Dharmapuri Arvind
-
క్లైమాక్స్కు బీజేపీ అధ్యక్ష పదవి కసరత్తు.. రేసులో ఈటల, అరవింద్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడెవరన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేందుకు ఎవరికి వారు తమ తమ పద్ధతుల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. సరిగ్గా ఏడాది కిందట అకస్మాత్తుగా బండి సంజయ్ స్థానంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని అధిష్టానం నియమించింది. అప్పటి నుంచి కిషన్రెడ్డి తాత్కలికంగా బీజేపీ సారథ్య బాధ్యతలు నెట్టుకొస్తున్నారు. అయితే ఫుల్ టైం అధ్యక్షుడిగా రాష్ట్రమంతగా తిరిగి పార్టీని పటిష్టం చేసే నాయకుడికోసం తెలంగాణ బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. అయితే సంస్థాగత ఎన్నికలు, సభ్యత్వం పేరుతో అధిష్టానం బీజేపీ అధ్యక్షుడి ఎంపిక పెండింగ్లో పెట్టింది.అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై అధిష్టానం వివిధ మార్గాల్లో సమాచారాన్ని సేకరిస్తోంది. కానీ ఇప్పటి వరకు అధ్యక్షుడి నియామకం హైకమాండ్ ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేకపోతోంది. దానికి ప్రధాన కారణం అధ్యక్ష పదవి కోసం పోటీ ఎక్కువకావడంతో పాటు, ఒకరిపై ఒకరు పోటాపోటీగా అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. దాంతో అధ్యక్షుడి ఎంపిక బీజేపీ పెద్దలకు తలనొప్పిగా మారింది. ఒకరికి పదవి ఇస్తే మరొకరు పనిచేయకుండా, సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఈ ఎంపిక ప్రక్రియను సాగదీస్తోంది. అయితే, అధ్యక్ష పదవి కోసం ప్రధానంగా ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ మధ్య పోటీ నెలకొంది. ఈ ఇద్దరు అధిష్టానం పెద్దలను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని తమతమ బలాలు చెప్పుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఈటలకు బలం కాగా, ఆయనకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేదని ఆయన వ్యతిరేకులు అంటున్నారు. మరో వైపు ధర్మపురి అరవింద్ రెండు సార్లు నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించి తన సత్తాను చాటారు. తొలి ప్రయత్నంలోనే కేసీఆర్ కూతరు కవితను ఓడించి అధిష్టానం దృష్టిలో పడ్డ అరవింద్ రెండో సారి కూడా గెలిచి తాను బలమైన నేతనని నిరూపించుకున్నారు.అయితే ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తారని, అందరినీ కలుపుకుపోలేరని ఆయన వ్యతిరేకవర్గం ఫిర్యాదులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతల బలాలను, బలహీనతలను అధిష్టానం బేరీజు వేసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ బీసీని తెలంగాణ అధ్యక్షుడిగా నియమించిన నేపథ్యంలో బీజేపీ కూడా ఈసారి బీసీకే సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఫ్లోర్ లీడర్గా మహేశ్వర్ రెడ్డిని నియమించిన అధిష్టానం, అధ్యక్ష పదవి బీసీకే అప్పగిస్తామనే సంకేతం పంపింది. ఈ కోణంలో కసరత్తు చివరి దశకు చేరుకుంది. ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్లో ఎవరో ఒకరికి సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఈ దిశగా ఏకాభిప్రాయం కుదరకపోతే కిషన్రెడ్డిని యథావిధిగా మరికొంత కాలం కొనసాగించే అవకాశముంది. -
ఎంఐఎం కేన్సర్లాంటిది
నిజామాబాద్ సిటీ: ఎంఐఎం పార్టీ దేశానికి కేన్సర్ వ్యాధి వంటిద ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. ఆదివా రం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా దానితో అంటకాగడం ఎంఐఎంకు అలవాటుగా మారిందని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎంఐఎంకు భయపడుతోందని ఎద్దేవా చేశారు. హైడ్రా పాతబస్తీలో అక్రమ కట్టడా లను ఎందుకు కూల్చటం లేదని ప్రశ్నించారు.వక్ఫ్బోర్డు చట్టంలో అనేక లొసుగులున్నా యని, వాటిని సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేని మాజీ మంత్రి కేటీఆర్.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర చేయాలనుకుంటున్నారో ప్రజ లకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తే ప్రజలు ఆయనకు చీపుర్లు, చెప్పులతో స్వాగతం పలికి నిలదీయాలని పిలుపునిచ్చారు. -
కేసీఆర్ ఒకప్పుడు పులి: ఎంపీ అర్వింద్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై నిజామాబాద్ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సోమవారం(సెప్టెంబర్30)ఇందిరాపార్క్ వద్ద బీజేపీ చేపట్టిన రైతు దీక్షలో అరవింద్ మాట్లాడారు.‘రేవంత్రెడ్డి.. విదేశీ పర్యటనలు అవసరం లేదు. గజ్వేల్లో కేసీఆర్ ఫామ్హౌస్లో ఎకరాకు కోటి రూపాయలు సంపాదించారట. ఇది అధ్యయనం చేయడానికి కేసీఆర్ ఫామ్హౌస్కు రైతులను పంపించాలని రేవంత్కు సలహా ఇస్తున్నా. కేసీఆర్ ఉద్యమం నడిపినన్ని రోజులు పులి.కేసీఆర్ స్పీచ్ మిస్ అవుతున్నాం. పిల్లల మాటలు విని కేసీఆర్ పిల్లి అయ్యారు. కేసీఆర్ ఎక్స్పైర్ అయిన మెడిసిన్. జాతిపిత కావాల్సిన కేసీఆర్ పిల్లల అవినీతికి పితగా మారారు’అని అరవింద్ ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి: ఢిల్లీ నుంచి వచ్చి క్షమాపణలు చెప్తారా..?: కేటీఆర్ -
తెలంగాణ బీజేపీ చీఫ్ నియామకంపై సస్పెన్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ చీఫ్ నియామకంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీసీ నేతకే బీజేపీ పగ్గాలు అంటూ ప్రచారం జరుగుతోంది. బీసీ కోటాల్లో ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ మధ్య పోటీ నెలకొంది. సామాజిక వర్గాల ప్రకారం మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్కి కేంద్రమంత్రి పదవి ఇవ్వడంతో అదే సామాజికవర్గానికి చెందిన అర్వింద్కు పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం లేదంటున్నాయి పార్టీ వర్గాలు.మరోవైపు, ఈసారి సంఘ్ పరివార్ క్షేత్రాల ప్రతినిధికి ఇవ్వాలనే వాదన ఉంది. మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావుకు కేటాయించాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. లోకల్బాడీ ఎన్నికల నేపథ్యంలో అధ్యక్ష నియామకంపై ఢిల్లీ జాతీయ నాయకత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.ఇప్పటికే కేంద్ర మంత్రిగా, పార్టీ రాష్ట్రఅధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. దీంతో టికెట్ ఆశిస్తున్న రెడ్డి సామాజికవర్గానికి చెందిన డీకే అరుణకు ఇస్తారా? లేదా? అన్నది కూడా ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉండగా ఇద్దరు సీఎంలను ఢీకొట్టి గెలిచిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి సైతం అధ్యక్షుడి రేసులో ఉన్నట్లు సమాచారం. కాగా, ఇప్పటికే బీజేఎల్పీ బాధ్యతలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహేశ్వర్ రెడ్డికి ఇవ్వడంతో పార్టీ పగ్గాలు బీసీ నేతలకే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త అధ్యక్షుడి నియామకం శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నెలాఖరులోగా ఈ టెన్షన్కు తెరపడే చాన్స్ ఉంది. -
తెలంగాణ BJP కొత్త సారథి ఎవరు.. అధ్యక్ష పదవి రేసులో ఉన్నదెవరు?
సాక్షి, తెలంగాణ : తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ఎప్పుడు నియమిస్తారు? కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు పూర్తయింది. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్రెడ్డి మరోసారి కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఎన్నికలన్నీ పూర్తయినందున ఇక పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి ఉంది. జాతీయ అధ్యక్షుడిని కూడా మోదీ క్యాబినెట్లోకి తీసుకున్నారు. అందువల్ల ముందుగా ఆలిండియా పార్టీ అధ్యక్షుడిని నియమించి..ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని నియమిస్తారని అంటున్నారు. ఇంతకీ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి పోటీపడుతున్నదెవరో చూద్దాం.ఎన్నికలన్నీ పూర్తయ్యాయి. మంత్రి పదవుల పంపకమూ అయిపోయింది. ఇక పార్టీ పదవుల్లో నియామకాలే మిగిలాయి. కిషన్రెడ్డి ఇప్పటివరకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటుగా..కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. మోదీ మూడో మంత్రివర్గంలో కూడా కిషన్రెడ్డికి బెర్త్ ఇచ్చారు. ఇక ఆయన పూర్తిగా మంత్రి బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్నందున.. ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొత్తనేతను నియమించాల్సి ఉంది. మరి తెలంగాణ కమల దళపతిగా ఎవరిని నియమిస్తారనేదానిపై బీజేపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ పదవి కోసం చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు.మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్కు తెలంగాణ బీజేపీ పగ్గాలు దక్కడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్ను పార్టీ ఫోకస్ చేసింది. గజ్వేల్, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఈటల పరాజయం పాలైనా... మల్కాజ్గిరి ఎంపీగా ఈటలకు పార్టీ మరో అవకాశం ఇచ్చింది. అక్కడ భారీ మెజారిటీతో ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు రాష్ట్ర పార్టీ పగ్గాలు ఈటలకు అప్పగించి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఈటలకే పార్టీ పగ్గాలు అప్పగించవచ్చు. ఇప్పటికే ఆ దిశగా పార్టీ అధిష్ఠానం సంకేతాలు ఇచ్చినట్లు ఈటల వర్గీయులు చెబుతున్నారు.అయితే తెరవెనక మరికొంత మంది నేతలు కూడా తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు రాష్ట్ర పార్టీ పగ్గాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందిరా గాంధీ గతంలో ప్రాతినిథ్యం వహించిన పార్లమెంట్ నియోజకవర్గంలో గెలవడం, మాజీ సిఎం కెసిఅర్ సొంత ఇలాకాలో విజయం సాధించడం రఘునందన్కు కలిసి వచ్చే అంశాలుగా చెబుతున్నారు. మంచి వాగ్ధాటి కల్గిన నేతగా..ప్రత్యర్థి పార్టీల నేతల విమర్శలను సమర్థవంతంగా తిప్పకొట్టగల నేతగా రఘునందన్ ముందు వరుసలో ఉంటారు. ఇటువంటి అంశాలు కమలనాథులు పరిగణనలోకి తీసుకుంటే రఘునందన్ పేరును పరిశీలించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి వర్గంలో స్థానం ఆశించిన పాలమూరు ఎంపీ డీకే అరుణకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే దానిపై అధిష్ఠానం పెద్దలు సమాలోచనలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర తెలంగాణ నుంచి బండి సంజయ్ కు, రాజధాని నగరం నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి వర్గంలో ఛాన్స్ ఇచ్చారు. దక్షిణ తెలంగాణా నుంచి డికె అరుణకి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే... సిఎం రేవంత్ కు ధీటుగా రాష్ట్రంలో బీజేపీని ముందుకు తీసుకువెళ్లవచ్చని పలువురు రాష్ట్ర నేతలు అధిష్ఠానం ముందు పెట్టినట్లు సమాచారం. కేంద్ర మంత్రివర్గంలో మహిళల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి వర్గంలో డికె అరుణకు ఛాన్స్ ఇస్తారని కూడా మరో ప్రచారం జరుగుతోంది.నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా మంత్రి వర్గంలో స్థానం దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు రాష్ట్ర పార్టీ పగ్గాలు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరమణ రెడ్డి సైతం అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. అయితే ఇప్పటికే బీజేఎల్పీ బాధ్యతలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర పార్టీ పగ్గాలు బిసి నేతకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ కు మంత్రి వర్గంలో ఛాన్స్ దక్కిన నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన అరవింద్ కు కొత్త బాధ్యతలు ఇస్తారా ? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.పార్టీలో చాలాకాలంగా పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, పేరాల చంద్ర శేఖర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జాతీయ పార్టీ అధ్యక్ష బాధ్యతలు కొత్త వారికి కేటాయించిన తర్వాతే తెలంగాణ పగ్గాలు ఎవరికిస్తారో తేలుతుంది. ఇదిలాఉంటే.. ఆషాడ మాసం ముగిసే వరకు కిషన్ రెడ్డి అటు కేంద్ర మంత్రిగా.. ఇటు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్ని కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఆషాడం ముగిసాకే కొత్త నేతకు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. -
17 మందిలో 14 మందిపై కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి లోక్సభకు ఎన్నికైన 17 మంది ఎంపీల్లో 14 మందికి నేరచరిత్ర ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్పై అత్యధికంగా 54 కేసులు ఉన్నాయని వెల్లడించింది. ఎంపీలు తమ ఎన్నికల అఫిడవిట్లలో పొందుపరిచిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు వెల్లడించినట్టు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి వివరించారు.కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై 42 కేసులు, మెదక్ ఎంపీ రఘునందన్రావుపై 29 కేసులు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై 22 కేసులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఐదు కేసులు ఉన్నట్టు పద్మనాభరెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ ఎంపీ కిషన్రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, వరంగల్ ఎంపీ కడియం కావ్యలపై మాత్రం ఎలాంటి కేసులు నమోదై లేవని వెల్లడించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియెజకవర్గంలో అత్యధికంగా 13,366 ఓట్లు ‘నోటా’కు పడినట్లు తెలిపారు. -
ఇందూరు నిర్ణేతలు వీరే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వ్యవసాయపరంగా అభివృద్ధిపథంలో దూసుకెళుతూ...రైతు ఉద్యమాల కేంద్రంగా ఉన్న ఇందూరులో గత కొన్నేళ్లుగా ఎన్నికల్లో ప్రజలు విలక్షణ తీర్పు ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో తీర్పును ప్రభావితం చేసే అంశాలు ప్రధాన పార్టీలకు గుబులు పుట్టిస్తున్నాయి. బీజేపీ నుంచి నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్, కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత తాటిపర్తి జీవన్రెడ్డి, బీఆర్ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో ఉన్నారు.త్రిముఖ పోటీగా భావిస్తున్నప్పటికీ రెండు జాతీయ పార్టీల మధ్యే హోరాహోరీ పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 1952 నుంచి 2019 వరకు నిజామాబాద్ లోక్సభ స్థానానికి 17 సార్లు ఎన్నికలు జరగగా 11 సార్లు కాంగ్రెస్, 3 సార్లు టీడీపీ, ఒకసారి స్వతంత్ర, ఒకసారి బీఆర్ఎస్, ఒకసారి బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక నిజామాబాద్ నుంచి ఇప్పటివరకు ఎవరినీ కేంద్ర మంత్రి పదవి వరించలేదు.గల్ఫ్ సంక్షేమ బోర్డు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో గల్ఫ్ వలస కార్మిక కుటుంబాల ఓట్లు 22% ఉన్నట్టు అంచనా. దీంతో ఆయా కార్మికుల కుటుంబాల ఓట్ల కోసం రెండు జాతీయ పార్టీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. గల్ఫ్ సంక్షేమ బోర్డు డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కాగా గల్ఫ్ కార్మిక సంఘాలు 60 ఉన్నాయి.ఈ సంఘాల జేఏసీకి జీవన్రెడ్డి గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో తనను తమ ప్రతినిధిగా పార్లమెంట్కు పంపాలని జీవన్రెడ్డి కోరుతున్నారు. గల్ఫ్ బోర్డు ఏర్పాటుకు సీఎం రేవంత్రెడ్డి హామీ ఇవ్వడంతో పాటు తగిన కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికులకు గౌరవం దక్కుతోందంటే బీజేపీ, మోదీ మాత్రమే కారణమని అర్వింద్ పేర్కొంటున్నారు. ♦ ఉత్తర, దక్షిణ భారతానికి మధ్యలో హబ్ మాదిరిగా ఉన్న నిజామాబాద్ ప్రాంతంలో కంటెయినర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డ్రైపోర్ట్ ఏర్పాటు చేయాలని చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కోరుతున్నారు. డ్రైపోర్ట్ ఏర్పాటయితే ఇక్కడి నుంచే నేరుగా వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి ఎగుమతులు చేయవచ్చని అంటున్నారు. ♦ జక్రాన్పల్లి వద్ద విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే డిమాండ్, బీడీ కార్మికుల అంశం సైతం ఈ ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. 185 నామినేషన్లలో 178 పసుపు రైతులవే.. 2019 ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ స్థానానికి ఏకంగా 185 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో పసుపు బోర్డు డిమాండ్తో రైతులు దాఖలు చేసిన నామినేషన్లే 178 ఉండడం గమనార్హం. ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీంతో ఇక్కడ పోలింగ్ నిర్వహణకు బెంగళూరు నుంచి ప్రత్యేకంగా ఈవీఎంలు తీసుకొచ్చి ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.పసుపు బోర్డు పసుపు బోర్డు మంజూరు చేస్తున్నట్టు గత శాసనసభ ఎన్నికల ముందు ప్రధాని మోదీ ప్రకటన చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రం గెజిట్ విడుదల చేసిందని, పసుపు ధర సైతం రూ. 20 వేలకు తీసుకొచ్చినట్టు అర్వింద్ చెబుతున్నారు. ఈ ప్రాంతానికి పసుపు శుద్ధి కర్మాగారాలు, ప్రాసెసింగ్, ప్యాకింగ్ యూనిట్లు వస్తాయని ఆయన అంటున్నారు.రీసెర్చ్ సెంటర్తో రైతులకు కొత్త వంగడాలు, మరిన్ని సబ్సిడీలు అందుతాయని పేర్కొంటున్నారు. అయితే పసుపు బోర్డు కాగితాలకే పరిమితమైందని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి విమర్శలు సంధిస్తున్నారు. మొత్తానికి పసుపు బోర్డు గెజిట్ విడుదలైనా, ఈ ఎన్నికల్లోనూ ఈ అంశంపై రెండు జాతీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కులాల వారీగా చూస్తే... నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మున్నూరుకాపు, ముస్లిం, పద్మశాలి ఓట్లు గణనీయంగా ఉన్నాయి. తర్వాత ముదిరాజ్, రెడ్డి, యాదవ్, గౌడ్ల ఓట్లు చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నాయి. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు కులసంఘాలతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మహిళల ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం ఓట్లు 16,89,957 ఉండగా, పురుషుల ఓట్లు 7,99,458, మహిళల ఓట్లు 8,90,411 ఉన్నాయి. నిజాం షుగర్స్ కీలక అంశం నిజాం షుగర్ ఫ్యాక్టరీలను అర్వింద్ తెరిపించలేకపోయారని జీవన్రెడ్డి విమర్శలు చేస్తున్నారు. తాము మాత్రం 2025లో నిజాం షుగర్స్ను తెరిపిస్తామని జీవన్రెడ్డి గట్టిగా చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రక్రియ ప్రారంభించిందన్నారు. అయితే ఎంపీ అర్వింద్ సైతం ఈసారి నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని చెబుతున్నారు. చెరకుతో పాటు వరి, మొక్కజొన్నల నుంచి ఇథనాల్ ఉత్పత్తి సైతం చేసే యూనిట్లు ఏర్పాటు చేస్తామంటున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆయా అభ్యర్థులకు వచ్చిన ఓట్లు.. బీజేపీ – ధర్మపురి అర్వింద్ 4,80,584 (45 శాతం) టీఆర్ఎస్ – కల్వకుంట్ల కవిత 4,09,709 (39 శాతం) కాంగ్రెస్ – మధుయాష్కీ69,240 (7 శాతం) -
ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి సీటుకే గ్యారంటీ లేదు: ఎంపీ అరవింద్
-
రేవంత్ కాంగ్రెస్లో ఉండటమే పెద్ద తప్పు: ఎంపీ అర్వింద్
