Search Results for ''
-
మోదీ చేసింది సరైన పనేనా?: సునీతా కేజ్రీవాల్
Live Updates.. ప్రతిపక్ష కూటమి మెగా ర్యాలీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కామెంట్లు... ప్రజాస్వామ్యం కావాలో,నియంతృత్వవం కావాలో మీరే(ప్రజలు) నిర్ణయించుకోవాలి నియంతృత్వానికి మద్దతు ఇచ్చేవారిని దేశం నుంచి తరిమిగొట్టాలి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ విషం లాంటివి వాటి విషం రుచి చూసినా మరణిస్తాం ప్రతిపక్ష కూటమి మెగా ర్యాలీ: కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ కామెంట్లు బీజేపీ భ్రమల్లో ముగినిపోయింది. వారికి నేను వెయ్యేళ్లనాటి కథ, నీతిని తెలియజేస్తున్నా. రాముడు సత్యం కోసం యుద్ధం చేశారు. రాముడికి అధికారం, వనరులు లేవు. రాముడికి కానీసం రథం కూడా లేదు. రావణాసురుడికి రథం, వనరులు, యుద్ధ సైన్యం ఉంది. రాముడి వద్ద సత్యం, నమ్మకం, విశ్వాసం, ఓర్పు, తెగువ ఉందని గుర్తు చేశారు. ఇండియా కూటమి ఐదు డిమాండ్లు చేస్తోంది #WATCH | Delhi: At the Maha Rally at the Ramlila Maidan, Congress General Secretary Priyanka Gandhi Vadra says, "I think that they (BJP) are trapped in illusion. I want to remind them of a thousand-year-old tale and its message. When Lord Ram was fighting for the truth, He did… pic.twitter.com/43vpN9Y107 — ANI (@ANI) March 31, 2024 ఐదు డిమాండ్లు ఇవే... ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల్లో అందరినీ సమానంగా చూడాలి బలవంతంగా ప్రతిపక్ష నేతలపై ఈడీ, సీబీఐ , ఐటీ అరెస్ట్లు, దాడులు ఆపేయాలి వెంటనే సీఎం అరవింద్ కేజ్రీవాల్, హెమంత్ సోరెన్ను విడిచిపట్టాలి0 ప్రతిపక్షాల ఆర్థిం వనరులను దెబ్బతీయటం ఆపేయాలి బీజేపీ పొందిన ఎలక్టోరల్ బాండ్ల విషయంలో సిట్ ఏర్పాటు చేసి వెంటనే దర్యాప్తు జరపాలి #WATCH | Delhi: At the Maha Rally at the Ramlila Maidan, Congress General Secretary Priyanka Gandhi Vadra says, "INDIA Alliance has 5 demands. The Election Commission should ensure equal opportunity in the Lok Sabha elections. Second, the ECI should stop the forceful action… pic.twitter.com/pSUBSFwhvm — ANI (@ANI) March 31, 2024 ప్రతిపక్ష కూటమి మెగా ర్యాలీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కామెంట్లు బీజేపీ 400 సీట్లు గెలుపు నినాదం సెటైర్లు ఈవీఎంలు లేకుండా, మ్యాచ్ ఫిక్సింగ్, సోషల్ మీడియా, మీడియాపకై ఒత్తిడి పెంచకుండా బీజేపీ కనీసం 180 సీట్లు కూడా గెలవలేదు. ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కామెంట్లు ఈడీ, సీబీఐ అండ్ ఐటీ బీజేపీకి చెందిన విభాగాలు. లాలూ ప్రసాద్ యావద్ను చాలా సార్లు వేధించాయి. మాపై వ్యతిరేకంగా కేసులు పెట్టారు. మా కుటుంబంలోని అందరిపై కేసులు మోపారు ఆర్జేడీ నేతలపై తరచూ సోదాలు జరుగుతున్నాయి ఈడీ, ఐడీ సోదాలు జరుగుతునే ఉన్నాయి. మేము ఎప్పడూ భయపడలేదు.. పోరాడుతూనే ఉన్నాం. టీఎంసీ ఇండయా కూటమిలో భాగమే.. ‘టీఎంసీ ఇండియా కూటమిలో భాగమే. ప్రజాస్వామ్యాకి బీజేపీకి మధ్య యుద్ధం జరుగుతోంది’టీఎంసీ నేత డెరెక్ ఒబ్రెయిన్ అన్నారు. #WATCH | INDIA alliance rally: TMC MP Derek O'Brien says, "...All India Trinamool Congress (TMC) is very much was, is and will be part of the INDIA alliance. This is a fight of BJP versus democracy..." pic.twitter.com/5q2YuoHRCO — ANI (@ANI) March 31, 2024 ఇండియా కూటమికి ఆప్ తరఫున మద్దతు తెలుపుతున్నా: సునీతా కేజ్రీవాల్ ఇండియా కూటమి కాదు.. ఇండియా అనేది మనందరి హృదయం అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను చదివి వినిపించారు. ఆరు గ్యారంటీలు.. దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు ఉండవు. దేశవ్యాప్తంగా పేదలకు విద్యుత్ ఉచితం. ప్రతి గ్రామంలో పిల్లలు నాణ్యమైన విద్యను పొందే మంచి పాఠశాల ఏర్పాటు గ్రామంలో మొహల్లా క్లినిక్, ప్రతి జిల్లాకు ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు స్వామినాథన్ నివేదిక ప్రకారం రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వటం. ఢిల్లీ ప్రజలు చాలా ఏళ్లుగా అన్యాయానికి గురవుతున్నారు. మేము అంతం చేస్తాము. ఢిల్లీ ప్రజలకు రాష్ట్ర హోదా పొందుతారు. ఐదేళ్లలో ఈ గ్యారంటీలు అమలుచేస్తాం #WATCH | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi and Delhi CM Arvind Kejriwal's wife Sunita Kejriwal at the INDIA alliance rally in Ramlila Maidan, Delhi. pic.twitter.com/ah1WM7RhsH — ANI (@ANI) March 31, 2024 ప్రధాని మోదీ కేజ్రీవాల్ను జైలులో పెట్టారు: సునీతా కేజ్రీవాల్ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి మెగా ర్యాలీ లోక్తత్ర బచావో (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి) ర్యాలీ ర్యాలీ పాల్గొన్న సీఎం కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ సీఎం కేజ్రీవాల్ పంపిన లేఖలను చదివి వినిపించిన సునీతా కేజ్రీవాల్ ప్రధాని మోదీ కేజ్రీవాల్ను జైలులో పెట్టారు మోదీ చేసింది సరైన పనేనా? సీఎం కేజ్రీవాల్ నిజాయితిపరుడని మీరు నమ్మటం లేదా? కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలా? మీ కేజ్రీవాల్ సింహం లాంటి వ్యక్తి కోట్ల మంది హృదయాల్లో కేజ్రీవాల్ ఉన్నారు #WATCH | INDIA alliance rally: Delhi CM Arvind Kejriwal's wife Sunita Kejriwal says, "Your own Kejriwal has sent a message for you from jail. Before reading this message, I would like to ask you something. Our Prime Minister Narendra Modi put my husband in jail, did the Prime… pic.twitter.com/aZsdXXvJOO — ANI (@ANI) March 31, 2024 రాంలీలా మైదానంలో ఇండియా కూటమి మెగా ర్యాలీ పాల్గొన్న సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ పంపిన లేఖ చదివి వినిపించిన సునీతా కేజ్రీవాల్ దేశం బాధలో ఉందని కేజ్రీవాల్ లేఖలో పేర్కొన్నారు. ‘ఇండియా కూటమి’మహా ర్యాలీ.. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కామెంట్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని రాజకీయ పార్టీలకు కనీస గౌరవం ఇవ్వడాన్ని పూర్తిగా నిరాకరిస్తోంది ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల విషయంలో మరీ దారుణం ఇలాంటి తరుణంలో లోక్సభ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతాయని ఎలా నమ్ముతాం? దేశంలో ఎన్నికలను బీజేపీ హైజాక్ చేయాలనుకుంటోంది ప్రతిపక్షపార్టీలు, నేతలను బీజేపీ టార్గెట్ చేస్తోంది అందుకే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి మెగా ర్యాలీని నిర్వహిస్తోంది #WATCH | On the INDIA bloc's rally at Ramlila Maidan, Congress MP KC Venugopal says, "Now the Government of India under the leadership of PM Modi is completely refusing to provide a level playing field to political parties, especially the opposition parties. How can you ensure… pic.twitter.com/cw5ZUZoBsl — ANI (@ANI) March 31, 2024 ‘ఇండియా కూటమి’ మెగా ర్యాలీలో పాల్గొనేందుకు అరవింద్ కేజీవాల్ సతీమణి సునితా కేజ్రీవాల్ రాంలీలా మైదానానికి బయల్దేరారు. #WATCH | Delhi: Punjab CM Bhagwant Mann along with Delhi CM and AAP national convener Arvind Kejriwal's wife Sunita Kejriwal leave for Ramlila Maidan to attend the INDIA alliance rally pic.twitter.com/uCYhUes7MN — ANI (@ANI) March 31, 2024 రాజ్యాంగం దాడికి గురవుతోందని కాంగెస్ నేత సుప్రియా శ్రీనతే అన్నారు. రాంలీలా మైదనంలోని మెగా ర్యాలీ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ రాజ్యాంగం దాడికి గురవుతోంది. దేశం మొత్తం రాజ్యాంగ రక్షణకు కలిసికట్టుగా ముందుకువెళ్తోంది. ఇదే విషయాన్ని విషయాన్ని తెలియజేయటానికి ర్యాలీకి హాజరవుతున్నా’ అని అన్నారు. #WATCH | Delhi: On the INDIA bloc's rally at Ramlila Maidan, Congress leader Supriya Shrinate says, "The democracy is being attacked. The whole country is standing in the favour of democracy. And we have come here to give the same message..." pic.twitter.com/WfgEQ8uRtK — ANI (@ANI) March 31, 2024 నియంత, మతతత్వ బీజేపీ పార్టీ విధానాలను ఎండకట్టేందుకు, అరవింద్ కేజ్రీవాల్, హెమంత్ సోరెన్ అరెస్ట్కు వ్యతిరేకంగా రాంలీలా మైదానంలో మహా ర్యాలీలో ప్రజలు. నేతలు పాల్గొంటున్నారని సీఐఎం(ఎం) నేత బృందా కారత్ అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడారు. ఉపా చట్టాన్ని ఈడీ, సీబీ దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం సమర్థమంతమైనది కాదనడానికి ఇదే నిదర్శనం అన్నారు. #WATCH | Delhi: On the INDIA bloc's rally at Ramlila Maidan today, CPI-M leader Brinda Karat says, "The message is that people from all over the country have gathered against this dictator and communal government. This Maha rally in Delhi is against Arvind Kejriwal and Hemant… pic.twitter.com/ZmSSr2FjLQ — ANI (@ANI) March 31, 2024 ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’ చేపట్టిన మెగా ర్యాలీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రవాల్ మాట్లాడనున్నారు. రాంలీలా మైదానానికి కూటమి నేతలు చేరుకుంటున్నారు. భారీ సంఖ్యలో ఢిల్లీ ప్రజలు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు చేరుకున్నారు. ఢిల్లీ ప్రజల కోసమే కేజ్రీవాల్ ఆందోళన.. రాంలీలా మైదనం వద్దకు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారని ఢిల్లీ మంత్రి ఆతిశీ అన్నారు. ఆమె మీడియా మాట్లాడారు. ‘ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల జీవితాలను మార్చారని వారికి తెలుసు. ఆయన అరెస్ట్ అయ్యాక కూడా ఢిల్లీ ప్రజల కోసం ఆందోళన పడుతున్నారు’అని మంత్రి అతిశీ అన్నారు. #WATCH | Delhi: On the INDIA bloc's rally at Ramlila Maidan today, AAP Minister Atishi says, "It is 10 am and people have already gathered in huge numbers. People from all over the country have come against the arrest of Arvind Kejriwal. The people of Delhi are aware that Arvind… pic.twitter.com/6XF8mN5WnU — ANI (@ANI) March 31, 2024 ఇండియా కూటమి మెగా ర్యాలీ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా రాంలీలా మైదానంలో మహా ధర్నా కేజీవాల్ జైల్లో ఉన్న ఫొటోలు ఏర్పాటు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సహా 13 పార్టీల నేతల హాజరు ఎండ వేడిమి తట్టుకోవడానికి ఏర్పాట్లు మెగా ర్యాలీ వద్ద భారీ భద్రత ఏర్పాటు ప్రశ్నిస్తే జైల్లో వేస్తున్నారు నకిలీ దర్యాప్తు పేరుతో, మన్నల్ని, మా పార్టీని గత రెండేళ్లుగా కేంద్రంలోని బీజేపీ టార్గెట్ చేసిందని ఆప్ జాతీయ అధికప్రతినిధి ప్రియాంకా కక్కర్ అన్నారు. రామ్లీలా మైదానంలో విపక్షాల ఇండియా కూటమి ర్యాలీ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఎటువంటి అధారాలు లేకుండా కొందరి నకిలీ ప్రకటనలతో సిట్టింగ్ సీఎంను అరెస్ట్ చేశారు. ఇది మా పార్టీ గొంతు నొక్కాలనే కుట్రలో భాగం. ఎవరైలే బీజేపీ ప్రశ్నిస్తారే వాళ్లను జైల్లో తోయటమే వారి పని’అని ప్రియాంకా మండిపడ్డారు. #WATCH | Delhi: On INDIA alliance rally at Ramlila Maidan, AAP leader AAP national spokesperson Priyanka Kakkar says, " It can be clearly seen how we are being targeted in the for last 2 years in the name of a fake investigation. Without any proof, just based on a few statements,… pic.twitter.com/7Ne4Kfuxcg — ANI (@ANI) March 31, 2024 ►ప్రజాస్వామ్యాన్ని కాపాడండి నినాదంతో విపక్ష ఇండియా కూటమి ఢిల్లీలో భారీ ర్యాలీ తలపెట్టింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ , కాంగ్రెస్కు ఐటీ నోటీసులపై బీజేపీతో యుద్దానికి ఇండియా కూటమి రెడీ అయ్యింది. ఇందులో భాగంగానే ఢిల్లీ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నేతలు మెగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ►రామ్లీల మైదానంలో కళ్లకు గంతులు కట్టుకుని కాంగ్రెస్ నేతల నిరసన #WATCH | Delhi: Congress workers organised a blindfold protest at the Ramlila Maidan. pic.twitter.com/5p0C5mwpRn — ANI (@ANI) March 31, 2024 ►ఇండియా కూటమి ర్యాలీకి బయలుదేరిన జార్ఖండ్ సీఎం చంపై సోరెన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియంతృత్వానికి స్వస్థి పలికి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని అన్నారు. #WATCH | Ranchi: Before leaving for Delhi to attend the INDIA Alliance Maha Rally at the Ramlila Maidan today, Jharkhand CM Champai Soren says, "We have to abolish the dictatorship and save the democracy..." pic.twitter.com/kOHI9A0EiV — ANI (@ANI) March 31, 2024 ►ఈ ర్యాలీకి కూటమిలోని 29 పార్టీలూ ర్యాలీలో పాల్గొనబోతున్నాయి. ముఖ్యంగా కేజ్రీవాల్ అరెస్ట్ , కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను ఐటీ శాఖ ఫ్రీజ్ చేయడంపై ఇండియా కూటమి భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. పన్ను ఎగవేత కేసులో రూ.1800 కోట్లు చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. #WATCH | Delhi: INDIA alliance to hold rally against the arrest of Delhi CM and AAP convener Arvind Kejriwal, at Ramlila Maidan from 10 am today (Visuals from the Ramlila Maidan) pic.twitter.com/cahR183k7g — ANI (@ANI) March 31, 2024 కీలక నేతలు హాజరు.. ►ఢిల్లీలో జరిగే ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోసియా గాంధీ, రాహుల్గాంధీ సహా కీలకనేతల పాల్గొనబోతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు అడ్డంగా దుర్వినియోగం చేస్తోందని మండిపడుతున్నాయి విపక్షాలు. ఇవాళ్టి ర్యాలీలో ఇదే అంశాన్ని ప్రధానంగా జనంలోకి తీసుకెళ్లనున్నారు నేతలు. ఇవాళ్టి కార్యక్రమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఢిల్లీ సీఎం కేజ్రివాల్ మద్యం కుంభకోణం కేసులో జైలుపాలైన నేపథ్యంలో ర్యాలీకి భారీ జనసమీకరణ చేసి సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది. డెరిక్ ఒబ్రియాన్ (టీఎంసీ), తిరుచ్చి శివ (డీఎంకే), అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), శరద్ పవార్ (ఎన్సీపీ–ఎస్సీపీ), తేజస్వీ యాద వ్ (ఆర్జేడీ), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) తదితరులు పాల్గొంటారన్నారు. సునీత కేజ్రీవాల్కు కల్పన సొరేన్ సంఘీభావం ►ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్కు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ సతీమణి కల్పన సొరేన్ శనివారం సంఘీభావం తెలిపారు. కేజ్రీవాల్ నివాసంలో వీరి భే టీ జరిగింది.శక్తిమంతులైన మహిళలు కలవడంతో బీజేపీ భయపడి ఉం టుందని.. వీరిద్దరి సమావేశంపై ఢిల్లీ మంత్రి ఆతీశి ట్వీట్ చేశా రు. కల్పన విలేకర్లతో మాట్లాడుతూ, సునీత కేజ్రీవాల్కు యావత్తు జార్ఖం డ్ ప్రజలు అండగా ఉంటారని, తాము ఒకరి ఆవేదనను మరొకరం పంచుకున్నామని చెప్పారు.తాము కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించామన్నారు. -
