Sarileru Neekevvaru Movie
-
మేరా భారత్ మహాన్
-
‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ నాకు మైనస్ అయ్యింది: సంగీత షాకింగ్ కామెంట్స్
నటి సంగీత.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఖడ్గం మూవీతో ఒకే ఒక్క చాన్స్ అంటూ అమాయకపు మాటలతో కుర్రకారును ఆకట్టుకుంది. ఆ తర్వాత పెళ్లాం ఊరెళితే, ఖుషి ఖుషిగా, సంక్రాంతి వంటి చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరైంది. చివరిగా 2010లో కారా మజాకా చిత్రంలో కనిపించిన ఆ తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చింది. దాదాపు 10ఏళ్ల విరామం అనంతరం మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీ రీఎంట్రీ ఇచ్చింది. చదవండి: హాట్టాపిక్ బిగ్బాస్ కంటెస్టెంట్స్ పారితోషికం, ఎవరెవరికి ఎంతంటే..! సెకండ్ ఇన్నింగ్స్లో ఆడపదడపా చిత్రాలు చేస్తూ.. పలు డాన్స్, కామెడీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తోంది. తాజాగా ఆమె ‘మసూద’ అనే హార్రర్ చిత్రంలో నటిచింది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ టీవీ షోలో పాల్గొన్న ఆమె సరిలేరు నీకెవ్వరు మూవీ, ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్కి తల్లిగా చేసిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత తెలుగులో ఆమె చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’లో హీరోయిన్కి మదర్గా చేయడం ప్లస్ అయ్యిందా? మైనస్అయ్యిందా? అని హోస్ట్ ప్రశ్నించగా.. రెండూ అని సమాధానం ఇచ్చింది. చదవండి: ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ నాకు మైనస్ అయ్యింది: సంగీత షాకింగ్ కామెంట్స్ ఆ తర్వాత అనిల్ రావిపూడి వచ్చి తనకు కథ వివరించారని చెప్పంది. ఇక ఇప్పుడు అనిల్ని చూస్తే ‘రేయ్ ఇలా చేశావ్ రా నన్ను’ అని తింటుకుంటాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సంగీత. ఆ తర్వాత అవకాశం వదులుకున్న సినిమాలు ఏమైనా ఉన్నాయా అని కూడా సంగీతని అడగ్గా.. ఓ సినిమా షూటింగ్ కి రెండు రోజులు వెళ్లానని, ఆ తర్వాత వాళ్లు చిత్రం నుంచి తీసేశారని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా సరిలేరు నీకెవ్వరులో సంగీత హీరోయిన్గా తల్లిగా ‘అబ్బబ్బా నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్’ అంటూ తన కామెడీతో ప్రేక్షకులను బాగా నవ్వించ్చింది. -
మహేశ్ సినిమాలో ఆ పాత్రను అయిష్టంగానే చేశా: ప్రకాశ్ రాజ్
ప్రకాశ్ రాజ్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. పరిశ్రమలో ప్రకాశ్ రాజ్కు ప్రత్యేకం స్థానం ఉంది. ఎలాంటి పాత్రలోనైన ఇట్టే ఒదిగిపోయే నటుడు ఆయన. అందుకే ఆయన నటనకు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండడనడంలో అతిశయోక్తి లేదు. ఎలాంటి పాత్రెయిన ఆయన ఇమిడిపోయే తీరు ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలా ఆయనను అందరి చేత విలక్షణ నటుడిగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహేశ్ బాబు చిత్రంలో తనకు నచ్చని పాత్ర చేశానంటూ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. ‘ఏ ఆర్టిస్టుకైనా ఒక్కోసారి నచ్చని పాత్రలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పాత్రల్లో 'సరిలేరును నీకెవ్వరు' సినిమాలో నేను చేసిన పాత్ర ఒకటి. ఆ సినిమాలో అబద్ధాలు చెప్పే రాజకీయనాయకుడి పాత్ర పోషించాను. అయితే నాకు పాత్ర నచ్చకున్న అయిష్టంగానే చేయాల్సి వచ్చింది. నటులకు కొన్ని సార్లు వారి నిర్ణయాలు.. అభిప్రాయాలతో పనిలేకుండా అలా జరిగిపోతూ ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు. కాగా మహేశ్ బాబు హీరోగా చేసిన ఆ సినిమాలో తానును అలాంటి పాత్రను చేయడం అసంతృప్తిగా అనిపించినా, ఆయన నిర్మించిన 'మేజర్' సినిమాలోని పాత్ర తనకు సంతృప్తినిచ్చిందన్నారు. ఇక తన కెరీర్లో 'ఆకాశమంత' .. 'బొమ్మరిల్లు' సినిమాలు తనకు చాలా సంతోషాన్ని కలిగించాయని ఆయన చెప్పారు. చదవండి: కొత్త జంట నయన్-విఘ్నేశ్కు ఓటీటీ షాక్! రూ. 25 కోట్ల ఒప్పందం రద్దు? -
2 ఏళ్ళు పూర్తి చేసుకున్న సరిలేరు నీకెవ్వరు
-
2020 ‘సినిమా’ రివ్యూ
2020.. ప్రపంచానికే ఓ బ్లాక్ ఇయర్. ఈ ఇయర్లోకి ఎంటరైన రెండు నెలలకే కరోనా వైరస్ మానవాళిపై దాడి చేసింది. ఈ మహమ్మారి దాటికి ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణికి పోయింది. అన్ని రంగాలు కుదేలైపోయాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు అయితే గట్టి దెబ్బ కొట్టింది. టాలీవుడ్లో ప్రతి ఏడాది దాదాపు 250 సినిమాల వరకు విడుదలై ప్రేక్షకుల్ని అలరించేవి. కానీ కరోనా ధాటికి ఈ ఏడాది దాదాపు 50 సినిమాలు కూడా విడుదల కాలేదు. సంక్రాంతి తప్ప.. ఈ ఏడాది మొత్తంలో ఒక్క స్టార్ హీరో సినిమా కూడా థియేటర్లలో విడుదలవలేదు. 2020లో విడుదలైన సినిమాలేంటి? వాటిలో ఏవి హిట్ అయ్యాయి. ఏవి ప్లాప్ను మూటగట్టుకున్నాయి? సమగ్ర సమాచారం మీకోసం... సంక్రాంతికి సందడి చేసిన మహేశ్-బన్నీ టాలీవుడ్ సినిమా క్యాలెండర్ ప్రతి ఏటా సంక్రాంతి నుంచి మొదలవుతుంది. ఈ సీజన్లో బడా హీరోలంతా బరిలోకి దిగుతారు. వీలైనన్ని పెద్ద సినిమాలు సంక్రాంతికి వస్తాయి. ఈ సారి కూడా పెద్ద పెద్ద సినిమాలే సంక్రాంతి బరిలోకి దిగాయి. మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరుతో బరిలోకి దిగగా... ‘అల వైకుంఠపురములో’తో అల్లుఅర్జున్ రంగంలోకి దూకాడు. ఇక ‘ఎంతమంచివాడవురా’ అంటూ కళ్యాణ్ రాము సంక్రాంతి పోరులో నిలిచారు. అయితే ఈ ముగ్గురిలో మాత్రం.. మహేశ్- బన్నీల మధ్యే ప్రధాన పోరు జరిగింది. ఒక్క రోజు తేడాతో వచ్చిన ఈ రెండు సినిమాలు బాక్సాపీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఈ రెండు సినిమాల్లో మాత్రం ‘అల వైకుంఠపురములో’కి కాస్త ఎక్కువ మార్కులు పడ్డాయి. ఇక రెండు భారీ సినిమాల మధ్య విడుదల అయిన కల్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’ ప్లాప్ను మూటగట్టుకుంది. ప్లాప్ను మూటగట్టుకున్న మాస్ మహారాజా మహేశ్, బన్నీ సినిమాలు సక్సెస్పుల్గా రన్ అవుతున్న సమయంలో ‘డిస్కోరాజా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రవితేజ. జనవరి 24న విడుదలైన ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయింది. సినిమా సక్సెస్ అవుతుందని ఎన్నో అశలు పెట్టుకున్న మాస్ మహారాజ ఫ్యాన్స్కు నిరాశే మిగిలింది. సినిమా కోసం రవితేజ కూడా బాగానే కష్టపడ్డాడు కానీ వర్కౌట్ కాలేదు. అలరించని ‘అశ్వథ్థామ’ ఛలో’ సినిమాతో యూత్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ హీరో నాగశౌర్య.. ‘అశ్వథ్థామ’గా ప్రతాపం చూసేందుకు ముందుకు వచ్చాడు. మెహరిన్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ ఈ ఏడాది జనవరి 31న విడుదలై పాజిటివ్ టాక్ను రాబట్టింది కానీ సిల్వర్ స్క్రీన్పై పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. కానీ బుల్లితెరపై మాత్రం సక్సెస్ అయింది. ఈ మూవీ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న జెమినీ టీవీ మే 15న ఈ చిత్రాన్ని ప్రసారం చేయగా.. 