సాక్షి, నిజామాబాద్: వందరోజుల్లో అమలు కాని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు.. ఆగస్టు తర్వాత ఎలా సాధ్యమవుతాయని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ అర్వింద్. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారనున్నాయన్నారు. హస్తం పార్టీకి ఇవే చివరి ఎన్నికలని అన్నారు. ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి సీటుకే గ్యారంటీ లేదని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకీ ఎదుగుతుందన్నారు. ఇతర పార్టీలతో లాలూచీ పడే అవసరం బీజేపీకి లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి 12 సీట్లు వస్తాయని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారన్నారు. వారు చెప్పినట్లు బీజేపీ 12 సీట్లు వస్తే సీఎం రేవంత్ను దేవుడే కాపాడాలని పెటైర్లు వేశారు. నిజామాబాద్ నగరంలో ఇంటింటి ప్రచారం ప్రారంభించిన బీజేపీ అభ్యర్థి, ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్ధుడే కానీ.. ఆయన కాంగ్రెస్లో ఉండటమే పెద్ద తప్పని అన్నారు. కాంగ్రెస్ నేతలు రేవంత్ను పనిచేయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్లో ఉంటే ఎవరికైనా రాజకీయ భవిష్యత్తు ఉండదని అన్నారు. ఎంపీ అర్వింద్ కామెంట్స్ కాంగ్రెస్ 100 రోజుల్లో ఏ గ్యారెంటీ నెరవేర్చలేదు. ఇప్పుడు ఆగస్టులో రుణమాఫీ అని మరోసారి మోసానికి తెరలేపింది. అవినీతి చేసిన వారికి శిక్ష తప్పదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇప్పట్లో బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీలు నెల రోజుల్లో పనిచేసే ప్రక్రియను ప్రారంభిస్తాం. నిజామాబాదు పార్లమెంటు పరిధిలో ఆధ్యాత్మిక, టూరిజం కారిడార్ను ఏర్పాటు చేస్తాం మా ఏకైక గ్యారెంటీ మోదీనే. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని మోడీ ప్రభుత్వం నెరవేర్చుతుంది. మోదీ మూడో టర్మ్లో కామన్ సివిల్ కోడ్ అమలు చేస్తాం. రైల్వే విభాగంలో కొత్త విప్లవం రాబోతుంది. రానున్న రోజుల్లో 25 వేల కి.మీ.ల కొత్త రైల్వే లైన్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ హిందు వ్యతిరేక పార్టీ. -
రేవంత్ కాంగ్రెస్లో ఉంటే నష్టపోతారు
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ కొన్ని కార్యక్రమాలు చురుగ్గా చేశారని, ఆయనకు మరో 15 ఏళ్ల వరకు రాజకీయాల్లో మంచి అవకాశాలున్నాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రేవంత్రెడ్డి కాంగ్రెస్లో ఉంటే ఆయన మరింత నష్టపో తారని స్పష్టం చేశారు. ఆయన బీజేపీ లోకి వస్తానంటే ఆహ్వానిస్తానన్నారు. రేవంత్ అసమర్థుడు కారని, కాంగ్రెస్లో ఉంటే మాత్రం అసమ ర్థునిగా మిగిలిపోతా రన్నా రు. మోదీ ప్రభుత్వంలో పసుపు రైతులకు మార్కె ట్ పెరిగిందని, ప్రధాని మోదీ పై ప్రేమతోనే పసుపు రైతులు ఈసారి బీజేపీకి ఓటు వేస్తారని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే వ్యవహరిస్తోందన్నారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వం ప్రకటన చేయలేదని, ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే పేర్కొన్నారని విమర్శించారు. సరైన సమయంలో ధాన్యం కొనుగోలు జరగడం లేదని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తప్పు చేస్తే జైల్లో వేయాలని, రోజూ అదే అంశంపై మాట్లాడటం అనవసరమన్నారు. -
ప్రతిఒక్కరూ రజాకార్ సినిమా చూడండి : ఎంపీ బండి సంజయ్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో నిజామాబాద్–ఖమ్మం వరకు ఎన్హెచ్–563, ఆర్ఎఫ్సీఎల్ పునరుద్ధరణ, రైలు మార్గాల నిర్మాణం, టర్మరిక్ బోర్డు, నిజాం షుగర్ ఫ్యాక్టరీకి నిధులు.. ఇలా ఎన్నో ఇచ్చాం.. వచ్చే పదేళ్లలో తెలంగాణ ప్రగతిపై ఫోకస్ చేసి, మరెన్నో ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రంలో రోడ్లు, రైలు, గోదాంలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. సోమవారం జగిత్యాల పట్టణంలోని గీతా విద్యాలయం మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రసంగించారు. రాష్ట్రంతోపాటు ఉమ్మడి జిల్లాలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. వికసిత్ భారత్, వికసిత్ తెలంగాణ కోసం బీజేపీని గెలిపించాలని, అబ్ కీ బార్ 400 పార్ అని పిలుపునిచ్చారు. పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరతో రైతులను, సంక్షేమ పథకాలతో మహిళలను, రుణాలిచ్చి యువతను ఆదుకున్నామని తెలిపారు. పసుపు మద్దతు ధర, టర్మరిక్ బోర్డు ఏర్పాటు, నిజాం షుగర్ ఫ్యాక్టరీకి, ఆర్ఎఫ్సీఎల్ పునరుద్ధరణకు రూ.6,400 కోట్లు వెచ్చించామన్నారు. కాళేశ్వరం అవినీతి విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల తీరును ఎండగట్టారు. ఆ పార్టీలు తెరచాటు మిత్రులని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ అగ్రనాయకులు లక్ష్మణ్, సత్యనారాయణరావు, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి, నిర్మల్ ఎమ్మెల్యే పరమేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. రజాకార్ సినిమా చూడండి వీరులను కన్న గడ్డ జగిత్యాలలో పీఎఫ్ఐ లుచ్చాగాళ్లు అడ్డా పెట్టి, పాకిస్తాన్ జిందాబాద్ అంటుంటే వాళ్లకు ఆర్థికసాయం చేస్తున్న వాళ్లను వదిలేద్దామా? నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులు జగిత్యాల సొంతం. రాముని పేరు చెబితే కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్లు గజగజ వణుకుతున్నరు. దేశ ప్రజల భాగస్వామ్యంతో అయోధ్యలో రాముని గుడిని కట్టింది బీజేపీయే. మా పార్టీ బరాబర్ శ్రీరాముని పేరుతో ఎన్నికల్లోకి వెళ్తుంది. మీకు దమ్ముంటే బాబర్ పేరుతో ఓట్లడగండి. తెలంగాణ ప్రజాలారా... ప్రతిఒక్కరూ రజాకార్ సినిమా చూడండి. నిజాం సమాధి వద్ద మోకరిల్లిన కేసీఆర్, ఒవైసీ సోదరులను కట్టేసి, ఈ సినిమా చూపించండి. – ఎంపీ బండి సంజయ్ ఐదో ఆర్థిక శక్తిగా మన దేశం ప్రధాని మోదీ వల్లే మన దేశం ప్రపంచ దేశాల్లో బలమైన ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగింది. మయన్మార్, పాకిస్తాన్ లాంటి దేశాలను దారికి తెచ్చిన ఘనత ఆయనదే. మోదీ వల్లే దేశంలో సుస్థిరత, సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతాయి. ఇటీవల సీఏఏ అమలు చేశారు. త్వరలో ఎన్ఆర్సీ, యూసీసీ కోడ్ను కూడా అమలు చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి. – ఎంపీ ధర్మపురి అర్వింద్ దేశ ప్రజలందరూ ప్రధాని కుటుంబమే ప్రధాని నరేంద్ర మోదీకి కుటుంబం లేదంటున్న విపక్షాలకు సిగ్గులేదు. దేశ ప్రజలందరూ ఆయన కుటుంబమే. వేములవాడ రాజన్న ఆశీర్వాదంతో తెలంగాణ నుంచి బీజేపీ తరఫున అత్యధిక ఎంపీ స్థానాలు గెలిచి, ప్రధానికి కానుకగా ఇద్దాం. పదేళ్ల యూపీఏ హయాంలో జరగని స్కాం లేదు. బీఆర్ఎస్ కాళేశ్వరం నుంచి కరెంటు వరకు అవినీతిమయం చేసింది. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేయలేక చేతులెత్తేసింది. – ఏలేటి మహేశ్వర్రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత -
Telangana: ఎంపీ, ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్నా కూడా అసెంబ్లీకే జై
సాక్షి, కరీంనగర్: ఎంపీలుగా గెలిచినా, రాజ్యసభకు వెళ్లినా..ఎమ్మెల్సీలుగా ఎన్నికైనా ప్రస్తుత రాజకీయాల్లో అందరికీ శాసనసభలో అడుగుపెట్టి అధ్యక్షా అనాలనే ఉత్సుకత..ఆసక్తే ఎక్కువగా కనిపిస్తోంది. ఎంపీ, ఎమ్మెల్సీ కంటే ఎమ్మెల్యే గారూ అంటేనే వచ్చే కిక్కు వేరే లెవెల్ అన్నదే ఇప్పుడు రాజకీయనేతల మనసుల్లో నాటుకు పోయింది. ఆ క్రమంలో జిల్లాలో ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎవరెవరు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే బరిలో దిగారని ఒక్కసారి చూస్తే.. ఇద్దరు ఎమ్మెల్సీలు..! ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్తో ఎమ్మెల్సీ పాడికౌశిక్రెడ్డి పోటీ పడుతున్నారు. ఈయన 2021లో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే.. తన స్థానానికి రాజీనామా చేయాల్సి వస్తుంది. దీంతో ఆ స్థానానిక ఉప ఎన్నిక జరుగుతుంది. ఇక ఈటల రాజేందర్ హుజురాబాద్తోపాటు గజ్వేల్లోనూ పోటీ చేస్తున్నారు. ఒకవేళ రెండుచోట్ల రాజేందర్ విజయం సాధిస్తే.. ఏదో ఒక అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక తథ్యం.) మరో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి కూడా జగిత్యాల అసెంబ్లీ బరిలో ఉన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత అయిన జీవన్రెడ్డి 2019లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఒకవేళ అసెంబ్లీపోరులో ఈయన గెలిస్తే.. 2025 వరకు అంటే దాదాపు ఏడాదిన్నర సమయం ఉంది. దీంతో ఈయన స్థానానికి ఉపఎన్నిక అనివార్యమవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చదవండి: కంటతడి పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. నెల రోజులు ఇదే పరిస్థితి.. కిలో ఎంతంటే! ఇద్దరు ఎంపీలు సైతం! ఇద్దరు ఎంపీలు అసెంబ్లీకి పోటీ పడుతున్నారు. కోరుట్ల నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్ అసెంబ్లీ బరిలో ఉన్నారు. వీరిద్దరూ విజయం సాధించినా.. ఆరునెలలు మాత్రమే వీరి పదవీకాలం మిగిలి ఉండటంతో ఉపఎన్నిక రాకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ గెలవకపోయినా.. వీరి పదవులకు వచ్చిన ఢోకా ఏమీ ఉండదు. -
దళిత ముఖ్యమంత్రి హామీ ఏమైంది?
సాక్షి, న్యూఢిల్లీ: బీసీలను రాజకీయంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలన్నది బీజేపీకి తెలుసునని.. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ తమకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలు కలిపి 50 శాతానికిపైగా మంత్రులు ఉన్నారని తెలిపారు. శనివారం ఆయన ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామన్న హామీ ఏమైందో తన తండ్రి కేసీఆర్ను అడగాలని కేటీఆర్ను డిమాండ్ చేశారు. వచ్చే రోజుల్లో అయినా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారా? లేక కేసీఆర్.. తర్వాత కేటీఆర్, ఆ తర్వాత ఆయన కొడుకుని ముఖ్యమంత్రి చేయడమే తమ రాజకీయమా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఇలాంటి వ్యక్తులు బీజేపీ గురించి మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంటుందని అర్వింద్ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవితను ఒక రాజకీయ నాయకురాలిగా తాను ఏమాత్రం భావించటంలేదని అన్నారు. కవిత ఒక కాలం చెల్లిన, ప్రజలు తిరస్కరించిన నాయకురాలని విమర్శించారు. కాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా పార్టీ సీనియర్లను హైకమాండ్ కోరినప్పటికీ కొందరు వివిధ కారణాలతో పోటీ వద్దనుకున్నారని చెప్పారు. అయితే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ఒక అర్హత అన్నది తన అభిప్రాయమన్నారు. -
రేవంత్, కవిత బిజినెస్ పార్ట్నర్స్
సుభాష్నగర్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బిజినెస్ పార్ట్నర్స్ అని, వారు ఒకే కంపెనీ లో డైరెక్టర్లుగా ఉన్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యా ఖ్యలు చేశారు. మంగళవారం నిజామాబాద్ జిల్లాకేంద్రంలో బీజేపీ అర్బన్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మా ట్లాడారు. కవిత రేవంత్రెడ్డితో మాట్లాడి ఆకుల లలితను కాంగ్రెస్లోకి పంపించి అర్బన్ టికెట్ ఇప్పిస్తున్నారని, అందుకే కవితను నిజామాబాద్ అర్బన్, బోధన్ ఇన్చార్జీగా బీఆర్ఎస్ నియమించిందని ఆరోపించారు. బతికుండగా ఆరోగ్యబీమా ఇవ్వలేని సీఎం కేసీఆర్.. చనిపో యాక రూ.5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తానని బీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేర్చారని, కానీ మంత్రి కేటీఆర్కు రూ.10 లక్షలు, ఎమ్మెల్సీ కవిత కు రూ.20 లక్షలు బీమా ఇస్తానని ఎద్దేవా చేశా రు. మైనార్టీబంధు రూ.10 లక్షలకు పెంచాలని ఎంఐఎం నేత ఒవైసీ ఎందుకు డిమాండ్ చేయడం లేదో చెప్పాలన్నారు. ప్రజలకు నవంబర్ 30న మంచి అవకాశం వచ్చినందున బీజేపీకి మద్దతుగా నిలవాలని అన్నారు. -
అసెంబ్లీ బరిలో ఎంపీ అర్వింద్.. బీఆర్ఎస్ సీనియర్ నేతతో ఢీ!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతారన్న ప్రచారం ఊపందుకుంది. ఎంపీలను ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పరిధిలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానంలో పోటీ చేయాల్సిందేనని బీజేపీ అధిష్ఠానం ఆదేశించడంతో తమకు అనుకూలమైన స్థానంలో బరిలో నిలిచేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలోనే ఎంపీ అర్వింద్ తన పార్లమెంట్ పరిధిలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో ఎంపీ సామాజిక వర్గ ఓట్లు అధికంగా ఉన్నాయి. దీనికితోడు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ మహబూబ్నగర్లో జరిగిన బహిరంగ సభలో నిజామాబాద్లో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అదే సమయంలో ఏళ్లక్రితమే మూతపడిన షుగర్ ఫ్యాక్టరీని ప్రధాని మోదీ, అమిత్షాల దృష్టికి తీసుకెళ్లానని, త్వరలోనే పునఃప్రారంభించేలా చూస్తానన్న హామీతో ఓట్లు అడిగేందుకు అర్వింద్ సమాయత్తమవుతున్నట్లు సమాచారం. కోరుట్ల నియోజకవర్గంలో పసుపు, చెరుకు పండించే రైతులు అధికంగా ఉండడం.. అటు పసుపుబోర్డు, ఇటు షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం అంశం ఎన్నికల్లో కలిసొస్తుందన్న ఆలోచనలో అర్వింద్ ఉన్నట్లు తెలిసింది. గతంలో మెట్పల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచిన చెన్నమనేని విద్యాసాగర్రావు ఈ ప్రాంత అభివృద్ధి కోసం శ్రమించారు. దీంతో ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో ఇప్పటికీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ఇది కూడా తన గెలుపునకు దోహదపడుతుందని, ఆర్మూర్తో పోలిస్తే కోరుట్లలోనే విజయం సాధించడం సులువనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. -
బియ్యం అమ్మకం..రూ.4 వేల కోట్ల స్కామ్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నిధుల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం బియ్యం అమ్మకానికి పెట్టి.. కస్టమ్మిల్లర్ల నోట్లో మట్టికొట్టే పనిచేస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలకు కిలో నాలుగైదు రూపాయల తక్కువకు అమ్మాలని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం.. ఒక్క ఆక్షన్కి రూ.1000 కోట్ల స్కామ్.. కోటిటన్నులు అమ్ముకునే ప్రణాళిక బీఆర్ఎస్ సర్కారుదని ఆరోపించారు. ఈ విధంగా వచ్చే రూ.4 వేల కోట్ల అవినీతి సొమ్ము 100 నియోజకవర్గాల్లో..ఒక్కో సెగ్మెంట్లో రూ.40 కోట్లు ఖర్చు చేసి వచ్చే ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపణలు సంధించారు. శనివారం అర్వింద్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సర్కార్ బియ్యం అమ్ముకుంటామని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని, దీనికి వెనుక అసలు ఉద్దేశం అదేనని ఆరోపించారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని వేలం వేసేందుకు వెయ్యికోట్ల టర్నోవర్, రూ.100 కోట్ల ప్రాఫిట్ ఉండాలనే నిబంధనలు పెట్టారని మండిపడ్డారు. మొదటిదశలో రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వేలం వేయాలని నిర్ణయించారని, టెండర్లో పాల్గొనేందుకు పౌరసరఫరాలశాఖ నిర్ణయించిన విధివిధానాలతో రైస్ మిల్లర్లకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎంఎస్పీకి బియ్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలో మిల్లర్లు సిద్ధంగా ఉన్నా, టెండర్ల ద్వారా తమ మిల్లు సామర్థ్యం మేరకు ధాన్యం దక్కించుకుందామనుకున్న మధ్యతరగతి మిల్లర్లకు అసలు అందులో పాల్గొనే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలతో రైస్మిల్లర్లు బియ్యం ఆక్షన్లో కొనలేరన్నారు. రైస్మిల్లర్ల వ్యాపారం బంద్ అయితే రైతులు రోడ్డుమీదకు వచ్చే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ నుంచి ఎంపీగా కల్వకుంట్ల కవిత పోటీచేస్తే మూడో స్థానానికి పరిమితం అవుతుందని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. తాను ఎంపీగా పోటీలో ఉండడం ఖాయమని ప్రకటించారు. -
ఎంపీ అరవింద్తో విభేదాలు.. బీజేపీకి గుడ్బై
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఆర్మూరు నియోజక వర్గ బీజేపీ ఇంఛార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కొంతకాలంగా ఎంపీ అరవింద్తో వినయ్కి పడటం లేదు. చివరకు.. ఎంపీ అరవింద్ వ్యతరేకంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఇటీవల ఆందోళన సైతం చేపట్టారు వినయ్. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండడంతో.. ఆయన పార్టీ మారుతుండడం చర్చకు దారి తీసింది. వినయ్ 2018 లో ఆర్మూర్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు వినయ్. ఆ ఎన్నికల్లో దాదాపు 20 వేల ఓట్లు సాధించారు. ఈ దఫా ఆర్మూర్ టికెట్ ఆశావాహుల్లో ఈయన కూడా ఉన్నారు. బీజేపీని వీడిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వినయ్ బయటకు రావడం.. జిల్లాలో కమలం పార్టీపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ గెలుపులో గిరిజనులే కీలకం -
తమాషాలొద్దు..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అర్వింద్కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన నిజామాబాద్ జిల్లా పార్టీ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి తనదైన శైలిలో క్లాస్ పీకారు. ఏదైనా సమస్య ఉంటే అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలే తప్ప మీడియా ఎదుట నిరసనలు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు, తమాషాలొద్దు... అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ రెండు వర్గాలుగా విడిపోయింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య ఇటీవల 13 మండలాల అధ్యక్షులను తొలగించి.. కొత్త వారిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక నేతలతో చర్చించకుండా.. కొత్తవారిని ప్రకటించడంపై మరో వర్గం రగిలిపోయింది. ఎంపీ అర్వింద్ పట్టుబట్టి పార్టీ మండల అధ్యక్షులను మార్చివేశారని ఈ వర్గం ఆరోపిస్తోంది. ఈక్రమంలో బుధవారం నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాలకు చెందిన అసమ్మతి నేతలు వచ్చి ఒక్కసారిగా బైఠాయించి.. ఆందోళనకు దిగారు. ఎంపీ అర్వింద్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి ఉమాశంకర్, రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి.. వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వినకపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో కిషన్రెడ్డి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అసమ్మతి నేతలను పిలిపించుకుని మాట్లాడారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే ఆందోళన చేయడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య ఉంటే అంతర్గతంగా కూర్చొని సెట్ చేసుకోవాలని.. ఇలా వీధిన పడటం భావ్యం కాదని క్లాస్ తీసుకున్నారు. ఈ నెల 29న అమిత్ షా పర్యటన తర్వాత... సర్ధుబాటు చేసుకుందామని చెప్పి ఆందోళనకు దిగిన వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఆ జిల్లాలో అన్ని సెగ్మెంట్లలోనూ పోటాపోటీ నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఇప్పటి నుంచే టికెట్ల కోసం బీజేపీ నేతల మధ్య పోటాపోటీ నెలకొంది. నిజా మాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య పోటీ చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఎంపీ అర్వింద్ ప్రోత్సాహంతో ధన్పాల్ సూర్యనారా యణ గుప్త కూడా అక్కడ పనిచేసుకుంటున్నారు. ఇక ఆర్మూర్ లోనూ ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన వినయ్ రెడ్డితో పాటు పార్టీలో చేరిన వ్యాపారవేత్త రాకేశ్రెడ్డి అక్కడ బీజేపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇక బోధన్ నియోజకవర్గం నుంచి ప్రకాశ్రెడ్డితో పాటు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇలా జిల్లాలో నేతల మధ్య వర్గపోరు తార స్థాయికి చేరింది. అయితే మండలాల అధ్యక్షులను మార్చడం.. వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలనుకున్న కొంతమంది అసమ్మతి వర్గా నికి ఆజ్యం పోయడంతో ఆ రచ్చ కాస్తా బీజేపీ రాష్ట్ర కార్యాల యానికి చేరింది. కాగా, ఎంపీ అర్వింద్ మాత్రం.. మండలాల అధ్యక్షుల మార్పులో తన ప్రమేయం లేదని ఢిల్లీలో స్పష్టం చేశారు. -
తెలంగాణ కమలం పార్టీ ఆఫీస్లో కలకలం.. ఒక్కసారిగా దూసుకొచ్చి..