సల్మాన్పై నటి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై : కృష్ణ జింకలను వెంటాడి చంపిన కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న సల్మాన్ ఖాన్కి చిత్ర పరిశ్రమ మొత్తం సానుభూతిని తెలియజేస్తోంది. సల్లూ భాయ్ త్వరగా బయటకు రావాలంటూ బాలీవుడ్ సెలబ్రిటీలంతా బలంగా కోరుకుంటున్నారు. అయితే బ్రిటీష్ సింగర్, బాలీవుడ్ నటి సోఫియా హయత్ మాత్రం సల్మాన్ జైలుకెళ్లటం చాలా సంతోషాన్నిస్తోందంటూ చేసిన పోస్ట్ దుమారాన్ని రేపుతోంది. ‘సల్మాన్ జైలుకెళ్లటం అతని కర్మ. చేసిన పాపాలకు అతను అనుభవిస్తున్నాడు. బాలీవుడ్లో అతనో బడా స్టార్. ఇండస్ట్రీ మొత్తం అతని కనుసైగలో నడుస్తుంది. అందుకే అతనికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు అంతా జంకుతున్నారు. కానీ, నాకు ఆ భయం లేదు. చేసిన దానికి అతను ప్రతిఫలం అనుభవిస్తున్నాడు. సల్మాన్ జైలుకెళ్లటం నాకు సంతోషాన్నిస్తోంది’ అంటూ భారత చట్టాలు ఆలస్యమైనా న్యాయాన్ని చేకూరుస్తాయంటూ... పెద్ద పోస్ట్నే ఆమె ఉంచింది. పైగా నో మోర్ హ్యుమన్ అంటూ సల్మాన్ పోస్టర్ను షేర్ చేసింది. ఇంగ్లీష్ టీవీ షోలతో పాపులర్ అయ్యి.. అర డజనుకు పైగా బాలీవుడ్ చిత్రాల్లో నటించింది సోఫియా హయత్(33) బిగ్ బాస్-7 కంటెస్టెంట్ కూడా. అయితే షో లో ఆమె తీరు వివాదాస్పదం కావటం.. పైగా ఆ తర్వాత ఆమెకు బాలీవుడ్ కలిసిరాకపోవటం రాకపోవటంతో బాలీవుడ్కు గుడ్ బై చెప్పేసింది. Karma gets you in the end...Many people are afraid to talk against Salman because they think he controls Bollywood. Well, I no longer serve my ego and therefore am not afraid to speak up. I am so happy that Salman has gone to jail for what he has done. Animals are so important to this planet and doing what he did and then mocking it was a huge act of his own self importance. Lots of children look up to him, and he has a responsibility to the young people.What is he showing the world when he does things like this? What lessons is he giving them? That it is ok to break the law, to kill animals and then mock it because he is a celebrity? In any western country he would have been vilified for this and the drink driving deaths that he caused. He has then reinvented himself as a charitable man to try and compensate his karma. Today, India has shown that no matter who you are, if you break the law, you are no bigger than the law. I have heard so many young people in India speak about how they are afraid to go to the police about crimes committed by others because they watch the tv and see how people with money and status get away with it because they have paid off the police or the judge or the lawyers. This happened to me when Armaan Kohli paid off 2 of my lawyers so that I could not continue with the case, Dolly Bindra also told me that Armaans family are powerful enough to put drugs in my bag at the airport and I would be in Jail. I had to then drop the case as all the lawyers I hired were paid off. Today, Hindustan can stand strong and hold its head up high to the world and show them that justice is held up in India, and today, all the poor people have been shown a glimmer of hope in their own fight for justice against those who have manipulated the law. Today I can say Hindustaan Zindabaad! A post shared by Sofia Hayat (@sofiahayat) on Apr 5, 2018 at 10:40am PDT -
రషీద్పై ప్రసంశల వర్షం
సాక్షి, హైదరాబాద్ : శుక్రవారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ సంచలం, యువకెరటం రషీద్ ఖాన్ సత్తా చాటాడు. కోల్కతాతో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో, రషీద్ అటు బ్యాటుతో ప్రత్యర్థి బౌలర్లు విసిరిన బంతిని బౌండరీలు తరలిస్తే.. ఇటు గింగిరాలు తిరిగే బంతితో కోల్కతా బ్యాట్మెన్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఫీల్డ్లో అద్భుతంగా కదిలి రనౌట్ చేశాడు. అంతేకాకుంకా కీలక సమయంలో రెండు క్యాచ్లను పట్టి మ్యాచ్ను గెలిపించాడు. ఇలా శుక్రవారం రోజు రషీద్ వన్ మ్యాన్ షో చేశాడు. సన్రైజర్స్కు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. రషీద్ ఆటతీరుపై ప్రసంశలు వెల్లువెత్తాయి. టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్బాబు తన తరపున రషీద్ ఖాన్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. సన్రైజర్స్ హైదరాబాద్ అద్భుతంగా ఆడిందని, రషీద్ ఖాన్తో పాటు జట్టు మొత్తానికి అభినందనలు చెప్పారు. తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ సైతం మ్యాచ్పై స్పందించారు. మ్యాచ్ చూడలేపోయానని చెప్పిన ఆయన, ట్రోఫీ అందుకోవాలంటూ ఆకాంక్షించారు. రషీద్ గురించి ఎవరేమన్నారంటే.. ప్రముఖుల ట్వీట్లు Take a bow @rashidkhan_19... Whatta match by @SunRisers 👏Can't wait for Sunday!!! Congratulations to the whole team. 😊 Go #OrangeArmy #SRH — Mahesh Babu (@urstrulyMahesh) May 25, 2018 Missed the game but glad that @SunRisers made it 👏👏Congratulations and good luck for the trophy Guys 👍 — KTR (@KTRTRS) May 25, 2018 Cometh the hour, cometh the man. Big game, and @rashidkhan_19 was simply outstanding with both bat and ball. Has been a wonderful journey for us on our way to the finals and I wish the boys give it their everything and enjoy the finals. #KKRVSRH — VVS Laxman (@VVSLaxman281) May 25, 2018 Special performance from @rashidkhan_19 tonight, big game player! #superstar #SRH — Tom Moody (@TomMoodyCricket) May 25, 2018 This was @rashidkhan_19 ‘s day and when it is the day of a top player, his team invariably wins. Congratulations @SunRisers . The two top teams meet in the final on Sunday, must be a fascinating contest #KKRVSRH — Mohammad Kaif (@MohammadKaif) May 25, 2018 .@rashidkhan_19 you beauty! What a key role this man played today with the ball, the bat & on the field ! It's gonna be Orange vs Yellow in the finale! @SunRisers #SRHvKKR #IPL2018 — R P Singh (@rpsingh) May 25, 2018 Pathhar se pani nikal nahi sakte Lekin @rashidkhan_19 aaj Wo bhi kar dete. Batting bowling fielding. Mind blowing effort #KKRvsSRH Goodluck to two best teams of this ipl2018 for the finals #CSKvSRH — Irfan Pathan (@IrfanPathan) May 25, 2018 As a leg spinner I love seeing all the different types of leg spinners playing in the #IPL but watching @rashidkhan_19 bowl in these big games makes me proud as he loves this stage & pressure it also gets me excited ! 👍 — Shane Warne (@ShaneWarne) May 25, 2018 Deserved to be in the finals! @SunRisers ... Rashid - what a match he’s had! so happy for Kane Williamson! It’s Gonna be one helluva final! #KKRvsSRH — Ranveer Singh (@RanveerOfficial) May 25, 2018 I think Rashid Khan could discover a new planet in the solar system or a new element in the periodic table today — Harsha Bhogle (@bhogleharsha) May 25, 2018 మరోసారి మంచి మనసు చాటుకున్న రషీద్ ఇక్కడ చదవండి -
తిరుపతిలో రోడ్డుపై మోహన్ బాబు ధర్నా
సాక్షి, తిరుపతి : సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్ బాబును హౌస్ అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ శుక్రవారం తిరుపతిలో ధర్నాకు దిగారు. రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందంటూ నిరసన వ్యక్తం చేస్తూ ఆయన శ్రీవిద్యా నికేతన్ సంస్థల ఎదుట రోడ్డుపై బైఠాయించారు. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. చదవండి....(చంద్రబాబు ఇచ్చినమాట నిలబెట్టుకో: మోహన్ బాబు) ఈ నిరసనను అణిచి వేసేందుకు ప్రభుత్వం ఆదేశాల మేరకు ...మోహన్ బాబును గృహ నిర్భందం చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోను తన నిరసన కొనసాగిస్తానంటూ మోహన్ బాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉంచారు. చంద్రబాబు ప్రభుత్వం నుంచి శ్రీవిద్యా నికేతన్కు సుమారు రూ.17కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రావాలి. ఎన్నోసార్లు లేఖ రాసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోంది. చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా చేపట్టా’. అని తెలిపారు. చదవండి...(ఆస్తులు తాకట్టుపెట్టి కాలేజీని నడపాల్సి వస్తుంది!) కాగా చంద్రబాబు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పదివేల మంది విద్యార్థులతో తిరుపతి లీలామహల్ సర్కిల్ నుంచి గాంధీ రోడ్డు వరకూ విద్యార్థులతో కలిసి మోహన్ బాబు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచే తిరుపతి రూరల్ రంగంపేటలోని విద్యానికేతన్ విద్యాసంస్థల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు మోహన్ బాబు ధర్నాతో తిరుపతి-పీలేరు రహదారిలో సుమారు 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. Wanted to take a peaceful rally today in Tirupathi protesting the non payment of the fee reimbursement of the students by the Govt.... Police have arrived at our home in Tirupathi and looks like they are not going to allow the rally. — Mohan Babu M (@themohanbabu) 22 March 2019 Why is The government not paying the students fee? And the rally I want to is for the students. I don’t gain anything from it. 19 crores have been pending and for what? Why isn’t the government honoring their commitment???? — Mohan Babu M (@themohanbabu) 22 March 2019 -
ఇది అక్రమ అరెస్ట్, న్యాయ పోరాటం చేస్తా: కవిత
MLC Kavitha Arrest Updates.. 06:14PM కవిత భర్త అనిల్కు ఈడీ సమన్లు సోమవారం హాజరు కావాలని ఆదేశం ఢిల్లీ లిక్కర్ కేసులో అనిల్ ఫోన్లను ఇప్పటికే సీజ్ చేసిన ఈడీ కవిత రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తి ఢిల్లీ లిక్కర్ విధానంలో కీలక కుట్రదారు... ప్రధాన లబ్ధిదారు కవితే మాగుంట శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రకు పాల్పడ్డారు ఆప్ నేతలకు 100 కోట్ల ముడుపులు ఇచ్చారు ఢిల్లీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు అరుణ్ పిళ్లైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీలో.. కవిత వాటా పొందారు ఇతరులతో కలిసి 100 కోట్ల రూపాయల లంచాలను ఆప్ నేతలకు కవిత ఇచ్చారు కవిత తన మొబైల్ లోని ఆధారాలు తొలగించారు సౌత్ గ్రూప్ లోని శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవ మాగుంటతో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రలు: ఈడి 05:05PM కవితకు ఏడు రోజుల ఈడీ కస్టడీ విధించిన సెషన్స్ కోర్టు అరెస్టు అక్రమమని వాదించిన విజ్ఞప్తిని తిరస్కరించిన కోర్టు 23 మార్చి 12 గంటలకు తిరిగి హాజరు పరచాలని ఆదేశం కుటుంబ సభ్యులను, న్యాయవాదులను కలిసేందుకు అవకాశం ఇంటి భోజనానికి అనుమతి 02:32PM కవిత కేసులో ముగిసిన వాదనలు పదిరోజుల కస్టడీ కోరిన ఈడీ సాయంత్రం నాలుగున్నరకు ఉత్తర్వులు ఇవ్వనున్న కోర్టు 01:39PM కవిత కేసు విచారణకు లంచ్ బ్రేక్ లంచ్ బ్రేక్ తర్వాత మళ్లీ కొనసాగనున్న వాదనలు 01:01PM ఈడీ తరపు వాదనలు జోయబ్ హుస్సేన్, ఈడి తరపు న్యాయవాది కవితను చట్టబద్దంగా అరెస్ట్ చేశాం సూర్యాస్తమయానికి ముందే అరెస్ట్ చేశాం హైదరాబాద్లో 6.26కి సూర్యాస్తమయం జరిగింది సాయంత్రం 5.20 గంటలకు అరెస్ట్ చేశాం కవిత అరెస్ట్ మెమో చదివి సాయంత్రం 5.43 గంటలకు సంతకం చేశారు ఇండో స్పిరిట్ ద్వారా కవిత లిక్కర్ స్కాం చేశారు బుచ్చి బాబు, మాగుంట మధ్య వాట్సాప్ చాట్లో కవిత పాత్ర బయట పడింది ‘మేడంకు 33 శాతం’ అని చాట్లో బయటపడింది ఆ మేడం కవితే అని మాగుంట రాఘవ, బుచ్చిబాబు ను విచారిస్తే అంగీకరించారు అయిదు ఫోన్లు మేము సీజ్ చేశాం అందులోనే డేటాను కూడా రెట్రీవ్ చేశాం సెక్షన్ 19 పాటించాము నేరం చేసి అక్రమ సొమ్ము సంపాదించారని దర్యాప్తులో తేలింది నిన్న సోదాలు 6.45కి పూర్తి అయ్యాయి సోదాల సమయంలో కవిత సోదరుడు అని చెప్పి 20 మంది లోపలికి వచ్చి గందరగోళం సృష్టించారు 12:36PM ఈడి తరపు వాదనలు ప్రారంభం మేము బలవంతపు చర్యలు తీసుకోమని ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు పది రోజుల టైంతో తదుపరి సమన్లు ఇస్తామని మాత్రమే చెప్పాం మీడియా కథనాలను నమ్మవద్దు కోర్టు ప్రొసీడింగ్స్ విషయంలో మీడియా కథనాలను పరిగణనలోకి తీసుకోవద్దు అని సుప్రీం కోర్టు గతంలోనే చెప్పింది మేము ఇచ్చిన స్టేట్మెంట్ వేరే రకంగా ఆపాదిస్తున్నారు దీనిపై ఎలాంటి లిఖిత పూర్వక ఆదేశాలు లేవు సెక్షన్ 19 ప్రకారం మేము ముందుకి వెళ్ళాం ఇది ఎలాంటి కోర్టు ధిక్కారం కాదు మేము తొలుత ఇచ్చిన హామీకి సంభందించిన నెక్స్ట్ డేట్ ఎప్పుడో వెళ్లిపోయింది కఠిన నిర్ణయాలలు తీసుకోవద్దని కోరారు. కానీ, కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు కఠిన చర్యలు తీసుకోబోమని మేము ఎలాంటి అండర్ టేకింగ్ ఇవ్వలేదు పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి నిర్ణయానికి రావద్దు 12:12 PM వాదనలు ప్రారంభించిన కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి, కవిత తరపు న్యాయవాది అధికార దుర్వినియోగం తో అరెస్ట్ చేశారు సెప్టెంబర్ 15న సుప్రీం కోర్టులో ఇచ్చిన మాట ఉల్లంఘించారు తదుపరి విచారణ జరిగే వరకు ఎలాంటి చర్యలు తీసుకోమని చెప్పి, ఉల్లంఘించారు మహిళను ఈడి కోర్టుకు పిలవడంపై కేసు పెండింగ్ ఉంది ఓపెన్ కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్కు కట్టుబడి లేదు కోర్టు ఆర్డర్లో రికార్డు చేయనప్పటికీ, మీడియాలో ఇది రిపోర్ట్ అయ్యింది నిన్న జరిగిన సుప్రీం కోర్టు విచారణలో ఈడి తరపున ఏఎస్పి రాజు సెప్టెంబర్ లో ఇచ్చిన స్టేట్మెంట్ విత్ డ్రా చేసుకుంటున్నాం అని చెప్పారు కానీ సుప్రీం కోర్టు దీనిపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు, కేసు 19కి వాయిదా వేశారు అయినప్పటికీ ఈడి అధికారులు హైదరాబాదులో కవిత ఇంటికి సోదా ల పేరుతో వెళ్లి అరెస్ట్ చేశారు ఇది అక్రమ అరెస్ట్.. మూడు రోజులు ఆగితే పోయేదేమిటి సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అని ఈడి భావిస్తోంది 12:07 PM.. కవిత కేసు విచారణ ప్రారంభం వాదనలు ప్రారంభించిన కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి, కవిత తరపు న్యాయవాది అధికార దుర్వినియోగంతో అరెస్ట్ చేశారు సెప్టెంబర్ 15న సుప్రీం కోర్టులో ఇచ్చిన మాట ఉల్లంఘించారు మహిళను ఈడీ కోర్టుకు పిలవడంపై కేసు పెండింగ్లో ఉంది 12:05 PM.. కోర్టులో ప్రోసీడింగ్స్ ప్రారంభం. కవిత ఆరోపణలు ఇవే.. నిన్నటి నుంచి నన్ను న్యాయవాదులతో మాట్లాడనివ్వలేదు. మధ్యాహ్నం 2 గంటలకు తీసుకువస్తామని 11 గంటలకు తీసుకొచ్చారు. 11:48 AM.. కాసేపట్లో కవిత కేసు విచారణ ప్రారంభం.. మరికాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో కవిత కేసు విచారణ ప్రారంభం వారం రోజులు ఈడీ కస్టడీ కోరే అవకాశం కవిత అరెస్ట్ కేసు విచారించనున్న సీబీఐ స్పెషల్ జడ్జీ ఎం.కె నాగ్ పాల్ కవిత తరపు వాదనలు వినిపించనున్న విక్రమ్ చౌదరి, మోహిత్ రావు ఈడీ తరపు వాదనలు వినిపించనున్న న్యాయవాదులు జోయబ్ హుస్సేన్ , ఎన్.కె మట్టా కోర్టు హాల్లోనే ఉన్న ఈడీ అధికారులు భానుమతి, జోగెందర్ విచారణ చూసేందుకు వచ్చిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి సత్యవతి 11:48 AM.. ►కవితను 10 రోజుల కస్టడీ కోరిన ఈడీ. ►రౌస్ అవెన్యూ కోర్టుకు చేరుకున్న బీఆర్ఎస్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ 11:40 AM.. ►రౌస్ అవెన్యూ కోర్టు ముందు కవితను హాజరుపరచిన ఈడీ ►ఇది అక్రమ అరెస్టు. కావాలనే నన్ను ఈ కేసులో ఇరికించారు. న్యాయపోరాటం చేస్తామన్న కవిత 11:17 AM, Mar 16, 2024 ►రౌస్ అవెన్యూ కోర్టుకు చేరుకున్న కవిత. కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు. #WATCH | Delhi: BRS MLC K Kavitha arrives at Rouse Avenue Court. K Kavitha was arrested by the ED and brought to Delhi yesterday. She will be further questioned in connection with the Delhi excise policy-linked money laundering case. pic.twitter.com/4GZ5YRPKS2 — ANI (@ANI) March 16, 2024 ►రౌస్ అవెన్యూ కోర్టుకు బయలుదేరిన కవిత. #WATCH | BRS MLC K Kavitha leaves from ED office for Rouse Avenue Court. K Kavitha was arrested by the ED and brought to Delhi yesterday. She will be further questioned in connection with the Delhi excise policy-linked money laundering case. pic.twitter.com/kGK14Ywrbs — ANI (@ANI) March 16, 2024 ►రౌస్ అవెన్యూ కోర్టుకు చేరుకున్న ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుమతి, లాయర్లు ►మరి కొద్దిసేపట్లోనే కవితను కోర్టుకు తరలించనున్న ఈడీ అధికారులు 11:30 AM, Mar 16, 2024 నేరం చేయకపోతే భయమెందుకు?: బీజేపీ లక్ష్మణ్ నేరం చేయకపోతే భయమెందుకు?. ఢిల్లీ ప్రభుత్వంలో పెద్దలపై ఈ కేసులో అనేక ఆరోపణలు వచ్చాయి. లిక్కర్కేసులో కవితకు సంబంధం ఉందో లేదో వారే చెప్పాలి. కవిత అరెస్ట్కు బీజేపీకి సంబంధం లేదు. ఏడాది కాలంగా ఈ కేసులో దర్యాప్తు చేస్తోంది. నేరం చేయకుంచే శిక్ష పడదు. తప్పు చేస్తే శిక్ష పడుతుంది. ఈడీ తన పని తాను చేసుకుపోతుంది. దీనిలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదు. 10:30 AM, Mar 16, 2024 ►మరి కాసేపట్లో రౌజ్ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత ►ఈడీ కార్యాలయంలో వాహనాలు సిద్ధం చేసిన అధికారులు ►జస్టిస్ ఎంకే నాగ్పాల్ ముందు కవితను హాజరుపరచనున్న ఈడీ అధికారులు. 