాబూ..గత టీడీపీ హయాంలో నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా గిరిజనులకు ఎటువంటి పథకాలూ అందలేదు. కనీసం రేషన్కార్డులు, ఆధార్ కార్డులు వంటివి కూడా లేవు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను గుర్తించి ప్రతి ఇంటికీ మేలు చేశాం. ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూటమిగట్టి..బూటకపు హామీలిస్తున్నాయి. అవేవీ నమ్మశక్యంగా లేవు. 2014 మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఎన్ని అమలు చేశారు? పోనీ, ఇప్పుడు మేనిఫెస్టో కూడా ఉమ్మడిగా ఇచ్చే ధైర్యం చేయలేకపోయారు. కూటమిలోని బీజేపీ దూరంగా ఉంది. అంటే..దాని అమలు మీద వారిలో వారికే నమ్మకం లేదు. ఇంక ప్రజలు ఎలా నమ్ముతారు..అభివృద్ధి అంటే ఇది కాదా?59 నెలల కాలంలో గతంలో ఏ ప్రభుత్వమూ చేయని అభివృద్ధి నియోజకవర్గంలో చేసి చూపించాం. కొన్ని పెండింగ్ పనులు మిగిలిపోయాయంటే..అది గత టీడీపీ ప్రభుత్వ కక్షపూరిత వైఖరే. ఆ విషయం విజ్ఞులైన నియోజకవర్గ ప్రజలు, మేధావులందరికీ తెలుసు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 4,086 మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాం. కిమ్మి–రుషింగి వంతెన నిర్మాణం రూ.27.50 కోట్లతో పూర్తి చేశాం. సీతంపేటలో సుమారు రూ.50 కోట్లతో మల్లీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరుగుతోంది. సీతంపేట ఆస్పత్రిని రూ.19 కోట్లతో అప్గ్రేడ్ చేశాం. టీటీడీ ద్వారా రూ.10 కోట్లతో ఆలయాన్ని నిర్మించాం. 146 దేవాలయాలకు ఒక్కో గుడికి రూ.10 లక్షలు చొప్పున టీటీడీ దేవస్థానం నుంచి మంజూరు చేయించాం. బత్తిలిలో రూ.2.5 కోట్లతో మోడల్ పోలీస్స్టేషన్ నిర్మాణం చేపట్టాం. నియోజకవర్గంలో రూ.214 కోట్లతో సుమారు 234 కి.మీ. మేర రోడ్లు, 41 కి.మీ మేర డ్రైన్లు వేశాం. 102 సచివాలయాల నిర్మాణం, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్ల నిర్మాణం, నాడు–నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి మా హయాంలోనే చేపట్టాం. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలు చొప్పున వెచ్చించి మరిన్ని పనులు చేశాం. సంక్షేమ పథకాల లబ్ధి కోసం మరో రూ.1,500 కోట్లకుపైగా వెచ్చించాం. ఇదంతా అభివృద్ధి కాదా? ముందు ప్రభుత్వాలు ఇవేవీ ఎందుకు చేయలేదు? మాపై దుష్ప్రచారం చేస్తున్న వారు వీటికి సమాధానం చెప్పగలరా? కరోనా వంటి కష్టకాలంలో పేదలకు మా ప్రభుత్వం అండగా నిలిచింది. అందుకే ఇప్పుడు ధైర్యంగా వారి వద్దకు వెళ్లగలుగుతున్నాం. పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తాం.పర్యాటకంగా అభివృద్ధి, ఉపాధిసీతంపేటలో పర్యాటకంగా అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయి. రూ.2.5 కోట్లతో అడలి వ్యూపాయింట్, గిరిజన మ్యూజియం అభివృద్ధితోపాటు, మరికొన్ని ప్రాంతాలు, జలపాతాలపై దృష్టి సారించాం. ఇప్పటికే ఇక్కడ అడ్వెంచర్పార్కు ఉంది. నేను అభివృద్ధి కోరుకునేదానిని. టూరిజం కోసం అప్పట్లోనే ప్రశ్నించా. యువతకు కూడా స్థానికంగా నే ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో పరిశ్రమలు తె చ్చే ఆలోచన ఉంది. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టాం. దాదాపు 10 వేల మంది వరకూ ఇక్క డే ఉపాధి లభిస్తే బాగుంటుందన్నది నా ఆలోచన.కూటమికి ప్రజలే బుద్ధి చెబుతారు..కూటమి పేరుతో ఓట్ల కోసం వస్తున్న వారి గత చరిత్ర ఎలాంటిదో ఇక్కడ అందరికీ తెలుసు. వారి అవినీతి గురించి ఎంత చెప్పినా తక్కువే. వారికి ప్రజలే ఓట్ల ద్వారా బుద్ధి చెబుతారు. -
‘నన్ను కించపరుస్తూ గెలవాలనుకుంటున్నారా?’: మంత్రి తానేటి వనిత