సాక్షి, హైదరాబాద్: ఇందూరు కమలం దళంలో రేగిన చిచ్చు.. హైదరాబాద్ లోని స్టేట్ పార్టీ కార్యాలయానికి పాకింది. ఎంపీ ధర్మపురి అరవింద్ తీరుపై స్థానిక అసమ్మతి నేతలు ఆందోళనకు దిగారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ సీనియర్ నేతలు సముదాయించినా అసమ్మతి నేతలు వినకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. నిజామాబాద్ కాషాయ పార్టీ నేతల ఆందోళనకు కారణమేంటీ ? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వారికి ఏం చెప్పి సముదాయించారు? నిజామాబాద్ జిల్లాలో కాషాయ పార్టీ రెండుగా చీలింది. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్య ఇటీవల 13 మండలాల అధ్యక్షులను తొలగించి.. కొత్త వారిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక నేతలతో చర్చించకుండా.. నేరుగా కొత్తవారిని ప్రకటించడంపై అసమ్మతివర్గం రగిలిపోయింది. ఎంపీ అరవింద్ పట్టుబట్టి పార్టీ మండల అధ్యక్షులను మార్చివేశారని అసమ్మతివర్గం ఆరోపిస్తోంది. (చదవండి: విశ్వనగరమట.. కనీస స్పందన ఉండదా?.. కేసీఆర్, కేటీఆర్లపై రేవంత్రెడ్డి ఫైర్) బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్భన్ నియోజకవర్గాలకు చెందిన కొంత మంది నేతలు వచ్చి ఒక్కసారిగా బైఠాయించి.. ఆందోళనకు దిగారు. అరవింద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి ఉమాశంకర్, రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి.. వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ బీజేపీ నుంచి పోటీ చేయడానికి చాలా మంది అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య పోటీ చేయాలని గట్టిపట్టుదలతో ఉన్నారు. ఎంపీ అరవింద్ ప్రోత్సాహంతో ధన్ పాల్ సూర్యనారయణ గుప్త అక్కడ పనిచేసుకుంటున్నారు. ఇక ఆర్మూర్ లోనూ ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన వినయ్ రెడ్డితో పాటు ఇటీవల పార్టీలో చేరిన వ్యాపారవేత్త రాకేశ్ రెడ్డి ఆర్మూర్ బీజేపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. (చదవండి: మోదీ సర్కార్పై అవిశ్వాస తీర్మానం.. లోక్సభలో ఎవరి బలం ఎంతంటే!) బోధన్ అసెంబ్లీ నుంచి ప్రకాశ్ రెడ్డితో పాటు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. జిల్లాలో నేతల మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది. (చదవండి: కాంగ్రెస్లోకి వస్తూనే టికెట్ల పంచాయితీ పెట్టిన జూపల్లి! నాగం ఆగమాగం.. చేరికపై ట్విస్టయితే ఉండదుగా!) ఇదే తరుణంలో మండలాల అధ్యక్షులను మార్చడం.. వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలనుకున్న కొంత మంది.. అసమ్మతి వర్గానికి ఆజ్యం పోయడంతో ఆ రచ్చ కాస్తా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరింది. ఎంపీ అరవింద్ మాత్రం.. మండలాల అధ్యక్షుల మార్పులో తనప్రమేయం లేదని చెబుతున్నారు. ఆందోళనకు దిగిన నిజామాబాద్ అసమ్మతి నేతలను కిషన్ రెడ్డి పిలిపించుకుని మాట్లాడారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆందోళన చేయడంపై వారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. సమస్య ఉంటే అంతర్గతంగా కూర్చొని సెట్ చేసుకోవాలని.. ఇలా వీధిన పడటం భావ్యం కాదని క్లాస్ తీసుకున్నారు. ఈ నెల 29న అమిత్ షా పర్యటన తర్వాత... సర్ధుబాటు చేసుకుందామని చెప్పి ఆందోళనకు దిగిన అసమ్మతి నేతలను కిషన్ రెడ్డి తిరిగి పంపించారు. -సాక్షి, పొలిటికల్ డెస్క్ -
హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్తత
-
బీజేపీ ఆఫీసులో ఉద్రిక్తత.. అర్వింద్కు షాకిచ్చిన కాషాయ కార్యకర్తలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీ అర్వింద్కు వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లా నేతలు నినాదాలు చేశారు. కార్యాలయం లోపలే అర్వింద్ వ్యతిరేక వర్గం ఆందోళనకు దిగారు. ఈ సందర్బంగా వారిని పార్టీ కార్యాలయం నుంచి వెళ్లాలని రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి కోరారు. ఇక, ఇదంతా జరుగుతున్న క్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆఫీసులో ఉండటం విశేషం. ఇదే సమయంలో బీజేపీ కార్యకర్తలు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో 13 మండలాల అధ్యక్షులను పార్టీ నిబంధనలను విరుద్దంగా మార్చినట్టు తెలిపారు. ఈ విషయంలో కిషన్రెడ్డి కలుగజేసుకుని సమస్య పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం.. ఎంపీ అర్వింద్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇది కూడా చదవండి: అమిత్ షా పర్యటన వేళ కీలక పరిణామం.. రఘునందన్, అర్వింద్కు కీలక బాధ్యతలు! -
ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అరవింద్ సంచలన ఆరోపణలు
సాక్షి, నిజామాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజల సొమ్మును ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళ్ల దగ్గర మంత్రి ప్రశాంత్ రెడ్డి దారబోస్తున్నారని ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, ఎంపీ అరవింద్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గంలో కట్టిన ప్రతీ బిడ్జిపై ఎమ్మెల్సీ కవితకు కమీషన్ వెళ్తోంది. ఒకే పనికి డబుల్ బిల్లింగ్ చేస్తున్నారు. రోడ్ కార్పోరేషన్ డెవలప్మెంట్ నుంచి కట్టినట్టు శిలాఫలకం వేశారు. కేంద్రం ద్వారా నిధులు పొందినట్టు కేంద్రానికి యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. 50 ఏళ్లు వడ్డీలేని రుణం ద్వారా నిర్మించినట్టు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా రూ.5వేల కోట్లకు పైగా స్కామ్ జరిగింది అని ఆరోపణలు చేశారు. ఇది కూడా చదవండి: వాతావరణశాఖ హెచ్చరిక.. తెలంగాణలో నాలుగు రోజులు గట్టి వానలే.. -
బీజేపీ ‘పరివార’ చర్చలు
సాక్షి, హైదరాబాద్: పార్టీ నేతలు, కార్యకర్తలంతా ఒకే పరివారమని చాటేలా, వివిధ అంశాలపై ఆరోగ్యకరమైన చర్చలు జరిగేలా బీజేపీ చేపట్టిన ‘టిఫిన్ బాక్స్ బైఠక్’ఆదివారం జరగనుంది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించే ఈ ‘లంచ్’భేటీలకు కార్యకర్తలు ఎవరికి వారే టిఫిన్ బాక్స్లు తెచ్చుకొని, సహపంక్తి భోజనాలు చేయనున్నారు. ఫొటోలు, వేదిక, బ్యానర్లు, మీడియా, భారీగా భోజనం ఏర్పాట్లు వంటి రాజకీయ హంగు, ఆర్భాటాలేవీ లేకుండా.. పార్టీ నేతలు, కార్యకర్తలు కలుసుకునేలా వీటి నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు. ‘‘ప్రధానంగా దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో ఏర్పడిన కాంగ్రెస్ కల్చర్కు, ఏదో ఒక రూపంలో పెద్ద ఎత్తున ఖర్చు చేసే పద్ధతికి చెక్పెట్టేలా పార్టీ నాయకులు, కార్యకర్తల సాదర సమావేశాలకు రూపకల్పన చేశాం. ఈ భేటీల సందర్భంగా కార్యకర్తలు పిచ్చాపాటిగా అన్ని విషయాలపై మాట్లాడుకోవడంతో పాటు వివిధ అంశాలపై ఆరోగ్యకరమైన చర్చకు అవకాశం ఉంటుంది..’’అని బీజేపీ నేతలు చెప్తున్నారు. నిరంతరం కొనసాగించే యోచన ప్రజలకు మరింత సేవ చేసేలా ప్రోత్సాహం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, పార్టీ పటిష్టత తదితర అంశాలపైనా ‘లంచ్’భేటీల్లో దృష్టి పెట్టనున్నట్టు బీజేపీ నేతలు తెలిపారు. ఆదివారం ఈ బైఠక్లు జరిగాక.. వాటిని నిరంతరం కొనసాగించాలనే ఆలోచనతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉందని వివరించారు. త్వరలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. శక్తి కేంద్రాల ఇన్చార్జులు (మూడు, నాలుగు పోలింగ్ బూత్లు కలిపి ఓ శక్తి కేంద్రం), ఆ పైస్థాయిల వారు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వంద మంది, అంతకు మించి పాల్గొనేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. గతంలో ప్రధాని మోదీ వారణాసిలో ఈ తరహా కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. తర్వాత ఇతర రాష్ట్రాల్లోనూ నిర్వహిస్తున్నారు. నేతలు అతిథులుగా.. ఆదివారం నిర్వహిస్తున్న లంచ్ బైఠక్ కార్యక్రమాల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక్కో నేత ముఖ్య అతిథిగా హాజరవుతారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి ఒక ప్రకటనలో తెలిపారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, కరీంనగర్లో ఎంపీ బండి సంజయ్, గద్వాలలో జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఆర్మూర్లో ఎంపీ ధర్మపురి అర్వింద్ , బోథ్లో ఎంపీ సోయం బాపూరావు, హుజూరాబాద్లో ఈటల రాజేందర్, దుబ్బాకలో రఘునందన్రావు, మలక్పేటలో నల్లు ఇంద్రసేనారెడ్డి, మునుగోడులో కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి, ఇతర నియోజకవర్గాల పరిధిలో బీజేపీ ముఖ్య నేతలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పదాధికారులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బైఠక్లకు హాజరవుతారని తెలిపారు. -
అక్కడ వందల కోట్ల స్కాం జరిగింది: ఎంపీ అరవింద్ సంచలన కామెంట్స్
సాక్షి, నిజామాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. బాల్కొండలో వందల కోట్ల స్కామ్ జరిగిందని అరవింద్ ఆరోపించారు. బాల్కొండ ప్రజలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, ఎంపీ అరవింద్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బాల్కొండలో వందల కోట్ల స్కాం జరిగింది. బట్టాపూర్లో శ్రీకాంత్, వంశీరెడ్డి అక్రమంగా క్వారీక్రషర్లు నడుపుతున్నారు. పర్యావరణ అనుమతులు లేకుండా ఐదేళ్లు నడిపించారు. బాల్కొండ ప్రజలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. రూ.51లక్షల కరెంట్ బిల్లు కట్టకపోతే విద్యుత్ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు. సామాన్యుడు రూ.2వేలు విద్యుత్ ఛార్జీ కట్టకపోతే కరెంట్ కట్ చేస్తారు. దీనికి మంత్రి జగదీష్ రెడ్డి సమాధానం చెప్పాలి అని సీరియస్ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: బాధగా ఉంది.. కనీస కృతజ్ఞత కూడా లేదు: మంత్రి ప్రశాంత్ ఆవేదన -
కిషన్రెడ్డి పార్టీకి లక్కీ హ్యాండ్: ధర్మపురి అర్వింద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్రెడ్డిని నియమించడంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ హర్షం వ్యక్తం చేశారు. కిషన్రెడ్డిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపిన అర్వింద్.. కిషన్రెడ్డి పార్టీకి ఒక లక్కీ హ్యాండ్ అని స్పష్టం చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. ‘జేపీ నడ్డా.. అజాత శత్రువు.. కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. పరిపక్వత కల్గిన పొలిటీషయన్ కిషన్రెడ్డి. ఆయన్ను నియమించినందుకు ధన్యవాదాలు. ఈటలకు ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించినందుకు నడ్డాకు కృతజ్ఞతలు. 2024 లో మూడోసారి ప్రధాని మోదీ పీఎం అవుతారు. ఈటల తెలంగాణ వ్యాప్తంగా అగ్రెసివ్గా వెళ్తారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. బండి సంజయ్ అగ్రెసివ్గా తన టర్మ్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. మేమంతా కలిసి పనిచేస్తాం.. అధికారంలోకి తీసుకువస్తాం. ఎంపీగా గెలవలేని వ్యక్తి రాహుల్.. ఆయన కూడా మాపై వ్యాఖ్యలు చేస్తాడా?, కాంగ్రెస్ను లేపడానికి కొన్ని ఛానళ్లు బాగా కష్ట పడుతున్నాయి. మీడియా కథనాలతో ప్రజలను మభ్యపెట్టలేరు. రాహుల్ కు రాజకీయం నేర్పేందుకు కొన్ని ఛానళ్లు క్లాసులు ఇస్తున్నాయి. చచ్చిపోయిన పీనుగులాంటి కాంగ్రెస్ పార్టీ.. 12 వేల ఓట్లతో గెలిచిన వ్యక్తిని పార్టీలోకి చేర్చుకుంటే అధికారంలోకి వస్తుందా?, కవిత అరెస్ట్ విషయంలో పొలిటికల్ ఇన్వాల్వ్ మెంట్ ఉండదు. తప్పు చేసిన వారిని, అవినీతి చేసిన వారిని బొక్కలో వేస్తామని మోదీ హామీ ఇచ్చారు.. కేటీఆర్ కు ఇంకా ఏం హామీ ఇవ్వాలట. కవిత జైలుకు వెళ్లేముందు ఒక్కదాన్నే వెళ్లను.. అందరినీ తీసుకు వెళ్తామని అందని చెప్తున్నారు. నాకు, బండికి మధ్య ఎలాంటి గ్యాప్ లేదు. కవిత విషయంలో సంజయ్ కామెంట్స్ చేసినప్పుడు నా టంగ్ స్లిప్ అయి నేను కూడా కామెంట్స్ చేశా’ అని పేర్కొన్నారు. చదవండి: బీజేపీ స్ట్రాటజీ.. తెలుగు రాష్ట్రాల బీజేపీ చీఫ్ల మార్పు బీజేపీలో కిషన్రెడ్డి బలం అదే.. ఆయనే ఇక తెలంగాణలో పార్టీ గేమ్ఛేంజర్! -
కాంగ్రెస్కు షాక్.. రేవంత్పై ఆరోపణలతో బీజేపీలో చేరిక
సాక్షి, న్యూఢిల్లీ: కేసీఆర్ కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ ఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో కేసీఆర్ చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారని, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. లోపాయికారి ఒప్పందంలో భాగంగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ గుర్తుమీద గెలిచినవాళ్లు కేసీఆర్ పంచన చేరి అసెంబ్లీలో కూర్చుంటున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణకు చెందిన పారిశ్రామికవేత్త పైడి రాకేష్రెడ్డికి తన నివాసంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సమక్షంలో తరుణ్ఛుగ్ కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తరుణ్ ఛుగ్ మాట్లాడుతూ, తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతోందని, కేసీఆర్ అవినీతిపాలనను మోదీ నేతృత్వంలో అంతమొందిస్తామన్నారు. నవంబర్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ ప్రజల సంపూర్ణ మద్దతుతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కవిత కేసీఆర్ మాట వినకుండా.. ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ, కవిత కేసీఆర్ మాట వినకుండా నిజామాబాద్ నుంచే పోటీ చేయాలని.. మెదక్కు పారిపోవద్దని కోరారు. కేసీఆర్ ఆమెను మెదక్ నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ఒక బీమారి అయితే దానికి వాక్సిన్ బీజేపీ అని వ్యాఖ్యానించారు. కర్నాటకలో ఫలితాలు, తెలంగాణలో ఏ మాత్రం ప్రభావం చూపించవని.. పక్క ఇంట్లో బిర్యానీ వండితే మన కడుపు నిండుతుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు చాలామంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అర్వింద్ చెప్పారు రౌడీల రాజ్యంలా రాష్ట్రం: రాకేష్రెడ్డి అమరవీరుల త్యాగాల తెలంగాణ ఇది కాదని, రౌడీల రాజ్యంలా రాష్ట్రం ఉందని బీజేపీలో చేరిన పారిశ్రామికవేత్త పైడి రాకే‹Ùరెడ్డి మండిపడ్డారు. మోదీ నాయకత్వం నచ్చే బీజేపీలో చేరానని, కార్యకర్తగా ఉంటూనే పార్టీ ఎలాంటి బాధ్యత ఇచ్చినా మోసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో అన్యాయాలు, అక్రమాలు ఎదుర్కొంటామని, టిప్పర్లను అడ్డుకోవడమే తన కర్తవ్యమని తెలిపారు. ఇది కూడా చదవండి: ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన సందర్భం ఇది: సీఎం కేసీఆర్ -
డీఎస్ ఇంట్లో రాజకీయ రచ్చ.. అన్న ఆరోపణలపై స్పందించిన అరవింద్..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్లో డీఎస్ చేరిక వ్యవహారంపై ఆయన చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన తండ్రి మైల్డ్ పెరాలసిస్తో పాటు, చెప్పింది మర్చిపోయే డిమెన్షియాతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ సమయంలో ఆయనను గాంధీభవన్కు తీసుకెళ్లి పార్టీ కండువా కప్పడం సబబు కాదన్నారు. ' మా నాన్న మైండ్ స్ట్రోక్ వచ్చి బాధపడితే కనీసం సోనియా గాంధీ గానీ ఇంకెవరు గానీ పలకరించినవాళ్లు లేరు. నా తండ్రి కట్టర్ కాంగ్రెస్ వ్యక్తి అని నేనే పలుమార్లు చెప్పాను. ఆయన కాంగ్రెస్లోకి వెళ్లినా, కమ్యూనిస్టు పార్టీలోకి వెళ్లినా నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ, ఇది సమయం కాదు.. జాయిన్ చేసుకునే పద్ధతి ఇది కాదు. సోనియానో , ఇంకెవరైనా ఆ స్థాయి వాళ్లో ఆయన ఇంటికే వెళ్లి కండువా కప్పితే భావ్యం తప్ప ఇది పద్ధతి కాదన్నదే నా ఉద్దేశం' అని అరవింద్ అన్నారు. కాగా.. డీఎస్, ఆయన పెద్ద కుమారుడు సంజయ్ ఆదివారం గాంధీభవన్ వెళ్లి కాంగ్రెస్లో చేరారు. కానీ ఒక్కరోజుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. తాను పార్టీలో చేరలేదని, కానీ చేరినట్లు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అయితే ఈ లేఖను తన తమ్ముడు అరివింద్ బ్లాక్మెయిల్ చేసి రాయించాడని సంజయ్ ఆరోపించారు. తన తండ్రి అనారోగ్యంపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం అన్నాదమ్ముల మధ్య పొలిటికల్ హీట్ పెంచింది. సంజయ్ ఆరోపణల నేపథ్యంలోనే అరవింద్ సోషల్ మీడియా వేదికగా స్పందించి వివరణ ఇచ్చారు. చదవండి: కాంగ్రెస్లో చేరిక పంచాయితీ.. డీఎస్ తనయుల వార్! తండ్రిని బ్లాక్ మెయిల్ చేశారా? -
కాంగ్రెస్లో చేరిక పంచాయితీ.. డీఎస్ తనయుల వార్! తండ్రిని బ్లాక్ మెయిల్ చేశారా?
డీ శ్రీనివాస్ ఆరోగ్యంపై ఆందోళనగా ఉందని ఆయన కుమారుడు ధర్మపురి సంజయ్ తెలిపారు. తన తండ్రికి ఫిట్స్ వస్తే ఇంట్లోనే ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. తన తమ్ముడు ధర్మపురి అరవిందే తండ్రిని బ్లాక్మెయిల్ చేసి లేఖలు రాయిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అరవింద్ దిగజారి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి చుట్టూ ఉన్నవాళ్లపై తనకు అనుమానం ఉందని సంజయ్ చెప్పారు. డీఎస్ రాజీనామా లేఖలు బీజేపీ చేస్తున్న డర్టీ పాలిటిక్స్ అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే అరవింద్పై పోటీ చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. డీఎస్, ఆయన కుమారుడు సంజయ్ ఆదివారమే కాంగ్రెస్ గూటికి తిరిగివెళ్లారు. అయితే 24 గంటల్లోనే ఆ పార్టీకి రాజీనామా చేస్తునట్లు డీఎస్ ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు. డీఎస్ లేఖ రాస్తున్న వీడియోను కూడా విడుదల చేశారు. రాజీనామా లేఖను ఆయన సతీమణి విజయలక్ష్మి మీడియాకు విడుదల చేశారు. డీఎస్ ఆరోగ్యం సహకరించట్లేదని, కాంగ్రెస్ వాళ్లు తమ ఇంటి వైపు రావొద్దని డీఎస్ భార్య విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సోదరుడు అరవింద్పై సంజయ్ తీవ్ర ఆరోపణలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. డీఎస్ రాజీనామానా వ్యవహారం కాస్తా ఆయన కుమారుల పంచాయితీగా మారింది. అన్న సంజయ్ ఆరోపణలపై తమ్ముడు అరవింద్ ఇంకా స్పందించాల్సి ఉంది. మరోవైపు తన కుమారుడు సంజయ్ కాంగ్రెస్లోకి తిరిగి చేరిన సందర్బంగానే గాంధీభవన్ వెళ్లానని, కానీ తానూ పార్టీలో చేరినట్లు ప్రచారం చేశారని డీఎస్ లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు భావిస్తే ఈ లేఖను రాజీనామాగా భావించి ఆమోదించాలని కోరుతున్నట్లు తెలిపారు. చదవండి: చేరికల చిచ్చు.. ఒక్క రోజుకే కాంగ్రెస్కు డీఎస్ రాజీనామా.. అసలేమైంది? -
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత అరెస్ట్ ఖాయం
సైదాబాద్: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావటం ఖాయమని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ప్రజాగోస–బీజేపీ భరోసా పేరిట ఐఎస్సదన్ డివిజన్ వినయ్నగర్ కాలనీలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో ఆయన డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేతమధుకర్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆ రాష్ట ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియానే అరెస్ట్ అయ్యారని, అందులో ప్రమేయం ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కవిత కూడా తీహార్ జైలుకు వెళ్లడం ఖాయం అన్నారు. కల్వకుంట్ల కుటంబంతో స్నేహం చేసిన మంచోళ్లు కూడా భ్రష్టుపట్టి జైళ్ల పాలవుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరిగిన లక్షల కోట్ల రూపాయల కుంభకోణాల సొమ్ము కూడా బయటకు వచ్చే సమయం ఆసన్నమైందని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ భాగ్యనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు జంగం మధుకర్రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
టీడీపీతో పొత్తు ఉంటుందా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీడీపీతో బీజేపీ పొత్తుపై వస్తున్న ఊహాగానాలపై స్పష్టత ఇవ్వాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పార్టీ నాయకత్వాన్ని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో టీడీపీ–బీజేపీ పొత్తు అంశం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తోందని వారు జాతీయ నేతల దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిసింది. శామీర్పేటలోని ఓ రిస్టార్లో జరిగిన బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో విజయశాంతి, అర్వింద్లు ఈ విషయం ప్రస్తావించడం చర్చనీయాంశం అయింది. రాష్ట్రంలో ఇటీవల బల ప్రదర్శన చేయడం ద్వారా తన ఉనికిని చాటుకునేందుకు టీడీపీ ప్రయత్నించిన నేపథ్యంలో ఈ అంశం హాట్ టాపిగ్గా మారిందని వారు చెప్పినట్లు తెలిసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్, సంస్థాగత ఇన్చార్జి సునీల్ బన్సల్ సమక్షంలో.. విజయశాంతి ఈ విషయం లేవనెత్తారని, అర్వింద్ కూడా పొత్తులపై స్పష్టత ఇవ్వాలని కోరారని తెలిసింది. కాగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కారణంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నష్టపోయిన విషయం తనకు ప్రత్యక్షంగా తెలుసునని విజయశాంతి పేర్కొన్నట్టు సమాచారం. స్పందించని జాతీయ నాయకత్వం ఆకస్మికంగా పొత్తుల అంశం చర్చకు రావడంతో సమావేశంలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది. అయితే తెలంగాణలో టీడీపీతో ఎలాంటి పొత్తు ఉండదని బండి సంజయ్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని కార్యకర్తలకు కూడా తెలియజేయాలని ఆయన సూచించారు. వేదికపై జాతీయ నాయకులున్నా, పొత్తులపై వారు ఎలాంటి వ్యాఖ్యలూ చేయకపోయినా.. సంజయ్ మాత్రం కల్పించుకుని పొత్తు ప్రసక్తే లేదని చెప్పినట్లు సమాచారం. ఇదే విషయాన్ని గతంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ కూడా ప్రకటించిన సంగతి విదితమే. కాగా తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఇదివరకే నాయకత్వం స్పష్టం చేసిన విషయాన్ని సంజయ్ గుర్తు చేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
బీజేపీలో గ్రూపుల గోల..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా బీజేపీలో గ్రూపుల గోల వేడి పుట్టిస్తోంది. ధర్మపురి అర్వింద్ గత ఎన్నికల్లో కల్వకుంట్ల కవితను ఓడించి పార్లమెంటు సభ్యుడిగా వచ్చారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలు గతంలో కంటే మరింత స్పీడందుకున్నాయి. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే నానుడికి అనుగుణంగా పార్టీ కార్యకలాపాలు ఎంత మేరకు పెరుగుతున్నాయో, అదేవిధంగా గ్రూపులు సైతం ఏర్పడ్డాయి. జిల్లా కేంద్రమైన నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఎంపీ అర్వింద్ గ్రూపుగా ఉన్నారు. ధన్పాల్ సైతం పార్టీ తరపున అనేక కార్యక్రమాలు చేపట్టడంలో ముందంజలో ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో టిక్కెట్టు రేసులోనూ ముందున్నారు. అయితే ఇక్కడ ఎంపీకి వ్యతిరేకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే యెండల లక్షి్మనారాయణ ప్రత్యేక గ్రూపుగా ఉండగా, గత కొన్ని నెలల వరకు ఎంపీ వర్గీయుడిగా ఉన్న జిల్లా అధ్యక్షుడు బస్వా లక్షి్మనర్సయ్య తాజాగా యెండల గ్రూపులో చేరిపోయాడు. ఆర్మూర్ నియోజకవర్గం విషయానికి వస్తే సీనియర్ నాయకుడు లోక భూపతిరెడ్డి తటస్థంగా ఉండగా, రాష్ట్ర నాయకులు పల్లె గంగారెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్, నియోజకవర్గ నాయకుడు కంచెట్టి గంగాధర్ ఎంపీ వర్గంలో ఉన్నారు. ప్రొద్దుటూరి వినయ్రెడ్డి యెండల లక్షి్మనారాయణతో చేరారు. బాల్కొండ నియోజకవర్గంలో ఇన్చార్జి ఏలేటి మల్లికార్జున్రెడ్డి ఎంపీ వర్గంలో ఉండగా, రుయ్యాడి రాజేశ్వర్, పెద్దోళ్ల గంగారెడ్డి యెండలతో చేతులు కలిపారు. బోధన్ నియోజకవర్గంలో నాయకులు మేడపాటి ప్రకాష్రెడ్డి, వడ్డి మోహన్రెడ్డిలు ఎంపీ వర్గంలో ఉన్నారు. కాగా బోధన్ టిక్కెట్ కోసం యెండల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ కులాచారి దినేష్ ఎంపీ వర్గీయుడిగా ఉన్నారు. అయితే ఈ నియోజకవర్గానికి చెందిన ఓ జాతీయ పార్టీ నేత బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీ అరి్వంద్ ద్వారా రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. -
అర్వింద్ పద్ధతి మారకుంటే ప్రజలు ఊరుకోరు: దానం
బంజారాహిల్స్ (హైదరాబాద్): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను లక్ష్యంగా చేసుకుని ఎంపీ ధర్మపురి అర్వింద్ చేస్తున్న వ్యక్తిగత దాడిని ఎట్టి పరిస్థితిలో చూస్తూ ఊరుకునేది లేదని, పద్ధతి మార్చుకోకపోతే ప్రజల చేతిలో చావుదెబ్బతినాల్సి వస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు. శనివారం ఆయన కవితను కలసి సంఘీభావం తెలిపారు. అనంతరం మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ కలసి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ను ఉద్దేశించి బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్ మాటలు వింటే ప్రజల రక్తం మరిగిపోతోంద న్నారు. కాంగ్రెస్ పార్టీలో బీఫారమ్స్ అమ్ముకున్న చిల్లర వ్యక్తి అరవింద్ ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారన్నారు. -
ఎంపీ అర్వింద్ భాష మార్చుకోవాలి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ధర్మపురి అర్వింద్ ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఘోరమైన పదజాలం ఉపయోగిస్తున్నారని, భాష మార్చుకోవాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర హెచ్చరించారు. ఖమ్మంలోని తన స్వగృహంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రవిచంద్ర మాట్లాడారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న అర్వింద్ వంటి వారు ఇలాంటి భాషను ఉపయోగించడం సరికాదన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వివాదాన్ని మున్నూరుకాపులపై జరిగిన దాడిగా కొందరు సామాజిక మాధ్యమాల్లో అభివర్ణిస్తున్నారని... ఇది రెండు పార్టీల మధ్య గొడవే తప్ప, కులపరమైన దాడిగా భావించవద్దని మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడి హోదాలో కోరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా తెలంగాణ మాదిరి అభివృద్ధి లేదని, అందుకే ఆ పార్టీ నేతలు ఓర్వలేక సీఎం కేసీఆర్, ఆయన కుటుంబంపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ను ఎదుర్కోవడానికి ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని వద్దిరాజు ఆరోపించారు. -
పోలీస్ కనుసన్నల్లోనే దాడి
బంజారాహిల్స్ (హైదరాబాద్): ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసంపై టీఆర్ఎస్ కిరాయి గూండాలు దాడి చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పోలీసుల సహకారంతోనే ఈ దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. శనివారం సంజయ్ బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న అర్వింద్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కుటుంబం అహంకారాన్ని తెలంగాణ ప్రజలు చూశారన్నారు. దాడి చేయాల్సినంత కారణం ఏమిటో అంతుబట్టడం లేదన్నారు. ఎన్నికల సమయం దగ్గరకు వస్తుండటంతో సీఎం కేసీఆర్లో భయం మొదలైందన్నారు. హిందువులు అందరూ తల్లిగా భావించే తులసీ అమ్మవారి మీద, లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో మీద దాడి చేశారని ఆరోపించారు. తన దైవం మీద దాడి చేశారని అర్వింద్ తల్లి ఆందోళన వ్యక్తం చేశారన్నారు. పోలీసుల సహకారంతోనే టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ దాడి చేశారన్నారు. రాజకీయాల్లో విమర్శలకు ప్రతి విమర్శలు చేయాలే తప్ప భౌతిక దాడులు సరైంది కాదని ఆయన అన్నారు. దాడులు ఎవరు చేసినా మంచిది కాదని, తమ పార్టీ కార్యకర్తలకు కూడా ఇదే చెప్పామని స్పష్టంచేశారు. దాడి సమయంలో నిర్లక్ష్యంగా ఉన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిల్లలు ఆయన అదుపులో లేరన్నారు. దాడి ఘటనపై వెంటనే కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అర్వింద్ ఇంటిపై దాడి జరిగిన విషయాన్ని ఆరా తీశారన్నా రు. గతంలో జరిగిన దాడులనూ ఆయన దృష్టికి తీసుకెళ్లామని సంజయ్ చెప్పారు. పొర్లుదండాలు పెట్టి బీజేపీకిలోకి వస్తానని కేసీఆర్ బతిమిలాడినా తీసుకోలేదని, మరి ఆయన కూతురును ఎలా తీసుకుంటామని అన్నారు. ప్రజల కోసం, దేశం కోసం, తెలంగాణ కోసం తాము పని చేస్తామన్నారు. కేసీఆర్ మూల్యం చెల్లించుకోక తప్పదు: ఈటల కేసీఆర్ ప్రభుత్వం ప్రజల విశ్వా సం కోల్పోయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అర్వింద్ నివాసంపై జరిగిన దాడికి ముఖ్యమంత్రి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. శనివారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఆయన తల్లి విజయలక్ష్మిలను పరామర్శించిన అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం కూడా ప్రజాప్రతినిధుల ఇళ్లపై ఇంత నీచంగా దాడులకు పాల్పడలేదన్నారు. అర్వింద్ ఇంటిపై దాడి గురించి కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోం మంత్రి అమిత్షాకు లేఖ రాస్తామన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు రక్షణ కల్పించడంలో కేసీఆర్ సర్కారు పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల రక్తాన్ని కళ్లజూసి టీఆర్ఎస్ పార్టీని బతికించుకోవాలని ముఖ్యమంత్రి చూస్తున్నారని విమర్శించారు. -
బెంగాల్ ఫార్ములా అమలుకు బీజేపీ కుట్ర
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ సర్కస్ ఆడుతోందని, రాష్ట్రంలో బెంగాల్ ఫార్ములా అమలుకు బీజేపీ కుట్ర చేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. ఏదో ఒక విషయాన్ని వివాదాస్పదం చేసి తెలంగాణలో శాంతి భద్రతల సమస్య తెచ్చేందుకు బీజేపీ పన్నాగం పన్నిందన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, ఎమ్మెల్సీలు వి.గంగాధర్గౌడ్, రాజేశ్వర్రావుతో కలిసి శనివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ప్రశాంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్పై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నామని, ఆయన చేసిన వ్యాఖ్యలతో పోలిస్తే కవిత తిట్టింది చాలా తక్కువని వ్యాఖ్యానించారు. సంస్కారం లేకుండా రాజకీయాలకే కళంకంగా మారిన అర్వింద్ తన తీరు మార్చుకోవడం లేదని, ఆడబిడ్డను కేసీఆర్ అమ్ముకుంటున్నారని నీచ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కవితపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తే అభిమానులు సహిస్తారా అని మంత్రి ప్రశ్నించారు. మహిళా గవర్నర్ ఏం చేస్తున్నారు? కేసీఆర్ తన బిడ్డను అమ్ముకుంటున్నారని ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై మహిళా గవర్నర్ ఏం చేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాతే రాష్ట్రంలో రాజకీయాల స్థాయి దిగజారిందన్నారు. కేసీఆర్ ఫెయిల్యూర్ సీఎం అంటూ విమర్శలు చేస్తున్న బండి సంజయ్కి సక్సెస్, ఫెయిల్యూర్కు నడుమ తేడా తెలుసా అని ప్రశ్నించారు. మునుగోడు ఓటమి నుంచి బీజేపీ గుణపాఠం నేర్చుకోలేదన్నారు. అర్వింద్ ఇంట్లో మూడు పార్టీలకు చెందిన నేతలున్నారని, కాంగ్రెస్తో కుమ్మక్కు కావడం వల్లే ఆయన ఎంపీగా గెలుపొందారని ఆరోపించారు. అర్వింద్ భాషపై పౌర సమాజం, మీడియా కూడా స్పందించాలని మంత్రి వేముల కోరారు. బీజేపీ నేతల తిట్లతో పోలిస్తే అరవింద్ ఇంటిపై జరిగిన దాడి ఘటన చాలా చిన్నదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అభిప్రాయపడ్డారు. తెలంగాణలో బెంగాల్ తరహా కుట్రలను బీజేపీ అమలు చేయాలని చూస్తోందని ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ ఆరోపించారు. అర్వింద్ మొదటి నుంచి తప్పుడు మార్గంలో ఉన్నారని, కాంగ్రెస్లో బీ ఫారాలు అమ్ముకున్న చరిత్ర ఉందని ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు విమర్శించారు. -
‘కేసీఆర్ క్రోమో ఫోబియాతో ఇబ్బంది పడుతున్నారు’
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి తెలంగాణలో పొలిటికల్ హీట్ను పెంచింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. అరవింద్ కుటుంబ సభ్యులను బండి సంజయ్ పరామర్శించారు. అనంతరం, టీఆర్ఎస్పై సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకు దాడి చేశారో వారికే తెలియదు. ఇంటిలో పగులగొట్టిన ఫర్నీచర్ గురించి మాకు పెద్దగా బాధ లేదు. నా మీద దాడి చేసినా నేను పట్టించుకోను. కానీ.. హిందూ దేవుళ్ల మీద దాడి చేశారు. పవిత్రంగా కొలిచే తులసీ మాత, లక్ష్మీ అమ్మవారు, దుర్గా మాత మీద దాడులు చేశారు. కేసీఆర్ క్రోమో ఫోబియాతో ఇబ్బంది పడుతున్నారు. టైమ్ గడుస్తున్న కొద్దీ టెన్షన్కు గురవుతున్నారు. ఎంపీ అరవింద్ విమర్శ మాత్రమే చేశారు.. ఏదైనా బూతులు మాట్లాడారా?. దాడులు ఎవరు చేసినా మంచిది కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం అహంకారం ఏమిటో తెలంగాణ ప్రజలందరూ చూశారు. భవిష్యత్తు రోజుల్లో ప్రజలే టీఆర్ఎస్కు తగిన బుద్ధిచెబుతారు’ అని కామెంట్స్ చేశారు. -
ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి.. బీజేపీ నేతల తెలంగాణ భవన్ ముట్టడి
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడిని నిరసిస్తూ బీజేపీ నాయకులు తెలంగాణ భవన్ ముట్టడి చేసేందుకు బయలుదేరారు. అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకొని పలువురిని అరెస్ట్ చేశారు. ఇక తెలంగాణ భవన్ ముట్టడికి బీజేపీ నేతలు, కార్యకర్తలు సిద్ధమైన క్రమంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయం ముందు భారీగా పోలీసులు మోహరించారు. అలాగే నిజామాబాద్, ఆర్మూర్లో ఎంపీ అర్వింద్ నివాసాల వద్ద భద్రత ఏర్పాటు చేశారు. కాగా నిజామాబాద్ జిల్లా దిశా మీటింగ్ ఉన్న సమయంలో హైదరాబాద్లోని ఎంపీ అర్వింద్ ధర్మపురి నివాసంపై టీఆర్ఎస్ నేతలు దాడి చేసిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో ఆందోళనకు దిగారు. ఎంపీ నివాసంపై దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దాడి సమయంలో ఎంపీ అమ్మ ఇంట్లోనే ఉన్నారు. ప్రజల్లో పట్టు కోల్పోతున్నారనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. -
మా అమ్మపై దాడి చేసే హక్కు ఎవరిచ్చారు?.. అరవింద్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ నేతల దాడి నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం పీక్ స్టేజ్కు చేరుకుంది. ఈ క్రమంలో ఎంపీ అరవింద్.. ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. మా అమ్మను భయపెట్టారు. మహిళా స్టాఫ్ను రాళ్లతో కొట్టారు. మా అమ్మపై దాడి చేసే హక్కు ఎవరిచ్చారు?. ఇది దొరల పాలన అనుకుంటున్నారా?. నిజామాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తా.. కవిత పోటీ చేస్తారా?. రండి కొట్లాడదాం.. ఇదే ఫైనలా.. మళ్లీ మాట మారుస్తారా?. కేసీఆర్ కుటుంబానికి కుల అహంకారం ఎక్కువ. దమ్ముంటే 2024లో మళ్లీ పోటీ చేయ్. ఖర్గేకు కవిత ఫోన్ చేసిందో లేదో తేలాలి. అది నిజం కాబట్టే కవిత ఇంతలా రియాక్ట్ అయ్యారు. కవిత కుల అహంకారంతో మాట్లాడుతోంది. నీ మేనిఫెస్టో మొత్తం చీటింగే.. కేసీఆర్పై కేసు పెట్టుకో. పసుపు రైతులు మొత్తం బీజేపీతోనే ఉన్నారు. నాకు తెలిసింది మాట్లాడాను.. అందులో అనుచిత వ్యాఖ్యలు ఏమున్నాయి?. కవిత రాజకీయ జీవితం ముగింపునకు వచ్చింది. నాపై పోటీ చేయాలనుకుంటే స్వాగితిస్తాను. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అంత సీన్ కవితకు లేదు అంటూ సీరియస్ అయ్యారు. ఇక, అంతకుముందు.. ఈ దాడి ఘటనపై ఎంపీ అరవింద్.. ప్రధాని మోదీకి ట్వీట్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాలతోనే నా ఇంటిపై టీఆర్ఎస్ గుండాలు దాడి చేశారు. ఇంట్లో బీభత్సం సృష్టించి మా అమ్మను బెదిరించారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి నేపథ్యంలో కేంద్రమంత్రి ప్రహాద్ జోషి స్పందించారు. ఈ సందర్భంగా జోషి సీరియస్ అయ్యారు. కేసీఆర్, కేటీఆర్ నిరాశలో ఉన్నారు. అందుకే మా ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి చేయించారు అని ఫైరయ్యారు. కెసిఆర్, KTR, K.కవిత ల ఆదేశాలపై హైదరాబాద్ లోని నా ఇంటిపై దాడి చేసిన TRS గుండాలు. ఇంట్లో వస్తువులు పగలగొడుతూ, బీభత్సం సృష్టిస్తూ, మా అమ్మను బెదిరించారు! TRS goons attacked my residence and vandalised the house. They terrorised my mother & created ruckus.@PMOIndia @narendramodi pic.twitter.com/LwtzZU4rfg — Arvind Dharmapuri (@Arvindharmapuri) November 18, 2022 -
కవిత ఎంట్రీ.. డైలమాలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్!
నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ డైలమాలో పడ్డారా? తొలిసారి ఎంపీగా గెలిచిన ఆనందం కొనసాగుతుందా? ఇంతటితో ఆగిపోతుందా? ఇంతకీ ఆయన టెన్షన్కు కారణం ఏంటి? అసలు ఇందూరు రాజకీయాల్లో ఏం జరుగుతోంది? రాబోయే ఎన్నికల నాటికి పరిణామాలు ఎలా మారబోతున్నాయి? ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా, మాజీ మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో ఓ స్థాయిలో చక్రం తిప్పిన తండ్రి అండదండలు ఓపక్క.. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితనే ఓడించిన ఆత్మవిశ్వాసం మరోపక్క.. నిజామాబాద్ ఎంపీ అరవింద్కు మంచి ఇమేజ్ తెచ్చి పెట్టాయి. అయితే కొంత కాలం స్తబ్దుగా ఉన్న కల్వకుంట్ల కవిత మళ్లీ ఇందూర్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వడంతో... ధర్మపురి అరవింద్ లో డైలామా మొదలైంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎక్కువ శాతం అధికార టీఆర్ఎస్ పార్టీ వారే కాబట్టి... వారి అండదండలతో కవిత ఎమ్మెల్సీగా మళ్లీ నిజామాబాద్ రాజకీయాల్లో అడుగు పెట్టారు. దీంతో బీజేపి మళ్లీ ఆమెపై ముప్పేట దాడిని మొదలెట్టినా... కవిత మాత్రం ఇందూరు చుట్టే తన రాజకీయ జీవితాన్ని తిప్పుతుండటంతో... ఎంపీ అరవింద్లో ఒకింత టెన్షన్ మొదలైందా అన్న చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న ఎంపీలందరినీ.. ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపాలన్న యోచనలో బీజేపి అధిష్ఠానం ఉన్నట్టుగా రాష్ట్ర పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అరవింద్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి బరిలోకి దిగుతారన్న ప్రచారం మొదలైంది. అందుకు తగ్గట్టే ఆయన పెర్కిట్ లో ఇల్లు కూడా తీసుకుని...అక్కడి నుంచి కార్యకలాపాలు మొదలెట్టడం కూడా ఆ ప్రచారం నిజమే అనిపిస్తోంది. ఎన్ని ఆరోపణలున్నా.. కొంచెం గట్టి పిండమైన జీవన్ రెడ్డి... వాటన్నింటినీ చూసీచూడనట్టుగానే పోతూ... ఇంకోవైపు అరవింద్నూ అంతకంతకూ కౌంటర్ చేస్తుండటంతో... అరవింద్ ఇప్పుడు ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడమా? వద్దా అన్న మీమాంసలో పడ్డట్టుగా తెలుస్తోంది. ఫ్యూచర్ పాలిటిక్స్కు చిక్కు అరవింద్ మీమాంసను మరింత బలపర్చేలా... రానున్న ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఒక వేళ పార్లమెంట్కు మళ్లీ ఎన్నిక కావాలనుకుంటే నిజామాబాద్ లోక్సభ స్థానానికి లేదా అసెంబ్లీకి వెళ్లాలనుకుంటే ఆర్మూర్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తారంటూ ఇప్పటివరకు ఊహాగానాలు కొనసాగాయి. వచ్చే ఎన్నికల్లో కవిత నిజామాబాద్ నుంచి లోక్సభ సీటుకు పోటీ చేస్తే గనుక.. తనకు గత పార్లమెంట్ ఎన్నికల్లో దక్కిన ఆదరణ మళ్లీ దక్కుతుందో.. లేదోనన్న సందేహాలే ఇప్పుడు అరవింద్ ఫ్యూచర్ పాలిటిక్స్ కు చిక్కుగా మారాయి. అదే సమయంలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గంపైన కూడా అరవింద్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో క్యాడర్లో అస్పష్టత... అరవింద్ బరిలోకి దిగుతాడని ప్రచారం జరుగుతున్న నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఆశించే ఆశావహుల్లో నిస్తేజానికీ ఈ డైలమా కారణమవుతోందన్నది ఇప్పుడు ఇందూరు రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. బరిలోకి అన్న సంజయ్ నిజామాబాద్ అర్బన్ నుంచి డీఎస్ తన పెద్దకుమారుడు సంజయ్ను బరిలోకి దించాలని యోచిస్తున్న క్రమంలో... అక్కడి నుంచి అన్నకు పోటీగా దిగే పరిస్థితి అరవింద్ కు ఉండదు. పైగా తనకు ప్రధాన అనుచరుడైన ధన్ పాల్ సూర్యనారాయణ అక్కడి నుంచి టిక్కెట్ ఆశిస్తున్నాడు. ఇక గతంలో ఎమ్మెల్యేగా చేసిన ఎండల లక్ష్మీనారాయణ నుంచి అంత సహకారం అందే పరిస్థితి లేదు. ఇక రూరల్ నియోజకవర్గంలో నిల్చోవడమంటే... ఎదురుగా ఉన్నది బాజిరెడ్డి గోవర్ధన్. తన తండ్రికి ఇందూర్ పాలిటిక్స్ లో ఎంత పట్టుందో... జిల్లాలోని బాన్సువాడ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ వంటి నియోజకవర్గాల నుంచి గెల్చిన చరిత్ర బాజిరెడ్డికుంది. ఈ క్రమంలో ఆయన్ను తట్టుకోవడమూ అంత వీజీ కాదు. ఇక బాల్కొండలో ఇప్పటికైతే మంత్రి ప్రశాంత్ రెడ్డి హవా స్పష్టంగా కనిపిస్తున్న క్రమంలో... అరవింద్ అక్కడి నుంచి బరిలో ఉంటాడా అన్నదీ మళ్లీ డౌటే. అయితే ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి కూడా బీజేపి నుంచి బరిలో ఉండటానికి ఉత్సాహం చూపిస్తున్నా... అరవిందే అడ్డుపడుతున్నాడన్న ఒకింత ప్రచారమూ... ఆయన బాల్కొండపై కన్నేశాడా అనే అనుమానాలకు బలమిస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలనాటికి.... అరవింద్ నియోజకవర్గ దారేది...? అన్న చర్చ జిల్లాలో జరుగుతోంది. చదవండి: బీజేపీ ఎమ్మెల్యేకు ఝలక్ ఇచ్చిన గోమాత! -
మునావర్కు భారీ బందోబస్తు.. మరి నాకు ఎందుకివ్వరు?
కోరుట్ల: ‘మునావర్ షో ప్రోగ్రామ్కు ఐదు వందల మంది పోలీసుల బందోబస్తు పెడ్తరు.. నాకేమో ఇస్తలేరు. ఎర్దండి దగ్గర నాకు కావాలనే బందోబస్తు తక్కువ పెట్టారు. దీంతో కొంత మంది నా కారుపై రాళ్లు వేశారు. నా దగ్గర అన్ని సాక్ష్యాలున్నాయి. నేను కోరుట్ల వెళ్లాలంటే శాంతి భద్రతల సమస్య అంటున్నరు. నాకు ప్రొటెక్షన్ ఇవ్వ లేరా? మీరు ఎమ్మెల్యే చెప్పినట్లు చేస్తున్నరు. ఆయన చెబితే వచ్చారా..?’ అంటూ ఎంపీ అర్వింద్ పోలీసులపై మండిపడ్డారు. విశ్వబ్రహ్మణుల సమస్యలపై కోరుట్లలో సమావేశానికి హాజరవ్వడానికి ఎంపీ అర్వింద్ శుక్రవారం ఉదయం 11 గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరారు. సరిగ్గా జగిత్యాల జిల్లా సరిహద్దు కమ్మర్పల్లి గండి వద్దకు చేరుకోగానే ఎంపీ అర్వింద్ కాన్వాయ్ను మెట్పల్లి డీఎస్పీ రవీందర్రెడ్డి, కోరుట్ల, మెట్పల్లి సీఐలు రాజశేఖర్రాజు, శ్రీను, ఎస్సైలు అడ్డుకుని తిరిగివెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతల సమస్య కారణంగా తమకు సహకరించాలని కోరారు. అయితే, కావాలనే తన కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని పోలీసులపై ఎంపీ అర్వింద్ విమర్శలు చేశారు. ప్రతీసారి తన కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసుల తీరు సిగ్గుచేటని, తీరు మార్చుకోవాలని సూచించారు. -
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్పై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్పై సరూర్ నగర్ పోలీస్ స్టే కేసు నమోదైంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఎంపీ అర్వింద్ తెలంగాణ ప్రభుత్వంపై , సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ లీగల్ సెల్ కో కన్వీనర్, లాయర్ రవికుమార్ ఈనెల 17న సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వం, కేసీఆర్ ప్రతిష్టను కించపరిచే విదంగా పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేసిన ఎంపీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు లీగల్ ఓపీనియన్కు పంపారు. న్యాయ నిపుణుల సలహా మేరకు బుధవారం ధర్మపురి అరవింద్పై 504 , 505(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సరూర్ నగర్ ఇన్స్పెక్టర్ సీతారాం వెల్లడించారు. -
ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటి ముందు పసుపు కొమ్ములు పోసి..
పెర్కిట్ (ఆర్మూర్): ఎంపీగా గెలిచిన వెంటనే పసుపు బోర్డు తీసుకొస్తానని బాండు పేపరు రాసిచ్చి మోసం చేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తన పదవికి రాజీనామా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని చేపూర్, మాక్లూర్ మండలం రాం చంద్రపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఆదివారం పెర్కిట్లోని ఎంపీ నివాసం ఎదుట పసు పు కొమ్ములు పోసి ఆందోళనకు దిగారు. పోలీసులు ఎంపీ నివాసానికి చేరుకుని రైతులను అక్కడి నుంచి పంపించారు. కాగా, రైతుల ముసుగులో దౌర్జన్యాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ గుండాలపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అక్కడికి చేరుకున్న బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. -
ఆర్మూర్లో దాడి జరిగింది, కానీ.. గన్నారంలోనే జరగాల్సింది: ఎమ్మెల్యే
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిజామాబాద్లో టీఆర్ఎస్ నేతలలు హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ హెచ్చరించారు. నోటికెంత వస్తే అంత మాట్లాడితే సహించేది లేదన్నారు. బీజేపీ ఎంపీ అరవింద్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కాబట్టే ఆర్మూర్లో దాడి జరిగిందన్నారు. వాస్తవానికి గన్నారంలోనే జరగాల్సిందని, సీఎంతో పాటు మంత్రులను, ఎమ్మెల్యేలను తిడుతుంటే కొట్టడం కరెక్ట్ అని సమర్థించుకున్నారు. బీజేపీ నాయకులకు ఎదురు తిరగాలని, ఎక్కడికక్కడ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ దేశానికి ప్రధాని కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, అర్వింద్, రేవంత్ రెడ్డిలు తెలంగాణకు శనిలా మారారని విమర్శించారు. తమ ఆట మొదలైందని, కేసీఆర్ను విమర్శిస్తే వేటాడి వెంటాడుతామని హెచ్చరించారు. చదవండి: సీఎం కేసీఆర్ పుట్టినరోజు.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్ దేశమంతా కేసీఆర్ వైపు చూస్తోందని, దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరమని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా లు విషం కక్కుతున్నారని, దీనిపై తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కేసీఆర్ బర్త్ డే రోజు బీజేపీపై యుద్ధం ప్రకటిస్తున్నామని తెలిపారు. తెలంగాణ పథకాలు అమలు చేయాలంటూ బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అక్కడి ప్రజలు.. ఆ పార్టీల ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని ప్రస్తావించారు. చదవండి: మేడారం మహాజాతరలో అద్భుతం ఆవిష్కృతం -
ఎంపీ అర్వింద్కు లోక్సభ స్పీకర్ ఫోన్
సుభాష్నగర్ (నిజామాబాద్): నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై ఆర్మూర్లో టీఆర్ఎస్ కార్యకర్తలు ఇటీవల దాడి చేసిన ఘటనపై లోక్సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా శుక్రవారం నేరుగా ఫోన్ చేసి ఆయనను ఆరా తీశారు. దాడి ఎలా జరిగింది? నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వ్యవహరించిన తీరు గురించి అర్వింద్ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తనపై పోలీసుల సహకారంతో హత్యాయత్నానికి పాల్పడిందని ఎంపీ వివరించగా..వెంటనే ఢిల్లీకి రావాలని స్పీకర్ సూచించారు. దాడి ఘటనను బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం సీరియస్గా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. దాడి ఘటనపై రెండ్రోజుల్లో ఢిల్లీకి వెళ్లి స్పీకర్కు ఫిర్యాదు చేయనున్నట్లు అర్వింద్ తెలిపారు. -
సీఎంగా ఎన్నుకుంది గూండాయిజం చేయడానికా?
నల్లగొండ: ఎంపీగా తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ధర్మపురి అర్వింద్పై టీఆర్ఎస్ గూండాలు, కార్యకర్తలు రాళ్లతో దాడి చేయడం, బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నానికి పాల్పడడం దుర్మార్గమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. సీఎంగా కేసీఆర్ను ఎన్నుకున్నది గూండాయిజం చేయడానికా? పాలించడానికా? అని నిలదీశారు. సంజయ్ మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అర్వింద్పై దాడిని తీవ్రంగా ఖండించారు. దాడి గురించి నిజామాబాద్ పోలీస్ కమిషనర్కు, డీజీపీకి ఫోన్ చేసినా ఎత్తలేదని, డీజీపీకి తెలిసే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. అర్వింద్ సీఎం ఫామ్హౌస్కో, ప్రగతిభవన్కో పోలేదని, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తుంటే దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. అర్వింద్పై దాడిని కేంద్ర నాయకత్వానికి, పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఉద్యోగం రాక ముత్యాల సాగర్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది ప్రభుత్వ హత్యేనన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీఓను సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికి 40 మంది ఉపాధ్యాయ, ఉద్యోగులు చనిపోయినట్లు సంఘాలు తెలిపాయన్నారు. తెలంగాణకు నెంబర్వన్ ద్రోహి కేసీఆర్ అని సంజయ్ ఆరోపించారు. ఉద్యమ కాలంలో దొంగ దీక్షలు చేయడంతోపాటు పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటు సందర్భంగా ఓటింగ్కు హాజరు కాలేదని, కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ, పీఎఫ్ స్కామ్లకు పాల్పడ్డారని తెలిపారు. వాటిపై సీబీఐ విచారణ కూడా జరిగిందన్నారు. కేసీఆర్ పతనానికి కౌంట్డౌన్ మొదలైందని, ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని చెప్పారు. విలేకరుల సమావేశంలో బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, రాష్ట్ర నాయకులు మనోహర్రెడ్డి, రజని, చంద్రశేఖర్, శ్రీనివాస్గౌడ్, భరత్, ప్రేమేందర్రెడ్డి, చింతా సాంబమూర్తి పాల్గొన్నారు. -
పోలీసుల సహకారంతోనే దాడులు: అర్వింద్
సాక్షి, నిజామాబాద్: పోలీసులు దగ్గరుండి మరీ టీఆర్ఎస్ శ్రేణులతో దాడులు, హత్యాయత్నాలు చేయిస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. తన లోక్సభ నియోజకవర్గంలో తాను పర్యటించకుండా టీఆర్ఎస్ శ్రేణులకు పోలీసులు సహకరిస్తున్నారని మండిపడ్డారు. ఇస్సాపల్లిలో టీఆర్ఎస్ శ్రేణుల దాడి ఘటనపై ఎంపీ అర్వింద్ నిజామాబాద్ పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సుమారు 200 మంది తమపై రాడ్లు, కత్తులతో దాడి చేసి, చంపేందుకు ప్రయత్నించారని అందులో పేర్కొన్నారు. పలువురు బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలైనట్టు వివరించారు. తర్వాత అర్వింద్ మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ శ్రేణులు దాడులకు పాల్పడే అవకాశముందని ఒకరోజు ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చామని.. అయినా టీఆర్ఎస్ వాళ్లకు పోలీసులే సమాచారమిచ్చి దగ్గరుండి దాడులు చేయించారని ఆరోపించారు. పోలీసులు తమను దారి మళ్లించి, టీఆర్ఎస్ వాళ్లను పిలిచి దాడి చేయించారని విమర్శించారు. దాడి ఘటన వీడియోల్లో అన్నీ కనిపిస్తున్నాయని చెప్పారు. దీనిపై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి, లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఇటీవల మాక్లూర్ మండలంలో ‘సాక్షి’విలేకరిపై హత్యాయత్నం చేయించారని, ఇప్పుడు తనపైనా హత్యాయత్నం చేయించారని ఆరోపించారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హుందాగా లేకపోవడం వల్లే టీఆర్ఎస్ వాళ్లు ఇలా తయారయ్యారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో జీవన్రెడ్డిని 50 వేల ఓట్ల తేడాతో ఓడిస్తామని సవాల్ చేశారు. -
తండ్రి కాంగ్రెస్ లో.. తనయుడు బీజేపీలో..!!