10:06 AM, Mar 16, 2024 ఈడీ ఆఫీస్ వద్ద హైటెన్షన్ లిక్కర్ స్కామ్లో అరెస్టైన కల్వకుంట్ల కవితకు వైద్య పరీక్షలు పూర్తి ఈడీ కార్యాలయం వద్ద కేంద్ర బలగాల మోహరింపు కార్యాలయం బయట బీఆర్ఎస్ శ్రేణులు కాసేపట్లో రౌస్ ఎవెన్యూ కోర్టుకు కవిత తరలింపు 9:35 AM, Mar 16, 2024 ►ఎమ్మెల్సీ కవితకు ముగిసిన వైద్య పరీక్షలు. ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన వైద్యుల బృందం. ►ఈరోజు ఉదయం 10:30 గంటలకు ఈడీ కార్యాలయం నుంచి రౌస్ అవెన్యూ కోర్టుకు కవిత తరలింపు. #WATCH | Delhi: A team of doctors leave from the Enforcement Directorate (ED) office. BRS MLC K Kavitha was arrested by the ED and brought to Delhi yesterday. She will be further questioned in connection with the Delhi excise policy-linked money laundering case. pic.twitter.com/qZ3pF9oL5R — ANI (@ANI) March 16, 2024 ►కవిత అరెస్ట్ నేపథ్యంలో ఈడీ కార్యాలయం, రౌస్ అవెన్యూ కోర్టు వద్ద భారీ బలగాల మోహరింపు. ఎలాంటి నిరసనలు, ఆందోళనలు చేపట్టకుండా భద్రత ఏర్పాటు. #WATCH | Security heightened & a team of doctors arrive at the ED office. BRS leader K Kavitha was arrested in Hyderabad in connection with the Delhi Excise Policy Case. K Kavitha was brought to Delhi where she will be further questioned in connection with the Delhi excise… pic.twitter.com/hU7Cei4ER7 — ANI (@ANI) March 16, 2024 8:20 AM, Mar 16, 2024 ► ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ► ఈరోజు మధ్యాహ్నం కేటీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. కీలకంగా మారిన కవిత అరెస్ట్ నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కోర్టులో హాజరుపరచనున్న ఈడీ అధికారులు. ఉదయం 10 గంటలకు రౌజ్ అవెన్యూ కోర్టు ముందు కవితను ప్రవేశ పెట్టనున్న ఈడీ ఈరోజు కవితను తమ కస్టడీకి ఇవ్వాలని కోరనున్న ఈడీ అధికారులు ఢిల్లీ మద్యం పాలసీ ద్వారా బినామీ పేర్లతో అక్రమార్జన చేశారని కవితపై అభియోగాలు అక్రమార్జన ద్వారా ఇండోస్పిరిట్లో పార్ట్నర్షిప్ పొందారని, అరుణ్ రామచంద్ర పిళ్లై ద్వారా వ్యవహారాలు నడిపారని ఆరోపణలు ఢిల్లీ లిక్కర్ కేసులో కీలకంగా మారిన కవిత అరెస్టు లిక్కర్ కేసులో కవిత పాత్రపై ఇప్పటికే పలు ఆధారాలు సంపాదించిన ఈడీ అరుణ్ రామచంద్ర పిళ్లై, ఆడిటర్ బుచ్చిబాబు, మాగుంట రాఘవ, అశోక్ కౌశిక్ తదితరులు ఇచ్చిన వాంగ్మూలంలో కవిత పేరు దీంతో కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఇక ఈ కేసులో మిగిలింది కేవలం సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ మాత్రమే అని చర్చ నేడు కోర్టు ఎదుట హాజరు ►కవితను ఢిల్లీకి తరలించిన ఈడీ అధికారులు శుక్రవారం రాత్రి ఆమెను ఈడీ కార్యాలయంలోనే ఉంచారు. శనివారం ఉదయం 10 గంటలకు ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నట్టు సమాచారం. #WATCH | Delhi: BRS MLC K Kavitha brought to the Enforcement Directorate (ED) Office. K Kavitha had been arrested by the ED and brought to Delhi where she will be further questioned in connection with the Delhi excise policy-linked money laundering case. pic.twitter.com/9TUvwsoa8Z — ANI (@ANI) March 15, 2024 ►ఢిల్లీ మద్యం విధానం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అధికారుల బృందం శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసింది. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన, పోలీసుల స్వల్ప లాఠీచార్జ్, నాటకీయ పరిణామాల మధ్య ఈడీ అధికారులు రాత్రి 8:45 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు తీసుకెళ్లి.. విమానంలో ఢిల్లీకి తరలించారు. ►ఈడీ అధికారులు అంగీకరించడంతో భర్తతో కలసి కారులో బయలుదేరారు. ఈ కారు ముందు వెనుక ఈడీ, పోలీసు వాహనాలు కాన్వాయ్గా శంషాబాద్కు చేరుకున్నాయి. విమానాశ్రయం లోపలికి వెళ్లే సమయంలోనూ కవిత పిడికిలి ఎత్తి అభివాదం చేశారు. ఈడీ అధికారుల బృందం విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన యూకే–870 విమానంలో రాత్రి 8.58 గంటలకు కవితను ఢిల్లీకి తరలించింది. నేడు కేసీఆర్, కేటీఆర్ ఢిల్లీకి.. ►ఎమ్మెల్సీ కవిత అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతోపాటు మరికొందరు కీలక నేతలు శనివారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. తండ్రిగా కేసీఆర్, సోదరుడిగా కేటీఆర్ నైతికంగా కవితకు అండగా నిలబడేందుకు, న్యాయ నిపుణులతో చర్చించేందుకు వెళ్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణలో ఉన్న సమయంలో ఈడీ అరెస్టు చేసిన అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని వారు భావిస్తున్నట్టు తెలిసింది. కవిత అరెస్టుతోపాటు తెలంగాణ, జాతీయ రాజకీయాలు, మోదీ–బీజేపీ విధానాలపై కేసీఆర్ జాతీయ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని సమాచారం. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను ప్రశ్నించిన @KTRBRS గారు అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారన్న కేటీఆర్ pic.twitter.com/FsNLeMZPGr — Thirupathi Bandari (@BTR_KTR) March 15, 2024 ఈడీ తీరు చట్టవిరుద్ధం: కవిత న్యాయవాది మోహిత్రావు ►ఎమ్మెల్సీ కవిత అరెస్టు విషయంలో ఈడీ చట్టవిరుద్ధంగా వ్యవహరించిందని సుప్రీంకోర్టులో ఆమె తరఫున వాదిస్తున్న న్యాయవాది మోహిత్రావు పేర్కొన్నారు. హైదరాబాద్లో కవిత అరెస్టు నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ మంగళవారానికి వాయిదాపడిందని.. ఈ కేసులో కవితపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోబోమని ఈడీ గతంలో కోర్టుకు హామీ ఇచ్చిందని వివరించారు. సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు కఠిన చర్యలు తీసుకోబోమన్న ఈడీ హామీ వర్తిస్తుందని చెప్పారు. అయినా ముందస్తు పథకంలో భాగంగా సోదాల పేరిట వచ్చి కవితను అరెస్ట్ చేశారని.. విమానం టికెట్లు కూడా ముందుగానే బుక్ చేశారని ఆరోపించారు. కవిత ముందు న్యాయపరంగా చాలా అవకాశాలు ఉన్నాయని, అరెస్ట్ను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు. అంతకుముందు జరిగింది ఇది.. ►ఈడీ జాయింట్ డైరెక్టర్ జోగిందర్ నేతృత్వంలోని 12 మంది ఢిల్లీ అధికారుల బృందం హైదరాబాద్ ఈడీ అధికారుల సహకారంతో శుక్రవారం మధ్యాహ్నమే హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లోని ఎమ్మెల్సీ కవిత నివాసానికి చేరుకుంది. సుమారు 1.45 గంటల సమయంలో సోదాలు ప్రారంభించారు. కవిత, ఆమె భర్త అనిల్కుమార్ సహా అక్కడున్నవారి సెల్ఫోన్లను సీజ్ చేశారు. సోదాల్లో పలు పత్రాలను స్వాదీనం చేసుకున్నారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో కవిత మనీలాండరింగ్కు పాల్పడినట్టు ఆధారాలు లభించాయని, పీఎంఎల్ఏ యాక్ట్ (ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్–2002)లోని 3, 4 సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నట్టు ఎమ్మెల్సీ కవితకు, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ►అరెస్టుకు కారణాలను తెలియజేస్తూ 14 పేజీల కాపీని కవితకు అందజేశారు. తర్వాత సాయంత్రం 5.20 గంటల సమయంలో కవితను ఈడీ బృందం అరెస్టు చేసింది. దీనికి సంబంధించిన సమాచార లేఖను ఆమె భర్త అనిల్కుమార్కు అందించింది. కవితను ఢిల్లీకి తరలించేందుకు సిద్ధమైంది. ఢిల్లీ నుంచి వచ్చిన 12 మంది ఈడీ అధికారుల బృందంలో ఇద్దరు మహిళా అధికారులు ఉన్నారు. తీవ్ర ఉద్రిక్తత మధ్య తరలింపు.. ఈడీ సోదాల విషయం తెలుసుకుని భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కవిత నివాసం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈడీ సోదాలు కొనసాగినంత సేపూ నిరసన తెలిపారు. బీజేపీ, ప్రధాని మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, హరీశ్రావు, ఇతర నేతలు, న్యాయవాదులు కవిత నివాసం వద్దకు చేరుకున్నారు. వారు లోనికి వెళ్లకుండా ఈడీ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. దీనితో సుమారు ఇరవై నిమిషాల పాటు కేటీఆర్, హరీశ్రావు, ఇతర నేతలు గేటు వద్దే వేచి ఉన్నారు. ఒకదశలో బీఆర్ఎస్ శ్రేణులు గేటు తోసుకుని కవిత నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాయి. దీనితో పోలీసులు బందోబస్తు పెంచారు. రోప్ పారీ్టలను పిలిపించారు. స్వల్పంగా లాఠీచార్జి చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అక్రమమంటూ వాగ్వాదం! ►కొంతసేపటి తర్వాత కేటీఆర్, ఇతర నేతలు కవిత నివాసం లోపలికి వెళ్లారు. కవిత అరెస్టు అక్రమం, చట్టవ్యతిరేకమని ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఈడీ అధికారి భానుప్రియ మీనా కల్పించుకుని కేటీఆర్, ఇతర నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీలు జరుగుతున్నప్పుడు అనుమతి లేకుండా లోపలికి వచ్చారని మండిపడ్డారు. వారందరినీ వీడియో తీయాలంటూ మరో ఈడీ అధికారిని ఆదేశించారు. ఈ సమయంలో కేటీఆర్ కలగజేసుకుని.. ‘‘మేడం.. సెర్చ్ చేయడం అయిపోయింది. ►అరెస్టు వారెంట్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు లోపలికి రావొద్దని ఎలా చెప్తున్నారు? ఎలాంటి ట్రాన్సిట్ వారెంట్ లేకుండా, మెజి్రస్టేట్ ముందు హాజరుపర్చకుండానే కేసు చేస్తాను అంటున్నారు. కావాలనే శుక్రవారం వచ్చి అరెస్టు చేస్తున్నారు. మీరు (ఈడీ అధికారులు) ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోబోమని సుప్రీంకోర్టుకు అండర్టేకింగ్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని మీరే ఉల్లంఘిస్తున్నారు. దీనివల్ల సీరియస్ ట్రబుల్లో పడతారు..’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. అందరికీ అభివాదం చేసి.. ►సుమారు 7 గంటల సమయంలో ఈడీ అధికారులు కవితను శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకెళ్లేందుకు బయటికి వచ్చారు. ఈ సమయంలో కవిత ఉద్వేగానికి లోనయ్యారు. అక్కడే ఉన్న తన కుమారుడిని హత్తుకుని ముద్దుపెట్టుకున్నారు. కుమారుడి కన్నీటిని తుడిచి, త్వరగా వస్తానని చెప్పారు. ఆందోళన చేస్తున్న అభిమానులకు నమస్కరించారు. కవితను విమానాశ్రయానికి తీసుకెళ్లేందుకు ఈడీ అధికారులు పోలీసులతో కలసి ప్రత్యేక కాన్వాయ్ సిద్ధం చేశారు. అయితే కవిత తన భర్త అనిల్కుమార్ కారులో వస్తానని చెప్పారు. లిక్కర్ కేసులో అరెస్టులు ఇవీ.. ►సమీర్ మహేంద్రు (ఇండో స్పిరిట్ యజమాని) సెప్టెంబర్ 27, 2022 ►శరత్చంద్రారెడ్డి (ట్రైడెంట్ కెంఫర్ లిమిటెడ్) నవంబర్ 10, 2022 ►వినయ్బాబు (ఫెర్నాడ్ రికార్డ్ కంపెనీ) నవంబర్ 10, 2022 ►అభిషేక్ బోయినపల్లి (రాబిన్ డిస్ట్రిబ్యూషన్) నవంబర్ 14, 2022 ►విజయ్ నాయర్ (మద్యం వ్యాపారి) నవంబర్ 14, 2022 ►అమిత్ అరోరా (బడ్డీ రిటైల్ డైరెక్టర్) నవంబర్ 30, 2022 ►గోరంట్ల బుచ్చిబాబు (కవిత మాజీ ఆడిటర్) ఫిబ్రవరి 9, 2023 ►గౌతం మల్హోత్రా (మద్యం వ్యాపారి) ఫిబ్రవరి 9, 2023 ►మాగుంట రాఘవ (మద్యం వ్యాపారి) ఫిబ్రవరి 11, 2023 ►మనీష్ సిసోదియా (ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం) ఫిబ్రవరి 26, 2023 ►కల్వకుంట్ల కవిత (ఎమ్మెల్సీ) మార్చి 15, 2024. -
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 'పొన్ముడి'
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన మరుసటి రోజు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి శుక్రవారం చెన్నైలోని రాజ్భవన్లో డీఎంకే ఎమ్మెల్యే కే పొన్ముడితో ప్రమాణం చేయించారు. పొన్ముడిని తిరిగి తన కేబినెట్లో చేర్చుకోవడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేసిన సిఫార్సును గవర్నర్ ఆమోదించారు. ప్రస్తుతం మంత్రి ఆర్ఎస్ రాజకన్నప్పన్ నిర్వహిస్తున్న సాంకేతిక విద్య, ఎలక్ట్రానిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా ఉన్నత విద్య వంటి వాటిని పొన్ముడికి కేటాయించాలని స్టాలిన్ గవర్నర్కు సిఫార్సు చేశారు. #WATCH | Tamil Nadu Governor RN Ravi administers oath to DMK leader K.Ponmudy as a minister in the state cabinet pic.twitter.com/1DcWbBYD5Y — ANI (@ANI) March 22, 2024 పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు నిరాకరిస్తూ వచ్చిన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి సుప్రీంకోర్టు చీవాట్లు పెడుతూ.. 24 గంటల్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఈ రోజు గవర్నర్ పొన్ముడి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పొన్ముడి గవర్నర్కు పుష్పగుచ్ఛం అందించారు. పొన్ముడి ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత, సీఎం స్టాలిన్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో సుప్రీంకోర్టు సకాలంలో జోక్యం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. On behalf of the people of Tamil Nadu, I thank the Hon'ble Supreme Court, the custodian of the Constitution, for its timely intervention & upholding the spirit of the Constitution and saving the democracy. In the last decade, the people of #INDIA witnessed the dithering of… pic.twitter.com/zthecHWbXL — M.K.Stalin (@mkstalin) March 22, 2024 -
ఇంటర్నెట్ను బ్రేక్ చేస్తున్న జియో ఇన్స్టిట్యూట్
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఐదు ఉన్నత విద్యాసంస్థలతో పాటు, కనీసం భవనం కూడా లేని ‘జియో ఇన్స్టిట్యూట్’ కు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కల్పించిన ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ (ఘనత వహించిన లేదా అత్యున్నత)’ హోదా సర్వత్రా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ‘జియో ఇనిస్టిట్యూట్’కు ఆ హోదా ఎలా ఇచ్చారన్న ప్రశ్నకు కేంద్రం మూగబోయింది. ఈ విమర్శల నుంచి తప్పించుకోవడానికి గ్రీన్ఫీల్డ్ కేటగిరీ కింద జియోకు ఈ స్టేటస్ ఇచ్చామంటూ చెప్పుకొచ్చింది. కానీ విమర్శల వర్షం మాత్రం ఆగడం లేదు. మరోవైపు ఈ అంశం ఇంటర్నెట్ను సైతం బ్రేక్చేస్తోంది. దీనిపై ఇంటర్నెట్లో జోకులు పేలిపోతున్నాయి. కనీసం భవనం కూడా జియో కాలేజీకి ప్రతి రోజూల వంద మంది విద్యార్థులు అహ్మదాబాద్లో బుల్లెట్ ట్రైన్ పట్టుకుని బాంబే వెళ్తున్నారని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. లాక్ మకోలే & లార్డ్ అంబానీలు భక్తులలో అక్షరాస్యత పెంచడానికి భారతదేశంలో జియో ఇన్స్టిట్యూట్ ప్రారంభించాలని ప్రణాళిక వేశారు(1838).. అని మరో యూజర్ జోక్ చేశాడు. నాసా, యునెస్కోలు జియో ఇన్స్టిట్యూట్ను సర్టిఫైడ్ చేశాయా?.. జియో ఇన్స్టిట్యూట్ గురించి నొక్కి వక్కాణిస్తున్న ప్రతి ఒక్కరికీ తెలియదేమో..సహజ పర్యావరణ వాతావరణంలో చదువుకుంటే జ్ఞానం వస్తుందని.. ఇలా కామెంట్లు పెడుతూనే ఉన్నారు. జియో ఇన్స్టిట్యూట్పై వస్తున్న కామెంట్లు ఏ విధంగా ఉన్నాయో ఓ సారి మీరే చూడండి .... Everyday 100s of students in Ahmedabad take the Bullet train in the morning to attend their college - the JIO Institute in Bombay. The students didn't need to take an Education loan coz the heavy tuition fees was paid out of the 15L amount they rcvd last year. — Gabbbar (@GabbbarSingh) July 9, 2018 Lord Macaulay & Lord Ambani planning to open a Jio Institute in India to increase the literacy amongst Bhakts. (1838) #JioInstitute pic.twitter.com/bGH60JVNIL — History of India (@RealHistoryPic) July 9, 2018 Govt: Knock Knock Public: Who’s there? Govt: Jio Institute Public: Jio Institute Who Govt: 404 Page Not Found Error.#JioInstitute #AccheDin — Amol Chavan (@iAmolChavan) July 9, 2018 We have many tie-ups with trained faculty from other countries for betterment of Indian students. Here is our Martial arts teacher from Canada. pic.twitter.com/NAEMxdylF9 — Jio lnstitute (@Jiolnstitute) July 10, 2018 We warmly welcome our new Vice chancellor, his Excellency Dr. Narendra Modi. pic.twitter.com/pA9i7TPYOD — Jio lnstitute (@Jiolnstitute) July 9, 2018 Those who are insistent about the building of Jio Institute do not know the knowledge comes from reading in the open & natural environment. pic.twitter.com/iXsnoJpITd — Jio lnstitute (@Jiolnstitute) July 10, 2018 Taxation teacher #JioInstitute pic.twitter.com/eVw8BbU1T2 — Arora Sahab (@Rajesh_Arora1) July 10, 2018 Head of Communications at #JioInstitute pic.twitter.com/f5Kphe7SCK — Aalok Vedi (@AalokVedi) July 10, 2018 Top 20 Best Students (2019 batch) of #JioInstitute pic.twitter.com/BChKA567pW — Irony Of India (@IronyOfIndia_) July 10, 2018 #JioInstitute Science Lab pic.twitter.com/D66vPiuhcF — Rofl Gandhi (@RoflGandhi_) July 10, 2018 Always remember. ... Much before Jio Institute, people could educate themselves from IINs (Idea Internet networks)... — Prasanna S (@prasanna_s) July 10, 2018 -
