IlayaRaja
-
ఇద్దరు లెజండరీ పర్సన్స్ క్రియేట్ చేసిన సాంగ్.. చూశారా
'లేడీస్ టైలర్' సినిమాతో మెప్పించిన రాజేంద్రప్రసాద్, అర్చన సుమారు 38 ఏళ్ల తర్వాత మరోసారి వారిద్దరూ కలిసి నటించిన చిత్రం 'షష్టి పూర్తి'.. తాజాగా ఈ మూవీ నుంచి ఒక మెలోడీ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఎన్నో పాటలకు మ్యూజిక్ అందించడమే కాకుండా రచయితగా కూడా కీరవాణి గుర్తింపు తెచ్చకున్నారు. అయితే, ఈ సినిమాతో తొలిసారి ఇళయరాజా సంగీతంలో ఆయన ఈ సాంగ్ను రచించడం విశేషం. ‘షష్టిపూర్తి’ సినిమాలో రూపేష్, ఆకాంక్షా సింగ్ జంటగా.. రాజేంద్ర ప్రసాద్, అర్చన మరో జోడీగా నటించారు. ఈ మూవీని పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేష్ చౌదరి నిర్మించారు. ‘లేడీస్ టైలర్’ తర్వాత ఈ చిత్రంలో వారిద్దరూ మరోసారి నటిస్తుండటంతో సినిమాపై ఆసక్తికలిగించేలా ఉంది. తాజాగా విడుదలైన సాంగ్ రూపేష్, ఆకాంక్షా సింగ్ మధ్యే ఉంటుంది. మంచి లవ్ ట్రాక్తో పాటు చక్కటి మెలోడీనిచ్చేలా పాట ఉంది. -
'భారతరత్న' అవార్డ్స్.. రేసులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్
దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’( Bharat Ratna) అవార్డును ప్రముఖ సంగీత దర్శకుడు అందుకోనున్నారని కోలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. ఏదైనా రంగంలో అసాధారణ సేవలు అందించి, అత్యుత్తమ పనితీరును కనబరచినవారికి ఈ అవార్డును అందజేస్తారు. ఒక ఏడాదిలో గరిష్ఠంగా ముగ్గురికి మాత్రమే ఈ పురస్కారాన్ని ప్రకటించవచ్చు. అయితే, 2025 ఏడాదికి గాను మేస్ట్రో ఇళయరాజాను (Ilaiyaraaja) భారతరత్న అవార్డ్తో కేంద్ర ప్రభుత్వం గౌరవించనుందని తెలుస్తోంది. ఈ ఉగాదిలోపు ప్రకటించే అవకాశం ఉంది.మేస్ట్రో ఇళయరాజా... ఈ పేరు వింటే చాలు సంగీత ప్రియులు ఆయన సినిమాల్లోని పాటలతో కూని రాగాలు తీస్తుంటారనడంలో సందేహం లేదు. తన పాటలతో అంతలా సంగీత ప్రియులను అలరించారాయన. తనకంటూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఇళయరాజాను భారతరత్న అవార్డ్తో కేంద్ర ప్రభుత్వం గౌరవించనున్నట్లు దాదాపు ఖాయం అయిందని సమాచారం. తన 30 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 5వేల పాటలతో పాటుగా 1000 సినిమాలకు పైగానే సంగీత దర్శకత్వం వహించి రికార్డ్ క్రియేట్ చేశారు. బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఆయన కొనసాగుతున్న విషయం తెలిసిందే.2010లో భారత ప్రభుత్వం ఆయనను "పద్మభూషణ్" పురస్కారంతో సత్కరించగా.. 2018లో "పద్మవిభూషణ్" అవార్డ్ వరించింది. ఉత్తమ సంగీత దర్శకుడుగా ఏడు సార్లు జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడిగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు. దేశంలోనే అత్యున్నతమైన 24 అవార్డ్స్ను ఇళయరాజా అందుకున్నారు.లండన్లో ఇటీవల ఇళయరాజా ‘వాలియంట్’ పేరుతో మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్కడ వెస్ట్రన్ క్లాసికల్ సింఫొనీ నిర్వహించిన తొలి ఆసియా మ్యూజిక్ కంపోజర్గా ఇళయరాజాకు గౌరవం దక్కింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా ఇళయరాజా కలిశారు. -
ఇళయరాజా మ్యూజికల్ జర్నీపై తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన
తరాలు మారుతున్నా ఇళయరాజా సంగీతంపై అభిమానం ఏంతమాత్రం తగ్గదు. గత 50 ఏళ్లుగా కోట్లమందికి తన సంగీతంతో ఆయన దగ్గరయ్యారు. ఈ క్రమంలో ఇళయరాజా 50 ఏళ్ల మ్యూజికల్ జర్నీపై తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ప్రస్థానాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తాజాగా తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. ఇదే విషయాన్ని ఎక్స్ వేదికగా తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు.తమిళనాడు తేని జిల్లాలో మారుమూల కుగ్రామంలో రాజయ్యగా పుట్టి, రాజాగా ఆయన మారారు. అప్పటికే చిత్ర పరిశ్రమలో మన ఏ.ఎం.రాజా ఉండటం వల్ల ‘ఇళయ’ చేర్చుకుని ఇళయరాజాగా ఆయన పరిచయం అయ్యారు. అలా ‘అన్నాకిళి’ (1976)తో మొదటి చిత్రం చేశారు. ఏ ముహూర్తాన సంగీత దర్శకుడిగా జన్మించాడోగాని ఇంతకాలం తర్వాత, 1,500 సినిమాలకు 8,500 పాటలు చేశాక, 81 ఏళ్లకు చేరుకున్నాక కూడా ఆకర్షణ కోల్పోలేదు. భారతీయ సంగీత ప్రతిభను ప్రపంచానికి చాటడానికి వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్లో అత్యంత క్లిష్టమైన ‘సింఫనీ’ రాసి, దానికి ‘వేలియంట్’ అని నామకరణం చేసి, మార్చి 8న లండన్ లో 85 మంది సభ్యుల ప్రతిష్ఠాత్మక రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో ప్రదర్శన ఇచ్చారు. ప్రపంచ దేశాల నుంచి రాజా అభిమానులు ఈ సింఫనీకి హాజరయ్యారు. 45 నిమిషాల నాలుగు అంచెల సింఫనీని విని స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఇలా వెస్ట్రన్ క్లాసికల్లో సింఫనీ రాసి, లండన్ (London)లో ప్రదర్శన ఇచ్చిన మొట్టమొదటి భారతీయుడిగా రాజా చరిత్ర సృష్టించారు. -
రాజా... రాజాధిరాజా...
‘టిక్... టిక్... టిక్...’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న కె.భారతీరాజా తన మిత్రుడు ఇళయరాజాకు పాట సందర్భాన్ని వివరిస్తూ ‘పాట మధ్యలో ఒకచోట భయంకరమైన మ్యూజిక్ కావాలి. అక్కడ ప్రేక్షకులు ఉలిక్కిపడే దృశ్యం చూపిస్తాను’ అన్నాడట. ఇళయరాజా ‘సరే’ అని పాట రికార్డు చేశాడు. భారతీరాజా ఆ పాట విని మొదట తనే ఉలిక్కిపడ్డాడు. ఏమంటే భయంకరమైన మ్యూజిక్ కావాలని అతడు కోరిన చోట ఇళయరాజా (Ilayaraja ) ఏం చేశాడో తెలుసా? కొన్ని సెకన్ల నిశ్శబ్దం (Silence) ఉంచాడు. ‘నిశ్శబ్దానికి మించిన భయమైన ధ్వని ఏముంది?’. ఆ పాట హిట్ అయ్యింది. శబ్దం, నిశ్శబ్దం తెలిసిన ఈ మహా సంగీతకారుడు (music maestro) గత 50 ఏళ్లుగా కోట్లమందికి తోడుగా ఉన్నాడు. అభిమానులతో సహజీవనం చేస్తున్నాడు. ఆరాధకులతో సహయానం సాగిస్తున్నాడు. మనసుకు వైద్యుడు. కలత వేళ ఏకాంత తీరాలకు మోసే వెదురు తెప్ప.‘ప్రేమ’ సినిమా కుర్రకారు ఓపెనింగ్స్తో మొదలైంది. హీరో గిటారిస్ట్. క్లయిమాక్స్ జాతీయస్థాయిలో పాటల పోటీ. హీరో ఎలాంటి పాటతో అదరగొట్టి చిందులు వేస్తాడోనని అందరూ ఎదురు చూస్తే ‘ప్రియతమా... నా హృదయమా’... అని ఎంతో నెమ్మదైన మెలడీ వస్తుంది. ఇళయరాజా అలా ఎందుకు చేశాడు? పాట మరోసారి వినండి. పాటకు ముందు మెరుపు వేగంతో గిటార్ మోతతో స్టేజ్ ఊగిపోయేలా ప్రిలూడ్ వస్తుంది. హఠాత్తుగా ఆగి స్లోగా పాట మొదలవుతుంది. హీరో పాడాలనుకున్నది ప్రిలూడ్కు అనువైన పాట. పాడింది ఈ పాట. కారణం? హీరోయిన్ చావు బతుకుల్లో ఉంది. దర్శకుడి కంటే ఇళయరాజాకే కథ బాగా అర్థం అవుతుంది. అందుకే అతడి పాట నిలబడుతుంది.తెల్లవారే లేచి, కాస్త టీ కొట్టి, హైదరాబాద్ నుంచి చెన్నైకి కారు ప్రయాణం మీద బయలుదేరే కొందరు అమ్మో అంత దూరమా? అనుకోరు. ఇళయరాజా పాటల పెన్ డ్రైవ్ తగిలిస్తే చాలు అనుకుంటారు. ఏ శనివారం సాయంత్రమో పార్టీలో డబ్బు తక్కువై సరంజామా తగ్గినా ఊరుకుంటారు... ఇళయరాజా పాట మాత్రం బ్యాక్గ్రౌండ్లో ఉండాల్సిందే. ప్రేమ విఫలం... ఇళయరాజా. ప్రేమ జయం... ఇళయరాజా. భావనలొకటై సాగిపోయే వేళలో.... పరువమా చిలిపి పరుగు తీయకు....తమిళనాడు తేని జిల్లాలో మారుమూల కుగ్రామంలో రాజయ్యగా పుట్టి, రాజాగా మారి అప్పటికే మన ఏ.ఎం.రాజా ఇండస్ట్రీలో ఉండటం వల్ల ‘ఇళయ’ చేర్చుకుని ఇళయరాజాగా ‘అన్నాకిళి’ (1976)తో ఏ ముహూర్తాన సంగీత దర్శకుడిగా జన్మించాడోగాని ఇంతకాలం తర్వాత, 1,500 సినిమాలకు 8,500 పాటలు చేశాక, 81 ఏళ్లకు చేరుకున్నాక కూడా ఆకర్షణ కోల్పోలేదు. పెరిగే అభిమానుల రాశి తప్ప అతని పాటల సూచి కుదేలైన దాఖలా లేదు. ఇసైజ్ఞాని. మేస్ట్రో. రాజా సార్. ఒకసారి వింటే చర్మానికి అంటుకుపోయే ఒడు కొలాన్ సెంట్. 1980లలో హైస్కూల్లోనో కాలేజీలోనో ఉన్నవారెవరైనా ఇతని మొగలి వనాలలో వ్యసనపరులు. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. రావడం రావడమే కొత్త సౌండ్ను ప్రవేశ పెట్టిన ఇళయరాజాకు, కర్ణాటక ధోరణిని వెస్ట్రన్ తో ఫ్యూజన్ చేయాలనుకుంటున్న ఇళయరాజాకు తన పాటలు సగటు శ్రోతలకు నచ్చుతాయా లేదా అనే సందేహం తెగ పీడించింది. ఒకరోజు సాయంత్రం వాకింగ్కు ఇంటి నుంచి బయలుదేరితే రేడియోలో ‘అన్నాకిళి’ (రామచిలుక)లోని ‘మావయ్య వస్తాడట’ పాట మొదలైందట! అంతే... ఆ ఇంటి ఇల్లాలు గబగబా బయటకు వచ్చి ‘ఓ సుబ్బాయక్కా... మంగమ్మత్తా... మావయ్య వస్తాడట పాట వస్తోందే రేడియో పెట్టండి’ అని అరిచిందట! ఇళయరాజా నడుస్తున్న పొడవైన వీధి. ఇక చూడండి... ప్రతి గడపా వరుసగా రేడియో ఆన్ చేస్తూ అతని పాటను అతనికే వినిపిస్తూ కచేరీ. వారిచ్చిన నమ్మకం నేటికీ!‘సంగీతం రాదు... ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను’ అనే ఇళయరాజా ఇంత పేరు, ఖ్యాతి, సంపద తర్వాత కూడా వయసు రీత్యా విరమించుకొని ఉండొచ్చు. గర్వంతో మొద్దుబారి ఉండొచ్చు. అహంతో బంగారు సింహాసనం చేసుకుని విర్రవీగొచ్చు. కాని అతడు అవేం చేయలేదు. భారతీయ సంగీత ప్రతిభను ప్రపంచానికి చాటడానికి వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్లో అత్యంత క్లిష్టమైన ‘సింఫనీ’ రాసి, దానికి ‘వేలియంట్’ అని నామకరణం చేసి, మార్చి 8న లండన్ లో 85 మంది సభ్యుల ప్రతిష్ఠాత్మక రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో ప్రదర్శన ఇచ్చాడు. చదవండి: వాక్కాలుష్యం.. మాటల గురించి కాస్త మాట్లాడుకుందాంప్రపంచ దేశాల నుంచి రాజా అభిమానులు ఈ సింఫనీకి హాజరయ్యారు. 45 నిమిషాల నాలుగు అంచెల సింఫనీని విని స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఇలా వెస్ట్రన్ క్లాసికల్లో సింఫనీ రాసి, లండన్ (London)లో ప్రదర్శన ఇచ్చిన మొట్టమొదటి భారతీయుడిగా రాజా చరిత్ర సృష్టించాడు. మరల రాజాధిరాజుగా నిలిచాడు. వ్యక్తిగత ప్రవర్తనలో కొందరికి అభ్యంతరాలు ఉండుగాక... కాని ఇళయరాజా ఒకసారి హార్మోనియం పెట్టె ముందు కూచున్నాడంటే దేవుడు– అభిమానులకు! చేసిన పాటల కంటే బ్యాక్గ్రౌండ్ స్కోరుకు ఫ్యాన్స్ ఉన్నారంటే ఏమిటి చెప్పడం! చదవండి: ఆ రెండూ ఉంటే.. కావాల్సినవన్నీ ఉన్నట్టేరాజా తరగని స్ఫూర్తి. కొద్దిగా చేసి ఎంతో అనుకునేవారు, కాసింత వయసుకే డీలా పడిపోయే వారు, నాలుగు ముక్కలు చదివి మేధావులుగా చలామణి అయ్యేవారు, అద్దెలొచ్చే నాలుగు ఫ్లాట్లకు ఓనర్లైనంత మాత్రాన ఇతరులను పురుగుల్లా చూసేవారు... రాజా నుంచి నేర్చుకోవాల్సింది ఉన్నట్టే ఉంది. రాజా చెయ్యి వేస్తే... అది రాంగై పోదు లేరా! -
ఇళయరాజాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సారీ చెప్పిన దర్శకుడు
సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ మిస్కిన్ క్షమాపణలు చెప్పాడు. బాటిల్ రాధ సినిమా ఈవెంట్లో మిస్కిన్ మాట్లాడుతూ.. తాను పెద్ద తాగుబోతునని చెప్పాడు. ఎన్నో సమస్యలకు మందు పరిష్కారమని చెప్పాడు. ఇళయరాజా సంగీతం వల్ల ఎందరో మద్యానికి అలవాటుపడ్డారన్నాడు. ఇళయరాజాపై ఈయన చేసిన కామెంట్లు వివాదాస్పదమవడంతో నేడు సారీ చెప్పాడు. తాను సరదాగా అన్న వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్నారని పేర్కొన్నాడు.చులకనగా మాట్లాడటం కరెక్ట్ కాదుతాజాగా ఈ వివాదంపై తమిళ హీరో విశాల్ (Vishal) స్పందించాడు. అందరూ ఆరాధించే ఇళయరాజాను అగౌరవపర్చడం ఏమాత్రం సమంజసం కాదన్నాడు. ఆయన సంగీతం వల్ల ఎంతోమంది డిప్రెషన్ నుంచి బయటపడ్డారని తెలిపాడు. అలాంటి మహనీయుడు గురించి, ఆయన సంగీతం గురించి చులకనగా మాట్లాడటం కరెక్ట్ కాదని హెచ్చరించాడు. విశాల్-మిస్కిన్ కాంబోలో 2017లో వచ్చిన తుప్పరివాలన్(తెలుగులో డిటెక్టివ్) పెద్ద హిట్ అయింది.చేదు అనుభవం బయటపెట్టిన దర్శకుడుఇకపోతే మిస్కిన్ తాజాగా బాటిల్ రాధ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టాడు. 2013లో ఒనాయుమ్ ఆట్టుకుట్టియుమ్ సినిమా తీశాను. కొందరు ఈ మూవీ టెలివిజన్ రైట్స్ హక్కులు కొనేందుకు నన్ను సంప్రదించారు. ఓ బడా దర్శకుడు నాకు ఫోన్ చేసి ఈ సినిమా తాను కొంటానని, అందుకోసం పెద్ద మొత్తంలో డబ్బిస్తానంటూ ఓ చోటుకు రమ్మన్నాడు.(చదవండి: ఈ వారం ఓటీటీలో 18 చిత్రాలు.. ఆ రెండు స్పెషల్!)సగం కంటే తక్కువకే ఇచ్చేయమన్నారుసరేనని అతడు చెప్పిన ప్రదేశానికి వెళ్లాను. నన్ను ఓ పెద్ద గదిలో కూర్చోబెట్టారు. ఆ గదిలో 20 మంది ఉన్నారు. రూ.75 లక్షలకే డిజిటల్ రైట్స్ ఇవ్వమని అడిగారు. ఎంతో కష్టపడి తీశాను సర్.. ఇది చాలా మంచి సినిమా.. కనీసం రూ.2 కోట్లు ఇవ్వండి అని కోరాను. కానీ వాళ్లు మాత్రం నా మాట వినలేదు. అంత డబ్బు ఇవ్వలేం.. మేము అడిగినదానికే డీల్ కుదిర్చేయ్ అని బలవంతం చేశారు. బెదిరించి బలవంతంగా సంతకంకాసేపటికి వాళ్లందరూ గూండాలని అర్థమైంది. నన్ను బెదిరించి పత్రాలపై సంతకం తీసుకున్నారు. వాళ్లు చెప్పినట్లు రూ.75 లక్షలే ఇచ్చారు. ఇదంతా వెనకుండి నడిపించిన వ్యక్తి ఇండస్ట్రీలో పేరు మోసిన డైరెక్టర్. నా సినిమాను ఇప్పటివరకు వారి ఛానల్లో 80 సార్లు వేసి ఉంటారు. అది టీవీలో కూడా హిట్టయింది అని చెప్పుకొచ్చాడు.చెప్పు విసురుతానని..ఇళయరాజాపై వ్యాఖ్యల గురించి స్పందిస్తూ.. కొన్నిరకాల వివాదాలు నిర్మాతలను ఇబ్బందిపెడతాయి. అందుకే నా వల్ల ఏ సమస్యా ఉండకూడదని సారీ చెప్తున్నాను. అయితే నా వ్యాఖ్యలు విన్న నా స్నేహితుడు నాపై చెప్పు విసురుతానన్నాడు. నా చెప్పు సైజ్ 8.. కాబట్టి ఒకటికి బదులుగా రెండు విసరమని చెప్పాను. అతడికి కూడా క్షమాపణలు చెప్పాను. ఆరోజు సరదాగా అన్న మాటల్ని చాలాదూరం తీసుకెళ్తున్నారు. అందుకే సారీ చెప్తున్నా అన్నాడు మిస్కిన్.చదవండి: క్యాన్సర్తో పోరాటం.. అన్నీ వదిలేసి నటికి సపర్యలు చేస్తున్న ప్రియుడు -
నా కూతురు పోయాకే చేదు నిజం తెలుసుకున్నా.. ఇళయరాజా ఎమోషనల్
కళ్లముందు కూతుర్ని కోల్పోవడం కంటే విషాదం మరొకటి ఉంటుందా? ఆ కడుపుకోతను సంగీత జ్ఞాని ఇళయరాజా అనుభవిస్తున్నాడు. గతేడాది జనవరి 25న ఆయన కూతురు, గాయని, సంగీత దర్శకురాలు భవతారిణి క్యాన్సర్తో పోరాడుతూ కన్నుమూసింది. ఆమె మొదటి వర్ధంతి సందర్భంగా కూతుర్ని తలుచుకుని ఇళయారాజా భావోద్వేగానికి లోనయ్యాడు.నిర్లక్ష్యం చేశా..ఇళయరాజా (Ilayaraja) మాట్లాడుతూ.. నేను ఎంతగానో ప్రేమించే నా కూతురు దూరమై ఏడాదవుతోంది. తను మాతో లేదన్న బాధ ఇప్పటికీ నన్ను వేధిస్తోంది. తను నాపై ఎంత ప్రేమ కురిపించేది.. ఎంత ఆప్యాయత చూపించేదన్న విషయం తనను కోల్పోయాకే తెలుసుకున్నాను. నా జీవితమంతా సంగీతానికే ధారపోశాను. ఈ క్రమంలో నా కుటుంబాన్ని పట్టించుకోలేదు. పిల్లల్ని నిర్లక్ష్యం చేశాను. వారికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయాను. ఈ చేదు నిజం నన్ను కుంగదీస్తోంది.సంగీతంతో స్వాంతనసంగీతం ఎంతోమందికి ఓదార్పునిస్తుందంటారు. ఇలాంటి క్లిష్ట సమయంలో అదే సంగీతం నాకూ కొంత స్వాంతన కలిగిస్తోంది. ఫిబ్రవరి 12న నా కూతురి పుట్టినరోజు. ఆరోజు నా కూతురికి నివాళిగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాను. నా సన్నిహితులను, ఇండస్ట్రీ మిత్రులను అందరినీ ఈ ప్రోగ్రామ్కు ఆహ్వానిస్తాను. నా కూతురు ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. (చదవండి:సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత)సింగర్గా భవతారిణిఇళయరాజాకు కూతురు భవతారిణితో పాటు కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజా అని ఇద్దరు కుమారులు సంతానం. మలయాళ త్రీడీ ‘మై డియర్ కుట్టి చాత్తాన్’ (1984) గాయనిగా భవతారణికి తొలి చిత్రం. ప్రభుదేవా హీరోగా నటించిన ‘రాసయ్య’ (1995) మూవీ ద్వారా సింగర్గా తమిళ చిత్రపరిశ్రమకు పరిచయమైంది. ‘భారతి’ (2000) చిత్రంలోని ‘మైలు పోల పొన్ను..’ పాటకు గాను జాతీయ ఉత్తమ గాయనిగా కేంద్ర ప్రభుత్వ అవార్డు అందుకుంది. తెలుగులోనూ పలు పాటలు పాడింది. ‘గుండెల్లో గోదారి’ సినిమాలో ‘నన్ను నీతో..’ అనే పాటను ఆలపించింది.మ్యూజిక్ డైరెక్టర్గానూ..‘మిత్ర్: మై ఫ్రెండ్’తో సంగీత దర్శకురాలిగా మారారు భవతారణి. సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్, శిల్పాశెట్టి ముఖ్య తారలుగా వచ్చిన హిందీ చిత్రం ‘ఫిర్ మిలేంగే’ (2004) సినిమాకు ఓ సంగీత దర్శకురాలిగా చేశారు. హిందీలో ఇదే తన తొలి సినిమా. దాదాపు పాతిక చిత్రాల్లో సాంగ్స్ పాడగా పది సినిమాలకు సంగీత దర్శకురాలిగా పని చేసింది. శబరిరాజ్ అనే వ్యక్తితో భవతారణి వివాహం జరిగింది.. కానీ, వీరికి సంతానం లేదు.చదవండి: వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం'.. 12 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే? -
ఇళయరాజాకు అవమానం? వీడియో వైరల్
దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాకు అవమానమే ఇది. ఎందుకంటే ఈ రోజు (డిసెంబర్ 16) నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతంది. ఒక్కోచోట ఒక్కో ఆచారమున్నట్లే తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలో పెళ్లి కాని యువతలతో పాటు చాలామంది ప్రత్యేక పూజలు జరుపుకొంటారు. ఈ మాసం తొలిరోజున ఆండాళ్, తిరుప్పావై పట్టు వస్త్రాలు ధరించి రంగమన్నార్ స్వామితో దర్శనమిచ్చారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)ఈ క్రమంలోనే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా.. ఆండాళ్ని దర్శించుకునేందుకు వేకునజామునే ఆలయానికి వచ్చారు. స్వామివారి దర్శనం చేసుకునేందుకు ఆండాళ్ గర్భగుడి ముందున్న మండపంలోకి ప్రవేశించే సమయంలో.. అక్కడే ఉన్న జీయర్ ఈయనని అడ్డుకున్నారు. దీంతో గర్భగుడి బయటే నిలబడి ఇళయరాజా పూజా చేసుకున్నారు.అయితే శ్రీ విల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయ అర్థ మండపంలోకి ఇళయరాజాను రానివ్వకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్నో పాటల్లో స్వామిని కీర్తించిన సంగీత విద్వాంసుడికి దక్కిన గౌరవం ఇదేనా అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: బిగ్బాస్ విన్నర్గా నిఖిల్.. ప్రైజ్మనీతోపాటు ఏం సాధించాడంటే?)SHOCKING: Ilaiyaraaja denied entry✖️ to Sanctum Sanctorum and asked to get out by the priests at Srivilliputhur Andal Temple🛕 pic.twitter.com/Aii7GQPg6k— Manobala Vijayabalan (@ManobalaV) December 16, 2024 -
ఇళయరాజా బయోపిక్పై నీలినీడలు?
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా జీవిత చరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు జరిగిన విషయం తెలిసిందే. వెయ్యికి పైగా చిత్రాలకు సంగీతాన్ని, 7 వేలకు పైగా పాటలకు బాణీలు కట్టిన మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఎనలేని గుర్తింపు పొందారు. ఆయన బయోపిక్ తెరకెక్కనున్న వార్త, సంగీత ప్రియుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. సంగీత ప్రపంచంలో ఇళయరాజా ఒక లెజెండ్.. ఆయన బయోపిక్లో నటుడు ధనుష్ నటించడానికి సమ్మతించడం కూడా మంచి క్రేజ్ను తీసుకొచ్చింది. దీన్ని ఇంతకు ముందు ధనుష్ కథానాయకుడిగా నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రం ఫేమ్ అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహించడానికి సిద్ధం అయ్యారు. ఓ బాలీవుడ్ సంస్థ దీన్ని నిర్మించడానికి ముందుకు వచ్చింది. అదేవిధంగా ఈ చిత్ర పరిచయ కార్యక్రమాన్ని చాలా రోజుల క్రితమే చైన్నెలో నిర్వహించారు. అందులో సంగీత దర్శకుడు ఇళయరాజా, నటుడు కమలహాసన్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. త్వరలోనే చిత్ర షూటింగ్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అలాంటిది ఇప్పటివరకు ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాలేదు. అదేవిధంగా నటుడు ధనుష్ కథానాయకుడిగా ,దర్శకుడుగా తన చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇళయరాజా బయోపిక్పై నీలినీడలు పడుతున్నాయి. ఈ చిత్ర నిర్మాణానికి బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ సెట్ కాదని అభిప్రాయాన్ని యూనిట్ వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్ర షూటింగ్ ఆదిలోనే ఆగిపోతుందా? లేక వేరే సంస్థ దీని నిర్మాణ బాధ్యతలను చేపడుతుందా? అనేది వేచి చూడాల్సి ఉంది. -
ఇళయరాజా గారితో తిట్లు తినేవాడిని ..
-
ఇళయరాజాకు 'మంజుమ్మెల్ బాయ్స్' ఎంత డబ్బు చెల్లించారు..?
'మంజుమ్మెల్ బాయ్స్' సినిమా రికార్డ్ కలెక్షన్లతో సూపర్ హిట్ అందుకుంది. రూ. 200 కోట్లు కలెక్షన్స్ రాబట్టి మలయాళ ఇండస్ట్రీలో ఆల్టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాలోని ఒక పాట వివాదం తెచ్చిపెట్టింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా 'మంజుమ్మెల్ బాయ్స్' చిత్ర నిర్మాతకు లీగల్ నోటీసులు కూడా పంపిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక పాటను కమల్ నటించిన 90ల నాటి 'గుణ' చిత్రం నుంచి వాడారంటూ ఆ నోటీసుల్లో ఇళయరాజా పేర్కొన్నారు.ఈ నోటీసులకు 'మంజుమ్మెల్ బాయ్స్' చిత్ర నిర్మాత షాన్ ఆంటోనీ స్పందించారు. సరైన అనుమతి పొందిన తర్వాతే పాటను ఉపయోగించామని ఆయన చెప్పుకొచ్చారు. ఆ సాంగ్కు సంబంధించ కాపీరైట్ కలిగిన రెండు మ్యూజిక్ కంపెనీలను సంప్రదించి వారి నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే పాటను వాడామని స్పష్టత ఇచ్చారు.ఈ వివాదంలో ఇళయరాజా రూ.2 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశారని, సమస్యను పరిష్కరించేందుకు 'మంజుమ్మెల్ బాయ్స్' నిర్మాత రూ.60 లక్షలు ఇచ్చారని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయమై ఇళయరాజా తరపు న్యాయవాది శరవణన్ను సంప్రదించగా, ఆయన ఈ సమాచారాన్ని ఖండించారు. నిర్మాత వైపు నుంచి ఇళయరాజాకు ఎలాంటి డబ్బులు అందలేదని ఆయన చెప్పారు. అనంతరం తాము నోటీసు పంపామని తెలిపారు.ఈ విషయమై మంజుమల్ బాయ్స్ యూనిట్ కూగా రియాక్ట్ అయింది. సంగీత దర్శకుడు ఇళయరాజాకు పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని వారు తెలిపారు. మా సినిమాలో ఉపయోగించిన 'కణ్మణి అన్బోడు వాలంతన్' పాటకు మ్యూజిక్ మాస్టర్ ఆడియో నుంచి పొందామని వారు వివరించారు. అదేవిధంగా శ్రీదేవి మ్యూజిక్ కార్పొరేషన్ అనే సంస్థ నుంచి తెలుగు పాటను పొందినట్లు తెలిపారు. మరి ఇప్పటి వరకు ఇళయరాజాకి తాము ఎలాంటి పరిహారం ఇవ్వలేదని పేర్కొన్నారు. -
ఈ పాట నా చెల్లెలు కోసం అంటూ యువన్ శంకర్ రాజా ఎమోషనల్
సౌత్ ఇండియా స్టార్ హీరో విజయ్ నటించిన గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) చిత్రం నుంచి రెండో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో దివంగత సింగర్ భవతారిణి వాయిస్ కోసం ఏఐ టెక్నాలజీ ఉపయోగించారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో భారీ బడ్జెట్తో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రంలో నటుడు ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్, స్నేహా, లైలా, మీనాక్షీ చౌదరి వంటి పలువురు ప్రముఖులు ముఖ్యపాత్రలు పోషించారు. షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. కాగా దీనికి యువన్శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.తాజాగా విడుదలైన రెండో సాంగ్ గురించి యువన్శంకర్ రాజా ఎమోషనల్ అయ్యారు. ఈ పాట తనకెంతో ప్రత్యేకమంటూ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేశారు. 'మొదటి పాటలాగే ఈ పాటను కూడా విజయ్ పాడారు. కానీ ఇందులో నా సోదరి దివంగత భవతారిణి వాయిస్ కూడా ఉంది. ఈ పాట నాకు చాలా ప్రత్యేకమైనది. ఈ అనుభూతిని వర్ణించడానికి నా వద్ద మాటలు కూడా లేవు. బెంగళూరులో ఈ పాటను నేను మొదట కంపోజ్ చేస్తున్నప్పుడు.. దీనికి నా సోదరి వాయిస్ అయితే బాగుంటుందని భావించాను. ఆమెతోనే ఈ పాటను పాడించాలని బలంగా కోరుకున్నాను. ఆమె ఆరోగ్యం బాగుపడి ఆసుపత్రి నుంచి రాగానే రికార్డ్ చేయవచ్చు అనుకున్నాను. కానీ, అదే సమయంలో ఒక గంట తర్వాత ఆమె ఇక లేదనే వార్త వచ్చింది. అప్పుడు నా గుండె ముక్కలైంది. నేను ఆమె వాయిస్ని ఇలా ఏఐ టెక్నాలజీ ద్వారా ఉపయోగిస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఆమె వాయిస్ను మరోసారి వినిపించేలా కష్టపడిన నా సంగీత బృందానికి, ఇందులో భాగమైన వ్యక్తులందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఇది నాకు చాలా చేదు తీపి క్షణం.' అని యువన్శంకర్ రాజా ఎమోషనల్ అయ్యారు.ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా వారుసురాలు, గాయనీ, సంగీతదర్శకురాలు భవతారిణి కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమెకు ఇద్దరు సోదరులు యువన్ శంకర్రాజా, కార్తిక్ రాజాలాగే భవతారణి కూడా తండ్రి ఇళయరాజా వారసత్వాన్ని కొనసాగించారు. మ్యూజిక్ డైరెక్టర్గానే కాకుండా సింగర్గా కూడా తనదైన ముద్ర ఆమె వేశారు. తాజాగా విజయ్ సినిమాలో ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఆమె వాయిస్ను మరోసారి అభిమానులకు అందించారు యువన్శంకర్ రాజా. సెప్టెంబరు 5న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. -
ఇళయరాజా ముందు ధనుష్ భారీ డిమాండ్
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా జీవితం వెండితెరపైకి రానుంది. ధనుష్ లీడ్ రోల్లో నటిస్తున్న ‘ఇళయరాజా’ షూటింగ్ కార్యక్రమాన్ని కొద్దిరోజుల క్రితమే ప్రారంభించారు. ఈ మూవీకి అరుణ్మాథేశ్వరన్ దర్శకుడు. కనెక్ట్ మీడియా, పీకే ప్రైమ్ ప్రొడక్షన్, మెర్క్యూరీ మూవీస్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అయితే, ఈ సినిమాకు హీరో ధనుష్ భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్లు కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి.ధనుష్ నటించిన 'కెప్టెన్ మిల్లర్' చిత్రం పట్ల భిన్న అభిప్రాయాలు వచ్చినప్పటికీ సినిమాపై మంచి టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.అయితే, ధనుష్ మాత్రం తన పారితోషికాన్ని తగ్గించకుండా మరింత పెంచాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తర్వాత తెలుగులో డైరెక్ట్ సినిమా ఒకటి ఆయన తీస్తున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో 'కుబేర' కోసం నాగార్జున, ధనుష్ కలిసి ఇందులో నటిస్తున్నారు. ఇదే వరుసలో రాయన్, ఇళయరాజా బయోపిక్ ఉంది. అయితే, ధనుష్ రెమ్యునరేషన్ భారీగా పెంచాడని తెలుస్తోంది. ఇళయరాజా సినిమా కోసం రూ. 50 కోట్ల రెమ్యునరేషన్ అడిగారని కోలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. అయితే, సినిమా కోసం కేవలం 50 రోజులకు మించి కాల్షిట్స్ ఇవ్వలేనని కూడా ఆయన ముందే చెప్పారట. ధనుష్ పారితోషికం రోజుకు కోటి రూపాయలకు పెరిగిందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా రజనీకాంత్, విజయ్, అజిత్ వంటి ప్రముఖ నటులు 100 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. అయితే వారు ఒక్కో సినిమాకు కనీసం 70 రోజులకు పైగా కేటాయిస్తారని టాక్ ఉంది. -
కూతుర్ని కోల్పోయా.. అందుకే బర్త్డే సెలబ్రేట్ చేసుకోవట్లేదు: ఇళయరాజా
ఇళయరాజా సంగీతం గలగల పారే గంగా ప్రవాహం. ప్రతి మనిషికి ఉత్సాహం. అలసిన మనసులకు ఆహ్లాదం. ఇళయరాజా 1943 జూన్ 3వ తేదీన జన్మించారు. ఇప్పుడీ సంగీత పిపాసి వయసు 81 సంవత్సరాలు. ఇప్పటికీ సంగీతమే ఇళయరాజా ప్రపంచం. 1000 కి పైగా చిత్రాలు, 4,500కు పైగా పాటలు.. అందుకే అందరూ ఇతన్ని సంగీత జ్ఞాని అంటారు. ఇన్నేళ్లలో ఎన్నో జాతీయ, రాష్ట్రీయ అవార్డులు ఈయనను వరించాయి.81వ బర్త్డే..అలాంటి సంగీత రారాజు ఇళయరాజా 81వ జన్మదినోత్సవం సందర్భంగా కమల్ హాసన్ సహా అనేకమంది ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులైతే ఈయనను చూడడానికి స్థానిక టీనగర్లోని ఇళయరాజా రికార్డింగ్ స్టూడియోకు పోటెత్తారు. ఆయనతో ఫొటోలు దిగడానికి బారులు తీరారు. ఇళయరాజా ఎంతో సహనంతో వచ్చిన అభిమానులందరినీ సంతోషపరిచేందుకు వారితో చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలు దిగడం విశేషం. సెలబ్రేట్ చేసుకోవడం లేదుఆయన మీడియాతో మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా మీరే తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారని, తాను మాత్రం తన కుమార్తెను కోల్పోవడం వల్ల ఎలాంటి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం లేదని పేర్కొన్నారు. అయితే ఇదంతా మీ కోసమే కానీ తన కోసం కాదని ఇళయరాజా తెలిపారు. కాగా ఇళయరాజా కూతురు, గాయని, సంగీత దర్శకురాలు భవతారిణి క్యాన్సర్తో పోరాడుతూ జనవరిలో కన్నుమూశారు.చదవండి: ప్రకృతి ఒడిలో ఒకప్పటి హీరో కొత్తిల్లు.. 'నీకంత డబ్బు ఎక్కడిది?' -
ఇళయరాజా కూతురి చివరి సాంగ్ విడుదల
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా వారుసురాలు, గాయనీ, సంగీతదర్శకురాలు భవతారిణి కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా ఆమె చివరిగా అరియమల, పుయలిల్ ఒరు ధోనీ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అయితే, అరియమల అనే చిత్రంలో ఆమె ఒక పాటను ఆలపించారు. ఆ సాంగ్ అనంతరం భవతారిణి మరణించారు. తాజాగా ఆ చిత్ర మేకర్స్ పాటను విడుదల చేశారు.దర్శకుడు జేమ్స్ యువన్ దర్శకత్వంలో ఆర్ఎస్ కార్తీక్ హీరోగా నటిస్తున్న చిత్రం 'అరియమల'. ఈ చిత్రంలో మనీషా కథానాయికగా నటిస్తుండగా, మరిముత్తు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో దివంగత ప్లేబ్యాక్ సింగర్ ఇళయరాజా కుమార్తె భవతారిణి పాడిన 'అతిపూవా పోలా' అనే రొమాంటిక్ మెలోడియస్ సాంగ్ ప్రస్తుతం విడుదలైంది. నెట్టింట ఆ సాంగ్ తెగ వైరల్ అవుతుంది. తెలుగు ఆడియన్స్ను కూడా ఆ సాంగ్ మెప్పించేలా ఉంది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలోని లిరికల్ సాంగ్ ఇప్పుడు విడుదలై అభిమానుల హృదయాలను ఉర్రూతలూగించింది. ముఖ్యంగా భవతారిణి వాయిస్ని మిస్ అవుతున్నామని అభిమానులు అంటున్నారు. సోదరులు యువన్ శంకర్రాజా, కార్తిక్ రాజాలాగే భవతారణి కూడా తండ్రి ఇళయరాజా వారసత్వాన్ని కొనసాగించారు. మ్యూజిక్ డైరెక్టర్గానే కాకుండా సింగర్గా కూడా తనదైన ముద్ర వేశారు. తెలుగులో కూడా ఆమె ఒక పాట ఆలపించారు.. 'నను నీతో నిను నాతో కలిపింది గోదారి' (గుండెల్లో గోదారి) చిత్రంతో తెలుగు వారిని కూడా మెప్పించారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె శ్రీలంకలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటూ మరణించారని సమాచారం. -
హిట్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా తాజాగా మరో సినిమా యూనిట్కు నోటీసులు జారీ చేశారు. తను సంగీతం అందించిన పాటును అనుమతిలేకుండా ఉపయోగించుకున్నారని ఆయన నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఆయన పాటలను ఉపయోగించుకున్న పలు సినిమాలకు సంబంధించిన మేకర్స్కు కూడా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.ఈ ఏడాదిలో మలయాళం నుచి విడుదలైన 'మంజుమ్మల్ బాయ్స్' సూపర్ హిట్ కొట్టింది. తెలుగు,తమిళ్లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే 1991లో ఇళయరాజా- కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన గుణ చిత్రంలోని 'కణ్మణి అన్బోడు' పాటను ఈ చిత్రంలో ఉపయోగించారు. అయితే, తమ అనుమతి లేకుండా ఈ పాటను వాడుకున్నందుకు మంజుమ్మల్ బాయ్స్ చిత్ర నిర్మాణ సంస్థకు సంగీత స్వరకర్త ఇళయరాజా తరపున న్యాయవాది శరవణన్ నోటీసు పంపారు.కాపీరైట్ చట్టం ప్రకారం ఈ పాటకు పూర్తి హక్కులు ఇళయరాజాకు చెందినవని, అలాంటి సమయంలో పాటను ఉపయోగించుకోవడానికి హక్కులు పొందాలంటే.. వినియోగానికి తగిన పరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొనబడింది. లేకుంటే కాపీరైట్ను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లుగా చట్టపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నోటీసులో హెచ్చరించింది. రజనీకాంత్ నటిస్తున్న 'కూలి' చిత్రం టైటిల్ టీజర్లో తన సంగీతాన్ని అనుమతిలేకుండా వాడినట్టు సన్ పిక్చర్స్కు కూడా ఇళయరాజా నోటీసు పంపారు. -
ఆ పని నాది కాదు.. వైరముత్తుకు కౌంటర్ ఇచ్చిన ఇళయరాజా!
తమిళసినిమా: ఇతరుల గురించి పట్టించుకోవడం తన పని కాదని, అంత తీరిక కూడా తనకు లేదని, తన పనిని తాను సక్రమంగా చేసుకుంటున్నానని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పేర్కొన్నారు. ఇటీవల ఈయన పేరు నిత్యం వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఇళయరాజా సంగీతాన్ని అందించిన పాటకు కాపీ రైట్స్ కోరుతున్న విషయం విధితమే. ఈ వ్యవహారం కోర్టులో ఉంది. ఇటీవల తన అనుమతి లేకుండా తన సంగీతాన్ని కాపీ కొట్టారంటూ సన్ పిక్చర్స్ సంస్థకు నోటీసులు కూడా జారీ చేశారు. అసలు సంగీతం గొప్పదా? సాహిత్యం గొప్పదా? అనే ప్రశ్నకు గీతరచయిత వైరముత్తు తెర లేపారు. ఇలాంటి పరిస్ధితుల్లో ఇళయరాజా గురువారం ఒక వీడియోను తన సామాజిక మాధ్యమం ద్వారా విడుదల చేశారు. అందులో ఇటీవల తన గురించి ఏవేమో వార్తలు వస్తున్నట్లు వింటున్నానన్నారు. అయితే వాటి గురించి పట్టించుకునే సమయం తనకు లేదని, అలాంటి వాటిపై దృష్టి పెట్టడం తన పని కాదన్నారు. తన పని తాను సక్రమంగా చేసుకుంటున్నానని, చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూనే, ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నానని, అయినప్పటికీ 35 రోజుల్లో సింపోనీ రాసి పూర్తిచేసినట్లు చెప్పారు. ఇది సంతోషకరమైన విషయం అని పేర్కొన్నారు. ఇళయరాజా జూలై 14న భారీ సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్థానిక నందనంలోని వీఎంసీఏ గ్రౌండ్లో జరగనున్న ఈ సంగీత విభావరిలో ఇళయరాజా కనీసం 50 నుంచి 60 పాటలు పాడే అవకాశం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. pic.twitter.com/6Bkj59HOhi— Ilaiyaraaja (@ilaiyaraaja) May 16, 2024 -
అది జరగాలని కోరుకుంటున్నా.. రజనీకాంత్పై ధనుష్ కామెంట్
కోలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన నటుడు ధనుష్. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా రాణిస్తున్న ఈయన తాజాగా సంగీతజ్ఞాని ఇళయరాజా బయోపిక్లో నటిస్తున్నారు. కెప్టెన్ మిల్లర్ చిత్రం ఫేమ్ అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మీడియా, పీకే ప్రైమ్ ప్రొడక్షన్, మెర్కురీ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుక, ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చైన్నెలోని ఓ హోటల్లో తాజాగా జరిగింది. ఇందులో నటుడు కమల్హాసన్, దర్శకుడు భారతీరాజా, వెట్రిమారన్, ఆర్వీ ఉదయకుమార్ మొదలగు పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు ధనుష్ మాట్లాడుతూ భావనను బట్టే జీవి తం అంటారన్నారు. దాన్ని తాను నమ్ముతానన్నారు. పలువురు రాత్రుల్లో నిద్ర పట్టకపోతే ఇళయరాజా పాటలను వింటూ నిద్రపోతారన్నారు. అయితే తాను పలు రాత్రుళ్లు ఇళయరాజాగా నటిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ నిద్ర లేకుండా గడిపానన్నారు. తాను ఇద్దరి బయోపిక్లలో నటించాలని ఆశ పడ్డానని, అందులో ఒకరు రజనీకాంత్ కాగా, మరొకరు ఇళయరాజా అనీ అన్నారు. అందులో ఇళయరాజా బయోపిక్లో నటించే కల నెరవేరుతోందని అన్నారు. ఈ అవకాశం తనకు రావడం గర్వంగా ఉందన్నారు. ఇళయరాజా సంగీతమే తనకు అండ అని, ఇది అందరికీ తెలుసని పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటించడం ఛాలెంజ్, ప్రెజర్ అని అంటున్నారని, నిజానికి అలాంటిదేమీ లేదని, జాలీగా నటించడమేనని ధనుష్ పేర్కొన్నారు. అదేవిధంగా విడుదలై చిత్ర పాటల రికార్డింగ్ సమయంలో తనను పాడమని ఇళయరాజా చెప్పినప్పుడు మీరు ఇక్కడే ఉంటారా? అని అడిగానన్నారు. అందుకాయన తాను ఎప్పుడు మీతో లేకుండా ఉండాను అని పేర్కొన్నట్లు తెలిపారు. కాగా ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని, నీరవ్షా ఛాయాగ్రహణం అందిస్తున్నారు. -
Ilaiyaraaja Biopic:వెండితెరకి ఇళయరాజా జీవితం
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా జీవితం వెండితెరపైకి వస్తోంది. ధనుష్ లీడ్ రోల్లో నటిస్తున్న ‘ఇళయరాజా’ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ మూవీకి అరుణ్మాథేశ్వరన్ దర్శకుడు. కనెక్ట్ మీడియా, పీకే ప్రైమ్ ప్రొడక్షన్, మెర్క్యూరీ మూవీస్ సమర్పణలో రూ΄÷ందుతున్న ‘ఇళయరాజా’ షూటింగ్ బుధవారం చెన్నైలో ప్రారంభమైంది. ఈ వేడుకకి ఇళయరాజా, హీరోలు కమల్హాసన్, ధనుష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇళయరాజాతో తమకున్న అనుబంధాన్ని కమల్హాసన్, ధనుష్ పంచుకున్నారు. కాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ని రిలీజ్ చేశారు. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా ఈ మూవీకి ఇళయరాజా సంగీతం అందిస్తారని కోలీవుడ్ టాక్. -
మాజీ అల్లుడితో రజినీకాంత్.. ఆ దిగ్గజం బయోపిక్ కోసమే?
సాధారణంగా స్టార్ హీరోలు ఇద్దరు కలిసి నటిస్తే పెద్ద విషయమేం కాదు. కానీ ముగ్గురు ప్రముఖ హీరోలు ఒకే మూవీలో కలిసి నటిస్తే మాత్రం విశేషమని చెప్పొచ్చు. ఇలాంటిదే త్వరలో తమిళ చిత్రసీమలో జరగబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ధనుష్ 'రాయన్' సినిమాతో బిజీగా ఉన్నాడు. హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్నాడు. దీని తర్వాత దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్లో టైటిల్ రోల్ చేయబోతున్నాడు. (ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) ఇప్పటి జనరేషన్కి తెలియకపోవచ్చు గానీ 90ల్లో సినిమాలు చూసిన వాళ్లకు ఇళయరాజా పాటల్లోనే మ్యాజిక్ ఏంటనేది తెలుస్తుంది. దక్షిణాదిలో స్టార్ హీరోల సినిమాలకు సంగీతమందించిన ఈయన.. దశాబ్దాల పాటు గుర్తుండిపోయే పాటలు ఇచ్చారు. ఇప్పుడు ఈయన జీవితాన్నే సినిమాగా తీయబోతున్నారు. ఇందులోనే కమల్ హాసన్-రజినీకాంత్ అతిథి పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. రజినీకాంత్ కూతురు ఐశ్వర్యని గతంలో పెళ్లి చేసుకున్న ధనుష్.. కొన్నేళ్ల క్రితం విడాకులు ఇచ్చేశాడు. దీంతో రజినీకాంత్కి ఇతడు మాజీ అల్లుడు అయిపోయాడు. అయినా సరే ఇప్పుడు రజినీకాంత్.. ధనుష్ సినిమాలో కనిపించబోతున్నాడనే వార్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. బహుశా ఇళయరాజా బయోపిక్ కావడం వల్లే ఒప్పుకొని ఉంటాడని నెటిజన్స్ అనుకుంటున్నారు. ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవి ఖరీదైన కొత్త వాచ్.. రేటు తెలిస్తే మైండ్ బ్లాకే) -
ఇళయరాజా కూతురు భవతారిణి చివరి చిత్రం ఇదే..
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా వారుసురాలు, గాయనీ, సంగీతదర్శకురాలు భవతారిణి కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూశారు. కాగా ఆమె చివరిగా సంగీతాన్ని అందించిన తమిళ చిత్రం 'పుయలిల్ ఒరు ధోనీ' త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈశన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నూతన తారలు విష్ణుప్రకాశ్, అర్చనాసింగ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు వెల్లడిస్తూ.. మహిళల గొంతుకగా ఈ చిత్రం ఉంటుందన్నారు. తాను కథను సిద్ధం చేసుకున్నప్పుడే భవతారిణే దీనికి సంగీతాన్ని అందించాలని నిర్ణయించుకున్నానన్నారు. చిత్ర షూటింగ్ను పూర్తి చేసిన తరువాత భవతారిణిని కలిసి చిత్రాన్ని చూపించానన్నారు. చిత్రం నచ్చడంతో ఆమె సంగీతాన్ని అందించడానికి అంగీకరించినట్లు చెప్పారు. ఇందులో రెండు పాటలు ఉంటాయని, రెండింటినీ గీత రచయిత స్నేహన్ రాశారని చెప్పారు. ఈ పాటలకు భవతారిణి చాలా వేగంగా సంగీతాన్ని సమకూర్చారన్నారు. ఇందులో ఓ పాటను సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్కుమార్ ,మానసీ కలిసి పాడారని, మరో పాటను సంగీత దర్శకుడు కార్తీక్రాజా పాడారని చెప్పారు. రెండు పాటలు చాలా బాగా వచ్చాయని, ఇవి సంగీత ప్రియులకు కచ్చితంగా నచ్చుతాయన్నారు. నేపథ్య సంగీతాన్ని చాలా బాగా రూపొందించారని, త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న ఈ పుయలిల్ ఒరు ధోని చిత్ర విజయాన్ని సంగీతదర్శకురాలు భవతారిణికి అంకితం చేస్తామని దర్శకుడు చెప్పారు. -
ఇళయరాజా కుమార్తె, సంగీత దర్శకురాలు భవతారణి కన్నుమూత
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె, గాయని భవతారణి రాజా (47) కొంతకాలంగా క్యాన్సర్తో బాధ పడుతూ గురువారం రాత్రి శ్రీలంకలో కన్నుమూశారు. నేడు ఆమె భౌతికకాయాన్ని చెన్నైకు తీసుకురానున్నారు. శుక్రవారమే అంత్యక్రియలు జరుగుతాయని తెలిసింది. ఇళయరాజాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజా సంగీత దర్శకులు. కుమార్తె భవతారణ సంగీత దర్శకురాలిగా, గాయనిగా రాణిస్తున్నారు. మలయాళ త్రీడీ ‘మై డియర్ కుట్టి చాత్తాన్’ (1984) గాయనిగా భవతారణికి తొలి చిత్రం. ప్రభుదేవా హీరోగా నటించిన ‘రాసయ్య’ (1995) చిత్రం ద్వారా గాయనిగా కోలీవుడ్కి పరిచయమయ్యారు భవతారణి. అదే విధంగా ‘భారతి’ (2000) చిత్రంలోని ‘మైలు పోల పొన్ను..’ అనే పాటకు గాను జాతీయ ఉత్తమ గాయనిగా కేంద్ర ప్రభుత్వ అవార్డును అందుకున్నారామె. తెలుగులోనూ పలు పాటలు పాడారు. తండ్రి, సోదరుల సంగీత దర్శకత్వంలో అనేక పాటలను పాడారు భవతారణి. దాదాపు పాతిక చిత్రాల్లో పాటలు పాడారు. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘గుండెల్లో గోదారి’ సినిమాలో ‘నన్ను నీతో..’ పాటను పాడారామె. మెలోడీ పాటలతో సంగీత అభిమానుల హృదయాలలో చోటు దక్కించుకున్నారు. 2002లో నటి రేవతి దర్శకురాలిగా తెరకెక్కించిన తొలి చిత్రం ‘మిత్ర్: మై ఫ్రెండ్’తో సంగీత దర్శకురాలిగా మారారు భవతారణి. సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్, శిల్పాశెట్టి ముఖ్య తారలుగా వచ్చిన హిందీ చిత్రం ‘ఫిర్ మిలేంగే’ (2004) సినిమాకు ఓ సంగీత దర్శకురాలిగా చేశారు. హిందీలో ఆమెకు ఇది తొలి చిత్రం. తెలుగులో ‘అవునా’(2003), కన్నడలో ‘గీయా గీయా’ (2005) సినిమాలకు సంగీతం అందించారు భవతారణి. దాదాపు పది చిత్రాలకు సంగీతదర్శకురాలిగా చేశారు. అడ్వరై్టజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆర్. శబరిరాజ్తో భవతారణి వివాహం జరిగింది. వీరికి సంతానం లేరు. భవతారిణి మృతి పట్ల పలువురు చిత్రరంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
రెహమాన్, ఇళయరాజాలకు అవార్డులు.. ఆ సినిమాలకే
గత 14 ఏళ్ల నుంచి నార్వే చిత్రోత్సవారాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తమిళంలో ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఎంపిక చేసి ప్రతి ఏడాది అవార్డులు ఇస్తుంటారు. అలా ఈ సారి కూడా 20 చిత్రాలకు చెందిన యాక్టర్స్, టెక్నీషియన్స్కి పురస్కారాలు అందజేయనున్నారు. అయితే వీరిలో దిగ్గజ సంగీత దర్శకులు ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ కూడా ఉండటం విశేషం. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి రానున్న 21 సినిమాలు) జనవరి 25న 15వ నార్వే చిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఉత్తమ చిత్రం 'చిత్తా' (నిర్మాత సిద్ధార్థ్), ఉత్తమ నటుడు సూరి (విడుదలై –1), ఉత్తమ నటి ప్రీతి అస్రాని (అయోతి), ఉత్తమ దర్శకుడు మారి సెల్వరాజ్ (మామన్నన్), ఉత్తమ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (మామన్నన్, పొన్నియిన్ సెల్వన్–2), ఉత్తమ నిర్మాణ సంస్థ కేజే గణేష్ (చిత్రం యాత్తిసై ), ఉత్తమ ప్రతినాయకుడు ఫాహద్ ఫాజిల్ (మామన్నన్), ఉత్తమ సహాయ నటుడు (లేట్) పూరాము (చిత్రం కిడా), ఉత్తమ సహాయ నటి అబర్ణతి (ఇరుగపట్రు), ఉత్తమ గాయకుడు ఇళయరాజా (విడుదలై –1) ఉత్తమ గాయని శ్వేతామోహన్ (వాత్తి) అవార్డులు గెలుచుకున్నారు. (ఇదీ చదవండి: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది) -
వాటి గురించి ఆలోచించడం మానేశా
‘‘నన్ను అందరూ ‘ఇసైజ్ఞాని’ అని పిలుస్తుంటారు. నిజం చెప్పాలంటే ఆ పేరుకు నేను అర్హుడినా? అని ఆలోచిస్తే నాకే ప్రశ్నార్థకంగా ఉంటుంది’’ అని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ వేడుకలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘నాకు భాష, సాహిత్యంపై అంత పరిజ్ఞానం లేదు. కర్ణాటక సంగీతాన్ని ఔపోసన పట్టలేదు. కానీ, ప్రజలు నన్ను ఇసైజ్ఞాని అని పిలుస్తున్నారు. కానీ, నేను ‘ఇసైజ్ఞాని’ అనుకోవడం లేదు. నా గర్వాన్ని చిన్న వయసులోనే వదిలేశా. అన్నతో కలిసి నేను కచేరీలకు వెళ్లే సమయంలో హార్మోనియం వాయిస్తుంటే ప్రేక్షకులు చప్పట్లుకొడుతూ అభినందించేవారు. ఆ సమయంలో ఎంతో గర్వంగా ఉండేది. అయితే ఆ అభినందనలు నాకు కాదు.. నేను సృష్టించే బాణీలకు వస్తున్నాయని తెలుసుకున్నా. మనకు ఏ విషయంతో సంబంధం లేదని గ్రహించాను. అందుకే కీర్తి ప్రతిష్టల గురించి ఆలోచించడం మానేశాను’’ అని పేర్కొన్నారు. -
విజయ్ సినిమాలో అదిరిపోయే సర్ప్రైజ్లు..
సంగీతజ్ఞాని ఇళయరాజా, దళపతి విజయ్ 23 ఏళ్ల తరువాత కలిశారు.. చాలా ఆసక్తిగా ఉంది కదూ. ఆ కథేంటో చూద్దాం. విజయ్ తాజాగా నటిస్తున్న తన 68 చిత్రానికి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే పేరును ఇటీవలే ఖరారు చేశారు. హాలీవుడ్ చిత్రాల తరహాలో ఆంగ్లంలో ఉన్న ఈ టైటిల్పై సర్వత్రా చర్చ జరుగుతోంది. అదే విధంగా ఈ చిత్రంలో పలు ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకోవడం విశేషం. ముఖ్యంగా ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేయడంతో పాటు భారీ తారాగణం ఉండబోతుంది. మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా, మైక్ మోహన్, ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, ప్రేమ్జీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వెంకట్ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. యువన్ శంకర్రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజా షెడ్యూల్ కోసం యూనిట్ వర్గాలు శ్రీలంక బయలుదేరనున్నాయి. కాగా ఇళయరాజా సోదరుడు, వెంకట్ప్రభు తండ్రి, సంగీత దర్శకుడు, గీత రచయిత, దర్శకనటుడు గంగై అమరన్ ఈ చిత్రం కోసం ఒక పాట రాయడం విశేషం. మరో విశేషం ఏమిటంటే ఈ పాటను నటుడు విజయ్, సంగీత దర్శకుడు ఇళయరాజా కలిసి పాడారన్నది తాజా సమాచారం. వీరిద్దరూ కలిసి 1995లో రాజావిన్ పార్వైయిల్, 1997లో కాదలుక్కు మరియాదై, 2000 సంవత్సరంలో కన్నుక్కుల్ నిలవు, 2001లో ఫ్రెండ్స్ చిత్రాల్లో కలిసి పని చేశారు. తాజాగా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రంలో కలిసి పాడడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. చదవండి: ఓటీటీలో ఆ సూపర్ హిట్ ప్రీక్వెల్.. మీరు చూశారా? -
ఇళయరాజా బయోపిక్లో ధనుష్
సంగీత జ్ఞాని ఇళయరాజా జీవితం వెండితెరపైకి రానుంది. ఇందులో ధనుష్ ఓ ప్రధాన పాత్రలో నటించనున్నారు. మెర్క్యూరీ గ్రూప్, కనెక్ట్ మీడియా సంస్థలు ఈ బయోపిక్ను నిర్మించనున్నాయి. వచ్చే ఏడాది అక్టోబరులో ఈ చిత్రం షూటింగ్ప్రారంభించి, 2025 ఏడాది మధ్యలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా మెర్క్యూరీ గ్రూప్ సీఈవో, ఎండీ శ్రీరామ్ భక్తి శరణ్ మాట్లాడుతూ –‘ప్రాంంతీయ కథలతో సినిమాలు తీస్తే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. అందుకే లోకల్,ప్రాంతీయ కథలను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘రాబోయే రెండు దశాబ్దాల్లో భారతీయ వినోద పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ వినోద పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన మెర్క్యూరి సంస్థతో మెగా బడ్జెట్ సినిమాలను నిర్మించడానికి వారితో చేతులు కలపడం మాకు సంతోషంగా ఉంది’’ అని కనెక్ట్ మీడియా ప్రతినిధి వరుణ్ మాథుర్ అన్నారు. -
ఇళయరాజాగా ధనుష్..!
నటుడు ధనుష్, సంగీత దర్శకుడు ఇళయరాజాగా మారనున్నారా అన్న ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. బహుభాషా నటుడిగా రాణిస్తున్న ధనుష్ తమిళంతో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అంత బిజీలోనూ ప్రస్తుతం మెగాఫోన్ పట్టి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హీరోగానూ నటిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఇది ఈయన నటిస్తున్న 50వ చిత్రం కావడం విశేషం. దీంతో పాటు తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న 51వ చిత్రంలోనూ నటిస్తున్నారు. కాగా ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇది పీరియడ్ కథాంశంతో తెరకెక్కుతున్న కథా చిత్రం. కాగా సంగీత దర్శకుడు ఇళయరాజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. మెలోడి మాస్టర్. తన సంగీతంతో గుక్కపట్టి ఏడ్చే పసిపిల్లలను కూడా చిరునవ్వులతో కేరింతలు కొట్టించే శక్తి ఈయన సంగీతంలో ఉందనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. నాలుగు దశాబ్దాలకు పైగా సంగీత ప్రియులను అలరిస్తున్న ఇళయరాజా 1000 చిత్రాలకు పైగా సంగీతాన్ని అందించి అసాధారణ రికార్డును సాధించారు. కాగా సంగీత మేధావి బయోపిక్ చిత్రంగా తెరకెక్కనున్నట్లు, దీనిని ఆయనే నిర్మించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత ఆ ఊసే లేదు. అలాంటిది ఇప్పుడు మళ్లీ ఇళయరాజా బయోపిక్ గురించి చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో ఇళయరాజాగా ధనుష్ నటించడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రం 2024లో సెట్పైకి వెళ్లనుందని, 2025లో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
షేన్ వాట్సన్ ఇళయరాజా పాట
ఒక ఇంటర్య్వూలో ‘డూ యూ హ్యావ్ ఎనీ స్పెషల్ టాలెంట్స్?’ అనే ప్రశ్నకు సమాధానంగా గిటారు చేతిలోకి తీసుకున్నాడు ఆస్ట్రేలియన్ క్రికెటర్ షేన్ వాట్సన్. ఆంగ్ల పాట ట్యూన్ ఏదో ప్లే చేస్తాడు అని మనం అనుకునేలోపే ఇళయరాజా పాట ‘ఎన్ ఇనియ పొన్నిలావే’ కొంచెం ప్లే చేసి ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
ఇళయరాజాతో నా అనుబంధం: రాజేంద్ర ప్రసాద్
-
ఆరోజు ఇళయరాజా విషయంలో నన్ను చాలా తప్పు పట్టారు
-
ఆ విషయంలో నా భార్యకి కూడా టైం కేటాయించను
-
నా సంగీత జీవితంలో తెలుగు భాష చాలా గొప్పది
-
SP బాలసుబ్రహ్మణ్యం తో సహా ఏ సింగర్ ని మెచ్చుకోలేదు..నా జీవితంలో..!
-
నా సంగీత జీవితానికి ముగింపు లేదు: ఇళయరాజా
-
కెరీర్ బిగినింగ్ లో గిటారిస్ట్ గా పనిచేశాను
-
నేను పాడొద్దు అంటూ ఇళయరాజా గారు నిషేధం చేశారు
-
సాక్షి అగర్వాల్ కొత్త మూవీ .. సరికొత్త కాన్సెప్ట్తో!
సాక్షి అగర్వాల్ రాజా రాణి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ సాక్షి అగర్వాల్. ఆ తర్వాత తమిళం, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించింది. తాజాగా సాక్షి అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సారా. ఈ మూవీ షూటింగ్ వినాయక చవితి సందర్భంగా చైన్నెలోని ఇళయరాజా రికార్డింగ్ స్టూడియోలో ప్రారంభించారు. విజయ్ విశ్వ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో యోగిబాబు, రోబో శంకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఆర్.విజయలక్ష్మి, చెల్లమ్మాళ్ గురుస్వామి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రజిత్ కన్నా దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీక్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు సంగీత దర్శకుడు ఇళయరాజా ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు అందించారు. (ఇది చదవండి: చంద్రబాబు అరెస్ట్.. స్టార్ హీరో సంబరాలు!) తనకి అవకాశాన్ని కల్పించిన దర్శకుడికి సాక్షి అగర్వాల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రం సరికొత్త అనుభవాన్నిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్తీక్రాజా సంగీత దర్శకత్వంలో నటించడం గర్వంగా ఉందని నటుడు విజయ్ విశ్వ పేర్కొన్నారు. చిత్ర దర్శకకుడు వివరాలను తెలుపుతూ క్లిష్టమైన పరిస్థితుల్లో ఒక యువతి తన కోసం అన్ని వదులుకొని వచ్చిన ప్రేమికుడిని కాపాడుతుందా? లేక తన కోసం త్యాగం చేసిన స్నేహితుడిని కాపాడుతుందా? అన్న ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రమని తెలిపారు. హీరోయిన్ ఇతివృత్తంతో యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు కచ్చితంగా మంచి అనుభూతిని కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. -
31 ఏళ్ల తర్వాత వారిద్దరి కాంబోలో మరో సినిమా!
తమిళ సినిమా: లెజెండరీ దర్శకుడ భారతీరాజా, సంగీత దర్శకుడు ఇళయరాజా 31 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక చిత్రంలో కలిసి పని చేయడం విశేషం. వీరి కాంబినేషన్లో చివరిగా నాడోడి తెండ్రల్ చిత్రం వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు దర్శకుడు సుశీంద్రన్ తన వెన్నెల ప్రొడక్షనన్స్ పతాకంపై నిర్మిస్తున్న మార్గళి తింగల్ చిత్రంతో ఈ మ్యాజిక్ జరిగింది. ఈ చిత్రం ద్వారా దర్శకుడు భారతీరాజా వారసుడు, నటుడు మనోజ్ భారతీరాజా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన తాజ్ మహల్ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించిన మనోజ్ మెగా ఫోన్ పట్టి తొలి ప్రయత్నంలోనే తన తండ్రిని డైరెక్ట్ చేయడం విశేషం. భారతీరాజా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో పలువురు నూతన నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. దీని గురించి దర్శకుడు సుశీంద్రన్ తెలుపుతూ నటుడు మనోజ్ భారతీరాజాను తన చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అదనపు బలం అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇటీవల ఈ చిత్రం పాటల రికార్డింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలి చిత్రంతోనే తన తండ్రి భారతీరాజాను డైరెక్ట్ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని మనోజ్ పేర్కొన్నారు. -
ఇళయరాజా బయోపిక్.. ఛాన్స్ కొట్టేసిన ఆ స్టార్ హీరో
ఇళయరాజా.. ఈ పేరు సంగీతానికి చిరునామా. చాలా భాషల్లో పనిచేసిన సంగీతజ్ఞాని. ఈయనలో అద్భుత గాయకుడు, గీతరచయిత ఉన్నారు. మాస్ట్రో ఇళయరాజాది సంగీతంలో సింపోని చేసిన ఘనత. ఇప్పటికే 1400 చిత్రాలకు పైగా పనిచేసి చరిత్ర సృష్టించారు. అలాంటిది ఈయన జీవిత చరిత్రని సినిమా తీస్తే.. అవును మీరు విన్నది నిజమే. ఇప్పుడీ ఈ ఆలోచన బాలీవుడ్ ప్రముఖ దర్శకుడికి వచ్చింది. (ఇదీ చదవండి: నా మనసులో ఉన్నది అతడే.. ఆల్రెడీ పెళ్లి!: రష్మిక) హిందీలో పలు చిత్రాలు తీసి ప్రేక్షకుల్ని అలరిస్తున్న డైరెక్టర్ బాల్కీ.. ఇప్పటికే హీరో ధనుష్తో 'షమితాబ్' సినిమా తీశారు. ఇందులో బిగ్బీ అమితాబ్ కూడా నటించారు. అలానే బాల్కీతో నటుడు ధనుష్కు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఈ క్రమంలోనే సంగీత దర్శకుడు ఇళయరాజాగా ధనుష్ని చూడాలని బాల్కీ ఆశపడుతున్నారు. ఇళయరాజా బయోపిక్ తీయాలనుకుంటున్నా, ఇది తన డ్రీమ్ అని రీసెంట్గా ఓ మీటింగ్లో చెప్పుకొచ్చారు. ఇందులో ఇళయరాజాగా నటుడు ధనుష్తో యాక్ట్ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ధనుష్ కూడా మంచి సింగర్, లిరిక్ రైటర్, డైరెక్టర్, నిర్మాత అన్న విషయం తెలిసిందే. అలానే ఇళయరాజాగా నటించేందుకు ధనుష్ ఆసక్తితో ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్) -
ఇళయరాజా గారిని చూస్తే ఇప్పటికి భయం..
-
ప్రేమమ్ దర్శకుడు కొత్త సినిమా, హిట్ కోసం వెయిటింగ్!
దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రన్ 2015లో తెరకెక్కించిన సూపర్ హిట్ మలయాళ చిత్రం ప్రేమమ్. ఈ ఒక్క చిత్రంతో నటుడు నివీన్ బాలి, సాయిపల్లవి, మడోనా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్లకు మంచి సినీ జీవితం ఇచ్చాడు ఆల్ఫోన్స్. అంతకుముందు ఇతడు తమిళంలో నేరం అనే సక్సెస్ఫుల్ చిత్రాన్ని చేశారు. ప్రేమమ్ చిత్రం తరువాత చాలా గ్యాప్ తీసుకుని గత ఏడాది పృథ్వీరాజ్, నయనతార జంటగా గోల్డ్ అనే చిత్రాన్ని రూపొందించారు. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. తాజాగా దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రన్ మరో చిత్రానికి సిద్ధమయ్యారు. దీనికి గిఫ్ట్ అనే టైటిల్ను నిర్ణయించారు. ఈ చితత్రానికి ఆయన కథ, కథనం మాటలు ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించడం విశేషం. రోమియో పిక్చర్స్ పతాకంపై రాహుల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నృత్య దర్శకుడు శాండి, నటి కోవైసరళ, సహానా సర్వేశ్, నటి మహాలక్ష్మి, సంపత్రాజ్, రాహుల్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంగీతజ్ఞాని ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. వైవిధ్యభరితమైన ప్రేమ కథతో తెరకెక్కిస్తున్న ఇందులో 7 పాటలు ఉండబోతున్నాయట. గిఫ్ట్ చిత్రం ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటోందని యూనిట్ వర్గాలు తెలిపాయి. చదవండి: టాప్ హీరోతో ఒకే ప్లేట్లో భోజనం చేసిన స్నేహితులు -
ఇళయారాజా బర్త్డే.. ఇంటికి వెళ్లి మరీ విష్ చేసిన తమిళనాడు సీఎం
సంగీతాన్ని నవరసాల్లో నాట్యం చేయించే రారాజు ఇళయరాజా. సంగీతానికి రాళ్లను కరిగించే శక్తి ఉంటుందంటారు. ఇళయరాజా సంగీతంలో అంత మాధుర్యం ఉంటుంది. 80 వసంతాల ఇళయరాజా నేటికీ సంగీత రారాజుగానే కొనసాగుతున్నారు. శుక్రవారం ఆయన 80వ పుట్టినరోజు. ఇది సంగీతానికే జన్మదినం అన్నంతగా సంగీత ప్రియులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ సంగీత జ్ఞానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా ఇళయరాజా ఇంటికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు అందించి శాలువాతో సత్కరించారు. స్టాలిన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో.. తొలిపొద్దు మధురంగా మారడానికి, ప్రయాణాలు సుఖవంతం కావడానికి, ఆనందమయం కావడానికి, కష్టాలు గాలిలో కలిసిపోవడానికి, రాత్రులు ప్రశాంతమయం కావడానికి కారణం సంగీత జ్ఞాని ఇళయరాజానే. ఆయన మన హృదయాలను రంజింపజేస్తున్నారు. తమిళ చిత్ర సీమకు మాత్రమే కాకుండా సంగీత ప్రపంచానికే ఆయన ఒక విప్లవం. అందుకే కరుణానిధి ఆయనను సంగీత జ్ఞాని అని కొనియాడారు. ఆయన సంగీతానికి మైమరచిపోయే అభిమానుల్లో ఒకరినైన నేను ఆ గొప్ప కళాకారుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపడానికి ఆనందిస్తున్నాను. మా హృదయాల్లో కోట కట్టి, జెండా నాటిన మీరు ఎప్పటికీ రాజానే, శతాధిక వసంతాలు దాటిన ఇళయరాజానే‘ అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. నటుడు కమల్ హాసన్ సైతం ఇళయారాజాకు ట్విటర్లో విష్ చేశారు. ‘సినీ సంగీతం 8 దశాబ్దాలు అధిగమించి సంతోషంగా కొనసాగుతోంది. ఇళయరాజా అనే ఐదు అక్షరాలు భారతీయ సినీ సంగీతంలో అపూర్వస్వరాలు అనేంతగా తన సంగీత సింహాసనాన్ని ఏర్పరచుకున్న తన ప్రియమైన, అన్నయ్య ఇళయరాజాకు హ్యాప్ బర్త్డే' అని పేర్కొన్నారు. చదవండి: విషమంగా పంచ్ ప్రసాద్ ఆరోగ్యం -
నా కొడుక్కి 17 ఏళ్లు, ఓ రోజు సడన్గా నా దగ్గరకు వచ్చి: కేటీఆర్
'మ్యూజిక్ స్కూల్ సినిమా డైరెక్టర్, నిర్మాత పాపారావు బియ్యాల నాకు మంచి మిత్రుడు, తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇక్కడే పని చేశారు. పాపారావు సినిమా తీశారనగానే చాలా ఆశ్చర్యపోయా. పేరెంట్స్ తమ పిల్లలు ఇంజనీర్, లేదంటే డాక్టర్ కావాలనుకుంటున్న ధోరణిని సినిమాలో చూపించారు. మనకు కావాల్సింది ఇంజనీర్లు మాత్రమే కాదు ఆర్టిస్టులు కూడా' అన్నారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. శ్రియ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మ్యూజిక్ స్కూల్. శర్మన్ జోషి, ప్రకాశ్ రాజ్, నటి లీలా సామ్సన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ నెల 12న విడుదల కానుంది. శనివారంనాడు హైదరాబాద్లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 'నా కొడుక్కి 17 సంవత్సరాలు. మూడు నెలల కిందట సడన్గా ఒక రోజు నా దగ్గరకు వచ్చి ఓ సాంగ్ పాడాను, రిలీజ్ చేస్తున్నా అని చెప్పడంతో ఆశ్చర్యపోయా. చాలామందిలో హిడెన్ టాలెంట్ ఉంటుంది. మనం వాటిని తొక్కేయకుండా ఎంకరేజ్ చేయాలి. ఇళయరాజా గారు తెలంగాణలో మ్యూజిక్ ఇండస్ట్రీ పెట్టాలి' అన్నారు. ఇళయరాజా మాట్లాడుతూ.. 'మ్యూజిక్ ఉంటే వైలెన్స్ ఉండదు, చీటింగ్ ఉండదు. మ్యూజిక్ ఉంటే లక్ష్మి ఉంటుంది, సరస్వతి ఉంటుంది. కేటీఆర్ చెప్పినట్టు మ్యూజిక్ యూనివర్సిటీ వస్తే ఇక్కడ 200 మంది ఇళయరాజాలు తయారు అవుతారు. దేశం మొత్తం కూడా ఇక్కడ పర్ఫామెన్స్ ఇస్తారు' అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రియ, దిల్ రాజు, జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
ఇళయరాజా కుటుంబంలో తీవ్ర విషాదం
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఇళయరాజా అన్నయ్య కొడుకు పావలర్ శివన్ (60) మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు. ఇళయరాజా అన్నయ్య పేరు పావలర్ వరదరాజన్. ఈయన గాయకుడు, గీత రచయిత, సంగీత దర్శకుడు, నాటక రచయిత.. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆరంభ కాలంలో ఇళయరాజా ఎదుగుదలలో ఈయన పాత్ర ఉంది. పావలర్ వరదరాజన్ 1973లో కన్నుమూశారు. ఈయన ఇద్దరు కొడుకులు ఒకరు 2020లో కిడ్నీ సమస్య కారణంగా మరణించారు. కాగా మరో కొడుకు పావలర్ శివన్. ఈయన గిటార్ వాయిద్య కళాకారుడు. ఇళయారాజా సంగీత బృందంలోనే కొనసాగుతూ వచ్చారు. పావలర్ శివన్ రెండు మూడు చిత్రాలకు సంగీత దర్శకుడుగా కూడా పని చేశారు. ఈయన కుటుంబ సభ్యులతో కలిసి పాండిచ్చేరిలో నివసిస్తున్నారు. కాగా మంగళవారం వేకువజామున అనూహ్యంగా గుండెపోటు కారణంగా మంచంపై నుంచి కిందకి పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మృతికి సంగీత దర్శకులు, పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: కమల్, వాణి గురించి చెప్పినా శ్రీవిద్య వినలేదు, పాపం! -
ఇళయరాజా అరుదైన ఫొటోలు.. చూశారా
-
మాస్ట్రో ఇళయరాజాకు ఘనంగా సన్మానం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో "ట్రిబ్యూట్ టు ఇళయరాజా " మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించారు. ఆదివారం ఇళయరాజా లైవ్ కన్సర్ట్ జరగనున్న నేపథ్యంలో శనివారం "ట్రిబ్యూట్ టు ఇళయరాజా" ఈవెంట్ సాయంత్రం 6:30 నుంచి 10.00 గంటల వరకు రెడ్ కార్పెట్ ఈవెంట్ కార్యక్రమం కొనసాగింది. హైదరాబాద్ టాకీస్ వారి ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరిగింది. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన సినిమాలలోని అలనాటి మధురమైన పాటలను ఆయన ముందే గాయనీ గాయకులు వీనులవిందుగా ఆలపించారు. ఇళయరాజా పాటలు శ్రోతలను ఉర్రూతలూగించాయి. అనంతరం ఇళయరాజాకు సన్మానం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితుల ఆశీర్వచనాలతో సత్కరించారు. ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, గాయనీగాయకులు ఇళయరాజాను శాలువాతో సన్మానించారు. దర్శకుడు కోదండరామిరెడ్డి, నిర్మాత అశ్వినీదత్, సంగీత దర్శకులు మణిశర్మ, ఆర్.పీ.పట్నాయక్, పాటల రచయిత హరి రామజోగయ్య శాస్త్రి, నిర్మాత సి.కళ్యాణ్, నటుడు మురళీమోహన్, ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్, గాయని సునీత, నటుడు రఘుబాబులు ఇళయరాజాను సన్మానించారు. ఇళయరాజా 80 ఏళ్ల వయసులోకి అడుగుపెడుతున్న సందర్బంగా 80 ఏళ్ల లోగోను ప్రముఖ రచయితా విజయేంద్రప్రసాద్ రిమోట్తో ఆవిష్కరించారు. కమ్మని సంగీతం..ఎంత విన్నా...వినాలనిపించే సాహిత్యం ఇళయరాజా పాటల్లో ఉంటుందని అని సినీ ప్రముఖులు కొనియాడారు. -
హైదరాబాద్: ట్రాఫిక్ అలర్ట్.. ఆ రూట్లలో వెళ్లకపోవడమే మంచిది!