-
ఎంపీ అర్వింద్ అడ్డగింత
ఇందల్వాయి(నిజామాబాద్ రూరల్): నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడానికి యత్నించాయి. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల పరిధిలోని గన్నారంలో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. గన్నారం గ్రామంలో నిర్మించి న పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటిక, సీసీ కెమెరాలను ప్రారంభించడానికి ఆదివారం ఎంపీ వచ్చారు. ధాన్యం కొనుగోళ్లు, పసుపు బోర్డు విషయంలో జిల్లా రైతులను మోసం చేస్తున్నా రని ఆరోపిస్తూ... గ్రామ ముఖద్వారం వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నా రు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొంది. ఎంపీ అర్వింద్ వాహనంతో పాటు బీజేపీ మండలాధ్యక్షుడి కారు స్వల్పం గా దెబ్బతిన్నాయి. పలువురు టీఆర్ఎస్ నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి. హోం గార్డు రూపకళకు కాలు విరిగింది. పోలీసులు ఆందోళన చేస్తున్నవారిని అడ్డుకుని ఎంపీ వాహనాన్ని ముందుకు పంపించారు. పల్లె ప్రకృతివనం, శ్మశాన వాటిక, సీసీ కెమెరాలను ప్రారంభించిన అనంతరం ఎంపీ అర్వింద్ మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని, రాష్ట్ర ప్రభుత్వమే అబద్ధాలు చెబుతోందని అన్నారు. పసుపు బోర్డుకు రూ.30 కోట్ల నిధులు కేటాయించడమే కాకుండా దిగుమతులు నిలిపి ఎగుమతులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు రౌడీ రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా బీజేపీ ఎదుగుదలను అడ్డుకోలేరన్నారు. -
ఓ కుటుంబ కథా చిత్రం..
-
అయ్యా కొడుకులు మత్తులో మునుగుతున్నారు
కమలాపూర్: ‘అయ్యా కొడుకులిద్దరూ మత్తులో మునుగుతున్నారు. ఈటల రాజేందర్ను పార్టీ నుంచి బయటకు పంపాక.. ఎంత తాగినా మనసుల పడుతలేదట, మందు ఎక్కుత లేదట’అని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లను తీ వ్రస్థాయిలో విమర్శించారు. గురువారం ఆయ న హనుమకొండ జిల్లా కమలాపూర్ మండ లం మర్రిపల్లి, మర్రిపల్లిగూడెం, జూజునూర్పల్లి, వంగపల్లి, పంగిడిపల్లి, లక్ష్మీపూర్ గ్రామా ల్లో మాజీ మంత్రి, బీజేపీ హుజూరాబాద్ అభ్యర్థి ఈటల రాజేందర్తో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాట్లాడుతూ కేసీఆర్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ సోయం బాపూరావు తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ కుటుంబ పాలనను విడిచిపెట్టే ప్రసక్తే లేదు: ఎంపీ అర్వింద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కంటే కూడా సిక్కిం ఎక్కువ అభివృద్ధిని సాధించిందని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. చిన్న రాష్ట్రమైనా తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతోందంటూ మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాము సాధిస్తున్న పురోగతితో దేశాన్ని నడుపుతున్నామని, ఎన్నో అంశాల్లో ఆదర్శంగా నిలుస్తామని చెబుతున్న టీఆర్ఎస్ నేతలు.. ఆదాయం కోసం ప్రభుత్వ భూములను ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీవెళ్లిన సీఎం కేసీఆర్ కేంద్రప్రభుత్వంలోని ముఖ్యశాఖల మంత్రులు, తమ పార్టీ పెద్దలను కలిసి వచ్చినా.. టీఆర్ఎస్ను, కేసీఆర్ కుటుంబ పాలనను బీజేపీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. బీజేపీతో టీఆర్ఎస్కు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధాలు బాగా ఉంటే పదేపదే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. చదవండి: ‘కోదండరాం బట్టలు చినిగిపోయేలా దాడి చేయడం దారుణం’ కోల్కతా కోర్టు తీర్పుతోనైనా స్పీకర్ కళ్లు తెరవాలి: దాసోజు సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పు స్పీకర్ వ్యవస్థకే చెంపపెట్టని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రావణ్ పేర్కొన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఇప్పటికైనా కళ్లు తెరచి ఫిరాయింపు నిరోధక చట్టానికి వ్యతిరేకంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని చెప్పారు. ఈ మేరకు మంగళవారం శ్రావణ్ ట్విట్టర్లో పోస్టు చేశారు. టీఎంసీ ఎమ్మెల్యే ముకుల్రాయ్ అనర్హత పిటిషన్పై అక్టోబర్ 7లోగా నిర్ణయం తీసుకోవాలని పశి్చమబెంగాల్ స్పీకర్కు కోల్కతా హైకోర్టు ఆదేశాలిచ్చిందని ఆయన వివరించారు. ఆ తీర్పును గౌరవించి రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అనర్హత పిటిషన్లపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. -
పుట్టిన రోజునాడే ప్రమాదం.. ఇంట్లో జారి పడిన డీఎస్
సాక్షి, నిజామాబాద్ అర్బన్ : రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ సోమవారం హైదరాబాద్లోని తన నివాసంలో జారిపడ్డారు. దీంతో అతని ఎడమ భుజం వద్ద ఎముక విరిగింది. ఆయన పుట్టిన రోజునాడే ఈ ప్రమాదం జరిగింది. ఇంట్లో పూజ చేసి బయటకు వచ్చే క్రమంలో జారి పడ్డారు. డీఎస్ ఆరోగ్యం బాగానే ఉందని, నాలుగు రోజుల తర్వాత సర్జరీ చేయనున్నట్లు ఈయన తనయుడు ఎంపీ అర్వింద్ ఫేస్బుక్ ద్వారా తెలిపారు. డీఎస్తో కలిసిన ఫొటోను షేర్ చేశారు. చదవండి: (ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్ పార్క్ ‘తెలంగాణలో..’) -
పెద్ద దుష్మన్ కాంగ్రెస్సే
నిర్మల్: దేశానికి, సమాజానికి పెద్ద దుష్మన్ కాంగ్రెస్ పార్టీయేనని, కులాలు మతాలుగా ప్రజలను వీడదీసిందని, 75 ఏళ్ల నుంచి కేన్సర్ వ్యాధిలా పీడిస్తోందని ఎంపీలు సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్రావు దుయ్యబట్టారు. రేవంత్రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని, కేసీఆర్ను మూడు నెలల్లోనే గద్దెదించవచ్చని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో హిందూవాహిని ఆధ్వర్యంలో శనివారం అఖండ భారత్ దివస్ సభ నిర్వహించారు. హిందూవాహిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షుడు రాజవర్ధన్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు హరిచంద్రరెడ్డి మాట్లాడుతూ.. భైంసా ఘటనల్లో ఒకవర్గం యువకులపైనే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని మండిపడ్డారు. 1970 నుంచి 2020 వరకు భైంసా అల్లర్లలో హిందువులే నష్టపోయారని చెప్పారు. కేసీఆర్వి చిల్లర రాజకీయాలు మనోడే మోసం చేస్తే వంద అడుగుల బొంద తీసి పాతిపెట్టాలని కాళోజీ చెప్పారని, ఇప్పుడు రాష్ట్రంలో భయంకర హిందువునని చెప్పుకొనే సీఎం ఉన్నా భైంసాలో హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. పనికిరాని కొడుకును సీఎం చేసేందుకు సీఎం కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఇంద్రవెల్లిలో ఆదివాసీలను చంపింది కాంగ్రెసేనని, అదే గడ్డకు వెళ్లి రేవంత్రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు. కొందరు ఐపీఎస్ అధికారులు యూనిఫాం లోపల గులాబీ కండువాలు వేసుకుని పనిచేస్తున్నారని, అలాంటి వారి లెక్క లు రాసిపెట్టి, తాము అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తామని హెచ్చరించారు. ఒవైసీ చేతిలో కారు స్టీరింగ్.. రాష్ట్రంలో పేరుకే టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తోందని, కారు స్టీరింగ్ మాత్రం ఒవైసీ చేతుల్లో ఉందని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. భైంసాలో 40 ఏళ్లుగా అధికార పార్టీతో కుమ్మక్కై ఎంఐఎం దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారిన పోలీసులు ఒక వర్గం యువతపైనే కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే రఘునందన్రావు మండిపడ్డారు. ఒవైసీ చేతిలో కారు స్టీరింగ్.. రాష్ట్రంలో పేరుకే టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తోందని, కారు స్టీరింగ్ మాత్రం ఒవైసీ చేతుల్లో ఉందని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. భైంసాలో 40 ఏళ్లుగా అధికార పార్టీతో కుమ్మక్కై ఎంఐఎం దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారిన పోలీసులు ఒక వర్గం యువతపైనే కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే రఘునందన్రావు మండిపడ్డారు. -
ఈటలపై అక్కసుతోనే కేసీఆర్ రాజకీయాలు: ఎంపీ అరవింద్
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రజలు ఆక్సిజన్, రెమ్డెసివిర్ ఇంజక్షన్లు, డాక్టర్ల కొరతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. ఈటలపై అవినీతి ఆరోపణలపై కేసీఆర్ కుంభకర్ణుడి నిద్ర లేచి.. విచారణకు ఆదేశించడం హాస్యాస్పదమన్నారు. అవినీతి ఆరోపణలు ఉన్న టీఆర్ఎస్ నేతలందరిపై సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి ఈటల గ్రాఫ్ క్రమంగా పెరుగుతోందనే అక్కసుతోనే ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. ఈటలపై కేసీఆర్ రాజకీయ ప్రతీకారం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మై హోం రామేశ్వరరావు అక్రమాలపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడంలేదని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఈటలకో న్యాయం? జూపల్లికో న్యాయమా అంటూ ఎంపీ ప్రశ్నించారు. పేద ప్రజల భూదాన్ భూముల్లో ఫ్యాక్టరీలు, అటవీ భూముల్లో మైనింగ్లపై కేంద్రం మూడు సార్లు నోటీసులు ఇచ్చినా ఎందుకు స్పందించడం లేదంటూ ఎంపీ అరవింద్ నిలదీశారు. చదవండి: ఈటలకు భారీ షాక్.. వైద్యారోగ్య శాఖ నుంచి తొలగింపు పక్కా ప్లాన్ ప్రకారమే నాపై కుట్ర: ఈటల రాజేందర్ -
తమాషా చేస్తున్నారా.. నన్ను ఆపడానికి మీరెవరు?
సాక్షి, బంజారాహిల్స్: ‘నన్ను ఆపడానికి మీరెవరంటూ’ ఎంపీ ధర్మపురి అరవింద్ పోలీసులతో వాగ్వాదానికి దిగిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాను భైంసాకు వెళ్తున్నట్లు సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ట్వీట్ చేశారు. దీంతో అప్రమత్తమైన బంజారాహిల్స్ పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అరవింద్ను అడ్డుకునేందుకు ఇంటి వద్దకు వెళ్లారు. అయితే అప్పటికే ఆయన వెళ్లిపోయినట్లు తెలియడంతో బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ ఆర్. కళింగరావు, ఎస్ఐలు బాలరాజు, కె.ఉదయ్తో పాటు పోలీసులు పెట్రోకార్లలో ఆయనను వెంబడించారు. బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని పార్క్హయత్ హోటల్ ముందు నుంచి వెళ్తున్న ధర్మపురి అరవింద్ వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన పోలీస్ పెట్రోకార్లు రోడ్డుకు అడ్డంగా నిలిపి అడ్డుకున్నారు. దీంతో కారులో నుంచి దిగిన అరవింద్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను ఆపడానికి మీరెవరంటూ పోలీసులను నిలదీయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాను నిజామాబాద్ వెళుతుంటే ఎందుకు ఆపుతున్నారంటూ ప్రశ్నించారు. హిందువులను నాశనం చేయాలనుకున్నారా.. తమాషా చేస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతో సహకరించాలని ఇన్స్పెక్టర్ విజ్ఞప్తి చేసినా వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. నిజామాబాద్ వెళ్తుంటే వద్దని చెప్పేందుకు ఆర్డర్ ఏదంటూ నిలదీశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అరెస్ట్ చేసే అధికారం తమకు ఉందని పోలీసులు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చదవండి: నల్లధనం తేలేదు.. నల్ల కుబేరులను దేశం దాటించారు 15 నుంచి తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ -
ఫామ్హౌజ్లలో ఉన్నా వదిలేది లేదు: బండి సంజయ్
సాక్షి, కామారెడ్డి : రైతులకు సన్న వడ్ల రకాలు వేయాలని చెప్పిన సీఎం కేసీఆర్ తన ఫామ్హౌస్లో దొడ్డు రకాలు వేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. బాన్సువాడలో బీజేపీ ఏర్పాటు చేసిన సమావేశంలో బండి సంజయ ప్రసంగించారు. ఈ మేరకు పీఎన్బీ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ లాగా దొంగలు ఎక్కడున్న వదిలేది లేదని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణలో ఫామ్హౌజ్లలో ఉన్నా వదిలేది లేదని పరోక్షంగా సీఎం కేసీఆర్ను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ నాయకులు గ్రామల్లోకి వస్తే సీఎం కేసీఆర్ నిరుద్యోగ భృతి ఏదని నిలదీయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ఇస్తున్న నిధులను టీఆర్ఎస్ సర్కార్ ఫొటోలూ పేర్లు మార్చి మోసం చేస్తోందని ఆరోపించారు. బీజేపీని మతతత్వ పార్టీగా టీఆర్ఎస్ చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ ఏ మతానికి వర్గానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. 2023 లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. రామరాజ్యం రావాలంటే రామ భక్తులకు అవకాశం ఇవ్వాలని కోరారు. బీజేపీ కార్యకర్తలను బెదిరించి కేసులు పెడితే ఊరుకోమని హెచ్చరించారు. బాన్సువాడ వెనుబడిన నియోజకవర్గంగా మిగిలిపోయిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కేసీఆర్ బంగారు తెలంగాణలో బాన్సువాడ ఉందో లేదో తెలియదన్నారు. బాన్సువాడను ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్కు అమ్మేశాడని విమర్శించారు. కారు రథసారథి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ చేతుల్లో ఉందని తెలిపారు. కేసీఆర్ స్టీరింగ్ ఎటు తిప్పుమంటే అటు తిప్పుతారని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
సీఎం పుట్టిన రోజు ఖర్చు రూ.500 కోట్లా?
సాక్షి, ధర్పల్లి: సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని రూ.500 కోట్ల ఖర్చుతో కోటి మొక్కలు నాటామని చెప్పుకుంటున్నారని, అయితే అందులో రూ.450 కోట్లను సీఎం కేసీఆరే బకాసురుడి మాదిరిగా మింగారని బీజేపీ ఎంపీ అర్వింద్ ఆరోపించారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో బీజేపీ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. రూ.500 కోట్లతో ఎన్ఆర్ఐ సెల్ పెడతామని ఇచ్చిన హామీని కేసీఆర్ విస్మరించారన్నారు. ఇప్పుడు పుట్టినరోజు ఖర్చుతోనే ఎన్ఆర్ఐ సెల్ పెట్టొచ్చుకదా అని అన్నారు. పుట్టినరోజుకు అంత ఖర్చు ఎలా పెడతారని నిలదీశారు. సీఎం పుట్టిన రోజున కేటీఆర్ అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమై, దుబాయి వరకు వెళ్లారని, పరువు పోతుందని కేసీఆర్ తిరిగి వెనక్కి పిలిపించి పరువు కాపాడుకున్నారని అన్నారు. -
మేయర్ ఎన్నిక: ‘ఓవైసీ, కేసీఆర్ చీకటి ఒప్పందం’
సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్ మేయర్ ఎన్నికతో అసదుద్దిన్ ఓవైసీ, సీఎం కేసీఆర్ చీకటి ఒప్పందం బయటపడిందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ దర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలో ఎంఐఎం పోటీ చేయకుండా అధికార టీఆర్ఎస్కు మద్దతు ప్రటించిన విషయం తెలిసిందే. మేయర్ అభ్యర్థిని బరిలో నిలపకుండా టీఆర్ఎస్ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి విజయానికి సపొర్టు తెలిపింది. దీంతో మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. సందర్భంగా ఢిల్లీలో ఎంపీ గురువారం మాట్లాడుతూ.. రాబోయే ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు తథ్యమని అన్నారు. అదే విధంగా గిరిజన మహిళల మీద కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ అర్వింద్ ఖండించారు. మీటింగ్కు వచ్చిన మహిళలను కుక్కలతో పోలుస్తావా అని కేసీఆర్పై ధ్వజమెత్తారు. కేసీఆర్ అబద్ధాలు చెప్పడు అంటే అది పెద్ద జోక్ అని ఎంపీ అర్వింద్ అన్నారు. కేసీఆర్ పెద్ద అవినీతి పుట్ట అని పేర్కొన్నారు. ప్రతి ఊరికి అంతా ఇస్తా ఇంతా ఇస్తా అనడం అబద్దమని, నాగార్జునసాగర్ ఎన్నికల్లో కేసీఆర్కు ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. అసెంబ్లీలో దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి మూడు గుంటలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. చదవండి:వారిది అక్రమ సంబంధం: మేయర్ ఎన్నికపై బండి సంజయ్ -
సీఎంగా కేసీఆర్ను తొలగించాలంటూ గవర్నర్కు ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ: సీఎం పదవిని కాలి చెప్పుతో పోల్చిన కేసీఆర్ను గవర్నర్ తక్షణం పదవి నుండి తొలగించాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసైకు ఆయన సోమవారం లేఖ రాశారు. టీఆర్ఎస్ పార్టీలో సీఎం కేసీఆర్పై విశ్వాసం సన్నగిల్లిందని, కేసీఆర్ కుటుంబంపై ఎమ్మెల్యేల్లో నమ్మకం పోయిన కారణంగానే ముఖ్యమంత్రి మార్పుపై చర్చ జరుగుతోందని అరవింద్ పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీ విజయ్చౌక్లో అరవింద్ మీడియాతో మాట్లాడారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సమావేశం గులాబీ డ్రామాలకు తెరదించిందని ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వరుసగా ఎదురవుతున్న అపజయాలతో పార్టీలో వ్యతిరేక గళం వినిపిస్తుండటంతో, ముఖ్యమంత్రి అభద్రతాభావంతో ఉన్నారని అందుకే ఎమ్మెల్యేలపై బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఏ హక్కుతో శాసనసభ్యులను బెదిరిస్తున్నారని అరవింద్ ప్రశ్నించారు. కేసీఆర్పై చర్యలు తీసుకోవాలి గవర్నర్కు ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవిని ఉద్దేశించి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపి రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి టి.జీవన్రెడ్డి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కోరారు. ఈ మేరకు గవర్నర్కు సోమవారం ఆయన లేఖ రాశారు. ముఖ్యమంత్రి పదవి తన ఎడమకాలి చెప్పుతో సమానమని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు పత్రికల్లో వచ్చిందని జీవన్రెడ్డి తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అటు రాజ్యాంగాన్ని, ఇటు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకాన్ని అవమానించడమేనన్నారు. ఈ లేఖ ప్రతిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కు కూడా పంపినట్టు సీఎల్పీ వర్గాలు వెల్లడించాయి. -
కేసీఆర్ కాళ్లు బరాబర్ మొక్కుతా: మంత్రి