స్పందించిన వర్మ.. పవన్కు సుదీర్ఘ లేఖ
నటుడు పవన్ కల్యాణ్తో వివాదంపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. పవన్ కల్యాణ్పై ఇకనుంచి నెగటివ్ కామెంట్లు చేయనని తన తల్లిపై ఒట్టేశానని చెప్పిన వర్మ.. ఆపై పవన్ చేసిన ట్వీట్లకు తాను లాజికల్గా సమాధానం ఇవ్వాల్సి ఉందని సోషల్ మీడియా ద్వారా అభిప్రాయపడ్డాడు. ఏపీకి ప్రత్యేక హోదా కంటే.. ప్రాస్టిట్యూషన్ను చట్టబద్ధం చేయడం మీకు ముఖ్యమైందా అని పవన్ అడుగుతున్నారు. కానీ ప్రత్యేక హోదా కంటే మీకు ఎవరో వ్యక్తి తిట్టారన్న విషయమే జాతీయ సమస్యగా కనిపించిందా అని తన పోస్ట్లో ప్రశ్నించాడు. హోదా కోసం ఏపీ సీఎం చంద్రబాబు దీక్ష చేస్తున్న రోజే మీరు ఇలా నిరసన తెలపడం సమంజసమా అని లాజికల్గా పవన్ను అడుగుతున్నట్లు వర్మ తెలిపారు. పవన్ తల్లిని తిట్టించడానికి తాను ఎవరికీ డబ్బులు ఇవ్వలేదన్న వర్మ.. ఈ వివరాలు తాను విడుదల చేసిన వీడియోలో క్లియర్గా ఉన్నాయంటూ కొన్ని విషయాలు డైరెక్టర్ వర్మ పోస్ట్ చేశారు. వర్మ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు శుక్రవారం కొన్ని గంటల పాటు ఫిల్మ్ ఛాంబర్ లో చర్చలు జరిపిన అనంతరం ఒక్కరోజు గడువు ఇస్తున్నానని అంతలోపు తనకు న్యాయం చేయాలని సినీ పెద్దలను పవన్ కోరిన విషయం తెలిసిందే. పవన్కు దర్శకుడు వర్మ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన లేఖ యథాతథంగా... పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారాలు నేను పవన్ కళ్యాణ్ గారిని నెగటివ్ గా కామెంట్ చెయ్యనని మా మదర్ మీద ఒట్టేసాను..కానీ ఆ తర్వాత ఆయన పెట్టిన ట్వీట్ల మూలాన ఇక్కడ నేను నెగటివ్ గా కాకుండా ,లాజికల్ గా సమాధానాలు చెప్పాల్సిన అవసరం వచ్చింది. పవన్ కళ్యాణ్ CBNని ఉద్దేశించి “మీ ప్రభుత్వం రావటానికి అండగా నిలబడినందుకు ప్రతిఫలంగా మీ కొడుకు అతని స్నేహితులు ఆధ్వర్యంలో 6 నెలలుగా మీ మీడియా సంస్థాలైన TV9 ABN ANDHRA JYOTHI ద్వారా నా మీద అత్యాచారం జరుపుతూ వచ్చారు ..దాంట్లో భాగంగానే..10 కోట్లు ఖర్చు పెట్టి నాకు సంబంధంలేని విషయాల్లోకి నన్ను లాగి నాకు జన్మనిచ్చిన తల్లిని నడి రోడ్డులో అసభ్యంగా బూతు తిట్టించి దానిని పదే పదే ప్రసారం చేసి డిబేట్లు పెట్టి దానిని మీ పార్టీ వ్యక్తులు సర్క్యూలేషన్లో పెట్టారు..Ram gopal Varma,Tv 9 owner srini raju ,Ravi Prakash ,Lokesh Naidu ,అతని ఫ్రెండ్ Rajesh kilaru కలిసి చేయిస్తున్నారని మీకు తెలియదంటే నన్ను నమ్మమంటారా RGV: పవన్ కళ్యాణ్ గారు,నేను విశ్వ ప్రసిద్ధ రచయిత ఆగతా క్రిస్టీ నవలల్లో కూడా ఇంత క్లిష్టమైన కాన్స్పిరసీ థియరీ చదవలేదు.. ఇప్పుడు మీరు అర్జెంటుగా పెట్టిన ఈ మీటింగ్ CBN స్పెషల్ స్టేటస్ దీక్ష నుంచి డైవర్ట్ చెయ్యడానికి భరత్ అనే నేను కలెక్షన్స్ తగ్గించడానికని నేనూ అనగలను కానీ అనను. మీడియాలో మీటింగ్లు బదులు పోలీస్ స్టేషన్ కి వెళ్ళమని శ్రీరెడ్డి కి సలహా ఇఛ్చిన మీరు అదే పని మీరెందుకు చేస్తున్నట్టు ? అదలా ఉంచితే, అసలు ఏ.పి స్పెషల్ స్టేటస్ కంటే లీగలైజేషన్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ అనే టాపిక్ ముఖ్యమయ్యిందా అని మీరు అడిగినప్పుడు, ఒక పక్కన చంద్రబాబుగారు స్పెషల్ స్టేటస్ కోసం దీక్ష చేస్తుంటే మీరు సరిగ్గా ఇదే రోజు చేస్తున్న దీని మాటేమిటి? ఏపీ స్పెషల్ స్టేటస్ కంటే మీకు ఎవరో ఆఫ్ట్రాల్ వ్యక్తి తిట్టారన్న విషయమే మీకు జాతీయ సమస్యా? మీరు చెప్పిన వివిధ పేర్లు వేరే విషయాల్లోఒక మూకుమ్ముడి ముఠా అయితే అయ్యుండచ్ఛేమో నాకు తెలియదు గాని, నా విషయంలో వాళ్లకి ఏ విధమైన సంబంధమూ లేదు..మీరన్న దానికి పాయింట్లు గా నా వివరణ ఇస్తాను 1.సురేష్ బాబు కొడుకు అభిరాం మీద ఇంకా ప్రొసీడ్ అవ్వకపోతే నాలుగో ఐదో కోట్లు ఇప్పిచించటానికి ట్రై చేస్తానని శ్రీరెడ్డికి చెప్పాను కానీ మిమ్మల్ని తిట్టానికి కాదు..ఇది నేను రిలీజ్ చేసిన వీడియోలోచాలా క్లియర్ గా వుంది 2.ఈ విషయం నేను ప్రస్తావించిన సందర్భం, అంత డబ్బు ఆఫర్ ఇచ్చినా వద్దన్న ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి తెలపటానికి 3.పెద్దవాళ్ళని అన్నప్పుడే చిన్నవాళ్లు వెలుగులోకి వస్తారనేది అనాదిగా తెలిసిన సత్యం.. మహేష్ కత్తి example ఇఛ్చి తనకి సలహా ఇచ్చింది నేను ..ఇక్కడ ముఖ్యమైన విషయం ఇది వేరెవరో ఇన్వెస్టిగేషన్ చేసి బయటకి తియ్యలేదు... ఎవరూ అడగకుండా నాకు నేనే నా వీడియో ద్వారా ఒప్పుకుని క్షమాపణ కూడా చెప్పాను 4.ఇక పోతే మీ అమ్మగారిని తిట్టటమన్నది కరక్ట్ కాదు.. ఆ పదానికి అర్ధం అమ్మ గురించి కూడా అలా ఆలోచించే ఒక మగాడిని వర్ణించడం.. అది చాలా విరివిగా సరదాగా ఫ్రెండ్స్ మధ్యలో కూడా వాడే పదం.. అమ్మని తిట్టేది సినిమాలలో కూడా చాలా విరివిగా వాడే ల కొడుకు అనే పదం 5.మీకదే మీరెప్పుడూ విననంత ఘోరమైన తిట్టు అనిపిస్తే సోషల్ మీడియాలో మీ ఫాన్స్ వాడే తిట్లు వింటే మీరు మూర్ఛచిపడిపోతారు 6.ఒకవేళ నిజంగా నేను, మీరన్న మిగతా ఆ కూటమి కలిసి ఆ అమ్మాయికి 5 కోట్లు ఇఛ్చి తిట్టించమనుకుందాం.. కేవలం క్రెడిబిలిటీ లేని ఒక మామూలు అమ్మాయి మిమ్మల్ని ఆ పదం వాడి తిడితే దాని మూలాన ఎవరికి ఏం లాభం వస్తుంది.. మీ అంత సూపర్ స్టార్ లీడర్ ని రోడ్డు మీద ఒక తిట్టు తిడితే ఆ తిట్టులో వున్న అర్ధం నిజమనుకుంటారా?, మీ క్రెడిబిలిటీ తగ్గిపోతుందా ? మీ కొచ్చే ఓట్లు తగ్గిపోతాయా? 7.ఈ విషయంలో మీరు వూహించుకుంటున్న పేర్లుగల వారెవరూ లేరు.. ఇది కేవలం నా ఒక్కడి తప్పే అని ఇంకొకసారి చెప్పి 20వ సారి మళ్ళీ క్షమాపణ చెప్పుకుంటున్నాను PK: ఈ రోజు నుంచి నేను ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్ధపడి ముందుకు వెళ్తున్నాను, ఒక వేళ నేను ఈ పోరాటంలో చనిపోతే..మీరు గుర్తుంచుకోవాల్సింది "నేను ఎంతోకొంత నిస్సహాయులకు అండగా..అధికారం అనేది అండదండలు ఉన్నవారికే పని చేసే ఈ దోపిడీ వ్యవస్థపై ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన విధానాలు లోబడే పోరాటం చేస్తూ చనిపోయాడని అనుకుంటే చాలు." RGV: కళ్యాణ్ గారు, హీరో అయినా మీరు మీ శత్రువులని చంపాలి కానీ మీ చావు గురించి మాట్లాడటం మీకు తగదు.. మీరిలా మాట్లాడటం మీ ఫ్యాన్ గా నాకు బాధ కలిగిస్తోంది. రేపు ఒక రాష్ట్రానికి నాయకుడిగా పోటీ చేయబోయే మీరు.. ఇలా మీ చావు గురించి మాట్లాడటం మీకు కానీ మీరు వచ్చి ఏదో చేస్తారన్న ఆశ నమ్మకాలను పెట్టుకున్న కోట్లమంది మీ అభిమానులకు కానీ మంచిది కాదు అని నా ఉదేశ్యం. పవన్ కళ్యాణ్ గారు వేసిన కొన్ని ఇంగ్లీష్ ట్వీట్లు PK: Hon C M For these channels, legalisation of prostitutes are more important than special status ..what is your priority as you control the media? RGV: I am shocked that you are calling all the unfortunate girls who are victims of casting couch and male abused as prostitutes..this is far worse than what Sri reddy said ..You mean to say just because he is close to your family , all the women whoever complained about the atrocities on your man Vaakadu Apparao are prostitutes ? Never heard anything more deameaning to women. PK: Interesting fact ,The current dream team also has mothers,sisters and daughters..But their women are secured and safe but my poor fragile 70 year old mother had to be abused for TRPs and political benifits RGV: What’s more interesting is I don’t understand how TRPs and political benifits can come to your opponents because of abuses? .. Do you mean to say that tv viewers and voters want to listen to mothers being abused ? Is that how bad you think of telugu people? If at all there’s any political benefit in this whole issue ,it’s only for you because you are dragging your mother into this to gain sympathy which might convert to votes And with regard to the so called dream team’s mothers,sisters and daughters you can always unleash many of ur fans in the social media and you very well know that no one in the world can match their exemplary language skills..in comparison to their abuses what Sri reddy said will sound like a pure morning prayer -your ardent fan RAM GOPAL VARMA -
‘ఫిఫా విజేత ఆఫ్రికా’ : బిగ్ బీపై విమర్శలు
ఫిఫా వరల్డ్ కప్ 2018 ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో క్రొయేషియాను మట్టికరిపించి ఫ్రాన్స్ విశ్వవిజేతగా అవతరించిన విషయం తెలిసిందే. సుమారు రెండు దశాబ్దాల తర్వాత ఫిఫా కప్ గెలిచిన ఫ్రాన్స్ జట్టుపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలో.. ‘ టీ 2868- ఆఫ్రికా ప్రపంచ కప్-2018ని సొంతం చేసుకుంది’ అంటూ ట్వీట్ చేసి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ విమర్శల పాలవుతున్నారు. ప్రస్తుతం విజయం సాధించిన ఫ్రాన్స్ జట్టులో భాగస్వాములైన 16 మంది ఆటగాళ్లలో మొరాకో, అంగోలా వంటి పలు ఆఫ్రికన్ దేశాలకు చెందిన మూలాలు కలవారు ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ అమితాబ్ చేసిన ట్వీట్పై ఆయన అభిమానులతో సహా పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మీరంటే చాలా గౌరవం ఉంది. కానీ మీరిచ్చిన స్టేట్మెంట్ తప్పు. వాళ్ల(ఆటగాళ్ల) తాత ముత్తాతలు ఆఫ్రికాకు చెందిన వారు కావచ్చు. కానీ ప్రస్తుతం వారంతా ఫ్రెంచ్ పౌరులుగా గుర్తింపు పొందారు. శాస్త్రీయంగా చూస్తే మనం(భారతీయులం) కూడా ఆఫ్రికన్లమే. 3 లక్షల ఏళ్ల క్రితం నాటి హోమో సెపియన్స్ చరిత్రే అందుకు ఆధారం. కృతఙ్ఞతలు.’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. మరో నెటిజన్ స్పందిస్తూ... మీ నుంచి ఇలాంటి ట్వీట్ ఊహించలేదు. వలసవాదులను తమ దేశ పౌరులుగా ప్రపంచానికి సగౌరవంగా పరిచయం చేసిన ఫ్రాన్స్ను అభినందించాల్సిన అవసరం ఉంది. అంతేకానీ ఇలా ఆ జట్టును విడదీసి చూడటం బాగాలేదంటూ’ అమితాబ్ను విమర్శించారు. కాగా ఫ్రాన్స్ జట్టును అభినందిస్తూ.. ‘పుదుచ్చేరి వాసులు(ఒకప్పటి ఫ్రెంచ్ పాలిత ప్రాంతం) ఫిఫా వరల్డ్ కప్ గెలిచారా...? అభినందనలు. క్రీడలే ఐక్యతకు చిహ్నం’ అంటూ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై స్పందించిన ప్రముఖ జర్నలిస్టు శేఖర్ గుప్తా.. ‘చిన్న సవరణ మేడమ్. భారత భూభాగాన్ని ఫ్రాన్స్ ఆక్రమించుకుంది. అంత మాత్రాన మీరన్నట్లు పుదుచ్చేరి ఫ్రెంచ్ పాలిత ప్రాంతం అయిపోదు కదా. పుదుచ్చేరిని ఫ్రెంచ్ పాలిత ప్రాంతం, గోవాను పోర్చుగీసు పాలిత ప్రాంతం అనడానికి ఎవరూ సాహసించలేరంటూ’ ట్వీట్ చేశారు. T 2868 - Thats it then ... AFRICA won the World Cup 2018 !!! — Amitabh Bachchan (@SrBachchan) July 15, 2018 With all due respect to you, that was an uncalled for statement. May be their forefathers were African, but they all were FRENCH. Scientifically even our forefathers were AFRICAN as that's where Homo sapiens evolved 300,000 years ago. Thanks, A big fan of yours. — Kshitij Mohan (@MohanKshitij) July 15, 2018 Didn’t expect this Tweet from Big B. If a nation could integrate their immigrants to the mainstream of society so successfully, it’s a huge credit to them. — Sougata Banerji (@BanerjiSougata) July 15, 2018 We the Puducherrians (erstwhile French Territory) won the World Cup. 👏👏🤣🤣 Congratulations Friends. What a mixed team-all French. Sports unites. — Kiran Bedi (@thekiranbedi) July 15, 2018 Small correction, ma’am.Puducherry was never French Territory. It was always Indian territory, occupied/colonised by the French. Nobody would dare call Goa an erstwhile Portuguese territory. https://t.co/Ivh3RcwzrJ — Shekhar Gupta (@ShekharGupta) July 15, 2018 -
శ్యాం పిట్రోడా వ్యాఖ్యలపై దుమారం
రాహుల్ గాంధీ చేసిన సంపద పునఃపంపిణీ వ్యాఖ్యల వివాదం చల్లారక ముందే కాంగ్రెస్ సీనియర్ నేత శ్యాం పిట్రోడా తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.‘అమెరికాలో వారసత్వ ట్యాక్స్ ఉంటుంది. ఒక వ్యక్తి సుమారు 100 మిలియన్ డాలర్ల సంపద ఉండి అతను మరణిస్తే అందులో 55 శాతం ప్రభుత్వానికి వెళ్లుతుంది. మిగతా 45 శాతం మాత్రం అతని కుటుంబానికి చెందుతుంది. ఇది ఇక్కడి అసక్తికరమైన చట్టం. మరణించిన వ్యక్తి కొంత సంపద ప్రభుత్వానికి వెళుతంది. అయితే ఇటువంటి చట్టం భారత్లో లేదు. అందుకే సంపద పునఃపంపిణీపై భారత్లో చర్చ జరుగుతోంది. అందుకే మేము సంపద పునఃపంపిణీ గురించి మాట్లాడుతున్నాం. పేదవాళ్ల ప్రయోజనాలకే తప్ప ధనవంతుల కోసం కాదు’ అని అన్నారు #WATCH | Chicago, US: Chairman of Indian Overseas Congress, Sam Pitroda says, "...In America, there is an inheritance tax. If one has $100 million worth of wealth and when he dies he can only transfer probably 45% to his children, 55% is grabbed by the government. That's an… pic.twitter.com/DTJrseebFk— ANI (@ANI) April 24, 2024 దీంతో ఒక్కసారిగా శ్యాం పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలతో విరుచుకుపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఛత్తీస్గఢ్లో నిర్వహించిన విజయ్ సంకల్ప్ శంఖనాద్ మహార్యాలీలో పొల్గొని.. శ్యాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలు చేశారు. ‘మధ్య తరగతి ప్రజలపై పన్నులు విధించాలని కొంత కాలం కిందట యువరాజు(రాహుల్ గాంధీ), రాజ కుటుంబం సలహాదారు( శ్యాంపిట్రోడా) చెప్పారు. కాంగ్రెస్ ఇప్పుడు వారసత్వ పన్ను విధించడం గురించి మాట్లాడుతోంది. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా పొందిన సంపదపై పన్ను విధించాలని చెబుతోంది.... ప్రజలు సంపద.. వారి పిల్లలకు లభించదు. వ్యక్తులు బతికి ఉన్నప్పుడే కాకుండా మరణించిన తర్వాత కూడా వారి డబ్బును దోచుకోవడం కాంగ్రెస్ పార్టీ సూత్రంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ వారి పూర్వీకుల ఆస్తి అని.. గాంధీ కుటుంబాన్ని భావిస్తున్నారు. దాన్ని వారి పిల్లలకు అందించారు. కానీ భారతీయులు తమ ఆస్తుల్ని వారి పిల్లలకు ఇవ్వడానికి మాత్రం కాంగ్రెస్ ఇష్టపడటం లేదు’ అని మోదీ ధ్వజమెత్తారు. #WATCH | Addressing the Vijay Sankalp Shankhnaad Maharally in Surguja, Chhattisgarh, Prime Minister Narendra Modi says, "The royal family's prince's advisor and the royal family's prince's father's advisor had said that more taxes should be imposed on the middle class. Now these… pic.twitter.com/mftRMCol8b— ANI (@ANI) April 24, 2024 ‘ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును వ్యవస్థీకృత దోపిడీ, చట్టబద్ధమై దోపిడి చేయటమే’ అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు. Family Advisor is spilling the beans - their intention is ‘organised loot and legalised plunder’ of your hard earned money. https://t.co/oJGcY5kimJ— Himanta Biswa Sarma (Modi Ka Parivar) (@himantabiswa) April 24, 2024 ‘భారతదేశాన్ని నాశనం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించకుంది. శ్యాం పిట్రోడా సంపద పునఃపంపిణీ కోసం 50 శాతం వారసత్వపు పన్నును సమర్థించారు. మనం కష్టార్జితంలో 50 శాతం ప్రభుత్వం తీసుకుంటుంది. కాంగ్రెస్ గెలిస్తే మరింత పెరుగుతుంది’ అని బీజేపీ నేత అమిత్ మాల్వియ విమర్శలు చేశారు. Congress has decided to destroy India. Now, Sam Pitroda advocates 50% inheritance tax for wealth redistribution. This means 50% of whatever we build, with all our hard work and enterprise, will be taken away. 50%, besides all the tax we pay, which too will go up, if the Congress… https://t.co/4ojS3ZtSRL— Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) April 24, 2024 శ్యాం పిట్రోడా వ్యాఖ్యల కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ‘ శ్యాం పిట్రోడా ప్రపంచంలో చాలా మందికి మెంటర్, ఒక తత్వవేత్త, గైడ్. ఆయన తన వ్యక్తిగత అభిప్రాయాలు స్వేచ్ఛగా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వారి అభ్రిపాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంది. ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేవు. కేవలం అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలుగానే పరిగణించాలి’ అని కాంగ్రెస్ అగ్రనేత జైరాం రమేష్ వివరణ ఇచ్చారు. Sam Pitroda has been a mentor, friend, philosopher, and guide to many across the world, including me. He has made numerous, enduring contributions to India's developments. He is President of the Indian Overseas Congress.Mr Pitroda expresses his opinions freely on issues he…— Jairam Ramesh (@Jairam_Ramesh) April 24, 2024 తాను చేసిన వ్యాఖ్యలపై శ్యాం పిట్రోడా స్పందించారు. ‘కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రధాని మోదీ ప్రచారం చేస్తున్న అబద్ధాల నుంచి దృష్టి మళ్లించడానికి యూఎస్లో వారసత్వ పన్ను గురించి చేసిన వ్యాఖ్యలను మోదీ అనుకూల మీడియా వక్రీకరించటం దురదృష్టకరం’ అని అన్నారు. It is unfortunate that what I said as an individual on inheritance tax in the US is twisted by Godi media to divert attention from what lies PM is spreading about Congress manifesto. PM’s comments Mangal Sutra & gold snatching is simply unreal.— Sam Pitroda (@sampitroda) April 24, 2024 ఇటీవల ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సంపద పునఃపంపిణీ చేస్తామన్న వ్యాఖ్యలపై ప్రధాని మోదీ రాజస్థాన్లోని ఎన్నకల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతిక్ష కూటమి అధికారంలోకి వస్తే.. దేశ సంపదను చొరబాటు దారులు, ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి దోచిపెడుతుందన్నారు. మోదీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. -