సాక్షి,గచ్చిబౌలి(హైదరాబాద్): గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపు, భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా లైవ్ కన్సర్ట్కు 17,520 మంది హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందన్నారు. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి జంక్షన్కు వచ్చే వాహనాలను హెచ్సీయూ బస్ డిపో వద్ద ఎస్ఎంఆర్ వినయ్సిటీ, మసీద్బండ, బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి వైపు వెళ్లాల్సి ఉంటుంది. గచ్చిబౌలి సర్కిల్ నుంచి లింగంపల్లికి వెళ్లే వాహనాలు బొటానికల్ గార్డెన్, మసీద్బండ, హెచ్సీయూ బస్ డిపో వైపు వెళ్లాల్సి ఉంటుందన్నారు. రాయదుర్గం నుంచి లింగంపల్లి వైపు వచ్చే వాహనాలను ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి గోపీచంద్ అకాడమీ, విప్రో సర్కిల్, క్యూసిటీ, గోపన్పల్లి, నల్లగండ్ల ఫ్లై ఓవర్ నుంచి వెళ్లాలన్నారు. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి జంక్షన్, గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు భారీ వాహనాల రాకపోకలపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. ట్రక్కులు, లారీలు, వాటర్ ట్యాంకర్లు, డీసీఎంలు, ఆర్ఎంసీ వాహనాలపై ఆంక్షలు ఉంటాయన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. చదవండి: లవర్ విషయంలో ఇంజనీరింగ్ విద్యార్థుల మధ్య గొడవ.. మందు తాగుదామని రూమ్కి పిలిచి దారుణంగా.. -
సంగీతం నా కన్నబిడ్డతో సమానం: ఇళయరాజా
సాక్షి, సిటీబ్యూరో: సంగీతం పట్ల తనకు సొంత బిడ్డల్ని తీర్చిదిద్దే క్రమంలో ఉండే శ్రద్ధతో సమానం అని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. మంగళవారం నగరంలోని టీ హబ్ ఫేజ్– 2లో తన అభిమానులు నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇళయరాజా మాట్లాడుతూ.. ఓ తల్లి తన పిల్లలకు ఆహారం అందించే ముందు తాను రుచి చూసి ఎలా అందిస్తుందో.. అలాగే తన ఫ్యాన్స్కు సంగీతాన్ని ఇస్తానన్నారు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ సంగీతకారుడికి తెలియాల్సింది టెక్నాలజీ కాదని టెక్నిక్ అని స్పష్టం చేశారు. చదవండి: ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన సునీత -
శివాజీ గణేషన్ను ఇండస్ట్రీ పట్టించుకోలేదు: ఇళయరాజా షాకింగ్ కామెంట్స్
సాక్షి, చెన్నై: దివంగత నటుడు శివాజీ గణేషన్ను చిత్ర పరిశ్రమ, ప్రభుత్వం తగిన రీతిలో సత్కరించలేదని సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. ప్రముఖ రచయిత మరుదు మోహన్ నటుడు శివాజీ గణేషన్ గురించి రాసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం చెన్నైలో జరిగింది. దర్శకుడు భారతి రాజా, కే.భాగ్యరాజ్, సంగీత దర్శకుడు ఇళయరాజా, రచయిత ముత్తులింగం, నటుడు ప్రభు, రాంకుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై ఇళయరాజా మాట్లాడుతూ.. శివాజీ గణేషన్ నుంచి తాను నేర్చుకున్న అనేక విషయాల్లో కాలం ఒకటని పేర్కొన్నారు. క్రమశిక్షణలో ఆయనకు మించిన వారు మరొకరు ఉండరన్నారు. తన కారు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు స్టూడియో ముందు ఆగుతుందన్నారు. ఒకసారి తాను ఆలస్యంగా రావడంతో ఏమిటి రాసా నువ్వు కూడానా అని శివాజీ గణేషన్ తనను అడిగారన్నారు. రికార్డింగ్ స్టూడియోలో ఆయన తన అనువాభవాలను పంచుకునే వారని చెప్పారు. ఒకసారి సినీ పరిశ్రమ తరపున శివాజీ గణేషన్కు అభినందన సభ జరిగిందన్నారు. ఆయనకు ఒక కానుక అందించాలని నిర్ణయించామన్నారు. అందుకు తగిన నగదును పరిశ్రమ వర్గాల నుంచి వసూలు చేసినట్లు చెప్పారు. నటీనటులు తినే భోజనంలో ప్రతి బియ్యం గింజ పైనా శివాజీ గణేషన్ పేరు ఉంటుందన్నారు. దీంతో ఆయనకు ప్రదానం చేసే జ్ఞాపికపై ఎవరి పేర్లు ఉండరాదని, దానికి అయ్యే ఖర్చును తానే ఇస్తానని చెప్పానన్నారు. ఆ విషయం తెలిసి శివాజీ గణేషన్ ఎవరిని మరిచినా ఇళయరాజాను మరవకూడదని అన్నారన్నారు. శివాజీని సినిమా పెద్దలు గాని, ఏ ప్రభుత్వం తగిన విధంగా సత్కరించలేదని, అయితే వ్యక్తిగతంగా ఎవరైనా చేశారంటే అది ఈ ఇళయ రాజానే అని పేర్కొన్నారు. చదవండి: మొత్తం బిగ్బాస్ ద్వారా రేవంత్ ఎంత సంపాదించాడో తెలుసా? అందుకే సీతారామంకు తెలుగు వారిని తీసుకోలేదు: హను రాఘవపూడి -
7 గంటలపాటు ఎయిర్పోర్ట్లో ఇళయరాజా పడిగాపులు
ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన సంగీత జ్ఞాని ఇళయరాజా ఎప్పటిలానే తన చిత్రాలతో, సంగీత కచేరీలతో బిజీగా ఉంటున్నారు. తాజాగా అంగేరి దేశంలో నిర్వహించనున్న సంగీత కచేరిలో పాల్గొనేందుకు దుబాయ్కి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం వేకువ జామున రెండు గంటలకు విమానం చెన్నై నుంచి దుబాయ్కి బయలుదేరనుండటంతో ఇళయరాజా అంతకుముందే చెన్నై విమానాశ్రయం చేరుకున్నారు. అయితే శనివారం రాత్రి వర్షం కారణంగా విమానయానాలకు అంతరాయం కలిగింది. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి చెన్నైకు రావాల్సిన విమానాలు బెంగుళూరు, హైదరాబాద్ తదితర విమానాశ్రయంలో ల్యాండ్ కావలసిన పరిస్థితి. అదే విధంగా ఇళయరాజా పయనించాలని దుబాయ్కి వెళ్లే విమానం బయలుదేరడంలో చిక్కులు ఏర్పడ్డాయి. దుబాయ్కి వెళ్లే విమానం కొంత ఆలస్యంగా చెన్నైకు చేరుకుంది. అయితే రన్వేలో నీరు చేరుకోవడంతో విమానం బయలుదేరడానికి మరో మూడు గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆ తరువాత ఆకాశం మేఘాలు కమ్ముకోవడంతో మరో రెండు గంటలు అంతరాయం ఏర్పడింది. ఇలా ఏడు గంటల పాటు ఇళయరాజా చెన్నై విమానాశ్రయంలోనే ఉండిపోయారు. చదవండి: పబ్లిక్గా నటికి ముద్దులు.. అమ్మ చూస్తే ఏమంటుందోనంటున్న నటుడు డేటింగ్ చేసిన వ్యక్తే భర్తగా.. రెండోసారి పిల్లల్ని కనాలంటేనే భయం.. -
ఆటా వేడుకలు: ముచ్చటగా మూడు రోజులు సందడే సందడి
వాషింగ్టన్ డీసీ వేదికగా జరగబోతున్న 17వ అమెరికన్ తెలుగు అసొసియేషన్ మహాసభలు ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు తన వేడుకలకు రంగం చేసింది. మొత్తం మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఏ రోజు ప్రత్యేకత దానికే ఉంది. ఆ వివరాలు.. జులై 1 మొదటి రోజు కన్వెన్షన్ సెంటర్లోని గ్రాండ్ లాబీలో వెల్కం రిసెప్షన్తో వేడుకలు ప్రారంభమవుతాయి. ప్రముఖ గేయరచయిత చంద్రబోస్ స్వరపరిచిన ప్రారంభోత్సవ గీతాన్ని గాయకులు కొమాండూరి రామాచారి ఆలపిస్తారు. అదే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వేర్వేరు రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన తెలుగు ప్రముఖులకు అమెరికన్ తెలుగు అసొసియేషన్ అవార్డులందించనుంది. బాంకెట్ వేడుకల్లో సింగర్ రామ్ మిరియాల స్పెషల్ మ్యూజిక్ నైట్తో అలరించబోతున్నారు. జులై 2 రెండో రోజు ఉదయం నుంచే ఆటా పరేడ్ ప్రారంభం అవుతుంది. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా కళా ప్రదర్శనలకు ఏర్పాట్లు చేశారు. ఇదే రోజు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, యోగా గురు పద్మ విభూషణ్ సద్గురు జగ్గీ వాసుదేవన్ అతిథులతో మాట్లాడనున్నారు. అలాగే ఆటా కన్వెన్షన్లో భాగంగా హార్ట్ఫుల్నెస్ సంస్థ రామచంద్రమిషన్ వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటికే 75 ఏళ్లు పూర్తి చేసుకున్న రామచంద్రమిషన్ డైమండ్ జూబ్లీ సెలబ్రెషన్స్ నిర్వహిస్తారు. రెండో రోజు సాయంత్రం సంగీత దర్శకులు ఎస్.థమన్ నేతృత్వంలో విభావరి ఏర్పాటు చేశారు. జులై 3 మూడో రోజు ఉదయం తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి కళ్యాణం నిర్వహించనున్నారు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అమెరికా చేరుకున్నారు. శ్రీనివాసుడి కళ్యాణంలో భాగంగా ప్రముఖ నేపథ్య గాయకులు పద్మశ్రీ శోభారాజు, నిహాల్ కొండూరి ఆధ్యాత్మిక సంగీతంతో ఆహూతులను భక్తి పరవశ్యంలోకి తీసుకెళ్లనున్నారు. అదే రోజు సాయంత్రం గ్రాండ్ ఫినాలేలో భాగంగా ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా సంగీత విభావరి ఏర్పాటు చేశారు. ముగింపు వేడుకల్లో భాగంగా ఇళయరాజా తన 32 మంది ట్రూప్తో అతిథులను అలరించనున్నారు. దీంతో పాటు ఆహుతుల కోసం ప్రత్యేక ఎగ్జిబిషన్లు, వివిధ రకాల స్టాళ్లు, వేర్వేరు ఫుడ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆటా నిర్వహిస్తున్న ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు వచ్చిన అతిథులు.. ఎప్పటికీ మరిచిపోలేని విధంగా వేడుకలను డిజైన్ చేశారు. ఒకే వేదికపై అభివృద్ధి, సంస్కృతి, కళలు, ప్రజా సంబంధాలు, సెమినార్లు, వివాహా వేదికలు, మాటా ముచ్చట్లు.. చెప్పుకుంటూ పోతే.. మూడు రోజులు వాషింగ్టన్ డిసిలో పండగ వాతావరణం ఏర్పాటు కానుంది. ఆటా వేదికగా ఆట-పాట భారతీయులకు క్రికెట్ అంటే ఎంత అభిమానమో అందరికీ తెలుసు. అందుకే ఆటా నిర్వాహకులు ఇద్దరు లెజెండ్ క్రికెట్ క్రీడాకారులను ఈ కన్వెన్షన్కు తీసుకొస్తున్నారు. టాప్ క్లాస్తో సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడిన సునీల్ గవాస్కర్, సిక్సర్ల మెరుపులతో అలరించే వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్.. యూత్ క్రికెట్ సరదాగా ఆడబోతున్నారు. అలాగే మరో లెజెండరీ ఆటగాడు కపిల్ దేవ్ కూడా కనువిందు చేయబోతున్నాడు. ఆటా సెలబ్రిటీ గోల్ఫ్ టోర్నమెంట్లో భాగంగా కపిల్ దేవ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, అమెరికన్ ప్రొఫెషనల్ గోల్ఫర్ సాహిత్ రెడ్డి తీగల ఆటా వేడుకల్లో సందడి చేయనున్నారు. ఈ వేడుకలకు టాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున సినీతారలు విచ్చేస్తున్నారు. హీరోలు అడవి శేషు, డైరెక్టర్లు శేఖర్ కమ్ముల, అర్జున్రెడ్డి ఫేం సందీప్ వంగా, హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, నివేదా థామస్, డాన్స్ డైరెక్టర్ శేఖర్ మాస్టర్, వీజే సన్నీ, సింగర్ రాం మిరియాల, సింగర్ మంగ్లీ.. ఇంకా పలువురు ప్రముఖులు వేడుకలకు వస్తున్నారు. సాహితీ వేత్తలు జొన్నవిత్తుల రాంజోగయ్య శాస్త్రి, సీనియర్ నటులు తనికెళ్ల భరణి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ అష్టవధానంతో అలరించబోతున్నారు. - వాషింగ్టన్ డీసీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
ఇళయ మారుతం
ఇటీవల విడుదలైన ‘అంబేడ్కర్ అండ్ మోదీ– రిఫార్మర్స్ ఐడియాస్, పెర్ఫార్మర్స్ ఇంప్లిమెంటేషన్ అనే పుస్తకానికి రాసిన ‘ముందుమాట’ లో ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా మోదీని అంబేడ్కర్తో పోల్చి తాజా వార్తల్లోకి వచ్చారు. ‘‘దేశాభివృద్ధి, పరిశ్రమల రంగం, సామాజిక న్యాయం, మహిళాభ్యున్నతి వంటి వాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అంబేద్కర్ ఆలోచనలను అనుసంధానం చేసే అంశాలకు అధ్యయనంలా ఈ పుస్తకం ఉంది. ప్రధాని మోదీ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’ ఎన్నో రికార్డులను సృష్టించింది. సామాజిక న్యాయం కోసం ప్రధాని మోదీ అనేక చట్టాలను అమలుచేస్తున్నారు. ప్రధాని మోదీకి, అంబేడ్కర్కు అనేక విషయాల్లో పోలికలు ఉన్నాయి’’ అని ఇళయరాజా ఆ ముందుమాటలో రాశారు. ఇళయరాజా స్వాతంత్య్రానికి పూర్వం 1943 లో తమిళనాడులోని పన్నైపురంలో జూన్ 2న జన్మించారు. దళిత కుటుంబం నుంచి వచ్చిన ఇళయరాజా స్వయంకృషితో ఎదిగిన మహోజ్వల సంగీతకారులలో ఒకరిగా గుర్తింపు పొందారు. -
Ilayaraja: వివాదంలో ఇళయరాజా.. మోదీపై కీలక వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై : సంగీత దర్శకుడు ఇళయరాజా వివాదాల్లో చిక్కుకున్నారు. ఇళయరాజా.. ప్రధాని మోదీ గురించి రాసిన ఒక పుస్తకానికి ముందు మాట రాశారు. ఇందులో మోదీని డాక్టర్ అంబేడ్కర్తో పోల్చారు. ఇదే ఇప్పుడు వివాదానికి దారి తీసింది. ఇళయరాజా వ్యాఖ్యలను కొందరు ఖండిస్తున్నారు. ఇళయరాజా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఎంపీ పదవి కోసమే మోదీ భజన చేస్తున్నారని విమర్శి స్తున్నారు. ఈ విషయంపై ఇళయరాజా సోదరుడు, బీజేపీ సభ్యుడు గంగై అమరన్ స్పందిస్తూ.. అందరిలాగే ఇళయరాజా కూడా తన భావాలను వ్యక్తం చేశానని చెప్పారన్నారు. తన మాటల్లో తప్పు లేదనీ, అందుకు ఎలాంటి విమర్శలు ఎదురైనా తాను ఎదుర్కొంటానన్నారని, అదేవిధంగా తాను బీజేపీలో చేరలేదని, తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని చెప్పారని స్పష్టం చేశారు. ఇళయరాజా వ్యాఖ్యలపై ఆయన కొడుకు, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా స్పందిస్తూ.. కరుప్పు ద్రవిడన్ గర్వించదగ్గ తమిళన్ అని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
ఆయన కోరారు.. ఈయన ఓకే అన్నారు..
సాక్షి, చెన్నై: సంగీతజ్ఞాని ఇళయరాజా, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ దుబాయ్లో కలిశారు. ఈ సందర్భంగా ఇళయరాజా ముందు ఏఆర్ రెహమాన్ తన కోరికను వ్యక్తం చేశారు. అంతే వెంటనే ఇళయరాజా కూడా పచ్చజెండా ఊపేశారు. ఆ ముచ్చటేంటో చూద్దాం.. సంగీత దర్శకుడు ఇళయరాజా ఇటీవల దుబాయ్ ఎక్స్పో కార్యక్రమంలో భారీ సంగీత విభావరిని నిర్వహించారు. ఈ కార్యక్రమం ఈనెల 5వ తేదీన ముగిసింది. దీంతో ఆయన అక్కడ ఏఆర్ రెహమాన్కు చెందిన ఫిర్ధోస్ రికార్డింగ్ స్టూడియోకు వెళ్లారు. ఇళయరాజాను.. రెహమాన్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి దిగిన ఫొటోను రెహమాన్ తన ట్విట్టర్లో పోస్ట్ చేసి మ్యాస్ట్రో ఇళయరాజాను ఫిర్ధోస్ స్టూడియోస్కు ఆహ్వానించడం సంతోషంగా ఉందని, భవిష్యత్లో ఆయన తమ స్టూడియోలో రికార్డింగ్ చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన పోస్ట్కు స్పందించిన ఇళయరాజా త్వరలోనే దుబాయ్లోని ఏఆర్ రెహమాన్ స్టూడియోలో రికార్డింగ్ నిర్వహిస్తానని ట్విట్టర్ ద్వారా బదులిచ్చారు. Such a pleasure welcoming the Maestro @ilaiyaraaja to our Firdaus Studio... Hope he composes something amazing for our @FirdausOrch to play in the future! pic.twitter.com/oam4TJPL63 — A.R.Rahman (@arrahman) March 6, 2022 -
ఇళయరాజాకు అనుకూలంగా తీర్పు, వారందరికి షాక్!
సంగీత దర్శకుడు ఇళయరాజా పిటిషన్పై ఎకో, అగీ ఆడియో సంస్థలకు చెన్నై హైకోర్టు షాక్ ఇచ్చింది. వివరాలు.. ఇళయరాజా సంగీతంలో రూపొందిన పాటలను సీడీ, క్యాసెట్ రూపంలో విక్రయించడానికి ఎకో, అగి రికార్డింగ్ కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే ఒప్పందం కాలం ముగిసినా రెన్యువల్ చేయకుండా ఆ సంస్థలు తన పాటలను విక్రయిస్తుండడంతో ఇళయరాజా ఆ సంస్థలపై 2017లో మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఎకో, అగి ఆడియో సంస్థలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఇళయరాజా మరోసారి అప్పీలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. అందులో ఒప్పంద కాలం పూర్తి అయిన తరువాత ఇళయరాజా పాటలను ఎకో, అగి రికార్డింగ్ సంస్థలు వాణిజ్యం చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఆడియో సంస్థలు బదులు పిటిషన్ వేసుకోవచ్చని పేర్కొంది. తదుపరి విచారణను మార్చి 31వ తేదికి వాయిదా వేసింది. కాగా చాలా కాలంగా మనస్పర్థల కారణంగా దూరంగా ఉన్న ఇళయరాజా, ఆయన సోదరుడు గంగై అమరన్ ఇటీవల అనూహ్యంగా కలుసుకోవడం విశేషం. -
అంతరిక్షంలో మారుమోగనున్న ఇళయరాజా సంగీతం
ప్రముఖ సంగీత సందర్శకుడు ఇళయరాజా సంగీతం అంతరిక్షంలోనూ మారుమోగనుంది. అవును ఇది నిజం. తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థుల బృందం అత్యంత చిన్న శాటిలైట్ తయారు చేస్తోంది. దీనిని భారతదేశ 75వ స్వతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఆగస్టు 15న నాసా సహకారంతో అంతరిక్షంలోకి పంపనున్నారు. విశేషమేమిటంటే ఈ శాటిలైట్లో.. మనదేశం గొప్పతనాన్ని తెలియజేస్తూ గీత రచయిత స్వనంద్ కిర్కిరే రాసిన హిందీ పాటను వినిపించనున్నారు. కాగా ఈపాటకు ఇళయరాజా బాణీలు కట్టడానికి అంగీకరించడం, తమిళ వెర్షన్ను ఆలపించడానికి కూడా సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అలా ఇళయరాజా సంగీతం ఆకాశ తరంగాలను మీటనుంది. -
నా కల నెరవేరింది: దర్శకుడు
తన కల ఇప్పటికి.. నెరవేరిందని దర్శకుడు సుశీగణేషన్ అన్నారు. ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన తాజాగా స్వీయ దర్శకత్వంలో 4వీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం వంజం తీర్తాయడా. 1980 ప్రాంతంలో మదురైలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. కాగా ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించడం విశేషం. దీని గురించి దర్శకుడు తెలుపుతూ తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించాలని ఆశించానన్నారు. అయితే అది జరగకపోయినా ఇన్నాళ్లకు తాను సొంతంగా నిర్మిస్తున్న చిత్రం ద్వారా ఆ కల నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. వంజం తీర్తాయడా చిత్రంలో సంగీతం ఒక పాత్రలా ఆద్యంతం ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. -
Ilaiyaraaja: రూమర్స్కు చెక్ పెట్టిన ఇళయరాజా
-
ఆ ఇద్దరి బయోపిక్స్లో నటిస్తా: ధనుష్
అక్షయ్ కుమార్, ధనుష్, సారా అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘ఆత్రంగి రే’. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 24 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రముఖ హిందీ షోలో పాల్గొన్న ధనుష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ‘బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోన్న ఈ సమయంలో మీరు ఎవరు బయోపిక్స్లో నటిస్తారు?’ అనే ప్రశ్నకు ధనుష్ బదులిస్తూ– ‘‘రజనీకాంత్, ఇళయరాజగార్లంటే ఎంతో ఇష్టం.. ఎనలేని అభిమానం. అవకాశం వస్తే వారిద్దరి బయోపిక్స్లో నటించాలని ఉంది’’ అని పేర్కొన్నారు. తమిళంలో దాదాపు అరడజను సినిమాలకు కమిటైన ధనుష్ తెలుగులో శేఖర్ కమ్ముల, వెంకీ అట్లూరి దర్శకత్వాల్లో నటించేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. -
మనసుకు బాధగా ఉంది మిత్రమా: ఇళయరాజా భావోద్వేగం
Ilayaraja Condolence To Sirivennela Sitarama Sastry: సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి హఠాన్మరణం దేశవ్యాప్తంగా ఉన్న సాహితీప్రియులను, చలన చిత్ర పరిశ్రమలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. పండితుల నుంచి సామాన్యుల వరకు సిరివెన్నెల సాహిత్యం ప్రభావితం చేయగా.. ఆయన మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకున్నారు. ఇప్పటికే సినీ, రాజకీయా ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. కాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సిరివెన్నెల మృతిపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. చదవండి: సిరివెన్నెలను వరించిన 11 నంది అవార్డులు.. ఆ పాటలు ఇవే.. కాగా ఇళయరాజా, సిరివెన్నెలు దశాబ్దాల పాటు పనిచేశారు. ఇళయరాజా స్వరాలకు సిరివెన్నెల సాహిత్యం తోడై అద్భుతం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దీంతో ఇళయరాజా మిత్రుడు సిరి వెన్నెలకు పదాలతో నీరాజనం తెలిపారు. ‘మా ఇద్దరి కలయికలో ఎన్నో పాటలు ప్రాణం పోసుకున్నాయని చెప్పారు. ఆయన పాటల పదముద్రలు తన హార్మోనియం మెట్లపై నాట్యం చేశాయని తెలిపారు. సినిమా పాటల్లో సైతం కవితాత్మని, కళాత్మకతని అందించి తనదైన ముద్రతో అర్థవంతమైన, సమర్థవంతమైన పాటలను అందించారని చెప్పారు. శ్రీ వేటూరి సహాయకుడిగా వచ్చి...అతి తక్కువ కాలంలో..శిఖర స్థాయికి చేరుకున్న సరస్వతీ పుత్రుడు... చదవండి: కళావెన్నెల, కళాతపస్విల బంధం.. వారి అంతరంగం మీకోసం సీతారాముడు పాటతో ప్రయాణం చేస్తాడు.. పాటతో అంతర్యుద్ధం చేస్తాడు.. పాటలో అంతర్మథనం చెందుతాడు.. పాటని ప్రేమిస్తాడు.. పాటతో రమిస్తాడు.. పాటని శాసిస్తాడు.. పాటని పాలిస్తాడు.. పాట నిస్తాడు.... ‘మన భావుకతకి భాషను అద్ది. మనకు తెల్సిన పాటలా చెవుల్లోకి ఒంపుతాడు... అందుకే సీతారాముడి పాటలు ఎప్పటికీ గుర్తుంటాయి.. తన సాహిత్యం నాతో ఆనంద తాండవం చేయించాయి. నాతో శివ తాండవం చేయించాయి.. ‘వేటూరి’ నాకు తెలుగు సాహిత్యం మీద ప్రేమను పెంచితే... ‘సీతారాముడు’ నాకు తెలుగు సాహిత్యం మీద గౌరవాన్ని పెంచాడు.. ధన్యోస్మి మిత్రమా..! ఇంత త్వరగా సెలవంటూ శివైక్యం చెందడం మనస్సుకు బాధగా ఉంది.. పాటకోసమే బ్రతికావు,బ్రతికినంత కాలం పాటలే రాశావు....ఆ ఈశ్వరుడు నీకు సద్గతిని ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అంటూ ఇళయరాజా సిరివెన్నెలకు అంతిమ వీడ్కోలు తెలిపారు. కాగా మహాప్రస్థానంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు ఈ రోజు(బుధవారం) మధ్యాహ్నం 2:26 గంటలకు ముగిశాయి. హిందూ సాంప్రదాయాల ప్రకారం వేద పండితులు అంతక్రియల పక్రియ జరిపారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి మహా ప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. అంతిమ యాత్రలో పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సహా అభిమానులు పాల్గొన్నారు. -
Son Of India: ‘జయ జయ మహావీర’ సాంగ్ వచ్చేసింది
డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ సంస్థలు నిర్మించాయి. తాజాగా సినిమా నుంచి తొలి పాటను విడుదల చేశారు. ‘జయ జయ మహావీర..’ అంటూ సాగే ఈ పాటని ప్రముఖ సింగర్ రాహుల్ నంబియార్ ఆలపించగా, మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. 11వ శతాబ్దపు ప్రసిద్ధ రఘువీర గద్యాన్ని పాట రూపంలో మలిచారు సంగీత దర్శకుడు ఇళయరాజా. ఈ పాటను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ షేర్ చేస్తూ ‘భారతీయ సినిమా పరిశ్రమలోని ఇద్దరు దిగ్గజాలు .. ప్రముఖ తెలుగు నటుడు ఎం మోహన్ బాబు, మాస్ట్రో ఇళయరాజా కలిసి రాముడి శౌర్యానికి నివాళులర్పించిన ‘రఘువీరా గద్యం’లోని సాంగ్ ‘జయ జయ మహావీర’ సాంగ్. ఆల్ ది బెస్ట్’ అంటూ ట్వీట్ చేశారు. -
ప్రముఖ చిత్రకారుడు ఇళయరాజా మృతి
చెన్నై: కరోనాతో చిత్రకారుడు ఇళయరాజా ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన వయసు 43 ఏళ్లు. కుంభకోణం సమీపంలోని సెంబియవరంబిల్ అనే గ్రామానికి చెందిన ఇళయరాజా చిత్రకారుడిగా మంచి పేరుగాంచారు. కరోనా వ్యాధి సోకడంతో ఇళయరాజా ఇటీవల చెన్నై, ఎగ్మోర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన మృతికి సీఎం స్టాలిన్, నటుడు దర్శకుడు పార్తిబన్, పా.రంజిత్ సంతాపం వ్యక్తం చేశారు. -
ఇళయరాజా సోదరుడికి సతీవియోగం
తమిళ సినిమా: సీనియర్ సంగీత దర్శకుడు గంగై అమరన్ భార్య మణిమేఖలై ఆదివారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. ఈమె వయసు 69 ఏళ్లు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడే గంగై అమరన్. సినీ దర్శకుడు, సంగీత దర్శకుడు, గాయకుడు, పాటల రచయిత అయిన గంగై అమరన్, మణిమేఖలై దంపతుల కొడుకులు దర్శకుడు వెంకట్ప్రభు, సంగీత దర్శకుడు, నటుడు ప్రేమ్జీ. కాగా వీరి తల్లి మణిమేఖలై ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను చెన్నై లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. ఈమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా కోలీవుడ్లో కరోనా మరణాలు ఆగడం లేదు. తాజాగా ఈ మహమ్మారి నటుడు జోకర్ తులసి, దర్శకుడు దయాళన్ను బలితీసుకుంది. చదవండి: కంటెస్టెంట్లకే షాక్: బిగ్బాస్ షో క్యాన్సిల్ -
మనవరాలికి సంగీత పాఠాలు
ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా తన మనవరాలికి సంగీత పాఠాలు నేర్పిస్తున్నారు. ఇళయరాజా తనయుడు యువన్శంకర్ రాజా కుమార్తె జియా యువన్ ఇటీవల తాత దగ్గర పియానో నేర్చుకుంటున్న వీడియో చాలామందిని ఆకట్టుకుంది. పియానోతో సరిగమలు ఎలా పలికించాలో మనవరాలికి నేర్పుతున్న దృశ్యాన్ని వీడియో తీసి, సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు యువన్. ఈ వీడియో చూసిన శ్రుతీహాసన్ , విజయ్ ఏసుదాసు, శ్వేతాపండిట్ వంటి వారు ‘చాలా బాగుంది’ అంటూ జియాని అభినందిస్తూ కామెంట్లు పెట్టారు. కాగా ఇళయరాజా ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ‘రంగమార్తాండ’ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందం, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆ సంగతలా ఉంచితే.. ఇళయరాజా వారసులుగా కుమారులు కస్తూరి రాజా, యువన్ శంకర్ రాజా, కుమార్తె భవతారిణి కూడా సంగీతప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఈ ముగ్గురూ సంగీతదర్శకులుగానే కాదు పాటలు కూడా పాడతారు. మరి.. ఇప్పుడు మనవరాలికి కూడా స్వరాలు నేర్పిస్తున్నారంటే ఇళయరాజా కుటుంబం నుంచి మరో మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ వచ్చే అవకాశం ఉందని ఊహించవచ్చు. -
శాశ్వతంగా తప్పుకున్న ఇళయరాజా
సాక్షి, చెన్నై: ప్రసాద్ స్టూడియో యాజమాన్యం, సంగీత దర్శకుడు ఇళయరాజా మధ్య కొన్నేళ్లుగా నడుస్తున్న వివాదానికి సోమవారం తెరపడింది. ఇళయరాజా కోసం ప్రసాద్ స్టూడియో యాజమాన్యం 1976లో ప్రత్యేక రికార్డింగ్ స్టూడియో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కొన్నేళ్ల క్రితం ఇరుపక్షాల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఖాళీ చేయాలని స్టూడియో యాజమాన్యం ఇళయరాజాను కోరింది. ఇందుకు ఇళయరాజా నిరాకరించారు. ఈ వివాదంపై రెండేళ్లుగా మద్రాసు హైకోర్టులో వాదోపవాదాలు నడుస్తున్నాయి. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని న్యాయస్థానం సూచించింది. అయితే స్టూడియోలోని తన సంగీత పరికరాలు, అవార్డులను తీసుకునేందుకు, ధ్యానం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఇళయరాజా న్యాయస్థానంలో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ప్రతిపాదనను మొదట వ్యతిరేకించిన స్టూడియో యాజమాన్యం ఆ తరువాత కొన్ని షరతులతో అంగీకరించింది. ఏదో ఒక రోజు ఉదయం 9 నుంచి సాయత్రం 4 గంటల వరకు ధ్యానం చేసుకుని సంగీత పరికరాలు తీసుకెళ్లేందుకు అనుమతించాలని యాజమాన్యాన్ని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఇళయరాజా సోమవారం ఉదయం ప్రసాద్ స్టూడియోకు వస్తారని ప్రకటన విడుదలైంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇళయరాజా, స్టూడియో తరఫు న్యాయవాదులు వచ్చారు. పరికరాలు తీసుకెళ్లేందుకు ఇళయరాజా రాకుండా సహాయకులను పంపారు. అయితే ఇళయరాజా వినియోగించే రికార్డింగ్ థియేటర్ తలుపులు పగులగొట్టి అందులోని పరికరాలను మరో గదిలోకి తరలించి ఉండడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ సమాచారాన్ని అందుకున్న ఇళయరాజ తీవ్ర మనస్తాపానికి గురై స్టూడియోకి రాలేదని ఆయన పీఆర్వో మీడియాకు తెలిపారు. వీడియోలో అన్ని దృశ్యాలు చిత్రీకరిస్తుండగా గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఇళయరాజా సహాయకులే సామగ్రిని తీసుకెళ్లారు. (చదవండి: తానే సీఎం అభ్యర్థి అంటున్న కమల్ హాసన్) -
ఇళయరాజాకు ఎందుకు అనుమతివ్వరు
చెన్నై:సుమారు 40 ఏళ్లకుపైగా తన చిత్రాలకు సంబంధించిన సంగీత కార్యక్రమాలు నిర్వహించిన ప్రసాద్ స్టూడియోలో ఒకరోజు ఇళయరాజాకు ధ్యానం చేసుకోవడానికి ఎందుకు అవకాశం ఇవ్వరని మద్రాసు హైకోర్టు ప్రసాద్ స్టూడియో నిర్వాహకులను ప్రశ్నించింది. సాలిగ్రామంలోని ప్రసాద్ స్టూడియోలో ఇళయరాజా కోసం నాలుగు దశాబ్దాల క్రితం ఒక రూమును ప్రత్యేకంగా కేటాయించారు. ఆ గదిలోనే ఇళయరాజా తన చిత్రాలకు సంగీత కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే గత ఏడాది ఆ గదిని వేరే కార్యక్రమానికి కేటాయించడంతో ఇళయరాజాని ఖాళీ చేయాల్సిందిగా స్టూడియో అధినేతలు ఒత్తిడి చేశారు. దీంతో ఇళయరాజా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సోమవారానికి వాయిదా వేశారు. -
చెన్నై: ఇళయరాజా, ఎల్వీప్రసాద్ స్టూడియో వివాదం
-
నన్ను బెదిరిస్తున్నారు : ఇళయరాజా
సాక్షి,చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా-ప్రసాద్ స్టూడియో వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఎల్వీ ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్పై లయ రాజా తాజాగా మరో కేసు నమోదు చేశారు. సాయి, అతని మనుషులు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, తద్వారా తన స్టూడియోను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఇళయరాజా ఆరోపించారు. ఈ మేరకు ఆయన మేనేజర్ జాఫర్ ఫిర్యాదు దాఖలు చేశారు. ('ఇళయరాజా కేసును రెండు వారాల్లో ముగించండి') ప్రసాద్ స్టూడియోలోని తన సూట్లోకి ప్రవేశించి మరీ సంగీత వాయిద్యాలు, నోట్లు, ఇతర పరికరాలను ధ్వంసం చేశారని చెన్నై కమిషనర్కు ఇచ్చిన ఫిర్యాదులో ఇళయరాజా పేర్కొన్నారు. అంతేకాదు తన విలువైన వస్తువులను అధిక మొత్తానికి విక్రయించుకున్నారని కూడా ఆరోపించారు. సాయి, అతని అనుచరులపై శాశ్వత ఆంక్షలు విధించాలని కోరుతూ సిటీ సివిల్ కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసినట్లు వివరించారు. ఈ కేసు పెండింగ్లో ఉండగానే తనపై దౌర్జన్యం చేసి, బలవంతంగా స్టూడియోను లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. అందుకే స్టూడియోలో తన కార్యక్రమాలకు అడ్డొస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో సాయి ప్రసాద్, అతని అనుచరులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఇళయరాజా డిమాండ్ చేశారు. కాగా చెన్నైలోని ప్రసాద్ స్టూడియోస్ స్థాపకుడు ఎల్వీ ప్రసాద్, ఇళయరాజాపై గౌరవంతో ప్రత్యేక గది ఉన్న స్టూడియో స్థలాన్ని బహుమతిగా ఇచ్చారు. ఇక్కడున్న రికార్డింగ్ స్టూడియోలోనే గత 40 సంవత్సరాలకు పైగా ఆయన తన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఎల్వీ ప్రసాద్ కుమారుడు రమేష్ ప్రసాద్ ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం చెప్పకపోగా, మనవడు సాయి ప్రసాద్ మాత్రం స్టూడియోను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. Veteran music composer #Ilaiyaraaja filed a complaint against Sai Prasad for tampering his musical instruments, notes and valuables by unlawfully entering into his recording studio #PrasadStudios pic.twitter.com/1LyAntffNL — Rajasekar (@sekartweets) July 31, 2020 -
'ఇళయరాజా కేసును రెండు వారాల్లో ముగించండి'
సాక్షి, పెరంబూరు: సంగీతదర్శకుడు ఇళయరాజా కేసు విచారణను రెండు వారాల్లోకి ముగించాలని చెన్నై మధ్యవర్తిత్వ కోర్టుకు మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇళయరాజా స్థానికి సాలిగ్రామంలోని ప్రసాద్ స్టూడియోలో తన చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నారు. గత 42 ఏళ్లుగా అదే స్టూడియోలో తన సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఇళయరాజాను ఇటీవల ఆ స్టూడియో అధినేత ఖాళీ చేయాల్సిందిగా చెప్పారు. అకస్మాత్తుగా ఖాళీ చేయమనడంతో ఇళయరాజా అందుకు అంగీకరించలేదు. ఈ విషయంలో దర్శకుడు భారతీరాజా, అమీర్, ఆర్కే.సెల్వమణి, కే.భాగ్యరాజ్ వంటి వారు ఇళయరాజా తరఫున ప్రసాద్స్టూడియో అధినేతతో చర్చలు జరిపే ప్రయత్నం చేశారు. అయితే అవి ఫలించలేదు. చదవండి: కమల్ థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం దీంతో ఇళయరాజా కోర్టును ఆశ్రయించారు. 17వ సహాయ నగర మధ్యర్తిత్వ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈయన పిటీషన్ను విచారించిన కోర్టు సామరస్య చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని ఆదేశించింది. సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇళయరాజా మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తన పిటిషన్లో ప్రసాద్ల్యాబ్లో తాను 42 ఏళ్లుగా సంగీత వాయిద్యాలతో పని చేస్తున్నానన్నారు. అక్కడ వెయ్యికి పైగా చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చానని, 6 వేలకు పైగా పాటలకు సంగీతాన్ని అందించానని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా తన చిత్రాల సంగీత పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇకపై కూడా అదే స్టూడియోలో ప్రశాంతంగా తనను పని చేసుకునేలా ఆదేశించాలని కోరారు. తనను ప్రసాద్ల్యాబ్ నుంచి బయటకు పంపాలన్న వాదనపై స్టే విధించాలని కోరారు. ఈ పిటిషన్ను శుక్రవారం మద్రాసు హైకోర్టు విచారణ జరిపింది. న్యాయమూర్తి భారతీదాస్ సమక్షంలో విచారణ జరిగింది. ఇళయరాజా పిటిషన్పై విచారణను రెండు వారాల్లో ముగించాలని 17వ సహాయ నగర మధ్యవర్తిత్వ కోర్టుకు ఆదేశాలు జారీ చేశారు. చదవండి: అనుష్క విషయంలో ఇదీ వదంతేనా? -
‘ఇళయరాజా నాకు తల్లి,తండ్రి’
తన చిత్రాలు కత్తిపై నడకలానే ఉంటాయి అని దర్శకుడు మిష్కిన్ పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే ఇతర దర్శకులు చిత్రాలకు భిన్నంగానే ఈయన చిత్రాలు ఉంటాయి. అంతేకాదు మిష్కన్ మాటలు, చేతలు అలానే ఉంటాయి. తొలి నుంచి తనదైన శైలితోనే చిత్రాలు తెరకెకిక్కస్తున్న ఈయన ఆ మధ్య పిశాచు, తుప్పరివాలన్ వంటి చిత్రాలు సక్సెస్ అయ్యాయి. తాజాగా ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటి నిత్యామీనన్, అదితిరావ్ నాయికలుగా తెరకెక్కించిన చిత్రం సైకో. ఈ చిత్రం ప్రారంభం నుంచి విడుదలకు ముందు, ఆ తరువాత కూడా సంచలనంగా మారింది. సైకో చిత్రం గత నెల 24న తెరపైకి వచ్చింది. అయితే చిత్రానికి మాత్రం మిశ్రమ స్పందననే వస్తోంది. ఉదయనిది స్టాలిన్తో మిష్కిన్ కానీ టాక్కు సంబంధం లేకుండా థియేటర్లలో రెండో వారంలోకి చేరుకుంది. సాధారణంగా ఒక వారం పూర్తిగా చిత్రం థియేటర్లలో ఉంటేనే సక్సెస్ అనుకుంటున్న రోజులివి. కాబట్టి సైకో చిత్ర యూనిట్ సక్సెస్ సంతోషంలో ఉన్నారు. ఈ ఆనందాన్ని శుక్రవారం మీడియాతో పంచుకున్నారు కూడా. స్థానిక ప్రసాద్ల్యాబ్లో సైకో చిత్ర సక్సెస్ మీట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మిష్కిన్ మాట్లాడుతూ సంగీతదర్శకుడు ఇళయరాజా తనకు తల్లిదండ్రులు మాదిరని అన్నారు. ఆయన అందించిన సంగీతం, పాటలు సైకో చిత్ర విజయానికి కారణంగా పేర్కొన్నారు. అందుకే ఈ చిత్ర విజయాన్ని ఆయనకు సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపోతే సైకో చిత్ర షూటింగ్ పూర్తి అయిన తరువాత నటుడు ఉదయనిదిస్టాలిన్ను తన తల్లి కడుపున పుట్టిన తన తమ్ముడుగా భావిస్తున్నానని చెప్పారు. నిజం చెప్పాలంటే తాను ఆయన చిత్రాలేవీ చూడలేదన్నారు. సైకో 2 చిత్రం చేస్తారా? అని అడుగుతున్నారని, తన జీవిత కాలంలో ఎప్పుడైనా ఉదయనిధిస్టాలిన్ తనతో చిత్రం చేయమని కోరితే చేయడానికి సిద్ధం అని అన్నారు. ఇకపోతే సైకో చిత్రం గురించి రకరకాల విమర్శలు వస్తున్నాయని, అయితే ఇది చెడ్డ చిత్రం కాదని అన్నారు. తన చిత్రాలన్నీ కత్తిపై నడిచినట్లే ఉంటాయన్నారు. చదవండి: అమ్మకు కీర్తి తెచ్చిన పాత్రలో కీర్తి ‘అమలాపాల్-విజయ్ విడిపోడానికి ధనుషే కారణం!’ -
ఇళయరాజా బయోపిక్ను తెరకెక్కిస్తా
చెన్నై ,పెరంబూరు: ఇళయరాజా బయోపిక్ తెరకెక్కనుంది. ఇటీవల జెండ్రీల బయోపిక్ చిత్రాల ట్రెండ్ నడుస్తోందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధాని పీవీ.నరసింహరావు బయోపిక్ల నుంచి, క్రికెట్ కీడాకారులు, సినీ ప్రముఖుల బయోపిక్లు చిత్రాలుగా తెరకెక్కి వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ప్రస్తుతం దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్తో రెండు చిత్రాలు రూపొందుతున్నాయి. నటుడు సూర్య నటిస్తున్న సూరనై పోట్రు చిత్రం కూడా బడ్జెట్లో విమానాన్ని తయారు చేసిన జీఆర్.గోపీనాథ్ జీవిత చరిత్రే నన్నది గమనార్హం. రాజా ది జర్నీ సంగీతరంగంలో ఎంతో కీర్తి సాధించిన సంగీతజ్ఞాని ఇళయరాజా బయోపిక్ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. దీన్ని ఆయన కొడుకు, సంగీత దర్శకుడు యువన్శంకర్ రాజా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే ఒక భేటీలో స్వయంగా వెల్లడించారు. తన తండ్రి ఇళయరాజా బయోపిక్ను తెరకెక్కించాలన్న ఆలోచన ఉందని, దానికి తానే దర్శకత్వం వహిస్తానని చెప్పారు. దీనికి దాజా ది జర్నీ అనే టైటిల్ బాగుంటుందని అన్నారు. నటుడు ధనుష్ కరెక్ట్ ఇళయరాజా పాత్రను పోషించడానికి నటుడు ధనుష్ కరెక్ట్ అని చెప్పారు. మరి ఇళయరాజా పాత్రలో నటించడానికి నటుడు ఆయన అంగీకరిస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. మొత్తం మీద ఎన్నో జాతీయ, రాష్ట్ర అవార్డులను అందుకుని సంగీతరంగంలో రారాజుగా రాణిస్తున్న ఇళయరాజా బయోపిక్ సినిమాగా తెరకెక్కనుందన్న మాట. -
ఇళయారాజాకు మరో అరుదైన పురస్కారం
సాక్షి, చెన్నై: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజాకు మరో అరుదైన గౌరవ దక్కింది. కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘హరివరాసనం’ పురస్కారాన్ని ఆయనకు ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీన శబరిమలైలో ఇళయరాజాకు పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలకు సంగీతం అందించి.. ఎన్నో అద్భుతమైన పాటలు అందించి మ్యూజిక్ మేస్ట్రోగా పేరొందిన ఇళయరాజా.. ఇప్పటికే ఎన్నో పురస్కారాలు, సత్కారాలు పొందారు. భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. అయితే, శబరిమల కొండపై నెలకొన్న అయ్యప్పను మేలుకొలిపే ‘హరివరాసనం’ పాటను ఎంతో భక్తితన్వయత్వంపై ఇళయరాజా పాడటం.. విశేషమైన ప్రాచుర్యం పొందింది. అయ్యప్ప భక్తులు నిత్యం వినే పాటగా ఇది ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో ఇళయరాజకు హరివరాసనం పురస్కారం దక్కడం, శబరిమలలో దానిని అందుకోబోవడం అరుదైన విశేషమని చెప్పాలి. -
డిటెక్టివ్ రిటర్న్స్
విశాల్ మళ్లీ డిటెక్టివ్ అయ్యారు. 2017లో ఓసారి ‘డిటెక్టివ్’గా మనకు కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ‘డిటెక్టివ్’ సినిమా సీక్వెల్ చేస్తున్నారు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన మిస్కిన్ దర్శకత్వంలోనే మలి భాగం కూడా తెరకెక్కుతోంది. ఈ సినిమా చిత్రీకరణ లండన్లోని బ్రిస్టల్లో ప్రారంభమైంది. అక్కడ దాదాపు 40 రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుందని తెలిసింది. ఈ సినిమాతో ఆశ్య హీరోయిన్గా పరిచయం కాబోతున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. విశాల్ ‘యాక్షన్’ సుందర్. సి దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘యాక్షన్’. ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటించారు. ‘యాక్షన్’ చిత్రాన్ని ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. -
ఆయన పాట లేకుండా నేను లేను : ఎస్పీబీ
సాక్షి, హైదరాబాద్ : తానొక గడ్డిమొలక లాంటివాడినని, ఇళయరాజా పాట లేకుండా తాను ఉండలేనని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. తన పాటల విషయంలో రాయల్టీ కట్టాలంటూ అప్పట్లో ఇళయరాజా పేర్కొన్న సంగతి తెలిసిందే. తన అనుమతి లేనిదే తాను స్వరపర్చిన పాటలను పాడకూడదని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి దూరంగా ఉన్న ఈ మిత్రద్వయం కొన్ని రోజుల క్రితమే మళ్లీ కలిసిపోయారు. నవంబర్ 30న చిత్ర, ఏసుదాసులతో కలిసి నిర్వహించబోయే సంగీత విభావరి కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీబీ మాట్లాడుతూ.. ఇళయరాజాతో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని ఎస్పీబీ తెలిపారు. రాయల్టీ విషయంలో ఏవో చిన్న బేధాభిప్రాయాలు వచ్చాయన్నారు. సోషల్మీడియా ఎంత సహకారో అంత మహమ్మారి అని పేర్కొన్నారు. త్వరలోనే ఆయనతో పాటల కార్యక్రమం ఉంటుందని ప్రకటించారు. తనతో ఇళయరాజాకు ఎలాంటి సమస్య ఉండదని అన్నారు. -
ఆది పినిశెట్టి ‘క్లాప్’మూవీ ప్రారంభమైంది
-
స్టార్ స్టార్ సూపర్ స్టార్ ఇళయరాజా
-
నా పాట నీ నోట పలకాల బాలు
ఇళయరాజా– యస్పీ బాలసుబ్రహ్మణ్యంలది ఎవర్గ్రీన్ కాంబినేషన్. రాజా కంపోజిషన్లో బాలు అద్భుతమైన పాటలెన్నో పాడారు. సంగీతప్రియుల మ్యూజిక్ కలెక్షన్లో ఎవర్గ్రీన్ ఆల్బమ్స్లో నిలిచిపోయారు. అయితే ఈ మధ్య రాయల్టీ విషయంలో వీరిద్దరి మధ్య చిన్న గ్యాప్ వచ్చింది. ‘నేను స్వరపరిచిన పాటలెక్కడ పాడినా నాకు రాయల్టీ చెల్లించాలంటూ’ రాజా కొన్నేళ్లుగా సంచలన స్టేట్మెంట్స్ జారీ చేస్తూ వచ్చారు. దానికి ‘రాజా పాట పాడకుండా నన్నెవ్వరూ ఆపలేరని’ యస్పీబీ కూడా చెప్పారు. అది వీరి మధ్య చిన్న గ్యాప్కు కారణం అయింది. ఇటీవలే ఇళయరాజా, యస్పీబీ మళ్లీ కలసిన ఫొటోలు బయటకు వచ్చాయి. తాజాగా విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కుతున్న ‘తమిళరసన్’ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శకుడు. ఇందులో ఓ పాటను యస్పీబీ ఆలపించారు. ఇటీవలే ఆ పాటను రికార్డ్ చేయించారు. ఇవాళ చెన్నైలో జరగబోయే ఇళయరాజా కన్సెర్ట్లో యస్పీబీ పాడనున్నారని తెలిసింది. ట్యూన్కి, టోన్కి మళ్లీ నేస్తం కుదిరింది. సో.. మళ్లీ మరెన్నో మ్యూజికల్ హిట్స్ సంగీతాభిమానులకు ఇవ్వడానికి ఈ కాంబినేషన్ నిశ్చయించుకుందని అనుకోవచ్చు. -
ఇళయరాజా సంగీతం.. ఎస్పీబీ గాత్రం
ఇళయరాజా సంగీతంలో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎన్నో అధ్బుతమైన పాటలను పాడారు. ఆ పాటలన్నీ ఎప్పటికీ నిలిచిపోతాయి. వృత్తిపరంగానే కాకుండా, వ్యక్తిగతంగానూ ఇళయరాజా-ఎస్పీబీ ఎంతో స్నేహంగా ఉంటారు. అయితే గతంలో ఇళయరాజా తన పాటలకు రాయల్టి ఇవ్వాలని, అలా అయితేనే తన పాటలను వేదికలపై పాడాలని రచ్చ చేశారు. ఆ వివాదం తరువాత వీరిద్దరి మధ్య కాస్త దూరం పెరిగింది. అయితే తాజాగా వీరిద్దరు మళ్లీ కలిశారని, ఒకే వేదికపై కలవనున్నారని అంతేకాకుండా లైవ్ కాన్సెర్ట్లో బాలు పాడతారని తెలిపారు. అయితే తాజాగా ఇళయరాజా మ్యూజిక్ డైరెక్షన్లో రాబోతోన్న ‘తమిళసరన్’( ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోని హీరో) అనే చిత్రంలో బాలు ఓ పాటను కూడా పాడుతున్నారు. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన కంపోజిషన్ జరుగుతుండగా.. తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
నా పాటలను వాడుకున్న వాళ్లు మగతనం లేనివారే
పెరంబూరు: సంగీత దర్శకుడు ఇళయరాజా మరోసారి వివాదాల్లో చిక్కున్నారు. సంగీతజ్ఞానిగా వాసికెక్కిన ఆయన తరుచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో తన పేరును తానే తగ్గించుకుంటున్నారనే వాదన సినీ వర్గాలో వినిపిస్తోంది. సంగీత దర్శకుడిగా ఖ్యాతిగాంచిన ఇళయరాజా ఆ మధ్య తన పాటల రాయల్టీ వ్యవహారంలో కోర్టుకెక్కి అభాసుపాలయ్యారు. తన పాటలను ఎవరు, ఎలాంటి కార్యక్రమంలో వాడుకున్నా అందుకు తగిన రాయల్టీని తనకు చెల్లించాలంటూ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కొన్ని రికార్డింగ్ కంపెనీలపై ఆయన కోర్టులో దాఖలు చేసిన పిటీషన్లు కొట్టివేతకు గురయ్యాయి. పాటల కచేరీల్లోనూ తన పాటలను పాడరాదన్న విషయంలో ఇళయరాజాకు, గాయకుడు ఎస్పీ.బాలసుబ్రమణ్యంకు మధ్య పెద్ద మరస్పర్ధలకే దారి తీసింది. అవి ఇటీవలే సమసిపోయి, త్వరలో మళ్లీ ఇద్దరూ ఒకే వేదికపై కలవనున్నారనుకోండి. అసలు ఇళయరాజా సంగీతాన్ని అందించినందుకు పారితోషికం ఇస్తున్నామని, మళ్లీ పాటలకు రాయల్టీ ఏమిటని నిర్మాత కే.రాజన్ ప్రశ్నించడంతో పాటు ఆయన చర్యల్ని తప్పు పట్టారు. నిజానికి డబ్చు ఖర్చు పెట్టి, సంగీత దర్శకుడికి పారితోషికం చెల్లించిన నిర్మాతకు పాటల రాయల్టీలో భాగం ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా మరి కొందరు నిర్మాతలు కూడా ఇళయరాజా పాటలపై రాయల్టీ అడగడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక తాజాగా ఇళయరాజా చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. విజయ్సేతుపతి, త్రిష జంటగా నటించిన 96 చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం ఇప్పుడు తెలుగు, కన్నడ భాషల్లోనూ రీమేక్ కానుంది. కాగా 96 చిత్రంలో ఇళయరాజా సంగీతాన్ని అందించిన పాత చిత్రాల్లోని పాటలను పొందుపరిచారు. అదే విధంగా ఇటీవల తెరపైకి వచ్చిన మెహందీ సర్కస్ చిత్రంలోనూ ఇళయరాజా పాత పాటలను పొందుపరిచారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఇళయరాజా ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తాను సంగీతాన్ని సమకూర్చిన పాటలను కొత్త చిత్రాల్లో వాడుకున్న వాళ్లు మగతనం లేనివారే అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఇళయరాజా వ్యాఖ్యలకు 96 చిత్ర వర్గాలు గట్టిగానే బదులిచ్చారు. తమ చిత్రంలో వాడిని ప్రతి పాటకు రాయల్టీ చెల్లించినట్లు వారు తెలిపారు. కాగా ఇళయరాజా వైఖరిని నెటిజన్లు మాత్రం ఎండగడుతున్నారు. ఇళయరాజా తన సంకుచిత మనస్తత్వాన్ని వీడాలంటూ ఏకేస్తున్నారు. ఆయన ఇంతకు ముందు చాలా చిత్రాల్లో పాత చిత్రాల్లోని పాటలను వాడుకున్న సందర్భాలు ఉన్నాయని, అప్పుడు ఆయన మగతనం లేనివాడా? అని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు ఏఆర్.రెహ్మాన్కు ఇళయరాజాకు మధ్య ఉన్న వ్యత్యాసం ఇదేనని విమర్శలు గుప్పిస్తున్నారు. -
ట్యూన్ టోన్ కలిసెన్
కొన్ని కాంబినేషన్లు భలే కుదురుతాయి. అందులో ఎవర్గ్రీన్ కాంబినేషన్ అంటే ఇళయరాజా – యస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒకటి. రాజా కంపోజిషన్లో యస్పీబీ క్లాసిక్ సాంగ్స్ పాడారు. రాజా ట్యూన్, యస్పీబీ టోన్ అద్భుతః అనుకున్నారు ప్రేక్షకులు. అయితే ఈ బ్యూటిఫుల్ కాంబినేషన్కు ఆ మధ్య చిన్న గ్యాప్ వచ్చింది. ‘నా పాటలను నా అనుమతి లేకుండా ఏ వేదిక మీద పాడినా నాకు రాయల్టీ ఇవ్వాలి’ అని ఇళయరాజా స్టేట్మెంట్ జారీ చేశారు. ‘రాజా పాటలు పాడకుండా నన్నెవ్వరూ ఆపలేరు’ అని యస్పీబీ అన్నారు. ఈ వివాదం అలా సాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ యుద్ధాన్ని ముగించారట. చిన్న ఆలింగనంతో అలకలకు స్వస్తి చెప్పారు. వీరిద్దరూ కలిసున్న ఫొటోలను యస్పీబీ తనయుడు యస్పీ చరణ్ షేర్ చేశారు. వచ్చే నెలలో ఇళయరాజా బర్త్డే (జూన్ 2) సందర్భంగా జరగబోయే లైవ్ కాన్సెర్ట్లో ఈ ఇద్దరూ కలసి పెర్ఫామ్ చేయబోతారని తెలిసింది. ఇది సంగీతప్రియులకు నిజంగా శుభవార్తే. -
జూన్ 4న తీర్పు
చెన్నై ,పెరంబూరు: సంగీతదర్శకుడు ఇళయరాజా కాపీరైట్స్ పిటిషన్పై తుది తీర్పును జూన్ 4న వెల్లడించనున్నట్లు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు. సుమారు 1000కి పైగా చిత్రాలకు సంగీతం అందించిన ఇళయరాజా 4,500కు పైగా పాటలకు స్వరపరచారు. ఈయన తన పాటలను తన అనుమతి లేకుండా, కాపీరైట్స్ పొందకుండా సంగీత కచేరీలు వంటి పలు కార్యక్రమాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. కాపీరైట్స్ చట్టం ప్రకారం తన పాటలను వాడుకోవడానికి తనకు సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ విధంగా 2014లో మలేషియాకు చెందిన అగ్ని మ్యూజిక్, ఏకో రికార్డింగ్, గిరి వర్ధక సంస్థలపై కాపీరైట్స్ కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏకో సంస్థ నిర్వాహకులు మద్రాసు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. అందులో ఇళయరాజా పారితోషికం తీసుకునే సంగీతాన్ని అందిస్తున్నారని, కాబట్టి ఆయనకు కాపీరైట్స్ ఉండవని, చిత్ర నిర్మాతలకే ఆ రైట్స్ ఉంటాయని వాదించారు. దీంతో ఇళయరాజా కేసును కోర్టు కొట్టివేసింది. దీంతో నిర్మాతలు ఇప్పుడు పాటలకు సంబంధించి కాపీ చట్టం ప్రకారం తమకు వాటా ఉంటుందని కోరుతున్నారు. కాగా ఏకో సంస్థ దాఖలు చేసిన పిటిష¯న్పై విచారించిన న్యాయస్థానం ఇళయరాజా పిటిషన్ను కొట్టివేసినా, ఇతర రికార్డింగ్ సంస్థలపై కేసు విచారణలోనే ఉంది. ఇప్పుడీ కేసుపై తుది తీర్పును జూన్ 4న వెల్లడించనున్నట్లు న్యాయమూర్తి అనితా సుమంత్ తెలిపారు. బుధవారం నుంచి వేసవి సెలవులు మొదలు కావడంతో ఇప్పుడు తీర్పును వెల్లడించలేమని న్యాయమూర్తి పేర్కొన్నారు. -
రాజకీయనాయకులు దేన్నీ వదిలి పెట్టరు..