సాక్షి, హైదరాబాద్ : తండ్రి వయసున్న సీఎం కేసీఆర్పై బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ధ్వజమెత్తారు. బండి సంజయ్, ఎంపీ అర్వింద్లపై మండిపడ్డ మంత్రి.. వీరిద్దరూ తమ పరిధి దాటి మాట్లాడొద్దని హెచ్చరించారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం పని తీరుపై సంజయ్, అర్వింద్ ఎప్పుడూ తప్పుడు ప్రచారాలే చేస్తున్నారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో తొమ్మిది కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనల ప్రారభోత్సవ కార్యక్రమాల్లో శుక్రవారం మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 2016 రూపాయల పెన్షన్లో కేంద్రంలోని బీజేపీ రెండువందలకు మించి ఒక్కరూపాయి ఎక్కువ ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. ఎక్కువ ఇస్తున్నట్లు నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, లేదంటే ఎంపీ పదవికి అరవింద్ రాజీనామా చేస్తారా అని సవాలు విసిరారు. చదవండి: రైతు పిల్లలను ఎంకరేజ్ చేయాలి: హరీశ్ రావు గృహ నిర్మాణాల కోసం కేసీఆర్ ప్రభుత్వం 4 లక్షల 32 వేలు ఇస్తుంటే కేంద్రం ఇచ్చేది కేవలం 72 వేలు మాత్రమే అని చెప్పుకొచ్చారు. కల్యాణ లక్ష్మీ డబ్బులలో ఒక్క రూపాయి కుడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం లేదని స్పష్టం చేశారు. సీఎంఆర్ఎఫ్ లాగా పీఎం ఆర్ఎఫ్ కూడా ఉంటుందని అందులోంచి పేదల హాస్పిటల్ ఖర్చులకు సహాయం అందించాలని డిమాండ్ చేశారు. నిజంగా తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉన్నా, పౌరుషం ఉన్నా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పించి, కేంద్రం నుంచి నిధులు తెప్పించాలని డిమాండ్ చేశారు. అలాగే కన్న కొడుకులాగా చూసుకుంటాడు కాబట్టే తండ్రి సమానమైన కేసీఆర్ కాళ్లు బరాబర్ మొక్కుతానని మంత్రి పేర్కొన్నారు. ఒక్కసారి కాదు అనేక సార్లు మొక్కుతా అని చెప్పుకొచ్చారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడాలే తప్ప, సంస్కార హీనులుగా మాట్లాడొద్దని బండి సంజయ్, ఎంపీ అర్వింద్లకు సూచించారు. -
పసుపు రైతు చుట్టే పాలి‘ట్రిక్స్’
అన్ని పార్టీలు ఈ అంశాన్ని రాజకీయ లబ్ధికే వాడుకుంటున్నాయి. ఫలితంగా ఏళ్లు గడుస్తున్నా పసుపు రైతుకు న్యాయం జరగడం లేదు. గిట్టుబాటు ధర దక్కడం లేదు. ‘మద్దతు’ కోసం అన్నదాతలు ఏటా ఆందోళనలు చేస్తూనే ఉన్నా వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించట్లేదు. పసుపు సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో మరో ఉద్యమానికి రైతాంగం తెర తీస్తోంది. దీన్ని అవకాశంగా వాడుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుండడం ఆసక్తికరంగా మారింది. సాక్షి, నిజామాబాద్: పసుపు రైతులు మళ్లీ దగా పడుతున్నారు. ఈసారి కూడా సరైన మద్దతు ధర లేక ఆందోళన చెందుతున్నారు. రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టి తొమ్మిది నెలలు కష్టపడి పంట పండిస్తే గిట్టుబాటు ధర రావడం లేదు. కనీసం పెట్టుబడి కూడా తిరిగి రావట్లేదు. మరో పక్షం రోజుల్లో పసుపు సీజను ఊపందుకోనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పారీ్టలు పసుపు రైతుల సమస్యలపై దృష్టి సారించాయి. పసుపుబోర్డు, కనీస మద్దతు ధర విషయంలో ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టేందుకు అన్ని పక్షాలు ప్రయత్నిస్తుండటం ఆసక్తికరంగా మారింది. బీజేపీ బాండ్పేపర్పై టీఆర్ఎస్.. పసుపుబోర్డుపై ఎన్నికల్లో ఇచ్చిన హామీని బీజేపీ విస్మరించిందని టీఆర్ఎస్ మండిపడుతోంది. పసుపుబోర్డు విషయంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ రాసిచ్చిన బాండ్ పేపర్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు తమ ప్రసంగాల్లో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ఎంపీ అర్వింద్ విఫలమయ్యారని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు వెంటనే పసుపుబోర్డు ప్రకటించాలని కోరుతున్నారు. రాష్ట్ర సర్కారు పైకి నెట్టేస్తున్న బీజేపీ పసుపునకు మద్దతు ధర విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపడం లేదని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ ఇప్పిస్తే మద్దతు ధర విషయమై కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఒప్పిస్తామని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్చుగ్ ప్రకటించారు. మరోవైపు, పసుపుబోర్డుకు మించే స్పైసిస్బోర్డు రీజనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని, దీని ద్వారా రైతులకు లబ్ధి చేకూరుతుందని ఎంపీ ధర్మపురి అర్వింద్ చెబుతున్నారు. ఎట్టకేలకు స్పందించిన కాంగ్రెస్ పసుపు రైతుల సమస్యలపై ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. ఇప్పటి వరకు పసుపు రైతుల సమస్యలను పెద్దగా పట్టించుకోని ఆ పార్టీ.. ఇప్పుడు పసుపునకు కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఈ నెల 30న ఆర్మూర్లో ఒకరోజు దీక్ష చేపడుతున్నట్లు డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి ప్రకటించారు. ఈ దీక్షను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. -
బీజేపీ నేతలపై జీవన్రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీ నేతలు స్టువర్ట్ పురం దొంగలు.. వారంతా గాడ్సే వారసులంటూ టీఆర్ఎస్ ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘బండి సంజయ్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావ్.. మా నేతలంతా కలిసి తిడితే నువ్వు ఏ గ్రామంలో తిరగలేవు. మా సీఎం ఆదేశిస్తే.. మేము తిట్టడం స్టార్ట్ చేస్తే నువ్వు తట్టుకోలేవు. బాండ్ పేపర్ మీద పసుపు బోర్డు గురించి రాసిచ్చిన ధర్మపురి అరవింద్.. ఇప్పటికి తీసుకురాలేదు. కిషన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా హైదరాబాద్కి తీసుకురాలేదు’ అన్నారు. (చదవండి: 'కూకట్పల్లిలో బండి సంజయ్కు వ్యాక్సిన్ వేశా') ‘వలస కార్మికులను ప్రధాని నరేంద్ర మోదీ ఫుట్ బాల్ ఆడుకున్నారు. నల్లధనం తీసుకొస్తా అని చెప్పి ఇప్పటికి తేలేదు. గుజరాత్ వాళ్లకు మాత్రమే పదవులు ఇస్తారు. దేశ దొంగలు మొత్తం గుజరాత్ నుంచే ఉన్నారు. మోదీ ఒంటి మీద ఉన్న వస్తువులు, కార్లు అన్ని విదేశాలవే. కానీ ఆయన మాత్రం మేక్ ఇన్ ఇండియా అంటారు. రైతులతో పెట్టుకున్నోడు ఈ దేశంలో ఎవడు బాగు పడలేదు. తరుణ్ చుగ్ నీ రాష్ట్ర రైతుల సంగతి చూసుకో. మేము దంచుడు స్టార్ట్ చేస్తే అరవింద్ బోధన్ నుంచి కోరుట్ల పోలేడు.. బండి సంజయ్ కరీంనగర్ నుంచి హైదరాబాద్కి రాలేడు’ అంటూ జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ నేటితరం గాంధీ అని కొనియాడారు. -
టీఆర్ఎస్కు షాక్!
డిచ్పల్లి: అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో ‘కారు’ దిగి, కాషాయం గూటికి చేరారు. డిచ్పల్లి ఎంపీపీ సహా పది మంది సర్పంచ్లు, ఆరుగురు ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, ఇతర నాయకులు పెద్ద సంఖ్యలో ఆదివారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా మాజీ జెడ్పీటీసీ కులాచారి దినేశ్కుమార్ నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. డిచ్పల్లి ఎంపీపీ గద్దె భూమన్న, వైస్ ఎంపీపీ శ్యాంరావుతో పాటు పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, పార్టీ నాయకులు శనివారం టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసి, బీజేపీలో చేరేందుకు ఢిల్లీ వెళ్లారు. అయితే, ఆ పార్టీ నాయకుల సూచన మేరకు ఆదివారం హైదరాబాద్కు చేరుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఇక డిచ్పల్లి మండలంలో మొత్తం 17 మంది ఎంపీటీసీలు ఉండగా, ఇందులో ఎంపీపీ సహా ఏడుగురు ప్రస్తుతం కాషాయ గూటికి చేరారు. త్వరలోనే మిగతా వారు కూడా వస్తారని వారు చెబుతున్నారు. (చదవండి: కేటీఆర్ సమర్థుడైతే.. కేసీఆర్ అసమర్థుడా?) బీజేపీతోనే అభివృద్ధి.. ఈ సందర్భంగా కులాచారి దినేశ్కుమార్, ఎంపీపీ గద్దె భూమన్న మాట్లాడుతూ.. రాబోయే కాలంలో రూరల్ నియోజకవర్గంలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. బీజేపీలో చేరిన వారిలో సర్పంచులు కులాచారి సతీశ్కుమార్, శివారెడ్డి, రూప సతీశ్రెడ్డి, వినోద సదానంద్, బసునూరి ఆనంద సిద్దిరాములు, ఖతిజ యూసుఫ్, ప్రమీల గంగారాం, బి.నర్సయ్య, లత నర్సింగ్రావు, విజయ శశాంక్రెడ్డి, ఎంపీటీసీలు దండుగుల సాయిలు, బుక్యానాయక్, ఎంబడి సంతోషం, మంజుల గణేశ్, మానస సాయి, సౌమ్య సుదీర్తో పాటు ఉప సర్పంచులు, పార్టీ నాయకులున్నారు. కాగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చి, అనతి కాలంలోనే జిల్లా స్థాయి నేతగా ఎదిగారు. 2014 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్లో చేరారు. రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్య అనుచరుడిగా పేరు తెచ్చుకున్న దినేశ్కుమార్.. తన అనుచరులైన ఎంపీపీ, వైఎస్ ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీలతో కలిసి బీజేపీలో చేరడం అధికార పార్టీకి షాక్ తగిలినట్లయింది. -
నీ స్థాయేంటో తెలుసుకుని మాట్లాడు
సాక్షి, కరీంనగర్: భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ మీద ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఆయన చేస్తున్న ఆరోపణలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. సంస్కార హీనంగా మాట్లాడుతున్న బండి సంజయ్.. ఆయన స్థాయేంటో తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. నీ పదవి కూడా కేసీఆర్ భిక్షే అని విమర్శించారు. ప్రజలు నిన్ను కరీంనగర్ ఎంపీగా గెలిపిస్తే నీ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశావని నిలదీశారు. మంగళవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీ నిధులను ఢిల్లీలోనే ఆపించే చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని సంజయ్ను నిందించారు. దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తెప్పించేందుకు ప్రయత్నిస్తే ప్రజలు హర్షిస్తారని వ్యాఖ్యానించారు. మేమూ నీలాగా చిల్లరగా మాట్లాడగలం కానీ మాకు సంస్కారం అడ్డొస్తోందన్నారు. ఇప్పుడైనా నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. లేదంటే అంతే ధీటుగా సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. (చదవండి: కేసీఆర్ శేష జీవితం చర్లపల్లి జైలులోనే) నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై కూడా బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. పసుపు బోర్డు తెప్పిస్తానన్న ఎంపీ.. దాని గురించి తప్ప అన్నింటి మీదా మాట్లాడుతారని వ్యంగ్యాస్స్త్రాలు సంధించారు. ముందు నీ పార్లమెంట్ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చి తర్వాత రాష్ట్ర రాజకీయాలు మాట్లాడమని హితవు పలికారు. ఇక బాండు పేపర్ మీద రాసిచ్చిన వాగ్ధానం ఏమైందని సూటిగా ప్రశ్నించారు. మా మీద విమర్శలు చేసే ముందు ఈ హామీలను ఏం చేశారో సమాధానం చెప్పాలని సవాలు విసిరారు. (చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యాఖ్యలు హాస్యాస్పదం ) -
ఎంపీ అరవింద్పై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై కేసు నమోదైంది. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ సమీపంలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలను చించివేసిన ఘటనకు సంబంధించి ఆయనపై 504, 506, 427 సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీఆర్ఎస్ లీగల్ సెల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంపీ అరవింద్తో పాటు కార్యకర్తలపైనా కేసు నమోదు అయింది. మార్పుకు నాంది పలకండి.. సీఎం కేసీఆర్ ఫాంహౌస్లో ఉంటూ పాలన సాగిస్తున్నారని ఎంపీ అరవింద్ దుయ్యబట్టారు. బీజేపీ అభ్యర్థి విజయదుర్గ సందీప్ యాదవ్కు మద్దతుగా ఆయన నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికలతో మూతపడటం ఖాయమన్నారు. కరీంనగర్, నిజామాబాద్, దుబ్బాక ఎన్నికల్లో ఎలా నిజాయితీకి ఓటు వేశారో అలానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బీజేపీకి ఓటువేసి మార్పుకు నాంది పలకాలని ఎంపీ అరవింద్ కోరారు. -
రైతుల పాలిట వరం
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు కష్టాల నుంచి విముక్తి కలిగించి, రానున్న కాలంలో రైతే రాజు అనేలా వ్యవసాయాన్ని తీర్చిదిద్దుతాయని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఈ బిల్లులు రైతుకు నిజమైన స్వాతంత్య్రం తెచ్చాయన్నారు. వీటితో తన అక్రమ ఆదాయానికి కోత పడుతుందనే సీఎం కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఈ బిల్లులను తెస్తామని మేని ఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు రభస చేస్తోందని మండిపడ్డారు. సహచర ఎంపీ సోయం బాపూరావుతో కలసి సోమవారం ఢిల్లీలో విలేకరులతో అరవింద్ మాట్లాడారు. పంట అమ్మిన రోజే రైతు చేతికి సొమ్ము.. ‘స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయిన కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొత్త చట్టాల ద్వారా రైతులు తమ పంటను, తమకు నచ్చిన మార్కెట్లో ఎక్కడ ఎక్కువ ధర వస్తే అక్కడ అమ్ము కోవచ్చు. రవాణా ఖర్చుల భారం వారిపై పడదు. పంట నాణ్యత తనిఖీ బాధ్యత వ్యాపారిదే. రైతుకు రావాల్సిన సొమ్ము కూడా పంట అమ్మిన రోజే అతని ఖాతాలో చేరుతుంది. ప్రస్తుతం మార్కెట్ యార్డుల్లో అమ్మిన పంటకు రావాల్సిన సొమ్ము రైతుకు 15–20 రోజుల తర్వాత చేతికందుతోంది. వెంటనే డబ్బు కావాలంటే 2 శాతం వడ్డీ కట్టుకుని చెల్లిస్తున్నారు. కొత్త చట్టాలతో రైతు.. ఏజెంటుకు 2 శాతం కమీషన్, మార్కెట్ యార్డుకు 1 శాతం ఫీజు, 2 శాతం వడ్డీ చెల్లించడం తప్పుతాయి. దానితో రైతుకు కనీసం 5 శాతం డబ్బు ఆదా అవుతుంది’ అని అరవింద్ వివరించారు. -
‘రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారు’
సాక్షి, జగిత్యాల: రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పులపాలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. సోమవారం ఆయన జగిత్యాల రూరల్లోని చల్గల్, పోరండ్ల పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో వరి ఎక్కువ పండుతుందని చెబుతున్నారని.. ఇదేం కొత్త కాదని.. ఆయన ముఖ్యమంత్రి పదవిలో లేనప్పుడు కూడా అంతే పండిందని వ్యాఖ్యానించారు. ఇందులో కేసీఆర్ చేసిందేమిలేదని రైతులు కష్టపడి పండిస్తున్నారని తెలిపారు. కేంద్రం నుంచి ఎలాంటి పరిమితులు లేవని.. ఎన్ని మెట్రిక్ టన్నులైన ఎఫ్సీఐ కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాయకులు రైతులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు పండించిన ప్రతి వడ్లగింజని కేంద్రం కొనుగోలు చేసిందని చెప్పారు. తెలంగాణలోనే ప్రోక్యూర్మెంట్ అవుతుందని సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. గత ఏడాది ఒక్క పంజాబ్లోనే కోటి 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని భారత ఆహార సంస్థ( ఎఫ్సీఐ) కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. కరోనా సమయంలో రవాణా సౌకర్యం తక్కువ ఉందని, హమాలి కొరత ఉందని అన్నదాతల పొట్ట కొట్టడం బాధాకరమన్నారు. వలస కూలీల భోజన సౌకర్యం కోసం కేంద్రం రూ.599 కోట్లు మంజూరు చేసిందని..అది కూడా అమలు చేయడంలేదని.. కేవలం కార్డు లేనివారికి రూ.500 ఇచ్చి చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. వలస కూలీల కోసం ఇచ్చిన నిధులు, కోవిడ్ ఆసుపత్రుల అభివృద్ధి కోసం ఇచ్చిన 15 వేల కోట్ల నిధులు నుంచి రూ.1500లను పంచుతున్నారని మండిపడ్డారు. వలస కూలీలను స్వస్థలాలకు చేర్చడానికి ట్రైన్ సదుపాయం కోసం కేంద్రం 85 శాతం భరిస్తే.. రాష్ట్ర ప్రభుతాన్ని 15 శాతం భరించమంటే ఇబ్బంది పడుతుందని ఆయన విమర్శించారు. -
‘రూ.599 కోట్లలో 10 శాతం కుడా ఖర్చు చేయలేదు’
సాక్షి, నిజామాబాద్ : ధాన్యం కొనుగోళ్లలో రైతు సమస్యలపై గురువారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో బీజేపీ ఎంపీ దర్మపురి అర్వింద్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. కడ్తా పేరుతో 3 నుండి 5కిలోల వరకు తరుగు తీస్తున్నారని, దీని వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాల వలస కార్మికుల కోసం కేంద్రం ఇచ్చిన రూ. 599 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం కుడా ఖర్చు చేయలేదని దుయ్యబట్టారు. వలస కార్మికుల కోసం కేటాయించిన 599 కోట్ల నుంచే 1500 చొప్పున అందరికి ఇస్తున్నారని ఆరోపించారు. కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. (మే 17 వరకు లాక్డౌన్ పొడగింపు) -
ప్రభుత్వానికి ముందుచూపు లేదు: ఎంపీ అర్వింద్
సాక్షి, నిజామాబాద్ : మరికొన్ని వారాలు లాక్డౌన్ కొనసాగుతుందని, దానికి అందరూ సహకరించాలని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు. తెలంగాణలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని ఆయన పేర్కొన్నారు. గురువారం జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. జనాభా ఎక్కువ ఉన్న ఉత్తర ప్రదేశ్ కంటే తెలంగాణలో అధిక కేసులు నమోదవ్వడం ఆదోళన కలిగించే అంశమన్నారు. రైతులకు గన్ని బ్యాగులు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు. ప్రభుత్వానికి ముందు చూపు లేదని, టమాట రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఎంపీ అర్వింద్ సూచించారు.. (క్యాస్టింగ్ కౌచ్: రాజీకొస్తే ఇంతకంటే ఎక్కువ ఇస్తా! ) ఇక అమెరికాకు మందులు పంపిణీ చేసే స్థాయికి మన దేశాన్ని తీసుకెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పని చేయడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా కరోనాపై పోరాటం చేయాల్సిన సమయమిదని పేర్కొన్నారు. కరోనాపై కేంద్రం ఎప్పటికప్పుడూ పార్లమెంట్ సభ్యులతో చర్చిస్తుందని ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ తెలిపారు. (నీకు తోడుగా ఉంటా: బిగ్బాస్ రన్నరప్ ) -
‘కేసీఆర్ సూచనతోనే విద్యార్థులపై లాఠీచార్జ్’
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ముట్టడికి యత్నించిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రంగా తప్పుపట్టారు. పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, దీన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం పరాయి పాలనలో ఉన్నట్టు ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సూచన మేరకే పోలీసులు లాఠీచార్జ్ చేశారన్నారు. విద్యార్థులను బూట్లతో తన్నారని.. జంతువుల మీద కూడా ఇంత కఠినంగా వ్యవహరించరని మండిపడ్డారు. విద్యార్థుల వల్లనే తెలంగాణ వచ్చిందని.. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న పదవులు వారి వల్లేనని వ్యాఖ్యానించారు. (సీఎం కేసీఆర్ రాజీనామా చేస్తారా?) ప్రగతిభవన్ గేటు కూడా దాటలేరు తొమ్మిది యూనివర్సిటీల్లో అసలు వీసీలే లేరని ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. డిమాండ్ల సాధన కోసం వాళ్లు ధర్నా చేశారని తెలిపారు. విద్యార్థులను తక్కువ అంచనా వేయకూడదని హితవు పలికారు. ఇక ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను ఇద్దరు బడా పారిశ్రామిక వేత్తలు రూపొందించారని విమర్శించారు. త్వరలోనే కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవుతారని వ్యాఖ్యానించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. విద్యార్థుల బలిదానాల వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. కానీ ఇప్పుడు వారిపైనే లాఠీచార్జ్ చేస్తూ పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన పోలీసులపై హత్యాయత్న కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు తలుచుకుంటే సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ గేట్ కూడా దాటలేరని విమర్శించారు. (అసెంబ్లీ ముట్టడికి ఏబీవీపీ యత్నం) చదవండి: బీజేపీ అధ్యక్ష పదవికి నేనంటే నేనే.. -
ఆయన కొడుకును కట్టేసుకోవచ్చన్నారు..