9.10 టీఆర్పీ రేటింగ్ను దక్కించుకుంది. మాయ చేయని ‘జాను’ శర్వానంద్ నటించిన ‘జాను’ సినిమా ఫిబ్రవరి 7న విడులైన ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. `96`కి రీమేక్ గా వచ్చిన `జాను` పై ప్రేక్షకులకు ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. కానీ వాటిని ‘జాను’ అందుకోలేకపోయింది. `96`కి జిరాక్స్ కాపీగా మిగిలిందే తప్ప, ప్రత్యేకమైన ముద్ర వేయలేకపోయింది. కానీ శర్వానంద్, సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి. డిజాస్టర్ మూటగట్టుకున్న‘రౌడీ’ మంచి ఫాంలో ఉన్న విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అంటూ వాలెంటైన్స్ డే రోజు ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. కానీ ప్రేక్షకుల ప్రేమను మాత్రం చురగొనలేదు. క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఈ సినిమా డిజాస్టర్ అనిపించుకుంది. మూడు లవ్ స్టోరీలు చూపించినా.. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఇరవై కోట్లు కూడా రాబట్టలేకపోయిందట. ఫలించిన ‘భీష్మ’ బాణం వరుస పరాజయాలను మూటగట్టుకుంటున్న టాలీవుడ్ను భీష్ముడుగా వచ్చి కాపాడాడు యంగ్ హీరో నితిన్. వెంకీ కుడుమల దర్శకత్వంలో నితిన్, రష్మిక జంటగా నటించిన `భీష్మ` ప్రేక్షకుల్ని అలరించింది. నితిన్ కెరీర్లో ఇది పెద్ద హిట్టుగా నిలిచింది. విజయాలు లేక బోసిపోయిన థియేటర్లకు యూత్తో పాటు కుటుంబ ప్రేక్షకులను రప్పించింది. ఆ సినిమా విడుదలైన కొన్ని వారాలకే లాక్ డౌన్ మొదలైంది. లేకుంటే బాక్సాఫీస్ వద్ద 50కోట్ల క్లబ్ లో చేరేది. ‘హిట్’ సూపర్ హిట్ నాని నిర్మించిన ‘హిట్’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు హీరో విశ్వక్ సేన్. ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన `హిట్`…పేరుకి తగ్గట్టే హిట్ అనిపించుకుంది. ఈ సినిమా పాజిటీవ్ టాక్తో మంచి వసూళ్లను రాబట్టి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్గా నటించింది. పర్వాలేదనిపించిన ‘పలాస’ మార్చి 6న విడుదలైన `పలాస` విమర్శకుల్ని మెప్పించింది. ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చిన సినిమా ఇది. కరోనా వైరస్ లేకపోతే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యేది. సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకే థియేటర్లు మూతపడడంతో సినిమా అంతగా సక్సెస్ కాలేదు. థియేటర్లలో పెద్దగా ఆడలేదు గానీ, ఓటీటీలో వచ్చాక… ఈసినిమాకి వ్యూవర్ షిప్ పెరిగింది. ఈ సినిమాలో నాదీ నక్కిలీసు గొలుసు పాట మాత్రం మాస్ ఆడియన్స్ ని ఊపేసింది. మార్చి 17 నుంచి థియేటర్లు మూత పడటం సినిమాల విడుదలకు ఊహించని బ్రేక్ పడింది. సినిమాలు లేక విలవిలలాడిన సినీ ప్రేమికులను ఓటీటీ సంస్థలు కాపాడాయి. లాక్డౌస్ సమయంలో చొరవ చూపి మరి కొన్ని చిత్రాలను విడుదల చేశాయి. వాటిలో నాని, సుధీర్ బాబు