తూర్పుగోదావరి, సాక్షి: నల్లజర్లలో టీడీపీ శ్రేణులు తనపై దాడికి యత్నించడంపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. దళితురాలినైన తనను కించపరుస్తూ.. రౌడీయిజంతో గెలవాలనుకోవడం ఎంత వరకు సబబని ప్రత్యర్థులను ఆమె నిలదీశారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం గోపాలపురం నియోజకవర్గంలో పర్యటించాం. ఎన్నికల ప్రచారం ముగించుకుని స్థానిక నేత సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకున్నాం. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. మా నేతలపై రాళ్లతో దాడి చేయడంతో పాటు వాహనాలను సైతం ధ్వంసం చేశారు. వందమంది ఒకేసారి మూకుమ్మడిగా వచ్చి ప్రచార రథంపై ఉన్న బాక్సులను, అక్కడున్న బైకులను ధ్వంసం చేశారు.హోం మంత్రిపైనే దాడికి యత్నం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?. దళితురాలినైన నన్ను కించపరుస్తూ.. రౌడీయిజం ప్రదర్శిస్తూ, దాడి చేసి గెలవాలనుకోవడం ఎంత వరకు కరెక్ట్?. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రచార కార్యక్రమంలో మేము ముందు ఉండటం.. మాకు ప్రజల ఆదరణ చూసి టీడీపీ నేతలు ఓర్వలేక పోతున్నారు. గోపాలపురంలో వైఎస్సార్సీపీ గెలవబోతుందనే నిజాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆ కడుపు మంటతోనే దాడులకు తెగబడ్డారు.టీడీపీ శ్రేణుల దాడుల్లో.. మా కార్యకర్తలు నలుగురికి తీవ్రంగా దెబ్బలు తగిలాయి. ఒకరికి తల పగలటంతో కుట్లు సైతం పడ్డాయి. టీడీపీ నేతలు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ.. దాడులు చేయిస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. కేసు దర్యాప్తు చేస్తున్నారు అని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. -
రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
తూర్పు గోదావరి, సాక్షి: మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ఏపీ ముక్తకంఠంతో చెబుతోంది. ఆ పిలుపు కూటమి పార్టీల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వైఎస్సార్సీపీకి వస్తున్న ప్రజాదరణను భరించలేక దుశ్చర్యలకు పాల్పడుతోంది. తాజాగా సాక్షాత్తూ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితపైన దాడికి టీడీపీ శ్రేణులు యత్నించారు.మంగళవారం అర్ధరాత్రి గోపాలపురం నల్లజర్లలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. హోం మంత్రి తానేటి వనిత స్థానికంగా ప్రచారం ముగించుకుని ఎక్స్ జెడ్పీటీసీ సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. YSRCP ప్రచార వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలతో గొడవకు దిగాయి. ఈలోపు టీడీపీ కార్యకర్తల్లో కొందరు తానేటి వనిత పైకి దూసుకెళ్లే యత్నం చేశారు.అయితే అప్రమత్తమైన ఆమె భద్రతా సిబ్బంది ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి భద్రత కల్పించారు. అయినా ఆగకుండా సుబ్రహ్మణ్యం ఇంటి ఫర్నీచర్ను, అక్కడున్న మరికొన్ని వాహనాల్ని ధ్వంసం చేశారు. టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు కొందరు అడ్డుకునే యత్నం చేయగా.. వాళ్లనూ తీవ్రంగా గాయపరిచారు. టీడీపీ నేతలు దాడికి యత్నించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీల్లో నమోదు అయ్యాయి. శాంతి భద్రతలను పర్యవేక్షించే హోం మంత్రిపై దాడికి యత్నించడాన్ని వైఎస్సార్సీపీ ముక్తకంఠంతో ఖండిస్తోంది. విషయం తెలిసిన ఎస్పీ జగదీష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చిన పోలీసులు.. మరోసారి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నల్లజర్లలో భారీగా మోహరించారు.హోం మంత్రి స్పందనటీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, పైగా మహిళ అని కూడా చూడకుండా తనపై దాడికి యత్నించారని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. ‘‘హోం మంత్రిపైనే దాడికి యత్నం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?. మాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైట్హౌస్కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి
టీడీపీ కార్యకర్తల దాడి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు
పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
తప్పక చదవండి
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement