Ganesh nimajjanam
-
గణనాథుల భారీ క్యూ.. ట్యాంక్ బండ్పై కొనసాగుతున్న నిమజ్జనం (ఫొటోలు)
-
HYD: రేపు ఉదయానికల్లా నిమజ్జనం పూర్తి: సీవీ ఆనంద్
సాక్షి,హైదరాబాద్: రేపు ఉదయంలోగా నగరంలో నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. నిమజ్జనంపై మంగళవారం(సెప్టెంబర్17) మధ్యాహ్నం సీవీ ఆనంద్ మీడియాకు అప్డేట్ ఇచ్చారు.‘హైదరాబాద్లో ప్రశాంతంగా వినాయక నిమజ్జనం జరుగుతోంది.గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సౌత్ ఈస్ట్,సౌత్ వెస్ట్లో ఉన్న విగ్రహాలు త్వరగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నాం. నిమజ్జనం ఆలస్యం కాకుండా చర్యలు తీసుకున్నాం.మండప నిర్వాహకులతో మాట్లాడి త్వరగా నిమజ్జనం జరిగేలా చర్యలు తీసుకున్నాం. బాలాపూర్ వినాయకుడు కూడా త్వరగా నిమజ్జనం అయ్యేలా ప్రయత్నిస్తున్నాం.ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రణాళికలు సిద్ధం చేశాం.షిఫ్ట్ వారిగా 25 వేల మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశాం.నిమజ్జనంలో పోలీసులు అలసిపోకుండా షిఫ్ట్ల ప్రకారం డ్యూటీలు చేస్తున్నారు.లక్ష విగ్రహాల్లో ఇంకా 20 వేల విగ్రహాలు పెండింగ్ ఉన్నాయి.నిమజ్జనం కోసం వచ్చే ప్రజలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రావాలని కోరుతున్నాం.మీడియాలో లైవ్ టెలికాస్ట్ చూడాలని కోరుతున్నాం. ఇదీ చదవండి.. గణేష్ నిమజ్జనానికి హాజరైన తొలి సీఎం రేవంత్ -
మహా గణపతి నిమజ్జనానికి కదలిన భక్తజన సందోహం (ఫొటోలు)
-
ట్యాంక్బండ్పై సీఎం రేవంత్రెడ్డి.. గణేష్ నిమజ్జనం సమీక్ష (ఫొటోలు)
-
HYD: ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర (ఫొటోలు)
-
హైదరాబాద్లో ఘనంగా గణనాథుల నిమజ్జనం..ట్యాంక్బండ్ పరిసరాల్లో సందడి (ఫొటోలు)
-
నిమజ్జనానికి అంతా రెడీ: జీహెచ్ఎంసీ మేయర్
సాక్షి,హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం కోసం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. సోమవారం(సెప్టెంబర్16) నిమజ్జనంపై సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.’నిమజ్జనానికి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులను ఆదేశించాం.ట్యాంక్బండ్పై క్రేన్స్ ఏర్పాటు చేశాం. ట్యాంక్ బండ్పై నిమజ్జనం జరుగుతుంది. నాతోపాటు అధికారులు కూడా గత వారం రోజుల నుంచి నిమజ్జన ఏర్పాట్లలో ఉన్నారు. రేపు ఎల్లుండి కూడా 24 గంటలు అందుబాటులో ఉంటారు. వేలసంఖ్యలో సిబ్బంది, అధికారుల సమన్వయంతో నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాం. గతంతో పోలిస్తే ఈసారి మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం’అని మేయర్ చెప్పారు.కాగా, హైదరాబాద్లో మంగళవారం(సెప్టెంబర్ 17) నిమజ్జనం జరగనున్న విషయం తెలిసిందే. నిమజ్జనం కోసం పోలీసులు పక్కాగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఖైరతాబాద్ గణేష్, నాలుగు గంటలకు బాలాపూర్ గణేష్ నిమజ్జనం జరగనుందని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి.. గణేష్ నిమజ్జనం..అనుభవాల నుంచి పాఠాలు -
#GaneshNimajjanam2024 : హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సందడి (ఫొటోలు)
-
ఖైరతాబాద్ గణేష్ వద్దకు భారీగా తరలివచ్చిన భక్తులు (ఫొటోలు)
-
కర్నూలులో గణేష నిమజ్జనోత్సవానికి సర్వం సిద్ధం
-
తెలుగు రాష్ట్రాల్లో కన్నుల పండుగలా గణేష్ నిమజ్జనం (ఫొటోలు)
-
గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి..
-
నిమజ్జనానికి వచ్చే వారికి ఉచిత ఆహారం: అమ్రపాలి
సాక్షి,హైదరాబాద్:గణేష్ నిమజ్జనానికి జిహెచ్ఎంసి తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి చెప్పారు. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడారు‘17,18,19 తేదీల్లో మూడు రోజులపాటు 15వేల మంది జీహెచ్ఎంసీ సిబ్బంది పనిచేస్తారు.శానిటేషన్ సిబ్బంది,ట్యాంక్ బండ్లో గజ ఈతగాళ్లనుఏర్పాటు చేశాం.నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం ట్యాంక్బండ్, సరూర్నగర్లలో మంచినీళ్లు,ఆహారం ఏర్పాటు చేస్తున్నాం.ఇప్పటికే రోడ్లు రిపేర్ చేశాం.స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేశాం.అన్ని మేజర్ చెరువుల వద్ద క్రేన్లు ఉంచాం.జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చిన్న చిన్న చెరువుల వద్ద బేబీ పాండ్స్ ను ఏర్పాటు చేశాం.కాలనీలలో ఏర్పాటు చేసే చిన్న విగ్రహాలు అక్కడే నిమజ్జనం చేస్తారు.గణేష్ నిమజ్జనానికి జోనల్ కమిషనర్లతో పాటు పోలీసులు కోఆర్డినేషన్ చేసుకుంటూ పనిచేస్తారు’అని అమ్రపాలి తెలిపారు.ఇదీ చదవండి.. 17న నిమజ్జనం సెలవు -
HYD: ట్యాంక్బండ్లో నిమజ్జనం లేదు: సీవీ ఆనంద్
సాక్షి,హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలతో ఈసారి ట్యాంక్బండ్లో గణేష్ నిమజ్జనం లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ విషయమై శుక్రవారం(సెప్టెంబర్13) ఆయన మీడియాతో మాట్లాడారు. నెక్లెస్రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్లో గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. నిమజ్జన విధుల్లో మొత్తం 18వేల మంది పోలీసులు పాల్గొంటారని చెప్పారు. ఈ ఏడాది నుంచి హుస్సేన్సాగర్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్(పీవోపీ) విగ్రహాలు నిమజ్జనం చేయడానికి వీలులేదని హైకోర్టు గతేడాదే ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాల అమలు కోసం ఎన్డీఆర్ మార్గ్, నెక్లెస్రోడ్డులో విగ్రహాల నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్లో సెప్టెంబర్ 17న హైదరాబాద్లో నిమజ్జనోత్సవం జరగనుంది. ఇదీ చదవండి.. కఠినంగా వ్యవహరించండి: డీజీపీకి సీఎం రేవంత్ ఆదేశాలు -
Tank Bund: ఘనంగా మూడో రోజు వినాయక నిమజ్జనాలు (ఫొటోలు)
-
టెక్సస్ లో ఘనంగా గణేష్ నిమజ్జనం
-
Live: హైదరాబాద్ లో రెండో రోజు గణేష్ నిమజ్జనం..తగ్గని జోష్
-
కాసేపట్లో గంగ ఒడికి ఖైరతాబాద్ బడా గణేష్
-
సింగర్ల పాటలు..శోభాయాత్రలో డ్యాన్సులు..
-
భక్తితో ప్రాణం పెట్టి పాడారు..!
-
అద్భుతమైన పాటలు..!
-
గణపతి రూపాన్ని మార్చకండి..అన్ని రూపాలకు మూలం గణనాధుడు
-
వేలం పాటలో రూ.1.26 కోట్లు పలికిన గణేశ్ లడ్డూ
-
వరంగల్ లో వైభవోపేతంగా గణేష్ నిమజ్జనం
-
గణేష్ నిమజ్జనంలో సీపీ రంగనాథ్ డాన్స్
-
గణేష్ నిమజ్జనంలో అపశృతి.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో..
సాక్షి, ఖమ్మం: పెనుబల్లి మండలం పాత కారాయిగూడెంలో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. నిమజ్జనంలో డ్యాన్స్ చేస్తూ దూదిపాళ్ల సత్యనారాయణ అనే వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వైద్యం కోసం తిరువూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. దీంతో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. -
గౌరమ్మ తనయుడు గంగమ్మ ఒడికి
గౌరమ్మ తనయుడు గురువారం గంగమ్మ ఒడికి చేరనున్నాడు. కరిముఖుని సేవలో తరించిన భక్తజనులు గణపతి నిమజ్జనానికి సిద్ధమయ్యారు. బొజ్జ గణపయ్య భోగభాగ్యాలను కనులారా వీక్షించేందుకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. నగరమే వేదికగా నలుచెరగులా అలరారిన గణేశుని దివ్య మంగళరూపాలను వరుసగా వీక్షించే అరుదైన సందర్భానికి స్వాగతం పలుకుతోంది. శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు దాదాపు 3వేల మంది పారిశుద్ధ్య కార్మికులను విధుల్లో నియమించింది. శోభాయాత్ర మార్గాన్ని చార్మినార్ నుంచి ట్యాంక్బండ్ వరకు మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, మహ్మద్ మహమూద్ అలీ బుధవారం ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించి పరిశీలించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. 122 ప్రత్యేక తాగునీటి శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా నిమజ్జనాల కోసం ఏర్పాటు చేసిన 74 బేబీ పాండ్స్ (నీటి కొలనులు) వద్ద నీటి క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 37 వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. భక్తుల కోసం ఆర్టీసీ వివిధ మార్గాల్లో 535 బస్సులను నడిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 8 ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజాము 2 గంటల వరకు నగరంలోని వివిధ మార్గాల్లో మెట్రో రైళ్లను నడపనున్నారు. హైదరాబాద్: గణేష్ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సామూహిక నిమజ్జనం గురువారం హుస్సేన్సాగర్లో జరగనుంది. దీనికి దాదాపు 19 కిలోమీటర్ల మేర భారీ ఊరేగింపు సైతం ఉంటుంది. ఈ నేపథ్యంలో నగర శివార్లతో పాటు సిటీ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సిటీలోని మొత్తం 66 ప్రాంతాల్లో ట్రాఫిక్ను మళ్లించడమో, పూర్తిగా ఆపేయడమో చేస్తారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఇవి అమలులో ఉంటాయి. అవసరాన్ని బట్టి వీటిని పొడిగించే అవకాశం ఉంది. నిమజ్జనం పూర్తయిన తరవాత విగ్రహాలను తెచ్చిన ఖాళీ లారీల కోసం ప్రత్యేక రూట్లు కేటాయించారు. నిమజ్జనానికి వచ్చే ప్రజలు వీలున్నంత వరకు వ్యక్తిగత వాహనాలను వదిలి ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్లను ఆశ్రయించాలని పోలీసులు సూచించారు. ఇతర వాహనాలకు నో.. ► నగరంలోని దాదాపు 30 గంటల పాటు ప్రైవేట్ బస్సులు, లారీలు (గణేషులను తెచ్చేవి మినహా), ఇతర భారీ వాహనాలకు అనుమతి ఉండదు. ఆంక్షలు, మళ్లింపులు నేపథ్యంలో అత్యవసర వాహనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణ వాహనాలు ఆంక్షలు మార్గంలో ఇటు–అటు మారడానికి బషీర్బాగ్ ఫ్లైఓవర్ వద్ద అవకాశం కల్పిస్తున్నారు. ప్రధాన ఊరేగింపు మార్గం: ● కేశవగిరి–నాగుల్చింత–ఫలక్నుమా–చార్మినార్–మదీనా–అఫ్జల్గంజ్–ఎంజే మార్కెట్–అబిడ్స్– బషీర్బాగ్–లిబర్టీ–ఎన్టీఆర్ మార్గ్ల్లో నిమజ్జనం జరుగుతుంది. సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చేది: ► ఆర్పీ రోడ్–ఎంజీ రోడ్–కర్బాలామైదాన్–ముషీరాబాద్ చౌరస్తా–ఆర్టీసీ క్రాస్రోడ్స్– నారాయణగూడ ‘ఎక్స్’ రోడ్–హిమాయత్నగర్ ‘వై’ జంక్షన్ ద్వారా వచ్చి లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులో చేరుతుంది. ఈస్ట్జోన్ నుంచి వచ్చేది: ► ఉప్పల్–రామాంతపూర్–అంబర్పేట్–ఓయూ ఎన్సీసీ–డీడీ హాస్పిటల్ల మీదుగా ప్రయాణించి ఆర్టీసీ క్రాస్రోడ్స్ వద్ద సికింద్రాబాద్ రూట్ దాంతోకలుస్తుంది. ► వెస్ట్ జోన్ వైపు నుంచి వచ్చే ఊరేగింపు ఎంజే మార్కెట్ లేదా సెక్రటేరియేట్ వద్ద ప్రధాన ఊరేగింపుతో కలుస్తాయి. ► నిమజ్జనం ఊరేగింపు జరిగే మార్గాల్లో చిన్న వాహనాలకు అనుమతి ఉండదు. ఈ మార్గానికి అటు ఇటు ప్రాంతాల్లో ఉన్న వారు ప్రయాణించడానికి కేవలం బషీర్బాగ్ చౌరస్తా వద్ద మాత్రమే అవకాశం ఇచ్చారు. సాధారణ ప్రజలు రింగ్రోడ్, బేగంపేట్ మార్గాలను ఆశ్రయించడం ఉత్తమం. ► వెస్ట్–ఈస్ట్ జోన్ల మధ్య రాకపోకలు సాగించే వారికి కేవలం బషీర్బాగ్ వద్దే అవకాశం ఉంటుంది. ► వాహనచోదకులు సాధ్యమైనంత వరకు ఔటర్ రింగ్ రోడ్, బేగంపేట్ మార్గాలను ఎంపిక చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. సందర్శకులకు పార్కింగ్ ఇలా: ► హుస్సేన్సాగర్లో జరిగే నిమజ్జనాన్ని వీక్షించడానికి వచ్చే సందర్శకుల కోసం కి.మీ పరిధిలో ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయించారు. ► అవి... ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్, ఆనంద్నగర్ కాలనీ నుంచి రంగారెడ్డి జెడ్పీ ఆఫీస్ మధ్య, బుద్ధ భవన్ పక్కన, ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కాలేజీ, పబ్లిక్ గార్డెన్స్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, లోయర్ ట్యాంక్బండ్, గో సేవా సదన్, కట్టమైసమ్మ టెంపుల్. ఇక్కడ నుంచి సందర్శకులు కాలినడకనే ట్యాంక్బండ్ పరిసరాలకు చేరుకోవాలి. రాచకొండ పరిధిలో... ► గురువారం ఉదయం 6 నుంచి 29 రాత్రి 8 గంటల వరకు రాచకొండ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. నిమజ్జన వాహనాలకు మినహా సాధారణ వెహికిల్స్కు సరూర్నగర్ ట్యాంక్, సఫిల్గూడ, కాప్రా ట్యాంక్, అంబర్పేట ఫ్లై ఓవర్ పనులు నిర్మాణంలో ఉన్నందున రామంతాపూర్ మార్గంలో వాహనాలకు అనుమతి లేదు. ఈ మార్గంలో వచ్చే నిమజ్జన వాహనాలను హబ్సిగూడ స్ట్రీట్నం–8 లేదా ఉప్పల్ క్రాస్ రోడ్లో మళ్లించి, సర్వే ఆఫ్ ఇండియా మీదుగా, ఏక్ మినార్ మసీదు, హబ్సిగూడ, తార్నాక మీదుగా వెళ్లాలి. ► బైరామల్గూడ నుంచి చంపాపేట, చెంగిచర్ల నుంచి ఉప్పల్, నేరేడ్మెట్ నుంచి సఫిల్గూడ, ఆర్కే పురం నుంచి ఈసీఐఎల్, లాలాగూడ టీ జంక్షన్ నుంచి మిర్జాల్గూడ వరకు సాధారణ వాహనాలకు, గూడ్స్ వాహనాలకు అనుమతి లేదు. భక్తులు తమ వాహనాలను సరస్వతి శిశు మందిర్, సరూర్నగర్ పోస్ట్ ఆఫీసు, ఇందిరా ప్రియదర్శిని పార్క్లలో వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. ► నిమజ్జనం పూర్తయిన వాహనాలు ఇందిరా ప్రియదర్శిని పార్క్ మీదుగా సరూర్నగర్ పాత పోస్ట్ ఆఫీసు క్రాస్రోడ్, కర్మన్ఘాట్, సరూర్నగర్ పోస్ట్ ఆఫీసు వైపున తీసుకోవాలి. సైబరాబాద్ పరిధిలో.. ► బాలానగర్ నుంచి ఫతేనగర్ బ్రిడ్జి, గోద్రెజ్ నుంచి ఎర్రగడ్డ, ఫిరోజ్గూడ నుంచి కూకట్పల్లి గోద్రెజ్ వై జంక్షన్, గూడెన్మెట్ నుంచి నర్సాపూర్ క్రాస్ రోడ్లలో వాహనాలకు అనుమతి లేదు. అశోక్నగర్, బీరంగూడ నుంచి వచ్చే వాహనాలు బాచుపల్లి, గండిమైసమ్మ, ఓఆర్ఆర్ వద్ద మళ్లిస్తారు. ► సంగారెడ్డి నుంచి కూకట్పల్లి వైపు వచ్చే వాహనాలను ఓఆర్ఆర్ మీదుగా మళ్లిస్తారు. నిమజ్జన వాహనాలకు ఫతేనగర్ ఫ్లై ఓవర్, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఫ్లై ఓవర్, ఫోరంమాల్ ఫ్లై ఓవర్, బాబూజగ్జీవన్రామ్ ఫ్లై ఓవర్, ఖైత్లాపూర్ ఫ్లై ఓవర్ల మీదుగా ప్రవేశం లేదు. హెల్ప్లైన్స్ ఏర్పాటు: ఈ ఆంక్షలపై ప్రజలకు అవగాహన కల్పించడం, సహకరించడం కోసం ప్రత్యేక హెల్ప్లైన్స్ను సైతం ఏర్పాటు చేశారు. ఎలాంటి సహాయం కావాలన్నా 040–27852482, 9010203626 లను సంప్రదించవచ్చు. -
నిమజ్జనోత్సవంలో అపశ్రుతి
ప్రకాశం: మండలంలోని పొట్లపాడు గ్రామంలో వినాయక నిమజ్జనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. నిమజ్జన సమయంలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..గ్రామంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహానికి 9 రోజుల పాటు పూజలు చేశారు. మంగళవారం రాత్రి గ్రామోత్సవం చేసి నిమజ్జనం చేసేందుకు ఏర్పాటు చేశారు. ఒక ట్రాక్టర్ ట్రక్కులో గణపతి విగ్రహాన్ని ఉంచి లైటింగ్ ఏర్పాటు చేశారు. విగ్రహానికి నాలుగు వైపులా ఇనుప పైపులు ఉంచి డెకరేషన్ చేశారు. గ్రామోత్సవం అనంతరం పొలాల్లోని నీటి గుంటల్లో నిమజ్జనం చేసేందుకు పొలాల బాటలో వెళుతుండగా విద్యుత్ తీగలు డెకరేషన్ కోసం ఏర్పాటు చేసిన పైపులకు తగిలాయి. దీంతో విద్యుదాఘాతానికి గురవడంతో ట్రాక్టర్ పై ఉన్న వారంతా కిందకు దిగారు. ప్రమాదంలో చమిడిశెట్టి శ్రీను(35), తడకమల్ల నాగేంద్రం (11) విద్యుదాఘాతానికి గురై స్పృహ తప్పడంతో వెంటనే వినుకొండలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. హాస్పిటల్లో వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడు శ్రీనుకు భార్య, ఇరువురు పిల్లలు ఉన్నారు. నాగేంద్రం 8వ తరగతి చదువుతున్నాడు. వీరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యం దేవకుమార్ తెలిపారు. అన్ని విధాలా అండగా ఉంటాం పొట్లపాడులో విద్యుత్ షాక్తో మృతి చెందిన వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆయన మృతదేహాలను సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతిని తెలియజేశారు. పార్టీలో చురుకై న పాత్రను శ్రీను పోషించాడని, ఒక కార్యకర్తను పోగొట్టుకోవటం బాధాకరమన్నారు. వారి కుటుంబసభ్యులకు అండగా ఉండి శ్రీను లేని లోటును తీర్చుతానని హామీ ఇచ్చారు. ఆయన వెంట రాష్ట్ర గ్రీనరి అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ షేక్.సైదా, ఏఎంసీ ఉపాధ్యక్షుడు కండె గంగయ్య, దర్శి ఏఎంసీ మాజీ అధ్యక్షుడు వైవీ సుబ్బయ్య, కురిచేడు సొసైటీ ప్రెసిడెంట్ పోతిరెడ్డి నాగిరెడ్డి, మండల సచివాలయాల కన్వీనర్ మేరువ సుబ్బారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ కాకర్ల కాశయ్య, నాయకులు ఉన్నారు. -
వినాయకుని పూజ చేసి ఇంటికి వెళ్తూ..
కరీంనగర్రూరల్: ఎనిమిది రోజులపాటు వినాయకుడికి నిష్టతో రెండుపూటల పూజలు చేసిన ఓ పూజారి నిమజ్జనోత్సవం బుధవారం రాత్రి చివరిపూజచేసి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. స్థానికులు, రూరల్ పోలీసుల కథనం ప్రకారం...కరీంనగర్ మండలం ఇరుకుల్లకు చెందిన తిరువరంగం పాపయ్యశాస్త్రి(45) పూజారిగా పనిచేస్తున్నాడు. గణపతి నవరాత్రుల్లో భాగంగా చెర్లభూత్కూర్లోని వినాయక మండపాల వద్ద పూజలు నిర్వహిస్తున్నాడు. చివరిరోజు బుధవారం రాత్రి వినాయకుడి పూజలు పూర్తి చేసుకుని ద్విచక్రవాహనంపై ఇరుకుల్లకు బయల్దేరాడు. చెర్లభూత్కూర్ నుంచి మొగ్ధుంపూర్ రోడ్డుపైకి వచ్చిన ఆయన వెహికిల్ను పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నుంచి కరీంనగర్ వైపు వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య వనజ, కుమారుడు భరద్వాజ్, కూతురు హోత్రి ఉన్నారు. -
Ganesh Nimajjanam Photos: హుస్సేన్ సాగర్ లో గణేషుడి నిమజ్జనం (ఫొటోలు)
-
ప్రతి గణేష్ విగ్రహానికీ క్యూఆర్ కోడ్
హైదారబాద్: గణేష్ నిమజ్జన సామూహిక ఊరేగింపుల పర్యవేక్షణకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటున్నారు. ప్రతి వినాయక మండపానికీ ఓ ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ కేటాయించడంతో పాటు వాటికి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఇలా దాదాపు 12 వేల విగ్రహాలను ట్యాగ్ చేశారు. పోలీసులు గణేష్ విగ్రహాల వివరాలతో పోలీసులు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ముద్రించి అందిస్తున్నారు. ఇలా ఈ విగ్రహాలను జియో ట్యాగింగ్ చేయడంతో పాటు ఐసీసీసీలోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానించారు. ఈ క్యూఆర్ కోడ్స్, జియో ట్యాగింగ్ డేటాను పోలీసు అధికారిక యాప్ టీఎస్ కాప్లోకి లింకు ఇచ్చారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయిలో ఉండే పోలీసుల వరకు ఎవరైనా సరే తమ ప్రాంతంలో ఎన్ని మండపాలు ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? ఎప్పుడు ఏర్పాటు అవుతాయి? నిమజ్జనం ఎప్పుడు? ఏ మార్గంలో వెళ్ళి, ఎక్కడ నిమజ్జనం చేస్తారు? తదితర వివరాలను తమ ట్యాబ్స్, స్పార్ట్ఫోన్స్లో చూసుకునే అవకాశం ఏర్పడింది. ఊరేగింపు మార్గాలను పరిశీలించిన సీపీ సామూహిక నిమజ్జనం గురువారం జరగనుండటంతో నగర కొత్వాల్ సీవీ ఆనంద్ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. మంగళవారం ఆయన అదనపు సీపీలు విక్రమ్ సింగ్ మాన్, జి.సు«దీర్బాబు, సంయుక్త సీపీ ఎం.శ్రీనివాసులు తదితరులతో కలిసి చారి్మనార్, ఎంజే మార్కెట్ సహా వివిధ ప్రాంతాల్లోని ఊరేగింపు మార్గాన్ని పరిశీలించారు. బాలాపూర్ నుంచి హుస్సేన్సాగర్ వరకు మొత్తం 19 కిమీ మేర ప్రధాన ఊరేగింపు జరగనుంది. ఈ మార్గంలో అనేక ఇతర ఊరేగింపులు వచ్చి కలుస్తాయి. బందోబస్తు, భద్రతా విధుల్లో మొత్తం 25,694 మంది సిబ్బంది, అధికారులు పాల్గొంటారు. వీరికి అదనంగా 125 ప్లటూన్ల సాయుధ బలగాలు, మూడు కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వినియోగిస్తున్నారు. ఈ బలగాలు హుస్సేన్సాగర్ చుట్టూతో పాటు 18 కీలక జంక్షన్లలో మోహరించి ఉంటాయి. ప్రతి ఊరేగింపు మార్గాన్ని ఆద్యంతం కవర్ చేసేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అవసరమైన సంఖ్యలో క్యూఆరీ్ట, యాంటీ చైన్ స్నాచింగ్, షీ–టీమ్స్ బృందాలతో పాటు డాగ్ స్వా్కడ్స్ను రంగంలోకి దింపుతున్నారు. ఐసీసీసీలో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని విభాగాలకు చెందిన అధికారులు ఈ ఊరేగింపును పర్యవేక్షిస్తారు. నగర ప్రజలు సైతం తమకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. రాచకొండ పరిధిలో.. వినాయక నిమజ్జనానికి రాచకొండ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కమిషనరేట్ పరిధిలోని 56 చెరువుల వద్ద 3,600 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిమజ్జన ఏర్పాట్లపై మంగళవారం రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వివరాలను వెల్లడించారు. అన్ని చెరువులను సందర్శించి ఇప్పటికే క్రేన్లను ఏర్పాటు చేశామన్నారు. 6 వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉంటారని తెలిపారు. మరో 1000 మంది అదనపు సిబ్బందిని కూడా జిల్లాల నుంచి రప్పించామన్నారు. రూట్ టాప్, షీ టీమ్స్, మఫ్టీ పోలీస్లతో భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. అదనంగా ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు ఈ నెల 28న జరగనున్న వినాయక నిమజ్జన వేడుకల కోసం ఆరీ్టసీ, ఎంఎంటీఎస్, మెట్రో సంస్థలు విస్తృత ఏర్పాట్లు చేపట్టాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో 535 బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రయాణికుల రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు వివిధ మార్గాల్లో 8 ఎంఎంటీఎస్ సర్వీసులను అదనంగా నడపనున్నారు. భక్తుల రద్దీకనుగుణంగా మెట్రో రైళ్లను నడిపేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ చర్యలు చేపట్టింది. బస్సుల వివరాల కోసం ప్రయాణికులు 99592 26154, 99592 26160లను సంప్రదించవచ్చు. సమన్వయంతో.. సమష్టిగా – నిమజ్జనానికి ఏర్పాట్లు సామూహిక గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా, భక్తులకు ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకు వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేయనున్నాయి. జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, సమాచారం, పౌరసంబంధాలు, పోలీసు, రవాణా, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డు, మెడికల్అండ్ హెల్త్, ఫైర్సరీ్వసెస్, టీఎస్ ఆరీ్టసీ,టీఎస్ఎస్పీడీసీఎల్, ఇరిగేషన్, ఆర్అండ్బీ, టూరిజం విభాగాలతో పాటు 108 ఈఎంఆర్ఐ విభాగాల ఉన్నతాధికారులు సమన్వయంతో పని చేసేలా ప్రణాళిక రూపొందించారు. అన్ని విభాగాల అధికారుల ఫోన్నెంబర్లు అందరి వద్ద అందుబాటులో ఉంచారు. నిమజ్జనాల సందర్భంగా వెలువడే వ్యర్థాలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు దాదాపు 3 వేల మంది పారిశుద్ధ్య కారి్మకులు విధులు నిర్వర్తిస్తారు. విభాగాల వారీగా అన్ని ప్రభుత్వ శాఖలు పని చేయనున్నాయి. మహా నిమజ్జనానికి ట్రయల్ రన్ ఖైరతాబాద్: శ్రీ దశమహా విద్యాగణపతిగా ఖైరతాబాద్లో కొలువుదీరిన మహాగణపతి నిమజ్జనానికి పోలీసులు మంగళవారం ఉదయం 5.30 గంటలకు ఖైరతాబాద్ మండపం నుంచి ఎనీ్టఆర్ మార్గ్లోని క్రేన్ నెం– 4 వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. నేటి ఉదయం 11 గంటల వరకే మహాగణపతి దర్శనాలు ఉంటాయని, తెల్లవారుజామున 5 గంటల నుంచి షెడ్డు తొలగించే పనులు ప్రారంభించి 7 గంటల కల్లా పూర్తి చేస్తామని ఉత్సవ కమిటీ సభ్యుడు సందీర్ రాజ్ తెలిపారు. మినట్ టు మినట్.. మంగళవారం రాత్రి నుంచే ట్రాయిలర్ వాహనానికి వెల్డింగ్ పనులు మొదలు పెట్టారు. నేటి రాత్రి నుంచే నిమజ్జన ఏర్పాట్లు ప్రారంభిస్తారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు మహాగణపతి ఇరువైపులా ఉన్న విగ్రహాలను మరో వాహనంపైకి తెస్తారు. తెల్లవారుజామున 4 గంటల కల్లా రవి క్రేన్ సాయంతో మహాగణపతిని ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్ వాహనంపైకి తెస్తారు. ఉదయం 7 గంటలకు మహాగణపతికి వెల్డింగ్ పనులు పూర్తి చేసి 9.30 గంటలకు మహా శోభాయాత్ర ప్రారంభిస్తారు. ఎనీ్టఆర్ మార్గ్లోని క్రేన్ నెం–4 వద్ద మధ్యాహ్నం 12 గంటల వరకు నిమజ్జనం పూర్తయ్యేలా పోలీసులు మినట్ టు మినట్ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ విధంగానే ఏర్పాట్లు చేయాలని ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. -
ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనం సందడి
-
Ganesh Nimajjanam 2023 Photos: ఘనంగా వినాయక నిమజ్జనాలు.. భక్తుల సందడి (ఫోటోలు)
-
నిమజ్జనం.. మరింత వేగవంతం!
హైదరాబాద్: గణేష్ నవరాత్రుల్లో అత్యంత కీలక ఘట్టం సామూహిక నిమజ్జనం. దీనికోసం పోలీసులు హుస్సేన్సాగర్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు దాదాపు మధ్య మండలం మొత్తాన్నీ సాధారణ వాహనాలకు ‘నో ఎంట్రీ జోన్’గా మారుస్తారు. ఈ కారణంగానే ఈ క్రతువును వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో పోలీసులు అనేక ప్రయోగాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా ఈ ఏడాది మరో టెక్నిక్ను అమలులోకి తెస్తున్నారు. విగ్రహం ఉంచే ప్లాట్ఫామ్ కింద ఖాళీ ప్లాస్టిక్ డ్రమ్ములు ఏర్పాటు చేస్తున్నారు. నగర కొత్వాల్ సీవీ ఆనంద్, మధ్యమండల డీసీపీ ఎం.వెంకటేశ్వర్లుతో పాటు ఇతర ఉన్నతాధికారులు దీన్ని శనివారం రాత్రి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పడేసే పని ఉండదు... మండపాల నిర్వాహకులు గణేష్ విగ్రహాలను వాహనాల్లో హుస్సేన్సాగర్ వద్దకు తీసుకువస్తారు. అక్కడ నిమజ్జనం కోసం సిద్ధం చేసి ఉంచిన క్రేన్ల ప్లాట్ఫామ్ పైకి వీటిని ఎక్కిస్తారు. సాగర్ నీటి ఉపరితలం వద్దకు చేరిన తర్వాత ఆ ప్లాట్ఫామ్పై ఉండే సిబ్బంది విగ్రహాన్ని నీళ్లల్లోకి తోస్తారు. కొన్ని సందర్భాల్లో విగ్రహం ప్లాట్ఫామ్ వైర్కు పట్టుకోవడం, దాన్ని తప్పించి నీళ్లల్లో వేయడం జరుగుతుంటుంది. దీనికి పరిష్కారంగా నగర పోలీసులు గడిచిన ఆరేళ్ల నుంచి ప్రత్యేకంగా డిజైన్ చేయించిన హుక్ను వాడుతున్నారు. ఈసారి దానికంటే వేగంగా నిమజ్జనం పూర్తి చేయడానికి మరో కొత్త విధానం అవలంబించనున్నారు. ప్లాట్ఫామ్కు కింద ప్లాస్టిక్ డ్రమ్స్... ఈ విధానంలో భాగంగా విగ్రహాలను ఉంచే ప్లాట్ఫామ్కు కింది వైపు ఓ పక్కన ఒకటి లేదా రెండు ప్లాస్టిక్ డ్రమ్ములను ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి ఏర్పాటు ఉన్న ప్లాట్ఫామ్పై ఉన్న విగ్రహాన్ని నీటి ఉపరితలం వద్దకు తీసుకువెళ్లిన తర్వాత ప్రత్యేకంగా నీటిలోకి వేయాల్సిన అవసరం ఉండదు. క్రేన్ ఆపరేటర్ ప్లాట్ఫామ్ను కిందికి దించితే సరిపోతుంది. ఽఖాళీ డ్రమ్ము ఉన్న భాగం పైకి ఉండిపోయి.. మరోవైపు కిందికి వెళ్తుంది. ఫలితంగా ప్లాట్ఫామ్ పైన ఉన్న విగ్రహం ఆ వైపునకు పడిపోతుంది. ఈ విధానంగా నిమజ్జనం ఎవరి ప్రమేయం లేకుండా సాధారణ సమయం కంటే నాలుగు నుంచి ఆరు నిమిషాల ముందే ముగుస్తుంది. ట్యాంక్బండ్ వద్ద ఏర్పాట్ల పరిశీలన... ట్యాంక్బండ్ ఆధునికీకరణకు అనేక చర్యలు తీసుకున్న ప్రభుత్వం సర్వాంగ సుందరంగా తీర్చిదింది. దీంతో ఈ ఏడాది దానిపై అవసరమైన సంఖ్యలోనే క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా ఎక్కువ ఎత్తు లేకుండా మధ్యస్తంగా ఉన్న వాటినే నిమజ్జనం చేయనున్నారు. ఎన్టీఆర్ మార్గ్, పీవీ నరసింహారావు మార్గ్ల్లో గతం కంటే ఎక్కువ క్రేన్లు ఉండనున్నాయి. వీటి ద్వారానే పెద్ద విగ్రహాల నిమజ్జనం జరుగుతుంది. సాగర్ చుట్టూ ఉండే అన్ని క్రేన్ల ప్లాట్ఫామ్లకు ఖాళీ డ్రమ్ములు ఏర్పాటు చేయనున్నారు. సామూహిక నిమజ్జనం సమీపిస్తుండటంతో అక్కడి ఏర్పాట్లను నగర కొత్వాల్ సీవీ ఆనంద్ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, క్రేన్ల ఏర్పాటు, ట్రాఫిక్ మళ్లింపులకు తీసుకుంటున్న చర్యల్లో అనేక మార్పులు చేర్పులను సూచించారు. -
గణేశ్ శోభాయాత్రలో.. డీజే ఆపినందుకు ఒక్కసారిగా.. వ్యక్తిపై కత్తితో దాడి!!