పెరంబూరు: ఇది ఎన్నికల సమయం. రాజకీయనాయకులకు ప్రజలు గుర్తుకొచ్చేది ఇప్పుడే. వారి కష్టాలు, సమస్యలు అన్నీ తెలిసేదీ సమయంలోనే. పేద, గొప్ప అన్న తారతమ్యం లేకుండా పత్రి వారికి దండం పెడతారు. వారిని ఓట్లుగా మార్చుకోవడానికి ఏఏ అవకాశాలు ఉన్నాయో అన్నింటి పైనా దృష్టి పెడతారు. తమకు ఉపయోగ పడుతుందంటే వాడుకోవడానికి రాజకీయనాయకులు దేన్నీ వదిలి పెట్టరు. అవునండి మరి రాజకీయ నాయకులండి. ఇదంతా తెలిసిన సోదేగా అంటారా! రాజకీయపార్టీలు సినిమా గ్లామర్ను తెగ వాడేసుకుంటున్నారు. ఇదీ కొత్త విషమేమీ కాదు. సినిమా వాళ్లు కూడా రాజకీయ ప్రాపకం కోసం ఎగబడుతున్నారు ఇందులోనూ వింతేమీ లేదు. అయితే రాజకీయాలకు అతీతంగా ఉండాలనుకునేవారు కొందరుంటారు. వారిని వాడేసుకోవాలనుకుంటున్నారు. ఉదాహరణకు భారతీయ సినీరంగంలో సంగీతరారాజుగా వాసికెక్కిన ఇళయరాజా రాజకీయాల జోలికి పోయిన పాపాన పోలేదు. అయితే ఆయన్ని తమకు ఓట్లు రాబట్టుకోవడానికి పెట్టుబడిగా వాడేసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇళయరాజా వర్గమే పేర్కొన్నారు. అంతేకాదు ఇళయరాజా పేరును కొన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో లబ్ధిపొందే విధంగా వాడుకుంటున్నారని, అలా ఆయన పేరును గానీ, ఫొటోలను గానీ వాడుకోరాదని హెచ్చరిస్తూ ఒక ప్రకటన కూడా చేశారు. సాధారణంగానే తనకు సంబంధించి తన అనుమతి లేకుండా ఏం చేసినా ఈ సంగీతజ్ఞాని ఒప్పుకోరు. అవసరం అయితే చట్టాన్ని ఆశ్రయించడానికైనా సిద్ధపడతారు. అయినా అనుమతి లేకుండా అలా ఇతర ప్రముఖులు పేర్లను వాడుకోవడం తప్పు కదా! ఎలా ఇలాంటి చర్యలకు పాల్పడతారండి. రాజకీయనాయకులు కదంది! అంతేనండి. -
సంగీతంలో నాకెవరు సాటి!
సంగీతంపై తనతో చర్చించేంత ప్రతిభావంతుడు ఇంకా తారస పడలేదని సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. 75వ వసంతంలోకి అడుగు పెట్టిన ఈయనకు పలువురు అభినందన సభలను, సత్కారాలను నిర్వహిస్తున్నారు. ఇటీవలే సినీ నిర్మాతల మండలి ఘనంగా సన్మానించిన విషయం తెలిసిందే. పలు కళాశాలల్లో ఇళయరాజా జన్మదిన కార్యక్రమాలను నిర్వహిస్తూ సన్మానిస్తున్నారు. మంగళవారం విరుదునగర్లోని సెంధిల్ కుమర్ నాడార్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఇళయరాజా మాట్లాడుతూ విరుదునగర్లో తాను కాలు పెట్టని ప్రాంతమే లేదన్నారు. 1969లో మాసట్ర మనం అనే నాటకానికి సంగీ తాన్ని అందించడానికి తొలిసారిగా హార్మోనియంతో వచ్చానని తెలిపారు. అలా తనకు, తన హార్మోనియంకు పరిచయం అయిన ప్రాంతం విరుదునగర్ అని పేర్కొన్నారు. కామరాజర్ పథకంతో విద్యార్థులకు తాను చెప్పేదొక్కటే. అనవసర ఆలోచనలతో కాలాన్ని వృథా చేసుకోవద్దని హితవు పలికారు. బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని తన సంగీతంతో ఆశీర్వదిస్తున్నానన్నారు. ముఖ్యంగా మిమ్మల్ని ఎవరితోనూ పోల్చుకోవద్దని చెప్పారు. తనకు చదువు అంటే ఆసక్తి మక్కువనీ, అప్పట్లో కామరాజర్ ప్రవేశపెట్టిన మధ్యాహ్నం ఆహారం పథకంతో 6 నుంచి 8 వ తరగతి వరకూ చదువుకున్నానని ఇళయరాజా గుర్తు చేసుకున్నారు. విద్యార్థల ప్రశ్నలకు ఇళయరాజా బుదులిచ్చారు. అపూర్వసహోదరగళ్ చిత్రంలోని పుదుమాయ్ పిళ్లైక్కు నల్ల యోగమడా పాట ఎలా రూపొందిందన్న ఒక విద్యార్థిని ప్రశ్నకు ఆయన బదులిస్తూ, అది ఎంజీఆర్ పాటలు మాదిరిగా ఉండాలని నటుడు కమలహాసన్ కోరారన్నారు. అందుకే నాన్ పార్తదిలే అవళ్ ఒరుత్తిౖయెదాన్ నల్ల అళగి యన్భేన్ పాట బాణీలో అపూర్వ సహోదర్గళ్ చిత్రంలోని పాటను రూపొందించినట్లు తెలిపారు. సాహిత్యం, నాటక పుస్తకాలు ఉన్నాయి గానీ, సంగీతం గురించి పుస్తకాలు లేవు మీరు సంగీతం గురించి పుస్తకాలు రాయవచ్చుగా అన్న ప్రశ్నకు బదులిస్తూ సంగీతానికీ పుస్తకాలు ఉన్నాయనీ, అయితే అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయనీ చెప్పారు. సంగీతానికి సంబంధించి ఏ ఏ పుస్తకాలు ఉండేవో తాను సంగీతాన్ని అందించిన ఒళియిన్ ఓసై చిత్రంలో చెప్పాననీ అన్నారు. ఇకపోతే సంగీతం గురించి తనతో పాటు కూర్చుని చర్చించే ప్రతిభావంతుడు తనకింకా తారస పడలేదనీ, ఇలా అనడంతో తాను గర్విష్టినని కొందరు అనుకుంటారనీ, మరి కొందరు తన నుంచి దూరం అవుతున్నారనీ అన్నారు.అదే విధంగా సంగీతం గురించి పుస్తకం రాయాలన్న ఆలోచన తనకింత వరకూ రాలేదనీ పేర్కొన్నారు.అయినా పుస్తకాలు చదవడం ద్వారా సంగీతాన్ని అర్ధం చేసుకోవడమో, నేర్చుకోవడమో సాధ్యం కాదని ఇళయరాజా అన్నారు. -
అసహనం వ్యక్తం చేసిన ఇళయరాజా!
పెరంబూరు: నటుడు రజనీకాంత్, కేంద్ర మంత్రి పక్కన కూర్చునేందుకు విముఖత చూపారా? ప్రస్తుతం ఇదే అంశం చర్చనీయంశంగా మీడియాలో వైరల్ అవుతోంది. సంగీతజ్ఞాని ఇళయరాజా 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన్ని నిర్మాతల మండలి ఘనంగా సత్కరించింది. శని, ఆదివారాల్లో నందనంలోని వైఎంసీఏ మైదానంలో జరిగిన ఈ బ్రహ్మండ సంగీత కార్యక్రమంలో ఆదివారం సూపర్స్టార్ రజనీకాంత్, కమల్హాసన్, కేంద్ర మంత్రి పొన్.రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా నటుడు రజనీకాంత్ విశ్చేశారు. ఆ తరువాత వచ్చిన కేంద్ర మంత్రి పొన్.రాధాకృష్ణన్ రజనీకాంత్ను చూసి చిరునవ్వుతో ఆయన పక్కన కూర్చోవడానికి వచ్చారు. ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించడానికి నిశ్చల ఛాయాగ్రహకులు, వారి మధ్య సంభాషణలను సేకరించడానికి విలేకరులు వారి వైపు వేగంగా రావడం మొదలెట్టారు. దీంతో రజనీకాంత్ కాస్త ఇబ్బందిగా ఫీలయ్యారు. ఈ లోగానే కార్య నిర్వాహకులు రజనీకాంత్ను వేదికపైకి ఆహ్వానించడంతో అబ్బా.. తప్పించుకున్నాం రా బాబూ అన్నంత రిలీఫ్ అయినట్లు కనిపించింది. రజనీ మాట్లాడిన తరువాత నటుడు కమల్హాసన్ రావడంతో ఆయన పక్కన కూర్చున్నారు. ఇదంతా గమనిస్తున్న మీడియా రజనీకాంత్, కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ పక్కన కూర్చోవడానికి విముఖత చూపారా? అన్న ప్రచారానికి తెరలేపింది. కానరాని ప్రముఖులు: ఇళయరాజా 75 వసంతాల వేడుకకు చిత్ర పరిశ్రమ ప్రముఖులు పలువురు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. నటుడు విజయ్, అజిత్, సూర్య, ధనుష్, జీవా, ఎస్జే.సూర్య, జీవీ ప్రకాశ్కుమార్, అరుణ్విజయ్, అధర్వ, సతీష్, సంతానం, శశికుమార్, సముద్రఖని, సూరి, యోగిబాబు, ప్రకాశ్రాజ్, సమంత, హన్సిక, కాజల్, అంజలి, అమలాపాల్, దర్శకుడు భారతీరాజా, రామ్, రంజిత్, పాండిరాజ్, అట్లీ, విఘ్నేశ్శివన్, సంగీత దర్శకుడు అనిరుధ్, తమన్, శ్యామ్.సీఎస్, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, యేసుదాస్, హరిహరన్, శంకర్మహదేవన్, గాయని పి.సుశీల, జానకి, సైంధవి, ప్రముఖ నిర్మాత ఏవీఎం.శరవణన్, కలైపులి ఎస్.థాను వంటి ప్రముఖులు అభినందన సభకు దూరంగా ఉన్నారు. దీంతో కార్యక్రమ నిర్వహణలో కొన్ని లోటుపాట్లు జరిగాయన్నది వాస్తవం. అందరినీ కలుపుకునిపోవడంలో నిర్మాతల మండలి విఫలమైందనే అంశం వినిపిస్తోంది. వారికీ ధన్యవాదాలు ఆదివారం జరిగిన వేడుకలో చివరిగా సంగీతజ్ఞాని మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కొందరు ఎంతగా కృషి చేశారో, ఆపడానికి మరికొందరు అంతగా శ్రమించారన్నారు. వారికీ, వీరికీ అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఆపడానికి ప్రయత్నించిన వారికి ధన్యవాదాలు ఎందుకో అనుకోవచ్చని, వారు అలా చేయడం వల్లే ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి ఈ కార్యక్రమాన్ని నిషేధించరాదని తీర్పు ఇచ్చారన్నారు. న్యాయస్థానమే అండగా ఉంది కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యహరించిన నటి సుహాసిని మాట్లాడుతూ.. తాను ఇంటి నుంచి ఇళయరాజా వేడుకకు బయలుదేరుతున్న సమయంలో ఇంటి పనిమనిషి వచ్చి, సంగీతజ్ఞాని సన్మాన కార్యక్రమానికి న్యాయమూర్తే అండగా నిలిచారు. సంతోషంగా వెళ్లి రండమ్మా అని చెప్పిందన్న విషయాన్ని ప్రస్తావించారు. అంతగా పోరాడిన గెలిచిన నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ను అభినందిస్తున్నానని అన్నారు. నటి రోహిణీ ప్రశ్నిస్తూ దర్శకుడు శంకర్తో మీరు చేసే చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు. వారి ఆశ ఎప్పుడు నెరవేరుతుందని ఇళయరాజాను ప్రశ్నించడంతో ఆయన కాస్త చిరాకు పడ్డారు. అవన్నీ ఇప్పుడెందుకమ్మా? దర్శకులు ఏ సంగీత దర్శకుడితే కంఫర్టుబుల్గా ఉంటే వారితో పని చేయించుకుంటారు అని అన్నారు. ఏదేమైనా విశాల్ ముందు నుంచి చెబుతున్నట్లు గానే ఇళయరాజాకు అభినందన సభను చరిత్రలో గుర్తుండిపోయేటట్లు నిర్వహించి చూపించారు. అదేవిధంగా ఒక సంగీత పుత్రుడి అభినందన కార్యక్రమం అశేష సంగీత ప్రియులను ఆనందడోలికల్లో ముంచెత్తిందన్నది నిజం. -
సంగీతంలో రాజాగారే నాకు స్ఫూర్తి
సంగీత జ్ఞాని ఇళయరాజా 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ఇళయరాజా 75’ పేరుతో గత శని, ఆదివారాల్లో చెన్నైలో ఘనంగా వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకను తమిళ నిర్మాతల మండలి నిర్వహించింది. ఈ వేడుకలోని హైలెట్స్... ► ఇళయరాజాగారితో ఉన్న అనుబంధం గురించి రెహమాన్ మాట్లాడుతూ – ‘‘నేను రాజాగారి దగ్గర పని చేసిన రోజులు నాకింకా గుర్తున్నాయి. ‘మూండ్రామ్ పిరై’ (వసంత కోకిల) సినిమాకు రాజాసార్ టీమ్లో జాయిన్ అయ్యాను. రాజాగారు రికార్డింగ్ స్టూడియోలోకి ప్రవేశిస్తుంటే ,హెడ్ మాస్టర్ క్లాస్రూమ్లోకి వస్తున్న భావన కలిగేది. ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. సంగీతంలో రాజాగారే నాకు స్ఫూర్తి’’ అన్నారు. ► ఈ కార్యక్రమానికి సీనియర్ నటి, మణిరత్నం భార్య సుహాసిని యాంకర్గా వ్యవహరించారు. ‘రెహమాన్ మిమ్మల్ని గురువు అన్నారు. దాని గురించి ఏదైనా పంచుకుంటారా? అని ఇళయరాజాని ఆమె అడగ్గా– ‘‘రెహమాన్ తన తండ్రి దగ్గర కంటే నా దగ్గరే ఎక్కువ ఉన్నాడు. కరెక్టే కదా (రెహమాన్ వైపు చూస్తూ). దానికి రెహమాన్ అవును అన్నారు. ‘ఈ విషయాలన్నీ నువ్వు (రెహమాన్) చెప్పాలి’ అని సరదాగా పేర్కొన్నారు. మరో యాంకర్గా వ్యవహరించిన నటి కస్తూరి.. రెహమాన్ కంపోజ్ చేసిన ఏదైనా పాటను పాడమని అడగ్గా ఇళయరాజా ‘మౌనరాగం’ చిత్రంలోని ‘మండ్రం వంద తెండ్రులుక్కు.’ అనే పాటను ఆలపించారు. అదే సమయంలో కీబోర్డ్ దగ్గర ట్యూన్ చేస్తున్న రెహమాన్.. సంగీతజ్ఞాని పాట వింటూ ఆగిపోయారు. ‘ఏమైంది? ట్యూన్ సరిగ్గా గుర్తులేదా? ’ అంటూ రాజా చమత్కరించారు. ► రజనీకాంత్ మాట్లాడుతూ – ‘‘ఇళయరాజా స్వయంభూలింగం. ధోతి ధరించకముందు వరకూ సార్ అని పిలిచేవాణ్ని. ఆ తర్వాత నుంచి స్వామి అంటున్నాను. రాజాగారు కూడా నన్ను అలానే పిలుస్తారు. నాకంటే కమల్కు మంచి సంగీతాన్ని అందించారు’’ అని రజనీ అంటుండగా, ఇళయరాజా అందుకుంటూ ‘కమల్హాసనేమో మీకు మంచి మ్యూజిక్ ఇచ్చాను అంటుంటారు. నాకు యాక్టర్ ఎవరన్నది కాదు. ఏ పాటకైనా నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను’’ అన్నారు. ► కమల్ హాసన్ ఆయన కుమార్తె శ్రుతీహాసన్ స్టేజ్ మీద మూడు పాటలు పాడి, ఇళయరాజాతో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు. ‘‘నేను రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నప్పుడు రాజాగారు సలహాలిచ్చారు’’ అన్నారు కమల్. ► ‘‘సంగీతానికి ఒకరే రాజు. ఆయనే ఇళయరాజా. లాంగ్డ్రైవ్లకు వెళ్తున్నప్పుడు బండిలో పెట్రోల్ ఉందా లేదా అని చూసుకోవడం కంటే ముందు ఇళయరాజా పాటలున్నాయా? లేదా ? అని చెక్ చేసుకుంటారు. ఇలాంటి లెజెండ్స్ను సన్మానించుకోవడం మా బాధ్యత. ఇండస్ట్రీలోని వాళ్లకోసం ఇండస్ట్రీ వాళ్లం ఈవెంట్స్ చేయడంలో తప్పు లేదనుకుంటున్నాను. ఈ వేడుక చరిత్రలో మిగిలిపోతుంది. అలాగే దీన్ని వ్యతిరేకించినవాళ్లు కూడా చరిత్రలో ఉంటారు’’ అని పేర్కొన్నారు నిర్మాతల మండలి అధ్యక్షుడు, హీరో విశాల్. రెహమాన్, ఇళయరాజా శ్రుతీహాసన్, కమల్హాసన్ కమల్, రజనీ -
ఆయనే నాకు స్ఫూర్తి : ఏఆర్ రెహ్మాన్
తమిళ సినిమా: సంగీత సామ్రాజ్యానికి ఏకై క రారాజు ఇళయరాజానే అని నటుడు, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ప్రశంసించారు. 75 వసంతాలు పూర్తి చేసుకున్న సంగీతజ్ఞాని ఇళయరాజా, పలు భాషల్లో వెయ్యి చిత్రాలకు పైగా సంగీతాన్ని అందించి ప్రపంచ ఖ్యాతి గాంచారు. ఈ సందర్భంగా ఆయనను నిర్మాతల మండలి ఘనంగా సత్కరించే రీతిలో స్థానిక నందనంలోని వైఎంసీఏ మైదానంలో రెండు రోజులు పాటు బ్రహ్మాండంగా సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించతలపెట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా శనివారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ చేతుల మీదుగా సంగీత విభావరిని ప్రారంభించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ మొదలగు భారతీయ సినీ ప్రముఖులు పలువురు పాల్గొన్న ఈ కార్యక్రమంలో లక్షలాదిమంది సంగీత ప్రియులు విచ్చేశారు. కళాకారులు, గాయనీగాయకులు పలువురు పాల్గొని ఆటపాటలతో ఆహూతులను ఉర్రూతలూగించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ మాట్లాడుతూ 1996లో తన అన్నయ్య వరదరాజన్తో కలసి చెన్నై నగరానికి వచ్చిన ఇళయరాజా, అన్నక్కిళి చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారన్నారు. గ్రామీణ పాటలకు, తమిళ సంప్రదాయ పాటలకు ప్రాణ ప్రతిష్ట చేసి ఘనుడు ఇళయరాజా అని పేర్కొన్నారు. కేవలం 13 రోజుల్లో సింపోనిని సమకూర్చి ప్రపంచ రికార్డు సాధించిన ఖ్యాతి ఆయనదని కీర్తీంచారు. 5 జాతీయ అవార్డులకు అలంకారంగా మారిన ఘనత ఇళయరాజాదని శ్లాఘించారు. ఈయనకు తమిళం, తెలుగు అంటూ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని పేర్కొన్నారు. అలాంటి సంగీతజ్ఞాని సంగీత పయనం ఇంకా పలు కాలాల పాటు దిగ్విజయంగా కొనసాగాలని గవర్నర్ ఆకాంక్షించారు. సంగీత సామ్రాజ్యానికి రారాజు నిర్మాతల మండలి అధ్యక్షడు, నటుడు విశాల్ మాట్లాడుతూ ప్రపంచంలో ఒక్కో దేశానికి ఒక్కో రాజు ఉంటారని, అయితే సంగీత సామ్రాజ్యానికి మాత్రం ఏకైక రారాజు ఇళయరాజానే అని అన్నారు. అలాంటి సంగీత రాజును సత్కరించుకోవడం తమకు గర్వం కాదని, ఆయన రుణాన్ని కొంచెం అయినా తీర్చుకోవడం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆపాలని చాలామంది ప్రయత్నించారన్నారు. అయితే ఇళయరాజా చాలాకాలం క్రితమే ఒక చిత్రం కోసం ఎన్ కిట్ట మోదాదే నా రాజాధిరాజనడా (నాతో ఢీకొనవద్దు నేను రాజాధిరాజునురా) అన్న పాటను రూపొందించారన్నారు. ఆ విషయం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలన్న వారికి అర్థం అయ్యి ఉంటుందని విశాల్ చురకలు వేశారు. ఇళయరాజానే నాకు స్ఫూర్తి : ఏఆర్ రెహ్మాన్ ప్రఖ్యాత సంగీత దర్శక ద్వయం ఇళయరాజాను, ఏఆర్ రెహ్మాన్ను ఒకే వేదికపై చూడడం ప్రేక్షకులకు కనులపండుగగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఆర్ రెహ్మాన్ మాట్లాడుతూ.. తనకు ఇళయరాజానే స్ఫూర్తి అని పేర్కొన్నారు. తనకు ఇప్పుడు హెడ్మాస్టర్ ముందు నిలబడిన స్టూడెంట్గా అనిపిస్తోందన్నారు. తనకు ఆస్కార్ అవార్డు లభించినప్పుడు ఎందరో సంగీత దర్శకులు అభినందించినా, సంగీత మేధావి ఇళయరాజా ప్రశంసలను ఎప్పటికీ మరిచిపోలేనని అన్నారు. అనంతరం ఇళయరాజా మాట్లాడుతూ.. ఏఆర్ రెహ్మాన్ తన తండ్రి వద్ద కంటే తన వద్దే ఎక్కువ రోజులు ఉన్నారని, తనతో 500ల చిత్రాలు పనిచేశారని గుర్తుచేసుకున్నారు. కాగా, ఈ వేదికపై సినీ పరిశ్రమ అంతా కలసి ఇళయరాజాకు బంగారంతో చేసిన వయోలిన్ను బహుకరించారు. కాగా ఈ బ్రహ్మాండ సంగీత విభావరి కార్యక్రమానికి నటి సుహాసిని వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆసాంతం రక్తికట్టించారు. -
సంగీత జ్ఞానికి ఘన సత్కారం
సంగీతజ్ఞాని ఇళయరాజాకు శనివారం సాయంత్రం చెన్నైలో ఘనసత్కారం జరిగింది. 1000కి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించి రికార్డుకెక్కిన ఇళయరాజా 75 వసంతాలను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ సంగీత రాజాకు తమిళ నిర్మాతల మండలి చెన్నైలో అభినందన సభ నిర్వహించింది. శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు, చెన్నై నందనంలోని వైఎంసీఏ మైదానంలో బ్రహ్మాండమైన సంగీత విభావరిని తలపెట్టారు. అందులో భాగంగా శనివారం సాయంత్రం జరిగిన ఈ సంగీత కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘1996లో ‘అన్నక్కిళి’ చిత్రంతో తన సంగీత పయనాన్ని ప్రారంభించిన ఇళయరాజా గ్రామీణ, తమిళ సంప్రదాయ పాటలకు ప్రాణప్రతిష్ట చేశారు. 13 రోజుల్లో సింపోనికి బాణీలు కట్టి ప్రపంచ రికార్డు సాధించిన ఘనత ఇళయరాజాది. ప్రపంచస్థాయిలో అభిమాన గణం కలిగిన ఇళయరాజా ఇంకా పదికాలాల పాటు సంగీత దర్శకుడిగా కొనసాగాలి’’ అన్నారు. సంగీత సామ్రాజ్యానికి ఏకైక రారాజు ఇళయరాజానే అని తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, నటుడు విశాల్ సంగీతజ్ఞానిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఆర్ రెహమాన్ తన మార్గదర్శి ఇళయరాజానే అని పేర్కొన్నారు. కాగా ఈ వేదికపై సినీ పరిశ్రమ తరఫున ఇళయరాజాకు బంగారంతో చేసిన వయోలిన్ను బహూకరించి ఘనంగా సత్కరించారు. -
సంగీతం గురించి తెలియదు
చెన్నై ,పెరంబూరు: తనకు సంగీతం గురించి ఏమీ తెలియదు అని పేర్కొన్నారు సంగీతజ్ఞాని ఇళయరాజా. ఈయన 75 వసంతాల వేడుకలను పలు వేదికలపై జరుపుకుంటున్నారు. పలు విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులతో తన అనుభవాలను పంచుకుంటున్న ఇళయరాజా శుక్రవారం చిదంబరంలోని అన్నామలై విశ్వవిద్యాలయంలో తన 75వ పుట్టిన రోజును జరపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇళయరాజా విద్యార్థులనుద్ధేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ 1994లో ఇదే వేదికపై తాను డాక్టరేట్ బిరుదును అందుకున్నానని గుర్తు చేశారు. గీతం, సంగీతం గాలిలోని అశుభ్రతను స్వచ్ఛ పరుస్తాయని అన్నారు. మనం అన్ని రకాల సంగీతానికి తలాడించడం లేదన్నారు. పరిపక్వత చెందిన గొంతుల నుంచి వచ్చే సంగీతానికే తన్మయత్వం చెందుతున్నామని పలువురు తనతో చెప్పారని పేర్కొన్నారు. ఎగిసి పడే ఒక్కో అల ఒక్కో విధం మాదిరిగా విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్కో విధం అని అన్నారు. నీరు ప్రవహించే ప్రాంతాలు పచ్చదనంతో నిండి ఉన్నట్లు, విద్యార్థులు వెళ్లే పలు రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు. సంగీతంలో తాను చెప్పని పలు సాధనాలు ఉన్నాయని, అదేవిధంగా సంగీత కళాకారులు తయారు కావడం లేదని, పుడుతున్నారని అన్నారు. తనకు సంగీతం గురించి ఏమీ తెలియదని, అందుకే సంగీతాన్ని కొనసాగించుకుంటూ పోతున్నానని ఇళయరాజా పేర్కొన్నారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ ఇళయరాజా
-
నాకు మాత్రమే సంగీతం తెలుసు
సంగీత భాణీలు కట్టడం నాకు మాత్రమే తెలుసు. ఇంకెవరికీ తెలియదు అన్నారు ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా. 75వ వసంతంలోకి అడుగుపెట్టిన ఈయనకు పలువురు సత్కార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆ విధంగా స్థానిక మెరీనా తీరంలోని రాణీ మేరీ బాలల కళాశాల నిర్వహకం ఇళయరాజా 75 వసంతాల వేడుకను శుక్రవారం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంగీతజ్ఞాని ఇళయరాజా విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ మీరీ కళాశాలను ఇప్పుడే చూస్తున్నారని, తాను 48 ఏళ్లుగా చూస్తున్నానని అన్నారు. తాను సహాయ సంగీత దర్శకుడిగా ఆల్ ఇండియా రేడియో కార్యాలయానికి ఈ మార్గంలోనే వెళ్లేవాడినని చెప్పారు. దీనికి ఆసియాలోనే ప్రప్రథమంగా స్థాపించిన కళాశాల అనే ఖ్యాతి ఉందన్నారు. మెరినా తీరం ఎదురుగా నెలకొల్పడం ఈ కళాశాల ప్రత్యేకత అని పేర్కొన్నారు. తాను అన్నక్కిళి చిత్రానికి తొలి భాణీలు కట్టింది మెరీనా తీరంలోనేనని తెలిపారు. పరిస్థితులకు తగ్గ సంగీతం చిత్రంలోని ఇప్పుడు పరిస్థితులకు తగ్గట్టు సంగీత భాణీలు కట్టేవారు తాను మినహా ఎవరూ లేరని ఇళయరాజా అన్నారు. అనంతరం విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఇళయరాజా బదులిస్తూ తాను కళాశాల చదువులు చదవకపోవడం వల్ల ఎలాంటి చింతా లేదన్నారు. అయితే కళాశాల చదువు అనుభవం మాత్రం తనకు చాలా ఉందన్నారు. 1968 మార్చి నెలలో చెన్నైకి వచ్చినప్పుడు తన వద్ద ఏమీ లేదని, నమ్మకం మాత్రమే ఉందని ఇళయరాజా పేర్కొన్నారు. ముందుగా ఇళయరాజా తాను భాణీలు కట్టిన పాటలను విద్యార్థులకు పాడి వినిపించారు. -
ఇసయరాజా @ 75
మేస్ట్రో ఇళయరాజా... ఈ పేరు వినగానే సంగీత ప్రియులు ఆయన సినిమాల్లోని పాటలతో కూని రాగాలు తీస్తుంటారనడంలో సందేహం లేదు. తన పాటలతో అంతలా సంగీత ప్రియులను అలరించారాయన. తనకంటూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఇళయరాజా పుట్టినరోజు జూన్ 2న. ఈ ఏడాది ఆయన 75ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ‘తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్పీసీ)’ ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘‘వచ్చే ఏడాది ఫిబ్రవరి 2, 3 తేదీల్లో చెన్నైలో ఈ వేడుకను గ్రాండ్గా నిర్వహించనున్నాం. సంగీతం, సినిమా రంగానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఈ వేడుకకు తమిళ చిత్రసీమ మొత్తం తరలిరానుంది. వేలమంది అభిమానులు, సంగీత ప్రేమికుల మధ్య చెన్నైలోని వైఎమ్సీఏ మైదానంలో ఈ వేడుక నిర్వహించనున్నాం. రెండు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమంలో దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమ (తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ) నుంచి పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ‘ఇసయరాజా 75’ (సంగీతం రాజా) అని పేరు పెట్టాం. ఫిబ్రవరి 2, 3 తేదీల్లో ఎటువంటి సినిమా షూటింగులు, ప్రమోషన్ కార్యక్రమాలు జరగవు. ఈ వేడుకలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలి’’ అని టీఎఫ్పీసీ పేర్కొంది. -
అనుమతి లేకుండా నా పాటలు పాడొద్దు
నా అనుమతి లేకుండా నా పాటలు పాడారంటూ సంగీత దర్శకుడు ఇళయరాజా గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి నోటీసులు జారీ చేసిన విషయం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఇలాంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు ఇళయరాజా. ‘‘నేను కంపోజ్ చేసిన పాటలు పాడుతున్న గాయకులందరకీ ఇదే నా విన్నపం. నా పాటలు పాడొద్దని మీకు చెప్పడం లేదు. కానీ, పాడే ముందు నా అనుమతి తీసుకోండి.. తీసుకోకపోతే మాత్రం నేరం. నా అనుమతి లేకుండా నా పాటలు పాడితే మ్యుజీషియన్స్తో పాటు బ్యాండ్ సభ్యులపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అంతేకాదు.. నేను ఐపీఆర్ఎస్(ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ)లో సభ్యుడిని కాకున్నా నా పాటలు పాడుతున్న వారి నుంచి రాయల్టీ ఫీజును ఐపీఆర్ఎస్ వసూలు చేస్తోంది. ఇకపై అలా జరగకూడదు. ఆ ఫీజు ‘దక్షిణ సినిమా సంగీత కళాకారుల సంఘం’ సేకరిస్తుంది. మీరు పాటలు పాడటానికి డబ్బులు తీసుకుంటారు? ఉచితంగా పాడటం లేదు కదా? మరి నా పాటలు పాడుతూ మీరు డబ్బులు తీసుకోవడం కరెక్టేనా? నాకూ వాటా రావాల్సిన అవసరం లేదా? నేను అడుగుతోంది కొంచెం డబ్బు మాత్రమే. భవిష్యత్ తరాలకు ఈ డబ్బు ఎంతో ఉపయోగపడుతుంది’’ అన్నారు. -
పూసిందే ఆ పూల మాను నీ దీపంలో...