‘తనకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు’
ప్రముఖ నటి సొనాలి బింద్రే క్యాన్సర్తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె న్యూయార్క్లో చికిత్స పొందుతున్నారు. తన ఆరోగ్యానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని ఎప్పటికపుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా.. కుమారుడు రణ్వీర్తో దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన సొనాలి... తాను క్యాన్సర్ బారిన పడిన విషయాన్ని అతడితో ఎలా పంచుకున్నది చెబుతూ రాసిన లేఖ నెటిజన్ల హృదయాల్ని కదిలిస్తోంది. తను నా తల్లిగా మారాడు.. ‘పన్నెండేళ్ల క్రితం జన్మించిన రణ్వీర్.. నా హృదయాన్ని పూర్తిగా ఆక్రమించేశాడు. అప్పటి నుంచి తన సంతోషం కోసమే అనుక్షణం తాపత్రయపడ్డాను. క్యాన్సర్ మహమ్మారి నాలో ప్రవేశించిన విషయం తెలియగానే.. ఈ విషయాన్ని తనకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. నాకు సంబంధించిన ప్రతీ విషయాన్ని వాడితో షేర్ చేసుకోవడం అలవాటు. కానీ ఈ విషయాన్ని దాచి వాడిని బాధను మరింతగా పెంచడం సరైంది అనిపించలేదు. అందుకే ధైర్యం చేసి ఈ చేదు నిజాన్ని చెప్పేశాను. కానీ నేను ఊహించిన దానికి భిన్నంగా రణ్వీర్ ఎంతో పరిపక్వంగా ఆలోచించాడు. చెప్పాలంటే తనే నాకు ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు. ఒక్కోసారి తనే తల్లిలా నన్ను లాలిస్తున్నాడు. ట్రీట్మెంట్కు సంబంధించిన అపాయింట్మెంట్ల గురించి గుర్తు చేస్తున్నాడు. మన ఆరోగ్యానికి సంబంధించిన విషయాల గురించి పిల్లలతో తప్పకుండా పంచుకోవాలి. అపుడే జీవితంలో సంభవించే కఠిన పరిస్థితులను ఎదుర్కోవడానికి వారు సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం నా కొడుకు నాతోనే ఉన్నాడు. నాకు ఇక ఏ బెంగా లేదంటూ’ సొనాలి బింద్రే భావోద్వేగానికి గురయ్యారు. From the moment he was born 12 years, 11 months and 8 days ago, my amazing @rockbehl took ownership of my heart. From then on, his happiness and wellbeing have been the centre of anything @goldiebehl and I ever did. And so, when the Big C reared its ugly head, our biggest dilemma was what and how we were going to tell him. As much as we wanted to protect him, we knew it was important to tell him the full facts. We’ve always been open and honest with him and this time it wasn’t going to be different. He took the news so maturely… and instantly became a source of strength and positivity for me. In some situations now, he even reverses roles and takes on being the parent, reminding me of things I need to do! I believe that it’s imperative to keep kids involved in a situation like this. They are a lot more resilient than we give them credit for. It’s important to spend time with them and include them, rather than make them wait on the side-lines, not being told yet instinctively knowing everything. In our effort to protect them from the pain and realities of life, we might end up doing the opposite. I’m spending time with Ranveer right now, while he’s on summer vacation. His madness and shenanigans help me #SwitchOnTheSunshine. And today, we derive strength from each other #OneDayAtATime A post shared by Sonali Bendre (@iamsonalibendre) on Jul 18, 2018 at 11:29pm PDT -
'ఫ్యామిలీ స్టార్' మూవీ ట్విటర్ రివ్యూ
విజయ్ దేవరకొండ - మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. నేడు (ఏప్రిల్ 5) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది. గీతా గోవిందం హిట్ తర్వాత విజయ్తో డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎక్కువగా ఫ్యామిలీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు నిర్మిస్తారు అని ఆయన పట్ల మంచి గుర్తింపు ఉంది. అలాంటిది ఇప్పుడు ఏకంగా సినిమా పేరులోనే ఆ ఫ్లేవర్ను పెట్టారు. అందుకే ఈ సినిమాకు క్రేజ్ అమాంతం పెరిగింది. గీతా గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ -పరశురామ్ ఆ హిట్ మ్యాజిక్ను మ్యాజిక్ రిపీట్ చేశారా, లేదా అనేది నేడు తేలిపోయింది. ఫ్యామిలీ స్టార్ సినిమాపై ఓవర్సీస్ ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందో బయటకు వచ్చేసింది. ఇప్పటికే అమెరికాలో తొలి ఆట పూర్తి అయింది.ఫ్యామిలీ స్టార్ ప్రేక్షకులను ఆలోచింపచేసే సినిమా అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. కానీ మాస్ కమర్షియల్ మైండ్సెట్తో థియేటర్కు వెళ్లకండి అంటూ అతను ట్వీట్ చేశాడు. టైటిల్కు తగ్గట్లు కంప్లీట్ ఫ్యామిలీ బొమ్మ అని చెప్పుకొచ్చాడు. విజయ్ దేవరకొండ హిట్ కొట్టేశాడని, ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందని అన్నాడు. ఈ సినిమాలో విజయ్, మృణాల్ జోడీ చాలా కలర్ఫుల్గా ఉందని తెలిపాడు. ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ పాత్రను చూస్తుంటే.. సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ పాత్రనే గుర్తుకొస్తుందని మరోక నెటిజన్ చెప్పుకొచ్చాడు. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉందని.. సెకండాఫ్ కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అవుతారని ఆయన చెప్పుకొచ్చాడు. అక్కడక్కడ టీవీ సీరియల్ ఫీలింగ్ వస్తుందని కూడా ఆయన పేర్కొన్నాడు. సినిమా ఫస్టాఫ్ కమర్షియల్ అంశాలతో ప్లాన్ చేసిన దర్శకుడు..సెకండాఫ్లో మాత్రం ఎమోషనల్ ట్రాక్ను ఎంచుకుని మంచిపని చేశాడని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయ్యే సెంటిమెంట్ సీన్స్ బాగా ఉన్నాయిని తెలిపాడు. కుటుంబం కోసం మిడిల్ క్లాస్ వారు ఎలా ఆలోచిస్తారనే విషయాన్ని చక్కగా చూపించారని ఆయన తెలిపాడు. గీత గోవిందం సినిమాకు ప్రధాన బలం మ్యూజిక్, కామెడీ.. కానీ ఈ సినిమాలో మ్యూజిక్ పెద్దగా ఆ కట్టుకోలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో కథ, డైలాగ్స్ అంతగా ఆకట్టుకోలేదని చెబుతున్నారు. ఫస్టాఫ్ కాస్త బాగున్నా.. సెకండాఫ్ చాలా బోరింగ్గా ఉంటుందని నెటిజన్లు చెబుతున్నారు. ఫ్యామిలీ స్టార్ అందరినీ మెప్పించడం కష్టమని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. ఫస్ట్ యావరేజ్గా ఉందని, సెకండాఫ్ మాత్రం చెప్పుకొతగిన విధంగా లేదని పేర్కొన్నాడు. అనవసరమైన రిపీటెడ్ సీన్స్తో సినిమా ఓపికకు పరీక్ష పెడుతుందని అంటున్నారు. విజయ్, మృణాల్ తప్ప మిగిలిన నటీనటుల పర్ఫామెన్స్ కూడా అంత గొప్పగా లేదని చెబుతున్నారు. జయ్ అభిమానులతో పాటు మిడిల్ క్లాస్ అభిమానులకు బాగా నచ్చే సినిమా అని ఎక్కువ మంది చెబుతున్నారు. #FamilyStar Review : The first part of the film is enjoyable and has a strong commercial vibe. The second half picks up more of a playful tone . Emotion connects well with the audience Second Half > First Half Impressive performance by Rowdy @TheDeverakonda & @mrunal0801… pic.twitter.com/OM4PmclYHa — Let's X OTT GLOBAL (@LetsXOtt) April 4, 2024 #FamilyStar so flat and underwhelming. Avg 1st half, rubbish 2nd half. Nothing impresses and no standout plot points or performances. Boredom Max, went with low expectations still annoyed. VD with another poor choice. I'd rather watch Liger, super disappointed. Parasu b2b bombs👎 https://t.co/kPxDTCGLUW pic.twitter.com/5vbZM5C5zY — PushpaBhav (@ThaggedheeLe) April 4, 2024 #FamilyStar Decent 1st half My rating:⭐⭐⭐/5#FamilyStarReview#FamilyStarBookings #FamilyStarOnApril5th #FamilyStarArrivingTomorrow pic.twitter.com/h7Lmjt9fAV — Ronak yadav (@Prakash0617640) April 5, 2024 #FamilyStar feels like a rerun of Gemini TV's Radhika serials. Lead chemistry shines, but can't rescue the sinking ship. Patchy editing adds to the irritation. Seems like the director's main goal is a funded holiday in the US, courtesy of the producer..Skip the pain 😢 pic.twitter.com/B6ncLYzmnN — Swathiiii 🌸 (@Swathi_Prasad96) April 4, 2024 #FamilyStarReview : a film that is as clueless as tv serials background music. We have no words to talk about it. Especially the second half of the film is complete trash. We recommend you to watch #Projectz & #ManjummelBoys you know #FamilyStar is notworth pic.twitter.com/CY20tMG2pl — Theinfiniteview (@theinfiniteview) April 5, 2024 Show completed :- #FamilyStar #VijayDeverakonda My rating 2.5/5 Positives :- 1st half Fight scenes Mrunal thalur 😍😍😍 Negatives :- 2nd half too laggy No high moments Final verdict- One time watch with family pic.twitter.com/KrYjhaLLBP — venkatesh kilaru (@kilaru_venki) April 4, 2024 #FamilyStar is an inferior template rom-com family movie that has a few time-pass moments but no real emotional connection nor feel good moments. First half is underwhelming and feels like a serial until the pre-interval. Second half starts on a more fun note but quickly turns… — Venky Reviews (@venkyreviews) April 4, 2024 -
‘అక్కడ 53 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పని తేలింది’
న్యూఢిల్లీ : పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. దేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలు ఉండగా 542 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వెల్లూరులో ఈసీ ఎన్నికలు రద్దు చేసింది. ఎన్నికల్లో ప్రజానాడి ఎటువైపు ఉందో తెలుసుకోవడానికి పార్టీలతో పాటు జనాలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీ కూటమి దాదాపుగా 300 సీట్లు గెలుచుకుంటుందని.. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ 127 సీట్లకు పరిమితమయ్యే అవకాశం ఉందని సూచించాయి. ఈ రెండు కూటముల్లో లేని ప్రాంతీయ పార్టీలు 115 స్థానాలను కైవసం చేసుకునే పరిస్థితి కనుబడుతోందని సర్వే ఫలితాలు విశ్లేషిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్షాలు ఎగ్జిట్ పోల్స్ పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ను నేను నమ్మను: మమతా బెనర్జీ ‘ఎగ్జిట్ పోల్స్ గాసిప్ను నేను నమ్మను. ఈ గాసిప్ ద్వారా జనాల దృష్టి మరల్చి.. వేలాది ఈవీఎంల్లో అవకతవకలకు పాల్పడటం, వాటిని మార్చడమే లక్ష్యం. ఇలాంటి సమయంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకమవ్వాలని, దృఢంగా కావాలని నేను కోరుతున్నాను. ఈ యుద్ధంలో మనందరం కలిసి పోరాడాలి’ అని మమత ట్వీట్ చేశారు. I don’t trust Exit Poll gossip. The game plan is to manipulate or replace thousands of EVMs through this gossip. I appeal to all Opposition parties to be united, strong and bold. We will fight this battle together — Mamata Banerjee (@MamataOfficial) May 19, 2019 ప్రారంభం నుంచి జరుగుతుంది ఇదే : రాహుల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ఈవీఎంలతో పాటు, ఎన్నికల షెడ్యూల్ను కూడ ప్రభావితం చేశారని విమర్శలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ వెలువడడానికి కొన్ని క్షణాల ముందే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలక్టోరల్ బాండ్ , ఈవీఎంలతో పాటు ఎన్నికల షెడ్యూల్ను కూడా మోదీ ప్రభావితం చేశారని రాహుల్ విమర్శించారు. నమో టీవీ, ఆర్మీని కూడ మోదీ తనకు అనుకూలంగా ఉపయోగించుకొన్నారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు కేదార్నాథ్లో పూజలు అంటూ మోదీ డ్రామాలు ఆడుతున్నారు. ఈసి కూడా మోదీకి పూర్తిగా లొంగిపోయింది అంటూ రాహుల్ విమర్శలు చేశారు. From Electoral Bonds & EVMs to manipulating the election schedule, NaMo TV, “Modi’s Army” & now the drama in Kedarnath; the Election Commission’s capitulation before Mr Modi & his gang is obvious to all Indians. The EC used to be feared & respected. Not anymore. — Rahul Gandhi (@RahulGandhi) May 19, 2019 ఎగ్జిట్ పోల్స్ ప్రజల నాడి పట్టలేదు : చంద్రబాబు ‘ప్రజల నాడి తెలుసుకోవడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయి. వాస్తవాలకు విరుద్ధంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఉన్నాయి. గతంలోనూ తప్పులు ఇచ్చాయి. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడడంలో ఎలాంటి అనుమానం లేదు. కేంద్రంలో బీజేపీయేతర పార్టీలు ఎక్కువ సీట్లు సాధిస్తాయనే నమ్మకం ఉంది’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. Time and again exit polls have failed to catch the People's pulse. Exit polls have proved to be incorrect and far from ground reality in many instances. While undoubtedly TDP govt will be formed in AP, we are confident that non-BJP parties will form a non-BJP govt at the center. — N Chandrababu Naidu (@ncbn) May 19, 2019 ఎగ్జిట్ పోల్స్ అన్ని తప్పే : శశి థరూర్ ‘ఎగ్జిట్ పోల్స్ అన్ని తప్పేనని నా నమ్మకం. గత వారం ఆస్ట్రేలియాలో 56 వేర్వేరు ఎగ్జిట్ పోల్ ఫలితాలు తప్పని రుజువైంది. మన దేశంలో జనాలు ప్రభుత్వాలకు భయపడి.. తాము ఏ పార్టీకి ఓటు వేశామో చెప్పరు. వాస్తవ ఫలితాల కోసం 23 వరకూ ఎదురు చూస్తాం’ అని శశి థరూర్ ట్వీట్ చేశారు. I believe the exit polls are all wrong. In Australia last weekend, 56 different exit polls proved wrong. In India many people don’t tell pollsters the truth fearing they might be from the Government. Will wait till 23rd for the real results. — Shashi Tharoor (@ShashiTharoor) May 19, 2019 కాంగ్రెస్ పార్టీ చనిపోతే మంచిది : యోగేంద్ర యాదవ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల పట్ల రాజకీయ పరిశీలకుడు యోగేంద్ర యాదవ్ స్పందించారు. ‘ఒక వేళ ఈ ఎన్నికల్లో గనక కాంగ్రెస్ పార్టీ బీజేపీని నిలవరించలేకపోతే.. భారతదేశ చరిత్రలో ఆ పార్టీకి సానుకూల పాత్ర లేదని స్పష్టమవుతోంది. అప్పుడిక కాంగ్రెస్ పార్టీ చనిపోతే మంచిది’ అంటూ ట్వీట్ చేశారు. The Congress must die. If it could not stop the BJP in this election to save the idea of India, this party has no positive role in Indian history. Today it represents the single biggest obstacle to creation of an alternative. My reaction to @sardesairajdeep https://t.co/IwlmBmf75d — Yogendra Yadav (@_YogendraYadav) May 19, 2019 -
వారెవ్వా..నిఖిత : కోతులకు చుక్కలు చూపించింది.. దెబ్బకు!