నల్గొండ: గణేశ్ శోభాయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. గంజాయి మత్తులో ఓ వ్యక్తి మిర్యాలగూడ డీసీఎం యూనియన్ జనరల్ సెక్రటరీ వెంకన్నపై కత్తితో దాడి చేశాడు. మిర్యాలగూడ పట్ణంలోని వాసవీనగర్లో నివాసముంటున్న సుంకరబోయిన వెంకన్న డీసీఎం డ్రైవర్స్, ఓనర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి శనివారం నిర్వహిస్తున్న శోభాయాత్రలో పాల్గొన్నాడు. వాడపల్లిలో వినాయకుడిని నిమజ్జనం చేసే క్రమంలో పట్టణంలో నిర్వహిస్తున్న శోభాయాత్రలో మిర్యాలగూడ మండలం తుంగపాడుకు చెందిన నాగరాజు కూడా పాల్గొన్నాడు. నాగరాజు గంజాయి మత్తులో డీజేకు అనుగుణంగా నృత్యం చేస్తూ శోభాయాత్రను ముందుకు సాగనివ్వడం లేదు. దీంతో శోభాయాత్ర నిర్వాహకులు డీజేని ఆపి ముందుకు సాగుతున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన నాగరాజు వెంట తెచ్చుకున్న కత్తితో వెంకన్నపై దాడి చేశాడు. గమనించిన కొందరు నాగరాజుని అడ్డుకుని గాయపడిన వెంకన్నను ఆస్పత్రికి తరలించారు. ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకన్నను డీఎస్పీ వెంకటగిరి కలిసి దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ ఎస్ఐ శ్రీనునాయక్ తెలిపారు. -
వైరల్ అవుతున్న మహేష్ బాబు కొడుకు, కూతురు వినాయకుడి నిమజ్జనం
-
ట్రాఫిక్ పోలీసుల రూట్ స్టడీ!
హైదరాబాద్: ‘గణేష్ విగ్రహాలతో ఊరేగింపుగా వచ్చే ఒక్క లారీకీ ఆటంకాలు ఏర్పడకూడదు. ఎక్కడా ట్రాఫిక్ జామ్స్కు తావుండకూడదు. 29వ తేదీ తెల్లవారుజాము సమయానికే ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్బండ్ సాధారణ ట్రాఫిక్కు అందుబాటులోకి రావాలి’ – గణేష్ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సామూహిక నిమజ్జనం నేపథ్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలివి. ఈ నెల 28న జరిగే ఈ క్రతువు కోసం అధికారులతో పాటు క్షేత్రస్థాయిలో ఉండే సిబ్బంది ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ట్రాఫిక్ ఠాణాల వారీగా నిమజ్జనం రూట్లను అధ్యయనం చేస్తూ, మండప నిర్వాహకులతో సమన్వయం ఏర్పాటు చేసుకుని చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ చీఫ్ జి.సుధీర్బాబు నేతృత్వంలో డీసీపీలు రాహుల్ హెగ్డే, డి.శ్రీనివాస్ వీటిని పర్యవేక్షిస్తున్నారు. విగ్రహాల ఎత్తు ఆధారంగా మార్గం... సామూహిక నిమజ్జనాన్ని సజావుగా పూర్తి చేయడంలో ట్రాఫిక్ అధికారుల పాత్ర కీలకం. ఊరేగింపు మార్గంలో ఏ చిన్న అవాంతరం ఏర్పడినా గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్స్ ఏర్పడటంతో పాటు ఆ ప్రభావం మరుసటి రోజు ట్రాఫిక్పై పడుతుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి వివిధ మార్గాల్లో ఉన్న పాట్హోల్స్ మరమ్మతులు, చెట్టు కొమ్మల నరికివేత తదితర చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో భారీ విగ్రహాలను ఏర్పాటు చేసిన మండపాల వివరాలు పోలీసుస్టేషన్ల వారీగా అధికారుల వద్ద అందుబాటులో ఉన్నాయి. మండపం ఏర్పాటు సమయంలో, ఆ తర్వాత నిర్వాహకులు పోలీసులు ఇచ్చిన పత్రంలో విగ్రహం ఎత్తు, నిమజ్జనం జరిగే తేదీ, ప్రాంతం ఉంటున్నాయి. ఈ వివరాలు సేకరించిన ట్రాఫిక్ ఠాణాల వారీగా అధ్యయనం చేస్తున్నారు. సదరు విగ్రహం ఊరేగింపు జరిగే మార్గాల్లో ఉన్న వంతెనలు, వాటి ఎత్తు పరిగణనలోకి తీసుకుంటున్నారు. రోడ్డు నుంచి వంతెన ఎంత ఎత్తులో ఉందో దాని కంటే కనిష్టంగా ఐదు అడుగుల తక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలకే ఆయా రూట్లలో క్లియరెన్స్ ఇస్తున్నారు. ట్రాలీ లేదా లారీ ఎత్తును పరిగణనలోకి తీసుకుంటూ ఇలా చేయనున్నారు. మిగిలిన వాటికి నిర్ణీత సమయం ముందే ప్రత్యామ్నాయ మార్గాలు సూచించనున్నారు. పీవీఎన్ఆర్ మార్గ్లో హోల్డింగ్ ఏరియా... నిమజ్జనానికి విగ్రహాలను తీసుకువచ్చే ప్రతి వాహనానికీ పోలీసు విభాగం సీరియల్ నెంబర్తో కూడిన స్టిక్కర్ ఇస్తుంటుంది. ఈసారి ఇందులో విగ్ర హం ఎత్తును పొందుపరుస్తున్నారు. ఆయా వాహనాలకు ముందు భాగంలో అతికించి ఉండే దీన్ని అంబేడ్కర్ విగ్రహం చౌరస్తాలోని పోలీసు సిబ్బంది పరిశీలిస్తారు. విగ్రహం ఎత్తు ఆధారంగా ట్యాంక్బండ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ఆర్ మార్గ్లోని వాటిని పంపిస్తారు. నిమజ్జనం రోజున ట్యాంక్బండ్, ఎన్టీఆర్ మార్గ్ల్లోకి సాధారణ వాహనాలు అనుమతించరు. ఈ నేపథ్యంలోనే వీలున్నంత వరకు 29వ తేదీ తెల్లవారేసరికి నిమజ్జనం పూర్తి చేసి, ఈ రెండు రూట్లను సాధారణ వాహనాలను అందుబాటులోకి తేవాలని ట్రాఫిక్ అధికారులు భావిస్తున్నారు. అప్పటికీ కొన్ని విగ్రహాల నిమజ్జనం మిగిలి ఉంటే పీవీఎన్ఆర్ మార్గ్ను హోల్డింగ్ ఏరియాగా చేసి వాటితో ఉన్న వాహనాలను అక్కడికి పంపిస్తారు. ఆపై ఆ మార్గంతో పాటు ఎన్టీఆర్ మార్గ్లో ఉన్న క్రేన్ల వద్ద క్రమపద్దతిలో నిమజ్జనం చేయడుతూ... రెండు మార్గాలను సాధారణ ట్రాఫిక్కు అందుబాటులోకి తీసుకురానున్నారు. మరోపక్క పాతబస్తీలోని సున్నిత ప్రాంతాల్లో ఉన్న గణేష్ మండపాల వద్దకు స్వయంగా వెళ్తున్న నగర కొత్వాల్ సీవీ ఆనంద్ అక్కడి పరిస్థితులు, మార్గాలను అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన గురువారం రాత్రి హుస్సేనిఆలం, కామాటిపుర, మొఘల్పురాలో ఆనంద్ పర్యటించారు. తెలుగుతల్లి జంక్షన్ మూసివేతతో.. రాజధానిలో ఎన్ని నిమజ్జనం జరిగే చెరువులు, పాండ్స్ ఉన్నప్పటికీ... హుస్సేన్సాగర్కు ప్రత్యేకత ఉంది. బషీర్బాగ్ వైపు నుంచి వచ్చే ప్రధాన ఊరేగింపులోని విగ్రహాలన్నీ అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా, తెలుగుతల్లి జంక్షన్ మీదుగా అటు ట్యాంక్బండ్, ఇటు ఎన్టీఆర్ మార్గ్వైపు వస్తాయి. అయితే కొత్త సచివాలయం అందుబాటులోకి రావడంతో ఆ ప్రాంతంలోని రహదారులు, జంక్షన్ల వద్ద కీలక మార్పు చేర్పులు జరిగాయి. తెలుగుతల్లి చౌరస్తా మూసివేతతో పాటు సచివాలయం ముందు కొత్త రోడ్డు అందుబాటులోకి రావడం, ఎన్టీఆర్ మార్గ్లో ఫుట్పాత్ నిర్మాణాల నేపథ్యంలో ఈ ఏడాది నిమజ్జనం ప్రక్రియలో స్వల్పమార్పు చేర్పులు చోటు చేసుకోనున్నాయి. తెలుగుతల్లి జంక్షన్ మూసివేత నేపథ్యంలో ఆ ప్రాంతం మీదుగా విగ్రహాలతో వచ్చే లారీలు ఇక్బాల్ మినార్ వైపు వెళ్లి... ఫ్లైఓవర్ ప్రారంభం వద్ద యూ టర్న్ తీసుకుని ట్యాంక్బండ్ వైపు రానున్నాయి. ఫార్ములా ఈ–రేసింగ్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బారికేడ్లను ట్రాఫిక్ అధికారులు పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి పీవీఎన్ఆర్ మార్గ్లోని పీపుల్స్ ప్లాజా పక్కన ఓ నిమజ్జనం ఘాట్ నిర్మించిన అధికారులు అక్కడ అదనంగా మూడు క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారు. డీసీఎం వాహనాల్లో వచ్చే మధ్య స్థాయి ఎత్తు విగ్రహాలను ఇక్కడ నిమజ్జనం చేయనున్నారు. -
నిమజ్జనం నిరుటి మాదిరే
సాక్షి, సిటీబ్యూరో: వినాయకచవితి పండగ సమీపిస్తుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు ఎక్కడి వారు అక్కడే తమకు దగ్గరి ప్రాంతాల్లో నిమజ్జనాలు చేసేందుకు వీలుగా కొలనులు సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా జీహెచ్ఎంసీ నిమజ్జనాల కోసమే నిర్మించిన కొలనులతోపాటు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పోర్టబుల్ కొలనులు, తాత్కాలికంగా నిర్మించే కొలనుల్ని నిమజ్జనాల కోసం వినియోగించనున్నారు. నిమజ్జనాల కోసమే నిర్మించిన కొలనుల్ని బేబీపాండ్స్గా వ్యవహరిస్తున్నారు. నిర్వహణలేక వ్యర్థాలతో నిండిపోయిన బేబిపాండ్స్ను శుభ్రం చేయడంతోపాటు, తాత్కాలిక చెరువుల పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బందికి గణేష్ మట్టి విగ్రహాలు మేయర్ పంపిణీ చేశారు. -
హుస్సేన్ సాగర్ చుట్టూ 200 సీసీ కెమెరాల ఏర్పాటు
-
తీన్మార్ డ్యాన్సులు, స్టెప్పులతో గణేషుడికి వీడ్కోలు
-
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం (ఫొటోలు)
-
బాలాపూర్ గణేష్ లడ్డు వేలం (ఫొటోలు)
-
హైదరాబాద్లో ఘనంగా గణనాథుల శోభయాత్ర (ఫొటోలు)
-
నిమజ్జనం పై డీజీపీ మహేందర్ రెడ్డి కీలక ప్రకటన
-
గణేష్ ఉత్సవాల్లో కీలక ఘట్టం.. హుస్సేన్సాగర్ వద్ద భారీ ఏర్పాట్లు (ఫొటోలు)
-
ఇక కీలక ఘట్టమే.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షల వివరాలివే!
సాక్షి, హైదరాబాద్: గణేష్ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సామూహిక నిమజ్జనం శుక్రవారం హుస్సేన్సాగర్లో జరగనుంది. దీనికి భారీ ఊరేగింపు సైతం ఉంటుంది. ఈ నేపథ్యంలో నగర శివార్లతో పాటు సిటీ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు బుధవారం నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. సిటీలోని మొత్తం 66 ప్రాంతాల్లో ట్రాఫిక్ను మళ్లించడమో, పూర్తిగా ఆపేయడమో చేస్తారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు ఇవి అమలులో ఉంటాయి. అవసరాన్ని బట్టి వీటిని పొడిగించే అవకాశం ఉంది. నిమజ్జనం పూర్తయిన తర్వాత విగ్రహాలను తెచ్చిన ఖాళీ లారీల కోసం ప్రత్యేక రూట్లు కేటాయించారు. నిమజ్జనానికి వచ్చే ప్రజలు వీలున్నంత వరకు వ్యక్తిగత వాహనాలను వదిలి ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్లను ఆశ్రయించాలని పోలీసులు సూచించారు. నగరంలోని దాదాపు 30 గంటల పాటు ప్రైవేట్ బస్సులు, లారీలు (గణేషులని తెచ్చేవి మినహా), ఇతర భారీ వాహనాలకు అనుమతి ఉండదు. ఆంక్షలు, మళ్లింపులు నేపథ్యంలో అత్యవసర వాహనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణ వాహనాలు ఆంక్షలు మార్గంలో ఇటు–అటు మారడానికి బషీర్బాగ్ ఫ్లైఓవర్ వద్ద అవకాశం కల్పిస్తున్నారు. ప్రధాన ఊరేగింపు మార్గం ►కేశవగిరి–నాగుల్చింత–ఫలక్నుమా–చార్మినార్–మదీనా–అఫ్జల్గంజ్–ఎంజే మార్కెట్–అబిడ్స్–బషీర్బాగ్–లిబర్టీ–ఎన్టీఆర్ (పీవీఎన్ఆర్) మార్గ్ సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చేది.. ►ఆర్పీ రోడ్–ఎంజీ రోడ్–కర్బాలామైదాన్–ముషీరాబాద్ చౌరస్తా–ఆర్టీసీ క్రాస్రోడ్స్– నారాయణగూడ ‘ఎక్స్’ రోడ్–హిమాయత్నగర్ ‘వై’ జంక్షన్ ద్వారా వచ్చి లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులో చేరుతుంది. చదవండి: (Hyderabad: సెప్టెంబర్ గండం.. గ్రేటర్ వాసుల వెన్నులో వణుకు) ఈస్ట్జోన్ నుంచి వచ్చేది.. ►ఉప్పల్–రామాంతపూర్–అంబర్పేట్–ఓయూ ఎన్సీసీ–డీడీ హాస్పిటల్ల మీదుగా ప్రయాణించి ఆర్టీసీ క్రాస్రోడ్స్ వద్ద సికింద్రాబాద్ రూట్ దాంతో కలుస్తుంది. ►వెస్ట్ జోన్ వైపు నుంచి వచ్చే ఊరేగింపు ఎంజే మార్కెట్ లేదా సెక్రటేరియేట్ వద్ద ప్రధాన ఊరేగింపుతో కలుస్తాయి. ►నిమజ్జనం ఊరేగింపు జరిగే మార్గాల్లో చిన్న వాహనాలకు అనుమతి ఉండదు. ఈ మార్గానికి అటు ఇటు ప్రాంతాల్లో ఉన్న వారు ప్రయాణించడానికి కేవలం బషీర్బాగ్ చౌరస్తా వద్ద మాత్రమే అవకాశం ఇచ్చారు. సాధారణ ప్రజలు రింగ్రోడ్, బేగంపేట్ మార్గాలను ఆశ్రయించడం ఉత్తమం. ►వెస్ట్–ఈస్ట్ జోన్ల మధ్య రాకపోకలు సాగించే వారికి కేవలం బషీర్బాగ్ వద్దే అవకాశం ఉంటుంది. ►వాహనచోదకులు సాధ్యమైనంత వరకు ఔటర్ రింగ్ రోడ్, బేగంపేట్ మార్గాలను ఎంపిక చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. కి.మీ పరిధిలో సందర్శకులకు పార్కింగ్.. హుస్సేన్సాగర్లో జరిగే నిమజ్జనాన్ని వీక్షించడానికి వచ్చే సందర్శకుల కోసం కి.మీ పరిధిలో ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయించారు. అవి.. ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్, ఆనంద్నగర్ కాలనీ నుంచి రంగారెడ్డి జెడ్పీ ఆఫీస్ మధ్య, బుద్ధ భవన్ పక్కన, ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కాలేజీ, పబ్లిక్ గార్డెన్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, లోయర్ ట్యాంక్బండ్, గో సేవా సదన్, కట్టమైసమ్మ టెంపుల్. ఇక్కడ నుంచి సందర్శకులు కాలినడకనే ట్యాంక్బండ్ పరిసరాలకు చేరుకోవాలి. హెల్ప్లైన్ల ఏర్పాటు: ఆంక్షలపై ప్రజలకు అవగాహన కల్పించడం, సహకరించడం కోసం ప్రత్యేక హెల్ప్లైన్స్ను సైతం ఏర్పాటు చేశారు. ఎలాంటి సహాయం కావాలన్నా 040–27852482, 94905 98985, 90102 03626లను సంప్రదించవచ్చు. ఇంత రాద్ధాంతమా: తలసాని కవాడిగూడ: వినాయక నిమజ్జనంపై కొన్ని శక్తులు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని ర్యాలీలు, దీక్షలు చేయాల్సిన అవసరం ఏముందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. బుధవారం ట్యాంక్బండ్పై నిమజ్జన ఏర్పాట్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. దేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద మొత్తంలో వినాయక చవితి ఏర్పాట్లు జరగలేదన్నారు. ప్రజలను కొందరు గందరగోళానికి గురి చేస్తున్నారని చెప్పారు. వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు మండపాల నిర్వాహకులు ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలని సూచించారు. ట్యాంక్బండ్పై క్రేన్ల ఏర్పాటు ఎట్టకేలకు ఈసారి సైతం హుస్సేన్సాగర్లో వినాయక నిమజ్జనాలు జరగనున్నాయని తెలుస్తోంది. నిమజ్జనానికి సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేసింది. దాదాపు వారం రోజులుగా భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి, బీజేపీ నిమజ్జనాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం లేదని, ఓ దశలో తామే చేస్తామని చెప్పడంతో ప్రభుత్వం తరపునే అన్నీ నిర్వహిస్తామని మంత్రి తలసాని పేర్కొనడం తెలిసిందే. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి సైతం ఎన్టీఆర్ మార్గ్వైపు 9 క్రేన్లు, ట్యాంక్బండ్పై 16 క్రేన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. వీటితోపాటు పీపుల్స్ప్లాజా దగ్గర రెండు బేబిపాండ్లు, ట్యాంక్బండ్ చిల్డ్రన్స్పార్కువద్ద 3 బేబిపాండ్లలో నిమజ్జనాలు జరగనున్నాయి. ఫ్లైఓవర్లు బంద్ వినాయక నిమజ్జనం నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఫ్లైఓవర్లన్నింటినీ మూసివేస్తారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు నిమజ్జనం పూర్తయ్యే వరకూ నిమజ్జనం జరిగే చెరువులు, ట్యాంక్లు పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ రావు తెలిపారు. పలుచోట్ల ట్రాఫిక్, మళ్లింపులు ఉంటాయన్నారు. అత్యవసర సహాయం కోసం 040–23002424, 85004 11111లను సంప్రదించవచ్చు. ఏర్పాట్లు ముమ్మరం రేపటి గణేశ్ విగ్రహాల నిమజ్జనాలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. హుస్సేన్సాగర్తో పాటు 74 కోనేర్లలో నిమజ్జనాలు జరగనున్నాయి. బాలాపూర్ నుంచి శోభాయాత్ర పొడవునా 303 కి.మీ మేర ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా జీహెచ్ఎంసీతోపాటు వివిధ విభాగాలు ఏర్పాట్లు చేశాయి. 303.30 కి.మీ మేర శోభాయాత్ర సాగనుంది. -
‘హిందువులంతా సద్దికట్టుకుని ట్యాంక్బండ్కు రండి’
కవాడిగూడ (హైదరాబాద్): పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఒక నాస్తికుడని అందుకే వినాయక నిమజ్జనానికి ఆటంకం కలిగిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. గణనాథులను ట్యాంక్బండ్లోనే నిమజ్జనం చేద్దామని, అందుకు హిందువులంతా సద్దికట్టుకుని ట్యాంక్బండ్పైకి రావాలని పిలుపునిచ్చారు. ట్యాంక్బండ్పై వినాయక నిమజ్జన ఏర్పాట్లను బుధవారం సంజయ్ పలువురు నేతలతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి దీక్షలకు, బీజేపీ నిరసనలకు దిగొచ్చి ప్రభుత్వం ట్యాంక్బండ్పై క్రేన్లను ఏర్పాట్లు చేస్తోందన్నారు. ట్యాంక్బండ్పై వినాయక మండపాల నిర్వాహకులను పోలీసులు అడ్డుకుంటుంటే దారుసలాంలో సంబురాలు చేసుకుంటున్నారన్నారు. నిఖా ర్సయిన హిందువునని ప్రకటించుకునే సీఎం కేసీఆర్కు ఇది తగునా? అని ప్రశ్నించారు. ఇదీ చదవండి: Telangana: స్పీకర్పై చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్ -
ఘనంగా గణేష్ నిమజ్జనం (ఫోటోలు)
-
Hyderabad: 9న గణేష్ నిమజ్జనం.. ఉచితంగా 6 లక్షల విగ్రహాల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 31న గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని, వచ్చే నెల సెప్టెంబరు 9న గణేష్ నిమజ్జనం నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై మంగళవారం జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 4 లక్షలు, పీసీబీ ఆధ్వర్యంలో లక్ష, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో లక్ష చొప్పున మొత్తం 6 లక్షల గణేష్ విగ్రహాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఖైరతాబాద్ గణేష్ను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఇబ్బందులకు గురి కాకుండా ఆర్అండ్బీ ఆధ్వర్యంలో బారికేడ్లు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెల 24న అధికారులతో కలిసి ఖైరతాబాద్ గణేష్ మండపాన్ని సందర్శిస్తామన్నారు. విగ్రహాల నిమజ్జనం కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 25 పాండ్లకు అదనంగా మరో 50 పాండ్ను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. విగ్రహాల ఊరేగింపు రహదారుల్లో అవసరమైన చోట్ల మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపడతామన్నారు. సెప్టెంబరు 9న నిర్వహించే గణేష్ నిమజ్జనానికి సుమారు 8 వేల మంది జీహెచ్ఎంసీ సిబ్బంది మూడు షిఫ్ట్ల్లో విధుల్లో ఉంటారని చెప్పారు. గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించేలా సహకరించాలన్నారు. (క్లిక్: కోట్ల గొంతుకలు.. ఒక్క స్వరమై) సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ ప్రభాకర్రావు, విద్యుత్ శాఖచీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, అదనపు డీజీపీ జితేందర్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్, పీసీసీబీ మెంబర్ సెక్రటరీ నీతూ కుమారి ప్రసాద్, పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, మహేష్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, కలెక్టర్ అమయ్ కుమార్, టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారి రఘోత్తంరెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు భగవంతరావు, రాఘవరెడ్డి, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధి సుదర్శన్, సికింద్రాబాద్, గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: సందడిగా మెగా రికార్డ్స్ అవార్డుల ప్రదానోత్సవం) -
Hyderabad: గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై సీఎస్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో సెప్టెంబర్, 2022లో జరిగే గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం బీఆర్కేఆర్ భవన్లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, అడిషనల్ డీజీ జితేందర్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, మహేష్ భగవత్, జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, కాలుష్య నియంత్రణా మండలి కార్యదర్శి నీతూ ప్రసాద్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, నగరంలో కాలుష్య కారక గణేష్ విగ్రహాలను ఉపయోగించవద్దని రాష్ట్ర హైకోర్ట్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, ఈ నేపథ్యంలో మట్టి వినాయకుల విగ్రహాలు వినియోగించే విధంగా నగర వాసులను చైతన్య పర్చాలని పేర్కొన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, సింథటిక్ కలర్లు, పర్యావరణ హాని కారక కెమికల్స్ను విగ్రహాల తయారీలో నిషేధిస్తూ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. పీఓపీతో తయారు చేసిన విగ్రహాలను ట్యాంక్ బండ్తో పాటు నగరంలోని ఇతర చెరువుల్లో కూడా నిమజ్జనం చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేసిందని సీఎస్ వివరించారు. ఈ అంశాలపై విగ్రహ తయారీదారులను చైతన్య పర్చాలని సూచించారు. నగరంలో మట్టి వినాయకుల తయారీ దార్లను ప్రోత్సహించడంతోపాటు మట్టి విగ్రహాల మార్కెటింగ్ కు తగు ప్రోత్సాహం ఇవ్వాలని సీఎస్ సూచించారు. హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. చదవండి: (ఉస్మానియా ఆస్పత్రి: వెయ్యి ఇస్తేనే శవం తీసుకెళ్తాం!) -
Hussain Sagar: ఈ ఏడాది కాలుష్యం తగ్గింది
సాక్షి, సిటీబ్యూరో: గత ఏడాది గణేష్ నిమజ్జనంతో పోలిస్తే.. ఈ ఏడాది హుస్సేన్సాగర్లో కాలుష్యం గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తాజా నివేదిక వెల్లడించింది. కాలుష్యంపై బుధవారం తుది నివేదిక విడుదల చేసింది. ఇందులో నిమజ్జనానికి ముందు, నిమజ్జనం జరిగిన రోజులు, అనంతరం సాగర జలాలను నాణ్యతను పరిశీలించి నివేదికను వెలువరించింది. ట్యాంక్ బండ్, బుద్ధ విగ్రహం, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, లేపాక్షి ప్రాంతాల్లో నీటి నమూనాలు సేకరించి నీటి నాణ్యతను ప్రయోగశాలలో పరిశీలించారు. నిమజ్జనం సమయంలో సాగర జలాల్లో కరిగిన ఆక్సిజన్ శాతం తగ్గుముఖం పట్టిందని, కరిగిన ఘనపదార్థాల మోతాదు పెరిగిందని, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరిగిందని, భార లోహాల మోతాదు సైతం పెరిగిందని వెల్లడించింది. నిమజ్జనం అనంతరం భారీగా వర్షాలు కురవడంతో.. సాగరంలో భారీగా వరద నీరు చేరి ఆయా కాలుష్యాల మోతాదు గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం సాగర్ జలాల నాణ్యత కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పరిమితుల మేరకే ఉన్నట్లు తెలిపింది. -
గణేశ్ నిమజ్జనం: ఈ ఫొటో చూసి వావ్ అనాల్సిందే!
అకేషన్ ఏదైనా ఫొటో ఉండాల్సిందే. ఫోన్ చేతిలో ఉంటే ‘బొమ్మ’పడాల్సిందే. స్మార్ట్ఫోన్లు విరివిరిగా అందుబాటులోకి వచ్చాక ఫొటోలు తీయడం అనేది సర్వసాధారణ విషయంగా మారిపోయింది. కళ్ల ముందు కనిపించే ప్రతి దృశ్యాన్ని ఫోన్ కెమెరాలో బంధించేందుకు ఆరాటపడుతున్నారు జనం. ఇలాంటి దృశ్యమే హైదరాబాద్లో గణేశ్ నిమజ్జన వేడుకల సందర్భంగా ఆవిష్కృతమైంది. భక్తుల ఆనందోత్సాహాల నడుమ శోభాయాత్రగా నిమజ్జనానికి బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుని భాగ్యనగర వాసులు పులకితులయ్యారు. అంతేకాదు శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతిని తమ ఫోన్ కెమెరాలతో ఫొటోలు తీసుకుని మురిసిపోయారు. ఆ సందర్భంగా తీసిన ఈ ఫోటోను హాయ్ హైదరాబాద్ ట్విటర్ పేజీలో పోస్ట్ చేశారు. Photo Courtesy: Hi Hyderabad Twitter Page గణేశ్ నిమజ్జన వేడుకల్లో భాగంగా చార్మినార్ సమీపంలో తీసిన మరో ఫొటో కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. శివుడి బాహువుపై ఆశీసుడైన గణనాథుడి ప్రతిమ వెనుక భాగంలో చార్మినార్ కనిపించే విధంగా తీసిన ఈ ఫోటో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. Photo Courtesy: Hi Hyderabad Twitter Page -
గంగమ్మ ఒడికి బొజ్జ గణపయ్య
-
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఫొటోలు
-
Ganesh: జజ్జనకరి జనారే.. నిమజ్జన హుషారే
సాగరం సన్నద్ధమైంది. గణనాథుడికి ఘనమైన స్వాగతం చెప్పేందుకు అలలు ఉవ్విళ్లూరుతున్నాయి. మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానున్న మహా ‘గణ’ ప్రభంజనానికి సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలో వందేళ్ల క్రితమే మొదలైన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంచెలంచెలుగా మహానగరమంతా విస్తరించుకున్నాయి. గతేడాది కోవిడ్ కారణంగా దేవదేవుడికి సాదాసీదాగా పూజలు చేసిన భక్తజనం ఈసారి ఘనంగా వేడుకలు నిర్వహించింది. నగరమంతటా వేలాది విగ్రహాలను ప్రతిష్టించారు. ఇష్టదైవాన్ని ఆనందోత్సాహాలతో కొలిచి మొక్కారు. ‘కరోనా వంటి మహమ్మారులు మరోసారి ప్రబలకుండా మమ్మల్ని కాపాడవయ్యా బొజ్జ గణపయ్యా’ అంటూ భక్తులు వేడుకున్నారు. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న లంబోదరుడి నిమజ్జన శోభాయాత్రతో భక్తజన సాగరం కనువిందు చేయనుంది. మహాగణపతి క్రేన్ నంబర్–4 ► ఖైరతాబాద్ శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతి నిమజ్జనం క్రేన్ నంబర్–4 వద్ద జరిగేలా ఏర్పాట్లు చేశారు. ► 2.5 కి.మీ. మేర సాగే ఖైరతాబాద్ వినాయక నిమజ్జన ప్రక్రియ మొత్తం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోగా పూర్తి చేయాలని పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ► బెంగళూరు నుంచి ప్రత్యేక భారీ వాహనాన్ని తీసుకొచ్చారు. ► ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ మండపం నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ► 11 గంటల మధ్య ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెం.4 వద్దకు చేరుకోగానే 12 గంటల నుంచి 1 గంట మధ్య నిమజ్జనం పూర్తి చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. రూట్ మ్యాప్ ఇలా... మహాగణపతి మండపం నుంచి శోభాయాత్ర ప్రారంభమై సెన్షేషన్ థియేటర్, రాజ్ దూత్ చౌరస్తా మీదుగా టెలిఫోన్ భవన్, ఎక్బాల్ మినార్, తెలుగుతల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ మార్గ్ గుండా క్రేన్ నెం.4 వద్దకు చేరుకుంటుంది. బాలాపూర్ గణేష్ ఎటు వైపు నుంచి? బాలాపూర్ నుంచి హుస్సేన్సాగర్ వరకు 17 కి.మీ. గణేష్ శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మార్గంలోని ఫలక్నుమా బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. శనివారం రాత్రి వరకు కొంత పూర్తయ్యే అవకాశం ఉందని..రాత్రి సమయంలో ట్రయల్ రన్ వేసి..సజావుగా సాగితే బాలాపూర్ గణేష్తో పాటు 15 అడుగులకు మించిన మూడు నాలుగు విగ్రహాలను కూడా ఇదే బ్రిడ్జి మీదుగా అనుమతిస్తామని సీపీ తెలిపారు. ట్రయల్ రన్లో విఫలమైతే కందికల్ గేట్ నుంచి లాల్దర్వాజా మీదుగా సాగర్ వైపు మళ్లిస్తామని చెప్పారు. ► కేశవగిరి నుంచి ప్రారంభమయ్యే ఊరేగింపు విగ్రహాలు పాత చాంద్రాయణగుట్ట పీఎస్– చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్– నల్లవాగు–కందికల్గేట్ ఫ్లైఓవర్– ఓపీ ఛత్రినాక– లాల్దర్వాజాగుడి–నాగుల్చింత–చార్మినార్–మదీనా–అఫ్జల్గంజ్– ఎస్బజార్–ఎంజేమార్కెట్– అబిడ్స్–బషీర్బాగ్–లిబర్టీ–అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్, (నెక్లెస్ రోడ్) లేదా ఎగువ ట్యాంక్బండ్ వెళ్తాయి. ► సికింద్రాబాద్ మీదుగా వచ్చే ఊరేగింపు విగ్రహాలు ఆర్పీ రోడ్ నుంచి ఎంజీ రోడ్–కర్బాలా మైదాన్– కవాడిగూడ– ముషీరాబాద్ క్రాస్ రోడ్– ఆర్టీసీ క్రాస్రోడ్– నారాయణగూడ క్రాస్ రోడ్– హిమాయత్నగర్ వై జంక్షన్ నుంచి లిబర్టీలో ప్రధాన మార్గంలో కలవాలి. ► చిలకలగూడ క్రాస్రోడ్ నుంచి వచ్చే వాహనాలు గాంధీ ఆసుపత్రి మీదుగా ముషీరాబాద్ క్రాస్ రోడ్లో కలవాలి. ► ఉప్పల్ నుంచి వాహనాలు రామంతాపూర్– 6 నంబర్ జంక్షన్ అంబర్పేట– శివంరోడ్– ఎన్సీసీ– దుర్గాభాయి దేశ్ముఖ్ ఆసుపత్రి– హింది మహావిద్యాలయ్ క్రాస్రోడ్– ఫీవర్ ఆసుపత్రి– బర్కత్పుర క్రాస్ రోడ్– నారాయణగూడ క్రాస్రోడ్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి వచ్చే మార్గంలో కలవాలి. ► దిల్సుఖ్నగర్ నుంచి వచ్చే వాహనాలు ఐఎస్ సదన్– సైదాబాద్– చంచల్గూడ నుంచి ముసారాంబాగ్ మీదుగా అంబర్పేట మార్గంలో కలవాలి. ► తార్నాక నుంచి వచ్చే విగ్రహాలు ఓయూ దూరవిద్యా కేంద్ర రోడ్ నుంచి అడిక్మెట్ నుంచి విద్యానగర్ మీదుగా ఫీవర్ ఆసుపత్రి మార్గంలో కలవాలి. ► టోలిచౌకి, రేతిబౌలి, మెహదీపట్నం నుంచి వచ్చే వాహనాలు మాసబ్ట్యాంక్ మీదుగా అయోధ్య జంక్షన్– నిరంకారీ భవన్– పాత సైఫాబాద్ పీఎస్– ఇక్బాల్ మినార్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు మళ్లాలి. ► ఎర్రగడ్డ నుంచి వచ్చే వాహనాలు ఎస్ఆర్నగర్– అమీర్పేట–పంజగుట్ట–వీవీ విగ్రహం నుంచి మెహదీపట్నం మీదుగా నిరంకారీ భవన్ వైపు మళ్లాలి. ► టపాచబుత్ర, ఆసిఫ్నగర్ మీదుగా వచ్చే వాహనాలు సీతారాంబాగ్– బోయిగూడ కమాన్– వౌల్గా హోటల్– గోషామహల్ బారాదరి– అలాస్కా మీదుగా ఎంజే మార్కెట్ ప్రధాన మార్గంలో కలవాలి. ఇక్కడ్నుంచి అబిడ్స్ మీదుగా బషీరాబాగ్–లిబర్టీ– అంబేద్కర్ విగ్రహం– ఎన్టీఆర్ మార్గ్– పీవీఎన్ఆర్ మార్గ్ మీదుగా ఎగువ ట్యాంక్బండ్కు చేరుకోవాలి ► సుమారు 27 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్త్ను ఏర్పాటు చేశారు. హోంగార్డ్లు, స్పెషల్ ఆఫీసర్స్, ఫారెస్ట్, ఎక్సైజ్, ఎస్పీఎఫ్, క్విక్ రెస్పాన్స్ టీమ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ పోలీసులు ఉన్నారు. ► సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలు, జంక్షన్లలో వజ్ర వాహనాలను, గ్యాస్ ఎస్కార్ట్, వాటర్ వెహికిల్స్, అగ్నిమాపక వాహనాలను సిద్ధం చేశారు. 19 సైబర్ ట్యాచ్ టీమ్, బాంబ్ డిస్పోజ్ టీమ్ను ఏర్పాటు చేశారు. 24 స్నిపర్ డాగ్స్ కూడా బందోబస్త్లో పాల్గొంటున్నాయి. ► రైల్వే స్టేషన్లు, బస్స్టాండ్లు, సాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వేగవంతమైన కమ్యూనికేషన్ కోసం ఇప్పటికే పోలీసులు వద్ద ఉన్న 2,700 వైర్లెస్ సెట్స్తో పాటు అదనంగా 475 సెట్లను అందించారు. ► హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఇరిగేషన్, మెట్రో, ట్రాన్స్పోర్ట్ విభాగాలలతో కూడిన జాయింట్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు అన్ని శాఖల అధికారులు పర్యవేక్షిస్తుంటారు. ► సుప్రీంకోర్టుకు చేసిన విజ్ఞప్తి కనుగుణంగా చెరువులు, కొలనులు కలుషితంకాకుండా విగ్రహాలు వేసిన వెంటనే తొలగించేందుకు ఏర్పాట్లు. ► హుస్సేన్సాగర్ ప్రాంతంలో కోవిడ్ నిరోధక ఉచిత వ్యాక్సినేషన్ శిబిరం. సోమవారం ఉదయం లోపే పూర్తి.. గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. అవసరమైన మేర పోలీసు బలగాలు విధుల్లో ఉంటాయి. మూడు కమిషనరేట్లతో పాటు చుట్టు పక్కల జిల్లాల నుంచి కూడా హుస్సేన్సాగర్లో నిమజ్జనానికి విగ్రహాలు తరలివస్తాయి. సుమా రు 50 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నాం. సోమ వారం ఉదయం 5:30 వరకు నిమజ్జనం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ కోవిడ్ నిబంధనలు పాటించాలి వినాయక నిమజ్జనం చూసేందుకు తరలివచ్చే భక్తులు, నిర్వాహకులు అందరూ కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలి. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. నిమజ్జనానికి వచ్చే మార్గాలలో ఎలాంటి వాహనాలు, నిర్మాణ సామగ్రి వంటివి నిలిపి ట్రాఫిక్ జామ్లకు గురిచేయకూడదు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగేలా ప్రజలు సహకరించాలి. – మహేశ్ ఎం. భగవత్, సీపీ, రాచకొండ వదంతుల్ని ఫార్వర్డ్ చేయొద్దు భక్తులు తమ పిల్లల్ని, వెంట తెచ్చుకునే వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలాంటి వదంతుల్ని నమ్మొద్దు. వాట్సాప్ గ్రూప్లకు అనవసర మెసేజ్లను ఫార్వర్డ్ చేయొద్దు. ఎవరైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే డయల్ 100కు గానీ 94906 17444 వాట్సాప్లో గానీ ఫిర్యాదు చేయాలి. మహిళలపై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే 94936 22395 నంబరులో ఫిర్యాదు చేయాలి. – స్టీఫెన్ రవీంద్ర, సీపీ, సైబరాబాద్ -
5వ రోజు గణేష్ నిమజ్జనం
-
భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనంపై గందరగోళం
-
ట్యాంక్బండ్లో 3వ రోజు గణేష్ నిమజ్జనం
-
ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జన ట్రయల్ రన్
-
జాగ్రత్త గణేశా..!
-
ట్యాంక్బండ్లో 5వ రోజు గణేష్ నిమజ్జనం
-
ట్యాంక్బండ్లో 3వ రోజు గణేష్ నిమజ్జనం
-
హబ్సిగూడలో గ్యాంగ్ వార్
తార్నాక: గణేష్ నిమజ్జన ర్యాలీ సందర్బంగా డ్యాన్స్ విషయంలో జరిగిన గొడవ రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్ వార్కు దారితీసింది. ఓయూ పోలీసుస్టేషన్ పరిధిలోని హబ్సిగూడ స్ట్రీట్ నంబర్–8లో జరిగిన ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ సంఘటనలో ముగ్గురు నిందితులను ఓయూ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి...ఈనెల 14న రాత్రి 1.30గంటల ప్రాంతంలో రామంతాపూర్ రహదారిలోని మధురాబార్ సమీపంలో వినాయక నిమజ్జన ర్యాలీ కొనసాగుతోంది. ఈ సందర్బంగా అనిల్ అనే కారు డ్రైవర్, రామంతాపూర్కు చెందిన డిగ్రీ విద్యార్థి సతీష్ మధ్య డ్యాన్స్ విషయంలో గొడవ జరిగింది. దీంతో వారిరువురు రెండు గ్యాంగులుగా విడిపోయి ఘర్షణ పడ్డారు. స్థానికులు సర్దిచెప్పడంతో వారు శాంతించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిన సతీష్ తన స్నేహితులతో కలిసి హబ్సిగూడ రవీంద్రనగర్ ఎస్ఆర్ అపార్టుమెంట్ వద్ద ఉన్నాడు. ఈ విషయం తెలియడంతో అనిల్ 15 మందితో కలిసి అక్కడికి వచ్చి సతీష్, అతని స్నేహితులపై దాడికి దిగగా, సతీష్ అతని స్నేహితులు ప్రతి దాడి చేశారు. ఇరువర్గా లు రోడ్డుపైనే విచక్షణారహితంగా కొట్టుకున్నారు. అనిల్ గ్రూప్ వ్యక్తులు సతీష్ను కర్రలతో చితకబాదుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో స్థానికులు భయందోళనకు గోనయ్యారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఓయూ పోలీసు లు గాయపడిన సతీష్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్మీడియాతో వెలుగులోకి...? రెండు గ్రూపుల మధ్య జరిగిన గ్యాంగ్వార్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ కేసు వెలుగులోకివచ్చింది. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు. సోషల్ మీడియాలో సీసీ ఫుటేజీ వీడియోవైరల్గా మారడంతో కేసు నమోదు చేసినట్లు ప్రకటించారు. ముగ్గురు నిందితుల అరెస్టు ఈ సంఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఓయూ సబ్ ఇన్స్పెక్టర్ హరీశ్వర్రెడ్డి తెలిపారు. రామంతాపూర్కు చెందిన అనిల్, హబ్సిగూడకు చెందిన కరుణాకర్తో పాటు అదే ప్రాంతానికి చెందిన మైనర్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. -
వైరల్ వీడియో: ఒక్కసారిగా అంబులెన్స్ రావడంతో..
పుణె: వినాయక నిమజ్జనం సందర్భంగా ఓ అంబులెన్స్ రావడంతో భక్తులు నిట్టనిలువుగా చీలిపోయి.. అంబులెన్స్కు దారి ఇచ్చిన ఘటన పుణెలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. పుణెలోని లక్ష్మీనగర్ రోడ్డులో వినాయక శోభాయాత్ర గురువారం అట్టహాసంగా సాగుతున్న వేళ అదే దారిలో అంబులెన్స్ వచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన అంబులెన్స్ చూసిన అక్కడి భక్తులు, ప్రజలు వెంటనే మానవతా దృక్పథంతో స్పందించారు. రోడ్డు మీద రద్దీని క్లియర్ చేసి.. అంబులెన్స్ వెళ్లేందుకు వీలుగా దారి కల్పించారు. వినాయక శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో ఉన్న ప్రజలు, భక్తులు రోడ్డుకిరువైపులా నిలువుగా చీలిపోయి.. అంబులెన్స్ ముందుకు కదిలేందుకు వీలుగా దారి ఇచ్చారు. కొందరు యువకులు అంబులెన్స్ ముందు పరిగెడుతూ.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ వాహనం ముందుకు కదిలేలా చూశారు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్ల హృదయాలను హత్తుకుంటోంది. ఆపత్కాలంలో మానవీయత ఉట్టిపడేలా వ్యవహరించిన పుణె వాసులను నెటిజన్లు కొనియాడారు. -
పుణెలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో
-
హైదరాబాద్ : కన్నుల పండుగ నిమజ్జనోత్సవం
-
గణేష్ శోభయాత్రలో జోగి బ్రదర్స్
-
కొనసాగుతున్న గణేష్ శోభాయాత్ర
-
గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణనాధుడు
-
గంగమ్మ ఒడికి బొజ్జ గణపయ్య
-
అప్డేట్స్: ఘనంగా నిమజ్జనం
హైదరాబాద్ : ఖైరతాబాద్ ద్వాదశ ఆదిత్య మహాగణపతి నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయింది. మధ్యాహ్నం ఒంటి గంటన్నర ప్రాంతంలో ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 6 వద్ద ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడిలోకి చేరాడు. ఈ సారి వినాయకుడు పూర్తిగా మునగటం విశేషం. మహాగణపతిని సాగనంపటానికి పెద్ద సంఖ్యలో భక్తులు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం కోలాహలంగా మారింది. ఎటువంటి ఆటంకం లేకుండా మహాగణపతి నిమజ్జనం పూర్తవడంతో భక్తులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ ఘనంగా నిమజ్జనం జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ....గణేష్ నిమజ్జనంలో పోలీసులు ప్రధాన పాత్ర పోషించారని ప్రశంసించారు. శాంతి భద్రతలను పోలీసులు సవాల్గా తీసుకున్నారన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేశారు. ఖైరతాబాద్ వినాయకుడిని దేశం మొత్తం చూస్తుందని, లక్షల మంది భక్తులు ఆయనను దర్శించుకున్నారన్నారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ గురువారం సాయంత్రం వినాయక నిమజ్జనం, శోభాయాత్రను హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. చార్మినార్ చేరుకున్న బాలాపూర్ గణనాధుడు ఎంజే మార్కెట్ వద్ద శోభాయాత్రలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ పాతబస్తీలో అపశ్రుతి పాతబస్తీ బహుదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో అపశ్రుతి చోటుచేసుకుంది. వినాయక విగ్రహాన్ని క్రేన్తో లారీలో పెట్టె సమయంలో రవీందర్ అనే పోలీస్ కానిస్టేబుల్ క్రేన్ మీద నుంచి కిందపడ్డాడు. దీంతో తీవ్రగాయాలపాలైన అతడి పరిస్థితి విషమంగా మారింది. అత్యవసర చికిత్స కోసం వెంటనే అతడిని నాంపల్లి కేర్ ఆసుపత్రికి తరలించారు. నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనేవారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్ చేరుకున్న ఖైరతాబాద్ గణేశ్ ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర కొనసాగుతోంది. మరి కొద్దిసేపట్లో ఎన్టీఆర్ మార్గ్లో గణేశుని నిమజ్జనం జరగనుంది. ఇప్పటికే ఖైరతాబాద్ గణేశుడు ఎన్టీఆర్ మార్గ్ చేరుకున్నాడు. ఖైరతాబాద్ గణేశుని మహా నిమజ్జనానికి రెడీగా ప్రత్యేక క్రేన్ను ఏర్పాటు చేశారు అధికారులు. ఎన్టీఆర్ మార్గ్లోని వినాయక విగ్రహాలను ట్యాంక్ బండ్వైపు మళ్లిస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఖైరతాబాద్ గణేశుడు బాలాపూర్ లడ్డు @ రూ. 17.60 లక్షలు బాలాపూర్ వినాయకుడి లడ్డు వేలం ముగిసింది. ఈ సారి లడ్డు వేలంలో 28 మంది పాల్గొన్నారు. రూ. 17.60 లక్షలకు కొలను రాంరెడ్డి అనే భక్తుడు లడ్డును సొంతం చేసుకున్నాడు. బాలాపూర్ లడ్డు వర్షంలోనే గణనాథుల నిమజ్జనోత్సవం గణనాథుల శోభాయాత్ర కొనసాగుతోంది. ఈ ఉదయం నుంచి నగరంలో పలు చోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. వర్షంలోనే గణనాథుల నిమజ్జనోత్సవం కొనసాగుతోంది. భక్తుల కోలాటాలు, నృత్యాల మధ్య వినాయకుల శోభాయాత్ర వైభవోపేతంగా జరుగుతోంది. శోభాయాత్ర సందడితో రహదారులన్ని కొత్త రూపు సంతరించుకున్నాయి. వర్షంలోనే గణనాథుల నిమజ్జనోత్సవం కదిలిన బాలాపూర్ గణేశుడు బాలాపూర్ గణేశుని శోభాయాత్ర ప్రారంభమైంది. శోభాయాత్ర అనంతరం లడ్డు వేలం పాట జరగనుంది. గతేడాది లడ్డు రూ. 16.60 లక్షలు పలికింది. దీంతో ఈ సంవత్సరం లడ్డు వేలం పాటపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బాలాపూర్ గణేశుడు ప్రారంభమైన ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర ఖైరతాబాద్ ద్వాదశ ఆదిత్య మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్లో నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. క్రేన్ నెంబర్ 6 వద్ద జీహెచ్ఎంసీ అధికారులు భారీ క్రేన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి సాక్షి, హైదరాబాద్ : జంట నగరాల్లో బొజ్జగణపయ్యల నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైంది. గురువారం ఉదయం 6 గంటల నుంచే వినాయక విగ్రహాలు నిమజ్జనానికి ఊరేగింపుగా బయలుదేరాయి. నగరంలోని వీధులన్నీ శోభయాత్ర వెలుగులను సంతరించుకున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం వరకు గణేశ్ నిమజ్జన కార్యక్రమం జరగనుంది. కాగా, నగరవ్యాప్తంగా దాదాపు 391 కిలోమీటర్ల మేర నిమజ్జనోత్సవం జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని శాఖలు అప్రమత్తమయ్యాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మొదటిసారిగా గూగుల్ మ్యాప్స్లో ‘శోభాయాత్ర’
సిటీలో గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం నగరవ్యాప్తంగా దాదాపు 391 కిలోమీటర్ల మేర జరగనున్న నిమజ్జనోత్సవం కోసం అన్ని శాఖలు అప్రమత్తమయ్యాయి. జీహెచ్ఎంసీ, పోలీస్, జలమండలి, శానిటేషన్, ఫైర్, వైద్యారోగ్య, విపత్తుల నివారణ, విద్యుత్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ప్రతి 3 కిలోమీటర్లకు ఒక గణేశ్ యాక్షన్ టీంను నియమిస్తున్నారు. ఈ టీంలో అన్ని శాఖల సిబ్బంది ఉంటారు. అవసరాన్ని బట్టి వీరు వెంటనే రంగంలోకి దిగి అవసరమైన చర్యలు చేపడతారు. ఆయా చెరువులు, కొలనులు, హుస్సేన్సాగర్ వద్ద భారీ క్రేన్లు సిద్ధం చేశారు. అటు బందోబస్తు కోసం పోలీసులు..ఇటు ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు.గూగుల్మ్యాప్స్లో శోభాయాత్రను అప్డేట్ చేస్తారు. తద్వారా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పరిస్థితిని పర్యవేక్షిస్తారు. ♦ శోభాయాత్ర 391 కి.మీ. ♦ వైద్యశిబిరాలు 27 ♦ నిమజ్జనం కోసం వసతులు 32 ప్రాంతాల్లో ♦ స్టాటిక్ క్రేన్లు 93 ♦ మొబైల్ క్రేన్లు 134 ♦ ట్రాఫిక్ సిబ్బంది 2100 ♦ ప్రత్యేక బస్సులు 550 ♦ ఆంక్షలు 66 ప్రాంతాల్లో ♦ హెల్ప్లైన్ నంబర్లు: 04027852482 , 9490598985 ,9010203626 సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో మహా ఘట్టానికి రంగం సిద్ధమైంది. గురువారం జరగనున్న గణేశ్ నిమజ్జనానికి జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. నిమజ్జనం సందర్భంగా శోభాయాత్ర మార్గం పొడవునా రహదారులకు మరమ్మతులతోపాటు అవసరమైనంత పారిశుధ్య సిబ్బంది, తాత్కాలిక లైటింగ్ ఏర్పాట్లతోపాటు టాయ్లెట్లు తదితర సదుపాయాలు కల్పిస్తారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ముఖ్యమైన 32 ప్రదేశాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. నిమజ్జన ఏర్పాట్లపై మేయర్ బొంతు రామ్మోహన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దాదాపు రూ.20 కోట్లతో అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ♦ గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరిగే 391 కిలోమీటర్ల మార్గంలో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక గణేష్ యాక్షన్ టీమ్ ఏర్పాటు. ఒక్కో టీమ్లో ఒక శానిటరీ సూపర్వైజర్ లేదా శానిటరీ జవాన్, ముగ్గురు ఎస్.ఎఫ్.ఏలు, 21 మంది పారిశుధ్య కార్మికులు మూడు షిఫ్ట్లుగా పనిచేస్తారు. మొత్తం 194 గణేష్ యాక్షన్టీమ్ల ఏర్పాటు . ♦ నిమజ్జన ప్రాంతాల్లో 27 ప్రత్యేక వైద్య శిబిరాలు..92 మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు. ♦ 32 ప్రాంతాల్లో 93 స్టాటిక్ క్రేన్లు, 134 మొబైల్ క్రేన్ల ఏర్పాటు. ఈసారి నీటిపారుదల శాఖ ద్వారా కాకుండా జీహెచ్ఎంసీ ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. ♦ 23 గణేశ్ నిమజ్జన కొలనుల్లో శుభ్రమైన నీరు నింపి నిమజ్జనానికి ఏర్పాట్లు. ♦ శోభాయాత్ర మార్గంలో రోడ్ల రీకార్పెటింగ్, మరమ్మత్తులు, పూడ్చివేత తదితరమైన వాటికి సంబంధించి 176 పనులకు రూ. 9.29 కోట్ల ఖర్చు. ♦ ఎస్సార్డీపీ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ఆటంకాలు లేకుండా ప్రయాణం సాపీగా సాగేలా మరమ్మతులు. ♦ నిమజ్జనం జరిగే చెరువుల వద్ద భద్రత నిమిత్తం గజ ఈతగాళ్లను నియమిస్తారు. ♦ సరూర్నగర్, కాప్రా, ప్రగతినగర్ చెరువుల వద్ద ప్రత్యేకంగా 3 బోట్ల ఏర్పాటు . ట్యాంక్ బండ్, సరూర్నగర్ వద్ద కేంద్ర విపత్తు నివారణ దళాల సేవలు. పర్యాటక శాఖ ద్వారా హుసేన్ సాగర్లో 7 బోట్లు, 44 స్పీడ్ బోట్లు. హుస్సేన్ సాగర్లో పదిమంది గజ ఈత గాళ్లు. ♦ జీహెచ్ఎంసీ విద్యుత్ విభాగం ద్వారా 36,674 తాత్కాలిక లైట్ల ఏర్పాటు. ఇందుకు రూ.99.41 లక్షల ఖర్చు. ♦ నిమజ్జన శోభాయాత్ర జరిగే మార్గం మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లడం, నిమజ్జనం జరిగిన వెంటనే చెరువుల నుండి విగ్రహాలను తొలగించడం చేస్తారు. ♦ రోడ్లు భవనాల శాఖ ద్వారా 12 కిలోమీటర్ల మేర బారికేడింగ్ ఏర్పాట్లు. ♦ శోభాయాత్ర మార్గంలో 15 కేంద్రాల్లో వాటర్ ప్రూఫ్ టెంట్ల ఏర్పాటు. ♦ రోడ్లు, భవనాల శాఖ ఎలక్ట్రిక్ విభాగం ఆధ్వర్యంలో 75 జనరేటర్లు ఏర్పాటు. ♦ హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో హుసేన్ సాగర్ చెరువులో నిమజ్జనం ద్వారా వెలువడే వ్యర్ధాలను తొలగించడానికి ప్రత్యేకంగా వెయ్యి మంది నియామకం. ♦ జలమండలి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 115 వాటర్ క్యాంప్ల ద్వారా 30,52,000 వాటర్ ప్యాకెట్ల పంపిణీ. ♦ శోభాయాత్ర మార్గంలో 36 ఫైర్ ఇంజన్ల ఏర్పాటు. ♦ విద్యుత్ శాఖ ద్వారా హుస్సేన్ సాగర్ చుట్టూ 48 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు. సరూర్నగర్ చెరువు వద్ద 5 ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు. నగరవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు మొత్తం 101 అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు. ♦ శోభాయాత్ర మార్గంలో చెట్ల కొమ్మల నరికివేత. ప్రతి సర్కిల్లో ఒక ఎమర్జెన్సీ హార్టికల్చర్ టీమ్ నియామకం. నిమజ్జనోత్సవానికి 550 ప్రత్యేక బస్సులు సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 12వ తేదీన గణేశ్ నిమజ్జనం సందర్భంగా తరలి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య 550 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. బషీర్బాగ్ నుంచి కాచిగూడ, రాంనగర్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి కొత్తపేట్, ఎల్బీనగర్, వనస్థలిపురం, మిధానీ, లిబర్టీనుంచి ఉప్పల్, ఇందిరాపార్కు నుంచి ఉప్పల్, సికింద్రాబాద్, ఈసీఐఎల్ క్రాస్రోడ్స్, మల్కాజిగిరి, లకిడికాఫూల్ నుంచి బీహెచ్ఈఎల్, కొండాపూర్, రాజేంద్రనగర్, ఆల్ఇండియారేడియో నుంచి కోఠీ. ఖైరతాబాద్ నుంచి జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, సనత్నగర్, గాజుల రామారం, కూకట్పల్లి, పటాన్చెరు, బోరబండ, తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడువన్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వివిధ రూట్లలో బస్సుల సంఖ్యను పెంచారు. మరోవైపు బస్సుల నిర్వహణ కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. బ్రేక్డౌన్స్కు అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోనున్నట్లు ఈడీ తెలిపారు. ఒకవేళ ఆకస్మాత్తుగా చెడిపోయినా వెంటనే వాటికి మరమ్మతులు చేసేందుకు, ట్రాఫిక్కు అంతరాయం లేకుండా రోడ్డు పై నుంచి పక్కకు తప్పించేందుకు సిబ్బందిని అదనంగా ఏర్పాటు చేయనున్నారు. ఖైరతాబాద్ గణపతి నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు ఖైరతాబాద్: నగరంలో వినాయక నిమజ్జన మహోత్సవానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిందని, సాగర తీరంలో క్రేన్ నెం.6 వద్ద ప్రత్యేకంగా ఖైరతాబాద్ మహాగణపతిని సంపూర్ణ నిమజ్జనం గావించేందుకు 20 ఫీట్లకు పైగా లోతు పెంచామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. మంగళవారం వివిధ శాఖల అధికారులతో కలిసి ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెం.6 వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు అన్ని పండుగల్ని ఘనంగా జరుపుకోవాలని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. మహాగణపతి నిమజ్జన ఊరేగింపు 12వ తేదీ ఉదయం 7 గంటలకు ప్రారంభమై ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెం.6 వద్దకు 12గంటలకు చేరుకుంటుందని, అన్ని పనులు పూర్తిచేసి ఒంటి గంటలోపు నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తిచేస్తామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూం ఏర్పాటు ఎన్టీఆర్ మార్గ్లో నిమజ్జనాల సందర్భంగా ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, దీని ద్వారా అధికారులు సమన్వయంతో పనిచేస్తారని మంత్రి తలసాని చెప్పారు. గ్రేటర్ పరిధిలో 55 వేలకు పైగా వినాయక విగ్రహాలు ఏర్పాటుచేశారని, ఇప్పటికే చాలా విగ్రహాలు నిమజ్జనం అయ్యాయయని, 12వ తేదీ చివరి రోజు 36 వేల విగ్రహాలు నిమజ్జనానికి తరలివస్తాయని భావిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ విద్యాసాగర్, హెచ్ఎండీఏ ఎస్ఈ వరీందర్, ఎలక్ట్రికల్ డీఈ వేణుగోపాల్, ఐ అండ్ పిఆర్ రవికుమార్, మెడికల్ అండ్ హెల్త్ నాగేందర్ తదితరులు ఉన్నారు. కాగా ఖైరతాబాద్ మహాగణపతి మండపం వద్ద కూడా ఏర్పాట్లను మంత్రి తలసాని పరిశీలించారు. -
ఈసారీ అడ్వాన్స్డ్ హుక్స్!