చిత్రం: నిరీక్షణ రచన: ఆచార్య ఆత్రేయ సంగీతం: ఇళయరాజా గానం: కె. జె. ఏసుదాసు బాలు మహేంద్ర దర్శకత్వంలో వచ్చిన ‘నిరీక్షణ’ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్. అన్ని పాటల్లోకీ ‘సుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే/ ఇన్ని యేల సుక్కల్లో నిన్ను నేనెతికానే’ నాకు బాగా నచ్చిన పాట. ఈ పాట షూటింగ్ బెంగళూరు జైలు అధికారుల అనుమతితో అక్కడ చేశాం. జైలు అధికారులు మాకు ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు. అక్కడి ఖైదీలు ఏయే పనులు ఎలా చేస్తారో దగ్గర నుంచి గమనించాక చిత్రం తీశారు బాలు మహేంద్ర.నేరస్థులంతా రాత్రుళ్లు జైలు లోపల ఉంటారు. పగటిపూట పనులు చేస్తుంటారు. కొందరు రాళ్లు కొడతారు, కొందరు చెట్లు నరుకుతారు, కొందరు సిమెంట్ పని చేస్తారు, కొందరేమో పనిచేస్తున్నవారికి గార్డ్స్తో పాటు మంచి నీళ్లు, ఆహారం సప్లయి చేస్తుంటారు. అవన్నీ దగ్గరుండి గమనించాం. అక్కడి ఖైదీల కథలు మా మనసులను కదిలించాయి, ఖైదీలంతా వారి స్వవిషయాలు చెబుతుంటే కళ్లలో నీళ్లు ఆగలేదు. ఎవరో చేసిన నేరానికి మేం బలయ్యామని వారు చెబుతుంటే మనసు కదిలిపోయింది. ఏ నేరం చేయకుండా కూడా చాలామంది యావజ్జీవ శిక్షలు అనుభవిస్తున్నారు. భార్య వచ్చి ఏడాదికోసారి వచ్చి చూసి వెళ్తూ ఉంటుంది. వారి గురించి ఎవరు పోరాడతారో అర్థం కాదు. ఈ చిత్రంలో నా పాత్ర కూడా అలాంటిదే కావడం యాదృచ్ఛికం. వాళ్లతో కలిసిపోయినట్లు ఉండటం కోసం నేను, బాలు మహేంద్రగారు జైలులో వారు ఆ రోజు ఏది తింటున్నారో తెలుసుకుని, అదే వంటకం చేయించుకుని తెచ్చుకుని తినేవాళ్లం. వారంతా దీపావళి పండుగ చేసుకున్నట్లే అనుభూతి చెందారు.‘పూసిందే ఆ పూలమాను నీ దీపంలో/ దాగిందే నా పేద గుండె నీ తాపంలో/ఊగానే నీ పాటలో ఉయ్యాలై/ఉన్నానే ఈనాటికీ నేస్తాన్నై/ఉన్నా ఉన్నాదొక దూరం ఎన్నాళ్లకు చేరం/తీరందీ నేరం’ అనే మొదటి చరణంలో తన ప్రియురాలిని తలచుకుంటూ కుమిలిపోతాడు కథానాయకుడు. ఆత్రేయ గారు స్వయంగా ఈ పాత్రలో ప్రవేశించి ఈ పాట రాశారేమో అనిపిస్తుంది. ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో నేను దిగంబరంగా నటించడం చూసి కొందరు ఖైదీలు కన్నీరు కార్చారు. ‘అయ్యో! ఇంత పెద్ద ఆర్టిస్టు అయి ఉండి మీరు ఇలా నటించడమేంటి. ఏ తప్పూ చేయకుండా మీరు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారేంటి?’ అని అమాయకంగా ప్రశ్నించారు. వాస్తవానికి దగ్గరగా ఉండటం కోసం చేస్తున్నానని చెబితే, వారు ‘మీలాగ ఏ హీరో కూడా నటించరండి’ అని వారు అనడం నాకు ఇంకా బాగా గుర్తు. ఆ జైలులో తెలుగు వారు, తమిళులు ఎక్కువగా ఉండటం వల్ల వారు నన్ను తేలికగా గుర్తించారు. అదొక చెప్పరాని అనుభూతి. వాళ్ల కష్టాలతో పోలిస్తే మనం చాలా హాయిగా ఉన్నట్లే అనుకున్నాను. జైలులో బయటివారికి రాత్రుళ్లు అనుమతి ఇవ్వరు కనుక, జైలు సీన్లన్నీ పగటిపూటే తీశారు. బాలు మహేంద్రగారి గురించి ఒక పూట కాదు ఒక పుస్తకం కూడా చాలదు చెప్పడానికి. ఆయన మంచి నటుడు కూడా. ఆయనకు ఆయనే సాటి. పుణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి బంగారు పతకం సాధించిన బాలు మహేంద్ర కెమెరాతో మాయమంత్రాలు చేస్తారు. ‘తానాలే చేశాను నేను నీ స్నేహంలో/ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో/ఆనాటి నీ కళ్లలో నా కళ్లే / ఈనాటి నా కళ్లలో కన్నీళ్లే / ఉందా కన్నీళ్లకు అర్థం ఇన్నేళ్లుగ వ్యర్థం/ చట్టందే న్యాయం’ అనే చరణంలో కథానాయిక అర్చనను ఒక బ్లాక్ క్రియోపాత్రాలాగ సృష్టించారు బాలూమహేంద్ర. కెమెరాలో నుంచి బయటకు వచ్చేస్తే, మామూలుగా ఉంది అర్చన. కెమెరాలో నుంచి చూస్తే మనం వివరించలేం.ఇక్కడ ఒక విషయం గుర్తుకు వస్తోంది. ఊటీలో షూటింగ్ జరుగుతుండగా, మద్రాసు నుంచి ఒక పార్సిల్ వచ్చింది. జేసుదాసు స్వరంలో రికార్డు చేసిన ‘సుక్కల్లే తోచావే’ పాట క్యాసెట్ అది. ఆ పాట జేసుదాసు గొంతులో వినగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ క్యాసెట్టుతో పాటు ఒక ఉత్తరం ఉంది. బాలూ మహేంద్రగారిని ఉద్దేశిస్తూ, ‘డియర్ బాలూ, నేను నా జీవితంలో అద్భుతమైన పాటను నా శక్తి వంచన లేకుండా హార్ట్ అండ్ సోల్ పెట్టి పాడాను. మీరు చిత్రంలో అంతే అందంగా చూపించండి. నేను సినిమా చూస్తాను’ అని రాశారు. ఆ మాటలకు బాలు మహేంద్ర ఉక్కిరిబిక్కిరైపోయారు. ఒక్క క్షణం పాటు కదలకుండా నిశ్చలంగా ఉండిపోయారు. – సంభాషణ: వైజయంతి పురాణపండ -
ఫస్ట్లుక్ 28th August 2018
-
ఎలక్ట్రానిక్ సంగీతాన్ని దూరంపెట్టండి
తమిళసినిమా: ఎలక్ట్రానిక్ సంగీతాన్ని దూరంగా పెట్టండి అని సంగీతజ్ఞాని ఇళయరాజా ఈ తరం సంగీత దర్శకులకు హితవు పలికారు. ఆయన కొడుకు, ప్రముఖ సంగీతదర్శకుడు యువన్శంకర్రాజా వైఎస్ఆర్ పిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి కే.ప్రొడక్షన్స్ రాజరాజన్తో కలిసి నిర్మిస్తున్న చిత్రం ప్యార్ ప్రేమ కాదల్. యువ నటుడు హరీశ్, నటి రైసా విల్సన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ఇళన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యువన్ శంకర్రాజానే సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ ఆదివారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ఏవీఎం స్టూడియోలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఇళయరాజా పాల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాతగా మారిన యువన్ శంకర్రాజా మాట్లాడుతూ తన మిత్రుడు ఇర్ఫాన్ ఒకసారి మీ అభిమానుల కోసం ఒక చిత్రం చేయవచ్చుగా అని అన్నాడన్నారు. తన బలమే ప్రేమ గీతాలని, సమీప కాలంలో అలాంటి పాటలు తన చిత్రాల్లో చోటు చేసుకోలేదని అన్నారు. అందుకే ప్రేమ గీతాలతో కూడిన చిత్రం చేయాలన్న ఆలోచనే ఈ ప్యార్ ప్రేమ, కాదల్ చిత్రం అని తెలిపారు. అతిథిగా పాల్గొన్న నటుడు ధనుష్ మాట్లాడుతూ కళాకారులందరికీ ప్రేమే మానసిక శక్తి అని పేర్కొన్నారు. తుళ్లువదో ఇళమై, కాదల్ కొండేన్ చిత్రాల సమయంలో తానూ, అన్నయ్య సెల్వరాఘవన్ కష్టపడుతున్నప్పుడు యువన్శంకర్రాజా సంగీతమే తమకు గుర్తింపు తెచ్చిపెట్టిందన్నారు. అలా తాను ఆయనకు రుణ పడి ఉన్నానని అన్నారు. మరో నటుడు శింబు మాట్లాడుతూ ఇది ఆడియో ఆవిష్కరణ వేడుక మాదిరి కాకుండా సినీ ప్రముఖుల గెట్ టు గెదర్లా ఉందన్నారు. యువన్ శంకర్రాజా తనకు తండ్రి లాంటి వాడన్నారు. తను శత్రువులు కూడా బాగుండాలని భావించే వ్యక్తి అనీ, ఆయన కోసం వచ్చిన కూటం ఇదనీ శింబు పేర్కొన్నారు. ఇళయరాజా మాట్లాడుతూ తొలిసారిగా చిత్ర నిర్మాణం చేపట్టిన యువన్శంకర్రాజాను ఆశీర్వదించడానికి వచ్చానన్నారు. ఈ తరం సంగీత దర్శకులకు తాను చెప్పేదొక్కటేనని, ఎలక్ట్రానిక్ సంగీతాన్ని దూరంగా పెట్టి, సహజ సంగీత వాయిద్యాలతో భాణీలను కట్టాలని అప్పుడే నూతనోత్సాహాన్ని కలిగిస్తాయని హితవు పలికారు. కార్యక్రమంలో దర్శకుడు రామ్, శీనూరామసామి, అమీర్, అహ్మద్, నటుడు జయంరవి, విజయ్సేతుపతి, ఆర్య, కృష్ణ, శాంతను, నటి రేఖ, బింధుమాదవి, సంగీత దర్శకుడు డీ.ఇమాన్, సంతోష్నారాయణన్ పాల్గొన్నారు. -
సూపర్ సింగర్ ఫైనల్స్కు కర్నూలు కుర్రాడు
కర్నూలు(హాస్పిటల్): తమిళనాడులోని స్టార్ విజయ్టీవీ నిర్వహిస్తున్న సూపర్సింగర్ ఫైనల్స్కు కర్నూలుకు చెందిన అనిరుద్ ఎంపికయ్యాడు. జన్మతః అబ్బిన గాత్రంతో బాల్యం నుంచే అతను మంచి గాయకునిగా రాణించసాగాడు. కర్ణాటక సంగీతంతోపాటు సినీగీతాలను అలవోకగా పాడేస్తున్నాడు. ఐఐటీ చదివి చెన్నైలో ప్రయివేటు ఉద్యోగం చేస్తున్న ఆ యువకుడు సూపర్సింగర్ పోటీల్లో ఫైనల్స్కు చేరాడు. కర్నూలుకు చెందిన మెడికల్ రెప్ సుస్వరం వాసుదేవమూర్తి, సుస్వరం రజనీ వాసుదేవ్ దంపతులకు 1994 నవంబర్ 24న అనిరుద్ జన్మించాడు. బాల్యం నుంచే పాటలు పాడటంలో అతని ప్రతిభను గమనించిన తల్లిదండ్రులు మ్యూజిక్ టీచర్ విజయలక్ష్మి వద్ద శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత ప్రతి శని, ఆదివారం హైదరాబాద్ వెళ్లి బాలసుబ్రమణ్యం, రామాచారి వద్ద సంగీతం అభ్యసించాడు. 8వ ఏట ఎస్పీ బాలసుబ్రమణ్యం వ్యాఖ్యాతగా వ్యవహరించిన మాటీవీలో ‘పాడాలని ఉంది’ మ్యూజిక్ కాంపిటీషన్లో పాల్గొని సెమిఫైనల్ వరకు వచ్చాడు. ఆ తర్వాత 12వ ఏటా ఎస్పీ బాలసుబ్రమణ్యం వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈటీవీ కన్నడ ఛానల్లో పాల్గొని సెమిఫైనల్కు అర్హత సాధించాడు. 13వ ఏట జీ తెలుగు నిర్వహించిన జీ లిటిల్ ఛాంప్స్లో సంగీత దర్శకులు కోటి, రమణ గోరంట్ల, గాయని శైలజ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన పోటీలో టాప్ 4లో నిలిచాడు. జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా పలు సంగీత పోటీల్లో పాల్గొని అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నాడు. తర్వాత కొన్ని సంవత్సరాలు మ్యూజిక్కు దూరంగా ఉండి చదువుపై దృష్టి నిలిపాడు. ఐఐటీ మద్రాస్లో సీటు సాధించి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో బీటెక్, ఎంటెక్ పూర్తి చేశాడు. బీటెక్ ఫైనలియర్లో ఉన్నప్పుడే మాటీవీ వారు నిర్వహించిన సూపర్సింగర్ 8లో పాల్గొని ఫైనల్స్కు చేరుకున్నాడు. ప్రస్తుతం పేపాల్ చెన్నై బ్రాంచ్లో సర్టిఫైడ్ రిస్క్ అనలిస్ట్గా ఉద్యోగం చేస్తూ తమిళ్ ఛానల్ స్టార్ విజయ్ టీవీలో సూపర్సింగర్ పోటీలో పాల్గొని ఫైనల్ వరకు వచ్చాడు. ఈ పోటీకి దేశవ్యాప్తంగా 6వేల మందిని పరిశీలించగా చివరకు ఆరుగురు ఎంపికయ్యారు. అనిరుద్కు ఓటేయండి సూపర్ సింగర్ ఫైనల్ పోటీల్లో తమిళనాడు నుంచి ముగ్గురు, కర్ణాటక, కేరళ నుంచి ఒక్కొక్కరు, తెలుగు రాష్ట్రాల నుంచి అనిరుద్ ఎంపికయ్యారు. ఈ పోటీ ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్నారు. టైటిల్ విన్నర్ అవ్వాలంటే ఓటింగ్ తప్పనిసరి కావడంతో ఈ నెల 15వతేదీలోగా గూగుల్ ద్వారా అనిరుద్కు ఓటేసి గెలిపించాలని తండ్రి వాసుదేవరావు కోరుతున్నాడు. గూగుల్ వెబ్సైట్ తెరిచి ‘సూపర్ సింగర్ ఓట్’ అని టైప్ చేసి, అందులో అనిరుద్ ఇమేజ్ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత స్కేల్ను 50 వరకు డ్రాగ్ చేసి మీ ఓటును అందించాలని కోరారు. -
త్వరలో ప్యార్ ప్రేమమ్ కాదల్ గీతాలు
తమిళసినిమా: సంగీతజ్ఞాని ఇళయరాజా వారసుడిగా రంగప్రవేశం చేసిన ఆయన రెండవ కొడుకు యువన్ శంకర్రాజా అనతికాలంలోనే తన కంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన పాటల కోసం చెవులు కోసుకునే సంగీత ప్రియులు ఉన్నారంటే అతి శయోక్తి కాదు. ఒక ట్రెండ్ సెట్టర్గా పేరు సంపాదించుకున్న యువన్ శంకర్రాజా తాజాగా చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. ఆయన వైఎస్ఆర్ ఫిలింస్ చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి కే.ప్రొడక్షన్స్ రాజరాజన్, ఇర్ఫాన్ మాలిక్లతో కలిసి నిర్మిస్తున్న చిత్రమే ప్యార్ ప్రేమమ్ కాదల్. హరీష్కల్యాణ్, బిగ్బాస్ ఫేమ్ రైసా విల్సన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇలన్ దర్శకత్వం వహిస్తున్నారు. యువన్శంకర్రాజానే సంగీత బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రంలోని హై ఆన్ లవ్, డోప్ అనే పల్లవిలతో కూడిన రెండు పాటలను విడుదల చేశారు. ఈ పాటలకు సంగీత ప్రియుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని చిత్ర వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డోప్ అనే పాట యువతను ఉర్రూతలూగిస్తోందని చెబుతున్నారు. చిత్ర పూర్తి స్థాయి ఆడియోను జూలై మొదటి వారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. విభిన్న ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కించిన ప్యార్ ప్రేమమ్ కాదల్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉందని, నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. -
పట్టనంత ప్రేమ
ఎక్కువ ప్రేమను గానీ, ఎక్కువ ప్రేమల్ని గానీ కోరుకున్నప్పుడే ఆ మనుషుల్లో చోటు సరిపోక ప్రేమ వారిని వదిలిపోతుంది. లాస్ ఏంజెలిస్లో ఒక ఇళయరాజా ఉన్నాడు. నాదబ్రహ్మ. ఆయన శిష్యరికం దొరకడం అదృష్టం. ఏడాదికి ఇద్దరికే అవకాశం. ఆయనే డబ్బులు పెట్టుకుంటాడు. పేరు గిలాడ్.కెనడా నుంచి ఎరిక్ అనే డిగ్రీ చదువుతున్న కుర్రాడు ఆయన శిష్యరికానికి దరఖాస్తు చేసుకున్నాడు. లోకల్ నాదబ్రహ్మ ఆ కుర్రాడు. వచ్చేస్తుందనే స్నేహితులంతా అన్నారు. వచ్చింది. రిజెక్షన్ లెటర్! ఎరిక్ కుమిలిపోయాడు. బాధను అణుచుకుని డిగ్రీ పూర్తి చేశాడు. డిగ్రీ పూర్తిచేయడం అతడి కల కాదు. మ్యూజిక్లో డిగ్రీ ఎవరైనా చేస్తారు. గిలాడ్ దగ్గర మ్యూజిక్ నేర్చుకోవాలి. అదీ ఒరిజినల్ సర్టిఫికెట్! శిష్యరికం ఎలాగూ పోయింది, సాక్షాత్కారం దక్కినా చాలునని లాస్ ఏంజెలిస్ బయల్దేరి వెళ్లాడు. స్వామివారిని కలిశాడు. జన్మధన్యం అనుకున్నాడు. ‘ఆఫరిస్తే అప్పుడు రాలేదేం?’ అని అడిగాడు గిలాడ్. ఎరిక్ నివ్వెరపోయాడు. ‘రిజెక్ట్ చేశారు కదా గురువుగారూ’ అన్నాడు. ‘నేను రిజెక్ట్ చెయ్యడం ఏంటీ! రమ్మంటే నువ్వే కదా రాలేనని మెయిల్ పంపావు’ అన్నాడు గిలాడ్. ‘లేదు చూడండీ..’ అని తన ఇన్బాక్స్ చూపించాడు ఎరిక్. ‘అవునా! ఇదేంటి మరి?’ అని తన ఇన్బాక్స్ చూపించాడు గిలాడ్. అప్లికేషన్ రిజక్ట్ అయినట్లు శిష్యుడి బాక్స్లో ఉంది. రాలేనని తెలియజేసినట్లు గురువుగారి బాక్సులో ఉంది. అయితే ఆ మెయిల్ ఐడీలు మాత్రం వాళ్లవి కావు! ఈ ‘ఘాతుకానికి’ పాల్పడింది జెన్నిఫర్ అనే అమ్మాయి అని పోలీసు విచారణలో బయటపడింది. జెన్నిఫర్.. ఎరిక్ క్లాస్మేట్. కాలేజీలో అతడిని ప్రేమించిన అమ్మాయి. ఎరిక్ ‘ఇళయరాజా’ దగ్గరికి లాస్ ఏజెలిస్ వెళ్తానంటే నువ్వు లేకుండా ఉండలేనన్న అమ్మాయి. ‘వెళ్తే నామీదొట్టే’ అన్న అమ్మాయి. ఎరిక్ వినలేదు. జెన్నిఫర్ తను చేయాల్సింది తను చేసింది. గిలాడ్ పంపిన ఆఫర్ మెయిల్ను ఎరిక్ చూడకుండా డిలీట్ చేసి, అప్లికేషన్ని రిజెక్ట్ చేసినట్లు గిలాడ్ పేరు మీద ఎరిక్కి మెయిల్ పంపింది. ఇట్నుంచటు కూడా ‘నేను రాలేకపోతున్నాను’ అని ఎరిక్ పేరు మీద గిలాడ్కు మెయిల్ పెట్టింది. ఇదంతా తెలిసి ఎరిక్ నిర్ఘాంత పోయాడు. ప్రియురాలిపై కేసు పెట్టాడు. అమ్మాయి అబ్బాయికి మూడు లక్షల డెబ్బై ఐదు వేల డాలర్ల పరిహారం చెల్లించాలని కోర్టు రెండు రోజుల క్రితమే తీర్పు చెప్పింది. సంగీతమే తన జీవితం అనుకున్నాడు అతడు. అతడే తన జీవితం అనుకుంది ఆమె. కోరుకున్న దానిని సాధించాలన్న తపన అతడిది. కోరుకున్న వాడిని కోల్పోలేని బలేతనం ఆమెది. గట్టిగా చెయ్యి పట్టేసుకుంది. జీవితంలోని ప్రేమ, ఆపేక్ష ఇలాగే మనిషిని కదలనివ్వకుండా చేస్తాయి. ఆమెది స్వార్థం అనిపిస్తుంది. అతడిని ప్రేమిస్తున్నప్పుడు సంగీతంపై అతడికున్న ప్రేమకు ఆమె అడ్డుపడకూడదు కదా అనిపిస్తుంది. అలాగైతే అతడిదీ స్వార్థమే. ఆమె అంతగా అతడిని ప్రేమిస్తున్నప్పుడు ఆమెను వదిలేసి ఎలా వెళ్లాలనుకుంటాడు? డిగ్రీలో ఉన్నప్పుడే వీళ్లు విడిపోయారు. ఏవో కారణాలు. సంగీతం కాదు. ఈ ఈమెయిళ్లూ అవీ తర్వాత బయట పడినవి. ఎక్కువ ప్రేమను గానీ, ఎక్కువ ప్రేమల్ని గానీ కోరుకున్నప్పుడే ఆ మనుషుల్లో చోటు సరిపోక ప్రేమ వారిని వదిలిపోతుంది. జెన్నిఫర్ అతడి నుంచి ఎక్కువ ప్రేమను కోరుకుంది. ఎరిక్ ఆమె ఒక్క ప్రేమతోనే సరిపెట్టుకోలేకపోయాడు. – మాధవ్ శింగరాజు -
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా
-
‘ఇళయరాజా.. మణిరత్నా’ల్లాంటి పాటలు
దక్షిణాది సినీ ప్రపంచానికి ధృవతారలు వాళ్లు. ఒకరు దర్శకదిగ్గజమైతే, మరొకరు స్వరచక్రవర్తి. అందుకే వారి కాంబినేషన్లో వచ్చిన ప్రతీ సినిమా ఓ ఆణిముత్యంగా మిగిలిపోయింది. ప్రతీ సినిమా.. అందులోని పాటలు ‘మణిరత్నం’లా నిలిచిపోయాయి. ఈ తరానికి ఒకరు దర్శకత్వానికి మార్గదర్శకంగా మారారు. మరొకరు స్వరాల కొత్త అందాలు చూపారు. ఇద్దరూ ఇద్దరే. వీరిద్దరు ఒకే రోజు జన్మించడం వల్ల వీరిద్దరి భావాలు కలిసిపోయాయేమో. ఈ దర్శకుడి ఆలోచనలకు తన సంగీతంతో ప్రాణం పోశారు రాజా. సినీ ప్రపంచంలో వీరిద్దరు ఎప్పటికీ నిలిచిపోతారు. భారతీయ సినీ చరిత్రలో తమకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్న లెజెండ్స్ మణిరత్నం, ఇళయారాజాల పుట్టినరోజు నేడు. సమాజాన్ని ప్రతిభింబించే సినిమాలను చేయడం మణిరత్నం వంతు. ఆ సమాజాన్ని సైతం తన సంగీతంతో మాయ చేయడం ఇళయరాజా వంతు. మణిరత్నం తీసిన ప్రతీ సినిమా ఈ తరానికి ఒక దిక్సూచి లాంటిదే. అంజలి, గీతాంజలి, నాయకుడు, బొంబాయి, రోజా, ఇద్దరు, సఖి ఇలా ఎన్నో మరుపు రాని చిత్రాలను అందించారు. రోజా సినిమాకు ముందుకు వరకు మణిరత్నం సినిమాలకు ఇళయరాజానే సంగీతం సమకూర్చేవారు. ఆ సినిమాలు ప్రేక్షకుల్లో గుర్తుండిపోవడానికి ఇళయరాజా సంగీతం కూడా ఓ కారణమే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలోని పాటలన్నీ సంగీత ప్రియులకు ప్రియమైనవే. ‘సింగారాల పైరుల్లోనా బంగారాలే పండించాలన్నా’.. ‘అరె చిలకమ్మా చిటికేయంటా... నువ్వు రాగాలే తీయాలంటా’ అంటూ హుషారెత్తించే పాటలను అందించాలన్నా... ‘ఆడజన్మకు ఎన్ని శోకాలో..’, ‘నీ గూడు చెదిరింది.. నీ గుండె పగిలింది.. ఓ చిట్టి పావురమా...’ అంటూ కంటతడిపెట్టించగలరు. వీరిద్దరు ఎన్నో మధుర గీతాలకు ప్రాణం పోశారు. ‘నిన్నుకోరి వర్ణం వర్ణం.. సరి సరి కలిసేనే నయనం నయనం’, ‘ఒక బృందావనం సోయగం’ అంటూ సంగీత ప్రియులు ఎన్నటికీ గుర్తుంచుకునే గీతాల్ని అందించారు. ఇలా ఎన్నెన్నో పాటలకు ప్రాణం పోశారు వీరిద్దరు. ఇవన్నీ కూడా శ్రవణానందానికే కాకుండా, దృశ్యకావ్యం గానూ మలిచారు మణిరత్నం. ఇక తెలుగులో నేరుగా మణిరత్నం దర్శకత్వం వహించిన ఏకైక సినిమా గీతాంజలి. అది ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. తెలుగు సినిమాల్లో గీతాంజలిది ప్రత్యేకస్థానం. ఈ సినిమాలో ఇళయరాజా అందించిన ప్రతి పాట ఒక అద్భుతం. సినీ ప్రముఖులెందరో సోషల్ మీడియా ద్వారా ఈ ఇద్దరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
ఇళయరాజా ఏకలవ్య శిష్యుడిని..
సినీ సంగీతంలో కొత్త కెరటం యాజమాన్య తెనాలి: సినీ సంగీత సాగరంలో కొత్త కెరటం...యాజమాన్య. మ్యూజిక్ మాస్త్రో ఇళయరాజాకు ఏకలవ్య శిష్యుడు. ఆయన పాటతో అల్లుకున్న అనుబంధం సంగీతమే ప్రపంచమైంది. సినీ నేపధ్యం లేకుండానే సినిమా రంగంలోకి కాలుమోపాడు. కీబోర్డు ప్లేయరుగా వందలాది సినిమాల్లో అనుభవాన్ని రంగరించి, పదికి పైగా సినిమాలకు వినసొంపైన బాణీలను స్వరపరచి యువతరాన్ని ముగ్ధులను చేశారు. మరో అయిదు సినిమాలు కొద్దివారాల వ్యవధిలో విడుదల కానున్నాయి. తాజాగా పెదరావూరు ఫిలిమ్ స్టూడియో ఆధ్వర్యంలో నిర్మించనున్న ‘పండుగాడి ఫోటోస్టూడియో’ సినిమా సంగీతం కోసమని తొలిసారిగా నగరాన్ని వదిలి పెదరావూరు వచ్చారాయన. ‘సాక్షి’తో కొద్దిసేపు మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... పాట సంగీతం కేసి తీసుకెళ్లింది.. చిత్తూరు జిల్లా పలమనేరు నా స్వగ్రామం. తెలుగు కుటుంబమే. నా పూర్తి పేరు యాజమాన్య వినోద్. ‘పండుగాడి ఫొటోస్టూడియో’ నుంచి ఇంటి పేరు యాజమాన్యగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నా. మా ఇంట్లో ఎలాంటి సినీ నేపధ్యం లేదు. చదువుకొనే వయసులోనే సినిమా పాటలంటే ప్రాణం. ఇళయరాజా పాటలంటే చెప్పలేనంత ఇష్టం. ఆ స్ఫూర్తితో సంగీతంపై ఆసక్తి పెరిగింది. గిటార్ పట్టేలా చేసింది. కీబోర్డు ప్లేయరయ్యాను. ఎన్నో కచేరీలు చేశాను. వందేమాతరం శ్రీనివాస్ బృందంలో చేరాను. ‘జయం మనదేరా’ సినిమా రికార్డింగ్లో గిటారిస్ట్గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టా. కొద్దిరోజుల్లోనే కీబోర్డు ప్లేయరుగా అవకాశం లభించింది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో 300 సినిమాలకు పైగా పనిచేశాను. చక్రి, మణిశర్మ, కీరవాణి, తమన్..వంటి సంగీత దర్శకుల దగ్గర పనిచేయటం నా అదృష్టం. 2014 నుంచి సంగీత దర్శకత్వం 2014 నుంచి సొంతంగా సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నా. అంతా కొత్తవారితో తీసిన ‘నువ్వే నా బంగారం’ తొలి సినిమా. ‘పోరా పోవే’, ‘నాటుకోడి’, ‘అనగనగా ఒక చిత్రమ్’, ‘టైటానిక్’ (అంతర్వేది టు అమలాపురం), ‘పెళ్లికి ముందు ప్రేమకథ’, ‘రాక్షసి’, ‘దళపతి’, ‘అనగనగా ఒక ఊరిలో’, ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’ సినిమాలకు సంగీతం సమకూర్చా. మరో అయిదు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పోసాని సినిమా ‘దేశముదుర్స్’, ‘ప్రేమ ఎంత పనిచేసే నారాయణ’, ‘తమిళ తంబి’, ‘సమీరం’, ‘బొమ్మ అదుర్స్’ సినిమాలు మే/జూన్లో థియేటర్లకు రానున్నాయి. టైటానిక్ సినిమాలో ‘పడిపోతున్నా నీ మాయలో’, దళపతిలో ‘నీకూ నాకూ మధ్య ఏదో ఉంది’, అంటూ శ్రేయోఘోషల్ పాడిన పాటలు, ‘రాజూ..దిల్రాజూ’ పాటల యువతరాన్ని ఆకర్షించాయి. తొలిసారి గ్రామంలో... ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్లో ఉన్న ‘పండుగాడి ఫొటోస్టూడియో’ను పాటల రికార్డింగు నుంచి సినిమా షూటింగ్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఇక్కడే తీయాలనేది దర్శకుడు దిలీప్రాజా నిర్ణయం. నగరానికి దూరంగా పెదరావూరు గ్రామంలో పాటల కంపోజింగ్ చేస్తున్నాం. ఇదో కొత్త అనుభవం నాకు. జంధ్యాల మార్కు కామెడీతో కూడిన స్క్రిప్టుకు ఆ తరహా పాటల కంపోజింగ్ చేస్తున్నాం. బ్లాక్బస్టర్ కోసం.. సినిమా సంగీతంలో మునిగితేలుతూనే బీకాం కంప్యూటర్స్ పూర్తి చేశా. పెద్ద సినిమాలకు కీ బోర్డు ప్లేయరుగానూ సహకారం అందిస్తున్నా. నా సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలన్నీ జనాలకు వెళుతున్నాయి. ఆదరిస్తున్నారు. బ్లాక్ బస్టర్ రావాల్సి ఉంది. ఆరోజుకోసం చూస్తున్నా. మెలోడీనే కాకుండా అన్ని రకాల సినిమాలు చేయాలి. అంతర్జాతీయస్థాయిలో ఎదగాలి, అనేది నా లక్ష్యం. -
నువ్వు పట్టుచీర కడితే...
సినిమా పాటను ఒక కావ్యస్థాయికి తీసుకెళ్లడం ప్రతిసారీ జరగదు. చిక్కటి కవిత్వం జాలువారిన అరుదైన వ్యక్తీకరణలు కొన్నిసార్లు చెవులకు మహా ఇంపుగా వినబడతాయి. అట్లాంటి ఒక భావన ‘సీతాకోకచిలుక’ చిత్రం కోసం వేటూరి సుందరరామ్మూర్తి రాశారు. ‘అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే’ గీతంలోని ఒక చరణంలో ఆయన రాసిన ఈ పాదాల్లో ఎంత కవిత్వం ఉంది! ప్రేయసిని ఇంతకంటే పొగడటం ఏ ప్రియుడికైనా సాధ్యమా! ‘నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మ ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ. దీనికి సంగీతం సమకూర్చింది ‘మైస్ట్రో’ ఇళయరాజా. పాడింది వాణీ జయరాం, ఇళయరాజా. 1981లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు భారతీరాజా. కార్తీక్, ముచ్చర్ల అరుణ నటించారు. ఒకేసారి షూటింగ్ ప్రారంభించిన ఈ ద్విభాషా చిత్రంలో, తమిళంలో ఇదే అర్థం వచ్చే పంక్తులు ఉండటమూ, వాటి కర్త వైరముత్తు అని ఉండటమూ విశేషం. అయితే ఈ భావానికి ఎవరు అసలు కర్త అనేది పరిశోధకులు తేల్చాల్సిన అంశం. -
సంగీత మాంత్రికుడి మరో రికార్డు
కీర్తి అంతా భగవంతుడికే. మణిరత్నం చిత్రం కాట్రువెలియిడై చిత్రానికి జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఆయన ఆలోచనల సముద్రం. మణిరత్నం చిత్రం తనకెప్పుడూ ప్రత్యేకమే. మణిరత్నం అన్నయ్య, కార్తీ, చిత్ర యూనిట్ అందరికీ కృతజ్ఞతలు. దేశానికి చాలా అవసరమైన చిత్రానికి తనకు జాతీయ అవార్డు రావడం సంతోషం అన్నారు. మామ్ చిత్రం కోసం నటి శ్రీదేవి చెన్నైకి వచ్చినప్పుడు ఇది చాలా స్పెషల్. అయితే నటి శ్రీదేవినే మిస్ అయ్యాం. సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ మరో రికార్డును సాధించారు. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఉప్పొంగే ఓ కెరటం ఏఆర్ రెహ్మాన్. సినీ సంగీతాన్ని కొత్తబాట పట్టించిన ధ్రువతార ఈయన. శాస్త్రీయ, కర్ణాటక, పాశ్చాత్య సంగీతాలతో సినీ ప్రేక్షకులను ఓలలాడించిన సంగీత మాంత్రికుడు రెహ్మాన్. సంగీతాన్ని ఎప్పటికప్పుడు కొత్త పుంతులు తొక్కిస్తూ ప్రయోగాల వీరుడిగా పేరు గాంచిన ఏఆర్ రెహ్మాన్ సినీ సంగీతానికే ఒక బ్రాండ్గా నిలిచారు. 25 ఏళ్ల కిందట రోజా చిత్రంతో సువాసనలు వెదజల్లి తొలి చిత్రంతోనే జాతీయ అవార్డును కొల్లగొట్టిన సంగీత గని రెహ్మన్. అలా మొదలైన ఈయన సంగీత పయనం కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ దాటి హాలీవుడ్లో పరవళ్లు తొక్కింది. మహామహులైన భారత సినీ కళాకారులకు కలగా మిగిలిన ఆస్కార్ అవార్డును స్లమ్డాగ్ మిలియనీర్ చిత్రంతో అవలీలగా సాధించారు. సినీ భారతావని కీర్తి కిరీటాలను ప్రపంచానికి చాటారు. సంగీతం ఎల్లలు చెరిపేసిన ఈయన ఎందరో నూతన గాయనీగాయకులకు అవకాశాలను కల్పించి అందులోనూ రికార్డు సాధించారు. రోజా చిత్రంతోనే జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డును గెలుచుకున్న ఏఆర్.రెహ్మాన్ ఆ తరువాత మిన్సార కనువు, కన్నత్తిల్ ముత్తమిట్టాల్ చిత్రాలకు జాతీయ అవార్డును గెలుచుకున్నారు. అదే విధంగా ఉత్తరాది చిత్ర పరిశ్రమకు వెళ్లి అక్కడ లగాన్ చిత్రానికి జాతీయ అవార్డును కైవసం చేసుకున్నారు. తాజాగా కాట్రువెలియిడై తమిళ చిత్రానికి ఉత్తమ సంగీతదర్శకుడి అవార్డును, హిందీ చిత్రం మామ్ చిత్రానికి ఉత్తమ నేపథ్య సంగీతానికి గానూ జాతీయ అవార్డును గెలుచుకున్నారు. 65వ జాతీయ సినీ అవార్డులను వివరాలను శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతకు ముందు ఒకే వేదికపై స్లమ్డాగ్ మిలీనియర్ చిత్రానికి రెండు ఆస్కార్ అవార్డులను అందుకున్న రెహ్మాన్ రికార్డు నెలకొల్పారు. అదే విధంగా ఇప్పుడు ఒకే సారి రెండు జాతీయ అవార్డులను అందుకోనున్నారు.ఇదీ రికార్డే. ఇళయరాజా రికార్డు బ్రేక్ ప్రఖ్యాత సంగీతదర్శకుడు ఇళయరాజా సాధించిన జాతీయ అవార్డుల రికార్డును రెహ్మాన్ బ్రేక్ చేశారు. ఇళయరాజా ఇప్పటి వరకూ 5 జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఏఆర్.రెహ్మాన్ ఇంతకు ముందు రోజా, కన్నత్తిల్ ముత్తమిట్టాల్, మిన్సార కనవు, లగాన్ చిత్రాలకు జాతీయ పురష్కారాలను అందుకున్నారు. తాజాగా కాట్రువెలియిడై తమిళ చిత్రంకు, హింది చిత్రం మామ్కు గానూ రెండు జాతీయ అవార్డులను గెలుచుకుని ఆరు జాతీయ పురష్కారాలను అందుకున్న సంగీత దర్శకుడిగా ఇళయరాజా రికార్డును బ్రేక్ చేశారు. 65 వ జాతీయ అవార్డుల ప్రకటనలో ఈ సారి తమిళ చిత్ర పరిశ్రమ మూడు అవార్డులను గెలుచుకుంది. అందులో కాట్రువెలియిడై చిత్రానికి గానూ ఏఆర్.రెహ్మాన్, టూలెట్ అనే తమిళ చిత్రానికి ప్రాంతీయ చిత్రాల కేటగిరిలో ఉత్తమ చిత్రంగానూ, కాట్రులియిడై చిత్రంలోని వాన వరువాన్ అనే పాటకుగానూ గాయని శాషా త్రిపాధి జాతీయ అవార్డులను ప్రకటించారు. ఇలా ఈ సారి మణిరత్నం తమిళ చిత్రపరిశ్రమ గౌరవాన్ని కాస్త కాపాడారనే చెప్పాలి. -
భానూదయాన.. చంద్రోదయాలు
చిత్రం: మహర్షి రచన: నాయని కృష్ణమూర్తి గానం: బాలు, జానకి సంగీతం: ఇళయరాజా ‘మహర్షి’ సినిమాలోని ఈ పాట నేపథ్యం ఈ సందర్భంగా గుర్తుకు వస్తోంది. ఈ చిత్రంలో కొత్తవారితో ఒక పాట రాయించాలనుకున్నాను. అలా ‘సుమం ప్రతి సుమం సుమం...’ పాటతో నాయని కృష్ణమూర్తి కొత్త రచయితగా సినీరంగ ప్రవేశం చేశారు. మదురైలోని హోటల్ తమిళనాడులో కూర్చుని కంపోజ్ చేస్తే హిట్ అవుతుందని ఇళయరాజాకి ఒక సెంటిమెంట్ ఉంది. ఆయన అక్కడ కూర్చుని ట్యూన్ చేసి ఇచ్చారు. ఆ ట్యూన్ను నాయని కృష్ణమూర్తికి ఇచ్చి పాట రాయమన్నాను. ఆయన వారం రోజుల పాటు కష్టపడి పాట రాశారు. పాట పాడించడానికి ఎస్ పి బాలు, ఎస్. జానకిలను రప్పించాం. పాడటానికి వస్తున్న సమయంలో, ఇళయరాజా ఆ పాట ట్యూన్ మళ్లీ విని, ‘ఇది నాకు నచ్చలేదు’ అని మళ్లీ కొత్త ట్యూన్ కట్టారు. ఈలోగా గాయకులు వచ్చేశారు. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే మళ్లీ నాయని కృష్ణమూర్తిని రప్పించి, కొత్త ట్యూన్కి పాట రాయమని అడిగాను. ముందుగా పల్లవి రాసి ఇచ్చారు. పల్లవి రికార్డింగు అవుతుండగా చరణం రాశారు. ఇలా మొత్తం పాటను గంటలో రాసి ఇచ్చారు. మరో విషయం ఏంటంటే... ఈ పాట సోలోకి అనువుగా కంపోజ్ చేశారు ఇళయరాజా. అప్పటికే ఎస్. జానకి వచ్చేయడంతో, ఆ పాటలో ఆవిడ చేత హమ్ చేయించాం. పాట కోసం చాలా కష్టపడ్డాం. ఇలా ఆ పాట పుట్టింది.‘సుమం ప్రతి సుమం సుమం’ అంటూ అందమైన పదాల పూలతో అల్లుకున్న పందిరి ఈ పాట. సువాసనలు వెదజల్లే కుసుమాల వంటి పదాలతో అల్లిన మాలిక ఈ పాట. భావకవిత్వ పలుకులతో గుది గుచ్చిన పుష్పగుచ్ఛం ఈ పాట. కథానాయికను ఊహించుకుంటూ కథానాయకుడు చేసిన భావ ప్రకటనే ఈ పాట. కవి భావన హృద్యంగా ఉంటుంది. ‘భానూదయాన... చంద్రోదయాలు....’ తన కలల కథానాయికను చూడగానే సూర్యోదయ సమయాన చంద్రోదయం అయినట్లు భావిస్తాడు ప్రియుడు. ఆమె గొంతు విప్పి గానం చేస్తుంటే, అది వేణు నాదమో, వీణా నాదమో తెలియనంత సుస్వరంగా ఉంది ఆమె కంఠం అని ప్రస్తుతిస్తాడు. ప్రేమలో పడినవారికి... తమ ప్రియురాలిని తలచుకుంటే హృదయమంతా ఆనంద తరంగితమవుతుంది. ప్రేమ మహిమ అంటే ఇదేనేమో. ప్రపంచమంతా అందంగా అనిపిస్తుంది. ఆకాశమంతా తెల్లగా ప్రశాంతంగా ఉన్నప్పటికీ, రంగురంగుల ఆకాశాన్ని ఊహిస్తాడు. ఆమెను ప్రణయరాగ దేవతగా, చెలియ ప్రణయాన్ని అందుకోవడం ఒక వరంగా భావిస్తాడు ప్రేమికుడు. తన మనసులో ప్రేయసిని ఊహించుకుంటూ కలిగే సౌఖ్యం... స్థిరంగా, మధురంగా ఉంటుందనుకుంటాడు. తన మనసంతా ప్రేమమయంగా ఊహల్లో విహరిస్తాడు. ప్రపంచమంతా ప్రణయ కలహాలు కూడా ఉంటాయనుకుంటాడు. ఈ పాటలో హృదంతరం, సురతం, రాగోల్లసాలు... వంటి మంచి మంచి పదాలను ఉపయోగించారు రచయిత. ఒక ప్రేమికుడి అంతరంగాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన పాట ఇది. ఈ పాట ఒక కొత్త రచయిత రాసిన భావన కలగదు. అప్పటికే ఎన్నో సినీ గీతాలు రచించిన అనుభవజ్ఞుడిలా రాశారు రచయిత నాయని కృష్ణమూర్తి. – వైజయంతి -
ఇళయరాజా, విజయ్సేతుపతిల మామనిధన్
తమిళసినిమా: సంగీతజ్ఞాని ఇళయరాజా, యువన్శంకర్రాజా,విజయ్సేతుపతి కలిస్తే మామనిధన్. అర్థమైందను కుంటా. భారతరత్న తరువాత స్థాయి అవార్డు పద్మవిభూషణ్ సత్కారాన్ని అందుకోనున్న మేస్ట్రో ఇళయరాజా తాజాగా సంగీత బాణీలు కడుతున్నది ఎవరి చిత్రానికో తెలుసా? ఆయన కొడుకు యువన్శంకర్రాజా నిర్మించనున్న చిత్రానికే. ఈ క్రేజీ చిత్రానికి మామనిధన్ అనే పేరును నిర్ణయించారు. ఇందులో సక్సెస్ఫుల్ నటుడు విజయ్సేతుపతి కథానాయకుడిగా నటించనున్నారన్నది తాజా వార్త. సంగీతజ్ఞాని ఇళయరాజా చాలా కాలం క్రితమే నిర్మాతగా మారి నటుడు కమలహాసన్ హీరోగా సింగారవేలన్ అనే చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఆయన తనయుడు, ప్రముఖ సంగీతదర్శకుడు యువన్శంకర్రాజా కూడా ఆయన బాటలోనే పయనిస్తున్నారు. వైఎస్ఆర్ ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణం ప్రారంభించి ఇప్పటికే ప్యార్ ప్రేమ కాదల్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరీష్కల్యాణ్, నటి రైజా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇలన్ దర్శకత్వం వహిస్తున్నారు. యువన్నే సంగీత బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రం సమ్మర్ స్పెషల్గా విడుదలకు ముస్తాబవుతోంది. యువన్ మరో చిత్రానికి రెడీ అయ్యారు. అదే మామనిధన్ (మహామనిషి) చిత్రం. ఇందులో విజయ్సేతుపతి కథానాయకుడిగా నటించనున్నారు. శీనురామస్వామి దర్శకత్వం వహించనున్నారు. ఇతర వివరాలు వెలువడాల్సి ఉంది. ఈ చిత్రానికి తన తండ్రి ఇళయరాజాకు సంగీత బాధ్యతలు అప్పగించారు. ఇళయరాజా ఇప్పటికే ఈ చిత్రానికి సంగీత బాణీలు కట్టడంతో మునిగిపోయారట. దీని గురించి యువన్శంకర్రాజా తెలుతూ భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో తన తండ్రి ఇళయరాజాను సత్కరించనున్న నేపథ్యంలో తమ మామనిధన్ చిత్రానికి పూర్తి న్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఒక కొడుకుగానే కాకుండా అభిమానిగానూ సంగీతదర్శకుడైన తన తండ్రిని చూసి గర్వపడుతున్నానన్నారు. సంగీతంలో ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నానని తెలిపారు. తన సంగీత పయనంలో తన సోదరుడు కార్తీక్రాజా సహాయ సహకారం చాలా ఉందని యువన్శంకర్రాజా అన్నారు. -
రాజా ది గ్రేట్
-
ఇళయరాజాకు పద్మవిభూషణ్.. ధోనికి పద్మభూషణ్
-
ఇళయరాజాకు పద్మవిభూషణ్
న్యూఢిల్లీ: 2018 సంవత్సరానికి 85 మంది పేర్లతో పద్మ అవార్డుల (పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ) జాబితాను గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ రంగాల్లో నిష్ణాతులు, అద్భుతమైన సేవాకార్యక్రమాలు చేపడుతున్నా ఇన్నాళ్లుగా సరైన గుర్తింపునకు నోచుకోని హీరోలకు పద్మ అవార్డుల జాబితాలో చోటు కల్పించింది. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా (74)తో పాటుగా హిందుస్తానీ సంగీత విద్వాంసుడు గులాం ముస్తఫా ఖాన్, వివేకానంద కేంద్రం (కన్యాకుమారి) అధ్యక్షుడు పరమేశ్వరన్లు కూడా భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. 2009లో ఇళయరాజా పద్మ భూషణ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. పద్మశ్రీ జాబితాలో పేదలకు సేవ చేసిన వారికి, ఉచిత పాఠశాలలు ఏర్పాటుచేసిన వారికి గిరిజన కళలకు ప్రపంచ ప్రఖ్యాతి అందించిన వారికి చోటు కల్పించింది. పద్మ భూషణ్ జాబితాలో ప్రముఖులు పద్మ భూషణ్ జాబితాలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, బిలియర్డ్స్ ప్రపంచ చాంపియన్ పంకజ్ అడ్వాణీ, గోవా చిత్రకారుడు లక్ష్మణ్ పాయ్, ఆధ్యాత్మికవేత్త ఫిలిపోస్ మార్ క్రిసోస్టోమ్, పురాతత్వవేత్త రామచంద్రన్ నాగస్వామిసహా తొమ్మిది మంది ఉన్నారు. సామాజికసేవ, ప్రజాసంబంధాలు, ఇంజనీరింగ్, వాణిజ్య, విద్య, వైద్య, సాహిత్య, క్రీడలు తదితర రంగాల్లో సేవలందించిన 73 మంది ప్రముఖులను పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ అవార్డుల్లో తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. ఏపీ నుంచి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ ఒక్కరే పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. అభయ్ బంగ్–రాణిబంగ్ (సంయుక్తంగా వైద్యరంగం)–మహారాష్ట్ర, దామోదర్ గణేశ్ బాపత్ (సామాజికసేవ)–ఛత్తీస్గఢ్, సైకోమ్ మీరాబాయ్ చాను (వెయిట్లిఫ్టింగ్)– మణిపూర్ తదితరులు పద్మశ్రీ జాబితాలో ఉన్నారు. ఇన్నాళ్లూ గుర్తింపునకు నోచుకోని వారికి సరైన గౌరవం కల్పిస్తామని చెబుతూ వస్తు న్న కేంద్ర ప్రభుత్వం.. ఇందుకు తగ్గట్లుగా నే.. సామాజిక సేవ చేస్తున్న వారికి పద్మశ్రీ అవార్డుల జాబితాలో చోటు కల్పించింది. అవార్డు గ్రహీతల్లో విదేశీయులు! ఈ ఏడాది పద్మ అవార్డుల జాబితాలో 16 మంది విదేశీ, ఎన్నారై ప్రతినిధులున్నారు. ఇందులో ముగ్గురు మరణానంతరం పద్మ అవార్డులు అందుకోనున్నారు. భారత్లో రష్యా రాయబారిగా పనిచేసిన అలెగ్జాండర్ కడాకిన్కు (మరణానంతర) పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక చేసింది. వాణిజ్యరంగంలో సేవలకు గానూ ఫిలిప్పీన్స్కు చెందిన జోస్ మాజోయ్, మలేసియాకు చెందిన నృత్యరంగ ప్రముఖుడు రామ్లీ బిన్ ఇబ్రహీం, బౌన్లాప్ కియోకంగ్నా (లావోస్), టామీ కో (సింగపూర్), హున్ మెనీ (కంబోడియా), నౌఫ్ మార్వై (సౌదీ అరేబియా), తోమియో మిజోకమి (జపాన్), సోమ్డెట్ ఫ్రా మా (థాయ్లాండ్), థాంట్ మైయింట్ (మయన్మార్), ఐ న్యోమన్ నౌతా (ఇండోనేసియా), మలై హాజీ అబ్దుల్లా (బ్రూనై దారుస్సలాం), హబీబుల్లో రాజా బౌ (తజకిస్తాన్), డాక్టర్ సందుక్ రుయిత్ (నేపాల్), ఎన్గుయెన్ తీన్ (వియత్నాం)లు పద్మశ్రీ అవార్డులు అందుకోనున్నారు. పద్మవిభూషణ్, పద్మభూషణ్ విజేతలు పద్మవిభూషణ్: ఇళయరాజా (సంగీతం)–తమిళనాడు, గులాం ముస్తఫాఖాన్ (సంగీతం)–మహారాష్ట్ర, పరమేశ్వరన్ పరమేశ్వరన్ (సాహిత్యం, విద్యారంగం)– కేరళ. పద్మ భూషణ్: మహేంద్ర సింగ్ ధోనీ (క్రికెట్)–జార్ఖండ్, పంకజ్ అడ్వాణీ (బిలియర్డ్స్)– కర్ణాటక, ఫిలిపోస్ మార్ క్రిసోస్టోమ్ (ఆధ్యాత్మికం)–కేరళ, అలెగ్జాండర్ కడాకిన్ (ప్రజాసంబంధాలు)–రష్యా (మరణానంతర/విదేశీ), రామచంద్రన్ నాగస్వామి (పురాతత్వ విభాగం)–తమిళనాడు, వేదప్రకాశ్ నంద (సాహిత్యం, విద్యారంగం)–అమెరికా, లక్ష్మణ్ పాయ్ (కళారంగం)–గోవా, అరవింద్ పారిఖ్ (సంగీతం)–మహారాష్ట్ర, శారదాసిన్హా (సంగీతం)–బిహార్. మట్టిలో మాణిక్యాలు పద్మశ్రీ అవార్డులు అందుకున్న వారిలో కొందరు లక్ష్మీ కుట్టి: కేరళకు చెందిన గిరిజన మహిళ ఈమె. 500 రకాల మూలికలతో మందులను తయారుచేసి వేల మంది గిరిజనులకు వైద్యసాయం అందిస్తున్నారు. కొండల్లో ఉంటూ పాముకాటుకు గురైన వారికి ప్రాథమిక వైద్యంతో ప్రాణాలు కాపాడుతున్నారు. కేరళ ఫోక్లోర్ అకాడమీలో చదువు చెప్పే లక్ష్మి కుట్టి.. అడవిలో గిరిజనులతో కలిసి తాటిచెట్టు ఆకులతో చేసిన చిన్న గుడిసెలో నివసిస్తున్నారు. అరవింద్ గుప్తా: ఐఐటీ కాన్పూర్లో విద్యనభ్యసించారు. చెత్తనుంచి సైన్స్ను నేర్చుకోవటంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు స్ఫూర్తినిస్తున్నారు. నాలుగు దశాబ్దాల్లో 3వేల పాఠశాలలను సందర్శించి.. పనికిరాని వస్తువుల సాయంతో బొమ్మలను రూపొందించటంపై 18 భాషల్లో 6,200 లఘుచిత్రాలను రూపొందించారు. 1980ల్లో తరంగ్ పేరుతో విద్యార్థులకోసం టీవీషోను నిర్వహించారు. భజ్జు శ్యామ్: అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందిన గోండు చిత్రకారుడు భజ్జు శ్యామ్. పేద గిరిజన కుటుంబంలో పుట్టిన భజ్జు శ్యామ్ రాత్రి వాచ్మన్గా, ఎలక్ట్రిషియన్గా కుటుంబ పోషణ చేసేవారు అనంతరం ప్రొఫెషనల్ ఆర్టిస్టుగా యురప్లో గోండు పెయింటింగ్స్ (మధ్యప్రదేశ్లోని గిరిజన సంప్రదాయ చిత్రకళ) ద్వారా ప్రాముఖ్యత సంపాదించారు. ఐదు విదేశీ భాషల్లో ఈయన రూపొందించిన ‘ద లండన్ జంగిల్ బుక్’ 30వేల కాపీలు అమ్ముడుపోయింది. సుధాంషు బిశ్వాస్: 99 ఏళ్ల స్వాతంత్య్ర సమరయోధుడు. ఇప్పటికీ పేదల సేవలోనే జీవితాన్ని గడుపుతున్నారు. వీరికోసం పాఠశాలలు, అనాథాశ్రమాలు ఏర్పాటుచేశారు. మురళీకాంత్ పేట్కర్: 1965 భారత్–పాక్ యుద్ధంలో భుజం తెగిపడినా తెగువప్రదర్శించారు. పారాలింపిక్స్లో భారత్కు తొలి బంగారు పతకం అందించారు. ఎమ్ఆర్ రాజగోపాల్: కేరళలో సుపరిచితమైన వైద్య ప్రముఖుడీయన. నవజాత శిశువులకు సంబంధించిన వైద్యం ఈయన ప్రత్యేకత. సుభాషిణి మిస్త్రీ: గ్రామీణ పశ్చిమబెంగాల్లోని పేద మహిళ. ఈమె 20 ఏళ్లపాటు ఇళ్లలో పాచిపని, రోజూవారీ కూలీగా పనిచేసి పేద ప్రజల కోసం హాస్పిటల్ కట్టించారు. రాజగోపాలన్ వాసుదేవన్: భారత్లో ప్లాస్టిక్ రోడ్ల తయారీతో ఈయన ప్రాచుర్యం పొందారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లను నిర్మించటంలో సృజనాత్మక పద్ధతుల్లో ప్రయత్నించినందుకు పెటెంట్ కూడా పొందారు. -
తనయుడి కోసం ఇళయరాజా..!