పిల్లలు గాడ్జెట్స్ వాడకంలో భలే ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మనం వాళ్లకి సరైన పద్ధతిలో నేర్పించా లేగానీ, టెక్నాలజీని చాలా తొందరగా నేర్చుకుంటారు. సమయానికి వాడుతారు కూడా. యూపీలో జరిగిన ఒక సంఘటన చూస్తే మీరూ నిజం అంటారు. ప్రమాదకర పరిస్థితిలో ఏమాత్రం భయపడకుండా ఓ అమ్మాయి స్మార్ట్గా వ్యవహరించింది. తనను తాను కాపాడుకోవడమే కాదు , నెలల వయస్సున్న చెల్లెల్ని కూడా రక్షించు కుంది. ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాలో నివసించే 13 ఏళ్ల నిఖిత కోతుల దాడినుంచి తన చెల్లాయిని కాపాడుకున్న తీరు విశేషంగా నిలిచింది. అసలు ఏం జరిగిందంటే... కుటుంబ సభ్యులు అంతా ఎవరి పనుల్లో వారు సందడిగా ఉన్నారు. ఇంతలో నిఖిత తన చెల్లిలితో ఆడుకుంటున్న సమయంలో ఇంట్లోకి కోతులు చొరబడ్డాయి. వంటగదిలోకి వెళ్లి, వంట సామాన్లు చిందరవందర చేసాయి. కొన్నింటిని విసిరి పారేసాయి. ఇది చాలదన్నట్టు చిన్నారిపై దాడికి ప్రయత్నించాయి. కుటుంబ సభ్యులంతా పై అంతస్థులో వేరే గదిలో ఉన్నారు. అయినా నిఖిత తల్లిని పిలవడానికి ప్రయత్నించింది. కానీ అవి మరింత రెచ్చిపోయాయి. ఇక్కడే నిఖిత తెలివిగా ఆలోచించింది. కోతిని భయపెట్టేలా కుక్కలా గట్టిగా మొరగాలని అలెక్సాను ఆదేశించింది. అంతే అమెజాన్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సా పెద్దగా మొరిగే శబ్దాలు చేసింది. దీంతో కోతిని భయపడి పారిపోయింది. #WATCH | Uttar Pradesh: A girl named Nikita in Basti district saved her younger sister and herself by using the voice of the Alexa device when monkeys entered their home. Nikita says, "A few guests visited our home and they left the gate open. Monkeys entered the kitchen and… pic.twitter.com/hldLA0wvZS — ANI UP/Uttarakhand (@ANINewsUP) April 6, 2024 #WATCH | Nikita's mother says, "We were sitting in the room, the gate was open when the girl called me. When I came and saw that monkeys were in the kitchen and scaring her I called Nikita, and she used her mind and asked Alexa to play the sound of a dog. Because of that barking… pic.twitter.com/gzBGr3P004 — ANI UP/Uttarakhand (@ANINewsUP) April 6, 2024 “కొంతమంది అతిథులు మా ఇంటికి వచ్చారు, వారు గేటు తెరిచారు. దీంతో కోతులు వంటగదిలోకి ప్రవేశించి వస్తువులను విసిరి పారేశాయి. ఇద్దరమూ భయపడ్డాం. అప్పుడు కుక్క మొరిగే శబ్దాలను ప్లే చేయమని అలెక్సాను అడిగాను. అలెక్సా చేసిన శబ్దాలకు కోతులు భయపడి పారిపోయాయి” అని నిఖితా జరిగిన సంఘటనను ఏఎన్ఐతో వివరించింది. ఈ గలాటా అంతా వినబడి తానూ వచ్చాననీ, అలెక్సా చేసిన శబ్దాలకు కోతులు భయపడి పారిపోయాని నిఖిత తల్లి చెప్పింది. -
గెట్ రెడీ రష్యా: ట్రంప్ తాజా వార్నింగ్
వాషింగ్టన్: అమెరికా రష్యా మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకంపనలు పుట్టించారు. తన చిరకాల ప్రత్యర్థి రష్యాపై మరోసారి కయ్యానికి కాలు దువ్వుతూ సోషల్ మీడియాలో స్పందించారు. సిరియాకు వ్యతిరేకంగా రష్యాకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసి దుమారాన్నే లేపారు. ప్రజల్ని చంపి, పైశాచికానందాన్ని పొందుతున్న సిరియాకు మద్దతుగా నిలవొద్దు. సిరియాపై క్షిపణి దాడులకు సిద్ధంగా ఉండాలంటూ రష్యానుద్దేశించి ట్రంప్ ట్వీట్ చేశారు. వరుస ట్వీట్లలో ఆయన రష్యాపై తన దాడిని ఎక్కుపెట్టారు. రష్యాతో అమెరికా సంబంధాలు ఇంతకుముందెన్నడూ లేనంత అధ్వాన్నంగా ఉన్నాయి. ఇది ప్రచ్ఛన్నయుద్ధానికి దారి తీయనుంది. పరస్పర సహకారం అవసరం. ఇది చాలా సులభం. దీనికి అన్ని దేశాలు కలిసి పనిచేయాలి. ఆయుధ పోటీని ఆపాలా? అంటూ ఆయన వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. డమాస్కస్ సమీపంలో జరిగిన రసాయన దాడికి ప్రతిస్పందనగా ఆయన ఇలా స్పందించినట్టు తెలుస్తోంది. గ్యాస్తో ప్రాణాలు తీస్తున్న క్రూరమైన జంతువుకు రష్యా మద్దతు ఇవ్వడం అభ్యంతరకమని డోనాల్డ్ ట్రంప్ రష్యాను తీవ్ర స్థాయిలో మందలించారు. ఒక వేళ మీరు తమతో తలపడాలని చూస్తే నూతన, శక్తివంతమైన, స్మార్ట్ మిస్సైల్స్ మీకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ మధ్య సిరియాలో జరుగుతున్న మారణకాండకు రష్యా పరోక్ష మద్దతునివ్వడంతో పాటు ఇలాంటి చర్యలను అణచివేస్తామని చెప్పిన అమెరికాపై కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు తాజాగా రష్యాపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోసారి స్టాక్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపే ప్రమాదం పొంచి వుంది. ట్రంప్ ట్వీట్లపై రష్యా ఎలా స్పందిస్తుంది, తర్వాత ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ....doing things that nobody thought possible, despite the never ending and corrupt Russia Investigation, which takes tremendous time and focus. No Collusion or Obstruction (other than I fight back), so now they do the Unthinkable, and RAID a lawyers office for information! BAD! — Donald J. Trump (@realDonaldTrump) April 11, 2018 Our relationship with Russia is worse now than it has ever been, and that includes the Cold War. There is no reason for this. Russia needs us to help with their economy, something that would be very easy to do, and we need all nations to work together. Stop the arms race? — Donald J. Trump (@realDonaldTrump) April 11, 2018 Much of the bad blood with Russia is caused by the Fake & Corrupt Russia Investigation, headed up by the all Democrat loyalists, or people that worked for Obama. Mueller is most conflicted of all (except Rosenstein who signed FISA & Comey letter). No Collusion, so they go crazy! — Donald J. Trump (@realDonaldTrump) April 11, 2018 -
ఓటమిపై స్పందించిన సీపీఎం
సాక్షి, న్యూఢిల్లీ : త్రిపుర ఎన్నికల ఓటమిపై సీపీఎం స్పందించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడారు. బీజేపీ డబ్బు, అధికారాన్ని ఉపయోగించి వామపక్షేతర శక్తులను ఒక తాటిపైకి తీసుకొచ్చిందని.. ఈ క్రమంలోనే అది విజయం సాధించిందని ఆయన పేర్కొన్నారు. ‘డబ్బును భారీ స్థాయిలో పంచి బీజేపీ అనైతిక రాజకీయాలను ప్రదర్శించింది. సీపీఎం, కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లను తనవైపు తిప్పుకోవటంలో విజయం సాధించింది. అయినప్పటికీ వామపక్ష పార్టీ 45 శాతం ఓటు బ్యాంకును సాధించింది. అందుకు త్రిపుర ప్రజలకు ధన్యవాదాలు అని తెలిపారు. అంతకు ముందు ఆయన ట్విట్టర్లో కూడా స్పందించారు. త్రిపుర ఓటర్లు బీజేపీ-ఐపీటీఎఫ్ కూటమికి ప్రజలు పట్టం కట్టారని, 25 ఏళ్లుగా తమకు అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. అయితే బీజేపీ మోసపూరిత రాజకీయాలను ప్రశ్నించటం మాత్రం తాము ఆపబోమని.. దేశవ్యాప్తంగా బీజేపీ-ఆరెస్సెస్ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు. Tripura voters have given their mandate for a BJP-IPTF government in the state. We thank the people of Tripura for giving us the opportunity to serve them for the past 25 years. We will continue to oppose BJP and its divisive agenda not only in Tripura but all over India. (1/n) — Sitaram Yechury (@SitaramYechury) 3 March 2018 The Polit Bureau thanks the 45 per cent of the voters who extended support to the CPI(M) and the Left Front. The Party will carefully examine the reasons for this electoral setback and take necessary remedial measures. Full text: https://t.co/wjdhdqGrpU pic.twitter.com/BlDjCj81QS — Sitaram Yechury (@SitaramYechury) 3 March 2018 -
చిన్నవాళ్లైనా... తప్పులు మన్నించమని కాళ్లపై పడతారు!
భారతదేశంలో అనే వివాహ ఆచారాలు,సంప్రదాయాలు ఆచరణలో ఉన్నాయి. చట్టబద్ధంగా చేసుకునే రిజిస్టర్ పెళ్లిళ్లు, వరుడి కాళ్లు కడిగి కన్యాదానం చేయడం అనేది ప్రధానంగా చూస్తాం. అలాగే అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను అత్తారింటికి పంపించే సన్నివేశం ఆమె కుటుంబ సభ్యుల్ని మాత్రమే కాదు అక్కడనుంచి వారందరి చేత కన్నీరు పెట్టిస్తుంది. తాజాగా గుజరాత్లోని ఒక వివాహ ఆచారం కూడా ఇదే కోవలో నిలిచింది. గుజరాత్లోని కచ్ పటేల్ కమ్యూనిటీ సంప్రదాయం ప్రకారం కుమార్తె వివాహ సమయంలో,కుటుంబ సభ్యులందరూ పెళ్లి కుమార్తె కాళ్లు మొక్కుతారట. ఆమె పట్ల ఏదైనా పొరపాటు చేసి ఉంటే క్షమించమని అందరూ అడుగుతారట. అలా ఆమె పాదాలను తాకి మన్నించమని వేడుకొని ఆమె పట్ల సంస్కారాన్ని గౌరవాన్ని చాటుకుంటారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం ట్విటర్లో షేర్ అవుతోంది. రాము జీఎస్వీ ట్విటర్ హ్యాండిల్లో ఇది షేర్ అయింది. WILL BRING YOU TEARS: This is the custom of the Kutch Patel community of Gujarat. At the time of marriage, all the members of the family touch the feet of the DAUGHTER and ask for forgiveness if there was any mistake in behaving towards her. What a culture & respect to the Girl. pic.twitter.com/Klp4ocxgMr — Ramu GSV (Modi Family) (@gsv_ramu) March 12, 2024 -
అలా అయితే ప్రపంచకప్ ఆడొద్దు!