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పేద మహిళల ఉసురు పోసుకుంటున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానంటూ పెద్ద పెద్ద ప్రసంగాలు చేసిన ఆయన.. నిజామాబాద్ పట్టణంలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. ఇళ్ల నిర్మాణం విషయంలో సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పేద మహిళల కోసం కేంద్ర అవాస్ యోజన పథకం కింద ఎన్ని ఇళ్లు ఇచ్చిందన్న విషయం గురించి.. అర్వింద్ మాట్లాడుతూ.. ఈ పథకం కింద కేంద్రం వేల కోట్ల నిధులు ఇస్తుంటే సీఎం కేసీఆర్ వాటిని పక్కదారి పట్టించారని ఆరోపించారు. ‘‘కేసీఆర్ పేద ప్రజలకు శాపంగా మారారు. ఈ పథకము కింద కేంద్రం ఇచ్చిన వేల కోట్లు నిధులను పక్కదారి పట్టించారు. ఇంకా నిధులు రావాల్సి ఉన్నా.. వివరాలు ఇవ్వకుండా వాటిని నిలిపివేసుకున్నారు. 2016-17లో మొదటి విడత కింద కేంద్రం 190.79 కోట్ల రూపాయలు ఇస్తే... ఒక్క మహిళకు కూడా ఇల్లు కట్టించలేదు. ఈ పథకం కింద ఎన్ని ఇళ్లు కట్టించారు... ఎన్ని నిధులు ఖర్చు చేశారో గత నాలుగేళ్లలో కనీస వివరాలు కూడా ఇవ్వలేదు’’ అని అర్వింద్ పేర్కొన్నారు. అదే విధంగా హౌజింగ్ కమిటీ సమావేశానికి రాష్ట్రం తరుపున కనీసం ఒక మంత్రి లేదా అధికారి కూడా హాజరు కాలేదని మండిపడ్డారు. ‘‘మేము పర్యటనకు వెళ్తే మహిళలు ఇల్లు కావాలని అడిగేవారు. నిజానికి రెండు దఫాలలో డబుల్ బెడ్ రూమ్ హామీ వల్లనే టీఆర్ఎస్ గెలిచింది. కానీ ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం లేదు. పక్క రాష్ట్రాల్లో ఈ పథకం కింద వేల ఇళ్లు కట్టుకున్నారు. కేసీఆర్ మాత్రం ప్రాజెక్టులు కట్టడానికి లక్షల కోట్లు లోన్ తెచ్చుకుంటున్నారు. ఈ పథకం డబ్బులతో ప్రగతి భవన్ కట్టించుకున్నారు. ఆయన కోసమైతే ఆరు నెలలో ఇల్లు పూర్తి అయితది. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తా అని చెప్పారు. ఆ ఇళ్ల ముందు గొర్రెలు, బర్రెలు, ఆయన కొడుకును కట్టేసుకుకోవచ్చు అని పెద్దగా మాట్లాడారు. ఇళ్లు కట్టకపోయినా... కట్టామని చెబుతున్నారు. నిజంగా ఇళ్లు కడితే మరి ఎక్కడ కట్టారు.. గాల్లో కట్టారా...? లేదా ఆయన ఫామ్ హౌజ్లో కట్టారా..?’’ అని అర్వింద్ ఎద్దేవా చేశారు. -
సీఎం కేసీఆర్ రాజీనామా చేస్తారా?
సుభాష్నగర్(నిజామాబాద్అర్బన్): సీఎం కేసీఆర్ ‘చీప్’మినిస్టర్ అని, ఇంత చేతగాని, దిగజారిపోయిన సీఎంను ఎన్నడూ చూడలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు టీఆర్ఎస్ గెలుపు కోసం పని చేసినందుకే సీఎం కేసీఆర్ పోలీస్ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ డబ్బులు, మద్యం పంపిణీ చేసిన వీడియోలు డజన్ల కొద్దీ చూపిస్తానని.. సీఎం కేసీఆర్ రాజీనామా చేస్తారా? అని ఆయన సవాల్ విసిరారు. నిజామాబాద్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కేసీఆర్కు హిందువుల సంస్కృతి తెలియదని,గురుకులాల్లో దళి తులు, చిన్న పిల్లలను మత మార్పిడులు చేస్తున్న నువ్వు హిందువువా? అని ప్రశ్నించారు. సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసే హక్కు అసెంబ్లీకి లేదన్నారు. -
ఎంపీ అర్వింద్పై కేసు!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదైంది. పోలింగ్కు 48 గంటల ముందు ఎన్నికల ప్రచారాన్ని నిలిపి వేయాలనే నిబంధనను ఉల్లంఘించారనే ఆరోపణలపై జిల్లా ఎన్నికల అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 3వ టౌన్ పోలీస్స్టేషన్లో మంగళవారం కేసు నమోదు చేశారు. నగరంలోని ఓ ప్రార్థనా స్థలం వద్ద ఉన్న ఆక్రమణల విషయమై ఎంపీ తన ఫేస్బుక్ ఖాతాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన పోస్టు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసు విషయమై అర్వింద్ తన ఫేస్బుక్ ఖాతాలోనే స్పందించారు. బ్యూరోక్రాట్ల విజ్ఞప్తి మేరకు ఈ పోస్టును తొలగించానని తెలిపారు. అయినప్పటికీ అధికారులు కేసులు పెడతామంటున్నారని అన్నారు. ఇదిలా ఉండగా.. బుధవారం మున్సిపల్ పోలింగ్ సందర్భంగా పోలీసులు బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేశారంటూ అర్వింద్ పోలీసు ఉన్నతాధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనపై కూడా మరో కేసు నమోదు చేసే యోచనలో పోలీసుశాఖ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ కేసుల విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. -
ఎంపీ అర్వింద్కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సవాల్
సాక్షి, నిజామాబాద్ : బీజేపీ చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలను నమ్మొద్దని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. ఉన్నవి లేనట్లు.. లేనివి ఉన్నట్లు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మోసపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి 42 శాతం నిధులు, తెలంగాణ ప్రజల సొత్తు అని, 42 శాతం కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చినట్లు రుజువు చేస్తే దేనికైనా సిద్దమని స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ దర్మపురి ఆర్వింద్ కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా మండిపడ్డారు. అర్వింద్ నీచ రాజకీయాలు మానుకోవాలని మేయర్ స్థానం టీఆర్ఎస్ పార్టీదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ మజ్లిస్తో ఒప్పందం అయ్యిందంటూ హిందువులను మాయ మాటలతో రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఇచ్చిన మాట తప్పితే తాను రాజీనామా చేస్తానని.. రాజీనామాకు ఎంపీ అర్వింద్ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. -
మోదీని ఒక్క మాట అన్నా ఊరుకోం: అర్వింద్
సాక్షి, నిజామాబాద్: రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ప్రధాని మోదీ, బీజేపీ నేత అమిత్ షాలను విమర్శించే స్థాయి లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఏ బిల్లులో తేవాలో కేటీఆర్ దగ్గర ట్యూషన్ చెప్పించుకునే అవసరం వారికి లేదని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్కు రాజకీయ పరిజ్ఞానం లేదని విమర్శించారు. మోదీని ఒక్క మాట అన్నా ఊరుకునేది లేదని హెచ్చరించారు. భైంసా ఘటనలకు వ్యతిరేకంగా తాను శనివారం నాడు ఒకరోజు నిరాహార దీక్ష తలపెడితే పోలీసులు అనుమతి లేదంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఎంఐఎం వాళ్లకు అనుమతులు అవసరం లేకుండానే సభలు పెట్టుకోవచ్చు.. కానీ బీజేపీకి మాత్రం అసలు అనుమతులే దొరకవా? అంటూ మండిపడ్డారు. నిజామాబాద్ కార్పొరేషన్లో 40 సీట్లతో బీజేపీ మేయర్ స్థానం కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి మేయర్ కాగానే పాలకవర్గం నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తూ తొలి తీర్మానం చేస్తుందని ధర్మపురి అర్వింద్ వెల్లడించారు. చదవండి: భైంసాలో తొలగని భయం! -
సీఎం కేసీఆర్ ముల్లాలా తయారయ్యాడు: అర్వింద్
సాక్షి, భీమ్గల్(నిజామాబాద్): పసుపుబోర్డు ఏర్పాటు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని, ఈ నెలలోనే పసుపుబోర్డు తెస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. బోర్డు ఏర్పాటుకు సంబంధించి ఫైల్ రెడీ అయ్యిందని చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్ఆర్సీకి మద్దతుగా ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో భీమ్గల్ శివారులోని ఎల్జే ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఎంపీ ప్రసంగించారు. తాను ఇచ్చిన మాట ప్రకారం ఎంపీగా గెలిచినప్పటి నుంచి పసుపుబోర్డు సాధన కోసం కృషి చేస్తున్నానని తెలిపారు. బీజేపీకి రైతుల మీదే ప్రేమ.. పసుపుబోర్డు లేదా అంత కంటే మెరుగైనది మంజూరు చేయాలని తాను కేంద్రాన్ని కోరుతూనే ఉన్నానని చెప్పారు. అయితే, ఇప్పుడు ఫైల్ తయారైందని, ఈ నెలలోనే ప్రకటన వస్తుందని వెల్లడించారు. ఇందుకోసం రెండు పెద్ద వేర్ హౌస్లు, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం నుంచి సమాచారం వచ్చిందని చెప్పారు. తనను ఢిల్లీకి రమ్మని పిలుపు వచ్చిందని, పసుపుబోర్డు కోసం మున్సిపల్ ఎన్నికలను వదిలి ఢిల్లీకి వెళ్తున్నానని వివరించారు. బీజేపీకి ఎన్నికల మీద ప్రేమ లేదని, రైతుల మీద మాత్రమే ప్రేమ ఉందన్నారు. జగన్కు ఉన్న సోయి కూడా లేదు.. సీఎం కేసీఆర్ పెద్ద ముల్లాలా తయారయ్యాడని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. పసుపుబోర్డు ఏర్పాటు చేయమని కేంద్రానికి లేఖ రాయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కోరినా ఖాతరు చేయలేదని ధ్వజమెత్తారు. అదే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పసుపు పంటకు మద్దతు ధర నిర్ణయించడంతో పాటు కేంద్ర సాయం కోరాడని తెలిపారు. మన సీఎం కేసీఆర్కు మాత్రం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికున్న సోయి కూడా లేదని విమర్శించారు. డిపోను తెరిపించని మంత్రి.. బాల్కొండ నియోజకవర్గానికి చెందిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఇక్కడ అభివృద్ధి శూన్యమని ఎంపీ ఆరోపించారు. రవాణా శాఖ మంత్రిగా ఉన్న ప్రశాంత్రెడ్డి.. ఎన్నికల హామీ అయిన భీమ్గల్ బస్డిపోను తెరిపించలేక పోయాడన్నారు. ఆర్అండ్బీ శాఖ మంత్రిగా ఉండి రోడ్లు కూడా బాగు చేయించలేదని, భీమ్గల్కు రెండేళ్ల క్రితం ఉన్న రోడ్లే ఉన్నాయన్నారు. ప్రజలు పనులడుగుతే పైసలు లేవంటున్నాడని ఎద్దేవా చేశారు. భీమ్గల్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయినా కవిత మింగుడు తగ్గలేదని విమర్శించారు. కేంద్ర నిధులన్నీ కాళేశ్వరం, మిషన్ భగీరథకు వెచ్చిస్తున్నారని తెలిపారు. రాష్ట్రం నుంచి నిధులు రావని, అన్నీ కేంద్ర నిధులే వస్తాయని అందుకే బీజేపీకి ఓటేసి పట్టం గట్టాలని పిలుపునిచ్చారు. గల్లీ నుండే రామరాజ్య స్థాపన మొదలవ్వాలన్నారు. బీజేపీ నేతలు మల్లికార్జున్రెడ్డి, బస్వా లక్ష్మీనర్సయ్య, రుయ్యాడి రాజేశ్వర్, పిల్లోల్ల గంగాస్వామి తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ చెప్తే నా పదవికి రాజీనామా చేస్తా: లక్ష్మణ్
సాక్షి, నిజామాబాద్ : ముస్లిం పదం లేదని పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తున్నారంటే పాకిస్తాన్కు వత్తాసు పలుకుతున్నట్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రానంతరం ముస్లింలకు ప్రత్యేక దేశాలిచ్చినా.. హిందువుల మీద దాడి మాత్రం ఆపలేదని మండిపడ్డారు. నిజామాబాద్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశానికి లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్, బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ హాజరయ్యారు. లక్ష్మణ్ మాట్లాడుతూ.. భారత్ నుంచి విడిపోయిన ప్రాంతాలు ఇస్లాం దేశాలుగా ఏర్పడితే మనది మాత్రం సెక్యులర్ దేశంగా మిగిలిందన్నారు. తెలంగాణ పేరుతో ఆనాడు ఆంధ్ర ఉద్యోగులు, ప్రజలపై దాడి చేసిన కేసీఆర్.. ఇప్పుడు దేశంలోని హిందువులపై దాడి చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆరా లేక ఓవైసీనా అని ప్రశ్నించారు. సీఏఏను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో కేసీఆర్ సమాధానం చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సరైన సమాధానం చెబితే బీజేపీ రాష్ట్ర పదవికి రాజీనామ చేస్తానని ప్రకటించారు. హిందుగాళ్లు, బొందుగాళ్లు అంటే కేసీఆర్కు పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బుద్ది చెప్పారని అన్నారు. భద్రాచలంలో రామునికి తలంబ్రాలు ఇవ్వలేని నువ్వు హిందువు ఎలా అవుతావని కేసీఆర్ను నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్షాలు కృష్ణార్జుల్లా దేశ రక్షణ కోసం పనిచేస్తున్నారని ప్రశంసించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయం బీజేపీదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. సమగ్ర కుటుంబ సర్వేతో అరాచకం సృష్టించిన కేసీఆర్.. ఇప్పుడు ఎన్పీఆర్ను ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాలని లక్ష్మణ్ ప్రశ్నించారు. అమెరికాలో చదివి రాజ్యాంగం మరిచిపోయారు నిజామాబాద్లో సభ పెడితే హైదరాబాద్లో కేసీఆర్ వణుకుతున్నారని బీజేపీ ఎంపీ దర్మపురి అర్వింద్ దుయ్యబట్టారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్ ముస్లింలకు మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఒవైసీ గడ్డం పీకీ కేసీఆర్కు పెడతా. ఏం పీకుదామని నిజామాబాద్కు వచ్చారో ఓవైసీ చెప్పాలి. కూతురు ఓడిపోయిందన్న బాధలో అసద్ను కేసీఆర్ మాటిమాటికీ నిజామాబాద్ పంపుతున్నారు. కేటీఆర్ అమెరికాలో చదివి రాజ్యాంగం మరిచిపోయారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకీ బలోపేతం అవుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 95 శాతం ఓట్లు వస్తాయి’’ అని వ్యాఖ్యానించారు. జిన్నా కాలం పోయింది గుర్తుంచుకో బీజేపీతో పెట్టుకుంటే ఎంఐఎం చనిపోతుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్ధర్ అన్నారు. పాకిస్తాన్ భారత్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుందని, ఒవైసీ దేశాన్ని ముక్కలు చేయాలని మతం పేరుతో రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. జిన్నా కాలం పోయిందని గుర్తుంచుకో ఒవైసీ అంటూ ధ్వజమెత్తారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం టీఆర్ఎస్, ఎంఐఎం పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. గతంలో ఈ బిల్లును తేవాలని చెప్పిన పార్టీలన్నీ ఇప్పుడు వ్యతిరేకించడం అన్యాయమన్నారు. దేశంలో ఉన్న పాకిస్తానీ, బంగ్లాదేశ్ ముస్లింలను కచ్చితంగా పంపిస్తామని తెలిపారు. బీజేపీ ఉన్నంత వరకు దేశ రక్షణ కోసం పనిచేస్తామని, తెలంగాణలో బీజేపీని గెలిపించాలని సునీల్ కోరారు. -
ఎంపీ అరవింద్పై పసుపు రైతుల ఆగ్రహం
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తున్నారని పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్మర్ పల్లి వేల్పురు మండల కేంద్రంలో ఎంపీ అరవింద్ దిష్టిబొమ్మకు రైతులు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. అనంతరం మెండోరా మండలం సావేల్, కోడిచర్ల, మెండోరా గ్రామాల్లో పసుపు రైతుల పాదయాత్రతో పాటు సంతకాల సేకరణ నిర్వహిస్తామని పసుపు ఐక్యకార్యాచరణ కమిటీ ప్రకటించింది. తాను గెలిస్తే జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానంటూ హామీ ఇచ్చిన ఎంపీ అరవింద్ ఆ మాట నిలబెట్టుకోవాలని పసుపు రైతులు డిమాండ్ చేశారు. చదవండి: టీఆర్ఎస్ హిందువులకు వ్యతిరేకం: అరవింద్ -
‘మైనార్టీలు అంటే కేవలం ముస్లింలే కాదు’
ఢిల్లీ: కాంగ్రెస్ సనాతన పాపుల పార్టీ అని.. మైనార్టీలు అంటే కేవలం ముస్లింలే కాదని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో హిందువులపై అత్యాచారాలు, బలవంతంగా మత మార్పిడులు జరుగుతున్నాయని తెలిపారు. అయితే హిందువుల బాధలు టీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం పట్టటం లేదని అర్వింద్ ధ్వజమెత్తారు. హిందువుల ఓట్లతో టీఆర్ఎస్ పార్టీ గెలవలేదా అని ఆయన సూటిగా విమర్శించారు. గురుకుల పాఠశాలల్లో మత మార్పిడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీని ముస్లిం లీగ్లో కలపాలని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తమ పాపాలను కడుకునే పరిస్థితిలో లేదని ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల కోసం ఎంఐఎంకు భయపడి టీఆర్ఎస్ పార్టీ పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించిందని ఆయన మండిపడ్డారు. -
కేసీఆర్కు బ్లేడు పంపిద్దామా..
సాక్షి, నిజామాబాద్ : ఆర్టీసీ భూములు అమ్ముకోడానికి సీఎం కేసీఆర్ కుట్ర పన్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి ఆర్వింద్ ఆరోపించారు. సోమవారం నిజామాబాద్ ఆర్టీసీ కార్మికుల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం కేసీఆర్ ప్రవర్తిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సమ్మెపై ఎమ్మెల్యేలు, ఎంపీలు నోరు మెదపడం లేదని, మంత్రి హరీశ్రావు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ హోల్సేల్గా, ఎమ్మెల్యేలు రిటైల్గా దోపిడి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆర్టీసీ సమ్మె భయంతోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం లేదని విమర్శించారు. కేసీఆర్ తన కుటుంబంపై చూపించే ప్రేమలో 5 శాతం ఆర్టీసీ మీద చూపించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల బలిదానాలకు సీఎం కేసీఆర్ ఆహంకార ప్రకటనలే కారణమని, ఇందులో కేంద్రం తప్పు ఏముందని ప్రశ్నించారు. అలాగే ‘దళితుడిని సీఎం చేయకుంటే మెడ కోసుకుంటాను అన్న కేసీఆర్కు బ్లేడు పంపిద్దామా.. సీఎంది కోడి మెడ.. ఒక్క బ్లేడు సరిపోతుంది’ అంటూ చురకలు అంటించారు. సీఎం కేసీఆర్ను కోర్టుకు ఈడ్చాలని, ఆయన చర్యలను కేంద్రం గమనిస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్ తప్పులు 100 అవ్వగానే ఆయన మెడ తెగడం ఖాయమని, కేసీఆర్ జైలుకు వెళ్లే రోజులు దగ్గర్లో ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. విపరీత పాపాలు చేసిన కేసీఆర్ను గద్దె దింపాలని ఎంపీ అర్వింద్ పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికులు ధైర్యంగా ఉండాలని, విజయం సాధించే రోజు దూరంలో లేదని భరోసాయిచ్చారు.