హీరోలుగా నటించిన ‘వి’, కీర్తీ సురేష్ పెంగ్విన్, మిస్ ఇండియా, అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఇక పెద్ద సినిమాల్లో సూర్య హీరోగా నటించిన ఆకాశమే హద్దురా మాత్రం హిట్ టాక్ను సంపాదించుంది. వీటితో పాటు కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలోడీస్’, ఉమా మహేశ్వర ఉగ్ర రూపశ్య, జోహార్ లాంటి చిత్రాలు విజయవంతం అయ్యాయి. మొత్తానికి థియేటర్లు లేని లోటును కొద్దో గొప్పో ఓటీటీ వేదికలు తీర్చాయని చెప్పొచ్చు. -
దటీజ్ మహేశ్.. వరుసగా మూడోసారి
సూపర్స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన జంటగా వచ్చిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 11న రిలీజై మహేశ్ బాబు గత సినిమా రికార్డులన్నింటిని తిరగరాసింది. తాజాగా ఈ సినిమా మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. (చదవండి : నిహారికకు చిరంజీవి ఖరీదైన బహుమతి) అత్యధిక హ్యాష్ట్యాగ్లు సాధించి ట్విటర్లో ట్రెండింగ్లో నిలిచిన తెలుగు సినిమాల జాబితాలో అగ్ర స్థానంలో నిలిచింది. అలాగే ఈ ఏడాదికి ఓవరాల్గా భారత్లో మూడో స్థానం సాధించింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ `దిల్ బెచారా`, సూర్య `సూరారై పొట్రు` తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. కాగా, 2019లో కూడా మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమా కూడా ఎక్కువ మంది ట్వీట్స్ చేసిన సినిమాగా నిలిచింది. అంతకు ముందు 2018లో ‘భరత్ అనే నేను’ సినిమా కూడా ఎక్కువ మంది ఈ సినిమాను ట్వీట్ చేస్తూ ట్యాగ్ చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. (చదవండి : ఈ ఏడాది ట్విట్టర్లో ఎక్కువగా చర్చించిందేంటంటే..) Most Tweeted Hashtags Related to Movies In Telugu 🔥 2018 - #BharathAneNenu 2019 - #Maharshi 2020 - #SarileruNeekevvaru Super ⭐ @urstrulyMahesh 🤘#SSMBRuledTwitter2020 💥#SarkaruVaariPaata #ThisHappened2020 pic.twitter.com/5A2sniOAVs — BARaju (@baraju_SuperHit) December 8, 2020 -
వావ్..‘మైండ్ బ్లాక్’ చేసిన సితార
సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార మరోసారి తన డ్యాన్స్తో ఇరగదీసింది. ఇప్పటికే ఇంగ్లీష్ పాటలతో పాటు తన తండ్రి మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని ‘డాంగ్ డాంగ్’ పాటలకు చిందేసి హల్చల్ చేసిన సీతు పాప...తాజాగా అదే సినిమాలోని ఫేమస్ సాంగ్ ‘మైండ్ బ్లాక్’కి తనదైన స్టైల్లో స్టెప్పులు వేసి అదరగొట్టింది. (చదవండి : సితార డాడీ కూతురు.. ఫోటో షేర్ చేసిన నమ్రత) ఈ డ్యాన్స్కు సంబంధించిన వీడియోను నమ్రత తన ఇన్స్ట్రాగ్రామ్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం సితార డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సితార వేసిన స్టెప్స్కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. తండ్రికి తగ్గ తనయ అని అనిపించావు అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురుపిస్తున్నారు. కాగా, అనిల్ రావిపుడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక, విజయశాంతి ముఖ్య పాత్రలు పోషించారు. (చదవండి : మహేశ్ బాబు ఇంట బర్త్డే పండగ) -
‘మైండ్ బ్లాక్’ చేసిన సితార
-
మహేశ్ పాటకు చంపేశావ్ పో..