దేశగర్వించదగ్గ సంగీత దర్శకుల్లో ఒకరు మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా. ఎన్నో చిరస్మరణీయ గీతాలను అందించిన ఈ లెజెండ్, ఆయన సంగీత దర్శకత్వంలో పలు గీతాలను ఆలపించారు. అయితే ఇతర సంగీత దర్శకుల కోసం ఇళయరాజా పాటలు పాడిన సందర్భాలు చాలా అరుదు. అలాంటి అరుదైన సంఘటన ఇటీవల జరిగింది. ఓ యువ సంగీత దర్శకుడు స్వరపరిచిన పాటను ఇళయరాజా ఆలపించారు. అయితే ఆ యువ సంగీత దర్శకుడు ఇళయరాజా వారసుడు యువన్ శంకర్ రాజానే కావటం విశేషం. ధనుష్ హీరోగా ఘనవిజయం సాధించిన మారికి సీక్వల్గా అదే కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘మారి 2’ కోసం ఇళయరాజా ఓ గీతాన్ని ఆలపించారు. ఇటీవల ఈ సాంగ్ రికార్డింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని హీరో ధనుష్ తన సోషల్ మీడియా పేజ్ ద్వారా వెల్లడించారు. So happy to announce that the maestro isaignani ilayaraja sir sang a song today for #maari2. What a delightful divine experience. We feel so blessed and super thrilled. @thisisysr @directormbalaji pic.twitter.com/6pNRj09aZ7 — Dhanush (@dhanushkraja) 16 January 2018 -
ఒక పల్లవి నాలుగు చరణాలు
అమ్మాయిలని నోట్స్ అడగడం కూడా చాలా కష్టమైన రోజులు అవి. వారి కళ్లల్లో కళ్లు పెట్టి చూడటం తప్పు. పలకరించడం నేరం. కాఫీకి పిలవాలంటే న్యూక్లియర్ ఫార్ములాను డిరైవ్ చేసినంత పని. ఇక లవ్ లెటర్... హడల్. అబ్బాయిలు వేరు... అమ్మాయిలు పూర్తిగా వేరు అనుకునే 1990ల రోజులు అవి. పొడుగు జడలు, పవిటా పావడాలు, బిఎస్ఏ ఎస్సల్లార్ ఎక్కి తల వొంచుకుని వెళ్లి చదువుకునే అలాంటి రోజుల్లో ఇవాళ అమెరికాలో జరుగుతున్నట్టుగా, ఇండియాలో ఇంకా మొదలు కాలేదు, ఒక అమ్మాయి నలుగురు అబ్బాయిలు ఒకే గదిలో ఉంటే? వారు రూమ్ను షేర్ చేసుకుంటే? స్నేహాన్ని పంచుకుంటే... ఒకరిని ఒకరు గౌరవించుకునేలా ఉంటే? ఇలాంటి కథా? ఇలాంటి కథే అన్నాడు త్రివిక్రమన్. తీశాడు. ప్రేక్షకుల ముందు ఉంచాడు. జనం ఏం చేశారు? వాళ్లల్లో ఒకడు తనను తాను ఎస్.పి.బి అనుకున్నాడు. ఇంకొకడు ఇళయరాజా అనుకున్నాడు. మరొకడు కె.వి.మహదేవనో, పుహళేందో. నలుగురూ మద్రాసు చేరారు మ్యూజిక్ రంగంలో రాణిద్దామని. ఎవరూ ఆదరించలేదు. ఏవీఎం, విజయా గార్డెన్స్ గేట్లు వారి కోసం తెరుచుకోలేదు. పాట అందుకుంటే, కీర్తన ఆలపిస్తే కడుపు నిండదు. తినడానికి డబ్బులు కావాలి. వారి దగ్గర లేవు. ఆత్మాభిమానానికి ఆకలి ప్రథమ శత్రువు. వాళ్లు నలుగురు స్ట్రీట్ సింగర్స్గా మారారు. చెట్టు కింద, పేవ్మెంట్ మీద, బీచ్లో, బస్టాండ్ సమీపంలో గుడ్డ పరిచి పాట మొదలుపెట్టారు. రోజూ నాలుగు చోట్ల కచ్చేరీలు. దారిన పోయేవాళ్లు ఆగి కాసేపు విని చిల్లర పడేస్తే ఆ పూటకు భోజనం. లేకుంటే లేదు. వాళ్లు బతకడమే కష్టం అనుకుంటే ఇంకో పొట్ట కూడా తోడు చేరింది. అమ్మాయి. ఇప్పుడేమవుతుంది? మద్రాసులో ఏదో అడ్రస్ కోసం వెతుక్కుంటూ ఆ అమ్మాయి ఊరు విడిచి వచ్చింది. ఆ అడ్రస్లో ఆమెకు కావలిసినవారు లేరు. వీళ్లు కనిపించారు. ఆ అమ్మాయి వీరి వెంట నడిచింది. వయసులో ఉన్న కుర్రాళ్లందరూ గోడలు దూకేవాళ్లే అయి ఉండరు. కొందరు ఆశ్రయం కోరేవారికి పైకప్పుగా కూడా నిలబడగలుగుతారు. ఆ అమ్మాయి కష్టంలో ఉందని ఆ నలుగురు గ్రహించారు. తమ గదిలోనే చోటు ఇచ్చారు. వీధి ఆశ్చర్యపోయింది. హౌస్ ఓనరమ్మ ముక్కున వేలేసుకుంది. కాని మన ప్రవర్తనే మనకు సర్టిఫికెట్ ఇస్తుంది. త్వరలోనే వారిని ఆ వాడ యాక్సెప్ట్ చేసింది. డాబా మీద గది. రోజూ కనిపించే చందమామ. పిసినారితనం చూపకుండా హాయిగా వీచే చల్లగాలి. కొద్దిగా తిన్నా కడుపు నింపగల అన్నం. చేయగలిగిన కూర. బోలెడన్ని కబుర్లు. శ్వాస అంత సులభంగా తోడుగా ఉండే పాట. పాటలలోన జీవితమే పలికేను అంట.. మాటలలో చందనమే వెదజల్లేనంట... ఒక పల్లవికి నాలుగు చరణాలు తోడయ్యాయి. వాళ్లు జీవితంలో పైకి రావాలంటే వీధుల వెంట పాడటం మాని మంచి అవకాశాల కోసం ప్రయత్నించాలి అని ఆ అమ్మాయి వారికి చెబుతుంది. దాని కోసం జరిగే కాంపిటీషన్లో పాల్గొనడానికి ఏరోజుకారోజు డబ్బు కూడబెట్టేలా చేస్తుంది. ఈ లోపు ఆమె గతం కూడా వారికి చెబుతుంది. ఆమె ప్రేమించినవాడు దేశంలో లేడు. రేపో మాపో వస్తాడు... వస్తే అతడిని పెళ్లి చేసుకోవాలి... అందుకోసమే ఎదురు చూస్తోంది... ఆ విషయం తెలిసి వాళ్లు నలుగురు సంతోషపడతారు. అందరూ ఆ రాబోయేవాడి కోసం ఎదరు చూస్తూ ఉంటారు. కాని వచ్చేవాడు ఫల్గుణుడు కాదు. ఫాల్తు వెధవ. కుసంస్కారి. ఆడపిల్లకు వ్యక్తిత్వం ఉందని లోకం అంగీకరించదు. మగవాళ్లు స్నేహానికి, వ్యక్తిత్వానికి విలువ ఇస్తారన్నా లోకం నమ్మదు. ఒక అమ్మాయి నలుగురు అబ్బాయిలు ఒకే గదిలో సంవత్సరం పాటు ఉంటున్నారంటే వాళ్ల మధ్య ఏమీ ఉండకుండా ఉంటుందా? కథ చూస్తున్న ప్రేక్షకులకు వారి మధ్య ఏమీ లేదని తెలుస్తూ ఉంటుంది. కాని పాత్రధారి అయిన ఆ అమ్మాయి ప్రియుడికి మాత్రం తెలియదు. అతడు తెలివి మీరుతాడు. ఏకంగా ఆ అమ్మాయిని తీసుకెళ్లి కన్యత్వ పరీక్ష చేయిస్తాడు. అమ్మాయి హర్ట్ అవుతుంది. ఎందుకు చేయించావ్ అని అడిగితే పావలా రీఫిల్ కొనేటప్పుడు కూడా నాలుగుసార్లు రాసి చూసి కొంటాము... జీవితాంతం చూసుకోవాల్సిన వ్యక్తి ఎలా ఉందో తెలుసుకోవాల్సిన అవసరం లేదా అంటాడు. సీతకు కూడా అగ్నిపరీక్ష ఉందని అంటాడు. ‘సీత చెడిపోవాలనుకుంటే అయోధ్యలోనే చెడిపోయి ఉండవచ్చు. అశోకవనంలోనే కాదు’ అంటుంది ఆ అమ్మాయి. ‘ఎవరైతే నన్ను నమ్మాలో నువ్వు నన్ను నమ్మలేదు. ఎవరినైతే నేను అనుమానంగా చూడాలో వారు నన్ను నమ్మారు. ఇక నీకూ నాకూ పడదు. గుడ్బై’ అని ఆ అమ్మాయి అతణ్ణి వదిలి తను ఇష్టపడే, గౌరవించే నలుగురు స్నేహితుల దగ్గరకు వచ్చేస్తుంది. వాళ్ల ట్రూప్లో సభ్యురాలిగా ఉండిపోతుంది. ఆ ఐదుగురు కలిసి ఇప్పుడొక స్నేహగీతం అయ్యారు. దానిని సరిగా వినగలిగే సంస్కారం ఉన్నవాళ్లే వాళ్లకు తోడవుతారు. లేకుంటే? వాళ్ల దారిలో వారలా సాగిపోతూనే ఉంటారు. అమ్మాయి అబ్బాయి అనగానే ప్రేమ, కామం అని స్థిరపడిన లోకానికి వారి మధ్య స్నేహం కూడా సాధ్యమే అని చాలా తర్కబద్ధంగా, సంస్కారవంతంగా నిరూపించిన కథ కొద్దిగా అయినా ప్రేక్షకులను మారుస్తుంది. ఈ సినిమా అవసరం ఆ కాలం కంటే ఈ కాలం ఎక్కువగా ఉంది. ప్రేమ కోసం కత్తిపట్టుకునే వాళ్లంతా ఈ సినిమా డీవీడీ పట్టుకుంటే ఎంత బాగుండు? పుదు వసంతం దర్శకుడు విక్రమన్ తన తొలి సినిమాగా ప్రేక్షకుల మీదకు సంధించిన ఈ కొత్త తరహా కథ ‘పుదు వసంతం’గా 1990లో విడుదలయ్యి తమిళంలో సినిమా కథా ధోరణినే మార్చేసింది. పాడే హీరోలు, స్నేహం చేసే హీరోలు, నలుగురు కుర్రాళ్ల కథలు... ఇలాంటివి భారతీయ భాషలలో పుంఖాను పుంఖాలుగా రావడానికి ఈ సినిమా బీజం వేసింది. తమిళ నటుడు మురళి, ఆనంద్ బాబు, సితార వీళ్లంతా ఈ సినిమాతో చాలా పేరు సంపాదించుకున్నారు. సంగీత దర్శకుడు ఎస్.ఏ.రాజ్ కుమార్ ఈ సినిమా పాటలతో ఇళయరాజా ధాటికి తట్టుకుని నిలబడగలిగాడు. ‘స్త్రీని పరీక్షించే పురుష స్వభావాన్ని’ ప్రశ్నించినందుకే ఈ సినిమా హిట్ అయ్యిందని చెప్పాలి. ప్రఖ్యాత దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఈ సినిమాకు అసిస్టెంట్గా పని చేశారు. దీని ప్రభావంతో చిరంజీవి, సాక్షి శివానంద్లతో ‘ఇద్దరు మిత్రులు’ తీశారుకాని సఫలం కాలేదు. అలాగే తరుణ్ హీరోగా ఇదే ధోరణిలో 2002లో ఒక ‘నవ వసంతం’ వచ్చింది. సూపర్గుడ్ ఫిలిమ్స్ చౌదరి, విక్రమన్ కాంబినేషన్లో వచ్చిన హిట్ సినిమాలలో ‘శుభాకాంక్షలు’, ‘రాజా’, ‘మా అన్నయ్య’, ‘సూర్యవంశం’ తదితర భారీ హిట్స్ ఉన్నాయి. తమిళంలో విక్రమన్ది ఒక శకం. – కె -
ఛాలెంజింగ్ రోల్లో శ్రియ
టాలీవుడ్ సీనియర్ హీరోలతో పాటు కుర్ర హీరోలతోనూ నటించిమెప్పించిన సీనియర్ హీరోయిన్ శ్రియ ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. 17 ఏళ్లుగా కెరీర్ కొనసాగిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు పాధాన్యమున్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటున్నారు. తాజాగా మరో ఆసక్తికరమైన పాత్రకు ఓకె చెప్పింది ఈ బ్యూటీ. కొత్త దర్శకురాలు సుజన దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో ప్రయోగాత్మక పాత్రలో నటించనుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు. లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సంగీతమందిస్తున్న ఈసినిమాకు సాయి మాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
నేడు హైదరాబాలో ఇళయరాజా లైవ్షో
-
ఇళయరాజా సాక్షి కాంటెస్ట్ విజేతలు
కిక్కెక్కించే ఇళయరాజా పాటలు లైవ్లో వినేందుకు సిద్ధమైపోయారా? నవంబర్ 5న ఆయనే హైద్రాబాద్లో నేరుగా ఓ షో ఇచ్చేస్తున్నారు. అదీ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఫస్ట్టైమ్. ఈ షోలో పాల్గొనేందుకు సాక్షి పాఠకులకు ఒక ప్రత్యేక కాంటెస్ట్ పెట్టి రెండు వందల మందికి ఒక్కొక్కరికి రెండు చొప్పున నాలుగు వందల పాసులు ఇవ్వనున్నట్లు తెలిపాం. ఇప్పుడు ఈ కాంటెస్ట్లో విజేతలుగా నిలిచిన వారి వివరాలను ఇక్కడ తెలియజేస్తున్నాం. ఇంకేం మరి! మీ పేరు ఉందో లేదో చూస్కోండి. రాజా కాలింగ్ ఆజా!! ఈ క్విజ్లో విజేతలుగా నిలిచిన వాళ్లందరికీ ఎసెమ్మెస్ ద్వారా సమాచారం అందుతుంది. నవంబర్ 3, 4, 5వ తేదీల్లో విజేతలు హైద్రాబాద్లోని సాక్షి ఆఫీసులో తమ ఫోన్కు వచ్చిన మెసేజ్ చూపించి పాసులు పొందవచ్చు. ఆదివారం రోజు మాత్రం మధ్యాహ్నం 2గంటల వరకే ఈ అవకాశం ఉంటుంది. నవంబర్ 5న హైద్రాబాద్లోని గచ్చిబొలి స్టేడియంలో ఈ ఈవెంట్ జరుగుతుంది. NAME LOCATION KM SAVITRI HYDERABAD ALTHAF SHAIK HYDERABAD CH JAHNAVI HYDERABAD CHAVALA GOPALA KRISHNA HYDERABAD S.BHRAMARAMBA SHADNAGAR Y SRAVAN KUMAR HYDERABAD TONUGUR HANUMAN SINGH WARANGAL CH MOHAN KUMAR VISAKHAPATNAM K SRINIVAS HYDERABAD MAILA JYOTHY HYDERABAD KUSUMA NARESH WARANGAL P MARIYAMMA LENIN NAGAR B MYTHILI EAST GODAVARI B LALITHA DEVI VISAKHAPATNAM UNNAM VAJRAKIRAN GUNTUR KUSUMA KUMARI G KARIMNAGAR K PREETH KUMAR NRT U VARDINI WARANGAL S.SUDHEER KURNOOL A KIRAN KUMAR HYDERABAD D KRISHNA MOHAN KHAMMAM K.VENKATESHWARARAO GUDUR VVV.SATYANARAYANA RAJAHMUNDRY M SURESH BABU HYDERABAD M SAMBA SIVA REDDY KHAMMAM SARATH HYDERABAD INGURTHI LAXMI HYDERABAD R.KRISHNA KANTH HYDERABAD SK RABBANI SURYAPET GOGULA VENKATESHWARULU HYDERABAD B.ANIL KUMAR HYDERABAD Y VIJAY KUMAR REDDY HYDERABAD BHARANI TANAKU CH PRABHA HYDERABAD A TIRUPATHI HYDERABAD A KOTESHWARA RAO HYDERABAD C SIVA JYOTHI HYDERABAD G.RAJU KARIMNAGAR PALETI KIRAN KUMAR PRAKASAM DIST PJ SUNIL RAJAHMUNDRY D DINESH KUMAR HYDERABAD N ANIL KUMAR VISAKHAPATNAM B SRI VENKATA SAI MEDCHAL K.RAVINDRA HYDERABAD KALAVATHI ANANTAPUR A ANJANI NANDAN VIJAYAWADA IMTHIYAZ BASHA HYDERABAD MD MAHABOOB PASHA HYDERABAD GOTTE MUNISH HYDERABAD P VENKATESH HYDERABAD CHINTAKINDI GEETA HYDERABAD M MANJUNATH REDDY ANANTAPUR B DURGA PRADESH HYDERABAD G SREEMANN SURYAPET RAJA SATISH HYDERABAD GEETHA HYDERABAD CH RAJYA LAKSHMI HYDERABAD K SRINIVASA RAO VIJAYAWADA PURDHEESWARI HYDERABAD SASIKALA.P HYDERABAD DR B SRINIVASA RAO KAKINADA RAMESH V HYDERABAD V M NAIK GUNTUR M VINAY LATA HYDERABAD CH VIJAYA BHASKAR RAO WEST GODAVARI S MANASA NELLORE VINOD KG HYDERABAD K SATISH BABU KADAPA B SRINIVAS HYDERABAD K.PRASHANTH HYDERABAD CH PRASANNA KUMAR HYDERABAD M.PREM KUMAR NIRMAL BAS PRASAD WEST GODAWARI R.LAVAKUMAR REDDY HYDERABAD S PONNASWAMY NELLORE MANIMALA S MALLIREDDYPALLI AKKALA LAXMAN NARAYANPET M.ASWIN KUMAR SRIKAKULAM PRASHANTH HYDERABAD PATRA MANU KUMAR GUNTUR P SHABARI GIREESH PRAKASAM DIST VIDYA SAGAR HYDERABAD V VIJAYA SIMHA TIRUPATHI M ANNAREDDY HYDERABAD K KRISHNA MOHAN HYDERABAD SUNEETA PANGIDI HYDERABAD BHAVANI SIRISHA D HYDERABAD D NAGABHUSHANAM JAGITIAL P VENKATA DURGA HYDERABAD L.V.S VAMSHI MOHAN HYDERABAD N SOWJANYA HYDERABAD T SRIVARDHAN HYDERABAD S SREENIVASA RAO SURYAPET SHAIK ANWAR HYDERABAD SAI KRISHNA KOLLA HYDERABAD S.LALITHA SAI DURGA HYDERABAD G.PRAMOD VIJAYAWADA K.SUSHMITHA HYDERABAD MOHAN HYDERABAD RAMESH YELLANI HYDERABAD S UPPALAIAH WARANGAL D VISHNU VARDHAN REDDY HYDERABAD PULLURI USHA RANI KHAMMAM B SYAM KUMAR GUNTUR G SRINIVAS RAO HYDERABAD S.SURESH HYDERABAD SRINIVAS JETTI VIZAG G VAMSI KRISHNA ELURU T PHANEENDRA SAI HYDERABAD CH SRINIVASULU ANANTAPUR S RANGASWAMY KURNOOL M RAMAIAH HYDERABAD SHAH NAWAZ HYDERABAD V SRIKANTH HYDERABAD C PINKY DONAKONDA SHAIK AKBAR BASHA VIJAYAWADA YR RAMESH NANDYAL N RAMADEVI HYDERABAD KAKINADA LAKSHMI VIZIANAGARAM CH.VEENU HYDERABAD N S PRASAD HYDERABAD KVL KIREETI PRAKASAM DIST SHASHIKALA HYDERABAD MANSOOR ALI VIKARABAD SANTHOSH KASULA HYDERABAD P CHAND BASHA KADAPA R SWETHA MANCHERIAL K ANITHA HYDERABAD VENKATA KRISHNA HYDERABAD P SUMANASWINI WARANGAL SALI KEJEYA HYDERABAD A BHARATHI HYDERABAD KV MAHESWAR REDDY KADAPA KATTULA SATYA KUMARI EAST GODAVARI PRAVEEN JVL HYDERABAD D VENKATESWARA RAO BANGALORE B CHANDU NIZAMABAD P SURESH HYDERABAD M.RADHA HYDERABAD AJAY MADGULA TENALI T NAVEEN KUMAR HYDERABAD N SATYA PRASAD VIJAYAWADA C HARI KRISHNA HYDERABAD KN MOHAN HYDERABAD V SIRISHA REDDY HYDERABAD G RAMANA REDDY NIZAMABAD PRASHANTH B.SAI HYDERABAD A VINAYAK WARANGAL SINDHURI HYDERABAD B KARTHIK HYDERABAD VIJAY BHASKAR BHUPALPALLY CH PREMA CHAND PRAKASAM DIST I SUBHAS CHANDRA BOSE KURNOOL SHAIK SALEEM KAKINADA P KIRAN KUMAR KUKATPALLY J CHANDRA SEKHAR HYDERABAD P ASHOK REDDY HYDERABAD MD RASHEED PASHA SURYAPET RAMADEVI WANAPARTHY BV APPALA RAJU VISAKHAPATNAM M KRANTHI REDDY HYDERABAD SRAVANTHI HYDERABAD M.SWAMY KARIMNAGAR BL PRASAD HYDERABAD A SHANKAR VENKATAPUR GVJ SARMA KAKINADA E KISHAN WARANGAL A RAMESH GOUD NIZAMABAD A VIPANI HYDERABAD ARVIND GOUD M SHANKARPALLY B SAI PRASAD KARIMNAGAR P ANWAR BASHA PRAKASAM DIST RAMAKRISHNA ADURI HYDERABAD M RADHA HYDERABAD K SUNEETA HYDERABAD S K SHOWKATULLA KANDUKUR K JAGAN SRIKAKULUM D V SAI RAM TANGUTUR VARANASI MALLIKARJUNA SARMA KAKINADA RAJITA PATNAIK HYDERABAD V GANESH SAROOR NAGAR D RAJESH HYDERABAD K.KARUN HYDERABAD RAVINDER RYADA HYDERABAD G V SARMA NELLORE B JOHN PETER SAMALKOT DURGA PRASAD.B HYDERABAD P GOPICHAND HYDERABAD A SRINIVASA RAO JAGGAYYAPET M TIRUPATHI RAJANNA SIRICILLA PN RAGHAVENDRA REDDY ANANTAPUR BSV PHANI KUMAR HANMAKONDA C HARINI REDDY HYDERABAD H NAGARAJU KHAMMAM V RAVITEJA HYDERABAD SINGER MIMICRY SRINIVAS VIJAYAWADA VISWANADH HYDERABAD CH JAYARAJU NALGONDA B.CHINNA TIMAIAH MEDCHAL PALLE SRIKANTH HYDERABAD -
షో క్విజ్
వంద వయొలిన్లు ఆకాశానికి తల ఎత్తుతాయి. వేణువొక్కటి హృదయంలో వలపు వొంపుతుంది. నాదమ్ ధమ్ధమ్మంటూ ధ్వానం చేస్తుంది. కీబోర్డు కువకువలతో బంధనం బిగిస్తుంది. ఇళయరాజా లైవ్! హైదరాబాద్లో మొదటిసారిగా గ్రాండ్ గాలా షో. వేలు, లక్షలు, యక్షులు ఎదురు చూసే షో. చూడటం ఎలా? నో ప్రాబ్లమ్! మా పాఠకులకు మేము వీలు కల్పించదలుచుకున్నాం. ఇళయరాజాపై తయారు చేసిన ఈ క్విజ్లో గెలిచిన వారికి ఫ్రీ పాసులు లక్కీ డ్రా తీసి కానుకగా ఇవ్వదలిచాం. పెన్ను అందుకోండి. స్నేహితులతో కూపీ లాగండి. గెస్ చేయండి. గూగులమ్మను అడగండి. కరెక్ట్ ఆన్సర్స్ రాసి కన్సర్ట్లో మీ సీట్ గెలుచుకోండి. రాజా కాలింగ్! జల్దీ ఆజా!! ►‘సుందరమో సుమధురమో చందురుడంటిన చందన శీతలమో’... పాటను ‘అమావాస్య చంద్రుడు’లో ఎవరు రచించారు. a) వేటూరి b) ఆత్రేయ c) రాజశ్రీ d) శ్రీకాంత శర్మ ►‘కూలీ నంబర్ 1’లో ఇళయరాజా పాడిన పాట పల్లవి ఏమిటి? a) దండాలయ్యా ఉండ్రాళ్లయ్య b) అటెన్షన్ ఎవ్రిబడీ c) కలయా నిజమా d) కొత్త కొత్తగా ఉన్నది ►‘నాయకుడు’ సినిమాలో ‘నా నవ్వే దీపావళి’ పాడిన అలనాటి గాయని? a) జిక్కి b) బి.వసంత c) పి.లీల d) జమునారాణి ►‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’ చిత్రంలో ‘రాధా.. ఎందుకింత బాధ’ పాడిన గాయకుడు? a) ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం b) కమలహాసన్ c) మలేసియ వాసుదేవన్ d) నాగూర్బాబు ► ‘వసంత కోకిల’ చిత్రంలో సిల్క్స్మిత, కమల్హాసన్ మీద చిత్రీకరించిన పాట పల్లవి? a) ఈ లోకం అతి పచ్చన b) ఊరించే వయసిది లాలించే మనసిది c) కథగా కల్పనగా d) ఇది ఒక మరో లోకం ► ఇళయరాజా ట్యూన్ చేసిన కృష్ణశాస్త్రి గీతం? a) మనసున మల్లెల మాలలూగెనె b) జగదానంద కారక c) మళ్లీ మళ్లీ ఇది రాని రోజు d) జయజయ ప్రియభారత జనయిత్రి ► ఇళయరాజా కుమార్తె పేరు? a) కోకిల b) పల్లవి c) సుబ్బులక్ష్మి d) భవతారిణి ►‘ఈ ఎడారి నిండా ఉదక మండలాలు’... వేటూరి చేసిన ఈ పద ప్రయోగం ఉన్న ఇళయరాజా పాట ఏ సినిమాలోనిది. a) అభిలాష (సందెపొద్దుల కాడ) b) ప్రేమించు పెళ్లాడు (వయ్యారి గోదారమ్మ) c) ఛాలెంజ్ (సాయంకాలం) d) మరణమృదంగం(గొడవే గొడవమ్మా) ►‘ఏవేవో కలలు కన్నాను’... ఎస్.జానకి పాడిన ఈ పాట చిరంజీవి నటించిన ఏ సినిమాలోనిది? a) నాగు b) జ్వాల c) పులి d) రుస్తుం ► ఆర్.పి. పట్నాయక్ ఇళయరాజా సంగీతంలో పాడిన పాట a) నీకు నువ్వు నాకు నేను b) చిరుగాలి వీచెనె c) ప్రతి దినం నీ దర్శనం d) వెన్నెల్లో హాయ్ హాయ్ ►ఎన్.టి.రామారావుకు ఇళయరాజా సంగీతం అందించిన సినిమా a) యుగంధర్ b) యుగపురుషుడు c) ఛాలెంజ్ రాముడు d) అగ్గిరవ్వ ►ఇళయరాజా ట్యూన్ చేసిన శ్రీశ్రీ గీతం a) కూలి కోసం కూటి కోసం (ఆకలి రాజ్యం) b) నేను సైతం ప్రపంచాగ్నికి (రుద్రవీణ) c) కొంతమంది కుర్రవాళ్లు (విప్లవశంఖం) d) నేడే ఈనాడే (ఈనాడు) ► ఇళయరాజా సంగీతంలో బాలూ, ఏసుదాస్ కలిసి పాడిన పాట a) కురిసేను విరుజల్లులే (ఘర్షణ) b) సింగారాల పైరుల్లోన (దళపతి) c) నాగమణి నాగమణి (రోజా) d) స్వరరాగ గంగా ప్రవాహమే (సరిగమలు) ► ఒకప్పుడు ఇళయరాజాకు గురువుగా ఉండి ఆ తర్వాత ఇళయరాజా దగ్గరే పని చేసిన సంగీత దర్శకుడు? a) జి.కె.వెంకటేశ్ b) ఎల్.వైద్యనాథన్ c) ఎం.ఎస్.విశ్వనాథన్ d) కె.వి.మహదేవన్ ► ఇళయరాజా సంగీతంలో ఆశా భోంస్లే పాడిన పాట? a) తెల్ల చీరకు (ఆఖరి పోరాటం) b) సెప్టెంబర్ మాసం (సఖి) c) ఓ ప్రేమా (అశ్వమేధం) d) నాలో ఊహలకు (చందమామ) ► ‘రావేల వసంతాలే’... చిత్రకు అవార్డు తెచ్చిపెట్టిన ఈ పాట ఏ సినిమాలోది? a) తూర్పు సిందూరం b) చైతన్య c) మైఖేల్ మదన కామరాజు d) డాన్స్ మాస్టర్ ► సూపర్స్టార్ కృష్ణకు ఇళయరాజా సంగీతం అందించిన సినిమా? a) నా పేరే సాహసం b) జమదగ్ని c) తేనె మనసులు d) బండోడు గుండమ్మ ► ఇళయరాజా సంగీతంలో బాలూ పాడి స్క్రీన్ మీద నటించిన పాట? a) ఐయామ్ సారీ సో సారీ (ప్రేమ) b) అందమైన ప్రేమరాణి (ప్రేమికుడు) c) ఇదే పాట ప్రతీ నోట (పుట్టినిల్లు మెట్టినిల్లు) d) ప్రేమ ఎంత మధురం (అభినందన) ► ఇళయరాజా సంగీతంలో అమితాబ్ నటించిన తొలి హిందీ చిత్రం a) హమ్ b) చీనీ కమ్ c) చెన్నై ఎక్స్ప్రెస్ d) సింగమ్ ►ఇళయరాజా పెట్టగా నాగూర్బాబుకు తమిళనాట పాపులర్ అయిన పేరు a) మనో b) బాబు c) తంబి d) నంబి -
రాజా కాలింగ్ ఆజా!
రాజా.. రాజాధి రాజాధి రాజా.. ఆజా.. ఆజా.. సాక్షి పాఠకులకు 400 పాసులు ఫ్రీ మైమరపించే ఇళయరాజా పాటలు టీవీల్లో, ఎఫ్ఎంలో, మ్యూజిక్ సీడీల్లోనే వింటారా? లైవ్లో వినండి.పాసులా? మరేం పర్లేదు మేమిస్తాం.. రెండొందల మంది లక్కీ విన్నర్స్కి ఒక్కొక్కరికి రెండు చొప్పున. నవంబర్ 5న ఇళయరాజా హైద్రాబాద్లో లైవ్ షో ఇచ్చేస్తున్నారు.అదీ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఫస్ట్టైమ్! వచ్చేస్తున్నారా మరి? అందుకు మీరేం చేయాలని ఆలోచిస్తున్నారా! ఒక ఆట ఆడాలి. ఈ ఆదివారం (29–10–2017) ఆ ఆటేదో ఆడేందుకు సిద్ధమైపోండిక! -
ఇళయరాజా తొలిసారిగా..!
సౌత్ స్టార్ మ్యూజీషియన్ ఇళయరాజా తొలిసారిగా భాగ్యనగరంలో తొలి సారిగా లైవ్ షో చేయనున్నారు. ప్రస్తుతం సెలెక్టివ్ గా సినిమాలో చేస్తున్న ఈ సంగీత బ్రహ్మా దేశ విదేశాల్లో మ్యూజిక్ కన్సర్ట్ లలో పాల్గొంటున్నారు. అయితే తొలిసారిగా ఆయన నవంబర్ 5న తెలుగు నేల మీద తెలుగులో సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు. గచ్చిబౌలిలోని అథ్లెటిక్ స్టేడియంలో 85మంది టీం సభ్యులతో కలిసి భారీ మ్యూజికల్ కన్సర్ట్ ను ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ 5 సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఈ షో నిర్వహించనున్నారు. తనని దక్షిణాది ప్రజలంతా ఎంతో అభిమానిస్తారన్న ఇళయరాజా తొలిసారిగా తెలుగులో ప్రదర్శన ఇవ్వటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ షో లో ఇళయరాజాతో పాటు ప్రముఖ గాయకులు మనో, చిత్ర, కార్తీక్, సాధనా సర్గమ్ మరి కొంత మంది యువ గాయకులు, వాయిద్య కళాకారులు పాల్గొననున్నారు. -
సినిమాలోకం ఎటు పోతోంది?