సాక్షి, సిటీబ్యూరో: వినాయక చవితి నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న గణేష్ మండపాల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ విగ్రహాలను నిర్ణీత సమయంలో నిమజ్జనం చేయాలనే ఉద్దేశంతో కొంత వరకు క్రేన్ల సంఖ్య పెంచుకుంటూ పోయారు. అయితే వీటి సంఖ్యను పెంచడం కంటే ఉన్న క్రేన్లతోనే వీలైనన్ని ఎక్కువ విగ్రహాలు నిమజ్జనం చేయించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గతేడాది ట్యాంక్బండ్ వద్ద ఏర్పాటు చేసిన వాటిలో కొన్ని క్రేన్లకు ప్రత్యేక డిజైన్తో కూడిన కొండీలను (హుక్స్) ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఈసారి మరింత అడ్వాన్స్డ్ హుక్స్ అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటిని రాష్ట్రంలోని తొమ్మిది ప్రాంతాల్లోని 138 క్రేన్లకు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వీటి పనితీరును పరీక్షించిన పోలీసు ఉన్నతాధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీచక్ర ఇంజినీరింగ్ సంస్థ నిర్వాహకుడు టి.మురళీధర్ రూపొందించిన ఈ క్విక్ రిలీజ్ డివైజ్ (క్యూఆర్డీ) హుక్స్ ఈసారి ట్యాంక్బండ్, ఎన్టీఆర్ మార్గ్లో ఉండే 40 క్రేన్లకు వాడుతున్నారు. వీటి వినియోగంపై మురళీధర్ గురు–శుక్రవారాల్లో క్రేన్ ఆపరేట్లకు శిక్షణ ఇచ్చారు. తొలిసారిగా ఈ క్యూఆర్డీ హుక్స్ను గతేడాది వినియోగించారు. హుస్సేన్సాగర్ చుట్టూ ఉన్న 36 క్రేన్లలో 20 క్రేన్లను వీటిని వాడారు. క్రేన్ కొండీ ఉండే ప్రాంతంలో ఈ హుక్స్ నాలుగింటిని ఏర్పాటు చేశారు. విగ్రహానికి కింది భాగంలో నలుమూలలా వీటిని ఫిక్స్ చేశారు. పైకి ఎత్తినప్పుడు విగ్రహం బరువుకు గట్టిగా పట్టి ఉండే ఈ హుక్స్... అది నీటిని తాకిన వెంటనే బరువు తగ్గడంతో వాటంతట అవే రిలీజ్ అవుతాయి. గరిష్టంగా 25 సెకన్లలో నిమజ్జనం పూర్తయింది. గతంలో విగ్రహాన్ని నీటిలోకి తీసుకువెళ్ళిన తర్వాత క్రేన్పై ఉండే వ్యక్తులు కొండీలను డీలింక్ చేయాల్సి ఉండేది. దీనివల్ల కాలయాపనతో పాటు ప్రమాదాలకు ఆస్కారం ఉండేది. పాత కొండీలతో గంటకు ఒక క్రేన్ గరిష్టంగా 12 విగ్రహాలను నిమజ్జనం చేస్తే... క్యూఆర్డీ హుక్స్ వినియోగించిన క్రేన్ ఇదే సమయంలో 25 నుంచి 30 విగ్రహాలను నిమజ్జనం చేసింది. ఈసారి వీటిపై మరింత రీసెర్చ్ చేసిన మురళీధర్ అడ్వాన్డ్స్ వెర్షన్ అందుబాటులోకి తీసుకువచ్చారు. పాత హుక్ 15 కేజీల వరకు బరువు ఉండి, నిర్వహణ కష్టంగా ఉండేది. దీంతో దీన్ని గరిష్టంగా 5.6 కేజీలకు తగ్గించారు. ఇవి ఉన్న క్రేన్ ఓ విగ్రహాన్ని గరిష్టంగా 15 సెకన్లతో నిమజ్జనం చేస్తుంది. నాలుగు హుక్స్ పెట్టాల్సిన అవసరం లేదు. రెండింటితోనూ నిమజ్జనం పూర్తి చేయవచ్చు. ఇలాంటివి హుస్సేన్సాగర్ చుట్టూ 40 క్రేన్లకు ఏర్పాటు చేశారు. ఆటోమేటిక్ రిలీజ్ హుక్స్ ఈ హుక్స్ వినియోగించిన విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్నప్పుడు అవి ఆటోమేటిక్గా రిలీవ్ అవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 138 క్రేన్లకు వీటిని వినియోగిస్తున్నాం. ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించడంతో పాటు అవసరమైన అన్ని పరీక్షలు పూర్తి చేశాం. క్రేన్ ఆపరేటర్లకు శిక్షణ ఇస్తున్నాం. ఒక్కో విగ్రహం నిమజ్జనంలో 4 నుంచి 6 నిమిషాల సమయం ఆదా అవుతుంది. ఫలితంగా గంటకు 10 విగ్రహాలకు బదులుగా 25 నిమజ్జనం చేయవచ్చు. ఈ హుక్స్ పనితీరు పట్ల క్రేన్ ఆపరేటర్లు సైతం సంతోషం, సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మూడు కమిషనరేట్లలోని అన్ని క్రేన్లకు వీటిని వాడటంతో పాటు కొన్నింటిని రిజర్వ్లో ఉంచుతున్నాం. – టి.మురళీధర్, శ్రీచక్ర ఇంజినీరింగ్ -
ట్యాంక్ బండ్ : గణేష్ నిమజ్జనాల కోలాహలం
-
టెక్నికల్ గణేషా..!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఏటా జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలు, సామూహిక నిమజ్జనం నగర పోలీసులకు అత్యంత కీలకమైన ఘట్టాలు. మండపం ఏర్పాటుకు అనుమతి మంజూరు చేయడం నుంచి విగ్రహం నిమజ్జనం వరకు అనునిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇప్పటి వరకు మాన్యువల్గా జరుగుతున్న ఈ తతంగానికి నగర పోలీసులు సాంకేతికత జోడించారు. ప్రతి వినాయక మండపానికీ ఓ ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ కేటాయించడంతో పాటు దానిని జియో ట్యాగింగ్ ద్వారా పోలీసు అధికారిక యాప్ ‘టీఎస్ కాప్’కు అనుసంధానిస్తున్నారు. ఫలితంగా తనిఖీల నుంచి నిమజ్జనం వరకు ప్రతి అంశం జవాబుదారీగా, పారదర్శకంగా, సాంకేతికంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అంతా ఆన్లైన్లోనే... గణేష్ ఉత్సవాలకు సంబంధించి నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏటా వేల వినాయక మండపాలు ఏర్పాటవుతుంటాయి. ఈ నేపథ్యంలో మండపాల రిజిస్ట్రేషన్ను సిటీ కాప్స్ ఆన్లైన్ చేశారు. గత ఏడాది నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటి వరకు అధికారిక వెబ్సైట్ ద్వారా దాదాపు 9 వేల మండపాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఆన్లైన్లోనే దాఖలు చేసి దాని ప్రింట్ఔట్తో పాటు పత్రాలను ఠాణాలో సమర్పిస్తున్నారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోని మండపాల వద్దకు నేరుగా వెళ్తున్న పోలీసులు వాటి వివరాలు నమోదు చేసుకుని వాటి వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. ప్రత్యేక క్యూఆర్ కోడ్ కేటాయింపు... ఇలా ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులు, పోలీసులు ఆన్లైన్ చేసిన మండపాల వివరాలను పరిశీలించడానికి బషీర్బాగ్లోని కమిషనరేట్లో ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేశారు. వీరు ఆన్లైన్ దరఖాస్తులు, ఠాణాల నుంచి వచ్చిన పత్రాలను పరిశీలించి మండపం ఏర్పాటుకు అనుమతి ఇస్తారు. మండపాలన్నీ ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత ఆయా దరఖాస్తులపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ముద్రిస్తున్నారు. ఒక్కో విగ్రహానికి ఒక్కో కోడ్ కేటాయిస్తున్నారు. దీంతో అనుమతి మంజూరులో ఎలాంటి జాప్యం లేకుండా పని సాఫీగా సాగుతుందని అధికారులు చెబుతున్నారు.ఈ అనుమతి పత్రాన్ని మండప నిర్వాహకులు తమ మండపాల్లో నిర్ణీత ప్రాంతంలో అతికించేలా చూస్తున్నారు. ఈ క్యూఆర్ కోడ్స్ డేటాను పోలీసు అధికారిక యాప్ ‘టీఎస్ కాప్’లోకి లింకు ఇస్తున్నారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయిలో ఉండే పోలీసుల వరకు ఎవరైనా సరే తమ ప్రాంతంలో ఎన్ని మండపాలు ఉన్నాయి? ఎక్కడ ఉన్నా యి? ఎప్పుడు ఏర్పాటవుతాయి? నిమజ్జనం ఎప్పుడు? ఏ మార్గంలో వెళ్ళి, ఎక్కడ నిమజ్జనం చేస్తారు? తదితర వివరాలను తమ ట్యాబ్స్, స్పార్ట్ఫోన్స్లో చూసుకునే అవకాశం ఏర్పడుతోంది. క్యూఆర్ కోడ్ కేటాయింపులోనే అధికారులు పక్కాగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల వారీగా వేర్వేరుగా దీని కేటాయింపు జరుగుతోంది. తనిఖీలపై పర్యవేక్షణ... ఓ ప్రాంతంలో మండపం ఏర్పాటు అయినప్పటి నుంచి అందులోని విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు ప్రతి దశలోనూ పోలీసుల పర్యవేక్షణ ఉంటుంది. గస్తీ విధులు నిర్వర్తించే బ్లూకోల్ట్సŠ, పెట్రోలింగ్ వాహనాల సిబ్బంది నిత్యం ఆయా మండపాల వద్దకు వెళ్ళి పరిస్థితుల్ని అంచనా వేయడంతో పాటు తనిఖీలు నిర్వహించాలి. ఆయా మండపాల వద్దకు వెళ్ళిన వీరు కోడ్ను టీఎస్ కాప్ యాప్లో స్కాన్ చేస్తారు. దీంతో ఈ తనిఖీలు ఎలా సాగుతున్నాయన్నది ఉన్నతాధికారులకు ఈ యాప్ ద్వారానే తెలుస్తుంది. ఏ మండపానికి ఏ పోలీసును లైజనింగ్ అధికారిగా నియమించారు? ఆయా అధికారుల వివరాలు? ఇలా ప్రతి అంశమూ యాప్ ద్వారా అన్ని స్థాయిల అధికారులకూ తెలుస్తుంది. నిమజ్జన సమయంలో నిర్ణీత సమయంలో ఊరేగింపు ప్రారంభంకావడం నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు ప్రతి విగ్రహం కదలికల్నీ గమనిస్తుండాలి. క్యూఆర్ కోడ్తో కూడిన పత్రంతో వచ్చే విగ్రహాలను క్షేత్రస్థాయి సిబ్బంది ఎక్కడిక్కడ పర్యవేక్షిస్తారు. ఆ కోడ్ ను తమ ట్యాబ్స్, ఫోన్లలో స్కానింగ్ చేస్తుంటారు. దీంతో ఏ విగ్రహం, ఏ సమయంలో, ఏ ప్రాంతంలో ఉంది? ఎప్పుడు నిమజ్జనం జరిగింది? ఇంకా ఎన్ని విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉంది? అనే అంశాలు సిబ్బంది, అధికారులకు యాప్ ద్వారా తెలుస్తుంటాయి. మండపాల జియో ట్యాగింగ్ గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే ఒకే రోజులో నిమజ్జనం పూర్తి చేయాలని భావిస్తున్నారు. ప్రత్యేక క్యూఆర్ కోడ్ సాయంతో అన్ని మండపాలను మ్యాప్ మీది జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఏ చిన్న ఘటనకూ ఆస్కారం లేకుండా అన్ని ప్రభుత్వ విభాగాలు, నిర్వాహకులు, గణేష్ ఉత్సవ కమిటీలతో సమన్వయంతో పని చేస్తున్నాయి. జియో ట్యాగింగ్ చేసిన మండపాలను పోలీసుల అధికారిక యాప్ ‘టీఎస్ కాప్’ ద్వారా గస్తీ సిబ్బంది ట్యాబ్స్, మొబైల్స్కు లింకు చేస్తున్నారు. దీంతో మండపం ఏర్పాటు నుంచి నిమజ్జనం జరిగే వరకు ఆ మండపాన్ని ఏఏ పోలీసులు సందర్శించారు? ఏ సమయంలో వచ్చారు? నిర్వాహకులు ఎవరు ఉన్నారు? అనేవి తేలిగ్గా గుర్తించవచ్చు. ఫలితంగా గస్తీపై ఉన్నతాధికారుల నిఘా ఉంటోంది. ఈ ఏడాది సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ చేసే ఏర్పాట్లు భక్తులకు నచ్చేలా, వారు మెచ్చేలా ఉండాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నగరంలోని అన్ని ఊరేగింపు మార్గాలు సీసీ కెమెరా నిఘాలోకి తీసుకువస్తున్నారు. క్యూఆర్ కోడ్తో కూడిన విగ్రహాన్ని తీసుకువస్తున్న వాహనంపై నిమజ్జనం రోజు ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. అది ఎక్కడ ఉంది? అక్కడి పరిస్థితులు ఏంటి? అనేవి తెలుసుకోవడంతో ఎక్కడా ఆలస్యం, ఆటంకాలు లేకుండా నిమజ్జనం పూర్తి చేసే అవకాశం ఉంది. -
హుస్సేన్ సాగర్ వద్ద గణేష్ నిమజ్జనం సందడి
-
భారీ భద్రత
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చవితి సందడి మొదలైంది. బుధవారం నుంచి నిమజ్జనం ప్రారంభమవుతుంది. ఈ నెల 12న జరిగే ప్రధాన నిమజ్జనంతో ఉత్సవం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో నగర పోలీస్ విభాగం అప్రమత్తమైంది. భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. అసాంఘిక శక్తులు రెచ్చిపోకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేకంగా సీసీ కెమెరాలతో నిఘా, రూఫ్టాప్ వాచ్, ఎక్కడికక్కడ కార్డన్ ఏరియాలు, నగర వ్యాప్తంగా 250 ప్రాంతాల్లో వాచ్టవర్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కమ్యూనల్, సాధారణ రౌడీషీటర్ల బైండోవర్ ప్రక్రియ పూర్తి కావచ్చింది. అవసరమైన, అనుమానిత ప్రాంతాల్లో సాయుధ బలగాలు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించనున్నాయి. మూడు కమిషనరేట్లలోని సిబ్బంది అందరికీ ‘స్టాండ్ టు’ ప్రకటించి కచ్చితంగా విధుల్లో ఉండేలా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితులను బట్టి ఏ ప్రాంతానికైనా తరలించేందుకు వీలుగా కొన్ని ప్రత్యేక బలగాలను రిజర్వ్లో ఉంచారు. కమిషనరేట్లలో ప్రస్తుత పరిస్థితులు, అందుబాటులోని సిబ్బంది, ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్లు ఎప్పటిప్పుడు సమీక్షిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాల, పొరుగు జిల్లాల అధికారులతో సంప్రదింపులు జరుపుతూ భద్రత, బందోబస్తు చర్యల్లో అవసరమైన మార్పుచేర్పులు చేస్తున్నారు. సున్నిత ప్రాంతాలతో పాటు కీలక మండపాలను ప్రతిరోజు బాంబు నిర్వీర్య బృందాలు తనిఖీ చేయనున్నాయి. మండపాల వద్ద ఉండే వలంటీర్లకు అనుమానాస్పద వస్తువులు, వ్యక్తుల్ని గుర్తించడంపై స్థానిక పోలీసుల ద్వారా ప్రాథమిక శిక్షణనివ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. 10న మొహర్రం కావడంతో బీబీకా ఆలం ఊరేగింపు సైతం జరగనుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో కలిపి దాదాపు 62వేల మండపాలు ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రానికి నగర పోలీసు అధికారిక వెబ్సైట్ ద్వారా 10,702 మండపాల ఏర్పాటుకు అనుమతి తీసుకున్నారు. ఇవన్నీ ఐదడుగులు అంతకంటే ఎక్కువ ఎత్తయినవే కావడం గమనార్హం. అంతకు తక్కువ ఎత్తుతో కూడిన వాటిని ఏర్పాటు చేçస్తున్న సందర్భంలో సాధారణంగా అనుమతి తీసుకోవట్లేదు. సాగర్ దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు... కీలక నిమజ్జనాలు జరిగే హుస్సేన్సాగర్, ఖైరతాబాద్ గణేశుడి వద్ద ఏర్పాట్లను మధ్య మండల సంయుక్త పోలీసు కమిషనర్ ఎన్.విశ్వప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక అధికారిగా స్పెషల్ బ్రాంచ్ జాయింట్ పోలీసు కమిషనర్ తరుణ్ జోషికి బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది సాగర్లో 25వేల నుంచి 30వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నారు. మూడో రోజైన బుధవారం నుంచి ఈ సందడం ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఐదు, ఏడు, తొమ్మిదో రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ఈలోపు ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్ణయించారు. అవసరాన్ని బట్టి సిబ్బంది, క్రేన్లు అక్కడ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈసారీ ప్రతి క్రేన్ వద్ద నిమజ్జనం అవుతున్న విగ్రహాల వివరాలు, సమయాలు తెలుసుకోవడానికి క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానం అవలంభిస్తున్నారు. భవిష్యత్తులో జరిగే ఈ కార్యక్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేయడానికి ఇది ఉపకరిస్తుందని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. పటిష్ట నిఘా, బందోబస్తు కోసం గతేడాది మాదిరే వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. హుస్సేన్సాగర్ దగ్గర కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసుల సూచనలివీ... ♦ మండపం వద్ద నిర్వాహకులు వలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలి. వారి ద్వారా చుట్టు పక్కల ప్రాంతాలపై నిఘా వేసి ఉంచాలి. ♦ గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే వస్తువులను తీసుకోకూడదు. పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయా? అనేది గమనిçస్తుండాలి. ♦ పార్కింగ్ ప్రాంతాలు, అక్కడ నిలిపి ఉంటున్న వాహనాలపైనా కన్నేసి ఉంచాలి. ♦ రాత్రి 10 నుంచి ఉదయం 6గంటల మధ్య లౌడ్ స్పీకర్లు వాడకూడదు. ♦ మండపం పైనుంచి వెళ్లే కరెంట్ తీగలు, హైటెన్షన్ వైర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ♦ అక్రమ విద్యుత్ కనెక్షన్లు నేరమే కాదు... ప్రమాదం కూడా అనేది గుర్తుంచుకోవాలి. ♦ రాత్రి వేళ మండపంలో ఎవరో ఒకరు కాపలా ఉండడం ఉత్తమం. ♦ మండపం దాదాపుగా మండే స్వభావం ఉన్న థర్మకోల్, చెక్క తదితర వస్తువులతో నిర్మితమవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ వెలిగించే దీపాలు, అగరబత్తీలు, హారతి కర్పూరం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ♦ ఎలాంటి పుకార్లను నమ్మకూడదు. అవి విస్తరించేలా, ప్రచారం చేసేలా ప్రవర్తించడం నేరం. ♦ ఇతరుల మనోభావాలు దెబ్బతినే, రెచ్చగొట్టేలా చేసే చర్యలు, వ్యాఖ్యలు ఉండకూడదు. విగ్రహాలవివరాలివీ... సంవత్సరం విగ్రహాలు 2006 15,000 2007 16,500 2008 18,200 2009 19,400 2010 20,600 2011 21,900 2012 25,000 2013 30,000 2014 37,600 2015 42,400 2016 56,000 2017 58,000 2018 60,000 2019 62,000 (దాదాపు) -
హుస్సేన్సాగర్ కేంద్రంగా ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: గణేష్ విగ్రహాల నిమజ్జనం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హుస్సేన్సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ అంజనీకుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11 వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి వరకు ఇవి అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ♦ కర్బాలామైదాన్ వైపు నుంచి వచ్చే సాధారణ వాహనాలను అప్పర్ ట్యాంక్బండ్ మీదికి అనుమతించరు. వీటిని కవాడిగూడ చౌరస్తా వైపు పంపిస్తారు. లిబర్టీ వైపు వెళ్ళాల్సిన వారు కవాడిగూడ చౌరస్తా, గాంధీనగర్ టి జంక్షన్, డీబీఆర్ మిల్స్, ఇందిరాపార్క్, దోమలగూడ మీదుగా వెళ్ళాలి. ఖైరతాబాద్, పంజగుట్ట వైపు వెళ్ళాల్సిన వారు రాణిగంజ్, నల్లగుట్ట, సంజీవయ్యపార్క్, నెక్లెస్రోడ్, ఖైరతాబాద్ ఫ్లైవర్ మార్గాన్ని అనుసరించాలి. ♦ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే సాధారణ వాహనాలను ఎన్టీఆర్ మార్గ్లోకి అనుమతించరు. వీటిని నెక్లెస్రోడ్ లేదా మింట్ కాంపౌండ్ వైపు పంపిస్తారు. ♦ తెలుగుతల్లి విగ్రహం జంక్షన్ నుంచి సాధారణ వాహనాలను ఎన్టీఆర్ మార్గ్లోకి అనుమతించరు. వీటిని ఇక్బాల్ మీనార్ వైపు పంపిస్తారు. సికింద్రాబాద్ వైపు వెళ్లే ట్రాఫిక్ను తెలుగుతల్లి ఫ్లైఓవర్, కట్టమైసమ్మ దేవాలయం, డీబీఆర్ మిల్స్, చిల్డ్రన్స్ పార్క్, సెయిలింగ్ క్లబ్, కర్బాలా మైదాన్ మీదుగా మళ్లిస్తారు. ♦ గోశాల వైపు నుంచి అప్పర్ ట్యాంక్బండ్ వైపు వెళ్ళే వాహనాలను డీబీఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్బండ్ మీదుగా పంపిస్తారు. -
సమన్వయంతో సక్సెస్ చేద్దాం
సాక్షి, సిటీబ్యూరో: అన్ని శాఖలు, విభాగాలు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ వారు సమన్వయంతో పనిచేసి ఈ ఈ ఏడాది గణేష్ ఉత్సవాలను సక్సెస్ చేయాలని మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. గణేష్ ఉత్సవాల నిర్వాహణపై మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ లోకేష్ కుమార్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, అడిషనల్ కమిషనర్లు అనిల్ కుమార్, చౌహాన్, జోనల్ కమిషనర్ దాసరి హరిచందన, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల నిర్వహణ ప్రతి సంవత్సరం విజయవంతంగా జరుపుతున్నప్పటికీ ప్రతి సారి కొత్త అంశాలతో ఏర్పాట్లు చేపట్టాల్సి ఉంటుందన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది అదనపు సిబ్బంది, మౌలిక సదుపాయల కల్పనతో పాటు విస్తృత బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఏవిధమైన తప్పుడు ప్రచారాలు జరిగినా వాటిని నమ్మొద్దన్నారు. వాటిని పంపేవారి సమాచారాన్ని అధికారులకు అందించాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ నగరంలో గణేష్ నిమజ్జనం సాఫీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశామన్నారు. దీనిలో భాగంగా 254 క్రేన్లను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. సెప్టెంబర్ 2వ తేదీ నుండి 12వ తేదీ వరకు నగరంలోని అన్ని గణేష్ మండపాల వద్ద ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 30 శాతం అదనపు సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపారు. రూ.8.24 కోట్ల వ్యయంతో క్రేన్లు, వాహనాలు, రూ.9.20 కోట్ల వ్యయంతో రోడ్ల మరమ్మతులు, నిమజ్జన చెరువుల క్లీనింగ్ తదితర ఏర్పాట్లను చేపడుతున్నామని వివరించారు. గణేష్ నిమజ్జన శోభయాత్ర జరిగే మార్గాల్లో పారిశుధ్య నిర్వహణకుగాను గణేష్ యాక్షన్ టీమ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. దాదాపు రూ.కోటి రూపాయల వ్యయంతో 36,674 అదనపు లైట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిమజ్జనం సందర్భంగా 115 ప్రత్యేక క్యాంపుల ద్వారా 30.52 లక్షల మంచినీటి ప్యాకెట్లను అందించనున్నట్టు జలమండలి అధికారులు తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత సంవత్సరం 40 వేల విగ్రహాలను ప్రతిష్టించారన్నారు. ఈ ఏడాది మరింత మంది విగ్రహాలను పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. దాదాపు 21 వేల మంది పోలీసు అధికారులు, సిబ్బంది, ఐదు కంపెనీల సి.ఆర్.పి.ఎఫ్ బలగాలను శాంతిభద్రతల పరిరక్షణకు నియమిస్తున్నట్లు వివరించారు. గణేష్ విగ్రహాల ఏర్పాటుకు గాను ఆన్లైన్ ద్వారా అనుమతులు పొందాలని, దరఖాస్తు చేసిన ప్రతి విగ్రహానికి క్యూఆర్ కోడ్ను జారీచేయనున్నట్టు అంజనీకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ శోభాయాత్ర దారిపొడువునా పబ్లిక్ టాయ్లెట్లు ఏర్పాటు చేయాలన్నారు. ట్యాంక్బండ్ వద్ద ఎప్పటికప్పుడు వ్యర్థాలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. నిర్ణీత సమయం కంటే ముందు విగ్రహాలను నిమజ్జనం చేయొద్దంటూ వారు అభిప్రాయపడ్డారు. -
గణేష్ నిమజ్జనానికి భద్రత కట్టుదిట్టం
సాక్షి, హైదరాబాద్ : గణేష్ నిమజ్జనానికి భద్రతా పరంగా నగరంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. దాదాపు 21,000 మంది పోలీసులతో, 56 కంపెనీల కేంద్ర బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ‘నగరంలోని 5 జోన్లకు 5 ప్రత్యేక రంగుల ఇండికేషన్ స్టిక్కర్లు ఇస్తున్నాం. ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా 7000కు పైగా గణేష్ మండపాలకు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ప్రతి గణేష్ మండపం దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించాం. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ఉదయమే జరిగేలా ఉత్సవ కమిటీని కోరామని’ తెలిపారు. -
నిమజ్జనానికి 26 స్పెషల్ చెరువులు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో గణేష్ నిమజ్జనానికి ప్రత్యేకంగా 26 చెరువులు సిద్ధమవుతున్నాయి. సెప్టెంబర్ 12న జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమానికి జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే నగరంలోని ప్రధాన చెరువుల్లో నిర్మించిన 23 ప్రత్యేక నిమజ్జన కొలనులను శుభ్రపర్చడంతో పాటు నిర్మాణంలో ఉన్న మరో మూడు నిమజ్జన చెరువులను పూర్తిచేయాలని జీహెచ్ఎంసీ ప్రణాళికలు రూపొందించింది. లేక్ సిటీగా పేరుగాంచిన హైదరాబాద్ నగరంలో ఉన్న చెరువులు మరింత కాలుష్యం బారిన పడకుండా ఉంచడంతో పాటు శుభ్రమైన నీటిలో నిమజ్జనాలు నిర్వహించడానికి ఇప్పటికే 23 వినాయక నిమజ్జన కొలనుల నిర్మాణాలను చేపట్టింది. ఈ చెరువుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇతర ప్రమాదకర రసాయన పదార్థాలతో తయారుచేసిన వినాయక, ఇతర విగ్రహాల నిమజ్జనాన్ని చేయడం ద్వారా కాలుష్యానికి గురవుతున్నాయి. ఈ కాలుష్య నివారణకు చెరువుల్లో ప్రత్యేకంగా వినాయక నిమజ్జన కొలనుల నిర్మాణాన్ని జీహెచ్ఎంసీచేపట్టింది. బెంగళూరు మాదిరిగా... బెంగళూరు నగరంలో నిర్మించిన వినాయక నిమజ్జన కొలనులు మాదిరిగా నగరంలోని 26 ప్రాంతాల్లో నిమజ్జన కొలనుల నిర్మాణాలను చేపట్టింది. మొదటి దశలో రూ.6.95 కోట్ల వ్యయంతో పది నిమజ్జన కొలనులను, రెండో దశలో రూ. 14.94 కోట్ల వ్యయంతో 15 ఎమర్షన్ ట్యాంక్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఈ రెండో దశలో చేపట్టిన 15 ట్యాంక్లలో 13 పూర్తికాగా మరో రెండింటి నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. మూడో దశలో కోటి రూపాయల వ్యయంతో మల్కాజ్ గిరి బండ చెరువులో నిమజ్జన కొలను నిర్మాణాన్ని చేపట్టగా పనులు పురోగతిలో ఉన్నాయి. ఒక్కో నిమజ్జన కొలనులో 5 వేల విగ్రహాలు నిమజ్జనం చేసేవిధంగా నిర్మించారు. సఫిల్ గూడలో ఏర్పాట్లను పరిశీలించిన దానకిషోర్ మల్కాజ్ గిరి సర్కిల్ లోని సఫిల్ గూడ చెరువును జీహెచ్ఎంసి కమిషనర్ దానకిషోర్ సందర్శించి గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జనానికి గాను గ్రేటర్ పరిధిలో చెరువుల వద్ద లైటింగ్, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, చెరువుల వద్ద ప్రత్యేకంగా నిర్మించిన నిమజ్జన కొలనులను శుభ్రం చేసి వాటిలో మంచి నీటిని నింపే కార్యక్రమాన్ని చేపట్టాలని కమిషనర్ దానకిషోర్ అధికారులను ఆదేశించారు. నిమజ్జనం సందర్భంగా ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఆయా చెరువులకు దారితీసే మార్గాలన్నింటికీ మరమ్మత్తులు చేపట్టడం, మౌలిక సదుపాయాల కల్పన, తాత్కాలిక టాయిలెట్లను, టెంటు సౌకర్యం, మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటుకు నిబంధనలను అనుసరించి టెండర్లను పిలువాలని జీహెచ్ఎంసి కమిషనర్ దానకిషోర్ ఆదేశించారు. సఫిల్గూడ చెరువును పరిశీలిస్తున్న జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ పూర్తి అయిన నిమజ్జన కొలనులు ఇవే.. ♦ ఊరచెరువు, కాప్రా ♦ చర్లపల్లి ట్యాంక్ – చర్లపల్లి ♦ అంబీర్ చెరువు – కూకట్పల్లి ♦ పెద్ద చెరువు– గంగారం, శేరిలింగంపల్లి ♦ వెన్నల చెరువు – జీడిమెట్ల ♦ రంగధాముని కుంట – కూకట్పల్లి ♦ మల్క చెరువు – రాయదుర్గ్ ♦ నలగండ్ల చెరువు – నలగండ్ల ♦ పెద్ద చెరువు –మన్సూరాబాద్ సరూర్నగర్ ♦ హుస్సేన్సాగర్ లేక్, సికింద్రాబాద్ ♦ పెద్దచెరువు–నెక్నాంపూర్ ♦ లింగంచెరువు–సూరారం ♦ ముళ్లకత్వచెరువు–మూసాపేట్ ♦ నాగోల్చెరువు ♦ అల్వాల్–కొత్తచెరువు ♦ నల్లచెరువు– ఉప్పల్ ♦ పత్తికుంట–రాజేంద్రనగర్ ♦ బోయిన్చెరువు–హస్మత్పేట్ ♦ మియాపూర్–గురునాథ్చెరువు ♦ లింగంపల్లి– గోపిచెరువు ♦ రాయసముద్రం చెరువు– రామచంద్రాపురం ♦ హఫీజ్పేట్–కైదమ్మకుంట ♦ రాయదుర్గ్ – దుర్గంచెరువు పురోగతిలో ఉన్న నిమజ్జన కొలనులు ♦ పటాన్ చెరు లోని సాకి చెరువు ♦ హుస్సేన్ సాగర్లో అంబేడ్కర్ నగర్ వద్ద ♦ మల్కాజ్ గిరిలోని బండ చెరువు -
వ్యర్థం..అనర్థం..
సాక్షి,సిటీబ్యూరో: మహానగరంలో వినాయక నిమజ్జనం ముగిసింది. ఈ సారి హుస్సేన్సాగర్లో సుమారు 50 వేలు, శివార్లలో ఏర్పాటు చేసిన 40 నిమజ్జన కొలనులు, చెరువుల్లో మరో 35 వేల వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు జీహెచ్ఎంసీ, పీసీబీ విభాగాల అంచనా. దీంతో ఆయా జలాశయాలు కాలుష్యకాసారంగా మారుతున్నాయని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత అనుభవాల నేపథ్యంలో హుస్సేన్సాగర్ సహా ఇతర జలాశయాల కాలుష్యం వల్ల కలిగే అనర్థాలపై ఆందోళన చెందుతున్నారు. హుస్సేన్సాగర్లో ఇలా.. గణేష్ నిమజ్జనంతో ఈ ఏడాది హుస్సేన్ సాగర్లోకి సుమారు 20 వేల టన్నుల ఘన వ్యర్థాలు, 30 వేల లీటర్ల అధిక గాఢత గల రసాయనాలు, హానికారక మూలకాలు, 400 టన్నుల ఇనుము, 150 టన్నుల కలప, సుమారు వంద టన్నుల పీఓపీ చేరినట్లు అంచనా. అయితే ఇందులో ఇనుము, కలప, తదితర ఘన వ్యర్థాలను బల్దియా ఎప్పటికప్పుడు తొలగించినప్పటికీ పీఓపీ, ఇతర హానికారక రసాయనాలు, రంగులు నీటిలో కలిసిపోవడంతో సాగర్ మరింత గరళసాగరంగా మారనుంది. దీంతో జీవరాశుల మనుగడకు అత్యావశ్యకమైన బయలాజికల్ ఆక్సీజన్ డిమాండ్(బీఓడి) ప్రతి లీటరు నీటికి 100 పీపీఎంగా నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణ రోజుల్లో ఇది 35 నుంచి 40 పీపీఎం మించదు. ఇక కెమికల్ అక్సీజన్ డిమాండ్ లీటరు నీటికి (సీఓడి) 200 పీపీఎంను మించే ప్రమాదం ఉంది. సాధారణ రోజుల్లో ఇది 80–100 పీపీఎం మించదు. దీనికితోడు జలాశయం నీటిలో ఆక్సీజన్ స్థాయి దారుణంగా పడిపోనుంది. ఇది ప్రతి లీటరు నీటిలో ‘సున్న’గా నమోదయ్యే ఆస్కారం ఉంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్తో తయారుచేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడంతో అందులోని హానికారక రసాయనాలు ఆయా జలాశయాల్లో చేరి పర్యావరణ హననం జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హానికారక రసాయనాలు, మూలకాలివే.. రసాయన రంగుల అవశేషాలివే: లెడ్ సల్ఫేట్, చైనా క్లే, సిలికా, జింక్ ఆక్సైడ్, రెడ్ ఐరన్ ఆౖMð్సడ్,రెడ్ లెడ్,క్రోమ్ గ్రీన్,పైన్ ఆయిల్,లిన్సీడ్ ఆయిల్, లెడ్ అసిటేట్, వైట్ స్పిరిట్, టర్పీన్ ,ఆల్కహాల్, ఎస్టర్, తిన్నర్, వార్నిష్. హానికారక మూలకాలు:కోబాల్ట్, మ్యాంగనీస్, డయాక్సైడ్, మ్యాంగనీస్ సల్ఫేట్, అల్యూమినియం, జింక్, బ్రాంజ్ పౌడర్స్, బేరియం సల్ఫేట్, క్యాల్షియం సల్ఫేట్, కోబాల్ట్, ఆర్సినేట్, క్రోమియం ఆక్సైడ్,రెడ్ ఆర్సినిక్, జిక్ సల్ఫైడ్, మెర్క్యురీ, మైకా. జలాశయాల కాలుష్యంతో తలెత్తే అనర్థాలు.. ♦ ఆయా జలాశయాల్లో సహజ ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది. చేపలు, పక్షులు, వృక్ష, జంతువుల మనుగడ ప్రశ్నార్థకమౌతుంది. ♦ పర్యావరణం దెబ్బతింటుంది. సమీప ప్రాంతాల్లో గాలి,నీరు కలుషిత మౌతుంది. దుర్వాసన వెలువడే ప్రమాదం ఉంది. ♦ ఆయా జలాశయాల్లో పట్టిన చేపలను తిన్న వారి శరీరంలోకి హానికారక మూలకాలుచేరుతున్నాయి. ♦ మలేరియా,డెంగీ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ♦ సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు గరళంగా మారతాయి. ప్రత్యేక కొలనుల్లో నిమజ్జనం ఇలా.. నగరంలో చెరువులు కాలుష్యానికి గురికాకుండా ఉండేందుకు గణేష్ నిమజ్జనానికి ప్రత్యేకంగా నిర్మించిన 23 ప్రత్యేక నిమజ్జన కొలనులు మరో 17 చెరువుల్లో సుమారు 35 వేల విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు బల్దియా అధికారులు తెలిపారు. నెక్నాంపూర్ చెరువు కొలనులో 3,659, దుర్గం చెరువులో 3,608, మల్కం చెరువులో 2,584, రాజేంద్రనగర్ పత్తికుంట కొలనులో 2,667, కూకట్పల్లి రంగదామునిచెరువులో 3,214, కుత్బుల్లాపూర్ లింగంచెరువు పాండ్లో 2,012, అల్వాల్ కొత్త చెరువులో 2,234 విగ్రహాలను నిమజ్జనం జరిగినట్లు వారు వివరించారు. త్వరలో పీసీబీ కాలుష్య నివేదిక.. హుస్సేన్సాగర్ సహా నగరంలోని 17 ప్రధాన చెరువుల్లో గణేష్ నిమజ్జనానికి ముందు, నిమజ్జనం జరిగిన రోజులు, నిమజ్జనం పూర్తయిన తరవాత మూడు దఫాలుగా కాలుష్య నియంత్రణమండలి నీటి నమూనాలను సేకరించింది. వీటిని పీసీబీ ప్రయోగశాలలో పరీక్షించి త్వరలో నిమజ్జన కాలుష్యంపై నివేదిక విడుదల చేయనున్నట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి. -
నిమజ్జనంలో అపశ్రుతులు
చిన్న చిన్న అపశ్రుతులు మినహా ఆదివారం నగరంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగింది. నాంపల్లి పరిధిలో విధినిర్వహణలో ఉన్న ఓ ఏఎస్ఐ గుండెపోటుతో మృతి చెందాడు. ట్యాంక్బండ్పై ఓ మహిళ ట్రాక్టర్పై నుంచి కిందపడి మృతి చెందింది. సుల్తాన్బజార్ ప్రాంతంలో మద్యం తాగి వాహనం నడుపుతున్న ఓ ట్రక్కు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబిడ్స్: నిమజ్జనానికి వెళ్లి వస్తున్న ఓ ఆటో బోల్తాపడిన సంఘటన అబిడ్స్ చౌరస్తాలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..పాతబస్తీకి చెందిన నిమజ్జనానికి వెళ్లిన ఆటో భక్తులతో కలిసి తిరిగివెళుతుండగా రామకృష్ణ థియేటర్ సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఆటోలు ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులకు గాయాలయ్యా యి. నిమజ్జనం డ్యూటీలో ఉన్న పోలీసులు ఆటోను పైకి లేపి బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుండెపోటుతో ఏఎస్సై మృతి నాంపల్లి: విధి నిర్వహ ణలో ఓ ఏఎస్సై గుండె పోటుతో మృతిచెందిన సంఘటన హబీబ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొమురవెల్లి పోలీస్స్టేషన్కు చెందిన ఏఎస్సై నిమ్రా నాయక్(55) వినాయక నిమజ్జనం సందర్భం గా నగరంలో విధులు నిర్వహించేందుకు వచ్చా రు. హబీబ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని కరోడ్మాల్ బిల్డింగ్ సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఆది వారం తెల్లవారుజామున విధుల్లో ఉన్న నిమ్రానాయక్ గుండెపోటుతో అస్వస్తతకు గురికావడంతో హబీబ్నగర్ పోలీసులు అతడిని సమీప ంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచ న మేరకు నాంపలి లోని కేర్ ఆస్పత్రికి తరిలించగా అప్పటికే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని అతని స్వస్థలానికి తరలించారు. ట్రాక్టర్ కిందపడి మహిళ మృతి కవాడిగూడ: ట్యాంక్బండ్పై గణేష్ నిమజ్జనం వద్ద అపశ్రుతి చోటు చేసుకుంది. ట్రాక్టర్ టైరు కింద పడి ఓ మహిళ మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నా యి. రెజిమెంటల్ బజార్కు చెందిన హేమలత (46) కుమారుడు అభిషేక్తోపాటు కాలనీవాసులతో కలిసి శనివారం రాత్రి వినా యకుడిని నిమజ్జనం చేసేందుకు ట్రాక్టర్పై ట్యాంక్బండ్ వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున ట్రాక్టర్పై నిలుచున్న హేమలత ఇళ్లల్లో ఉంచి చిన్నవినాయకులను కిందకు అందిస్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ను ముందుకు కదిలించడంతో ఆమె అదుపు తప్పి కిందపడింది. కంగారుపడిన డ్రైవర్ ట్రాక్టర్ను రివర్స్ చేయడంతో చక్రాలు ఆమె మీదుగా వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ట్రక్కు డ్రైవర్ అరెస్ట్ సుల్తాన్బజార్/అఫ్జల్గంజ్: వినాయక నిమజ్జనోత్సవంలో బేగంబజార్ నుంచి భారీ గణనాధుని తరలించే ట్రక్కు డ్రైవర్ మద్యం సేవించినట్లు గుర్తించిన పోలీసులు వాహనాన్ని ఆపి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డ్రైవర్కు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. -
హుక్..క్విక్..