-
నేను..నీ ముందు తేలిపోయా: వార్నర్
క్రికెటర్గా బిజీ బిజీగా ఉండే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కరోనా లాక్డౌన్ సమయంలోనూ తీరిక లేకుండా గడుపుతున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సారథ్యం వహిస్తున్న వార్నర్ తెలుగు సూపర్ హిట్ సినిమా పాటలకు భార్యతో కలిసి టిక్టాక్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. వారు చేసిన టిక్టాక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతున్నాయి. తాజాగా ఈ దంపతులు సూపర్స్టార్ మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని మైండ్ బ్లాక్ పాటకు స్టెప్పులేశారు. దాదాపు 50 టేక్ల అనంతరం తాము సక్సెస్ అయ్యామని ట్విటర్లో ఆ వీడియోను శనివారం షేర్ చేశాడు. అయితే, వార్నర్ దంపతులు అదే పాటకు ఆదివారం కూడా స్టెప్పులేశారు. ఈ సందర్భంగా.. తన భార్య కాండిస్ మాదిరిగా తాను డ్యాన్స్ చేయలేకపోయానని వార్నర్ చెప్పుకొచ్చాడు. మైండ్ బ్లాక్ పార్ట్-2 లో ఆమె డ్యాన్స్ ఇరగదీసిందని మెచ్చుకున్నాడు. దీనికి మూడో పార్ట్ కూడా ఉంటుందని వార్నర్ చెప్పుకొచ్చాడు. ‘ డియర్.. నీ ముందు తేలిపోయా.. నేను చెత్తగా డ్యాన్స్ చేశా. నువ్వు మాత్రం స్టెప్పులతో ఇరదీశావ్. మరో పార్ట్తో ముందుకొస్తాం’ అని వార్నర్ తెలిపాడు. (చదవండి: ‘మైండ్ బ్లాక్’తో వచ్చిన వార్నర్..) -
వార్నర్ ‘మైండ్ బ్లాక్’ అదిరింది కానీ..
హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ టిక్టాక్ వీడియోలతో అభిమానులను అలరిస్తున్నాడు. ముఖ్యంగా తెలుగు డైలాగ్స్, పాటలతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు. బుట్టబొమ్మ, పోకిరి, బాహుబలి డైలాగ్స్తో టాలీవుడ్ అభిమానులను మెప్పిస్తున్నాడు. దీంతో ఆయా హీరోల అభిమానులు వార్నర్కు పలు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో మహేశ్బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని ‘మైండ్ బ్లాక్’ పాటకు టిక్టాక్ చేయాల్సిందిగా ఫ్యాన్స్ కోరుతున్నారు. (ఊపిరి పీల్చుకున్న టిక్టాక్) దీంతో అభిమానుల కోరిక మేరకు ‘మైండ్ బ్లాక్’ పాటకు సంబంధించిన స్టెప్పులతో పార్ట్-1 విడుదల చేశారు. ఈ పాట స్టెప్పుల కోసం చాలా కష్టపడ్డానని, 15 నిడివిగల ఈ టిక్టాక్ కోసం 51 సార్లు ప్రయత్నం చేశానని వార్నర్ చెప్పుకొచ్చాడు. అయితే తాజా వార్నర్ టిక్టాక్ వీడియో మహేశ్తో పాటు ఓవరాల్ టాలీవుడ్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా అభిమానుల కోరిక మేరకు అతడు పడుతున్న కష్టానికి ఫిదా అవుతున్నారు. ఈ పాటకు సంబంధించి మరో టిక్టాక్ వీడియో త్వరలోనే విడుదల చేస్తానని వార్నర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం వార్నర్ ‘మైండ్ బ్లాక్’ టిక్టాక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. (వార్నర్ వీడియోకు రష్మిక ఫిదా) Attempt 51 haha part 1 of @urstrulyMahesh #mindblock @CandyFalzon pic.twitter.com/AYrRVD3ooX — David Warner (@davidwarner31) May 30, 2020 -
రేపు వార్నర్ ‘మైండ్ బ్లాక్’ సర్ప్రైజ్!