సినీలోకం ఎటు పోతోంది? అని ప్రశ్నిస్తున్నారు సంగీతజ్ఞాని ఇళయరాజా. మాస్, క్లాస్ అన్న తారతమ్యం లేకుండా కథను మెరుగుపరచే విధంగా సంగీతం అందించడంలో దిట్ట. ఈయనని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మెలోడీలో మధురిమలు గుబాళింపజేసే సంగీతరాజా సంగీతంతో ఎన్నో చిన్న చిత్రాలు ప్రేక్షకుల మదిని దోచుకున్నాయి. అలా తాజాగా ఆయన సంగీతం కారణంగానే పెద్ద చిత్రంగా తెరపైకి రానున్న వైవిధ్యభరిత చిత్రం ఎంగ అమ్మ రాణి. నటి ధన్సిక ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా సంగీతజ్ఞాని ఇళయరాజాతో ఎంగఅమ్మ రాణి చిత్ర ముచ్చట్లు.. ప్ర: ఎంగఅమ్మరాణి వంటి చిన్న చిత్రానికి సంగీతం అందించడానికి కారణం? జ: ఇప్పుడు సినీలోకం ఎటువైపు పయనిస్తోంది? సరైన బాటలో సాగుతుందా?లేదా గాడితప్పుతుందా? అన్నది సినిమా చూసే ప్రేక్షకుడికి గానీ, తీసే వారికి గానీ సరిగా తెలియడంలేదు. ఉదాహరణకు చిన్న విషయం సీజీ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేవారికి రిజల్ట్ ఇలానే వస్తుందని చెప్పగలరా? అలాంటప్పుడు అందుకంటూ సెపరేట్ బడ్జెట్ ఎందుకు? ప్రస్తుతం సినిమాలో సహజత్వం కొరవడుతోంది. భావోద్రేకాల్లో యథార్ధత లోపిస్తోంది. నేటికీ దేవాలయాలకు, సంప్రదాయాలకు ప్రాధాన్యత సంతరించుకోవడానికి కారణం, ప్రజలకు మంచి విషయాలు తెలియజేయకపోతే నడవడిక మారిపోతుంది. భావితరాలకు మంచి విషయాలను రక్తంలో జీర్ణించుకునేలా చేయాలన్నదే. సినిమా ఒక కాలక్షేప మాధ్యమం అయినా అందులో మంచి కథాంశం, మంచి విషయాలు, చక్కగా చెప్పాలి. అలాంటి కథాంశంతో కూడిన చిత్రం కావడంతోనే ఎంగ అమ్మరాణి చిత్రానికి నేను సంగీతాన్ని అందిస్తున్నాను. ప్ర: ఇంతకు ముందు మీరు చేసిన చిత్రాలకు ఈ చిత్రానికి భిన్నత్వం ఏమిటంటారు? జ: నిజం చెప్పాలంటే నేను పని చేసే చిత్రాల గురించి ఎప్పుడూ మీ చెప్పను. చిత్రం చూసిన ప్రేక్షకులే చెప్పాలి. వాళ్లే ఇది మంచి చిత్రం అని చెప్పాలి. ప్ర: ఎంగఅమ్మ రాణి చిత్రం గురించి మీ అభిప్రాయం? జ: ఒక తల్లి తన పిల్లల కోసం ఏమైనా చేస్తుంది. కన్నబిడ్డపై తల్లికి అక్కర 200 శాతం ఉంటుంది. ఈ చిత్రంలో అలాంటి తల్లి తన పిల్లల కోసం ఎవరూ చేయనటువంటి పని చేస్తుంది.అదే ఈ చిత్రంలో కొత్తదనం. ప్ర: చిత్రంలో పాటల గురించి? జ: ఇందులో అమ్మ గురించి ఒక పాటను కంపోజ్ చేశాను.అది కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అమ్మ అనే ఒకరు లేరనే భావన లోకంలో ఎవరికీ రాదు.అలా వా వా మగళే అనే ఈ పాట ప్రమోషన్లోనే విశేష ఆదరణను పొందింది. -
పాడకు తీయగా
ఇళయరాజా పాట తియ్యగా ఉంటుంది. బాలూ పాడితే ఇంకా తియ్యగా ఉంటుంది. కానీ, టికెట్టు పెట్టి పాడే వేదికల మీద తన పాటలు అనుమతి లేకుండా పాడేందుకు వీలులేదని ఇళయరాజా బాలూకి నోటీసులు పంపడతో ఈ వ్యవహారం చేదుగా మారింది. ‘మాటే రాని చిన్నదాని కళ్లు పలికే ఊసులు... అందాలన్ని పల్లవించి ఆలకించే పాటలు’... ‘ఓ పాప లాలి’ సినిమాలో బాలూ ఉగ్గబట్టి ఒక్క దమ్ములో పాడిన పాట ఇది. గుక్క తిరగనివ్వని పాట. తాజాగా ఇళయరాజా ఇచ్చిన నోటీసు బాలూకు బహుశా ఇలాగే గుక్క పెట్టనివ్వని షాక్ ఇచ్చి ఉండవచ్చు. ‘లాభాపేక్ష కలిగిన కచేరీలలో తన పాటలు పాడటం కాపీరైట్ చట్ట ప్రకారం నేరమనీ కనుక పాడటం ఆపి వేయమని’ ఇళయరాజా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి తన లాయర్ ద్వారా నోటీసులు అందించారు. నోటీసు ఇచ్చినవాడు స్నేహితుడు. పుచ్చుకున్నవాడూ స్నేహితుడే. అనేక విషయాలలో ఇరువురికీ స్నేహం ఉండవచ్చు. కాని ప్రొఫెషనలిజమ్లోకి వచ్చేసరికి బహుశా పంతాలూ పట్టింపులూ కూడా చోటు చేసుకునే అవకాశం ఎక్కువ. ఇక్కడ అదే జరిగి ఉండవచ్చు. ఇద్దరూ స్నేహితులు బాలసుబ్రహ్మణ్యం ఇళయరాజాల స్నేహం ఇప్పటిది కాదు. 1970ల నుంచి ఉంది. అప్పట్లో దర్శకుడు భారతీరాజా బాలసుబ్రహ్మణ్యం మొదటగా స్నేహితులయ్యారు. తన ప్రాంతానికే చెందిన ఇళయరాజాను భారతీరాజా బాలూకు పరిచయం చేశారు. బాలూకు సొంత ఆర్కెస్ట్రా ఉండేది. అందులో ఇళయరాజాను టీమ్మేట్గా తీసుకున్నారు బాలూ. 1975లో ఇళయరాజా సంగీతదర్శకుడు అయ్యాక ఆ స్నేహాన్ని మర్చిపోలేదు. తన సంగీత దర్శకత్వంలో దాదాపు అన్ని పాటలూ బాలూ చేతనే పాడించారు. ఇతర గాయకులు పాడింది తక్కువ. బాలూ, ఎస్.జానకి, చిత్రల గళ సంపద ఇళయరాజా స్వర సంపదకు తోడై సంగీత ప్రియులను అలరించింది. అలరిస్తూనే ఉంది. తకిట తథిమి తందానా... ఇళయరాజా సంగీతంలో బాలూ పడిన పాటలన్నీ హిట్టే. ఇళయరాజా తొలిరోజుల్లో చేసిన ‘వయసు పిలిచింది’ సినిమాలో ‘మబ్బే మసకేసిందిలే’, ‘ఇలాగే.. ఇలాగే’.... పాటలు ఆదరణ పొందాయి. తమిళం నుంచి డబ్ అయిన ‘ఎర్రగులాబీలు’ వంటి సినిమాల నుంచి కూడా బాలూ పాడిన ‘ఎదలో తొలి వలపే’ పెద్ద హిట్. ఆ తర్వాత క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్పై ఇళయరాజా చేసిన సినిమాలు బాలు గొంతులో హుషారు రేపాయి. ‘సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది’ (అభిలాష), ‘ఇందువదన కుందరదన’ (ఛాలెంజ్), ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ (రాక్షసుడు), ‘సరిగమ పదనిస రస నస’ (మరణ మృదంగం)... ఇవన్నీ హిట్. అలాగే దర్శకుడు వంశీ ఇళయరాజా పాటలతోనే ఎక్కువ సినిమాలు చేయడం వల్ల బాలూకు మరిన్ని మంచి పాటలు దక్కాయి. ‘ఎక్కడ ఎక్కడ ఎక్కడ’ (లేడీస్ టైలర్), ‘సుమం ప్రతి సుమం సుమం’... ‘మాటరాని మౌనమిది’ (మహర్షి), ‘నిరంతరమూ వసంతములే’, ‘వయ్యారి గోదారమ్మ వొళ్లంత ఎందుకమ్మ’ (ప్రేమించు పెళ్లాడు) ఇప్పటికీ ప్రతి కచేరీలో వినిపిస్తుంటాయి. ఇక కె.విశ్వనాథ్ సినిమాల్లో ఇళయరాజా– బాలూల పాటలు ప్రత్యేకం. ‘తకిట తథిమి తకిట తథిమి తందానా’ (సాగర సంగమం), ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ’ (స్వాతిముత్యం) పాటలను ప్రేక్షకులు ఎలా మర్చిపోగలరు. బాలూ కచ్చేరీలు... సినీ గాయకుడు కాక మునుపు నుంచే బాలసుబ్రహ్మణ్యం కచ్చేరీలు చేసేవారు. నెల్లూరు చుట్టపక్కల అనేక ప్రాంతాలలో సినీ పాటలు పాడేవారు. ఇప్పటికీ పాడుతున్నారు. పాత కొత్త పాటలు బాలూయే కాదు ఏ ఆర్కెస్ట్రా అయినా పాడటం మనవారికి ఆనవాయితీగా వస్తోంది. ఒక్క ఇళయరాజా పాటలే కాదు చక్రవర్తి, కె.వి.మహదేవన్ల మొదలు నేటి కీరవాణి, ఏ.ఆర్.రహమాన్ల వరకు ఏ సంగీతకర్త చేసిన పాట అయినా ఏ ఆర్కెస్ట్రా అయినా ఎవరి అనుమతి అక్కర్లేకుండా పాడటం మన దేశంలో ముందు నుంచీ ఉంది. కాని ఈ తాజా నోటీసుల వల్ల ఒక అయోమయం ఏర్పడినట్టయ్యింది కాపీరైట్... సంగీతరంగంలో కాపీరైట్దీ, రాయల్టీది కీలకమైన పాత్ర. ఒక పాటను ఒక ఆడియో కంపెనీ కొనుక్కుంటే దాని మీద వచ్చే రాబడిలో సంగీతదర్శకుడికీ, గాయనీ గాయకులకీ రాయల్టీ ఇవాల్సి ఉంటుంది. హెచ్ఎంవి వంటి పెద్ద సంస్థలు ఈ రాయల్టీని చెల్లించేవి. గతంలో మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్లు ఈ రాయల్టీ విషయంలో ఒక కాంట్రవర్సీని లేపారు. ఒకసారి పాట పాడేశాక, దానికి రెమ్యునరేషన్ పుచ్చుకున్నాక ఆ తర్వాత రాయల్టీ అక్కర్లేదు అనేది రఫీ వాదన అయితే రాయల్టీ ఉండాలి అనేది లతా వాదన. దీని వల్ల కొంతకాలం పాటు వారిద్దరు కలిసి పాడలేదు కూడా. పాత పాటలను కొత్త సినిమాలలో వాడుకోవాలంటే అనుమతి తీసుకోవాలి. కొన్ని పాత పాటలను ఉపయోగించి యాడ్స్ చేయడం చూస్తుంటాము. వాళ్లు కూడా ఆ పాటలను సొంతదారుల నుంచి కొనుక్కుని ఉపయోగించాల్సిందే. ఏవో మూడు సెకన్లు ఆరు సెకన్లకు అనుమతులు అక్కర్లేదు కాని మొత్తం పాటను ఉపయోగించాలంటే డబ్బు కట్టక తప్పదు. ఇప్పుడు ఇళయరాజా చెబుతున్నది కూడా అదే. లాభాపేక్ష కలిగిన కచ్చేరీలు.. బాలూ ఇటీవల బాలూఎట్ఫిఫ్టీ పేర ప్రపంచ యాత్ర చేస్తున్నారు. దేశదేశాలలో కచ్చేరీలు ఇస్తున్నారు. ఆ కచ్చేరీలలో అందరి పాటలను పాడుతున్నారు. ఇళయరాజా ఏమంటారంటే ఇవన్నీ ఏ ప్రజాహిత కార్యక్రమం కోసమో ఉచితంగానో చేయడం లేదు కదా... కనుక వీటిలో నేను చేసిన పాటలు మీరు పాడి డబ్బు సంపాదించుకోవడం ఎంత వరకు భావ్యం అని ప్రశ్నిస్తున్నారు. బాలూ కూడా ఎంతో హుందాగా ఇలాంటి చట్టం ఉందని తనకు తెలియదనీ ఇక మీదట చట్టాన్ని గౌరవించి ఇళయరాజా పాటలు పాడనని తన ఫేస్బుక్ ద్వారా తెలియచేశారు. అయితే ఇళయరాజా కేవలం ఇది బాలూ కోసమే చేయలేదని మనం గుర్తు చేసుకోవాలి. సంవత్సరం క్రితం ఆయన అనేక ఎఫ్ఎం చానెల్స్, మ్యూజిక్ చానల్స్కు కూడా ఇలాంటి నోటీసులు ఇచ్చారు. చెప్పా పెట్టకుండా ఇష్టం వచ్చినట్టుగా తన బాణీలు, అంతర స్వరాలు ఉచితంగా వాడుకుంటున్నారనీ అనుమతి లేకుండా అలాంటి పనులు చేయవద్దనీ ఆయన నోటీసులు ఇచ్చారు. బాలూకు నోటీసు అందుకు కొనసాగింపే. రెండు వైపులా... ఇళయరాజా పాటలు బాలూ గొంతున వినాలి. వినకుండా ఎలా? కచ్చేరీలలో బాలూ ఇళయరాజా పాటలు పాడకుంటే అందం ఉండదు. ప్రజలలోకి వచ్చిన పాటను బాలూ పాడటంలో తప్పు లేదని ఒక వర్గం అంటుంటే తన మేధో హక్కులను కాపాడుకునేందుకు ఇళయరాజా నోటీసులు ఇవ్వడం తప్పు కాదని మరో వర్గం అంటోంది. ఇద్దరి వైపూ పాయింట్ ఉండొచ్చు. సంగీత అభిమానులకు ఇద్దరూ కావాలి. దీనికి కాపీరైట్ చట్టం అడ్డు కాకూడదు. ఇళయరాజా పాటలు పాడటానికి ఆయన అనుమతి స్నేహపూర్వకంగానో ఆర్థికపరంగానో తీసుకుని బాలూ ఇళయరాజా పాటలు పాడాలి... ఇళయరాజా కూడా పట్టువిడుపులు పాటించి తన పాటను బాలూ నోట ముందుకు తీసుకెళ్లాలి అని ఎక్కువమంది అభిమానులు కోరుకుంటున్నారు. నందికొండ వాగుల్లోన.... ఇళయరాజా బాలసుబ్రమణ్యం గొంతుతో అనేక ప్రయోగాలు చేశారు. బాలు కూడా ఆ ప్రయోగాలను సవాలుగా తీసుకుని స్వాగతించేవారు. ‘గీతాంజలి’ సినిమాలో ‘నందికొండ వాగుల్లోన’ పాట భూతం పాడినట్టు బొంగురుగా పాడాలని ఇళయరాజా ఆశించి రికార్డు చేసిన పాటను తిరిగి రికార్డ్ చేయగా బాలూ ఆయన ఆశించినట్టుగా పాడి మెప్పించారు. దాని వల్ల వారం రోజుల పాటు బాలు ఇతర పాటలు రికార్డ్ చేయలేకపోయారని అంటారు. అలాగే ‘ఇంద్రుడు–చంద్రుడు’ సినిమాలో ‘నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు’ పాట కోసం బాలు కమల్హాసన్లాగా బొంగురు గొంతుతో పాడి ఆ ప్రయోగాన్ని ఇళయరాజా ఆధ్వర్యంలో సక్సెస్ చేశారు. ఇటీవల ‘శ్రీరామరాజ్యం’లో ఇళయరాజా కాంబినేషన్లో పాడిన ‘జగదానంద కారకా’ పెద్ద హిట్. ఈ జోడీలో మరిన్ని పాటలు రావాల్సి ఉంది. మరి ఈ నోటీసు దరిమిలా ఏమవుతుందో చూడాలి! ఈ రాయల్టీ గొడవలు ముంబైలో, చెన్నైలో చాలా ఎక్కువ. ఇళయరాజాగారి పాటలు లేకుండా ప్రపంచంలో ఎక్కడా తమిళ, తెలుగు సంగీత విభావరిలు జరగడం లేదు. ఇప్పుడు బాలుగారికి మాత్రమే నోటీసులు వచ్చాయి. మిగతా గాయనీగాయకులు అందరికీ భవిష్యత్తులో నోటీసులు వెళతాయా? ఏమో చూడాలి మరి! రాజాగారు చేసినట్టు మిగతా సంగీత దర్శకులు కూడా చేస్తే గాయనీగాయకుల భవిష్యత్తు అంధకారమే. – గాయని సునీత సమస్య కనిపించేంత చిన్నదేం కాదు. దాని మూలాలు వేరే ఉన్నాయి. మన కళ్ల ముందు బాలు, ఇళయరాజాలు కనిపిస్తున్నారు కాబట్టి ఇప్పుడీ సమస్య పెద్దదిగా కనిపిస్తోంది. రాజాగారి పాట అయినప్పటికీ గేయ రచయితలు, నిర్మాతలకూ వాటా ఉంటుంది. వాళ్ల అనుమతి కూడా తీసుకోవాలి కదా. అలాగే, గాయకులకు కూడా ఏవో హక్కులు ఉన్నాయి. ఎవరూ హర్ట్ కాకుండా ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని అభిమానులతో పాటు నేను కూడా కోరుకుంటున్నా. – రామజోగయ్య శాస్త్రి సంగీతం అనగానే నాకు గుర్తొచ్చే రెండు పేర్లు... ఇళయరాజా, ఎస్పీబీ. ఈ లీగల్ గొడవలు వీలైనంత త్వరగా సమసిపోయి వాళ్లిద్దరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్లిద్దరూ లెజెండ్స్. నా చిన్నప్పట్నుంచి ఒకరు వాయిస్తుంటే.. మరొకరు పాడుతుంటే... చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేశా. ఆ క్షణాలు ఇంకా నా కళ్ల ముందు మెదులుతున్నాయి. వీరిద్దరూ 40 ఏళ్లుగా అత్యంత ఆత్మీయులు. ఇప్పుడు ఇద్దరూ 70 ఏళ్ల వయసు దాటారు. ఈ వయసులో ఈ ఎడబాటు ఎందుకు? ఇద్దరి అభిమానులు ఎంతో బాధపడుతున్నారు. – నాగూర్బాబు వనీవన న్యాయమని ఒకటుంది. అదేంటంటే... అడవిలో జంతువులకు చెట్టూపుట్టలు రక్ష. చెట్టూపుట్టలకు జంతువులు రక్ష. ఒకరికి మరొకరు తోడు లేకపోతే మనుగడ కష్టమని దీనర్థం. రెండూ కలసి ఉంటేనే ఆ గొప్పదనం. రాజాగారి బాణీకి బాలుగారు గొంతుతో సహాయం చేశారు. బాలుగారి గొంతుకు రాజాగారు తన బాణీతో న్యాయం చేశారు. ఇప్పుడిలాంటి సమస్య రావడం బాధాగా ఉంది. పాలు–నీళ్లను వేరు చేయమంటే ఏమని వేరు చేస్తాం చెప్పండి! అలాగే, వారిద్దరి పాట కూడా! – ఎం.ఎం. శ్రీలేఖ కాపీరైట్ యాక్ట్ 2012 ప్రకారం ఒకపాట రాయల్టీలో యాభై శాతం నిర్మాతకి, 25 శాతం పాట రచయితకి, 25 శాతం స్వరకర్తకి దక్కాలి. పాటను కమర్షియల్ వేదికల మీద ఉపయోగిస్తే న్యాయపరంగా ఈ రాయల్టీ ఇవ్వాల్సిందే. అందుకనే ఇళయరాజా ఈ నోటీసు ఇచ్చి ఉంటారు. ఏమైనా రెండు సంగీత శిఖరాల మధ్య వచ్చిన ఈ అభిప్రాయభేద మేఘాలు కరిగిపోవాలని కోరుకుంటున్నా. – అనంత్ శ్రీరామ్ ఏమైనా ఇది టీ కప్పులో తుఫాన్ కావచ్చు. లేదంటే హటాత్తుగా జారిన అపస్వరం కావచ్చు. బాలూ ఇళయరాజాల స్నేహం, వారి యుగళగీతం కొనసాగాలని కోరుకుందాం. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
మాటల్లేవ్... ఇళయరాజా పాటల్లేవ్!
‘‘అమెరికా టూర్ ప్రారంభానికి ముందు ఇళయరాజా నాతో ఈ అంశాన్ని చర్చిస్తే ఆయనతో మాట్లాడేవాణ్ణి. కానీ, లీగల్ నోటీస్ వచ్చిన తర్వాత నేనూ లీగల్గానే స్పందించవలసి (నేనెప్పుడూ అలా చేయాలనుకోను) ఉంటుంది లేదా చట్టాన్ని అంగీకరించాలి. నాకూ ఆత్మగౌరవం ఉంది’’ అని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అన్నారు. ‘ఎస్పీబీ50’ పేరుతో ఇటీవల అమెరికాలో నిర్వహించిన మ్యూజిక్ కన్సర్ట్లో సింగర్స్ ఇళయరాజా పాటలు ఆలపించారు. తన అనుమతి లేకుండా తన పాటలు పాడడంపై ఎస్పీబీకి ఇళయరాజా లీగల్ నోటీసులు పంపారు. దీనిపై ఎస్పీబీ స్పందిస్తూ –‘‘నాతో పాటు గాయని చిత్ర, చరణ్, మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహకులకు లీగల్ నోటీసులు అందాయి. ఇళయరాజా అనుమతి లేకుండా ఆయన పాటలు పాడితే... కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించినట్లేననీ, అందుకు భారీ మొత్తంలో ఆర్థిక జరిమానా చెల్లించడంతో పాటు చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వాటిలో పేర్కొన్నారు. ఈ చట్టాలపై నాకు అవగాహన లేదు. గతంలో ఇతర దేశాల్లో మ్యూజిక్ కన్సర్ట్లు నిర్వహించినప్పుడు లేనిది, ఇప్పుడీ అమెరికా టూర్ ప్రారంభించిన తర్వాత ఎందుకు నోటీసులు పంపారో అర్థం కావడం లేదు. ముందు చెప్పినట్టు నాకు చట్టాలపై అవగాహన లేదు. ఇదే చట్టమైతే.. నేను పాటిస్తా. ఈ పరిస్థితుల్లో ఇకపై ఇళయరాజా పాటలు పాడలేము. కానీ, షోలు జరుగుతాయి. భగవంతుడి దయ వల్ల ఇతర స్వరకర్తలకు నేను చాలా పాటలు పాడాను. వాటిని ‘ఎస్పీబీ50’లో ఆలపిస్తాం. శ్రోతలు ఎప్పటిలా ప్రేమాభిమానాలు చూపిస్తారని ఆశిస్తున్నా. ఈ అంశంపై ఎవరూ కఠినంగా స్పందించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఇదంతా భగవంతుడి లీల అయితే... భక్తిశ్రద్ధలతో శిరసావహిస్తా. సర్వేజనా సుఖినోభవంతు’’ అన్నారు. ‘‘కన్సర్ట్ నిర్వహకులకు నష్టాలు రావాలనీ, స్నేహితుడు ఇళయరాజాకు అసౌకర్యం కలిగించాలానీ అనుకోవడం లేదు. ప్రేక్షకులకు విషయం తెలియజేయాలనే సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చేశా’’ అన్నారు ఎస్పీబీ. -
యువన్లా ఇసైజ్ఞాని బాణీలు కట్టాలి
-
యువన్లా ఇసైజ్ఞాని బాణీలు కట్టాలి
యువన్శంకర్రాజా లాగా ఇసైజ్ఞాని ఇళయరాజా సంగీత బాణీలను కట్టాలని దర్శకుడు కరు.పళనివేల్ విజ్ఞప్తి చేశారు. ఎంకే ఫిలింస్ పతాకంపై సి.ముత్తుకృష్ణన్ నిర్మిస్తున్న చిత్రం రాణి. ఎస్.పాణి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి, కబాలి చిత్రం ఫేమ్ ధన్సిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంగీత జ్ఞాని ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడిమో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్లో జరిగింది. కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దర్శకుడు కరు.పళనియప్పన్ మాట్లాడుతూ తానింత వరకూ ఎవరినీ ఏ కోరిక కోరలేదన్నారు. అలా కోరితే సమస్యలు తలెత్తుతాయని అన్నారు. అరుునా తానీరోజున ఇసైజ్ఞాని ఇళయరాజాను ఒక కోరిక కోరుతున్నానన్నారు. ఆయన యువ సంగీత దర్శకుడు యువన్శంకర్రాజా లాగా ఈ తరానికి తగ్గట్టుగా సంగీతాన్ని అందించాలన్నారు. ఎందుకంటే ఆయన చాలా ఏళ్ల క్రితం బాణీలు కట్టిన పాటలను మనం ఇప్పటికీ విని ఆనందిస్తున్నామన్నారు. అలానే యువన్శంకర్రాజా తరహాలో పాటలను అందిస్తే ఈ తరం వారికి మరి కొన్నేళ్ల ఇళయరాజా పాటలను వినే భాగ్యం కలుగుతుందన్నారు. మరో కోరిక ఏమిటంటే కార్తీక్రాజా, యువన్శంకర్రాజాలు ఆయన తండ్రి ఇళయరాజా ఇప్పటి వరకూ సంగీతాన్ని అందించిన చిత్రాల వివరాలను సేకరించి ఆయనకు బ్రహ్మాండమైన అభినందన సభను ఏర్పాటు చేయాలని అన్నారు. ఇళయరాజాకు అభినందన సభ అంటే సంగీత ప్రియులందరూ చూసి సంతోషిస్తారని అన్నాను. నాలుగు శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన ఇళయరాజా ఇందుకు అంగీకరించరని, అయితే ఈ విషయమై తాను యువన్శంకర్రాజాతో మాట్లాడతానని దర్శకుడు కరు.పళనీయప్పన్ అన్నారు. ఈ కార్యక్రమంలో నటి ధన్సిక, చిత్ర దర్శకుడు పాణి, నిర్మా త ముత్తుకృష్ణన్, దర్శకుడు పేరరసు, సముద్రఖని, నమో నారాయణ, మనోజ్కుమార్, తమిళ నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడు పీఎల్.తేనప్పన్ తదితరులు పాల్గొన్నారు. -
తపన,సాధన కళకు రెండు కళ్లు
మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా.... గీతంలో డిలిట్ డాక్టరేట్ విశాఖ–కల్చరల్ : రాయనైనా కరిగించల శక్తి ఆయన సంగీతానికి ఉంది. ఎంతటి దుఃఖంలో ఉన్నా ఆయన స్వరాలు మనసు ఉత్తేజంతో తేలికపడుతుంది. వినసొంపైన స్వరాలను ఏరికూర్చి పాటల మాలను కట్టే మ్యూజిక్ మాస్ట్రో పద్మభూషణ్ ఇళయారాజా. గీతం వర్శిటీలో గౌరవ డాక్టర్ రేట్ తీసుకోడానికి విశాఖ విచ్చేసిన సందర్భంగా ఆయనను కలసి పాత్రికేయులతో కొద్దిసేపు ముచ్చటించారు. కళల పట్ల మనస్సులో తపన ఉండాలి. మనిషి నిత్యజీవితంలో అది ఏ స్థాయికి తీసుకెళ్తోందో మనకు తెలియదు. నేను పుట్టింది గ్రామీణ ప్రాంతంలోనైనా కన్న కలలతోనే నేడు జాతీయ స్థాయికి ఎదగగలిగాను. నేర్చుకోబోయే ఏ కళనైనా చూసి భయపడకూడదు. మొదట్లో నా చేతిలో ఏమీ లేదు..ఉట్టిచేతులతోనే సంగీతాన్ని నేర్చుకున్నా..ఆ అకుంఠత దీక్షతో సాధన చేశా. నిత్య సంగీత సాధకుడిగా మన సంగీతానికి పాశ్చాత్య సంగీతాన్ని మేళవిస్తూ చక్కని బాణీలు కూర్చడం నేర్చుకున్నాను. నిద్రలో కూడా... నిద్రలో కూడా చేతులు వేళ్లు కదుపుతుంటే మా అమ్మ అదేంట్రా..నిద్రలోకూడా పాడేస్తున్నావా..?అనేదని గుర్తు చేసుకున్నారు. తొలినాళ్లలో తాను రూపొందించిన సింధుభైరవి, సాగరసంగమం చిత్రాల గీతాలు నేటికీ ప్రజల హదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోవడం విశేషమన్నారు. 1976 నుంచి తెలుగులో... 1976లో జయప్రద నటించిన ‘భద్రకాళి’అనే తెలుగు చిత్రంలోని ‘చిన్నిచిన్ని కన్నయ్య’అనే పాటకు సంగీతాన్ని అందించి మ్యూజిక్ డైరెక్టర్గా సినీరంగ ప్రవేశం చేశాను. తన సినీ జీవితంలో ఇప్పటి వరకు ఐదుసార్లు తెలుగు, తమిళం, మళయాళం చిత్రాలకుగాను ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులను అందుకున్నా. 2015 అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో జీవిత సాఫల్య పురస్కారాన్ని స్వీకరించాను. 1993లో లండన్లోని రాయల్ ఫిలార్మోనిక్ ఆర్కెస్ట్రాలో పూర్తిస్థాయి సింఫనిపై రాగాలు పలికించి తొలి భారతీయ స్వరకర్తగా గుర్తింపు పొందాను. చలన చిత్రాలకు సంగీతాన్ని అందించడంతోపాటు పాశ్చాత్య సంగీతంతో భారతీయ శాస్త్రియ సంగీతాన్ని మేళవించి ప్రయోగాలను చేశాను. ‘పంజముగి’ అనే సరికొత్త రాగాన్ని సంగీత ప్రియులకు అందించడం గర్వకారణంగా ఉందన్నారు. తాను తయారు చేసిన ‘హౌటు నేమ్ ఇట్’,‘నథింగ్ బట్ విండ్’ సినిమాయేతర ఆల్బమ్లు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయన్నారు. ప్రయోగాత్మక సంగీత విభాగంలో సంగీత నాటక అకాడమి అవార్డు లభించాయన్నారు. ఇప్పటి వరకు 16 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చాయని, 1988లో తమిళనాడు ప్రభుత్వం ‘కలైమామని’ అవార్డుతో గౌరవించగా, ఈ ఏడాది కేరళ ప్రభుత్వం నుంచి నిషాంగంధి పురస్కారంతో సన్మానించిందన్నారు. హూస్టన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘విశ్వతులసి’చిత్రానికి ‘గోల్డెన్ రెమి’అవార్డును అందుకున్నానన్నారు. 2010 సంవత్సరంలో భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’ అవార్డుతో గౌరవించిందని, నేడు గీతం విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో గౌరవించడం గర్వంగా ఉందన్నారు. ఐదు జాతీయ అవార్డులు తన 1000వ చిత్రంగా తారై తప్పెటై్ట సినిమాకు ఉత్తమ నేపథ్య సంగీత విభాగంలో జాతీయ అవార్డు లభించిందని, ఇది నా సంగీత విభాగంలో సాధించిన ఐదో జాతీయ అవార్డ్ అని పేర్కొన్నారు. గత 1984లో సాగరసంగమం, 1989లో రుద్రవీణ లాంటి తెలుగు చిత్రాలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నానని ఇళయరాజా చెప్పారు. -
ఇళయరాజా సంగీతంతో అంజలి పాప
ఇసైజ్ఞాని ఇళయరాజా సంగీత సారథ్యంలో అంజలి పాప అనే చిత్రం తెరకెక్కుతోంది. సినిమాకు సంగీతానికి ఎంత అనుబంధమో చిన్న సినిమాలకు ఇళయరాజా సంగీతం అంత బలం. అందుకే చిన్న చిత్రాల నిర్మాతలు, నవ దర్శకులకు ముందు కళ్ల ముందు ప్రత్యక్షమయ్యేది ఆ సంగీత మ్యాస్ట్రోనే. ఆయన కూడా చిన్న, పెద్ద అని చూడకుండా కథ తనను హత్తుకుంటే వెంటనే సంగీతం అందించడానికి సిద్ధం అంటారు. అలా ఇళయరాజా కథ వినగానే తాను బాణీలు కడతాను అని చెప్పిన చిత్రం అంజలి పాప. విశేషం ఏమిటంటే అందరూ కొత్తవారు రూపొందిస్తున్న చిత్రం ఇది. రైనా ప్రొడక్షన్స్ పతాకంపై శిల్పా నాయక్ కథను అందించి, నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవ దర్శకుడు అజయ్ నోయల్ కథనం, దర్శకత్వం బాధ్యతలతో పాటు కథానాయకుడిగా నటిస్తున్నారు. నటి సన్నది కేహెచ్.నాయకిగా పరిచయం అవుతున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో ఆకాశ్భట్, విశాఖ వందన, యోగానంద్, షరోన్నివేదా నటిస్తున్నారు. టైటిల్ పాత్రలో బెంగళూర్కు చెందిన విపుల అనే మూడేళ్ల చిన్నారి నటిస్తున్నారు. ఆ చిత్రం షూటింగ్ శుక్రవారం ఉదయం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. చిత్రం గురించి దర్శకుడు, కథానాయకుడు అజయ్నోయల్ తెలుపుతూ ఇది మూడేళ్ల చిన్నారి ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్న కథా చిత్రం అని చెప్పారు. ఈ చిత్ర కథను వినగానే సంగీత జ్ఞాని ఇళయరాజా చాలా బాగుందని అభినందించడంతో పాటు వెంటనే సంగీతాన్ని అందిస్తానని చెప్పారని అన్నారు. దర్శకుడు చాలా ఎనర్జిటిక్ అని ఆయన దర్శకత్వంలో చిత్రం చేయడం చాలా ఆనందంగా ఉందని నిర్మాత శిల్పానాయక్ అన్నారు. -
ఎయిర్పోర్ట్లో ప్రముఖ అనామకులు
అవమానం ఇళయరాజాకి బెంగళూరు ఎయిర్పోర్ట్లో అవమానం జరిగింది! అవమానమా? ఎవరు అవమానించి ఉంటారు? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఎందుకంటే లోకంలో అవమానించేవారు అంటూ ఎవరూ ఉండరు. అవమాన పడేవాళ్లు మాత్రమే ఉంటారు. పట్టించుకుని ఫీల్ అయితే అవమానం. ఫీల్ని వదిలేస్తే.. జస్ట్ అదొక అనుభవం. ప్రముఖులకు, ప్రసిద్ధులకు జరిగే అవమానాలు సాధారణంగా పెద్దపెద్దవి అయి ఉండవు. కానీ పెద్దవాళ్లు కాబట్టి చిన్న చిన్న విషయాలకే ఫీల్ అవుతుంటారు. సగటు మనుషులుగా ఇది మన అబ్జర్వేషన్ మాత్రమే అయి ఉండొచ్చు కూడా. ఏదైనా నొప్పి నొప్పే. నొప్పించిన వాళ్లు డ్యూటీలో భాగంగా నొప్పించినా సరే.. గొప్పవాళ్లు బాధపడే అవకాశం ఉంది. ఇళయరాజా కూడా అలాగే బాధపడ్డారు. అవమానం ఫీల్ అయ్యారు. ఆ సంగతి కాస్త ఆలస్యంగా బయటికి వచ్చింది. గతవారం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం కోసం మంగుళూరు వెళ్లారు. దర్శనం అయ్యాక చెన్నైకి తిరుగు ప్రయాణం కట్టారు. బెంగళూరు విమానాశ్రయంలో ఆయన్ని భద్రత అధికారులు ఆపి తనిఖీ చేశారు! ఇళయరాజా దగ్గర ఉన్న దైవ ప్రసాదాన్ని వాళ్లు మరింకేదో అని అనుమానించి, ప్రసాదంతో పాటు ఇళయరాజా దగ్గర ఉన్న మిగతా సరంజామానంతా తనిఖీ చేశారు. ఆయన వివరణ ఇవ్వబోయినా వినిపించుకోలేదు. తర్వాత ఆయన కుటుంబ సభ్యులను కూడా చెక్ చేశారు. ఈ సంగతి తెలిసి ఇళయరాజా అభిమానులు కలత చెందారు. ఎండీఎంకే నేత వైగో ఈ అవమానాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒక సంగీత దర్శకుడిని.. ఎవరో అపరిచితుణ్ణి చేసినట్టుగా తనిఖీ చేస్తారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ సెలబ్రిటీలు ఇలా ఇంటా బయటా విమానాశ్రయాలలో మరీ అవమానం కాకపోయినా, అభాసుపాలైన సంఘటనలు మరికొన్ని ఉన్నాయి. 2013లో రణ్బీర్ కపూర్ ముంబైలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో బుక్ అయ్యాడు. అతడు లెక్కలో చూపించని వస్తువులు అధికారుల తనిఖీలో బయపడడంతో కపూర్ అక్కడికక్కడ కస్టమ్స్ వాళ్లకు లక్ష రూపాయలు కక్కవలసి వచ్చింది. పెనాల్టీగా మరో 70 వేలు. అయితే అంత డబ్బు తన దగ్గర లేకపోవడంతో వస్తువుల్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. తర్వాత కపూర్ మనుషులు డబ్బు కట్టి వాటిని విడిపించుకున్నారు. అనుష్కా శర్మ 2011లో ఏదో అవార్డు ఫంక్షన్కి ఫారిన్ వెళ్లి వస్తూ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ వాళ్లకు పట్టుబడ్డారు. అమె దగ్గర్నుంచి 45 లక్షల రూపాయల విలువైన ఆభరణాలను, అతి ఖరీదైన వాచీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదే ఏడాది బిపాష బసును ముంబై ఏర్పోర్ట్ అధికారులు తనిఖీ కోసం ఆపారు. ఆమె దగ్గర ఉన్న హ్యాండ్బ్యాగ్ భారీగా కనిపించడంతో వారికి అనుమానం వచ్చి చూశారు. చిన్న పాటి వస్తువులకు 12 వేలు సుంకం కట్టించుకుని, గంటపాటు నానా రకాల ప్రశ్నలు వేసి ఆమెను వదిలిపెట్టారు. 2012లో బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ని చికాగో ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ వాళ్లు, ఇమిగ్రేషన్ వాళ్లు ఇద్దరూ కలిసి ఆయన్ని ఒళ్లంతా తడిమి చూశారు. రకరకాల ప్రశ్నలతో విసిగించారు. ఒక కథనం ప్రకారం ఆయన బట్టలు కూడా తీయించి చెక్ చేశారు! ఈ చర్యలను ఆమిర్ ఎంతో అవమానకరమైనవిగా భావించారు. జాన్ అబ్రహాం 2009లో యు.ఎస్. వెళ్లినప్పుడు న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో తనిఖీ సిబ్బంది ఆపి చాలాసేపు గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. అతడి పాస్పోర్ట్లో ఓసారెప్పుడో ఆఫ్ఘనిస్థాన్కు వెళ్లివచ్చినట్లు ఉండడంతో వారికి అనుమానం వచ్చింది. తను సినిమా నటుడినని చెప్పి, వారిని ఒప్పించి ఎలాగో బయటపడ్డాడు అబ్రహాం. ఇదే ఎయిర్పోర్ట్లో అదే ఏడాది షారుక్ఖాన్ని అధికారులు ఆపేశారు. అప్పుడాయన ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ చిత్రం ముందస్తు ప్రమోషన్ టూర్లో వున్నారు. పేరు చివర ఖాన్ అని ఉండడంతో అనుమానించిన అధికారులు షారుఖ్ని దాదాపు రెండు గంటల పాటు ప్రశ్నించారు. అక్కడి భారతీయ రాయబారులు ఎయిర్పోర్ట్కు చేరుకుని షారుక్ని విడిపించాల్సి వచ్చింది. వీళ్లందర్నీ అలా ఉంచండి. సాక్షాత్తూ మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్నే ఏర్పోర్ట్ అధికారులు అడ్డుకుని, ప్రశ్నలతో సతమతం చేశారు. 2011లో ఆయన్ని యు.ఎస్.లోని. జాన్ ఎఫ్.కెన్నెడీ విమానాశ్రయ భద్రతా సిబ్బంది జాకెట్, షూజ్ విప్పించి మరీ తనిఖీ చేశారు. ఆ తర్వాత ఈ విషయమై అమెరికా, ఇండియాకు క్షమాపణ చెప్పింది. 2009లో కూడా కలామ్కి ఇలాంటి అవమానమే జరిగింది. న్యూఢిల్లీలో ఆయన ఎక్కిన కాంటినెంటల్ ఎయిర్లైన్స్ (యు.ఎస్.) విమాన సిబ్బంది ఆయన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే వదిలిపెట్టారు. అయితే కలామ్ ఈ రెండు సందర్భాలలోనూ అవమానంగా ఫీల్ అవలేదు. నవ్వుతూ తనిఖీ అధికారులకు సహకరించారు. ఆయన తరఫున భారత ప్రభుత్వం మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేసింది. పైన ‘పట్టుబడ్డ’ బాలీవుడ్ ప్రముఖులలో ఎక్కువమంది నిబంధనలు అతిక్రమించారు. కాబట్టి వాళ్లు దానిని అవమానంగా ఫీల్ కానవసరం లేదు. ఇక ఇప్పుడు ఇళయరాజాకు జరిగింది అవమానమా కాదా అన్నది కూడా ఆయన దానిని ఎలా తీసుకున్నారన్న దాన్ని బట్టే ఉంటుంది. -
ఇళయరాజాపై సోదరుడి ఫైర్
ఇళయరాజాపై ఆయన సోదరుడు, సంగీత దర్శకుడు గంగైఅమరన్ ఫైర్ అయ్యారు. జాతీయ అవార్డును తిరస్కరించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇటీవల పలువురు విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఆయన చర్యను చాలా మంది గర్హిస్తున్నారు. ఇళయరాజా 1000వ చిత్రం తారైతప్పటై చిత్ర నేపథ్య సంగీతానికిగాను ఆయనకు జాతీయ అవార్డు వరించింది. అయితే దాన్ని ఆయన తన సంగీతానికి సరైన గుర్తింపు లభించలేదంటూ తిరస్కరించారు. ఈ విషయంలో ఇళయరాజా నిర్ణయాన్ని ఆయన సోదరుడు, జాతీయ అవార్డుల జ్యూరీ సభ్యుల్లో ఒకరైన గంగైఅమరన్ తీవ్రంగా ఖండించారు. ఇళయరాజా చర్యను తప్పు పట్టారు. ఈ విషయంపై గంగైఅమరన్ స్పందిస్తూ ఇళయరాజా గొప్ప సంగీత దర్శకుడే. అలాగని జాతీయ అవార్డును తిరస్కరంచడం సరైన చర్య కాదు.సంగీతంలో ఇద్దరికి అవార్డును అందించడంలో తప్పేమిటి? సంగీతానికి, పాటలకు ఒకరికే అవార్డు ప్రకటించాలనడంలో అర్థం లేదు. ఆస్కార్ అవార్డుల్లో ఇలాంటి విధానం లేదు. అయినా ఇప్పుడు ఒక్క ఇళయరాజా మినహా పాటలకు, నేపథ్యసంగీతానికి ఏ సంగీత దర్శకుడు అందిస్తున్నారు. ఒక్కో పాటకు ఒకరు సంగీతాన్ని అందిస్తున్న రోజులివి. అదే విధంగా పాత చింతకాయ పచ్చడిలా ఎప్పుడూ ఒకే తరహా సంగీతాన్ని అందిస్తే ఎలా? కొత్త కొత్త సంగీత దర్శకులు వస్తున్నారు. మన కాలం ముగిసిందన్న ఆలోచనకు రావాలి. ఇప్పుటికీ తాను యువకుడినే అనే ఆలోచనా ధోరణిని మార్చుకోవాలి. ఇళయరాజా గొప్ప సంగీత దర్శకుడే.అలాంటి వ్యక్తి భారతదేశంలో అత్యున్నతమైన జాతీయ అవార్డును తిరస్కరించడం ఆయన అభిమానులైన తనలాంటి వారికి అసంతృప్తిని కలిగించే విషయం. ఒక వేళ ఆయనకు అవార్డు అందుకోవడం ఇష్టం లేకపోతే ఆ విషయాన్ని ముందే తెలిపితే ఆయన చిత్రాలు పరిశీలించేటప్పుడు ఇళయరాజా అవార్డును స్వీకరించరు అని ఆ చిత్రాలను పక్కన పెడతాం. విచారణై చిత్రానికి జీవీ మంచి సంగీతాన్నే అందించారు.ఆయనకు జాతీయ అవార్డును ప్రకటించి యువ సంగీతదర్శకులను ప్రోత్సహించే వారమని గంగైఅమరన్ తన సోదరుడు ఇళయరాజాపై విరుచుకుపడ్డారంటూ మీడియాలో ప్రచారం హల్చల్ చేస్తోంది. -
నా సంగీతానికి పూర్తి గుర్తింపు లభించలేదు: ఇళయరాజా
తమిళసినిమా (చెన్నై): నా సంగీతానికి పూర్తిగా గుర్తింపు లభించలేదని, అందుకే జాతీయ అవార్డును తిరస్కరించానంటున్నారు ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా. సహస్ర చిత్రాల సంగీత దర్శకుడైన ఈయన 1000వ చిత్రం తారైతప్పట్టై నేపథ్య సంగీతానికిగాను కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డును ప్రటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డును ఇళయరాజా మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదగా అందుకోవలసి ఉంది. బిగ్ బీ అమితాబ్, నటి రుతిక, సముద్రకని జాతీయ వార్డులను అందుకోగా ఇళయరాజా మాత్రం హాజరుకాలేదు. గురువారం తమిళనాడులోని తిరువణ్ణామలై సమీపంలోని రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్లిన ఇళయరాజా అక్కడ విలేకరులతో జాతీయ అవార్డును తిరస్కరించడం గురించి వివరణ ఇచ్చారు. తన సంగీతానికి పూర్తి గుర్తింపు లభించకపోవడం వల్లే తాను అవార్డును తిరస్కరించినట్లు వెల్లడించారు. సంగీతానికి ఇచ్చే అవార్డును రెండుగా విభజించడం తనకు సరి అనిపించలేదన్నారు. 2010 నుంచి ఆరేళ్లుగా ఒకే ఒక్క జాతీయ అవార్డు లభించిందన్నారు.అంతకు ముందు సాగర సంగమం, సింధుభైరవి, రుద్రవీణ చిత్రాలకు జాతీయ అవార్డును అందుకున్నానని గుర్తు చేశారు. అలాంటిది ఇప్పుడు సంగీతానికి ఇచ్చే అవార్డును రెండు భాగాలు చేసి ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డును ఎం.జయచంద్రన్కు అందించి తనకు నేపాథ్య సంగీతానికి అవార్డును ప్రకటించడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. సంగీతాన్ని ఒకే విభాగంగా భావించాలన్నారు. -
నేను ఓటు వేయను.. కమల్
రానున్న ఎన్నికలలో నేను ఓటు వేయను అని విశ్వ నటుడు కమలహాసన్ అన్నారు. ఆయన జోక్గా అన్న విషయం కాదు. పత్రికా ముఖంగానే చెప్పారు. కమలహాసన్ నటిస్తూ, రాజ్కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం శభాష్నాయుడు. తమిళం, తెలుగు, హిందీ భాషలలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్ర నిర్మాణంలో లైక్ ప్రొడక్షన్ భాగస్వామ్యం పంచుకుంటోంది. ప్రముఖ మలయాళ దర్శకుడు టి.కె.రాజీవ్కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కథానాయకిగా శ్రుతిహాసన్ నటించడం విశేషం. ముఖ్యపాత్రలో రమ్యకృష్ణతో పాటు బ్రహ్మానందం సౌరభ్శుక్లా, ఆనంద్ మహాదేవ్, భరత్బహుండల్, ఫరిదాజలాల్, సిద్ధిక్, మనునారాయణన్ తదితరులు నటిస్తున్నారు. చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఉదయం స్థానిక టి.నగర్, హబీబుల్లా రోడ్డులోని నడిగర్ సంఘం ఆవరణంలో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర టీజర్ను ప్రదర్శించారు. కార్యక్రమంలో కమలహాసన్, శ్రుతిహాసన్, దర్శకుడు టి.కె.రాజీవ్కుమార్, సంగీత దర్శకుడు ఇళయరాజా, లైక్ సంస్థ అధినేత సుభాష్కరణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కమలహాసన్ విలేకరులతో మాట్లాడుతూ ఇది హ్యూమరస్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషలలో ఏకకాలంలో రూపొందించనున్నట్లు చెప్పారు. తమిళం, తెలుగు భాషలలో శభాష్నాయుడు, హిందీ శభాష్కుండు పేరును నిర్ణయించినట్లు తెలిపారు. దశావతారం చిత్రంలోని పది పాత్రలలో ఒకటైన బలరామ్నాయుడు పాత్ర విస్తరించే కథే శభాష్నాయుడు అని వివరించారు. ఇందులో తన కూతురు శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్నట్లు చెప్పారు. ఆమె చిత్రంలోనూ తనకు కూతురుగానే నటిస్తున్నారని తెలిపారు. శ్రుతితో కలిసి నటించడం ఆనందంగా ఉందన్నారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పలువురు విదేశీ సంగీత కళాకారులు పని చేస్తున్నట్లు వెల్లడించారు. స్టెపప్-2 చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు తమ చిత్రానికి పని చేస్తున్నట్లు చెప్పారు. మే నెల 14 నుంచి అమెరికాలోని లాస్ఏంజెల్స్లో రెగ్యులర్ షూటింగ్ను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మే నెల 16న తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి కదా! మీరు ఓటు హక్కు వినియోగించుకోరా? అన్న ప్రశ్నకు తాను ఓటు వేయను అన్నారు. కారణం తనకు ఓటు పట్టికలో తన పేరు లేదని వివరించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేయాలని వెళితే అప్పటికే తన ఓటును వేరెవరో వేసేశారని, ఈ సారన్నా ఓటు హక్కును వినియోగించుకోవాలని భావించగా ఓటరు పట్టికలో తన పేరే లేదన్నారని, ఎన్నికల కమిషనర్ తనకు మంచి మిత్రుడే అయినా ఏమి చేసేది అని కమల్ నిట్టూర్చారు. నాన్నతో నటించడం గర్వంగా ఉంది: శ్రుతి ఇలాంటి తరుణం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నానని నటి శ్రుతిహాసన్ చెప్పారు. ఆయన తనకు ఆర్ట్, నటన, సంగీతం అన్ని నేర్పించారని ఈ చిత్రంలో నాన్న లాంటి గొప్ప నటుడితో కలిసి నటించడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు. -
అప్పుడు... బలరామ్ నాయుడు! ఇప్పుడు... శభాష్ నాయుడు!