సాక్షి, సిటీబ్యూరో: గణేష్ విగ్రహాలకు జియో ట్యాగింగ్, ప్రత్యేక క్యూఆర్ కోడ్ కేటాయింపుతో పాటు ఈసారి ట్యాంక్బండ్ చుట్టూ ఏర్పాటు చేసిన 38 క్రేన్లకు ప్రత్యేక డిజైన్తో కూడిన కొండీలను (హుక్స్) అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. క్విక్ రిలీజ్ డివైజ్ (క్యూఆర్డీ) పేరుతో నగరానికి చెందిన శ్రీచక్ర ఇంజనీరింగ్ సంస్థ నిర్వాహకుడు మురళీధర్ డిజైన్ చేసి ఈ హుక్స్ కారణంగా విగ్రహాలను సాగర్లో నిమజ్జనం చేయడం తేలికైంది. గతేడాది ప్రయోగాత్మకంగా వాడిన ఈ హుక్స్ను ఈ ఏడాది పూర్తి స్థాయిలో వినియోగించారు. హుస్సేన్సాగర్ చుట్టూ ఉన్న 38 క్రేన్లకు వీటిని ఏర్పాటు చేశారు. క్రేన్ కొండీ ఉండే ప్రాంతంలో ఈ హుక్స్ నాలుగింటిని ఏర్పాటు చేశారు. విగ్రహానికి కింది భాగంలో నలుమూలలా వీటిని ఫిక్స్ చేస్తున్నారు. పైకి ఎత్తినప్పుడు విగ్రహం బరువుకు గట్టిగా పట్టి ఉండే ఈ హుక్స్... అది నీటిని తాకిన వెంటనే బరువు తగ్గడంతో వాటంతట అవే రిలీజ్ అవుతాయి. విగ్రహాన్ని ఎక్కించే సమయాన్ని మినహాయిస్తే గరిష్టంగా 25 సెకన్లలో నిమజ్జనం పూర్తవుతోంది. గతంలో విగ్రహాన్ని నీటిలోకి తీసుకువెళ్లిన తర్వాత క్రేన్పై ఉండే వ్యక్తులు కొండీలను డీ–లింక్ చేయాల్సి ఉండేది. దీనివల్ల కాలయాపనతో పాటు ప్రమాదాలకు ఆస్కారం ఉండేది. పాత కొండీలతో గంటకు ఒక క్రేన్ గరిష్టంగా 12 విగ్రహాలను నిమజ్జనం చేయగా, క్యూఆర్డీ హుక్స్ వినియోగించిన క్రేన్ ఇతే సమయంలో 25 నుంచి 30 విగ్రహాలను నిమజ్జనం చేసింది. -
నిమజ్జనం..భక్తిపారవశ్యం
సాక్షి, సిటీబ్యూరో: బ్యాండు మేళాలు..డీజే హోరు..తీరైన నృత్యాలు..కోలాటాలు..చిత్ర, విచిత్ర వేషధారణలు..భక్తుల జయజయధ్వానాలు..డప్పు కళాకారుల ఆటా..పాట, గణపతి బప్పా మోరియా నినాదాల మధ్య భాగ్యనగరంలో ఆదివారం గణేష్ నిమజ్జన వేడుకలు అంబరాన్నితాకాయి. బాలాపూర్ నుంచి ఉదయం 11 గంటలకు మొదలైన శోభాయాత్ర చాంద్రాయణగుట్ట..ఫలక్నుమా..అలియాబాద్, శాలిబండ..చార్మినార్..అఫ్జల్గంజ్, మోజంజాహీ మార్కెట్ మీదుగా హుస్సేన్సాగర్కు చేరుకుంది. బాలాపూర్ గ్రామంలో లడ్డూ వేలంపాట ముగిసిన అనంతరం శోభాయాత్ర ప్రారంభమైంది. ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణంలో శోభాయాత్ర సాగింది. మార్గమధ్యంలో గణేష్ ఉత్సవ కమిటీలు ఏర్పాటుచేసిన స్వాగత మండపాలు, అక్కడ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి. నిమజ్జనంలో పాల్గొన్న భక్తజనం ఆకలి తీర్చేందుకు బాలాపూర్ మొదలుకొని హుస్సేన్సాగర్ వరకు వివిధ రకాల అల్పాహారం, ఆహారపదార్థాలతోపాటు, మంచినీరు, మజ్జిగను పలు భక్తసమాజాలు ఉచితంగా పంపిణీ చేశాయి. జలమండలి శోభాయాత్ర జరిగే మార్గంలో 101 వాటర్క్యాంపులు ఏర్పాటుచేసి 30 లక్షల మంచినీటిప్యాకెట్లను పంపిణీ చేసింది. ఆలస్యంగా ప్రారంభమైన శోభాయాత్ర... గతానికి భిన్నంగా పాతనగరంలో ఈసారి మూడు, ఐదు, ఏడు రోజులపాటు పూజలందుకున్న గణనాథులను నిమజ్జనం చేయడంతో భారీ గణనాథులను మాత్రమే ఆదివారం నిమజ్జనం చేసేలా పోలీసుశాఖ ప్రణాళిక సిద్ధంచేసింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం 1 గంట తర్వాతే పాతనగరంలో శోభాయాత్ర ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలకు ఊపందుకుంది. జనసంద్రమైన ట్యాంక్బండ్.. వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలోని ట్యాంక్బండ్ పరిసరాలు జనసంద్రమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న గణనాథులతో భక్తులు ట్యాంక్బండ్ పరిసరాలకు చేరుకున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. లక్షల సంఖ్యలో మంచినీటి ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. సంచార మరుగుదొడ్లను ఏర్పాటుచేశారు. వైద్య శిబిరాలు, సహాయ శిబిరాలు ఏర్పాటుచేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం తాత్కాలిక ట్రాఫిక్ శిబిరాలను నెలకొల్పారు. గణేశ్ నిమజ్జనం వీక్షించేందుకు నగరానికి వచ్చిన భక్తుల కోసం ఎంఎంటీఎస్ అదనపు సర్వీసులను నడిపింది. ఆర్టీసీ సైతం సుమారు 500 ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపింది. చార్మినార్ వద్ద తగ్గిన సందడి సామూహిక నిమజ్జనం నేపథ్యంలో పాతబస్తీ మీదుగా సాగే శోభాయాత్రలు అత్యంత కీలకమైనవి. నగర పోలీసులు సైతం వీటిపైనే ప్రధానంగా దృష్టిపెట్టి బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తుంటారు. ప్రతి ఏడాది ఉదయం నుంచి చార్మినార్ మీదుగా ఊరేగింపులు సాగుతూ ఉంటాయి. అయితే ఈసారి ఇంకా తొందరగా పూర్తి చేయించాలని పోలీసులు భావించినా అది సాధ్యం కాలేదు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు అప్పుడప్పుడు వచ్చిన విగ్రహాల ఆటోలు, ర్యాలీల మినహా సందడి లేదు. చార్మినార్ చుట్టపక్కల రోడ్లన్నీ దాదాపు నిర్మానుష్యంగానే ఉన్నాయి. ప్రతిసారీ నిమజ్జనం రోజు మధ్యాహ్నం మక్కా మసీదులో జరిగే ప్రార్థనల ముగింపు కోసం పోలీసులు ఊరేగింపులకు ఆపేవారు. అయితే ఈసారి మాత్రం ఆ సమయానికి ఊరేగింపులు ఆ సమీపంలోకి కూడా చేరుకోలేదు. గణేష్ ఉత్సవాలకు మూలవిరాట్గా భావించే బాలాపూర్ గణేష్ విగ్రహం సాయంత్రానికి హుస్సేన్సాగర్లో నిమజ్జనమైంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో చార్మినార్కు మూడుపక్కలా ఉన్న శాలిబండ, సర్దార్మహల్, లాడ్ బజార్ రోడ్ల నుంచి ఒక్కసారిగా విగ్రహాలతో కూడిన లారీలు అంగరంగ వైభవంగా వచ్చాయి. గతంలో విగ్రహాలతో వచ్చిన లారీల్లో దాదాపు ప్రతీది చార్మినార్ చుట్టూ తిరిగి ముందుకు సాగేది. ఈ సారి శాలిబండ వైపు నుం చి వచ్చిన లారీల్లో అత్యధికం చుట్టూ తిరగకుండా నేరుగా ముందుకు సాగేలా ఏర్పాటు చేశారు. మూడు లక్షల మంది భక్తులు... భారీగా తరలిచ్చిన భక్తులతో హుస్సేన్సాగర్ తీరమంతా పరవశించిపోయింది. సుమారు మూడు లక్షలకు పైగా భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్, జీహెచ్ఎంసీ ఇతర విభాగాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. సాయంత్రం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ మహేందర్రెడ్డి, దాన కిషోర్, అంజనీకుమార్లు ప్రత్యేక హెలికాఫ్టర్లో ఏరియల్ వ్యూ చేసి పరిస్థితిని సమీక్షించారు. పర్సులు, సెల్ఫోన్లు మాయం.. సాయంత్రం తర్వాత భక్తుల రద్దీ భారీగా పెరగడంతో చిన్నారులతో పాటు వృద్ధులు తప్పిపోయారు. మహిళాశిశు సంక్షేమ శాఖ అధికారులు, పోలీసులు తప్పిపోయిన చిన్నారులను గుర్తించి, వారి వివరాలను మైకుల్లో ప్రకటించి బంధువులకు అప్పగించారు. ట్యాంక్బండ్ సహా ప్రధాన రహదారుల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ దొంగలు తమ చేతులకు పని చెప్పారు. పర్సులు, సెల్ఫోన్లు తస్కరించారు. సెల్ఫోనులు పోయిన ఘటనపై ఖైరతాబాద్ పోలీసులకు వందకుపైగా ఫిర్యాదులు అందడం గమనార్హం. రెట్టింపు ధరలతో బెంబేలు నిమజ్జనాన్ని స్వయంగా వీక్షించేందుకు ట్యాంక్బండ్కు వచ్చిన భక్తులను వ్యాపారులు ఇష్టం వచ్చినట్లు దోచేశారు. సాధారణ రోజుల్లో రూ.10 ఉన్న మొక్క జొన్న తాజాగా రూ.20కి విక్రయించారు. ప్రూట్ సలాడ్, ఇడ్లి, దోశ, మిర్చి, శీతలపానీయాలు, ఐస్క్రీమ్స్ సహా అన్ని తినుబండారాల ధరలను అమాంతం పెంచేశారు. ఇక చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, బెలూన్స్, బూరలు, మాస్క్ల ధరలు చుక్కలంటాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదివారం కూకట్పల్లిలోని ఐడీఎల్ చెరువులో నిమజ్జనాన్ని పర్యవేక్షించారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ సరూర్నగర్, కపిలాంగూడ, ఎదులాబాద్, ఇనామ్గూడ, కాప్రా చెరువులను సందర్శించి నిమజ్జన తీరును పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. 30కి పైగా ప్రాంతాల్లో నిమజ్జనం... ప్రధాన కేంద్రమైన హుస్సేన్సాగర్తో పాటు నగరం నలుదిక్కులా ఉన్న చెరువులు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలనులతో కలిసి 30కి పైగా ప్రాంతాల్లో నిమజ్జనాల సందడి నెలకొంది. ఖైరతాబాద్ గణనాథుడిని గత ఏడాది కంటే దాదాపు గంటన్నర ముందు నిమజ్జనం చేశారు. ఊరేగింపు జరిగే మార్గం పొడవునా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. అయితే వరుస నిమజ్జనాల నేపథ్యంలో గతంలో పోలిస్తే ఈ ఏడాది కోలాహలం కాస్త తగ్గింది. సోమవారం ఉదయం వరకు హుస్సేన్సాగర్ వద్ద నిమజ్జనం సాగే అవకాశం ఉందని చెప్తున్న అధికారులు దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా వస్తాను వివిధ ప్రసార మాధ్యమాల్లో లైవ్ కవరేజీ ఉన్నప్పటికీ..స్వయంగా వీక్షించేందుకు ట్యాంక్బండ్కు వచ్చాం. కుటుంబ సభ్యులతో ఏటా వస్తుంటాం. చాలా సంతోషంగా ఉంది.– స్వప్న, బంజారాహిల్స్ ఈసారి వ్యాపారం బాగుంది మాస్కులు, ఇతర ఆట వస్తువులనువిక్రయిస్తున్నా. ఏటా నిమజ్జనానికి ఐదు రోజుల ముందు వస్తాం. ఆశించిన దానికంటే ఎక్కువ మాస్క్లు అమ్మాను. ఈసారి వ్యాపారంబాగుంది. – కుమార్, గుల్బర్గా 34 వేలకు పైగా.... నగరంలోని హుసేన్ సాగర్ లో ఆదివారం సాయంత్రం ఆరుగంటల వరకు 3420 గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగింది ట్యాంక్ బండ్ పై 3161, ఎన్. టీ.ఆర్ మార్గ్ లో 259 విగ్రహాల నిమజ్జనం జరిగింది. గత మూడు రోజుల నంచి ఇప్పటి వరకు హుసేన్ సాగర్ లో 19,420 విగ్రహాల నిమజ్జనం జరిగింది. నగరం మొత్తం మీద ఆదివారం సాయంత్రం వరకు 54, 358 విగ్రహాల నిమజ్జనం. ప్రశాంతం గా జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజల సహకారంతోనే... వినాయక సామూహిక నిమజ్జనం పూర్తి ప్రశాంతంగా సాగడానికి ప్రధాన కారణం ప్రజలు, ఉత్సవ కమిటీల సహకారం. ఆపై పోలీసు విభాగానికి చెందిన ప్రతి అధికారి, సిబ్బంది సమష్టిగా కృషి చేశారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా మధ్యాహ్నం ఒంటి గంటలోపే ఖైరతాబాద్ బడా గణేషుడి విగ్రహం నిమజ్జనం జరిగింది. క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసులు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటల్లోని అధికారులు, ఇతర విభాగాలకు చెందిన అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారు. బుధవారం సాయంత్రం నుంచి ఊరేగింపుల ప్రక్రియ జోరందుకుంది. ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని బేరీజు వేస్తూ, అందుకు తగ్గట్టు బందోబస్తు, భద్రత ఏర్పాట్లలో మార్పు చేర్పులు చేస్తున్నాం. సోమవారం సాధారణ వాహనచోదకులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. – అంజనీ కుమార్, నగర కొత్వాల్ శోభాయాత్ర హైలైట్స్ బన్సీలాల్పేట్: ఆదివారం సెలవుదినం కావడంతో లక్షలాది మంది జనం ట్యాంక్బండ్ వద్దకు తరలివచ్చారు. దీంతో ప్రాంతమంతా కిక్కిరిసి పోయింది. ⇔ గణేష్ విగ్రహాల నిమజ్జం కోసం ట్యాంక్బండ్పై మొత్తం 29 క్రేన్లు ఏర్పాటు చేశారు. ⇔ పోలీసు, జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్, ఆర్అండ్బీ విభాగాలకు చెందిన అధికారులు ట్యాంక్బండ్పై ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసుకుని పర్యవేక్షించారు. ⇔ నిమజ్జనం క్రేన్ల వద్ద ఆధునిక సాంకేతిక పద్ధతిని ప్రవేశ పెట్టారు. దీంతో గంటలో సుమారు 20 నుంచి 25 వరకు విగ్రహాలను సాగర్లో నిమజ్జనం చేశారు. ⇔ హుస్సేన్సాగర్ పరిసర ప్రాంతాల్లో సుమారు 900 వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు నిమజ్జనోత్సవ పరిస్ధితిని సమీక్షించారు. ⇔ షీ టీమ్లు మఫ్టీ డ్రెస్లో ట్యాంక్బండ్పై సంచరించడం కనిపించింది. మహిళలు...యువతులను ఇబ్బందులు పెట్టే పోకరీల ఆటకట్టించడానికి గట్టి చర్యలు తీసుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకొని హెచ్చరించారు. ⇔ ఇళ్లల్లో గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసుకున్న అనేక మంది కార్లు...చిన్న చిన్న వాహనాలను అందంగా అలంకరించి ఆటపాటలతో గణేశులను నిమజ్జనానికి తీసుకువచ్చారు. మండపంలోనే మట్టి గణపతి నిమజ్జనం నేరేడ్మెట్: వినాయకనగర్ డివిజన్ దీనదయాళ్నగర్లో గణా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో 11 రోజులపాటు పూజలందుకున్న 30 అడుగుల భారీ మట్టి గణపతి నిమజ్జనం కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. మండపంలోనే మట్టిగణపతిని నిమజ్జనం చేసి, ఆ మట్టిని భక్తులకు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో నిర్వాహకులు శ్రావణ్ పాల్గొన్నారు. అధికారుల సమన్వయం భేష్ ఎల్బీనగర్: గణేష్ నిమజ్జనం సందర్భంగా అధికారులందరు సమన్యయంతో అద్బతంగా పనిచేస్తున్నారని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్భగవత్ అన్నారు. నిమజ్జనం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం ఆయన సరూర్నగర్ మినీ ట్యాంక్ బండ్ను సందర్శించి నిమజ్జనంను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాల నిఘాలో నిమజ్జనం జరుగుతోందని ఎప్పటికప్పుడు భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. ఈ రోజు రాత్రి వరకు సుమారు 3 వేల విగ్రహాలను నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు. గ్రేటర్, విద్యుత్, ఇరిగేషన్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగిందన్నారు. -
వెళ్ళిరావయ్య బొజ్జగణపయ్య
-
గణపతి బప్పా మోరియా
కొన్ని రోజులుగా సినిమా షూటింగ్స్కి బ్రేక్ తీసుకుంటున్నారు అల్లు అర్జున్. ఈ గ్యాప్లో ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. కొత్త సినిమా కథలూ వింటున్నారు. పిల్లలతో ఎక్కువ టైమ్ ఆటలు ఆడుకుంటున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఈవెంట్స్తో గడుపుతున్నారు. వినాయక చవితి సందర్భంగా ఫ్యామిలీ అందరితో కలిసి వినాయకుడి పూజల్లో నిమగ్నమైపోయారు అల్లు అర్జున్. కుటుంబంతో సహా వినాయకుడ్ని దర్శించుకున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఫొటో అదే. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తర్వాత హడావిడిగా సినిమా సైన్ చేయలేదు అల్లు అర్జున్. కథలు వింటున్నారు. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కే కుమార్తో ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా ఉండబోతోందని, లేదు లేదు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా ఉండబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి.. నెక్ట్స్ అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. -
ఆకతాయిలపై షీ బృందం కొరడా
సాక్షి, సిటీబ్యూరో: గణేశ్ నిమజ్జనం జరుగుతున్న ట్యాంక్బండ్పై అమ్మాయిలను వేధిస్తున్న ఈవ్టీజర్లపై నగర షీ బృందాలు కొరడా ఝుళిపిస్తున్నాయి. ట్యాంక్బండ్పై బాలికలను వీడియో తీస్తున్న ఇద్దరు ఆకతాయిలను శుక్రవారం రాత్రి రెడ్హ్యండెడ్గా పట్టుకున్నాయి. ఒడిశాకు చెందిన శశికాంత్ పాండ, జార్ఖండ్కు చెందిన నితీశ్ కుమార్లను షీ టీమ్ కార్యాలయానికి తీసుకొచ్చి కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. అలాగే నెక్లెస్రోడ్డులో అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యాప్రాల్ వాసి నాగేంద్రబాబు, సికింద్రాబాద్లోని వారాసిగూడ వాసులు రోహిత్, మహేందర్, రామకృష్ణలను షీ బృందాలు పట్టుకున్నామయని నగర క్రైమ్ అండ్ సిట్ అదనపు పోలీసు కమిషనర్ షిఖా గోయల్ తెలిపారు. -
వెళ్ళిరావయ్యా...ఓ బొజ్జగణపయ్యా
-
మొదలైన ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర
-
రారండోయ్ వేడుక చూద్దాం!
సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలో అతిపెద్ద సామూహిక వేడుక వినాయక శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వ యంత్రాంగం పూర్తి చేసింది. ఆదివారం నగరం నలువైపుల నుంచి వైభవంగా ప్రారంభం కానున్న గణనాథుడి శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో కార్యాచరణ చేపట్టాయి. పోలీసులు పటిష్టమైన భద్రత కల్పిస్తున్నారు. లక్షలాది మంది భక్తజనం వేడుకలకు తరలిరానున్న దృష్ట్యా అడుగడుగునా నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. ట్యాంక్బండ్ చుట్టూ సుమారు 30 వేల మంది పోలీసు బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్, వైద్య, ఆరోగ్యశాఖలు రంగంలోకి దిగాయి. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ట్యాంక్బండ్, ఎన్టీఆర్ మార్గంలో నిమజ్జన వేడుకలు ముగిసి, భక్తులు తిరిగి ఇళ్లకు వెళ్లేవరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే నగరంలోని వివిధ మార్గాల్లో ప్రతిరోజు నడిచే 121 ఎంఎంటీఎస్ సర్వీసులతో పాటు, అదనపు సర్వీసులను దక్షిణమధ్య రైల్వే నడపనుంది. రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్యను పెంచనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు తెలిపారు. వేడుకలకు తరలివచ్చే భక్తుల కోసం జలమండలి 30 లక్షల మంచినీటి ప్యాకెట్లను సరఫరా చేయనుంది. ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ట్యాంక్బండ్, ఎన్టీఆర్మార్గ్లో, నగరంలోని ఇతర ప్రాంతాల్లో 27 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. అలాగే 108 అంబులెన్సులను 15 సిద్ధంగా ఉంచారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టింది. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి పరిస్థితినయినా అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయా శాఖల అధికారులు తెలిపారు. మరోవైపు గతేడాది నిర్వహించినట్లుగానే ఈసారి కూడా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన యాత్ర ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంట లోగా ముగియనుంది. ట్యాంక్బండ్తో పాటు నగరంలోని 35 చెరువుల్లో నిమజ్జనం ఏర్పాట్లకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. 117 స్థిరమైన క్రేన్లు, మరో 96 మొబైల్ క్రేన్లను ఆయా ప్రాంతాల్లో ఉంచారు. పక్కాగా పారిశుధ్య నిర్వహణ నిమజ్జనం సందర్భంగా పేరుకుపోయే చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేందుకు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక యాక్షన్ టీంలను రంగంలోకి దింపింది. రూ.16.86 కోట్ల వ్యయంతో అన్ని సౌకర్యాలు కల్పించినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. శోభాయాత్ర జరిగే 370 కిలోమీటర్ల మార్గంలో ప్రతి 3 కిలోమీటర్లకు ఓ యాక్షన్ టీమ్ ఉంటుంది. ఈ బృందంలో ఓ శానిటరీ సూపర్వైజర్ లేదా శానిటరీ జవాన్, ముగ్గురు ఎస్ఎఫ్ఏలు, 21 మంది పారిశుధ్య కార్మికులు మూడు షిఫ్ట్ల్లో పనిచేస్తారు. మొత్తం 178 గణేశ్ యాక్షన్ టీమ్లను రంగంలోకి దింపారు. పారిశుధ్య కార్యక్రమాలకు మొత్తం 481 మంది సూపర్వైజర్లు, 719 ఎస్ఎఫ్ఏలు, 8,597 కార్మికులు పనిచేస్తారు. ట్యాంక్బండ్తో పాటు, సరూర్నగర్, సఫిల్గూడ, మీరాలంట్యాంక్ తదితర అన్ని నిమజ్జన ప్రాంతాల వద్దా 27 ప్రత్యేక వైద్య శిబిరాలను, 92 మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. ⇔ జీహెచ్ఎంసీ నిర్మించిన 20 గణేశ్ నిమజ్జన కొలనుల్లో శుభ్రమైన నీటిని నింపి సిద్ధంగా ఉంచారు. ⇔ విద్యుత్ విభాగం రూ.94. 21 లక్షల వ్యయంతో 34,926 తాత్కాలిక లైట్లు ఏర్పాటు చేశారు. హుస్సేన్సాగర్ చుట్టూ 48 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను, సరూర్నగర్ చెరువు వద్ద 5 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం నగరంలోని అన్ని నిమజ్జన ప్రాంతాల్లో మొత్తం 101 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. 75 జనరేటర్లను అందుబాటులో ఉంచారు. ⇔ రోడ్లు భవనాల శాఖ ద్వారా 12 కిలోమీటర్ల మేర బారికేడింగ్ చేశారు. ⇔ శోభాయాత్ర మార్గంలో 15 కేంద్రాల్లో వాటర్ ప్రూఫ్ టెంట్లను వేశారు. 38 ఫైర్ ఇంజన్లను మోహరించారు. ⇔ సరూర్నగర్, కాప్రా, ప్రగతినగర్ చెరువుల వద్ద ప్రత్యేకంగా 3 బోట్లను అందుబాటులో ఉంచారు. ⇔ ట్యాంక్బండ్, సరూర్నగర్ చెరువుల వద్ద కేంద్ర విపత్తు నివారణ దళాలు మోహరించాయి. ⇔ పర్యాటక శాఖ హుసేన్ సాగర్ చెరువులో 7 బోట్లను సిద్ధం చేసింది. మరో 4 హైస్పీడ్ బోట్లు కూడా అందుబాటులో ఉంటాయి. 10 మంది గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు ఆదివారం రాత్రి 10.30 నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 8 ఎంఎంటీఎస్ రైళ్లను అదనంగా నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే చర్యలు చేపట్టింది. సికింద్రాబాద్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, ఫలక్నుమా–సికింద్రాబాద్, ఫలక్నుమా–లింగంపల్లి, తదితర మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. 550 ప్రత్యేక బస్సులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ట్యాంక్బండ్ వద్దకు చేరుకునేందుకు 550 బస్సులను అదనంగా తిప్పనున్నారు. సికింద్రాబాద్, ఉప్పల్, కాచిగూడ, కూకట్పల్లి, లింగంపల్లి, బాలానగర్, జీడిమెట్ల, మెహదీపట్నం, తదితర ప్రాంతాల నుంచి ఇందిరాపార్కు, లక్డీకాపూల్, ఖైరతాబాద్, బషీర్బాగ్ వరకు ఈ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. నిఘా నీడలో నిమజ్జనం గణేశ్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ మూడు కమిషనరేట్లలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లు డీజీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించారు. ముఖ్యంగా దాదాపు మూడువేలకు పైగా సీసీటీవీ కెమెరాలు అనుసంధానం చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఉన్నతాధికారులు నిమజ్జనయాత్రను పరిశీలించనున్నారు. బాలాపూర్ నుంచి హుస్సేన్సాగర్ వరకు శోభాయాత్ర దృశ్యాలను 450 సీసీటీవీ కెమెరాలు బంధించనున్నాయి. హుస్సేన్సాగర్లో నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన 38 క్రేన్లకు ప్రత్యేక కెమెరాలు అమర్చారు. ట్యాంక్బండ్, నెక్లెస్రోడ్డులో 90 సీసీటీవీ కెమెరాలు భక్తులు, గణనాథుల కదలికలను బంధించనున్నాయి. అలాగే నగరంలో గూగుల్ ద్వారా ట్రాఫిక్ అలర్ట్ను అందించనున్నారు. అలాగే ఏ సమయానికి ఏ విగ్రహం నిమజ్జనం చేస్తున్నారో కూడా పొందుపరచడంతో సమయనుగుణంగా నిమజ్జనం జరిగేలా పోలీసులు చూస్తున్నారు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. 1.సౌత్ జోన్: కేశవగిరి, మొహబూబ్నగర్ ఎక్స్రోడ్స్, ఇంజిన్బౌలి, నాగుల్చింత, హిమ్మత్పురా, హరిబౌలి, ఆశ్ర హాస్పిటల్, మొఘల్పురా, లక్కడ్కోటి, మదీనా చౌరస్తా, ఎంజే బ్రిడ్జ్,దారుల్షిఫా చౌరస్తా, సిటీ కాలేజ్ 2.ఈస్ట్ జోన్: చంచల్గూడ జైల్ చౌరస్తా, ముసారాంబాగ్, చాదర్ఘాట్ బ్రిడ్జ్, సాలార్జంగ్ బ్రిడ్జ్, అఫ్జల్గంజ్, పుత్లిబౌలి చౌరస్తా, ట్రూప్బజార్, జాంబాగ్ చౌరస్తా, కోఠి ఆంధ్రాబ్యాంక్ 3.వెస్ట్ జోన్: టోపిఖానా మాస్క్, అలాస్కా హోటల్ చౌరస్తా, ఉస్మాన్ జంగ్, శంకర్బాగ్, శీనా హోటల్, అజంతాగేట్, ఆబ్కారీ లైన్, తాజ్ ఐలాండ్, బర్తన్ బజార్, ఏఆర్ పెట్రోల్ పంప్ 4.సెంట్రల్ జోన్: చాపెల్ రోడ్ ఎంట్రీ, జీపీఓ దగ్గరి గద్వాల్ సెంటర్, షాలిమార్ థియేటర్, గన్ఫౌండ్రీ, స్కైలైన్ రోడ్ ఎంట్రీ, హిమాయత్నగర్ ‘వై’ జంక్షన్, దోమల్గూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చౌరస్తా, కంట్రోల్రూమ్ దగ్గరి కళాంజలి, లిబర్టీ చౌరస్తా, ఎంసీహెచ్ ఆఫీస్‘వై’ జంక్షన్, బీఆర్కే భవన్, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, ద్వారకా హోటల్ చౌరస్తా, వీవీ స్టాట్యూ చౌరస్తా, చిల్డ్రన్స్ పార్కు, వైశ్రాయ్ హోటల్ చౌరస్తా, కవాడిగూడ జంక్షన్, కట్టమైసమ్మ టెంపుల్, ఇందిరాపార్కు 5.నార్త్జోన్: కర్బాలా మైదాన్, బుద్ధభవన్, సెయిలింగ్ క్లబ్, నల్లగుట్ట చౌరస్తా వైపు నుంచి అప్పర్ ట్యాంక్బండ్, నెక్లెస్రోడ్లోకి ఎలాంటి ట్రాఫిక్ను అనుమతించరు. సీటీఓ, వైఎంసీఏ, ప్యారడైజ్ చౌరస్తా, ప్యాట్నీ జంక్షన్, బాటా ‘ఎక్స్’ రోడ్, ఆదివాసీ చౌరస్తా, ఘన్సీమండీ చౌరస్తా మధ్య ఆంక్షలు అమలులో ఉంటాయి. ⇔ మెట్రో రైల్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఎస్సార్నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎస్సార్నగర్ కమ్యూనిటీ హాల్, ఆర్ అండ్ బీ ఆఫీస్, బల్కంపేట, డీకే రోడ్ ఫుడ్ వరల్డ్, సత్యం థియేటర్ జంక్షన్, మాతా టెంపుల్, అమీర్పేట మీదుగా పంపిస్తారు. ఎన్టీఆర్ మార్గ్లో భారీ క్రేన్లు బంజారాహిల్స్: ఎన్టీఆర్ మార్గ్లో మొత్తం 12 క్రేన్లను అందుబాటులో ఉంచినట్టు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషారఫ్ ఫారుఖి, జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్–17డీఎంసీ సత్యనారాయణ తెలిపారు. శనివారం వారు ఆ ప్రాంతంలో ఏర్పాట్లును పరిశీలించి మాట్లాడారు. ఒక్కో క్రేన్ దగ్గర ఒక ఏఈ, మూడు క్రేన్లకు కలిపి ఒక డీఈ ఇన్చార్జిగా వ్యవహరిస్తారన్నారు. ఇద్దరు ఏఎంహెచ్ఓలు, జోనల్ కమిషనర్, ఇద్దరు డీఎంసీలు 12 మంది అధికారులు విధుల్లో ఉంటారన్నారు. వీరుగాక ఒక్కో క్రేన్ వద్ద షిఫ్ట్కు 21 మంది చొప్పున ఎంటమాలజీ, శానిటేషన్ వర్కర్లు వ్యర్థాలు తొలగించేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరందరికీ ప్లాస్టిక్ కవర్లు అందజేశారు. చెత్తను తరలించడానికి 15 టిప్పర్లు రేయింబవళ్లు పని చేస్తున్నాయి. ఇక్కడ జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసింది. నాలుగు చోట్ల మొబైల్ టాయ్లెట్లు, రెండు షీ టాయ్లెట్లను అందుబాటులో ఉంచామన్నారు. కాగా, శుక్రవారం ఒక్క రోజే 140 మెట్రిక్ టన్నుల చెత్తను తరలించినట్టు అధికారులు తెలిపారు. -
ట్రాఫిక్ సైరన్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో అత్యంత వైభవ ఘట్టం ‘సామూహిక నిమజ్జనం’ ఆదివారం హుస్సేన్సాగర్లో జరగనుంది. ఈ నేపథ్యంలో నగర శివార్లతో పాటు గ్రేటర్ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అదనపు పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) అనిల్కుమార్ శుక్రవారం తెలిపారు. డీసీపీ ఎల్ఎస్ చౌహాన్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిటీలోని మొత్తం 66 ప్రాంతాల్లో ట్రాఫిక్ను మళ్లించడం లేదా పూర్తిగా ఆపేయడం చేస్తారన్నారు. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. అవసరాన్ని బట్టి వీటినిపొడిగించే అవకాశం ఉందన్నారు. నిమజ్జనం పూర్తయిన తరవాత విగ్రహాలను తెచ్చిన ఖాళీ లారీల కోసం ప్రత్యేక రూట్లు కేటాయించారు. నిమజ్జనానికి వచ్చే ప్రజలు వీలున్నంత వరకు వ్యక్తిగత వాహనాలను వదిలి ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ను ఆశ్రయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన ఊరేగింపు మార్గం కేశవగిరి–నాగుల్చింత–ఫలక్నుమ–చార్మినార్–మదీనా–అఫ్జల్గంజ్–ఎంజే మార్కెట్–అబిడ్స్–బషీర్బాగ్–లిబర్టీ–అప్పర్ ట్యాంక్/ఎన్టీఆర్ మార్గ్ల్లో నిమజ్జనం జరుగుతుంది. సికింద్రాబాద్ వైపు నుంచి.. ఆర్పీరోడ్–ఎంజీ రోడ్–కర్బాలా మైదాన్–ముషీరాబాద్ చౌరస్తా–ఆర్టీసీ క్రాస్రోడ్స్– నారాయణగూడ ‘ఎక్స్’ రోడ్–హిమాయత్నగర్ ‘వై’ జంక్షన్ ద్వారా వచ్చి లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులో చేరుతుంది. ఈస్ట్జోన్ నుంచి.. ఉప్పల్–రామంతపూర్–అంబర్పేట్–ఓయూ ఎన్సీసీ–డీడీ హాస్పిటల్ మీదుగా ఆర్టీసీ క్రాస్రోడ్స్ వద్ద సికింద్రాబాద్ రూట్లో కలుస్తుంది. ♦ వెస్ట్ జోన్ వైపు నుంచి వచ్చే ఊరేగింపు ఎంజే మార్కెట్ మీదుగా సెక్రటేరియేట్ వద్ద ప్రధాన ఊరేగింపుతో కలుస్తాయి. ♦ నిమజ్జనం ఊరేగింపు జరిగే మార్గాల్లో చిన్న వాహనాలకు అనుమతి ఉండదు. ఈ మార్గానికి అటు ఇటు ప్రాంతాల్లో ఉన్న వారు ప్రయాణించేందుకు కేవలం బషీర్బాగ్ చౌరస్తా వద్ద మాత్రమే అవకాశం ఇచ్చారు. సాధారణ ప్రజలు రింగ్రోడ్, బేగంపేట్ మార్గాలను ఆశ్రయించడం ఉత్తమం. ♦ వెస్ట్–ఈస్ట్ జోన్ల మధ్య రాకపోకలు సాగించే వారికి కేవలం బషీర్బాగ్ వద్దే అవకాశం ఉంటుంది. ♦ వాహనచోదకులు సాధ్యమైనంత వరకు ఔటర్ రింగ్రోడ్, బేగంపేట్ మార్గాలను ఎంపిక చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్ 1. సౌత్ జోన్: కేశవగిరి, మొహబూబ్నగర్ ఎక్స్రోడ్స్, ఇంజిన్బౌలి, నాగుల్చింత, హిమ్మత్పురా, హరిబౌలి, ఆశ్ర హాస్పిటల్, మొఘల్పురా, లక్కడ్ కోటి, మదీనా చౌరస్తా, ఎంజే బ్రిడ్జ్, దారుల్షిఫా చౌరస్తా, సిటీ కాలేజ్ 2. ఈస్ట్ జోన్: చంచల్గూడ జైల్ చౌరస్తా, ముసారాంబాగ్, చాదర్ఘాట్ బ్రిడ్జ్, సాలార్జంగ్ బ్రిడ్జ్, అఫ్జల్గంజ్, పుత్లిబౌలి చౌరస్తా, ట్రూప్బజార్, జాంబాగ్ చౌరస్తా, కోఠి ఆంధ్రాబ్యాంక్ 3. వెస్ట్ జోన్: టోపిఖానా మాస్క్, అలాస్కా హోటల్ చౌరస్తా, ఉస్మాన్ జంగ్, శంకర్బాగ్, శీనా హోటల్, అజంతాగేట్, ఆబ్కారీ లైన్, తాజ్ ఐలాండ్, బర్తన్ బజార్, ఏఆర్ పెట్రోల్ పంప్ 4. సెంట్రల్ జోన్: చాపెల్ రోడ్ ఎంట్రీ, జీపీఓ దగ్గరి గద్వాల్ సెంటర్, షాలిమార్ థియేటర్, గన్ఫౌండ్రీ, స్కైలైన్ రోడ్ ఎంట్రీ, హిమాయత్నగర్ ‘వై’ జంక్షన్, దోమల్గూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చౌరస్తా, కంట్రోల్రూమ్ దగ్గరి కళాంజలి, లిబర్టీ చౌరస్తా, ఎంసీహెచ్ ఆఫీస్ ‘వై’ జంక్షన్, బీఆర్కే భవన్, ఇక్బాల్ మీనార్, రవీంద్రభారతి, ద్వారకా హోటల్ చౌరస్తా, వీవీ స్టాట్యూ చౌరస్తా, చిల్డ్రన్స్ పార్క్, వైశ్రాయ్ హోటల్ చౌరస్తా, కవాడిగూడ జంక్షన్, కట్టమైసమ్మ టెంపుల్, ఇందిరాపార్కు 5. నార్త్జోన్: కర్బాలా మైదాన్, బుద్ధభవన్, సెయిలింగ్ క్లబ్, నల్లగుట్ట చౌరస్తా వైపు నుంచి అప్పర్ ట్యాంక్బండ్, నెక్లెస్రోడ్లోకి ఎలాంటి ట్రాఫిక్ను అనుమతించరు. గురువారం ఉదయం నుంచి సీటీఓ, వైఎంసీఏ, ప్యారడైజ్ చౌరస్తా, ప్యాట్నీ జంక్షన్, బాటా ‘ఎక్స్’ రోడ్, ఆదివాసీ చౌరస్తా, ఘన్సీమండీ చౌరస్తా మధ్య ఆంక్షలు అమలులో ఉంటాయి. ♦ మెట్రో రైల్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఎస్సార్నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎస్సార్నగర్ కమ్యూనిటీ హాల్, ఆర్ అండ్ బీ ఆఫీస్, బల్కంపేట, డీకే రోడ్ ఫుడ్ వరల్డ్, సత్యం థియేటర్ జంక్షన్, మాతా టెంపుల్, అమీర్పేట మీదుగా పంపిస్తారు. సందర్శకులకు పార్కింగ్ ఇలా.. హుస్సేన్సాగర్లో జరిగే నిమజ్జనాన్ని వీక్షించడానికి వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయించారు. ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్, ఆనంద్నగర్ కాలనీ నుంచి రంగారెడ్డి జెడ్పీ ఆఫీస్ మధ్య, బుద్ధభవన్ పక్కన, ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కాలేజీ, పబ్లిక్ గార్డెన్స్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, లోయర్ ట్యాంక్బండ్, గో సేవా సదన్, కట్టమైసమ్మ టెంపుల్. ఇక్కడ నుంచి సందర్శకులు కాలినడకనే ట్యాంక్బండ్ పరిసరాలకు చేరుకోవాలి. నిమజ్జనం తర్వాత.. విగ్రహాలను తెచ్చిన లారీలు/ట్రక్కులు నిమజ్జనం పూర్తి చేసిన తర్వాత తిరిగి వెళ్లేందుకు ప్రత్యేక రూట్లు కల్పించారు. ఎన్టీఆర్ మార్గ్లో నిమజ్జనం చేసినవి నెక్లెస్ రోటరీ, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, వీవీ స్టాట్యూ, కేసీపీల మీదుగా వెళ్లాలి. వీటిని తెలుగుతల్లి స్టాట్యూ, మింట్ కాంపౌండ్స్లోకి అనుమతించరు. అప్పర్ ట్యాంక్బండ్ నుంచి నిమజ్జనం చేసిన లారీలు/ట్రక్కులు చిల్డ్రన్స్పార్కు, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ, ముషీరాబాద్ మీదుగా వెళ్లాలి. బైబిల్హౌస్ రైల్ ఓవర్ బ్రిడ్జ్ మీదుగా అనుమతించరు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చే లారీలను నగరంలోకి అనుమతించరు. ఔటర్ రూట్లలో వెళ్లాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సులకూ.. ట్రాఫిక్ ఆంక్షలు ఆర్టీసీ బస్సులకూ వర్తిస్తాయని పోలీస్ అధికారులు ప్రకటించారు. నిమజ్జనం నేపథ్యంలో మాసబ్ట్యాంక్, వీవీ స్టాట్యూ, సీటీఓ, వైఎంసీఏ, రేతిఫైల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, క్లాక్ టవర్, చిలకలగూడ చౌరస్తా, ఛే నెంబర్, గడ్డి అన్నారం, చాదర్ఘాట్, బహదూర్పురా, నల్గొండ చౌరస్తాను దాటి ముందుకు రానీయరు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులకు.. నిమజ్జనం పూర్తయ్యే వరకు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే బస్సులను నగరంలోకి అనుమతించరు. వీటిని శివార్లలోనే ఆపేసి అటునుంచే మళ్లిస్తారు. అందుబాటులో హెల్ప్లైన్స్ ట్రాఫిక్ ఆంక్షలపై ప్రజలకు అవగాహన కల్పించడం, సహకరించడం కోసం ప్రత్యేక హెల్ప్లైన్స్ను సైతం అందుబాటోకి తెచ్చారు. ప్రజలు ఎలాంటి సహాయం కావాలన్నా 040–27852482, 9490598985, 9010203626 నెంబర్లలో సంప్రదించవచ్చు. -
నిమజ్జన పర్వం ఆర్టీసీ సిద్ధం
సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 23న జరిగే వినాయక నిమజ్జనం సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. నిమజ్జన వేడుకలకు తరలి వచ్చే భక్తుల కోసం 550 బస్సులను అదనంగా ఏర్పాటు చేయనున్నారు. అలాగే బ్రేక్డౌన్లు చోటుచేసుకోకుండా, బస్సుల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా సమర్థవంతంగా బస్సులను నడిపేందుకు ప్రత్యేకంగా అధికారులు, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు తదితరులతో పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే పోలీసులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొనేందుకు కమిషనర్ కార్యాలయంతో పాటు, ప్రధాన మార్గాల్లోని పోలీస్స్టేషన్లు, ట్రాఫిక్ కూడళ్లలో ప్రత్యేకంగా కొంతమంది అధికారులను నియమించనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. 33 మంది అధికారులు, 40 మంది సూపర్వైజర్లు, 70 మంది మెకానిక్లు, 100 మంది డ్రైవర్లు, 50 మంది సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి బస్సుల నిర్వహణలో లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు పాటిస్తారు. ఈ రూట్లలో ప్రత్యేక బస్సులు బషీర్బాగ్ నుంచి కాచిగూడ, రాంనగర్, ఓల్డ్ఎమ్మెల్యేక్వార్టర్స్ నుంచి కొత్తపేట్, ఎల్బీనగర్, వనస్థలిపురం, మిధాని, హిమాయత్నగర్ నుంచి ఉప్పల్, ఇందిరాపార్కు నుంచి ఉప్పల్, రిసాలాబజార్, ఈసీఐఎల్ క్రాస్రోడ్స్, సికింద్రాబాద్, మల్కాజిగిరి,జామై ఉస్మానియా, తదితర రూట్లలో అదనపు బస్సులు నడుస్తాయి. అలాగే లకిడికాఫూల్ నుంచి టోలీచౌకి, రాజేంద్రనగర్, ఖైరతాబాద్ నుంచి బీహెచ్ఈఎల్, కొండాపూర్, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, కూకట్పల్లి, సనత్నగర్,బాచుపల్లి, లింగంపల్లి, కేపీహెచ్బి, పటాన్చెరు. ఖైరతాబాద్ నుంచి సికింద్రాబాద్, తదితర రూట్లలో 550 బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రత్యేక కంట్రోల్ రూం బస్సుల నిర్వహణలో ఇబ్బందులను అధిగమించేందుకు ఆఫ్జల్గంజ్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, నారాయణగూడ, ఇందిరాపార్కు, ఖైరతాబాద్, సరూర్నగర్లలో రిలీఫ్వ్యాన్లను, మెకానిక్లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఉదయం 7 గంటల నుంచి నిమజ్జన వేడుకలు పూర్తయ్యే వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న కంట్రోల్ కేంద్రం ద్వారా ప్రయాణికుల సలహాలను, సూచనలు, ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తారు. ప్రయాణికులు 9959224058 నెంబర్కు ఫోన్ చేయవచ్చు. -
ఈసారి అత్యాధునిక హుక్స్!
గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో కీలకఘట్టమైన నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. బందోబస్తు కోసం 19 వేల మంది పోలీసులను రంగంలోకి దింపుతున్నారు. నగరమంతటా సీసీ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచే నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమవుతుందని సీపీ అంజనీకుమార్ గురువారం మీడియాకు తెలిపారు. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం మధ్యాహ్నానికే పూర్తవుతుందని పేర్కొన్నారు. ‘ఈ ఏడాది నిమజ్జనంలో వినియోగించే క్రేన్లకు అత్యాధునిక హుక్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఇవి ఆటోమెటిక్గా రిలీజ్ అవుతాయి. తద్వారా ఒక్కో విగ్రహం నిమజ్జనంలో 4 నుంచి 6 నిమిషాల సమయం ఆదా అవుతుంది. ఒక్కో క్రేన్ ద్వారా గంటకు 25 విగ్రహాలను నిమజ్జనం చేయవచ్చు.’ అని సీపీ వెల్లడించారు. సాక్షి, సిటీబ్యూరో: గణేష్ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన నిమజ్జనం ఆదివారం జరుగనుండటంతో 19 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. గురువారం ఆయన నిమజ్జన ఏర్పాట్లను వివరించారు. నిమజ్జన ఘట్టాన్ని త్వరగా పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేశామని, రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తుల బైండోవర్, వారిపై నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది ఆదివారం అర్థరాత్రి లేదా సోమవారం తెల్లవారుజాములోగా నిమజ్జనం పూర్తయ్యేలా కసరత్తు చేస్తున్నారు. ఖైరతాబాద్ మహా గణేషుడి నిమజ్జనం ఉరేగింపు ఉదయం 6 గంటలకే ప్రారంభమై, మధ్యాహ్నం 11.30 గంటలకు ముగిసేలా చర్యలు తీసుకుంటున్నారు. సీసీ కెమెరాలు, హ్యాండ్ హెల్డ్ కెమెరాలతో ప్రతి ఘట్టాన్నీ చిత్రీకరించనున్నారు. బందోబస్తు కోసం నగర పోలీసులతో పాటు కేంద్రం, రాష్ట్ర సాయుధ బలగాలనూ మోహరిస్తున్నారు. ఆదివారం రాత్రి బాలాపూర్ గణేష్ నిమజ్జనం పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. బందోబస్తు వివరాలివీ: నగర పోలీసు విభాగంలోని నలుగురు అదనపు సీపీలు, ఒక జాయింట్ సీపీ, తొమ్మిది మంది డీసీపీలు, 20 మంది అదనపు డీసీపీలు, 64 మంది ఏసీపీలు, 244 మంది ఇన్స్పెక్టర్లు, 618 మంది ఎస్సైలు, 636 మంది ఏఎస్సైలు, 1700 మంది హెడ్–కానిస్టేబుళ్లు, 7198 మంది కానిస్టేబుళ్లు, 680 మంది ఎస్పీఓలు, 6000 మంది హోంగార్డులతో కలిపి మొత్తం 17,174 మంది సిబ్బందికి తోడు 25 ప్లటూన్ల టీఎస్ఎస్పీ బలగాలు బందోబస్తులో పాల్గొంటున్నాయి. అదనపు బలగాలు:ఐదుగురు ఐజీలు, ఒక డీఐజీ, 19 ఎస్పీ/అదనపు ఎస్పీలు, 66 మంది డీఎస్పీలు, 128 మంది ఇన్స్పెక్టర్లు, 129 మంది ఎస్సైలు, ఆరుగురు మహిళా ఎస్సైలు, 1336 మంది ఏఎస్సై/హెడ్కానిస్టేబుళ్లు, 5239 మంది కానిస్టేబుళ్లు, 149 మంది మíహిళా కానిస్టేబుళ్లు, 1426 మంది హోంగార్డులతో కలిపి మొత్తం 9382 మంది. వీరికి అదనంగా 45 ఏఆర్ ప్లటూన్లు, 5 కంపెనీల కేంద్ర బలగాలు బందోబస్తులో పాల్గొంటాయి. ♦ 13 యూనిట్ల గ్రేహౌండ్స్, రెండు యూనిట్ల ఆక్టోపస్ బలగాలు అందుబాటులో ఉంటాయి. ♦ నిమజ్జనం, ఊరేగింపుల్లో 2000 వేల మంది ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లతో పాటు స్వచ్ఛంద సంస్థలు, కార్యకర్తల సహకారం తీసుకోనున్నారు. నిరంతర నిఘా.. ♦ నగరంలో ఉన్న 2.5 లక్షలకు తోడు అదనంగా 2 వేల సీసీ కెమెరాలు, మరో 600 హ్యాండ్హెల్డ్ కెమెరాలను వినియోగించనున్నారు. ♦ 500 మీటర్ల పరిధిలో ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్తో పని చేసే 10 మెగా పిక్సల్ కెమెరాలు ట్యాంక్బండ్ చుట్టూ ఏర్పాటు చేశారు ♦ సీసీ కెమెరాలను స్థానిక ఠాణా, జోనల్ కంట్రోల్ రూమ్, కమిషనరేట్లోని కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్తో పాటు డీజీపీ కార్యాలయంతో అనుసంధానం చేశారు. ఈసారి అత్యాధునిక హుక్స్! వినాయక చవితి నేపథ్యంలో గతేడాది హైదరాబాద్లోని ట్యాంక్బండ్ వద్ద కొన్ని క్రేన్లకు ప్రత్యేక డిజైన్తో కూడిన కొండీలను (హుక్స్) ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఈసారి మరింత అడ్వాన్స్డ్ హుక్స్ అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్రంలోని ఎనిమిది ప్రాంతాల్లోని 100 క్రేన్లకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. శ్రీచక్ర ఇంజినీరింగ్ సంస్థ నిర్వాహకుడు మురళీధర్ రూపొందించిన ఈ క్విక్ రిలీజ్ డివైజ్ (క్యూఆర్డీ) హుక్స్ ఈసారి ట్యాంక్బండ్, ఎన్టీఆర్ మార్గ్లోని 38 క్రేన్లకు వాడుతున్నారు. గతేడాది హుస్సేన్సాగర్ చుట్టూ ఉన్న 36 క్రేన్లలో 20 క్రేన్లను వీటిని వినియోగించారు. క్రేన్ కొండీ ఉండే ప్రాంతంలో ఈ హుక్స్ నాలుగింటిని ఏర్పాటు చేశారు. విగ్రహానికి కింది భాగంలో నలుమూలలా వీటిని ఫిక్స్ చేశారు. పైకి ఎత్తినప్పుడు విగ్రహం బరువుకు గట్టిగా పట్టి ఉండే ఈ హుక్స్... అది నీటిని తాకిన వెంటనే బరువు తగ్గడంతో వాటంతట అవే రిలీజ్ అవుతాయి. దీంతో గరిష్టంగా 25 సెకన్లలో నిమజ్జనం పూర్తవుతుంది. పాత కొండీలతో గంటకు ఒక క్రేన్ గరిష్టంగా 12 విగ్రహాలను నిమజ్జనం చేస్తే... క్యూఆర్డీ హుక్స్ వినియోగించిన క్రేన్ ఇదే సమయంలో 25 నుంచి 30 విగ్రహాలను నిమజ్జనం చేసింది. ఈసారి వీటిపై మరింత అధ్యయనం చేసిన మురళీధర్ అడ్వాన్స్డ్ వెర్షన్ అందుబాటులోకి తీసుకువచ్చారు. పాత హుక్ 15 కేజీల వరకు బరువు ఉండటంతో నిర్వహణ కష్టంగా మారడంతో దీనిని గరిష్టంగా 5.6 కేజీలకు తగ్గించారు. ఇవి ఉన్న క్రేన్ ఓ విగ్రహాన్ని గరిష్టంగా 15 సెకన్లతో నిమజ్జనం చేస్తుంది. హైదరాబాద్లో 38 (ట్యాంక్బండ్, ఎన్టీఆర్ మార్గ్), సైబరాబాద్లో 20, రాచకొండ పరిధిలో 25 క్రేన్లకు ఈ తరహా హుక్కులను ఏర్పాటు చేయనున్నారు. 45 రోజులుగా కసరత్తు ‘కీలక ఘట్టమైన నిమజ్జనం ప్రశాంతంగా పూర్తి చేయడానికి 45 రోజులుగా కసరత్తు చేశాం. శుక్రవారం మెహర్రం ఊరేగింపును దృష్టిలో పెట్టుకుని బందోబస్తు నిర్వహిస్తున్నాం. సోషల్మీడియా, ఎస్సెమ్మెస్ల ద్వారా వచ్చే పుకార్లను నమ్మడం, ఇతరులకు ఫార్వర్డ్ చేయడం చేయవద్దు. ఎవరికైనా ఇలాంటి సందేశాలు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. నెక్లెస్రోడ్ ప్రాంతంలో అదనంగా హోల్డింగ్ ఏరియా కేటాయించాం. ఆదివారం అర్థరాత్రి 2 గంటల తర్వాత వచ్చే విగ్రహాల వాహనాలను అక్కడికి పంపిస్తాం. పని దినమైన సోమవారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది నిమజ్జనంలో వినియోగించే క్రేన్లకు అత్యాధునిక హుక్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఇవి ఆటోమెటిక్గా రిలీజ్ అవుతాయి. తద్వారా ఒక్కో విగ్రహం నిమజ్జనంలో 4 నుంచి 6 నిమిషాల సమయం ఆదా అవుతుంది. ఫలితంగా ఒక్కో క్రేన్ ద్వారా గంటకు 25 విగ్రహాలను నిమజ్జనం చేయవచ్చు. – అంజనీ కుమార్, సిటీ పోలీసు కమిషనర్ -
గతానికి భిన్నంగా..!
సాక్షి, సిటీబ్యూరో: ‘గణేష్’ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సామూహిక నిమజ్జనం ఆదివారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు జాగ్రత్తలు చేపట్టనున్నారు. నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ఆదేశాల మేరకు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు నిఘా, తనిఖీలు, గస్తీ, సోదాలు ముమ్మరం చేశారు. ప్రధాన ఉరేగింపు, నిమజ్జనం జరిగే చెరువుల వద్ద, నగర వ్యాప్తంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. ప్రతి చిన్న విషయాన్నీ పెద్దదిగా చేసి చూపిస్తూ, వదంతులతో బల్క్ ఎస్సెమ్మెస్లు, సోషల్మీడియా ద్వారా ప్రచారం చేయడం ఇటీవల కాలంలో పెరిగింది. కొన్ని సందర్భాల్లో ఇవి కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతున్నాయి. నగరంలో గతంలో చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న అధికారులు పుకార్లను తీవ్రంగా పరిగణించాలని నిర్ణయించారు. దీనికోసం ఆయా సర్వీస్ ప్రొవైడర్లతోనూ సమన్వయంగా పని చేయనున్నారు. వదంతులను వ్యాపింపజేస్తున్న ఎస్సెమ్మెస్లు, సోషల్మీడియాలపై టెక్నికల్ నిఘా ఉంచే ఏర్పాటు చేశారు. దీనికోసం సైబర్ క్రైమ్ పోలీసుల అధీనంలో ప్రత్యేక వింగ్ను ఏర్పాటు చేశారు. సామూహిక నిమజ్జనాన్ని తిలకించడానికి ప్రతి ఏడాదీ మహిళా భక్తులు సైతం అధిక సంఖ్యలో వస్తుంటారు. దీన్ని అదనుగా చేసుకుని ఆకతాయిలు, స్నాచర్లు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని దష్టిలో పెట్టుకున్న సిటీ పోలీసులు ఈసారి గతానికి భిన్నంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవ్టీజర్లుకు చెక్ చెప్పడానికి 100 షీటీమ్ బృందాలను వివిధ ప్రాంతాల్లో మోహరిస్తున్నారు. దీంతో పాటు స్నాచర్లుకు చెక్ చెప్పేందుకు సీసీఎస్, టాస్క్ఫోర్స్లకు చెందిన డెకాయ్ బృందాలు రంగంలోకి దిగనున్నాయి. వీరు అనుమానాస్పద, కీలక ప్రాంతాల్లో మఫ్టీల్లో సాధారణ వ్యక్తుల మాదిరి తిరుగుతూ నిఘా వేసి ఉంచుతారు. దాదాపు 40కి పైగా డెకాయ్ టీమ్స్ మోహరిస్తున్న ఉన్నతాధికారులు ఇందులో క్రైమ్ వర్క్పై పట్టున్న వాళ్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో ఎవరికైనా పుకార్లతో కూడిన సందేశాలు వస్తే వాటిని తక్షణం పోలీసుల దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేస్తున్నారు. వీటిని మరో గ్రూపులోకో, వ్యక్తిగతంగానో ఫార్వర్డ్ చేస్తే సాంకేతిక నిఘాతో వారిని కనిపెట్టేలా ఏర్పాట్లు చేశారు. అలాంటి వారిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయనున్నారు. వదంతితో కూడిన సందేశాన్ని సృష్టించడం ఎంత నేరమో... దాన్ని ప్రచారం చేయడం సైతం అదే స్థాయి నేరమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. సీసీ కెమెరాలతో గట్టి నిఘా.. నిమజ్జనం ఊరేగింపు నగరంలోని 25 పోలీసుస్టేషన్ల పరిధి నుంచి సాగనుంది. ఈ నేపథ్యంలో పూర్తి మార్గాన్ని నిశితంగా పరిశీలించేందుకు పోలీసులు సీసీ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఆయా మార్గాల్లో శాశ్వత ప్రాతిపదికన ఉన్న కెమెరాలకు తోడు అదనంగా భారీ సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నారు. హుస్సేన్సాగర్ చుట్టూనే దాదాపు 90 కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటన్నింటిలోని దృశ్యాలను ఎప్పటికప్పుడు బషీర్బాగ్ కమిషనరేట్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో (సీసీసీ) పాటు ప్రాంతాల వారీగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్స్ నుంచి చూసే ఆస్కారం ఉంది. వీటితో పాటు ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్బండ్, ఖైరతాబాద్ గణేష్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ‘టీఎస్ కాప్’ యాప్తో అనుసంధానించారు. ఫలితంగా వీటిలోని దృశ్యాలను అధికారులు, సిబ్బంది తమ ట్యాబ్స్, సెల్ఫోన్లలో ఎప్పటికప్పుడు చూసుకునే అవకాశం ఏర్పడనుంది. బాలాపూర్ గణ పతి సైతం.. గణేష్ శోభాయాత్ర నగర వ్యాప్తంగా దాదాపు 117.3 కిమీ పరిధిలో సాగనుందని పోలీసులు అంచనా వేశారు. పాతబస్తీతో కూడిన దక్షిణ మండలంలో అత్యధికంగా 39.3 కిమీ పరిధిలో ఈ యాత్ర జరగనుంది. బాలాపూర్ గణేషుడు సైతం ఇదే మార్గంలో రానుండటం గమనార్హం. ఇప్పటికే ఊరేగింపులు జరిగే శోభాయాత్ర మార్గాన్ని పలుమార్లు పరిశీలించిన కొత్వాల్ అంజనీకుమార్ బందోబస్తు, భద్రత చర్యల్లో అనేక మార్పు చేర్పులు సూచించారు. తాజాగా బుధవారం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి మరోమారు రూట్లో పర్యటించారు. శోభాయాత్ర మార్గాలు ఇలా.. సౌత్జోన్: 39.3 కి.మీ ఈస్ట్జోన్: 8.4 కి.మీ సెంట్రల్ జోన్: 6.4 కి.మీ వెస్ట్జోన్: 30.5 కి.మీ నార్త్జోన్: 33 కి.మీ మొత్తం: 117.3 కి.మీ -
వినాయకుడికో కోడ్!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఏటా జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం నగర పోలీసులకు అత్యంత కీలకమైన ఘట్టాలు. మండపం ఏర్పాటుకు అనుమతి మంజూరు చేయడం నుంచి విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇప్పటి వరకు మాన్యువల్ జరుగుతున్న ఈ తతంగాన్ని సిటీ కాప్స్ ఈసారి పూర్తి ఆన్లైన్ చేశారు. ప్రతి వినాయక మండపానికీ ఓ ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ కేటాయిస్తున్నారు. దీంతో తనిఖీల నుంచి నిమజ్జనం వరకు ప్రతి అంశం జవాబుదారీగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరోపక్క ఈ ఏడాది ఖైరతాబాద్ మహా గణపతితో పాటు బాలాపూర్ గణేషుడినీ ఒకే రోజు, గరిష్టంగా సాయంత్రం లోపు నిమజ్జనం చేయించేలా పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆన్లైన్లో దరఖాస్తుల వివరాలు... నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏటా వేల వినాయక మండపాలు ఏర్పాటవుతుంటాయి. దీనికోసం నిర్ణీత సమయం ముందు నుంచి పోలీస్ స్టేషన్లలో దరఖాస్తులు అందిస్తుంటారు. వీటిని పూర్తి చేసే మండప నిర్వాహకులు సంబంధిత పత్రాలు, నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు జత చేసి ఠాణాలోనే దాఖలు చేయాల్సి ఉండేది. వీటి ఆధారంగా పోలీసులు మండపాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంతో పాటు ప్రతి దానికీ ఓ నంబర్ కేటాయించే వారు. సదరు విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు ఆ నంబర్ ఆధారంగానే పర్యవేక్షణ జరిగేది. ఇప్పటి వరకు ఇదంతా మాన్యువల్గా జరుగుతూ వచ్చింది. ఈసారి పోలీసులు మాన్యువల్గా దరఖాస్తులు స్వీకరించినప్పటికీ వాటిని ఆన్లైన్ పొందుపరిచారు. ప్రత్యేక క్యూఆర్ కోడ్ కేటాయింపు... ఇలా ఆన్లైన్ చేసిన దరఖాస్తులను పరిశీలించేందుకు బషీర్బాగ్లోని కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. వీరు ఆన్లైన్ దరఖాస్తులు, ఠాణాల నుంచి వచ్చిన పత్రాలను పరిశీలించి మండపం ఏర్పాటుకు అనుమతి లేఖ ఇస్తారు. దీనిపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ముద్రిస్తారు. ఒక్కో విగ్రహానికి ఒక్కో కోడ్ కేటాయించేలా ఏర్పాట్లు చేశారు. దీంతో అనుమతి మంజూరులో ఎలాంటి జాప్యం ఉండదని అధికారులు తెలిపారు. ఈ పత్రాన్ని మండప నిర్వాహకులు తమ మండపాల్లో నిర్ణీత ప్రాంతంలో అతికించాల్సి ఉంటుంది. టీఎస్ కాప్లోకి లింక్... ఈ క్యూఆర్ కోడ్స్ డేటాను పోలీసు అధికారిక యాప్ టీఎస్ కాప్లోకి లింకు ఇస్తున్నారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయిలో ఉండే పోలీసుల వరకు ఎవరైనా సరే తమ ప్రాంతంలో ఎన్ని మండపాలు ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? ఎప్పుడు ఏర్పాటు అవుతాయి? నిమజ్జనం ఎప్పుడు? ఏ మార్గంలో వెళ్ళి, ఎక్కడ నిమజ్జనం చేస్తారు? తదితర వివరాలను తమ ట్యాబ్స్, స్మార్ట్ఫోన్లో చూసుకునే అవకాశం ఏర్పడింది. క్యూఆర్ కోడ్ కేటాయింపులోనే అధికారులు పక్కాగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల వారీగా వేర్వేరుగా దీని కేటాయింపు జరుగుతోంది. కోడ్ స్కానింగ్తో తనిఖీలు... ఓ ప్రాంతంలో మండపం ఏర్పాటు నుంచి విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు ప్రతి దశలోనూ పోలీసుల పర్యవేక్షణ ఉంటుంది. గస్తీ విధులు నిర్వర్తించే బ్లూకోల్ట్సŠ, పెట్రోలింగ్ వాహనాల సిబ్బంది నిత్యం ఆయా మండపాల వద్దకు వెళ్లి పరిస్థితులను అంచనా వేయడంతో పాటు తనిఖీలు చేయాలి. ఇప్పటి వరకు ఈ విధానం సైతం మాన్యువల్గానే సాగుతోంది. అయితే తాజాగా క్యూఆర్ కోడ్ కేటాయిస్తున్న నేపథ్యంలో గస్తీ సిబ్బంది తనిఖీలప్పుడు తమ ట్యాబ్స్ను వినియోగిస్తారు. ఆయా మండపాల వద్దకు వెళ్లి కోడ్ను హైదరాబాద్ కాప్ యాప్లో స్కాన్ చేస్తారు. దీంతో ఈ తనిఖీలు ఎలా సాగుతున్నాయన్నది ఉన్నతాధికారులకు ఈ యాప్ ద్వారానే తెలుస్తుంది. నిమజ్జనంపై స్పష్టత... గణేష్ ఉత్సవాల్లో నిమజ్జనం అత్యంత కీలకమైన ఘట్టం. నిర్ణీత సమయంలో ఊరేగింపు ప్రారంభంకావడం నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు ప్రతి విగ్రహం కదలికల్నీ గమనిస్తుండాలి. క్యూఆర్ కోడ్తో కూడిన పత్రంతో వచ్చే విగ్రహాలను క్షేత్రస్థాయి సిబ్బంది ఎక్కడిక్కడ పర్యవేక్షిస్తారు. ఆ కోడ్ను తమ ట్యాబ్స్, ఫోన్లలో స్కానింగ్ చేస్తుంటారు. దీంతో ఏ విగ్రహం, ఏ సమయంలో, ఏ ప్రాంతంలో ఉంది? ఎప్పుడు నిమజ్జనం జరిగింది? ఇంకా ఎన్ని విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉంది? అనే అంశాలు అందరు సిబ్బంది, అధికారులకు యాప్ ద్వారా తెలుస్తుంటాయి. -
పొల్యూషన్ అలర్ట్!