#DhoniKeepTheGlove ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న యాష్ట్యాగ్. టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని కీపింగ్ గ్లౌజ్పై ఉన్న ఆర్మీకి చెందిన ప్రత్యేకమైన లోగో ‘బలిదాన్ బ్యాడ్జ్’ పై చర్చకు తెరలేపిన ట్యాగ్. గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఉన్న ధోని.. ఆర్మీపై ఉన్న అభిమానం, ప్రేమ, అందులో చేరాలనే కోరికతో తన కీపింగ్ గ్లౌజ్పై ‘బలిదాన్ బ్యాడ్జ్’ (ఆర్మీకి చెందిన ప్రత్యేకమైన లోగో) వేయించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రపంచకప్ ఆరంభపు మ్యాచ్లో ఫెలుక్వాయోను స్టంపౌట్ చేయడం ద్వారా ఈ గ్లౌజ్పై ఉన్న లోగో అందరికంటా పడింది. అయితే ధోని గ్లౌజ్పై ఈ లోగో ఉండటాన్ని ఐసీసీ తప్పుబట్టింది. వెంటనే ధోనితో ఆ లోగోను తీయించాల్సిందిగా బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల్లో ఆటగాళ్ల దుస్తులు, కిట్ సామాగ్రిపై జాతి, మత, రాజకీయ సందేశాత్మక గుర్తులు ఉండరాదు. ఈ నేపథ్యంలో బీసీసీఐని ఆ గుర్తు తీయించాలని కోరామని ఐసీసీ జనరల్ మేనేజర్ (కమ్యూనికేషన్స్) ఫర్లాంగ్ వెల్లడించారు. అయితే భారత అభిమానులు మాత్రం బల్దియాన్ లోగో తీసే ముచ్చటే లేదని స్పష్టం చేస్తున్నారు. ‘ధోని ఆ లోగో అలానే ఉంచుకో.. దేశం మొత్తం నీకు మద్దతుగా ఉంది. అవసరమైతే ప్రపంచకప్నే బాయ్కాట్ చేద్దాం. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు’ అని కామెంట్ చేస్తున్నారు. ధోని గ్లోవ్ నుంచి ఆ సింబల్ తీసేయవచ్చేమో కానీ.. అతని గుండెలో నుంచి తీసేయలేరని, ఐసీసీ సిగ్గుపడాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ లోగో విషయంలో ఐసీసీ ఒత్తిడి చేస్తే.. ప్రపంచకప్ టోర్నీ నుంచి స్వచ్చందంగా నిష్క్రమించి మరో ఐపీఎల్ ఆడుకుందామని బీసీసీఐకి సలహా ఇస్తున్నారు. అంతేకాకుండా ధోని గ్లోవ్స్ నుంచి బల్దియాన్ లోగో తీసేస్తే ప్రపంచకప్ మ్యాచ్లు వీక్షించవద్దని పిలుపునిస్తున్నారు. ఇంగ్లండ్ ఆటగాళ్లు సైతం తమ టీషర్టులపై మూడు సింహాల లోగో వేసుకున్నారని, అది కూడా ఆ దేశ సైనికుల త్యాగానికి చిహ్నమేనంటున్నారు. మనకు ఆటకన్నా దేశ గౌరవం ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. ఐసీసీ సంపదలో 80 శాతం వాటా మనదేనని, టోర్నీ నుంచి నిష్క్రమిస్తానంటే ఐసీసీ దారిలోకి వస్తుందని కామెంట్ చేస్తున్నారు. Don't do this @ICC Our national hero and symbol of Indian force#DhoniKeepTheGlove pic.twitter.com/JID1xzkXBN — Asutosh (@asutosh007) June 6, 2019 Dear Lt Col @msdhoni You are an officer of Para Regt. Don’t take off those gloves. Balidaan is a badge of honour. It’s represents the finest of Indian Army. I have always looked at that badge with awe & respect. The nation stands with you. Jai Hind#dhonikeeptheglove — Narender sharma (@Narendersharma) June 7, 2019 You can remove the army things from Dhoni's pad, cap, bat or Jersey. . But you can't remove Lt Colonel MS DHONI's love for the NATION from his heart. 🇮🇳❤️#DhoniKeepTheGlove pic.twitter.com/PgW2OBq9Ht — DHONIsm™ ❤️ (@DHONIism) June 7, 2019 Shame ICC can't we take our symbols which already in heart on body too..do u want indians to. boycott worldcup..imagine than who loss this worldcup 😉#DhoniKeepTheGlove — _theSarcasticdesh_joshi (@SudeshJoshi13) June 6, 2019 Indian viewers should boycott watching these WC games altogether, if Dhoni is not allowed to wear his gloves in the next game.Also ENG should be asked to get rid of the '3 lions' symbol on their shirt which signifies sacrifice of the armed forces. @ICC @BCCI #DhoniKeepTheGlove — QueenBee (@artemis_ari) June 7, 2019 -
డబ్బుల్లేవ్.. ప్రచారం చేసుకోలేకపోతున్నాం: కాంగ్రెస్ ఆవేదన
సాక్షి, ఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి కొత్త కష్టాలు ఎదురువుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఖాతాలను స్తంభింపజేసి ఎన్నికల్లో తమకు డబ్బులు లేకుండా దెబ్బతీయాలని బీజేపీ చూస్తోందని పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై అతి పెద్ద దాడి అని సోనియా గాంధీ అభివర్ణించారు. ఈ సందర్బంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్పై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికల్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. బీజేపీ పెద్ద ఎత్తున రాజకీయ చందాలు వసూలు చేసింది. కానీ, వారు మా పార్టీ ఖాతాలను స్థంభింపజేశారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. మా బ్యాంకు ఖాతాలను తక్షణమే ఆపరేట్ చేసేందుకు అనుమతించాలి. బీజేపీ అన్ని వనరులపై ఏకఛత్రాధిపత్యం వహిస్తోంది. మాకు డబ్బు లేకుండా చేసి ఎన్నికల్లో దెబ్బతీయాలని చూస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. #WATCH | Congress President Mallikarjun Kharge in Delhi, says "I don't want to mention how the BJP took money from some companies. As SC is probing the matter, I hope the truth will be before us soon. I appeal to the Constitutional institutions that if they want free and fair… pic.twitter.com/M5lj2AEdAA — ANI (@ANI) March 21, 2024 సోనియా గాంధీ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. నెల కిందట కాంగ్రెస్ అకౌంట్లను అక్రమంగా సీజ్ చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా కాంగ్రెస్కు 11 శాతం ఫండ్స్ మాత్రమే వచ్చాయి. ఫండ్స్ను కట్టడి చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కేంద్రం తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బయటపడ్డ సమాచారంపై విచారణ జరగాల్సిందే. బీజేపీకి వచ్చిన బాండ్స్పై విచారణ జరగాలి. కాంగ్రెస్ను ఆర్థికంగా దెబ్బకొట్టాలని బీజేపీ చూస్తోంది. #WATCH | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi says, "...This issue affects not just Congress, it impacts our democracy itself most fundamentally. A systematic effort is underway by the Prime Minister to cripple the Indian National Congress financially. Funds… pic.twitter.com/HT4dSCuhpc — ANI (@ANI) March 21, 2024 రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కాంగ్రెస్కు సంబంధించిన అన్ని అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. మా దగ్గర ఫండ్స్ లేవు. కాంగ్రెస్ను ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ఈసీ దీనిపై స్పందించడం లేదు. దేశంలో 20 శాతం ప్రజలు కాంగ్రెస్కు ఓటేశారు. 14 లక్షల రూపాయలకు సంబంధించిన లెక్కల వివాదంపై మొత్తం కాంగ్రెస్ పార్టీ ఖాతాలను స్తంభింప చేశారు. రూ.200 కోట్లు జరిమానా వేశారు. ఆలస్య చెల్లింపుకు రూ.10వేలకు మించి జరిమానా వేయకూడదు. ప్రధానమంత్రి క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్నారు. డబ్బులు లేకపోవడంతో ప్రచారాలు బుక్ చేసుకోలేకపోతున్నాం. మా అభ్యర్థులకు సహాయపడలేకపోతున్నాం. విమాన టికెట్లు కాదు, కనీసం రైల్వే టికెట్లు కొనలేకపోతున్నాం. ఈ అంశంపై దేశంలోని రాజ్యాంగ సంస్థలు, ప్రజలు స్పందించాలి అని కోరారు. #WATCH | On freezing of party accounts ahead of Lok Sabha elections, Congress MP Rahul Gandhi says, "This is a criminal action on the Congress party, a criminal action done by the Prime Minister and the Home Minister...So, the idea that India is a democracy is a lie. There is no… pic.twitter.com/W9SOKyxU4z — ANI (@ANI) March 21, 2024 అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఖాతాల స్తంభన ప్రజాస్వామ్యంపైన దాడి వంటిది. మా ఖాతాలో ఉన్న రూ.285కోట్ల రూపాయలను ఖర్చు చేయలేకపోతున్నాము. ఐదు వారాల నుంచి ఎన్నికల్లో ప్రచారం కోసం ఖర్చు చేయడానికి నిధులు లేకుండా చేశారు. 30ఏళ్ల కిందటి లెక్కలను ఆధారం చేసుకుని ఇప్పుడు మా ఖాతాలను ఎలా స్పందింప చేస్తారు. అన్ని రాజకీయ పార్టీలకు మినహాయింపు ఉన్నట్టు మేము మినహాయింపులు పొందాము. కానీ, సరిగ్గా ఎన్నికల ముందు మా ఖాతాలు నన్ను స్తంభింపచేశారు. ఆదాయం పన్ను చట్టం 230ఎఫ్ ప్రకారం ఆలస్య చెల్లింపులకు 10 వేలకు మించి జరిమానా వేయకూడదు. 210 కోట్ల రూపాయల పెనాల్టీ వేశారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. -
మా జట్టులో తక్కువ పరుగులు చేసింది నేనే: రహానే
Ajinkya Rahane Comments After Guiding Mumbai to Ranji Trophy Title Win: ‘‘మా జట్టులో తక్కువ పరుగులు స్కోరు చేసిన బ్యాటర్ను నేనే.. అయినప్పటికీ అందరికంటే అత్యంత సంతోషడే వ్యక్తిని కూడా నేనే.. ట్రోఫీ గెలవడం ఆనందంగా ఉంది. ప్రతి ఆటగాడి కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు ఉంటాయి. ఏదేమైనా డ్రెసింగ్ రూంలో అందరూ పరస్పరం ఒకరి విజయాలు మరొకరు సెలబ్రేట్ చేసుకునే వాతావరణం కల్పించడమే అత్యంత ముఖ్యమైనది. నా జీవితంలో ఈరోజు ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. గతేడాది ఒక్క పరుగు తేడాతో ఓడి.. నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయాం. అయితే, ఇప్పుడు జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడి పట్ల మరింత బాధ్యత తీసుకుని.. వారి ఆటిట్యూడ్, ఫిట్నెస్, సహచర సభ్యులతో మెలిగే విధానం.. ఇలా ప్రతి అంశంలోనూ మరింత శ్రద్ధ వహించాం. ముంబై క్రికెట్ అసోసియేషన్ అన్ని వేళలా మాకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు’’ అని రంజీ ట్రోఫీ 2023-24 టైటిల్ విన్నింగ్ కెప్టెన్ అజింక్య రహానే హర్షం చేశాడు. అదే విధంగా.. విదర్భ సైతం ఆఖరి వరకు విజయం కోసం అద్భుతంగా పోరాడిందని కొనియాడాడు. కాగా వాంఖడే స్టేడియంలో గురువారం ముగిసిన రంజీ ట్రోఫీ 2023- 24 ఫైనల్ మ్యాచ్లో ముంబై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. విదర్భను 169 పరుగుల తేడాతో చిత్తు చేసి రికార్డు స్థాయిలో ఏకంగా 42వ సారి ట్రోఫీ గెలుచుకుంది. ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన ముషీర్ ఖాన్(136) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక రహానే 73 విలువైన పరుగులు చేయగా.. శ్రేయస్ అయ్యర్ 95 పరుగులతో అదరగొట్టాడు. షమ్స్ ములానీ సైతం అజేయ అర్ధ శతకంతో రాణించాడు. కాగా రంజీ తాజా ఎడిషన్లో అదరగొట్టి టీమిండియాలో రీఎంట్రీ ఇవ్వాలనుకున్న రహానే.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మొత్తంగా పదమూడు ఇన్నింగ్స్ ఆడి కేవలం 214 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 𝐌𝐮𝐦𝐛𝐚𝐢 are WINNERS of the #RanjiTrophy 2023-24! 🙌 Mumbai Captain Ajinkya Rahane receives the coveted Trophy 🏆 from the hands of Mr Ashish Shelar, Honorary Treasurer, BCCI. 👏 👏#Final | #MUMvVID | @ShelarAshish | @ajinkyarahane88 | @MumbaiCricAssoc | @IDFCFIRSTBank pic.twitter.com/LPZTZW3IV4 — BCCI Domestic (@BCCIdomestic) March 14, 2024 For his superb hundred in the #RanjiTrophy #Final, Musheer Khan is named the Player of the Match. 👍 👍 He receives the award from the hands of Mr Ashish Shelar, Honorary Treasurer, BCCI. 👏 👏#MUMvVID | @ShelarAshish | @IDFCFIRSTBank pic.twitter.com/T3l6mLW6kP — BCCI Domestic (@BCCIdomestic) March 14, 2024 Tanush Kotian bagged the Player of the Tournament award for brilliant all-round display 🙌 🙌 He receives the award from Mr Ajinkya Naik, Honorary Secretary, Mumbai Cricket Association. 👏 👏#RanjiTrophy | #Final | #MUMvVID | @ajinkyasnaik | @MumbaiCricAssoc | @IDFCFIRSTBank pic.twitter.com/eMbRcr4s24 — BCCI Domestic (@BCCIdomestic) March 14, 2024 -
సెక్స్ రాకెట్పై షాకింగ్ నిజాలు.. : పూనమ్
సాక్షి, సినిమా: టాలీవుడ్ చిత్ర పరిశ్రమని వరుస వివాదాలు చుట్టుముడుతున్న విషయం తెలిసిందే. మొన్నిటి వరకు క్యాస్టింగ్ కౌచ్ వివాదం టాలీవుడ్ని కుదిపేయగా.. ప్రస్తుతం చికాగో సెక్స్ రాకెట్ టాలీవుడ్లో కలకలం రేపుతోంది. అయితే సెక్స్ రాకెట్ వ్యవహారంలో ఇప్పటివరకూ కొంత మంది నటీమణులు సంచలన విషయాలను బయటపెట్టారు. తాజాగా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ సెక్స్ రాకెట్పై స్పందించారు. పూనమ్ దీనిపై ఎదుర్కొన్న సంచలన విషయాలను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. సెక్స్ రాకెట్ ప్రధాన నింధితులుగా కిషన్ మోదుగుమూడి - అతడి సతీమణీ చంద్రలను అమెరికా పోలీసులు అరెస్ట్ చేసి, విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే పూనమ్ అసలు కిషన్, చంద్ర దంపతులు భార్యాభర్తలు కాదని తెలిపారు. దంపతులు అనేది కేవలం లగ్జరీ జీవితం కోసం, ఇలాంటి నేరాలు చేయడానికి వారు వేసుకున్న ముసుగు మాత్రమేనని పూనమ్ కౌర్ పేర్కొన్నారు. పూనమ్ అమెరికాలో ఉన్నపుడు తాను ఉన్న హోటల్ దగ్గరకి ఆ దంపతులకి సంబంధించిన ఓ వ్యక్తి అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టాడని పేర్కొన్నారు. తనకు తెలుగు అర్థం కాదని మాట్లాడాడని.. కానీ నాకు తెలుగు అర్థమవుతుందని తెలిపారు. ఆ సమయంలో అతను చేసిన దానికి చెంప పగలగొట్టానని వెల్లడించారు. డబ్బు ఆశచూపి, భయపెట్టి అమెరికాలో అమ్మాయిలను లొంగదీసుకుంటారని పూనం పేర్కొన్నారు. అమెరికాలో మోసపోతున్న అమ్మాయిలని కాపాడాలని పూనమ్ ప్రధానమంత్రి మోదీని ఈ సందర్భంగా కోరారు. అమెరికాలో సంచలనం సృష్టిస్తున్న వ్యభిచార రాకెట్ ఆయన మా జీవితాలతో ఆడుకుంటున్నాడు! Received this case file couple of days back ... never spoke about this thing till date but would like to mention ... if it was not for my brother n few of his friends , pratap garu n few others .... I remember slapping one person as he did not know that I can understand Telugu and would have killed some one for knocking at my door middle of the night .... I was alone went thru a association n was only excited about meeting my school n family friends .... there so many people like these evil " husband and wife " duos who can do any thing for their comfort n luxuries n fake status in society .... they exactly know what they doing ... corner innocent n vulnerable woman n some times threaten them n it only happens with the back up of big big people who are never caught ....the lies which they say are not even a joke to convince a woman .... cornering a vulnerable woman ..... I wonder when they have places like #vegas why does one have to do this .... only for such " husband and wife's " who are crime partners to enjoy such luxuries .... @narendramodi ji apni betiyon ko bachao.... @oprah @barackobama @michelleobama .... u r the only hope ...... thank u . A post shared by Puunam Khaur (@puunamkhaur) on Jun 23, 2018 at 10:41pm PDT -
టాలీవుడ్ తారల దిగ్భ్రాంతి
ప్రముఖ నటి శ్రీదేవి మరణం సినీరంగానికి షాక్ ఇచ్చింది. ఊహించని ఈ సంఘటనపై టాలీవుడ్ తారలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘శ్రీదేవి మరణ వార్తతో షాక్ అయ్యాను. ఓ నటిగా, ఓ మహిళగా ఆమె అందరికీ ఆదర్శం. ఎప్పటికీ ఆమే నా అభిమాన నటి. ఆమె ఆత్మకు చేకూరాలని కోరుకుంటున్నా’అంటూ ట్వీట్ చేశారు. ‘ఇప్పటికే ఈ వార్త నమ్మలేకపోతున్నా.. నిజంగా సినీ పరిశ్రమకు తీరనిలోటు’ అన్నారు రవితేజ. దర్శకధీరుడు రాజమౌళి ‘ఈ వార్త విని షాక్ అయ్యాను. తొలి లేడీ సూపర్ స్టార్. 54 నాలుగేళ్ల జీవితంలో యాబై ఏళ్లు నటిగా కొనసాగిన ప్రస్థానం. ఇలా ముగిసింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలి’ అని ట్వీట్ చేశారు. హీరోలు అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, సుధీర్ బాబు, అధర్వ, రాహుల్ రవీంద్రన్, గౌతమ్ కార్తీక్లతో పాటు హీరోయిన్లు కాజల్ అగర్వాల్, ప్రగ్యా జైస్వాల్ శ్రీయ రెడ్డి, పరుల్ యాదవ్, ఐశ్వర్య రాజేష్లు తమ సంతాపాన్ని తెలియజేశారు. Shocked to hear the sad news. The first Lady Superstar of the Country. 50 of those 54 years as an actress par excellence. What a journey..and such an unexpected end. May your soul rest in peace. Sridevi garu 🙏🙏🙏 — rajamouli ss (@ssrajamouli) 25 February 2018 Form a Child Artist to a Legendary to Movie Star!! A great journey of one of the most charismatic women in the world of cinema comes to an end. #RIPSridevi pic.twitter.com/B4BREFoXNI — Rana Daggubati (@RanaDaggubati) 25 February 2018 Shocked & disturbed with the news of #Sridevi garu's demise. She truly was the epitome of everything amazing as an actor & a woman. My all time favourite actress.. Gone too soon. Strength to her family & loved ones. May her soul Rest in Peace. — Mahesh Babu (@urstrulyMahesh) 25 February 2018 It's definitely a great loss!! Still can't believe the news that #Sridevi garu is no more !!Irreplaceable. Heartfelt condolences to her family. #RIPSridevi — Ravi Teja (@RaviTeja_offl) 25 February 2018 Shocked to Hear the Demise of Iconic actress Sridevi Garu ! Really Sad News . Condolences to Her Family , Near & dear ones . #Sridevi — Allu Arjun (@alluarjun) 25 February 2018 Extremely sad and shocked to hear about the sudden demise of my most favourite actor and role model, #Sridevi Ma'am.. this must be so difficult, my heartfelt condolences to the family🙏🏻😢 #RIPSridevi #gonetoosoon #heartbreaking pic.twitter.com/UOjhoMVKcq — Kajal Aggarwal (@MsKajalAggarwal) 25 February 2018 Shocked to hear the sudden demise of #Sridevi Its not fair god she’s too young to leave us. It’s my sis in that pic with her in Thirumala & I was shy to take a pic.I wish I had taken too.... #RIP Sridevi garu pic.twitter.com/n9QALLBAI1 — Sudheer Babu (@isudheerbabu) 25 February 2018 -
రాయల్ ఫ్యామిలీ ఇంట ‘గే’ జంట పెళ్లి
సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటన్ రాజ కుటుంబంలో విహహం అంటే ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు ఉంటుందని అందరికీ తెలుసు. గత నెలలో రాజ కుమారుడు హ్యారీ, మేఘన్ మార్కెల్ వివాహం కూడా అలాగే జరిగింది. ఇదంతా ఒకెత్తయితే రాయల్ ఫ్యామిలీలో ఇప్పుడొక ‘గే’ జంట వివాహాం జరగనుంది. క్వీన్ ఎలిజబెత్ సోదరుడు లార్డ్ ఇవార్ మౌంట్ బాటన్, తన సహచరుడు జేమ్స్ కోయల్ను పెళ్లాడనున్నారు. ఈ మేరకు రాయల్ ఫ్యామిలీ సోమవారం ప్రకటించింది. వచ్చే వేసవి కాలంలో ఈ పెళ్లి జరగనుందని తెలిపింది. గే పెళ్లిళ్లు గతంలో జరిగినా రాజ కుటుంబంలో ఇదే తొలిసారి. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల హాజరులో డివాన్ పట్టణంలోని ఒక చర్చిలో ఈ వేడుక జరగనుంది. కాగా, ఇవార్ మౌంట్ బాటన్ తన భార్య పెన్నీ బాటన్కు 2016లో విడాకులు ఇచ్చారు. వీరికి ఎల్లా అనే కూతురు ఉంది. The Milford Haven Ruby Tiara: Lady Penelope Mountbatten wears the Milford Haven Ruby tiara at her wedding to Lord Ivar Alexander Michael Mountbatten on April 23, 1994. It was the last time it was seen until it showed up in Russia again...hmmm 👀#antique #atiaraaday #aristocracy #bolin #britain #crown #cabochon #diamonds #fluerdelys #gold #history #heart #jewelry #jewelrynerd #lordivarmountbatten #motif #monarchy #milfordhavenrubytiara #royal #rubies #royalty #russian #royalbrides #star #tiara #ladypenelopemountbatten #rubytiara A post shared by A Tiara A Day (@a.tiara.a.day) on Jan 6, 2016 at 8:10pm PST Royal family's first gay wedding: Queen Elizabeth’s cousin to tie the knot . Lord Ivar Mountbatten, a cousin of Queen Elizabeth (whose husband Prince Philip's last name is Mountbatten) is set to marry his partner James Coyle in what will be the first gay wedding in British royal family history. According to E! News, Lord Ivar became the first openly gay extended member of the royal family when he came out in 2016 and revealed his relationship with James. In an interview with Daily Mail, Lord Ivar opens up about struggling with his sexuality during his 16-year marriage to ex-wife, Penny, who he shares three children with. Following their divorce 8 years ago, the former couple are still friends with Penny even scheduled to give her ex-husband away when he marries James in the private chapel on his magnificent country estate in Devon. - “It makes me feel quite emotional. I'm really very touched,” Penny said of the honour. And, of course, the couple have the blessing of his entire family including lifelong friend, Prince Edward, Earl of Wessex - aka Queen Elizabeth’s youngest son - and his wife Sophie, Countess of Wessex. - “Sophie and Edward know of our plans and are really excited for us,” says Lord Ivar, adding that sadly the royal couple will not be able to attend the wedding due to prior engagements.” - The couple will tie the knot in a small, private ceremony in front of 120 family members and close friends. #royalfamily #queenelizabeth #jamescoyle #gaywedding #lordivarmountbatten A post shared by MediaGuide.NG (@mediaguide.ng) on Jun 18, 2018 at 4:03pm PDT -
‘‘సాహో’ టీం ఆమె వర్క్ను కాపీ చేసింది’
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సాహో చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్తో హాలీవుడ్ స్థాయి యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కిన సాహో అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే కొంత డివైడ్ టాక్ను తెచ్చుకున్నప్పటికి వసూళ్లపరంగా ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సాహో చిత్రంపై కాపీ ఆరోపణలు వస్తున్నాయి. బాలీవుడ్ నటి లిసా రే సాహో చిత్ర యూనిట్పై కాపీ ఆరోపణలు చేస్తున్నారు. సాహో యూనిట్, షిలో శివ్ సులేమాన్ ఆర్ట్ వర్క్ను కాపీ కొట్టారని లిసా ఆరోపిస్తున్నారు. అంతేకాక ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ప్రభాస్, శ్రద్ధా కలిసి ఉన్న ‘బేబీ వోన్ట్ యూ టెల్ మీ’ అనే పోస్టర్ను, దాంతో పాటు ఒరిజినల్ పోస్టర్కు సంబంధించిన చిత్రాలను లిసా రే తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఈ రెండు ఫోటోల్లో బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ వర్క్ ఒకేలా ఉంది. ఈ సందర్భంగా లిసా రే మాట్లాడుతూ.. ‘ఈ చిత్ర యూనిట్ చేసిన తప్పును ఎత్తి చూపడమే కాక బాధితుల పక్షాన నిలబడి, వారికి మద్దతుగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఓ భారీ బడ్జెట్ చిత్రంలో షిలో ఆర్ట్వర్క్ను ఒక దాన్ని కాపీ చేశారు. దీన్ని ప్రేరణ అనలేం.. ఇది ఖచ్చితంగా దొంగతనమే. ఇలాంటి పనులను ప్రపంచంలో ఎవరూ ఆమోదించరు. ఈ ఆర్ట్వర్క్ను వినియోగించుకునే ముందు సాహో యూనిట్ దాని సంబంధిత యజమానిని సంప్రదించలేదు.. ఆమె అనుమతి కూడా తీసుకోలేదు. కనీసం ఆమె పనికి తగిన గుర్తింపు కూడా ఇవ్వలేదు. ఇది సరైన పద్దతి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో సదరు వ్యక్తికి ఎలా ఉంటుందంటే.. ఎవరో దొంగ మీ ఇంట్లో చొరబడి మీ జీవితానికి, మీ జీవనోపాధికి, ఆత్మకు సంబంధించి అతి ముఖ్యమైన వస్తువును దొంగిలిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు షిలో పరిస్థితి కూడా అలానే ఉంది’ అని తెలిపారు లిసా రే. (చదవండి: జీవితం భలే మారిపోయింది) View this post on Instagram What is creativity? What is art? Where does it come from? We know what it is not. It’s not your social status. It’s not your job title. It’s not your appearance. It’s not even the image you see in the mirror. Creativity and its sister Art reach us from the sweet spot of the universe- the soul you might say- through mystery. But I do know that the creator- artist is the channel for it. Let me tell you how hard it is to create- anything- original or authentic. I personally labored for years over my book, quelled the doubts and noise from others and didn’t emerge until I had almost undone myself. Because it’s a calling. And when I was moving through dark moment of self-doubt or creative blocks, I would turn to the work that @shiloshivsuleman puts out into the world and shares on her Instagram handle. She may not even know this, but I can recognize when a creator works honourably and deeply, bleeding, sacrificing, unsleeping, stretching herself in the direction of emotional bravery to produce work that births those feelings we all look for in day to day life. To feel inspired. To feel alive. That’s why when something dishonorable happens, we need to stand up and speak up. To hold up a mirror to these makers to make them understand THIS IS NOT RIGHT. It’s come to light that a big budget film production has ripped off one of Shilo’s original creations. This is NOT inspiration but blatant theft. In no world, is this acceptable. The production did not contact the creator, ask her permission nor offer to collaborate or offer a credit. Nothing. This is not right. I believed the Hindi film industry was evolving necessarily past stealing storylines and rampant plagiarism but the producers of Shahoo have obviously not gotten the memo when it comes to art. Here’s the thing- Creators are worthy of worship. What they produce are more lasting and precious so than all the other ‘things’ we accumulate that can be taken away. Let’s hold these producers accountable for their infuriating, dishonourable action. How would you feel if a thief slid into your home and took away your most prized possessions? Your heart. Your soul. And your livelihood. Image @dietsabya A post shared by lisaraniray (@lisaraniray) on Aug 30, 2019 at 5:05am PDT -
సంప్రదాయ స్వాగతం లభించింది!
మౌంట్ మౌంగానీ : ఐదు వన్డేల సిరీస్లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే శనివారం జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మౌంట్ మౌంగానీ చేరుకున్న టీమిండియా బృందానికి బే ఓవల్లో సంప్రదాయ స్వాగతం లభించింది. న్యూజిలాండ్ ప్రాచీన సంస్కృతిని ప్రతిబింబించే మౌరీ వర్గం నృత్యాలతో ఆటగాళ్లకు వెల్కమ్ చెప్పింది. పౌహిరిగా పిలవబడే ఈ వర్గానికి చెందిన ఒక వ్యక్తి ముందుకు వచ్చి అతిథులను పరీక్షించడం వీరి సంప్రదాయం. ఇందులో భాగంగా బల్లెం లాంటి ఆయుధాన్ని చేతబూనిన ఓ వ్యక్తి ముందుకు వచ్చి, అతిథులను తాకి.. వారు మనకు శత్రువులా, మిత్రులా అనే విషయాన్ని గ్రహిస్తారట. ఆ తర్వాత వారు ఇచ్చిన చిన్న చెట్టుకొమ్మను అతిథి పైకి తీసి ఇవ్వడాన్ని శాంతి చిహ్నంగా భావిస్తారట. ఈ క్రమంలో రోహిత్ శర్మ ముందు నిలబడగా, మిగిలిన ఆటగాళ్లు అతడిని అనుసరించారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేసిన బీసీసీఐ.. ‘మెన్ ఇన్ బ్లూకు బే ఓవల్లో సంప్రదాయ స్వాగతం లభించింది’ అని పేర్కొంది. FEATURE: #TeamIndia got a traditional welcome at the Bay Oval - something that the Men in Blue enjoyed before the start of the 2nd ODI - by @RajalArora Full Video 👉👉 https://t.co/GFBo8ZSSei pic.twitter.com/VLzEleNGJP — BCCI (@BCCI) 25 January 2019 #TeamIndia received a traditional welcome at the Oval Bay from the Maori community. Full video coming up soon on https://t.co/CPALMGgLOj pic.twitter.com/FEbSuwHEZ8 — BCCI (@BCCI) January 25, 2019 India (@BCCI) have officially arrived in the @BayofPlentyNZ. Led by Rohit Sharma, the side received a powerful Māori pōwhiri from Ngai Tukairangi and Ngati Kuku, the manawhenua for the Bay Oval area ahead of tomorrow’s sold out ODI 2. #cricketnation #NZvIND #bayoval pic.twitter.com/vkRr3q9rmb — Bay Oval NZ (@BayOvalOfficial) January 24, 2019 -
సన్నీలియోన్ ఫొటోపై విమర్శలు
సాక్షి, న్యూఢిల్లీ: జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అనే నానుడి తెలిసిందే. బాలీవుడ్ నటి సన్నీలియోన్ విషయంలో ఇది నిజమేననిపిస్తోంది. కరెన్జీత్ కౌర్ నుంచి సన్నీలియోన్గా మారిన ఆమె గతంలో పలు అశ్లీల చిత్రాల్లో నటించారు. తర్వాత బాలీవుడ్లో అడుగుపెట్టి కొన్ని సినిమాలు, రియాలిటీ షోలలో కూడా చేశారు. అయితే, ఫాదర్స్ డే సందర్భంగా ఆమె ట్వీట్ చేసిన ఒక ఫోటోపై నెట్టింట్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘తండ్రిగా, భర్తగా, మిత్రుడిగా, ఆడ మనిషికి జీవితాంతం తోడుండే వ్యక్తికి జోహార్లు..! అతను కురిపించే ప్రేమ అనంతం..! మేమంతా మీ ప్రేమ పాత్రులం నాన్నా..!’ అంటూ ట్వీట్ చేశారు. దాంతో పాటు తన భర్త, పిల్లలతో కలిసి గురుద్వార వద్ద దిగిన ఒక ఫోటో, ఏకాంతంగా ఉన్న మరొక ఫోటో ట్వీటర్లో పోస్టు చేశారు. ఒక వైపు పవిత్ర గురుద్వారను దర్శించి పాపం చేశారని ఆమెపై కొందరు విమర్శలు చేస్తుండగా.. ఫాదర్స్ డే అంటూ తన భర్తతో కలిసి నగ్నంగా దిగిన ఫోటో అందరికీ పరిచయం చేయడమేంటని సన్నీని తిట్టుకుంటున్నారు. గతంలో ఆమె ఏం చేసిందో తెలియని వారు కూడా సోషల్ మీడియాలో ఆమె ఫోటోను చూసి మండిపడుతున్నారు. తన మేనేజర్ను వివాహమాడిన సన్నీ ఇకనైనా పద్ధతిగా ఉండాలని పలువురు ట్విటర్లో సూచిస్తున్నారు. ఇంటర్నెట్లో అశ్లీల ఫోటోలు పెడుతున్న సన్నీపై న్యూసెన్స్ కేసు పెట్టాలని మరికొందరు అంటున్నారు. ఆమె అభిమానులు మాత్రం సన్నీకి మద్ధతు పలుకుతున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా తన కూతురు, భర్తతో ప్రేమగా దిగిన ఫొటోలో సైతం అశ్లీలం వెతికే వారిని పట్టించుకోవద్దని చెప్తున్నారు. The Man...the Father...the husband...the friend...the one that holds us together, given us the best life and a infinite amount of love! We love you Papa! @dirrty99 Love - Nisha, Asher Noah and me :) Happy Fathers Day A post shared by Sunny Leone (@sunnyleone) on Jun 17, 2018 at 2:11am PDT This is Fathers Day!!! The greatest love one can imagine !!! Thank You @sunnyleone for meeting Nisha Kaur and Falling in Love for both of us !!! You are always the one who knows Best. She is everything and has stole my heart forever !!!! Xoxoxo Thank You !!!! A post shared by Daniel "Dirrty" Weber (@dirrty99) on Jun 16, 2018 at 7:42am PDT -
‘రెండు రోజుల క్రితమే నా గుండె ఆగిపోయింది’
మూడు రోజుల క్రితం మైనర్ లీగ్ బేస్ బాల్ ఆటగాడు బ్లేక్ బివెన్స్ కుటుంబ సభ్యులు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బివెన్స్ భార్య, కుమారుడితో పాటు అత్తగారు కూడా మరణించారు. తన కుటుంబ సభ్యుల మరణవార్త తెలిసి బివెన్స్ కుప్పకూలిపోయాడు. వారి మరణంతో బివెన్స్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ‘నాకు తెలుస్తోంది నా జీవితం నాశనమైందని, రెండు రోజుల క్రితమే నా గుండె ఆగిపోయింది’ అనే క్యాప్షన్తో ఇన్స్టాగ్రామ్లో వారి ఫొటోలు పోస్ట్ చేశాడు బివెన్స్. దాంతో పాటు కుటుంబ సభ్యులతో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశాడు. బివెన్స్ తన 25 ఏళ్ల భార్య గురించి చెబుతూ ‘ఎమిలీ నువ్వు ప్రపంచంలోనే ఉత్తమమైన భార్యవి, తల్లివి కూడా. నువ్వు చూపించేంత ప్రేమను ఇంకెవరు చూపలేరు. నీ ప్రేమ, దయ నా జీవితాన్ని మార్చేశాయ’ని పేర్కొన్నాడు. తన 14నెల కుమారుడు కల్లెస్ గురించి...‘నువ్వు పుట్టిన తర్వాతే నాకు ప్రేమ అంటే ఏంటో అర్థయయ్యింది. నువ్వు ఏడిస్తే చుడలేక ఏదో ఒకటి చేసి నిన్ను నవ్వించే వాడిని. నువ్వు లేకుండా నేను ఊపీరి పీల్చుకోలేను’ అంటూ కుమారుడిపై తనకు ఉన్న ప్రేమను తెలిపాడు. అలాగే 65 ఏళ్ల అత్తగారిని ఉద్దేశిస్తూ బివెన్స్ ‘తను కుటుంబం పట్ల చూపించే ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆ తల్లి, కుతూళ్లు చనిపోయి కూడా కలిసి ఉన్నందుకు ఆనందంగా ఉందని’ తన భావోద్వేగాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. మంగళవారం వర్జీనియాలోని తన ఇంట్లో ఈ ముగ్గురు విగత జీవులుగా పడి ఉన్నట్లు బివెన్స్కు పోలీసులు సమాచారం అందించాడు. తన భార్యకు సోదరుడి వరుసైన మాథ్యూ థామస్ బెర్నాడ్ ఈ హత్య చేసుంటాడని బివెన్స్ అనుమానం వ్యక్తం చేశాడు. దీని గురించి బివెన్స్ మాట్లాడుతూ.. ‘మేము, బెర్నాడ్లు ఒకే చర్చికి వెళ్తాం. గత కొద్ది రోజులుగా అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. తరచూ మా కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండేవాడు’ అని బివెన్స్ పోలీసులకు తెలిపాడు. దీంతో బెర్నాడ్పై కెసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. View this post on Instagram Two days ago my heart was turned to ash. My life as I knew it is destroyed. The pain my family and I feel is unbearable and cannot be put into words. I shake and tremble at the thought of our future without them. Emily, my sweetheart, you are the best wife and mother this world has ever seen. You made me into the man I am today and you loved me with all of my flaws. You brought our precious baby boy into this world and made our family complete. Your love and kindness changed countless lives, including mine. My sweet little boy, dada loves you so much! I can’t breathe without you here. I finally understood what love was when you were born and I would have done anything for you. You have changed my life forever, you are my reason why. I long to hold the both of you again in heaven. I’m so glad you are with all your Great-grandmothers now, I know they are eating you up. This earth did not deserve either of you; you were just too wonderful to comprehend. Joan you were the best mother-in-law anyone could ask for. You loved your family more than anyone I’ve ever seen. You raised the most wonderful girl in the world. I’m so glad y’all are still together. You were the best Nana this world has ever seen and I will never forget you. Skip you are a wonderful father and grandfather. We will get through this together as a family. We will not let the devil win! Thank you God for giving me the most wonderful family in the world! I’ve been blessed beyond belief. Thank you to all my family and friends who have reached out to me during this time of sorrow. Thank you @raysbaseball @biscuitbaseball for your support through everything. I am comforted by all the messages and well wishes. I’m not sure what is next for me, but I do know God has a plan even though I can’t see it. A post shared by Blake Bivens (@blakebbins) on Aug 29, 2019 at 6:55pm PDT -
తప్పు నాదే, క్షమించండి: ఆమిర్ ఖాన్
బాలీవుడ్కు ఈ ఏడాది కచ్చితంగా గుర్తుండిపోతుంది. బిగ్బీ అమితాబ్ బచ్చన్, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కాంబినేషన్లో వచ్చిన థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. బాహుబలి రికార్డులను వేటాడటానికి బరిలోకి దిగిన ఈ సినిమా.. పెట్టిన దాంట్లో కనీసం సగంవరకు కూడా రాబట్టలేక చతికిలబడిపోయింది. ఇంతటి పరాభవాన్ని ఆమిర్ మునుపెన్నడూ ఎదుర్కోలేదు. గత కొంతకాలంగా ఆమిర్ తన సినిమాలతో బాక్సాఫీస్ దాడి చేస్తుండగా.. ఈ చిత్రం కూడా సక్సెస్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఈ చిత్రం పరాజయం కావడానికి తానే కారణమని, ఆ తప్పును తనమీదే వేసుకున్నాడు ఆమిర్ ఖాన్. అయితే ఏదైనా సినిమా ఫెయిల్ అయితే హీరోలు బయటకురావడానికి కూడా ఇష్టపడరు. కానీ ఆమిర్ మాత్రం అభిమానులకు, ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. ప్రేక్షకులను అలరించలేపోయినందుకు క్షమాపణలను కోరారు. దీనిపై ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ స్పందిస్తూ.. ఈ ఆటలో గెలుపోటములు సహజమని ఆమిర్ తప్పక మళ్లీ తన స్టామినా ఏంటో చూపిస్తారనే నమ్మకం మాకుందని.. ఓటమిని ఒప్పుకోవడం చాలా కొద్దిమంది స్టార్స్లోనే చూశానని ఆమిర్కు ఎంతో ధైర్యం ఉందని.. అందుకే ఈ మూవీ ఫెయిల్యూర్ను తన భుజాన వేసుకున్నారని అన్నారు. Hits and flops are a part of the game... You win some, you lose some... Am sure, Aamir and YRF will bounce back with renewed vigour... #TOH is akin to a wake up call for everyone in the industry... Never take the audience for granted! — taran adarsh (@taran_adarsh) November 27, 2018 That moment when the audience delivers its verdict and the BO numbers start crumbling, I have seen the biggest of actors and film-makers break into a cold sweat... Fridays can make or break a film and change the fortunes - that’s the reality… #TOH — taran adarsh (@taran_adarsh) November 27, 2018 Very brave and courageous of Aamir Khan to admit #TOH is a failure and take the onus on himself... Very few people associated with a dud would accept that *on a public platform*... In the past, I have seen actors/filmmakers come up with hazaar excuses... — taran adarsh (@taran_adarsh) November 27, 2018