ఎనిమిదేళ్ల క్రితం పది పాత్రల్లో కమల్హాసన్ నటించిన ‘దశావతారం’ (2008) గుర్తుండే ఉంటుంది. అందులో కమల్ చేసిన పాత్రల్లో ‘రా’ ఆఫీసర్ బలరామ్ నాయుడు ఒకటి. కామెడీ టచ్ ఉన్న ఆ పాత్ర తెరపై కనిపించేది కాసేపే! ఆ పాత్ర ఎంత సూపర్హిట్ అంటే, ‘ఇంకాసేపు ఉంటే బాగుండు’ అని అప్పట్లో చాలామంది అనుకున్నారు. వాళ్ల కోరిక తీరనుంది. బలరామ్ నాయుడు పాత్రతో కమల్ ఓ కొత్త సినిమా మొదలుపెట్టారు. కమల్కు రియల్ డాటర్ శ్రుతీహాసన్ ఇందులో రీల్ డాటర్గా నటిస్తున్నారు. ఈ తండ్రీకూతుళ్ళు కలసి నటిస్తున్న తొలి చిత్రం ఇది. అలాగే, ఇందులో కమల్ భార్యగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. ‘దశావతారం’లో బలరామ్ నాయుడితో పాటు పక్కనే ఉంటూ సందడి చేసిన క్యారెక్టర్ ఇంకోటి ఉంది కదా! అప్పట్లో ఆ పాత్రను డ్యాన్స్ మాస్టర్ రఘురామ్ చేశారు. ఇప్పుడు అప్పారావు పాత్రను తెలుగు, తమిళ వెర్షన్స్లో బ్రహ్మానందం చేస్తున్నారు. హిందీలో ఈ పాత్రను రచయిత, నటుడు సౌరభ్ శుక్లా చేస్తున్నారు. తెలుగు, తమిళ చిత్రాలకు ‘శభాష్ నాయుడు’, హిందీ వెర్షన్కి ‘శభాష్ కుండూ’ అనే టైటిల్ ఖరారు చేశారు. టి.కె. రాజీవ్కుమార్ దర్శకత్వంలో రాజ్కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై ఈ చిత్రాన్ని కమల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా పాటలు స్వరపరుస్తుండడం విశేషం. -
కమల్కు ఇళయరాజా టైటిల్!
కమల్హాసన్-ఇళయరాజాలది ఓ సూపర్హిట్ కాంబినేషన్. కానీ, దాదాపు 11 ఏళ్లుగా కమల్ నటించిన ఏ చిత్రానికీ ఇళయరాజా పనిచేయలేదు. తాజాగా వీరిద్దరూ కలిసి మళ్లీ పనిచేస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం మంగళవారం చెన్నైలో జరిగింది. శ్రుతీహాసన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి టీకే రాజీవ్మీనన్ దర్శకుడు. విశేషమేమిటంటే, ఈ సినిమాకు నామకరణం ఇళయరాజానే చేశారట! పాతికేళ్ల క్రితం తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఓ చిత్రానికి ‘గుణ’ అనే టైటిల్ పెట్టింది కూడా ఇళయరాజానే. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కమల్ సినిమాకు ఇళయరాజా టైటిల్ సూచించారు. ఈ విషయాన్ని కమల్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మరి ఈ సినిమా టైటిల్ ఏంటో చెప్పకుండా కమల్ సస్పెన్స్లో పెట్టారు. -
మ్యాస్ట్రో మరో రికార్డ్
దక్షిణాది లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా మరో అరుదైన రికార్డ్ను సొంతం చేసుకున్నారు. భారతీయ సినీ చరిత్రలో మరే సంగీత దర్శకుడికి సాధ్యం కాని 1000 సినిమాల మార్క్ను అందుకున్న మ్యాస్ట్రో, తాజాగా ఆ సినిమాకు జాతీయ అవార్డ్ను సైతం సొంతం చేసుకున్నారు. తన 1000వ చిత్రంగా తారై తప్పట్టై సినిమాకు సంగీతం అందించిన ఇళయరాజాకు, ఉత్తమ నేపథ్య సంగీతం విభాగంలో జాతీయ అవార్డు లభించింది. ఇది, సంగీత విభాగంలో ఇళయరాజా సాధించిన ఐదవ జాతీయ అవార్డ్. గతంలో 1984లో సాగరసంగమం, 1989లో రుద్రవీణ లాంటి తెలుగు చిత్రాలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్న ఇళయరాజా, తరువాత 1986లో విడుదలైన తమిళ చిత్రం సింధుభైరవి, 2009లో రిలీజ్ అయిన మలయాళ సినిమా పళాసి రాజాలకు కూడా జాతీయ అవార్డులను అందుకున్నారు. తాజాగా దర్శకుడు బాల రూపొందించిన తారై తప్పట్టై చిత్రానికి గాను తన ఐదవ జాతీయ అవార్డును అందుకుంటున్నారు మ్యాస్ట్రో. -
పాంచ్ పటాస్
చెన్నై : కోలీవుడ్ జాతీయ స్థాయిలో పాంచ్ పటాస్ అంటూ మరోసారి తన సత్తా చాటుకుంది.ఉత్తమ చిత్రాలకు, కళాకారులకు పేరెన్నికలో మేమెప్పుడూ ఉంటామని తాజా జాతీయ అవార్డులతో మరోసారి రుజువు చేసుకుంది. ఈసారీ ఐదు జాతీయ అవార్డులు కోలీవుడ్ను పులకరింపజేశాయి.2015 ఏడాదికి గానూ కేంద్రప్రభుత్వం 63వ జాతీయ సినీ అవార్డులను గెలుచుకున్న చిత్రాలను, కళాకారులు, సాంకేతిక నిపుణుల పట్టికను సోమవారం ఉదయం ఢిల్లీలో వెల్లడించారు.అందులో తమిళ చిత్ర పరిశ్రమ ప్రధాన కేటగిరీల్లో ఐదు అవార్డులను గెలుచుకుని తన ఆధిక్యాన్ని నిలుపుకుంది. విచారణైకి ముచ్చటగా మూడు ఇక ఉత్తమ విలువలతో ఆలోచింపజేసే కథలతో చిత్రాలు రూపొందించడంలో తమిళ కళాకారులు దిట్ట అని ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి నిరూపణ అయ్యింది. వెట్రిమారన్ ఈయన తమిళసినిమా నమ్ముకున్న దర్శకులలో ఒకరు. ఇంతకు ముందు ఆడుగళం చిత్రంతో జాతీయ అవార్డును తమిళ సినిమాకు గెలిచిపెట్టిన వెట్రిమారన్ ఈ సారి విచారణై చిత్రంతో ఏకంగా మూడు జాతీయాలను అందించారు.జైలులో ఖైదీ జీవన విధానాన్ని అత్యంత సహజత్వంతో కళ్లకు కట్టినట్లు ఈయన తెరపై ఆవిష్కరించిన చిత్రం విచారణై.ఇటీవలే విడుదలై సగటు ప్రేక్షకుడితో పాటు విమర్శకులను సైతం మెప్పించిన చిత్రం విచారణై. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు,రివార్డులు అందుకున్న ఈ చిత్రం తాజాగా ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది.ఇక ఇందులో నటించిన దర్శకుడు సముద్రకనిని ఉత్తమ సహాయనటుడు అవార్డు వరించింది.ఇక ఇదే చిత్రానికి గాను ఆ మధ్య కన్ను మూసిన ఎడిటర్ కిశోర్ను జాతీయ అవార్డు వరించడం విశేషం.ఆయన ఇంతకు ముందు ఆడుగళం చిత్రానికి గాను ఉత్తమ జాతీయ అవార్డును అందుకున్నారన్నది గమనార్హం.అదే విధంగా తొలి చిత్రంతోనే సినీ పండితుల ప్రశంసలను అందుకున్న నటి రితిక ఇరుదుచుట్రు చిత్రానికి గాను ఉత్తమ నటిగా ప్రత్యేక అవార్డుకు ఎంపిక కావడం హర్షించదగ్గ విషయం.నిజ జీవితంలో బాక్సర్ అయిన రితిక చిత్రంలోనూ అదే పాత్రలో జీవించారు. ఈమెకిదే తొలి చిత్రం కావడం విశేషం.కాగా జాతీయ అవార్డులను గెలుచుకున్న కళాకారుల అభిప్రాయాలను చూద్దాం. ఆదరణకు ధన్యవాదాలు జాతీయ ఉత్తమ సహాయ నటుడు అవార్డుకు ఎంపికైన దర్శకుడు సముద్రకని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ నటుడిగా తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.విచారణై చిత్రానికి ప్రాంతీయ ఉత్తమ చిత్రం అవార్డు,ఎడిటర్ కిశోర్ను అవార్డు వరించడం సంతోషంగా ఉంది. ఆస్కార్ అవార్డుగా ఇక తొలి చిత్రంతోనే జాతీయ అవార్డుకు అర్హురాలైన నటి రితిక తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ అవార్డును ఊహించలేదు. దీన్ని ఆస్కార్ అవార్డుగా భావిస్తున్నాను.దీనికి కారణం అయిన దర్శకురాలు సుధ,రాజ్కుమార్ హిరాణి లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని అన్నారు.దర్శకుడు వెట్రిమారన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. జాతీయ అవార్డులను గెలుచుకున్న వారందరికీ సూపర్స్టార్ అభినందనలు తెలిపారు. సంగీతరాజాకు మరోసారి భారతీయ చిత్ర పరిశ్రమలోనే సహస్ర చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఏకైక సంగీత దర్శకుడు ఇళయరాజా.సంగీత ప్రపంచంలో అనితరసాధ్యం కాని ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఈ సంగీత జ్ఞానికి తాజాగా మరో జాతీయ అవార్డుకు అలంకారం కానున్నారు.ఎస్.ఆయన సంగీతం అందించిన 1000వ చిత్రం తారై తప్పట్టై చిత్రంతోనే ఆయన ఉత్తమ సంగీత దర్శకుడుగా మరోసారి జాతీయ అవార్డును అందుకోనున్నారు. బాలా వల్లే సాధ్యం అయ్యింది తారై తప్పట్టై చిత్రానికి గానూ ఇళయరాజా ఉత్తమ సంగీతదర్శకుడు అవార్డును గెలుచుకున్న సందర్భంగా ఆ చిత్ర నిర్మాత, కథానాయకడు శశికుమార్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఇళయరాజా 1000వ చిత్రాన్ని నేను నిర్మించడం భాగ్యంగా భావిస్తున్నాను.నా కంపెనీ ప్రొడక్షన్లో నిర్మించిన పసంగ,తలైమురైగళ్ చిత్రాల వరుసలో జాతీయ అవార్డులను గెలుచుకున్న చిత్రంగా తారైతప్పట్టై చేరడం ఆనందంగా ఉంది.ఇది దర్శకుడు బాలా వల్లే సాధ్యం అయ్యింది. కొన్ని చిత్రాల గురించి ముందుగానే.. మూడు జాతీయ అవార్డులను కైవశం చేసుకున్న విచారణై చిత్ర నిర్మాత నటుడు ధనుష్ ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.కొన్ని చిత్రాలు ప్రారంభించినప్పుడే తెలిసి పోతుంది.అవి ముఖ్యమైన స్థానంలో నిలుస్తాయని.వెట్ట్రిమారన్ దర్శత్వంలో నేను నిర్మించిన ఈ విచారణై చిత్రం అలాంటి అంచనాలనే ఏర్పరచింది.ఈ చిత్రంలో నటించిన సముద్రకని ఉత్తమ సహాయ నటుడు అవార్డును,ఎడిటర్ కిశోర్కు అవార్డు వరించడం సంతోషంగా ఉంది.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెట్రిమారన్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని ధనుష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ఇళయరాజాకు తొలి సెల్యూట్
చెన్నై : సంగీత రారాజు ఇళయరాజాకు తొలి సెల్యూట్ చేసే కార్యక్రమం శనివారం చెన్నైలో జరగనుంది. సహస్ర చిత్రాలకు సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడు బహుశ భారతదేశంలోనే ఇసైజ్ఞాని ఇళయరాజా ఒక్కరే అయ్యి ఉంటారు. ఇది ఒక చరిత్ర అని పేర్కొనవచ్చు. అలాంటి సంగీతరాజాకు సెల్యూట్ చెప్పే విధంగా వంద మంది ప్రముఖ చిత్ర కళాకారులు ఆయన సంగీతం నోట్స్కు రూపం ఇస్తూ గీసిన చిత్రలేఖనాల ప్రదర్శన కార్యక్రమం శనివారం ఉదయం 10 గంటలకు స్థానిక నుంగమ్బాక్కమ్లోని లయోలా కళాశాలలో జరుగనుంది. ఈ కార్యక్రమంలో ఇళయరాజాతో పాటు నటుడు విజయ్సేతుపతి, నడిగర్సంఘం అధ్యక్షుడు నాజర్, పొన్వన్నన్, దర్శకుడు ఎస్పీ జననాథన్,కదిర్, పా.రంజిత్ పాల్గొననున్నారు. -
27న ఇసైజ్ఞానికి అభినందనోత్సవం
వెయ్యి చిత్రాలు, 5 వేల పాటలకు సంగీతం అందించడం అసాధారణం అని చెప్పకతప్పదు. అలాంటి సాధనను ఆలవోకగా అధిగమించిన సంగీత జ్ఞాని ఇళయరాజా. ఒక భారతీయుడిగా మనందరం గర్వించే ఓ అద్భుత వ్యక్తి ఇళయరాజా. పలు భాషల్లో తన సంగీత ప్రవాహంతో ఖండాంతర ఖ్యాతి గాంచిన ఇళయరాజా సాధనకుగానూ ఆయనకు ఈ నెల 27న బ్రహ్మాండ అభినందనోత్సవ కార్యక్రమం జరుగనుంది. ఇళయరాజా మ్యూజిక్ మేనేజ్మెంట్, విజయ్ టీవీ సంయుక్తంగా నిర్వహించనున్న ఆ కార్యక్రమం చెన్నైలో జరగనుంది. ఆ వేదికపై ఇళయరాజా సంగీతం అందించిన ఆణిముత్యాలాంటి పాటల గానాంమృతం కార్యక్రమం ఆయనకు కానుకగా సమర్పించడానికి చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరూ పాల్గొననున్నట్లు, కనీవినీ ఎరుగని విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. వెయ్యి చిత్రాలన్నది ఒక లెక్కకే ఇళయరాజా మాట్లాడుతూ వెయ్యి చిత్రాలకు సంగీతం అందించానన్నది తనకు సంబంధించినంత వరకూ అది ఒక లెక్కకేనని పేర్కొన్నారు. దీంతో తాను గర్వపడడం లేదన్నారు. సంగీతం తన జీవితం, శ్వాస. తన అభిమానుల కరతాళ ధ్వనులే తనకు అభినందనలు. నా జీవితానికి అర్థం, పరమార్థం అవేనని పేర్కొన్నారు. తనకు అభినందన అనడం ఆ సంగీతాన్ని తనకిచ్చిన భగవంతునికే అభినందనగా భావిస్తూ తానా కార్యక్రమంలో పాల్గొననున్నట్లు ఇళయరాజా పేర్కొన్నారు. జగ్జిత్సింగ్ మెమోరియల్ అవార్డు ఈ ఇసైజ్ఞానికి మరో అరుదైన అవార్డు వరించినుందన్నది తాజా అంశం. మన జాతి రత్నాల్లో జగ్జిత్సింగ్ ఒకరని గర్వంగా చెప్పుకోవచ్చు. ఆయన పేరుతో ప్రతి ఏడాది వివిధ రంగాల్లో సాధించిన వారికి జగ్జిత్ ఫైండేషన్ జగ్జిత్ మెమోరియల్ అవార్డును అందించి గౌరవిస్తూ వస్తోంది. ఈ ఫైండేషన్ 75వ వార్షికం సందర్భంగా 2016వ ఏడాదికిగాను ఆ అవార్డుతో సంగీత జ్ఞానిని సత్కరించనున్నట్లు ఆ ఫైండేషన్ చైర్మన్ చిత్రాసింగ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 7,8 తేదీల్లో ముంబైలో నిర్వహించనున్న జగ్జిత్సింగ్ మ్యూజిక్ ఫెస్టివల్ కార్యక్రమంలో ఇళయరాజాకు అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత సంగీత కళాకారులు ఉస్తాద్ జకీర్ హుస్సేన్, పండిత్ హరిప్రసాద్ చౌరాసియా, పండిట్ బిర్జు మహరాజ్, సోనూనిగమ్, సురేశ్ వడ్కర్, హరిహరన్ పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. -
అజయ్క్రిష్ణ హీరోగా కట్టం పోట్ట సట్ట
నాడోడిగళ్ చిత్రంలో చిన్న పాత్రతో నటనకు శీకారం చుట్టిన నటుడు అజయ్క్రిష్ణ. చిన్న పాత్రతోనే చిన్న చిన్న గ్రామాల వరకూ రీచ్ అయిన ఈయన ఆ మధ్య విడుదలైన ధరణి చిత్రంలో కథానాయకుడిగా తన స్థాయిని మరింత పెంచుకున్నారు. తాజాగా కట్టంపోట్టసట్ట అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా పిశాచు చిత్రం ఫ్రేమ్ ప్రియాంక నటిస్తున్నారు. వైట్ పికాక్ ప్రొడక్షన్ పతాకంపై ఎస్.శరవణన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు అక్షయప్రియన్ పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు అగస్త్యిన్ శిష్యుడన్నది గమనార్హం. ఇసైజ్ఞాని ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సిలంబాట్టం చిత్ర దర్శకుడు శరవణన్ చాయాగ్రహణం అందించడం విశేషం. చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ దక్షిణాది జిల్లాల ప్రజల జీవన విధానాన్ని అందంగా ఆవిష్కరించే చిత్రం కట్టం పోట్ట సట్ట అని తెలిపారు. ఈ చిత్రం కోసం అళగర్మలై, అడివారం సమీపంలో ఒక గ్రామ సెట్నే వేసి చిత్రీకరిస్తున్నట్లు వెల్లడించారు. చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుందని దర్శకుడు తెలిపారు. -
దేవుడే పంపించాడు
మనుషుల్లో మానవత్వాన్ని పెంపొందించి రమ్మని భగవంతుడే తుపాన్ను పంపించారని ఇసైజ్ఞాని ఇళయరాజా వ్యాఖ్యానించారు. ఇటీవల తమిళనాడును తుపాన్ కుదిపేసిన విషయం తెలిసిందే. బాధితులను పలువురు పలు విధాలుగా ఆదుకునే ప్రయత్నం చేశారు. వారందరికి ధన్యవాదాలు తెలిపి ప్రసంశా పత్రాలను అందించే కార్యక్రమం గురువారం ఉదయం స్థానిక ఎగ్మోర్లోని ఎతిరాజ్ కళాశాల ఆవరణలో జరిగింది. ఇందులో ఇళయరాజా, నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ముఖ్య అతిథులుగా పాల్గొని వరద బాధితులకు ఆపన్న హస్తం అందించిన వారిని అభినందించారు. ఇళయరాజా మాట్లాడుతూ ఇటీవల వచ్చిన తుపాన్ చాలా మందిని బాధించిన మాట వాస్తవం అన్నారు. మరో పక్క అది మనుషుల్లోని మానవత్వాన్ని మేలుకొలపడానికి దోహద పడిందని వ్యాఖ్యానించారు. ప్రతి వ్యక్తిలోనూ మానవత్వం దాగి ఉంటుందని, దాన్ని ముందుగానే ప్రదర్శించి ఉంటే ఈ తుపాన్ వచ్చి ఉండేది కాదని అన్నారు. వానలు, వరదలు లాంటివి భగవంతుని ఆదేశానుసారంగా వస్తుంటాయన్నారు. ఆ భగవంతుడే మనుషుల్లోని మానవత్వాన్ని మేలుకొలిపి రమ్మని తుపాన్కు చెప్పి పంపించారని అన్నారు. తాను ప్రజల మధ్య ఉండటానికి ఇష్టపడనని అలాంటిది వరద బాధితులను కలుసుకోవడానికి సాహసించడం అన్నది భావమే కారణం అన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని ఈ తుపాన్ సూచించిందన్నారు. అయితే అది దాని వల్ల కలిగిన నష్టం మాత్రం పూడ్చలేనిదని ఇళయరాజా అన్నారు. -
ఇళయరాజా సరికొత్త రికార్డు
-
దేవుడే పంపించాడు
మనుషుల్లో మానవత్వాన్ని పెంపొందించి రమ్మని భగవంతుడే తుపాన్ను పంపించారని ఇసైజ్ఞాని ఇళయరాజా వ్యాఖ్యానించారు. ఇటీవల తమిళనాడును తుపాన్ కుదిపేసిన విషయం తెలిసిందే. బాధితులను పలువురు పలు విధాలుగా ఆదుకునే ప్రయత్నం చేశారు. వారందరికి ధన్యవాదాలు తెలిపి ప్రసంశా పత్రాలను అందించే కార్యక్రమం గురువారం ఉదయం స్థానిక ఎగ్మోర్లోని ఎతిరాజ్ కళాశాల ఆవరణలో జరిగింది. ఇందులో ఇళయరాజా, నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ముఖ్య అతిథులుగా పాల్గొని వరద బాధితులకు ఆపన్న హస్తం అందించిన వారిని అభినందించారు. ఇళయరాజా మాట్లాడుతూ ఇటీవల వచ్చిన తుపాన్ చాలా మందిని బాధించిన మాట వాస్తవం అన్నారు. మరో పక్క అది మనుషుల్లోని మానవత్వాన్ని మేలుకొలపడానికి దోహద పడిందని వ్యాఖ్యానించారు. ప్రతి వ్యక్తిలోనూ మానవత్వం దాగి ఉంటుందని, దాన్ని ముందుగానే ప్రదర్శించి ఉంటే ఈ తుపాన్ వచ్చి ఉండేది కాదని అన్నారు. వానలు, వరదలు లాంటివి భగవంతుని ఆదేశానుసారంగా వస్తుంటాయన్నారు. ఆ భగవంతుడే మనుషుల్లోని మానవత్వాన్ని మేలుకొలిపి రమ్మని తుపాన్కు చెప్పి పంపించారని అన్నారు. తాను ప్రజల మధ్య ఉండటానికి ఇష్టపడనని అలాంటిది వరద బాధితులను కలుసుకోవడానికి సాహసించడం అన్నది భావమే కారణం అన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని ఈ తుపాన్ సూచించిందన్నారు. అయితే అది దాని వల్ల కలిగిన నష్టం మాత్రం పూడ్చలేనిదని ఇళయరాజా అన్నారు. -
72 ఏళ్ల వయసులో.. పడవలో వెళ్లి సాయం చేశారు
జనజీవనాన్ని అతలాకుతలం చేసిన చెన్నై వరదల పై సామన్యులతో పాటు ప్రముఖులు కూడా బాగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా సినీ రంగానికి చెందిన చాలామంది ఇప్పటికే తమవంతుగా విరాళాలు ప్రకటించగా, మరికొందరు ప్రత్యక్షంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదే బాటలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కూడా స్వయంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాయం చేయడానికి ఎంత డబ్బయినా ఇచ్చే స్థోమత ఉన్నా, అక్కడి పరిస్థితి స్వయంగా తెలుసుకోవాలని భావించిన ఇళయరాజా, 72 ఏళ్ల వయసులో కూడా పడవలో ప్రయాణిస్తూ లిటిల్ ఫ్లవర్ అంధుల పాఠశాలకు వెళ్లి అక్కడి విద్యార్థులకు ఆహార పొట్లాలను అందించారు. కాసేపు వారితోనే గడిపిన రాజా వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. -
'సంగీతాన్నికంపల్సరీ చేయండి'
ప్రపంచ వ్యాప్తంగా హింసను తగ్గించాలంటే పాఠశాలలో, కళాశాలలో సంగీతాన్ని నిర్భంద విద్యగా ప్రవేశపెట్టాలని అన్నారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. గోవాలో జరగుతున్న ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సంగీతంలో దశాబ్దాల అనుభవం ఉన్న ఇళయరాజ, స్వరాల్లో ఉన్న దైవత్వం హింసను జయించగలదని,అందుకే విద్యార్థులకు సంగీతాన్ని నేర్పించాలన్నారు. దాదాపు భారతీయ భాషలన్నింటిలో ఎన్నో అద్భుత గీతాలను స్వరపరిచిన మేస్ట్రో వెయ్యి సినిమాలకు సంగీతం అందించిన మైళురాయికి చేరువలో ఉన్నారు. ఇప్పటికే నాలుగు నేషనల్ అవార్డ్స్తో పాటు, పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా అందుకున్న ఇళయరాజాను వేదికపై నిర్వాహకులు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్తో సత్కరించారు. -
హింసను తగ్గించడానికి సంగీతమే మార్గం!
పనాజీ: సంగీతానికి ఉన్న మహత్తర శక్తితో హింసను జయించవచ్చునని, పాఠశాలల్లో సంగీత పాఠాలను తప్పనిసరి చేయడం వల్ల సమాజంలో హింస తగ్గుముఖం పట్టే అవకాశముందని లెజండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా పేర్కొన్నారు. పనాజీలో జరుగుతున్న 46వ అంతర్జాతీయ భారతీయ చిత్రోత్సవంలో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న సందర్భంగా ఆయన ప్రసంగించారు. సంగీతానికి దివ్యశక్తితో సమాజంలో చోటుచేసుకుంటున్న హింసను నిరోధించవచ్చునని పేర్కొన్నారు. 'పాఠశాలలు, కళాశాలలు.. ఇలా ప్రతిచోటా సంగీతాన్ని తప్పనిసరి చేయండి. హింస దానంతట అదే తగ్గుముఖం పడుతుంది' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ కూడా పాల్గొన్నారు. కొన్ని దశాబ్దాల పాటు దక్షిణాది సినీ సంగీతాన్ని శాసించి.. అనేక సరికొత్త బాణీలతో సంగీతప్రియుల మదిలో చోటు సంపాదించుకున్న ఇళయరాజాను అనేక పురస్కారాలు వరించాయి. ఆయన సంగీతానికి పలుమార్లు జాతీయ చలనచిత్రం పురస్కారాలు లభించాయి. కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో ఆయనను సత్కరించింది. -
ఓ రాజకుమారి కథతో...
వైవిధ్యమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంటున్న నారా రోహిత్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘కార్తికేయ’ చిత్రాన్ని నిర్మించినవెంకట శ్రీనివాస్ బొగ్గరం సారథ్యంలో ‘కథలో రాజకుమారి’ పేరుతో ఓ సినిమా రానుంది. మహేశ్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నమితా ప్రమోద్ కథానాయిక. ఇళయ రాజా స్వరాలు సమకూరుస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్తో చిత్రాన్ని నిర్మించనున్నాం. ఇళయరాజా గారు సంగీతం అందించడం మా అదృష్టం. జనవరిలో చిత్రీకరణ ప్రారంభిస్తాం’’అని చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జయేశ్ నాయర్, సహ నిర్మాత:బీరం సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ప్రవసాయి సత్యనారాయణ, సమర్పణ: శిరువూరి రాజేశ్ వర్మ. -
’సంగీతమే నా శ్వాస, జీవితం, సర్వస్వం’
-
మనమందరం ప్రేమికులమే!
‘‘ఒక్కొక్కరికి ఒక్కో విషయంపై ప్రేమ ఉంటుంది. నాకు సంగీతంపై ప్రేమ ఉంటే కొందరికి డబ్బులపై ఉంటుంది. కాబట్టి మనమందరం ప్రేమికులమే. నేను మ్యూజిక్ చేసిన సినిమా గురించి నేను ఎక్కువగా మాట్లాడకూడదు. పాటలు విని శ్రోతలు మాట్లాడాలి. ఈ ‘అబ్బాయితో అమ్మాయి’ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అని సుప్రసిద్ధ సంగీత దర్శకులు ఇళయరాజా అన్నారు. నాగశౌర్య, పల్లక్ లల్వాని జంటగా రమేశ్వర్మ దర్శకత్వంలో వందనా అలేఖ్య జక్కం, కిరీటి పోతిని, శ్రీనివాస్ సమ్మెట నిర్మిస్తున్న ‘అబ్బాయితో అమ్మాయి’ పాటల ఆవిష్కరణ బుధవారం రాత్రి హైదరాబాద్లో జరిగింది. ఇళయరాజా పాటల సీడీనీ, నాగశౌర్య తల్లి ఉష, పల్లక్ లల్వాని తల్లి దీపికా లల్వాని థియేటర్ ట్రైలర్నూ ఆవిష్కరించారు. నాగశౌర్య మాట్లాడుతూ - ‘‘నా కెరీర్ తొలిదశలోనే ఇళ యరాజాగారితో పనిచేయడం నా అదృష్టం. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా కంటే ముందే నేను రమేశ్వర్మతో సినిమా చేయాలి. ఇప్పటికి కుదిరింది’’ అని చెప్పారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ వేడుకలో సినీ ప్రముఖులు నల్లమలుపు బుజ్జి, సాయి కొర్రపాటి, అవసరాల శ్రీనివాస్, లగడపాటి శ్రీధర్, బెల్లంకొండ సురేశ్, సి. కల్యాణ్, దాసరి కిరణ్, రావు రమేశ్, మల్టీడైమన్షన్ వాసు, ఆర్పీ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఇళయరాజా ప్రస్థానంలో మరో మైలురాయి
ఈ తరం సంగీత దర్శకులు 50వ సినిమా చేయటమే చాలా కష్టంగా కనిపిస్తుంది. అలాంటిది ఏకంగా 1000 సినిమాలకు సంగీతం అందించటం అంటే మామూలు విషయం కాదు. అలాంటి అరుదైన రికార్డ్ను త్వరలోనే సొంతం చేసుకోబోతున్నారు, సౌత్ సినిమా మ్యూజిక్ లెజెండ్ ఇళయరాజా. తన స్వర ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన పాటలతో అలరించిన ఈ స్వర మాంత్రికుడు సంగీతం అందించిన 1000వ సినిమా త్వరలోనే రిలీజ్కు రెడీ అవుతోంది. ఇళయరాజ కెరీర్లో మైల్స్టోన్ లాంటి సినిమా కావటంతో ఈ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాలో సుబ్రమణ్యపురం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయి తరువాత హీరోగా మారిన శశికుమార్ హీరోగా నటిస్తున్నాడు. శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ హీరోయిన్గా నటిస్తోంది. తమిళ్తో పాటు తెలుగులో కూడా రిలీజ్ కానున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో భారీ ఈవెంట్ను ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి : ఆనందరాగం కోరే ప్రాయం (2) నీ నవ్వులో విరులే తోచెనే ఈక్షణం యవ్వనం నీకోసం పాడేనే ఆనందరాగం కోరే ప్రాయం చరణం : 1 కొసరిన కలలలో ముసిరిన కథలలో ఊగే రేగే తీయని తీరని కోరికలే విరిసిన మల్లెలలో పరచిన వెన్నెలలో ఏవో తోచే అచ్చట ముచ్చటలెరుకలే తొలకరి వన్నెల పందిరిలో గడసరి కన్నుల వాకిటలో ఆశలు తీరా బాసలు తీరా ఆడాలీ పాడాలీ ॥ఆనందరాగం॥ చరణం : 2 అలిగిన దీపములే కలిపిన బంధములే నాలో నీలో చేసెను రేపెను సందడులే చెరగని స్నేహములే తరగని మోహములే నన్నూ నిన్నూ పొందిన అల్లరి చేసెనులే మనసున రాగము పూచినది పరువము నీపై వీచినదీ నీ జతలోనా మైమరిచేనా నీనీడై నీతోడై ॥ఆనందరాగం॥ చిత్రం : మధురగీతం (1981), రచన : రాజశ్రీ సంగీతం : ఇళయరాజా, గానం : పి.సుశీల -
పొంగిపొర్లే సంగీత తరంగం... ఇళయరాజా!
గ్రేట్ పర్సనాలిటీ నాలుగు దశాబ్దాలు.. ఎనిమిది వందల సినిమాలు.. నాలుగు వేలకు పైగా పాటలు.. సంగీత జ్ఞాని, మ్యాస్ట్రో ఇళయరాజా పరిచయానికి ఈ గణాంకాలు సరిపోవు. అంతకు మించిన ఘనకీర్తి ఆయన సొంతం. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మధ్యతరగతి స్వభావం ఆయనది. గడచిన మూడు దశాబ్దాలుగా దక్షిణ భారత సంగీత ప్రపంచాన ఏకఛత్రాధిపత్యం వహించినా ఆయనలో కించిత్ గర్వం కనిపించదు. ఇదే ఇళయరాజాను అత్యుత్తమ స్థానంలో నిలిపిందంటే సందేహం ఎంతమాత్రమూ లేదు. భారత దేశపు గ్రేటెస్ట్ మ్యుజీషియన్.. మ్యాస్ట్రో జీవిత విశేషాలు తెలుసుకుందాం..! వినసొంపైన సంగీతానికి మారుపేరు ఇళయరాజా. చెన్నైలో నివాసముండే ఈయన, ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఏళ్లుగా సంగీతాన్ని సృష్టిస్తున్న ఈ సంగీత మేధావి ఇటీవలి కాలంలో కాస్తంత విశ్రమించారు. అయినప్పటికీ మ్యాస్ట్రో గీతాలాపన మాత్రం ఆగటంలేదు. అప్పుడెప్పుడో ఆయన వాడిపారేసిన సంగీతపు ఎంగిలి మెతుకులను నేటికీ ఏరుకుంటున్నారు దర్శకులు (ఆయన అంగీకారంతోనే). ఆ మధ్య వచ్చిన హిందీ చిత్రం 'పా', ఇటీవలి 'ఎవడే సుబ్రమణ్యం' లాంటివి ఇందుకు ఉదాహరణలు. బాల్యం.. తమిళనాడులోని పన్నైపురం గ్రామంలో 1943, జూన్ 2న రామస్వామి, చిన్నతాయమ్మాళ్ దంపతులకు మూడో కుమారుడిగా ఇళయరాజా జన్మించారు. వ్యవసాయిక ప్రాంతంలో పెరగడం వల్ల రైతులు పాడుకునే పాటలతో ఆయనకు జానపద సంగీత పరిచయం కలిగింది. తన 14వ ఏట సోదరుడు పావలార్ వరదరాజన్తో కలిసి ఇళయరాజా సంగీత కచేరీల్లో పాల్గొనేవారు. ఈ కాలంలోనే కన్నదాసన్ అనే తమిళ కవి భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు నివాళిగా రాసిన కవితకు మొదటిసారిగా బాణీలు కట్టారు. అభ్యాసం.. సంగీతాన్ని వృత్తిగా చేసుకుని స్థిరపడాలంటే క్రమబద్ధమైన సంగీత శిక్షణ ఎంతో అవసరమని గ్రహించిన ఇళయరాజా 1968లో మద్రాసు చేరుకున్నారు. అక్కడ ధనరాజ దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఆ సమయంలోనే ఆయనకు పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంతో పరిచయం ఏర్పడింది. దీంతో బేక్, బీథోవెన్, మొజార్ట్, షూబర్ట్ వంటి పాశ్చాత్య సంగీత దిగ్గజాల శైలిని తెలుసుకోగలిగారు. వీరు ఇళయరాజా బాణీలను ఎంతగానో ప్రభావితం చేశారు. శాస్త్రీయ సంగీతాన్ని లండన్లోని ట్రినిటీ సంగీత కళాశాలలో అభ్యసించిన ఆయన.. అక్కడే సంప్రదాయ గిటార్లో బంగారు పతకాన్ని కూడా పొందారు. సినిమాలు.. మొదట చెన్నైలోని శుభకార్యాలు, సభల్లో సంగీత ప్రదర్శనలిచ్చే బృందంలో సభ్యుడిగా ఇళయరాజా సంగీత ప్రయాణం ప్రారంభమైంది. తరువాతి కాలంలో పశ్చిమ బెంగాల్కు చెందిన సలీల్ చౌదురి, కన్నడ సంగీత దర్శకుడు జి.కె.వెంకటేశ్ దగ్గర సహాయకుడిగా చేరారు. వీరి దగ్గర గిటార్, కీబోర్డు కళాకారుడిగా పనిచేయడంతో సినీ పరిశ్రమతో అనుబంధం మొదలైంది. వెంకటేశ్ దగ్గరే దాదాపు 200 చిత్రాలకు పైగా పనిచేశారు. ఈ సమయంలోనే పంజు అరుణాచలం అనే తమిళ నిర్మాతతో పరిచయం ఏర్పడింది. 1976లో ఆయన అవకాశం ఇవ్వడంతో 'అన్నక్కలి' అనే తమిళ సినిమాతో సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తనదైన ముద్ర.. ఇళయరాజా వస్తూనే భారతీయ సినీ సంగీతంపై తనదైన ముద్ర వేయసాగారు. ఎన్నో సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికారు. పాశ్యాత్య సంగీతానికి చెందిన వివిధ వాయిద్యాలను ప్రవేశపెట్టి సరికొత్త సంగీతాన్ని సృష్టించారు. దీంతో సంగీత దర్శకత్వ ప్రక్రియ వేగవంతమవ్వడమే గాక, పాటలకు బాణీలు కట్టడంలో సంగీత దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ లభించేది. సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా సంగీత ఆల్బమ్లను కూడా రూపొందించారు. కర్ణాటక సంగీతకారుడు త్యాగరాజుకు అంకితమిచ్చిన 'హౌ టూ నేమిట్' 'నథింగ్ బట్ విండ్' లాంటి ఆల్బమ్లు చెప్పుకోదగ్గవి. ప్రపంచం మెచ్చిన పాట.. ఇళయరాజా స్వరపరిచిన దళపతి సినిమాలోని 'చిలకమ్మా చిటికెయ్యంగా' పాట 2003లో ప్రఖ్యాత బీబీసీ సంస్థ 155 దేశాల్లో నిర్వహించిన పోల్లో నాలుగో స్థానం దక్కించుకుంది. ఈ సంగీత సామ్రాట్టుకు దక్కిన అతిపెద్ద గౌరవంగా దీన్ని పరిగణిస్తారు. ఈయన సంగీత సారథ్యం వహించిన 'నాయకుడు' సినిమా టైమ్ మ్యాగజైన్ వారి టాప్-100 సినిమాల జాబితాలో నిలిచింది. గౌరవాలు.. తెలుగు చిత్రాలైన సాగర సంగమం (1984), రుద్రవీణ (1989)తో పాటు 1985లో వచ్చిన తమిళ సినిమా ‘సింధు భైరవి’లకు మూడుసార్లు 'జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు' పురస్కారాన్ని అందుకున్నారు. 2010లో వచ్చిన 'పళసి రాజా' అనే మళయాల చిత్రానికిగానూ ఉత్తమ నేపథ్య సంగీతం విభాగంలో జాతీయ అవార్డు గెలుపొందారు. 2004లో ఎన్.టి.ఆర్ జాతీయ పురస్కారం, 2010లో పద్మభూషణ్ అవార్డు స్వీకరించారు. -
ఆస్పత్రి నుంచి ఇళయరాజా డిశ్చార్జ్
చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈయన నాలుగు రోజుల క్రితం గుండె సంబంధిత సమస్యతో చెన్నై అన్నాశాలైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇళయరాజా రెండేళ్ల క్రితం గుండెపోటుకు గురై శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఇప్పుడు ఆయనకు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండె రక్తప్రసరణ సమస్యలేమీ లేవని నిర్ధారించారు. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని సూచించారు. ఇళయరాజా సోమవారం సాయంత్రమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరినట్లు ఆయన తమ్ముడు గంగైఅమరన్ కొడుకు, దర్శకుడు వెంకట్ప్రభు తన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
'ఇళయరాజా కులాసాగా ఉన్నారు'
చెన్నై: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని దర్శకుడు, నటుడు వెంకట్ ప్రభు తెలిపారు. ఆస్పత్రి నుంచి నేడు డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. 'ఇళయరాజా ఆస్పత్రిలో చేరారని తెలియగానే అభిమానులు, సన్నిహితులు కంగారు పడ్డారు. ఇళయరాజా ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. ఆయనిప్పుడు కులాసాగా ఉన్నారు. జనరల్ చెకప్ కోసమే ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి నుంచి ఈరోజే విడుదలవుతారు' అని వెంకట్ ప్రభు సోమవారం ట్వీట్ చేశారు. కడుపు నొప్పితో బాధపడుతూ ఆయన ఈనెల 15న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. గ్యాస్ట్రిక్ సమస్య కారణంగానే ఆయనను ఆస్పత్రిలో చేర్చినట్టు ఇళయరాజా కుటుంబ సభ్యులు తెలిపారు. 72 ఏళ్ల ఇళయరాజా 5 వేలకు పైగా పాటలు కంపోజ్ చేశారు. For all isaignani fans and well wishers out there!! Raja pa is absolutely fine!! Just a general check up & few tests! He is back home 2day -
ఇళయరాజాకు అస్వస్థత
సాక్షి, చెన్నై: ప్రఖ్యాత సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా(72) అస్వస్థతతో ఇక్కడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన గుండె సంబంధ అనారోగ్యానికి గురయ్యారని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. ఒంట్లో నలతగా ఉండడంతో శుక్రవారం ఆయన ఆస్పత్రిలో చేరారు. డాక్టర్లు ఆయనకు గుండె, జీర్ణాశయానికి సంబంధించిన పలు పరీక్షలు నిర్వహించారు. ఇళయరాజా ఇదివరకు గుండెకు సర్జరీ చేయించుకున్నారు. ఆయన ఇటీవల యూట్యూబ్లో సొంత మ్యూజిక్ చానల్ను, ఓ వెబ్సైట్ను ప్రారంభించారని, ఆ సందర్భంగా పలు టీవీ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో అధికంగా మాట్లాడ్డంతో అనారోగ్యానికి గురై ఉండొచ్చని సినీ వర్గాలు చెప్పాయి. -
ఇళయరాజాకు అనారోగ్యం: ఆస్పత్రిలో చేరిక
-
సొంత మ్యూజిక్ సైట్ను ప్రారంబించిన మాస్ట్రో