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్ గత కొద్దిరోజులుగా టిక్టాక్ వీడియోలతో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ హీరోలను అనుకరిస్తూ ఇప్పటికే చేసిన టిక్టాక్ వీడియోలు ఎంత హైలైట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుట్టబొమ్మ సాంగ్, పొకిరి డైలాగ్, బాహుబలి సాంగ్కు తనదైన స్టైల్లో ఆకట్టుకున్నాడు వార్నర్. తన సతీమణి, కూతురుతో చేస్తున్న వీడియోలతో టిక్టాక్లో వార్నర్ ఫాలోవర్స్ సంఖ్య గణనీయంగానే పెరిగింది. ఈ క్రమంలో మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని మైండ్ బ్లాక్ సాంగ్కు టిక్టాక్ చేయమని వార్నర్ను అభిమానులు కోరుతున్నారు. (వార్నర్ వీడియోకు రష్మిక ఫిదా) ఇప్పటికే ఆ పాటలోని చిన్న బిట్కు టిక్టాక్ చేసిన వార్నర్, తాజాగా ఆ పాటకు సంబంధించిన పార్ట్1ను రేపు(శనివారం) విడుదల చేయనున్నట్లు తెలిపాడు. అయితే ‘మైండ్ బ్లాక్’ సాంగ్కు టిక్టాక్ అని చెప్పకుండా సర్ప్రైజ్ అంటూ ఆ పాటకు సంబంధించిన స్టెప్పులతో చిన్న హింట్ ఇచ్చాడు వార్నర్. దీంతో వార్నర్ తర్వాత టిక్టాక్ ‘మైండ్ బ్లాక్’అని అభిమానులు ఫిక్సయ్యారు. ఇక ‘బాహుబలి’ చిత్రంలోని ప్రభాస్ ఫోటోను, తన ఫోటోను జతచేస్తూ ‘మీరు మాలో ఎవర్ని ఇష్టపడుతున్నారు. మాలో ఎవరి దుస్తులు ఇష్టపడుతున్నారో చెప్పండి’అంటూ అభిమానులను వార్నర్ ప్రశించాడు. ఇక ఈ ఫోటోకు ‘దేవసేన ఎక్కడ’, ‘టాలీవుడ్లో హీరోగా ఎందుకు ట్రై చేయడం లేదు’, ‘ప్రభాస్ ఇండియా బాహుబలి, వార్నర్ ఆస్ట్రేలియా బాహుబలి’ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. (ఎన్టీఆర్కు వార్నర్ స్పెషల్ విషెస్!)! View this post on Instagram If you can guess this we will release part 1 tomorrow. #dance #nochance #wife #daughter @candywarner1 250k likes 👍👍 A post shared by David Warner (@davidwarner31) on May 28, 2020 at 11:36pm PDT View this post on Instagram Who’s costume do you prefer? 😂😂 @baahubalimovie #bahubali #prabhas #funny #fun A post shared by David Warner (@davidwarner31) on May 27, 2020 at 11:16pm PDT -
‘సరిలేరు’ తర్వాత మహేశ్ చిత్రం ఇదే!
‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తర్వాత టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు చేసే చిత్రం దాదాపు ఖరారయింది. మహేశ్ తన 28 చిత్రాన్ని ‘గీతా గోవిందం’ఫేమ్ పరుశురామ్కు అప్పగించినట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు పరుశురామ్ తన తదుపరి చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘ఒక్కడు సినిమా చూసిన తరవాత ఇండస్ట్రీకి రావాలని నిర్ణయించుకున్నాను. మహేష్ సార్తో సినిమా చేయాలనదే నా బలమైన కోరిక. నా కల ఇప్పుడు నెరవేరబోతోంది. ఇది నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో మానవ సంబంధాలు, కుటుంబ భావోద్వేగాలు అన్నీ ఉంటాయి. ప్రస్తుతం తన స్క్రిప్టులో ఇవన్నీ పొందుపరుస్తున్నాను. ఇది చాలా మంచి సినిమా అవుతుంది. నవరసాలు ఉంటాయి. అభిమానులు మహేశ్ను ఎలా చూడాలనుకుంటున్నారో అలానే ఈ చిత్రం ఉండబోతుంది. నాగ చైతన్యతో తాను కచ్చితంగా సినిమాను తెరకెక్కిస్తాను.. మహేశ్ చిత్రం తరువాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది’అని పరుశురామ్ వివరించాడు. కాగా మహేశ్ గత కొంతకాలంగా సందేశాత్మక కథాంశాలతో సినిమాలు చేస్తున్నారు. ఆ పంథాకు పూర్తి భిన్నంగా పూర్తిస్థాయి ప్రేమకథతో ఈ సినిమా మంచి ఎంటర్టైనర్గా ఉండనుందని సమాచారం. ఇక ఈ సినిమాలో మహేశ్ సరసన ‘మహానటి’ఫేం కీర్తి సురేష్ నటించనుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్రను విలన్ పాత్ర కోసం చిత్ర బృందం ఎంపిక చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. గోపీ సుందర్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం అన్నీ కుదిరితే ఆక్టోబర్లో సెట్స్పైకి వెళ్లనుంది. అయితే తన తదుపరి చిత్రం గురించి మహేశ్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. చదవండి: వార్నర్కు థ్యాంక్స్ చెప్పిన అల్లు అర్జున్ ‘మా అమ్మ బయోపిక్కి అనుమతి లేదు’ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘బాహుబలి’ని బ్రేక్ చేసిన మహేశ్ చిత్రం