సాక్షి, సిటీబ్యూరో: గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్లో ఓ మోస్తరు కాలుష్యం తగ్గినట్లు ఇటీవల అధికారులు పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు ఆ ఆనందం ఆవిరయ్యే పరిస్థితి కనిపిస్తోంది. నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వస్తున్న గణపతి విగ్రహాలను సాగర్లో భారీగా నిమజ్జనం చేస్తున్నారు. దీంతో కాలుష్యం తీవ్రత పెరిగే ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టర్ఆఫ్ ప్యారిస్, ఇతర రసాయనాలతో చేసిన గణపతుల నిమజ్జనంతో ఆయా జలాశయాలు కాలుష్యకాసారం అవుతాయని వారు అంటున్నారు. గత అనుభవాల నేపథ్యంలో హుస్సేన్సాగర్ సహా ఇతర జలాశయాల్లో కాలుష్యంతో జరిగే అనర్థాలను వివరిస్తున్నారు. ♦ ఏటా గణేష్ నిమజ్జన ప్రక్రియ కారణంగా సుమారు 20 వేల టన్నుల ఘన వ్యర్థాలు, 30 వేల లీటర్ల అధిక గాఢత గల రసాయనాలు, హానికారక మూలకాలు, 400 టన్నుల ఇనుము, 150 టన్నుల కలప, సుమారు వంద టన్నుల పీఓపీ సాగర జలాల్లో కలుస్తాయని అంచనా. ♦ ఇందులో ఇనుము, కలపను హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో తొలగించినా..పీఓపీ, ఇతర హానికారక రసాయనాలు, రంగులు నీళ్లలో కలిసిపోవడంతో హుస్సేన్సాగర్ మరింత గరళసాగరమౌతోంది. ♦ అధిక మోతాదులో హానికారక రసాయనాలు, వ్యర్థాలు, మూలకాలు ప్రవేశించడంతో జలాశయంలో ప్రతి లీటరు నీటిలో జీవరాశుల మనుగడకు అత్యావశ్యకమైన బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(బీఓడి) ప్రతి లీటరు నీటికి 100 పీపీఎంగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణ రోజుల్లో ఇది 35 నుంచి 40 పీపీఎం మించదు. ♦ ఇక కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ లీటరు నీటికి (సీఓడీ) 200 పీపీఎంకు మించే ప్రమాదం పొంచి ఉంది. సాధారణరోజుల్లో ఇది 80–100 పీపీఎం మించదు. ఇక జలాశయం నీటిలో ఆక్సిజన్ స్థాయి దారుణంగా పడిపోతోంది. ఇది ప్రతి లీటరు నీటిలో ‘సున్న’గా నమోదయ్యే ఆస్కారం ఉంది. అమ్మో.. ప్లాస్టర్ ఆఫ్ప్యారిస్.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారుచేసిన విగ్రహాలను హుస్సేన్సాగర్ సహా ఇతర జలాశయాల్లో నిమజ్జనం చేయడంతో అందులోని హానికారక రసాయనాలు ఆయా జలాశయాల నీటిలో చేరి పర్యావరణ హననం జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రసాయన రంగుల అవశేషాలివే: లెడ్ సల్ఫేట్, చైనా క్లే, సిలికా, జింక్ ఆక్సైడ్, రెడ్ ఐరన్ ఆక్సైడ్, రెడ్ లెడ్, క్రోమ్ గ్రీన్, పైన్ ఆయిల్, లిన్సీడ్ ఆయిల్, లెడ్ అసిటేట్, వైట్ స్పిరిట్, టర్పీన్, ఆల్కహాల్, ఎస్టర్, తిన్నర్, వార్నిష్. ♦ హానికారక మూలకాలు::కోబాల్ట్, మ్యాంగనీస్, డయాక్సైడ్, మ్యాంగనీస్ సల్ఫేట్, అల్యూమినియం, జింక్, బ్రాంజ్ పౌడర్స్, బేరియం సల్ఫేట్, క్యాల్షియం సల్ఫేట్, కోబాల్ట్, ఆర్సినేట్, క్రోమియం ఆక్సైడ్, రెడ్ ఆర్సినిక్, జింక్ సల్ఫైడ్, మెర్క్యురీ, మైకా. జలాశయాల కాలుష్యంతోతలెత్తే అనర్థాలివే.. ♦ ఆయా జలాశయాల్లో సహజ ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది. చేపలు, పక్షులు, వృక్ష, జంతు అనుఘటకాల మనుగడ ప్రశ్నార్థకమౌతుంది. ♦ పర్యావరణం దెబ్బతింటుంది. సమీప ప్రాంతాల్లో గాలి, నీరు కలుషిత మౌతుంది. దుర్వాసన వెలువడే ప్రమాదం ఉంది. ♦ ఆయా జలాశయాల్లో పట్టిన చేపలను పలువురు మత్స్యకారులు నగరంలోని వివిధ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసి తిన్న వారికి శరీరంలోకి హానికారక మూలకాలు చేరుతున్నాయి. చేపల ద్వారా మానవ శరీరంలోకి మెర్క్యురీ మూలకం చేరితే మెదడులో సున్నితమైన కణాలు దెబ్బతింటాయి. ♦ మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ♦ సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు గరళంగా మారతాయి. ♦ నగరంలో జీవావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. జలాల్లో అరుదుగా పెరిగే వృక్ష జాతులు అంతర్థానమౌతాయి. ♦ ఆర్సినిక్, లెడ్, మెర్క్యురీ మూలకాలు భారతీయ ప్రమాణాల సంస్థ, వైద్య పరిశోధనా సంస్థలు సూచించిన పరిమితులను మించి ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ♦ వీటితోపాటు క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాలిబ్డనమ్, సిలికాన్లు జలాశయం ఉపరితలంపై తెట్టుగా ఏర్పడతాయి. ♦ జలాశయాల అడుగున క్రోమియం, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, కాడ్మియం, లిథియం వంటి హానికారక మూలకాలు అవక్షేపంగా ఏర్పడతాయి. ప్రత్యామ్నాయాలివే.. ♦ రంగులు, రసాయనాలు లేని మట్టి వినాయక ప్రతిమలను మాత్రమే నిమజ్జనం చేయాలి. వీటి పరిమాణంసైతం చిన్నవిగానే ఉండాలి. ♦ ఆయా జలాశయాల్లో నిమజ్జనం చేసే వినాయక విగ్రహాల సంఖ్యను ఏటేటా తగ్గించాలి. ఎక్కడి విగ్రహాలను అక్కడే నిమజ్జనం చేసేలా ఆయా విభాగాలు చర్యలు తీసుకోవాలి. ♦ నగరంలో మంచినీటి చెరువులు, బావుల్లో విగ్రహాల నిమజ్జనం చేయరాదు. ♦ వినాయక విగ్రహాలతోపాటు జలాశయాల్లోకిపూలు, కొబ్బరి కాయలు, నూనె, వస్త్రాలు, పండ్లు, ధాన్యం, పాలిథీన్ కవర్లను పడవేయరాదు. ♦ నిమజ్జనం జరిగిన గంటలోపే వ్యర్థాలను తొలగించాలి. ♦ పీఓపి(ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్)తో తయారు చేసిన భారీ విగ్రహాలను నిమజ్జనం చేయకుండా... వాటిని జలాశయం వద్దకు తీసుకొచ్చి కొంత నీరు చల్లాలి. వచ్చే ఏడాది వీటిని వినియోగించేలా ప్రోత్సహించాలి. ♦ జలాశయాల్లో వ్యర్థాలు పోగుపడడంతో దోమలు వృద్ధిచెంది..మలేరియా, డెంగీ వ్యాధులు విజృంభిస్తాయి. ♦ జలాశయాల్లో వృక్ష, జంతు జాతులు, నీరు, మృతిక, గాలి, పర్యావరణం దెబ్బతినకుండా అన్నివర్గాల్లో అవగాహన పెంచాలి. -
నిమజ్జనోత్సవం షురూ
-
నిమజ్జనం.. కలవరం!
ప్రకాశం, కొత్తపట్నం: ఒంగోలు నగరానికి సమీపంలో ఉన్న కొత్త పట్నం బీచ్ అంటే అందరికీ ఇష్టమే. అయితే తీరంలో వసతుల లేమితో పర్యాటకులతో పాటు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు ఎంలాంటి చర్యలు తీసుకోవడంలేదు. సముద్ర స్నానాకి వచ్చిన వారు ఉప్పు నీటి బట్టలతోనే తిరిగి ఇంటి బాట పడుతున్నారు. మంచి నీటితో స్నానం చేద్దామన్నా వసతి లేక తడి బట్టలతో అలాగే ఉండిపోతున్నారు. ఒంగోలు నగరం చుట్టు పక్కల గ్రామాల నుంచి కొత్తపట్నం బీచ్కు నిత్యం వేలాది మంది వస్తుంటారు. సెలవు దినాల్లో అయితే తాకిడి ఎక్కువగా ఉంటుంది. కార్తీక పౌర్ణమిలో నెలరోజులు, రంజాన్, బక్రీద్ వివిధ రకాల పండగలకు కూడా తీరం జనసంద్రంగా మారుతుంది. కొంత మంది బీచ్కు వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో సేదతీరుతుంటారు. అధికారులు కూడా కుటుంబ సభ్యులతో వస్తుంటారు. కానీ బీచ్లో ఎలాంటి సౌకర్యాలు కనిపించవు. బహిర్భూమికి వెళ్లాలంటే మరుగుదొడ్లు ఉపయోగంలో లేవు. ఉన్నా వాటికి తాళాలు వేసి ఉంచుతున్నారు. అత్యవసర సమయాల్లో మహిళలు ఆరుబయట మలవిసర్జన చేయాల్సిన దారుణ సందర్భాలు అనేకం. ఇక మహిళలు దుస్తులు మార్చుకోవడానికి, స్నానం చేయడానికి కూడా ఇబ్బందులే. చీరలు అడ్డం పడ్డుకుని స్నానం చేస్తున్న దుస్థితి కొత్తపట్నం బీచ్లో కొనసాగుతోంది. ఈ సమస్యను అనేక సార్లు అధికారులు దృష్టికి తీసికెళ్లినా పట్టించుకోవడంలేదని భక్తులంటున్నారు. 21 రోజులు.. వినాయ చవితి అనంతరం వేలాది విగ్రహాలు నిమజ్జనానికి కొత్తపట్నం బీచ్కు తరలివస్తుంటాయి. పండగ రోజు నుంచి 21 రోజులు పాటు నిమజ్జన ఘట్టం కొనసాగుతుంది. ఒక్కో వినాయకుడి వెంబడి ట్రాక్టుర్లు, లారీలు, ఆటోల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అలాగే సూరారెడ్డిపాలెం వైపు నుంచి ఈతముక్కల బీచ్కు వస్తారు. ఈ బీచ్ దగ్గర కూడా కనీసం వసతులు కల్పించలేదని భక్తులు వాపోతున్నారు. కొత్తపట్నం, ఈతముక్కల బీచ్లకు ఈ ఏడాది సుమారు 1200 గణేష్ విగ్రహాలు రానున్నట్లు అంచినవేస్తున్నారు. వాటి వెంట 1.50 లక్షల మంది భక్తులు సముద్రస్నానానికి రానున్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. బీచ్ కాదు చెత్త కుప్పలవాడ తీరం వెంబడి పారిశుద్ధ్యం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. బీచ్ రోడ్డు పొడవునా వలలు, పడవలు తీయకుండా అడ్డంగా ఉంచుతున్నారు. పది రోజుల నుంచి చాపలు పడటం వల్ల తీరం అంతా దుర్వాసన వస్తోంది. బ్లీచింగ్, సున్నం చల్లితే భక్తులకు ఇబ్బందులు ఉండవు. అలాగే పిచ్చి చెట్లు, కాగితాలు పేరుకుపోయాయి. పడవలు, వలలు తొలగించకపోతే విగ్రహాలను సముద్రంలోనికి తీసికెళ్లడానికి వీలుండదని భక్తులు చెబుతున్నారు. అవి తొలగిస్తే ట్రాఫిక్కు అంతరాయం కలగుకుండా భక్తులు త్వరగా వెళ్లడానికి వీలుంటుందని భక్తులు చెబుతున్నారు. -
పలు రూట్లలో ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి రైల్వేస్టేషన్లో సిగ్నలింగ్ పనుల వల్ల ఈ నెల 15, 16 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేయనున్నారు. ఈ మేరకు 15వ తేదీన లింగంపల్లి –నాంపల్లి రైల్వేస్టేషన్ల మధ్య 10 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయనున్నారు. అలాగే 16వ తేదీన లింగంపల్లి– ఫలక్నుమా, నాంపల్లి–లింగంపల్లి మధ్య 3 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు కానున్నాయి. ⇔ పూర్ణ–హైదరాబాద్ ప్యాసింజర్ 15వ తేదీన పూర్ణ నుంచి లింగంపల్లి వరకే నడుస్తుంది.తిరుగు ప్రయాణంలోనూ లింగంపల్లి నుంచే బయలుదేరుంది. ⇔ హైదరాబాద్–కొచువెలి స్పెషల్ ట్రైన్ నాంపల్లి స్టేషన్ నుంచి కాకుండా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి 15వ తేదీ రాత్రి 9.40 కి బయలుదేరుతుంది. తాండూరు–హైదరాబాద్ ప్యాసింజర్ను లింగంపల్లి వరకే నడుపుతారు. హైదరాబాద్–పర్భని ప్యాసింజర్ సికింద్రాబాద్ నుంచి రాత్రి 11.10 కి బయలుదేరుతుంది. హుస్సేన్సాగర్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు : నగరంలో గురువారం నుంచి గణేష్ ఉత్సవాల సందడి మొదలైంది. విగ్రహాల నిమజ్జనం మూడో రోజు నుంచి ప్రారంభమవుతుంది. శనివారం నుంచి 22 వరకు హుస్సేన్సాగర్ చుట్టూ నిమజ్జనం కోలాహలం నెలకొననున్న నేపథ్యంలో సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ అంజనీ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంక్షలు, మళ్లింపులు ఇలా... హోటల్ మారియట్ ‘టి’ జంక్షన్ వద్ద: కర్బాలామైదాన్ నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్ను అప్పర్ ట్యాంక్బండ్ వైపు అనుమతించరు. వీటిని కవాడిగూడ చౌరస్తా మీదుగా పంపిస్తారు. లిబర్టీ వైపు వెళ్లే వాహనచోదకులు కవాడీగూడ చౌరస్తా, గాంధీనగర్ టి జంక్షన్, డీబీఆర్ మిల్స్, ఇందిరాపార్క్, దోమలగూడ మీదుగా వెళ్లాలి. ఖైరతాబాద్, పంజగుట్ట వైపు వెళ్లే వాహనచోదకులు రాణిగంజ్, నల్లగుట్ట, సంజీవయ్య పార్క్, నెక్లెస్రోడ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలి. నెక్లెస్ రోటరీ వద్ద:ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్ను ఎన్టీఆర్ మార్గ్ వైపు అనుమతించరు. వీటిని నెక్లెస్ రోడ్ లేదా మింట్ కాంపౌండ్ మీదుగా పంపిస్తారు. తెలుగుతల్లి చౌరస్తా వద్ద:ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే ట్రాఫిక్ను ఇక్బాల్ మీనార్ వైపు పంపిస్తారు. సికింద్రాబాద్ వైపు వెళ్లే ట్రాఫిక్ తెలుగుతల్లి ఫ్లైఓవర్, కట్టమైసమ్మ టెంపుల్, డీబీఆర్ మిల్స్, చిల్డ్రన్ పార్క్, సెయిలింగ్ క్లబ్, కర్బాలామైదాన్ మీదుగా వెళ్లాలి. డీబీఆర్ మిల్స్ వద్ద:గోశాల వైపు నుంచి అప్పర్ ట్యాంక్బండ్ వైపు వెళ్లే వాహనాలను డీబీఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్బండ్ మీదుగా పంపిస్తారు. -
నిమజ్జనానికి ఏర్పాట్లు!
సాక్షి,సిటీబ్యూరో: గణపతి నవరాత్రి ఉత్సవాలు గ్రేటర్లో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మహానగరం పరిధిలో ఈసారి వీధులు, ముఖ్య కూడళ్లలో సుమారు 35 వేల గణనాథులను(పెద్ద పరిమాణం) ప్రతిష్ఠించినట్టు జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాలు అంచనా వేస్తున్నాయి. ఇక కాలుష్య నియంత్రణ మండలి, హెచ్ఎండీఏ, ఇతర స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన స్ఫూర్తితో ఇళ్లలో మరో 5 లక్షల మట్టి గణపతులను(చిన్నవి) ప్రతిష్ఠించి పూజలు చేసినట్టు లెక్కవేస్తున్నారు. అయితే గ్రేటర్ సిటీజన్లు ఈసారి పర్యావరణ హితంగానే గణేష్ చతుర్థిని జరుపుకోవడం విశేషం. శాస్త్రోక్తంగా పూజలందుకొన్న గణనాథులను మూడు, ఐదు, ఏడు, తొమ్మిది రోజుల్లో నిమజ్జనం చేస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని హుస్సేన్సాగర్ సహా గ్రేటర్ పరిధిలోని 50 చెరువుల వద్ద బల్దియా ఏర్పాట్లు చేసింది. నిమజ్జన పనులకోసం రూ.10 కోట్లు కేటాయించింది. నిమజ్జనం జరిగే ప్రాంతాలు, ప్రధాన రహదారుల్లో అవసరమైన పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు. నిమజ్జనాలు జరిగే చెరువుల మార్గాల్లో, చెరువుల వద్ద సదుపాయాల కల్పనతో పాడు ఆయా మార్గాల్లో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టినట్టు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. శోభాయాత్రకు సైతం.. నగరంలో జరిగే గణేశ్ శోభాయాత్రలో సైతం మార్గం పొడవునా ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాత్రకు మూడు రోజుల మందే పూర్తిస్థాయిలో పనులు చేపడతామని ఇంజినీర్లు చెబుతున్నారు. తాత్కాలిక విద్యుత్ దీపాల ఏర్పాటు, గణేశ్ విగ్రహాల నిమజ్జనాల కోసం 107 మొబైల్ క్రేన్లు, 81 స్టాటిక్ క్రేన్లను నిమజ్జనం జరిగే చెరువుల వద్ద అందుబాటులో ఉంచనున్నారు. శోభాయాత్ర సందర్భంగా మెడికల్ క్యాంపులు, మొబైల్ టాయిలెట్లు తదితర సదుపాయాలు అందుబాటులో ఉంచుతామని జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ జియావుద్దీన్ తెలిపారు. పీఓపీ విగ్రహాలతో కాలుష్య ముప్పు గణపతి నవరాత్రులు ఎంత వైభవంగా జరిగినా.. నిమజ్జనంతో తలెత్తే కాలుష్యంతో పర్యావరణ వాదులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్తో చేసిన ప్రతిమలను జలాశయాల్లో నిమజ్జనం చేయడం వల్ల వాటిలో ఉండే వివిధ రకాల హానికారక రసాయనాలు జలాశయాల్లో చేరి కాలుష్య కాసారంగా మారడం తథ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చెరువుల్లో కలిసే రసాయన అవశేషాలివే.. లెడ్ సల్ఫేట్, చైనా క్లే, సిలికా, జింక్ ఆక్సైడ్, రెడ్ ఐరన్ ఆక్సైడ్, రెడ్ లెడ్, క్రోమ్ గ్రీన్, పైన్ ఆయిల్, లిన్సీడ్ ఆయిల్, లెడ్ అసిటేట్, వైట్ స్పిరిట్, టర్పైంన్, ఆల్కహాల్, ఎస్టర్, తిన్నర్, వార్నిష్. హానికారక మూలకాలు కోబాల్ట్, మాంగనీస్, డయాక్సైడ్, మ్యాంగనీస్ సల్ఫేట్, అల్యూమినియం, జింక్, బ్రాంజ్ పౌడర్స్, బేరియం సల్ఫేట్, క్యాల్షియం సల్ఫేట్, కోబాల్ట్, ఆర్సినేట్, క్రోమియం ఆక్సైడ్, రెడ్ ఆర్సినిక్, జిక్ సల్ఫైడ్, మెర్క్యురీ, మైకా. పీఓపీ విగ్రహాల నిమజ్జనంతో అనర్థాలు.. ⇔ జలాశయాల్లో సహజ ఆవరణ వ్యవస్థ దెబ్బ తింటుంది. చేపలు, పక్షులు, వృక్ష, జంతు అనుఘటకాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ⇔ పర్యావరణం దెబ్బతింటుంది. దుర్వాసనతో సమీప ప్రాంతాల్లో గాలి, నీరు కలుషితమవుతుంది. ⇔ ఆయా జలాశయాల్లో పట్టిన చేపలను నగరంలోని వివిధ మార్కెట్లలో విక్రయిస్తుంటారు. వీటిని తిన్నవారి శరీరంలోకి హానికారక మూలకాలు చేరతాయి. చేపల ద్వారా మానవ శరీరంలోకి మెర్క్యురీ మూలకం చేరితే మెదడులో సున్నితమైన కణాలు దెబ్బతింటాయి. ⇔ సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు గరళంగా మారతాయి. ⇔ నగరంలో జీవావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. జలాల్లో అరుదుగా పెరిగే వృక్షజాతులు నాశనమవుతాయి. ⇔ ఆర్సినిక్, లెడ్, మెర్క్యురీ మూలకాలు భారతీయ ప్రమాణాల సంస్థ, వైద్య పరిశోధనా సంస్థలు సూచించిన పరిమితులను మించి ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ⇔ క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాలిబ్డనం, సిలికాన్ జలాశయం ఉపరితలంపై తెట్టుగా ఏర్పడతాయి. గ్రేటర్లో జోన్ల వారీగా నిమజ్జన ఏర్పాట్ల పనులు, మంజూరైన నిధులు జోన్ పనులు నిధులు(రూ.లక్షల్లో) ఎల్బీనగర్ 22 187.40 చార్మినార్ 82 432.28 ఖైరతాబాద్ 22 135.51 శేరిలింగంపలి16 83.96 కూకట్పల్లి 15 74.86 సికింద్రాబాద్13 84.61 మొత్తం 170 998.62 -
రూ. 16.86 కోట్లతో నిమజ్జన ఏర్పాట్లు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకమైన గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనం సాఫీగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రూ. 16.86 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సెప్టెంబర్ 23న జరిగే నిమజ్జనానికి 35 ప్రాంతాల్లో 117 క్రేన్లను ఏర్పాటు చేస్తున్నామని, మరో 96 మొబైల్ క్రేన్లను అందుబాటులో ఉంచుతామన్నారు. గణేష్ నిమజ్జన శోభయాత్ర జరిగే మార్గాల్లో రోడ్డు రీకార్పెటింగ్, మరమ్మతులు, గుంతల పూడ్చివేత పనులను సెప్టెంబర్ 10లోగా పూర్తి చేసేందుకు రూ. 10.52 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆయా మార్గాల్లో 34,926 తాత్కాలిక లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని, పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేకంగా గణేష్ యాక్షన్ టీమ్లను సిద్ధం చేస్తున్నామన్నారు. ఆర్అండ్బి ఆధ్వర్యంలో 12 కిలోమీటర్ల మేర, ప్రధానంగా హుస్సేన్సాగర్ చుట్టూ రెండంచెల బారికేడింగ్, నిరంతర విద్యుత్ సరఫరా కోసం జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హుస్సేన్సాగర్ వద్ద ఎస్పీడీసీఎల్ ద్వారా 48 ట్రాన్స్ఫార్మర్లు, సరూర్నగర్ చెరువు వద్ద ఐదు ట్రాన్స్ఫార్మర్లతో సహా అన్ని ప్రాంతాల్లో వెరసి 101 ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు.వీటితో పాటు మంచినీటి సరఫరా, మొబైల్ టాయిలెట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీతో పాటు వివిధ శాఖలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయని, ఉత్సవాలు సాఫీగా జరిగేందుకు ప్రభుత్వ పాలనా యంత్రాంగానికి సహకరించాలని గణేష్ ఉత్సవ సమితి సభ్యులను కోరారు. విస్తృత బందోబస్తు: సీపీ గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. గణేష్ ఉత్సవాల సమయంలోనే మొహర్రం పండుగ కూడా ఉన్నందున వేడుకలు సాఫీగా జరిగేందుకు సహకరించాలని కోరారు. శోభాయాత్ర మార్గంలో మెట్రో రైలు స్టేషన్లు, ఎస్సార్డీపీ పనులు జరుగుతున్నందున విగ్రహాల ఎత్తు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విగ్రహాల ఏర్పాటు సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్లకు అందజేయాలని, ప్రతి విగ్రహం వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ అనిల్కుమార్, ట్రాఫిక్ డీసీపీలు చౌహాన్, బాబురావు, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లు శృతిఓజా, ముషారఫ్ అలీ, జోనల్ కమిషనర్లు రఘుప్రసాద్, రవికిరణ్, శంకరయ్య, శ్రీనివాస్రెడ్డి, చీఫ్ ఇంజినీర్లు సురేష్, జియాఉద్దీన్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పూర్తి సహకారం: గణేష్ ఉత్సవ కమిటీ గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం ఇబ్బందులు లేకుండా జరిగేందుకు సహకరిస్తామని గణేష్ ఉత్సవ సమితి పేర్కొంది. ఉత్సవ సమితి అధ్యక్ష , కార్యదర్శులు వెంకట్రెడ్డి, భగవంతరావులతో పాటు మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్రెడ్డి, పలు నియోజకవర్గాలకు చెందిన ఉత్సవ కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. నిమజ్జన సందర్భంగా క్రేన్ల వద్ద అదనపు సిబ్బందిని నియమించడంతో పాటు నగరంలో నిమజ్జనం జరిగే వివిధ ప్రాంతాల్లోనూ విస్తృత ఏర్పాట్లు చేయాలని, తగినన్ని మొబైల్ టాయ్లెట్లు, దారిపొడవునా విద్యుత్దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ధూల్పేట వద్ద ఎంట్రీ,ఎగ్జిట్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. శోభాయాత్ర మా ర్గంలోని ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్ల లోని టాయ్లెట్లను వినియోగించుకునేందుకు చ ర్యలు తీసుకోవాలని కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. -
గ్రేటర్పై ‘నిమజ్జన’ భారం
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో అత్యంత ఉత్సాహంగా జరిగే వినాయక చవితి మూడోరోజు నుంచి విగ్రహాల నిమజ్జనం ప్రారంభమవుతుంది. ఇప్పటి దాకా నిమజ్జనంలో ముఖ్య భూమిక పోషించిన ఇరిగేషన్ శాఖ నుంచి ఆ బాధ్యతలను ప్రభుత్వం జీహెచ్ఎంసీకి అప్పగించింది. సాగర్లో గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి ట్యాంక్బండ్తో పాటు దాదాపు 32 చెరువుల వద్ద క్రేన్లు, తదితర సదుపాయాలను ఆ విభాగమే కల్పించేది. అయితే, ఈ ఏడాది జరిగే నిమజ్జన ఏర్పాట్లను మాత్రం జీహెచ్ఎంసీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటికే వివిధ కార్యక్రమాలతో సతమతమవుతున్న జీహెచ్ఎంసీపై మరో భారం పడినట్టయింది. దీన్ని సక్రమంగా నిర్వహించడం అంత తేలిక కాదు. గతేడాది సైతం నిమజ్జన బాధ్యతలు జీహెచ్ఎంసీ చేపట్టాల్సిందిగా ప్రభుత్వం సూచించినప్పటికీ, జీహెచ్ఎంసీకున్న ఇతర బాధ్యతల వల్ల సాధ్యం కాదని భావించిన మున్సిపల్ పరిపాలన శాఖ ఆ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించడంతో అప్పట్లో జీహెచ్ఎంసీకి అప్పగించలేదు. ఈ సంవత్సరం జీహెచ్ఎంసీకే ప్రభుత్వం ఆపనులను అప్పగించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు సమాచారం అందింది. జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్ లేక్స్ అండ్ వాటర్బాడీస్ మేనేజ్మెంట్ విభాగం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. హుస్సేన్సాగర్తో పాటు వివిధ ప్రాంతాల్లోని చెరువుల వద్ద నిమజ్జనానికి అవసరమైన క్రేన్లు, కార్మికులతో సహా అన్ని ఏర్పాట్లను జీహెచ్ఎంసీయే చూసుకోవాల్సి ఉంది. వివిధ విభాగాలను సమన్వయం చేసుకోవడం, పనులను పర్యవేక్షించడం ఈజీ కాదు. సమన్వయం కుదరని పక్షంలో తీవ్ర సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. వివిధ శాఖల సమన్వయం.. నిమజ్జనం ఏర్పాట్లలో ఎన్నో ప్రభుత్వ విభాగాలు పనిచేస్తాయి. ఆయా ప్రాంతాల్లో బారికేడ్లను ఆర్అండ్బీ ఏర్పాటు చేస్తుంది. ప్రాథమిక చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, తదితరమైనవి వైద్య,ఆరోగ్యశాఖ చూస్తుంది. బోట్లు పర్యాటకశాఖ సమకూరుస్తుంది. గజ ఈతగాళ్లను మత్స్యశాఖ అందుబాటులో ఉంచుతుంది. వాహనాలను రవాణాశాఖ సమకూరుస్తుంది. జలమండలి తాగునీటి సదుపాయం కల్పిస్తుంది. విద్యుత్ అంతరాయం లేకుండా ట్రాన్స్కో చూస్తుంది. శాంతి భద్రతల కోసం పోలీసు బందోబస్తు తప్పనిసరి. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ విభాగం చూస్తుంది. ఈ విభాగాలన్నింటితో సమన్వయం తప్పనిసరి. ఎక్కడ ఎలాంటి తేడా వచ్చినా తీవ్ర సమస్యలు ఎదురవుతాయి. ఆ పరిస్థితి రాకుండా జీహెచ్ఎంసీ కీలకపాత్ర పోషించాల్సి ఉంది. 220 క్రేన్లకు రూ.2.65 కోట్లు ఖర్చు హుస్సేన్సాగర్తో పాటు గ్రేటర్ పరిధిలోని పలు చెరువులు, కుంటల వద్ద నిమజ్జన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇందుకు దాదాపు 220 క్రేన్లు అద్దెకు తీసుకోవాలని ప్రతిపాదించారు. వీటికి దాదాపు రూ.2.65 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. వినాయక నిమజ్జనం అనంతరం విజయదశమి సందర్భంగా జరిగే దుర్గామాత విగ్రహాల నిమజ్జనం బాధ్యతలు కూడా ప్రభుత్వం జీహెచ్ఎంసీకే అప్పగించింది. -
గంగమ్మ ఒడికి మహా గణపతి
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అశేష జనవాహిని మధ్య మధ్యాహ్నం దాదాపు రెండు గంటల ప్రాంతంలో పూర్తయింది. మరోవైపు భక్త జనుల జయజయ ధ్వానాలు.. బ్యాండు మేళాలు.. యువత కోలాహలం మధ్య ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరారు. మంగళవారం మధ్యాహ్నానికే అనంత చతుర్దశి ముగుస్తుందని చెప్పిన అధికారులు గతేడాది తరహాలోనే నిమజ్జనం కార్యక్రమాన్ని సాధ్యమైనంత ముందుగానే ముగించారు. నేటి ఉదయం 5 గంటలకు ప్రారంభమైన ఖైరతాబాద్ చండీకుమార అనంత మహాగణపతి శోభాయాత్ర 12 గంటలకల్లా పూర్తవుతుందని భావించినా అశేష జనవాహిని ట్యాంకు బండ్ కు తరలిరావడంతో కాస్త ఆలస్యమైంది. ఖైరతాబాద్ లోని సెన్సేషన్ థియేటర్, రాజ్ దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఎక్బాల్ మినార్ చౌరస్తా, సచివాలయం పాత గేటు, తెలుగుతల్లి చౌరస్తా, లుంబినీ పార్క్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 4 వద్దకు మొత్తంగా 3 కిలోమీటర్ల మేరకు చండీకుమార అనంత మహాగణపతి శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది. ఉదయం తక్కువ మంది భక్తులు రావడంతో ఉత్సాహంగా ప్రారంభమైన శోభాయాత్ర, క్రమక్రమంగా భక్తులు ట్యాంక్బండ్కు తరలిరావడంతో నెమ్మదించింది. అయినా ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా అధికారులు మహాగణనాథుని గంగమ్మ ఒడికి చేర్చారు. జిల్లాల నుంచి తరలివస్తున్న గణనాథుల నిమజ్జనం ఇంకా కొనసాగుతోంది. -
గంగమ్మ ఒడికి మహా గణపతి
-
వెళ్లిరావయ్యా.. గణపయ్యా..
- కనులపండువగా వినాయక నిమజ్జనం - అర్ధరాత్రి 2 వరకు వరకు సాగిన కార్యక్రమం హిందూపురం అర్బన్: వినాయక చవితి సందర్భంగా హిందూపురం పట్టణంలో కొలువుదీర్చిన వినాయకుల విగ్రహాల నిమజ్జనోత్సవం గురువారం కనులపండువగా సాగింది. మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన విగ్రహాల ఊరేగింపు అర్ధరాత్రి వరకు కొనసాగింది. స్థానిక ఐదులాంతర్ గాంధీసర్కిల్ నుంచి చిన్నమార్కెట్, అంబేడ్కర్ సర్కిల్, గురునాథ్ సర్కిల్ అనంతరం సద్భావన సర్కిల్, వీడీరోడ్డు మీదుగా శ్రీనివాసనగర్, మున్సిపల్ ఆఫీసు పక్క నుంచి గుడ్డం కోనేరు వరకు సాగింది. విగ్రహాలను ట్రాక్టర్లపై రంగురంగుల తోరణాలు, విద్యుత్ దీపాలంకరణ చేసి మేళాతాళాలతో సాగనంపారు. అంబేడ్కర్ సర్కిల్ వద్ద ప్రముఖులు తరలివచ్చి ఊరేగింపులో పాల్గొన్నారు. అలాగే వివిధ రకాల వేషధారణతో యువకులు ఆకట్టుకున్నారు. గుడ్డం వద్ద భారీ బందోబస్తు గుడ్డం రంగనాథస్వామి ఆలయం కోనేరు వద్ద భారీ బందోబస్తుతో వినాయకుల నిమజ్జనోత్సవం జరిగింది. డీఎస్పీ కరీముల్లా షరీఫ్, ఆర్డీఓ రామ్మూర్తి ఇతర శాఖాధికారులు నిమజ్జన కార్యక్రమం పర్యవేక్షించారు. ప్రత్యేక క్రేన్ ఏర్పాటు చేసి విగ్రహాలను అందులో ఉంచి నేరుగా కోనేరు మధ్యలో తీసుకెళ్లి నిమజ్జనం చేయించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టిచర్యలు తీసుకున్నారు. కాగా నిమజ్జనోత్సవం అర్ధరాత్రి 2 గంటల వరకు సాగింది. కోనేరు వద్ద భారీగా జనం తరలివచ్చి నిమజ్జన ఉత్సవాన్ని తిలకించారు. -
మత సామరస్యాన్ని చాటుదాం
– 2న గణేష్ నిమజ్జనం, బక్రీదు వేడుకలు – హిందూ–ముస్లింలు శాంతియుతంగా మెలగాలి – ఐక్యతా స్ఫూర్తితో జిల్లా కీర్తిని ఇనుమడింపజేయాలి – శాంతి ర్యాలీలో జిల్లా కలెక్టర్, ఎస్పీ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): సెస్టెంబర్ 2న వినాయక నిమజ్జనం, బక్రీదు వేడుకలను శాంతియుతంగా నిర్వహించి మత సామరస్యాన్ని చాటాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ గోపీనాథ్జట్టి సూచించారు. íహిందూ–ముస్లింలు ఐక్యతా స్ఫూర్తితో కర్నూలు జిల్లా కీర్తిని ఇనుమడింపజేయాలన్నారు. బుధవారం జమ్మిచెట్టు నుంచి తెలుగు తల్లి విగ్రహం వరకు హిందూ–ముస్లింలు భాయి భాయి నినాదాలతో శాంతి ర్యాలీ నిర్వహించారు. జమ్మిచెట్టు వద్ద అన్ని వర్గాల ప్రజలతో సమావేశమై న జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ గోపీనాథ్జెట్టీ శాంతి హితోపదేశం చేసి శాంతి కపోతాలు, బెలూన్లను ఎగుర వేశారు. అనంతరం ర్యాలీ చిత్తారి వీధి జంక్షన్, కర్నూలు వన్ టౌన్ పోలీసు స్టేషన్ మీదుగా పూలబజార్, గడియారం ఆసుపత్రి, పెద్దమార్కెట్, అంబేడ్కర్ సర్కిల్, కొండారెడ్డి బురుజు, తెలుగు తల్లి విగ్రహం వరకు సాగింది. ర్యాలీలో పాల్గొన్న హిందూ–ముస్లింలు సోదరులుగా మెలుగుతామని ప్లకార్డులు ప్రదర్శించారు. శాంతి ర్యాలీలో అడిషనల్ ఎస్పీలు షేక్ షాక్షావలి, ఐ.వెంకటేష్, డీఎస్పీ రమణామూర్తి, సీఐలు ములకన్న, నాగరాజుయాదవ్, డేగల ప్రభాకర్, కృష్ణయ్య, బి.శ్రీనివాసరావు, మహేశ్వరరెడ్డి, ఆర్ఐలు రంగముని, రామకృష్ణ, ముస్లిం మత పెద్దలు, గణేష్ కేంద్ర మహోత్సవ కమిటీసభ్యులు పాల్గొన్నారు. నిమజ్జనానికి సుంకేసుల నీరు వస్తుంది సెప్టెంబర్ 2న కర్నూలులో నిర్వహించే గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్.సత్యనారాయణ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. 2వ తేదీ ఉదయంలోపు కర్నూలుకు చేరే విధంగా సుంకేసుల జలాశయం నుంచి నీటిని విడుదల చేయాలని నీటిపారుదల శాఖ ఎస్ఈని ఆదేశించారు. నీటి కొరత ఉన్నందున కేసీలో నీరు ముందుకు వెళ్లకుండా ఇసుక బస్తాలు, అడ్డుగోడలు ఏర్పాట్లు చేయాలన్నారు. నిమజ్జనం సందర్భంగా ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు, లైటింగ్ సదుపాయం, నగరంలో పారిశుద్ధ్య పనులు, తాగు నీరు, వైద్య శిబిరాలు, విగ్రహాల నిమజ్జనానికి క్రేన్లు ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ఎస్ఈ చంద్రశేఖర్రావు, నగరపాలక సంస్థ కమిషనర్ హరినాథరెడ్డి, డీఎస్పీ రమణమూర్తి, ఆర్అండ్బీ ఈఈ జయరామిరెడ్డి, గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ప్రతినిధులు కిష్టన్న, బాలసుబ్రమణ్యం, సందడి సుధాకర్, కాళంగి నరసింహవర్మ తదితరులు పాల్గొన్నారు. -
గణపతి బప్ప మోరియా
-
విస్తారంగా వర్షాలు
- కోసిగిలో అత్యధికంగా 88.6 మి.మీ. వర్షపాతం - జిల్లా సగటున 38.8 మి.మీ. నమోదు - ఉల్లికి అపార నష్టం - గణేష్ నిమజ్జనానికి తొలగిన నీటి అడ్డంకులు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఊపందుకున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి వరకు విస్తారంగా కురిశాయి. అత్యధికంగా కోసిగిలో 88.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. అతి తక్కువగా కొలిమిగుండ్ల, చిప్పగిరి మండలాల్లో సెం.మీ. ప్రకారం నమోదు కాగా శ్రీశైలం మండలంలో అసలు నమోదు కాలేదు. ఒక్క రోజులోనే జిల్లా వ్యాప్తంగా 38.8 మి.మీ. నమోదు కావడం విశేషం. ఇటీవలి వరకు ఒక మోస్తరు వర్షాలకే పరిమితమైన రుతుపవనాలు బంగాళాఖాతంలో అల్పపీడనం తోడుకావడంతో జోరందుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ఫలితంగా గణేష్ నిమజ్జనానికి నీటి సమస్య తీరినట్లయింది. ఉల్లి రైతు గగ్గోలు... కర్నూలు, ఆదోని రెవెన్యూ డివిజన్లో కోత దశలో ఉన్న ఉల్లికి ప్రస్తుత వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వందల హెక్టార్లలో పంట నీట మునిగింది. వర్షాలు వల్ల ఉల్లి తడుస్తుండటం వల్ల నాణ్యత తగ్గి ధరలు తగ్గిపోతుండటంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. కొసిగి, గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు తదితర మండలాల్లో భారీ వర్షాలకు పత్తి పంట నీట మునిగింది. ఆగస్టు సాధారణ వర్షపాతం 135 మి.మీ. ఉండగా ఇప్పటి వరకు 163.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
వినాయక నిమజ్జనంలో అపశృతి
పాలకొల్లు టౌన్: వినాయక నిమజ్జన ఊరేగింపులో బాలిక మృతిచెందిన ఘటన పాలకొల్లులో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పాలకొల్లు బ్రాడీపేట మూడో వీధికి చెందిన నాల్గో తరగతి చదువుతున్న బుర్రే లిఖిత (9) ప్రమాదవశాత్తు మృతి చెందింది. బుర్రే ప్రసాద్, కల్యాణి దంపతులుకు ఇద్దరు కుమార్తెలు. వీరి పెద్ద కుమార్తె కల్యాణి అదే వీధిలో జరుగుతున్న వినాయక ఊరేగింపులో శనివారం పాల్గొంది. ఊరేగింపు స్థానిక కోడిగట్టు వద్దకు వచ్చేసరికి ఊరేగింపులో ఉన్న లిఖిత జనరేటర్ ఉన్న ప్లాట్ రిక్షాపై కూర్చుంది. ప్రమాదవశాత్తు లిఖిత వేసుకున్న చున్నీని జనరేటర్ లాగేయడంతో బాలికలు తల వెంట్రుకలు జనరేటర్కు చుట్టుకుపోయి బలమైన గాయమైంది. స్థానికులు వెంటనే లిఖితను దగ్గరలోని ప్రై వేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పట్టణ సీఐ కోలా రజనీకుమార్ ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి లిఖిత మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వద్దన్నా వినకుండా వెళ్లింది.. ప్రై వేట్ ఆస్పత్రిలో లిఖిత మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు ప్రసాద్, కల్యాణిల రోదనలు మిన్నంటాయి. ఊరేగింపునకు వెళ్లవద్దని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా వెళ్లిందని, ఇప్పుడు కానరాని లోకాలకు వెళ్లిపోయిందంటూ తల్లి కల్యాణ గుండెలవిసేలా రోదించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తెను భగవంతుడు దయలేకుండా తీసుకుపోయాడంటూ ప్రసాద్ విలపించారు. ప్రసాద్ ఎలక్ట్రిషీయన్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. -
రేపటి వరకూ నిమజ్జనాలు..
హైదరాబాద్: లక్షలాది మంది ఉత్సాహంగా పాల్గొంటున్న గణనాథుడి నిమజ్జనోత్సవం రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. జంట నగరాల్లో ప్రధానమైన గణేష్ విగ్రహాలు మొత్తం 11,074 ఏర్పాటు చేయగా, ఈ రాత్రి 5 వేల వరకు విగ్రహాలు నిమజ్జనం కావచ్చని, రేపు కూడా విగ్రహాల నిమజ్జనం జరుగుతూనే ఉంటుందని తెలిపారు. గురువారం ఉదయం నుంచి భారీగా వర్షం పడుతున్నప్పటికీ అనేక మండపాల నుంచి గణేష్ విగ్రహాల నిమజ్జనోత్సవం ప్రారంభం అయిందని అన్నారు. డీజీపీ, తన కార్యాలయంలోని సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ నుంచి నగరంలో గణేష్ నిమజ్జనం జరుగుతున్న ప్రాంతాలను ఉన్నతాధికారులతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, శాంతి భద్రతల అదనపు డీజీపీ అంజనీ కుమార్లతో కలిసి విగ్రహాల ఊరేగింపు ప్రాంతాలను హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ట్యాంక్బండ్ తో పాటుగా దగ్గరలోని చెరువుల్లోనూ ప్రజలు అనందోత్సహాల మధ్య గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారని అన్నారు. ఖైరతాబాద్ గణేశుడుని మధ్యాహ్నం రెండున్నర గంటలకు ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేశారని, సాయంత్రం 6 గంటల వరకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 1248 గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేశారని, ఈ రోజు రాత్రి మొత్తం కూడా గణేష్ విగ్రహాలు నిమజ్జనం కోసం తరలి వస్తూనే ఉంటాయని చెప్పారు. రేపు మధ్యాహ్నం వరకు దాదాపుగా అన్ని విగ్రహాల నిమజ్జనం పూర్తికావచ్చని డీజీపీ అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకూ ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగలేదని, పోలీసులు ప్రజలతో మంచి సంయవనం పాటిస్తూ గణేష్ విగ్రహాల ఊరేగింపు శాంతి భద్రతల మధ్య జరుగుతున్నదని అనురాగ్ శర్మ తెలిపారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సుమారు 12 వేల సీసీ, వీడియో కెమెరాలతో సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ నుంచి ఊరేగింపు జరుగుతున్న అన్ని ప్రాంతాలను పోలీస్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. నిమజ్జనోత్సవంలో అసాంఘీక శక్తులు కనబడితే చర్యలు తీసుకోవడంపై వెంటనే సమీపంలోని పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేస్తామన్నారు. సీనియర్ పోలీస్ అధికారులతో పాటుగా 25 వేల మంది పోలీస్ సిబ్బంది శాంతి భద్రతల విధుల్లో పాల్గొంటున్నారని వీరితో పాటుగా వివిధ విభాగాలకు చెందిన 13 కేంద్ర పోలీసు బలగాలు కూడా నిమజ్జనోత్సం సందర్భంగా శాంతి భద్రతల విధుల్లో పనిచేస్తున్నారని డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు. -
గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి
విద్యుత్ షాక్తో విద్యార్థి మృతి పెద్దపల్లిరూరల్ : పెద్దపల్లి మండలం చందపల్లి గ్రామంలో గణేష్ నిమజ్జనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. గ్రామంలో ప్రతిష్టించిన గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు అలంకరించిన వాహనానికి విద్యుత్ లైట్లు అమర్చారు. విద్యుత్ తీగలను సరిచేస్తుండగా వాహనంపైనే ఉన్న గాండ్ల అఖిల్(15) అనే విద్యార్థిపై పడింది. షాక్కు గురైన బాలుడిని స్థానికులు పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే అఖిల్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న బంధువులు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యహరించారంటూ ఆందోళనకు దిగారు. ఎస్సై శ్రీనివాస్ తన సిబ్బందితో చేరుకుని సముదాయించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అఖిల్ మరణంతో చందపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
లేపాక్షి : వినాయక చవితి నిమజ్జనంలో అపశ్రుతి నెలకొంది. మండల కేంద్రానికి చెందిన చాకలి క్రిష్టప్ప(40) అనే వ్యక్తి వినాయక విగ్రహాల ఊరేగింపులో ఉన్నఫళంగా మృతిచెందాడు. వినాయక విగ్రహాలను తిలకిస్తూనే కింద పడిపోయాడు. వెంటనే లేపాక్షి ప్రభుత్వ ఆస్పత్రికి తీసికెళ్లగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కాగా మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ విషయంపై ఎస్ఐ శ్రీధర్ను వివరణ కోరగా వినాయక విగ్రహాలను తిలకించిన తర్వాత ఇంటికి వెళ్లి చనిపోయాన్నారు. -
నిమజ్జనంలో విషాదం
మండవల్లి: మండవల్లి స్టేషన్రోడ్లో శనివారం వినాయక చవితి నిమజ్జనోత్సవంలో ప్రమాదంలో ఒకరు మరణించారు. ఊరేగింపు స్థానిక సెంటర్ వరకు రాగానే రైల్వేట్రాక్కు ఇసుక తోలుతున్న టిప్పర్ ఊరేగింపులో ఉన్న ఇద్దరిని ఢీకొంది. కైకలూరు మండలం భుజబలపట్నంకు చెందిన గంగునేని శ్యామ్, ఎస్సీకాలనీవాసి ప్రత్తిపాడు రాజుకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్సకు ముదినేపల్లి తీసుకువెళుతుండగా శ్యామ్ మరణించాడు. మృతుని బంధువుల ధర్నా టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు. మృతుని బంధువులు సెంటర్లో ధర్నాకు దిగడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఎస్ఐ ఎ.మణికుమార్, కైకలూరు సీఐ రవికుమార్ వచ్చి న్యాయం చేస్తామని సర్దిచెప్పారు. -
నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు
అనంతపురం సెంట్రల్ : గణేశ నిమజ్జనం సందర్భంగా నగరంలో పోలీసులు పటిష్టబందోబస్తు ఏర్పాటు చేశారు. ఐదు రోజుల పాటు పూజలందుకున్న వందలాది గణనాథులను అత్యంత భక్తి్రÔ¶ ద్ధలతో నిమజ్జనానికి తరలించే సమయంలో అపశ్రుతులకు తావులేకుండా చర్యలు చేపట్టారు. నేరుగా పోలీస్శాఖ అదనపు ఎస్పీ మాల్యాద్రి ఉదయం నుంచి నగరంలో జరుగుతున్న ఏర్పాట్లు, సాయంత్రం నిమజ్జనానికి తరలుతున్న వినాయకుల తీరును పోలీసు కార్యాలయంలోని ఈ – సర్వలెన్స్ కేంద్రం నుంచి సీసీ కెమెరాల పుటేజీల ద్వారా పరిశీలించారు. ఎప్పటకప్పుడు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలకు సూచనలు చేశారు. జిల్లా కేంద్రంతో పాటు పరిసర మండలాల నుంచి పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. నిమజ్జనానికి వెళ్లే వినాయకుల రథాలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ డీఎస్పీ నరసింగప్ప చర్యలు చేపట్టారు. బయటి వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా ఎక్కడికక్కడ ఆంక్షలు వి«ధిస్తూ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపించేశారు. -
మరికాసేపట్లో ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర
-
భక్తులతో సందడిగా మారిన ఎన్టీఆర్ మార్గ్
-
వినాయక నిమజ్జనంలో అపశృతి
ఖమ్మం: పట్టణంలోని మున్నూరు బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనంలో పాల్గొన్న ఇద్దరు భక్తులు గల్లంతయ్యారు. వారిని రాజస్థాన్ కు చెందిన గోపాల్, విక్రమ్ లుగా గుర్తించారు. ఇదిలా ఉండగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం చింతపర్రు గ్రామంలో వినాయక నిమజ్జనంలో భాగంగా కిరోసిన్ నోట్లో పోసుకుని నిప్పులు వెదజల్లే విన్యాసం చేస్తుండగా ఎదురుగా ఉన్న నలుగురు చిన్నపిల్లలకు గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మేకాశేషుబాబు పరామర్శించారు. -
ఊపందుకున్న గణేశ్ నిమజ్జనం
హైదరాబాద్: జంట నగరాల్లో గణేశ్ నిమజ్జనం ఊపందుకుంది. తొలుత వినాయక నిమజ్జనం మందకొడిగా సాగినా.. మధ్యాహ్న సమయానికి ఊపందుకుంది. ఇప్పటివరకూ దాదాపు 26 వేల వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. అయితే ఇంకా భారీ స్థాయిలో విగ్రహాలు నిమజ్జనానికి వేచి ఉన్నాయి. తొమ్మిది ప్రధాన మార్గాల నుండి వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్ కు చేరుకుంటున్నాయి. కాగా, క్రేన్ ల వద్ద నిమజ్జనం ఆలస్యం కావడం పై భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ సాయంత్రానికి భారీ సంఖ్యలో విగ్రహాలు ట్యాంక్ బండ్ వచ్చి చేరుతాయని... ఈ లోపు ఇప్పటికే వచ్చిన విగ్రహాల నిమజ్జనం పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, ఖైరతాబాద్ త్రిశక్తిమయ మోక్ష గణపతి నిమజ్జనం సోమవారం ఉదయానికి పూర్తయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. వినాయక నిమజ్జనం కోసం 25 వేల భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఒడిశా, తమిళనాడు పోలీసులతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు కమాండింగ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా 400 సీసీ కెమెరాలతో మానిటర్ చేస్తున్నారు. గతంలో ఇబ్బందులు ఎదురైన ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించి... నిమజ్జనం దారిలోని ప్రతి కూడాలిలో సీసీ కెమెరాలు అమర్చారు. ఎలాంటి ఘటన జరగకుండా కమాండింగ్ కంట్రోల్ ద్వారా మానిటర్ చేస్తున్నారు. గణేశ్ సామూహిక నిమజ్జనాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ జంట నగరాల్లో పలుప్రాంతాల్లో సందర్శించి ఏర్పాట్లును సమీక్షించారు. -
ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
శోభాయాత్రకు సిద్ధమవుతున్న 'మహా'గణపతి
-
శోభాయాత్రకు సిద్ధమవుతున్న 'మహా'గణపతి
హైదరాబాద్: ఖైరతాబాద్ మహా వినాయకుడు శోభాయాత్రకు సిద్ధమవుతున్నాడు. త్రిశక్తిమయ మోక్షగణపతి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రాకతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. హుస్సేన్ సాగర్ వద్దకు జనాలు భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటి వరకు 25 వేల గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేశారని పోలీసులు తెలిపారు. నగరంలో వినాయక నిమజ్జన ఏర్పాట్లను జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ సమీక్షిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్కు చెందిన 25వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించామని చెప్పారు. -
కన్నుల పండుగలా గణేష్ శోభాయాత్ర
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. జంట నగరాల్లో గణేశుని సామూహిక నిమజ్జన ఉత్సవాలు కన్నుల పండుగలా జరుగుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు కదులుతున్నాయి. మహానగరం అంతా డప్పులు, డ్యాన్సులు, డీజేలతో సందడిగా మారింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి నగరంలో పటిష్ట పోలీసు బలగాలను ఉంచారు. ఎలాంటి ఇబ్బంది కలిగినా సమాచారం అందించాలని కోరారు. -
నెక్లెస్ రోడ్డులో ట్రాలీ బీభత్సం, 9 మందికి గాయాలు
హైదరాబాద్: నగరంలోని నెక్లెస్ రోడ్డులో శనివారం రాత్రి ఓ ట్రాలీ బీభత్సం సృష్టించింది. వేగంగా వెళుతున్న ట్రాలీ జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మందికి గాయాలయినట్టు తెలిసింది. గణేశ్ నిమజ్జనం చేసిన అనంతరం తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కురిసింది వానా.. మిర్యాలగూడలోనా..
మిర్యాలగూడ టౌన్ : పట్టణంలో ఆదివారం రాత్రి కురిసిన వానతో ప్రజలు అతలాకుతలం అయ్యారు. ఒక వైపు గణేష్ నిమిజ్జనంకు వెళ్తున్న గణనాధులు, మరో వైపు కురుస్తున్న భారీ వర్షానికి పట్టణంలోని రోడ్లన్ని పొంగిపోర్లాయి. దీంతొ లొతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలువగా రాజీవ్ చౌక్, నల్లగోండ రోడ్, సాగర్ రోడ్డులో వర్షపునీటితో రోడ్లన్ని పొంగిపోర్లాయి. దీంతో కొంత సేపు జనజీవనం స్తంభించింది. -
నిమజ్జనంలో ఘర్షణ: ఆరుగురికి గాయాలు
కురబలకోట: వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ చోటు చేసుకుని ఆరుగురు గాయపడ్డారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం గంగావారిపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. వినాయకుడి నిమజ్జనం సందర్భంగా ఓ వర్గానికి చెందిన వ్యక్తి మద్యం సేవించి రావడంతో అతణ్ని వేరే వర్గం వారు అడ్డుకున్నారు. ఆ వివాదం కాస్త పెద్దది కావడంతో ఇరు వైపుల వారు దాడి చేసుకున్నారు. దీంతో ఆరుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
నిమజ్జనంలో అపశ్రుతి
నేకరికల్లు(గుంటూరు): గణేష్ విగ్రహం నిమజ్జనానికి వెళ్లిన ఓ వ్యక్తి హఠాన్మరణం చెందాడు. గుంటూరు జిల్లా నేకరికల్లు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని గుండ్లపల్లిలో గురువారం వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించారు. నిమజ్జనం చేయటానికి సమీపంలోని చెరువు వద్దకు శుక్రవారం మధ్యాహ్నం గ్రామస్తులంతా వెళ్లారు. కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తుడు కె.సాంబిరెడ్డి(50) విగ్రహ నిమజ్జనం అనంతరం చెరువులో ఈతకొట్టి, ఒడ్డున కూర్చున్నాడు. కొద్దిసేపటికే అక్కడికక్కడే పడిపోయి మృతి చెందాడు. తీవ్ర గుండెపోటుతోనే మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. -
వినాయక నిమజ్జనానికి భారీ బందోబస్తు
హైదరాబాద్: వినాయక నిమజ్జనానికి భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్ కమీషనర్ మహీందర్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణ జిల్లాల నుంచి కూడా సిబ్బందిని రప్పించామన్నారు. సోమవారం నాటి వినాయక నిమజ్జన కార్యక్రమానికి 30 వేల మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తున్నామన్నారు. నిమజ్జన దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించామన్నారు. రేపటి నిమజ్జనంలో 15 లక్షల మంది ప్రజలు పాల్గొంటారని అంచనా వేస్తున్నామన్నారు.దీనికి పోలీసులకు ప్రజల సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
నిఘా నీడలో..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా పోలీసు ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అవసరమైన బలగాలను ఇప్పటికే రప్పించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి గట్టి నిఘా పెట్టనున్నారు. సీసీ కెమెరాల ద్వారా ప్రతి కదలికను కనిపెట్టనున్నారు. నిమజ్జనాన్ని తిలకించేందుకు సుమారు 15 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. శని వారం బషీర్బాగ్లోని నగర సీపీ కార్యాలయంలో నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించా రు. ఇందులో అదనపు సీపీలు జితేందర్, అంజనీకుమార్, జాయింట్ పోలీసు కమిషనర్ మల్లారెడ్డి పాల్గొన్నారు. జంట కమిషనరేట్ల సీపీలు వెల్లడించిన వివరాలు ఇలా.. ప్రధాన ఊరేగింపు.... బాలాపూర్ నుంచి ట్యాంక్బండ్ వరకు ప్రధాన ఊరేగింపు సాగుతుంది. బాలాపూర్ నుంచి కేశవగిరి వరకు సైబరాబాద్ పోలీసులు బందోబస్తు వహిస్తుండగా కేశవగిరి నుంచి నగర పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారు. అలియాబాద్, నాగుల్చింత, చార్మినార్, మదీనా, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్బాగ్, లిబర్టీ మీదుగా అప్పర్ ట్యాంక్బండ్వైపు లేక ఎన్టీఆర్ మార్గ్ వైపు నిమజ్జనం కోసం వెళ్తాయి. సికింద్రాబాద్ నుంచి... సికింద్రాబాద్ నుంచి తరలి వచ్చే గణనాథులు ఆర్పీరోడ్డు, ఎంజీ రోడ్డు, కర్బలా మైదాన్, కవాడిగూడ, ముషీరాబాద్ జంక్షన్, ఆర్టీసీ జంక్షన్, నారాయణగూడ జంక్షన్, హిమాయత్నగర్ వై జంక్షన్ మీదుగా లిబర్టీ చౌరస్తా వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి. ఉప్పల్ వైపు నుంచి... ఉప్పల్వైపు నుంచి వచ్చే గణేశ్లు రామంతాపూర్, అంబర్పేట, ఎన్సీసీ, దుర్గాభాయ్ దేశ్ముఖ్ ఆస్పత్రి మీదుగా ఆర్టీసీ చౌరస్తాలో సికింద్రాబాద్ వైపు నుంచి ఊరేగింపులో కలవాలి. ఇతర మార్గాల నుంచి వచ్చే వినాయకులు ఎంజే మార్కెట్, తెలుగుతల్లి విగ్రహం వద్ద కలుస్తాయి. ఆంక్షలు.. పైమార్గాల్లో నిమజ్జనానికి తరలివెళ్లే వాహనాలు మిన హా ప్రధాన రహదారిపై ఇతర వాహనాలను అనుమతించరు. ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించుకునేందుకు ప్రజలు రింగ్రోడ్డు, బేగంపేట ప్రాంతాలను వాడుకోవాలి. కేవలం బషీర్బాగ్ చౌరస్తా వద్ద వాహనాలు అటు ఇటు వెళ్లే అవకాశం ఉంది. యాత్ర కొనసాగే ప్రధాన రహదారికి ఆనుకుని ఉండే అంతర్గత రహదారులను బారికేడ్లతో మూసివేస్తారు. ట్రాఫిక్ మళ్లించే ప్రధాన ప్రాంతాలు... సౌత్ జోన్ పరిధిలో: కేశవగిరి, మహబూబ్నగర్ చౌరస్తా, ఇంజన్బౌలి, నాగుల్చింత, హిమ్మత్పూర్, హరిబౌలి, అస్రా హోటల్, మొగల్పురా, లక్కడ్కోటే, మదీనా చౌరస్తా, ఎంజే బ్రిడ్జి, దార్ ఉల్ షరీఫ్ చౌరస్తా, సిటీ కాలేజ్ ఈస్ట్ జోన్ పరిధి: చంచల్గూడ జైలు చౌరస్తా, మూసారాంబాగ్, చాదర్ఘాట్ బ్రిడ్జి, సాలార్జంగ్ బ్రిడ్జి, అఫ్జల్గంజ్, పుత్లీబౌలి చౌరస్తా, ట్రూప్బజార్, జాంబాగ్ చౌరస్తా, ఆంధ్రాబ్యాంక్ కోఠి. వెస్ట్ జోన్: తోప్ ఖాన్ మాస్క్, అలస్కా హోటల్ జంక్షన్, ఉస్మాన్ జంగ్, శంకర్బాగ్, సీనా హోటల్, అజంతా గేట్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ఆబ్కారీ లైన్, తాజ్ ఐస్ల్యాండ్ బర్తన్ బజార్, ఏఆర్ పెట్రోల్ పంప్. సెంట్రల్ జోన్: చప్పల్రోడ్ ఎంట్రీ, గద్వాల్ సెంట్రల్, జీపీ ఓ, షాలిమార్ థియేటర్, గన్ఫౌండ్రీ, స్కైలెన్ రోడ్ ఎం ట్రీ, భారత్ స్కౌట్ అండ్ ైగె డ్ జంక్షన్, దోమల్గూడ, ఎక్బాల్మినార్, రవీంద్రభారతి, ద్వారకా హోటల్, ఖైరతాబా ద్, చిల్ట్రన్ పార్క్, వైస్రాయ్ హోటల్, కవాడిగూడ, కట్టమై సమ్మ దేవాలయం, లోయర్ ట్యాంక్బండ్, ఇందిరాపార్క్. నార్త్ జోన్: కర్బలా మైదాన్, బుద్ధభవన్, సైలింగ్ క్లబ్, నల్లగుట్ట జంక్షన్ల నుంచి సాధారణ వాహనాలను నెక్లెస్ రోడ్, అప్పర్ ట్యాంక్బండ్ వైపు అనుమతించరు. ఈ వాహనాలు సీటీఓ, వైఎంసీఏ, ప్యారడైజ్, ప్యాట్నీ, బాటా, అడవయ్య, ఘాన్స్మండి జంక్షన్ల వద్ద మళ్లిస్తారు. ఈ ఆంక్షలు సోమవారం ఉదయం 6 నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు అమలులో ఉంటాయి. వాహనాల పార్కింగ్... ఖెరతాబాద్ జంక్షన్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ ఆనంద్నగర్ కాలనీ, రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయం బుద్ధభవన్ వెనక వైపు గో సేవాసదన్ లోయర్ ట్యాంక్బండ్ కట్టమైసమ్మ దేవాలయం ఎన్టీఆర్ స్టేడియం నిజాం కళాశాల పబ్లిక్ గార్డెన్స్ -
నెమ్మదిగా సాగుతున్న ఖైరతాబాద్ గణపతి
-
గణనాథుడికి వర్షంలోనే వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: ముంబై మహానగరం తరువాత దేశంలోనే అత్యంత వైభవంగా నిర్వహించే వినాయక నిమజ్జన వేడుకలు బుధ వారం హైదరాబాద్లో కన్నుల పండువగా జరిగాయి. కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అశేష భక్తజనులు ట్యాంక్బండ్పైకి చేరుకొని గణనాథుడికి వీడ్కోలు పలికారు. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్యాంక్బండ్పై పెద్దఎత్తున వరద నీరు చేరింది. అయినప్పటికీ భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు. తొమ్మిది రోజుల పాటు భక్తజనుల పూజలను అందుకున్న వినాయకుడు మేళతాళాలు, బాజాభజంత్రీలు, నృత్యప్రదర్శనల నడుమ హుస్సేన్సాగర్ ఒడికి చేరుకున్నాడు. విభిన్న వర్గాల ప్రజలు, విభిన్న సంస్కృతులను ప్రతిబింబించే విధంగా సాగిన శోభాయాత్ర భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటింది. ఉదయం 10.30 గంటలకు బాలాపూర్లో లడ్డూ వేలం పాట ముగిసిన అనంతరం ప్రారంభమైన శోభాయాత్ర నెమ్మదిగా సాగింది. సాయంత్రం కురిసిన వర్షానికి నిమజ్జనానికి తరలి వచ్చిన పలు విగ్రహాలు వాహనాల్లోనే కరిగిపోయాయి. కవాడీగూడలో ఏర్పాటుచేసిన 60 అడుగుల మట్టి విగ్రహాన్ని అక్కడే పైపుల ద్వారా నీటిని చిమ్ముతూ నిమజ్జనం చేశారు. భాగ్యనగరంతోపాటు, ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు, విదేశీయులు సైతం శోభాయాత్రలో పాల్గొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు మెదక్, నిజామాబాద్, మహబూబ్నగర్, నల్లగొండ తదితర జిల్లాల నుంచి కూడా విగ్రహాలు ట్యాంక్బండ్ కు తరలి వచ్చాయి. పలు చోట్ల ముస్లిం సోదరులు సైతం వేడుకల్లో పాల్గొని విగ్రహాలకు స్వాగతం పలికారు. ఖైరతాబాద్ గణపతి లడ్డూ వర్షార్పణం ఖైరతాబాద్ మహా గణపతికి ఏటా భారీ లడ్డూను నైవేద్యంగా నివేదిస్తుంటారు. ఈసారి గణపతి చేతిలో ఉంచిన 4,200 కిలోల లడ్డూ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. లడ్డూను ప్రసాదంగా స్వీకరించడానికి భక్తులు అమితాసక్తి చూపుతుంటారు. అయితే, ఈసారి ఆ భాగ్యం లేకుండాపోయింది. బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఆ లడ్డూ కరిగి.. పాకంగా మారిపోయింది. ఏకంగా నాలుగు వేల కిలోల భారీ ప్రసాదం భక్తులకు అందకుండా పోయింది. వర్షంలో తడుస్తూనే భక్తులు లడ్డూనుంచి కారుతున్న పాకాన్ని ప్రసాదంగా భావించి సేవించారు. ఇదిలా ఉండగా వర్షానికి చితికిపోయిన లడ్డూను గురువారం గోషాలలో గోవులకు వేయనున్నారు. లంబో‘ధర’ లడ్డూలు గణపతి నిమజ్జనోత్సవాల సందర్భంగా హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన వేలంలో లడ్డూలు దక్కించుకునేందుకు భక్తులు పోటీలు పడ్డారు. దీంతో అవి రికార్డు స్థాయి ధర పలికాయి. శ్రీనగర్ కాలనీ డివిజన్ ఎల్లారెడ్డిగూడలో యంగ్ బాయ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి వద్ద ఉంచిన లడ్డూ రూ.18,11,111 ధర పలికి అగ్రస్థానంలో నిలిచింది. దీనిని ఇ.పున్నారావు దక్కించుకున్నారు. ఇలావుండగా భాగ్యనగర్ గణేశ్ ఉత్సవాల్లో ఎంతో ఖ్యాతి పొందిన బాలాపూర్ లడ్డూను ఈ ఏడాది మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి రూ.9.26 లక్షలకు దక్కించుకున్నారు. 51 బండ్లపై బుల్లి గణపతులు జియాగూడ గణేష్ భక్త సమాజ్వారు 51 బండ్లలో 51 విగ్రహాలను వినాయక సాగర్కు తరలించారు. జియాగూడ నుంచి గోషామహాల్, ఎంజె మార్కెట్ మీదుగా ర్యాలీగా తరలివెళ్లారు. దాదాపు 30 మంది తాళ్ల సహాయంతో ఈ బండ్లను లాగుతూ తరలించారు. ప్రాంతం గెలుచుకున్న వారు ధర గత ఏడాది ధర (రూ. లక్షల్లో) (రూ.లక్షల్లో) ఎల్లారెడ్డిగూడ ఇ.పున్నారావు 18.11 --- డీఆర్ఆర్ హౌసింగ్, మధురానగర్ ఎస్.పాండు రంగారావు 16 1.10 వీవీఆర్ సొసైటీ, అమీర్పేట్ బీఎస్ఎస్మూర్తి 12.01 9.10 బాలాపూర్ తీగల కృష్ణారెడ్డి 9.26 7.50 -
రేపు ఉదయం వరకు గణేష్ నిమజ్జనం
హైదరాబాద్: నగరంలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా గణేష్ నిమజ్జనం రేపు ఉదయం వరకు కొనసాగే అవకాశం ఉంది. నగరమంతా వర్షం కురుస్తున్నందున గణేశ్ నిమజ్జన యాత్ర నెమ్మదిగా సాగుతోంది. ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమాలకు వర్షం ఆటంకంగా ఉంది. ఛార్మినార్, ఎన్టీఆర్ మార్ట్, ఖైరతాబాద్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, బషీర్బాగ్, ట్యాంక్ బండ్ ప్రాంతాలన్నీ గణేష్ విగ్రహాలు, భక్తులతో నిండిపోయాయి. బాలాపూర్ గణేశుని యాత్ర ఎట్టకేలకు చార్మినార్ దాటింది. బషీర్బాగ్ నుంచి ఎంజే మార్కెట్ వరకూ విగ్రహాలు నిలిచిపోయాయి. -
ట్యాంక్బండ్ వద్దకు గణేష్ విగ్రహాలు
-
జబర్దస్త్ టీంతో చిట్చాట్ Part 4
-
జబర్దస్త్ టీంతో చిట్చాట్ Part 3
-
జబర్దస్త్ టీంతో చిట్చాట్ Part 5
-
హైదరాబాద్లో భారీ వర్షం
హైదరాబాద్: హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. నిమజ్జనానికి బయలుదేరిన విఘ్నేశ్వరుని విగ్రహాలన్నీ తడిసిపోయాయి. వర్షం కారణంగా గణేష్ విగ్రహాల ఊరేగింపు వేగంగా ముందుకు సాగుతోంది. ఊరేగింపులో పాల్గొన్న భక్తులు తడిసి ముద్దైపోయారు. వర్షంలో కూడా నిజమజ్జనం కొనసాగుతోంది. నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాలలో మోకాలి లోతు నీరు నిలిచింది. వర్షం కారణంగా పలు ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ అయింది. -
20న ప్రజాప్రతినిధుల ధర్నా: శోభానాగిరెడ్డి
-
జబర్దస్త్ టీంతో చిట్చాట్ Part 2
-
జబర్దస్త్ టీంతో చిట్చాట్ Part 1
-
నిమజ్జనోత్సాహం, మహాగణపతి నిమజ్జనం
-
శివన్న స్వరహేళ
-
గాయని గాయత్రి,జయశ్రీ తో స్పెషల్ ఎడిషన్