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు హీరోగా యంగ్ అండ్ ట్యాలెంటెడ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ . ఈ సినిమా విడుదలైన తొలి ఆట నుంచే కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా మహేశ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అయితే ‘సరిలేరు’ చిత్రం తాజాగా మరో ఘనతను అందుకుంది. ఉగాది కానుకగా ఓ ప్రముఖ ఛానల్లో వచ్చిన ఈ చిత్రం అత్యధిక టెలివిజన్ వ్యూవర్షిప్ రేటింగ్ (టీవీఆర్)ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ‘బాహుబలి 2’రికార్డులను సైతం ఈ చిత్రం అధిగమించింది. ఇప్పటివరకు 22.70 టీవీఆర్తో బాహుబలి-2 అగ్ర స్థానంలో ఉండగా.. తాజాగా మహేశ్ సరిలేరు నీకెవ్వరు చిత్రం 23.4 టీవీఆర్ను సాధించి గత రికార్డులన్నింటిని తిరగరాసింది. బాహుబలి తొలి పార్ట్కు 21.84 టీవీఆర్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో కూడా వచ్చేసింది. అంతేకాకుండా ఈ సినిమా హెచ్డీ ప్రింట్ను కొంత మంది ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేశారు. దీంతో ఇప్పటికే ఈ సినిమాను చాలా మంది చూశారు. అయినప్పటికీ ఇటీవల ఓ ప్రముఖ ఛానల్లో వచ్చిన ఈ సినిమాను ఎవరూ ఊహించన విధంగా బ్రహ్మరథం పట్టారు. దీంతో చిత్ర యూనిట్తో పాటు మహేశ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గడిచిన పదిహేనేళ్లలో ఏ తెలుగు చిత్రానికి ఈ విధంగా టీవీఆర్ రాలేదని దర్శకనిర్మాతలు పేర్కొంటున్నారు. కాగా, ‘సరిలేరు.. మీకెవ్వరు’చిత్రంతోనే లేడీ సూపర్స్టార్ విజయశాంతి దాదాపు పన్నెండేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేశ్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించాడు. చదవండి: ‘ప్రేక్షకులూ.. సరిలేరు మీకెవ్వరూ..’ ఆసక్తికర విషయం చెప్పిన నమ్రత var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘ప్రేక్షకులూ.. సరిలేరు మీకెవ్వరూ..’
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన జంటగా వచ్చిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్వకత్వం వహించిన ఈ చిత్రం విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 11న రిలీజై అయిన ఈ చిత్రం మహేశ్ బాబు గత సినిమా రికార్డులన్నింటిని తిరగరాసింది. లేడీ అమితాబ్ విజయశాంతి 13 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఈ సినిమాతోనే రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం హిట్ టాక్తో దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ ఫ్యాన్స్కు చిన్న సర్ప్రైజ్ ఇచ్చింది. ‘సరిలేరు నీకెవ్వరు’ స్పెసల్ ప్రోమోతో పాటు మైండ్ బ్లాక్ వీడియో సాంగ్ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక ‘సరిలేరు నీకెవ్వరు’చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి 50రోజులు అయిన సందర్భంగా హీరో మహేశ్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడిలు ట్విటర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ‘ఇంతటి పెద్ద విజయాన్ని అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత అనిల్ సుంకరలకు బిగ్ హగ్. అదే విధంగా చిత్రయూనిట్కు స్పెషల్ థ్యాంక్స్. అభిమానుల సపోర్ట్, ప్రేమ వర్ణించలేనిది’ అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. మరో మర్చిపోలేని సంక్రాంతి అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు. అంతేకాకుండా చిత్రంలోని ఫవర్ ఫుల్ డైలాగ్లతో పాట సరిలేరు ప్రయాణానికి సంబంధించిన పలు ఆసక్తిర విషయాలను పేర్కొన్నాడు. హీరో మహేశ్తో పాటు ఇతర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, అభిమానులకు అనిల్ రావిపూడి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. 50 Days of #SarileruNeekevvaru. A BIGGG hug to my director @AnilRavipudi & my producer @AnilSunkara1 for giving me this BLOCKBUSTER🤗 Thanks to my entire team, without whom this wouldn't have been possible! @vijayashanthi_m @iamRashmika @RathnaveluDop @prakashraaj @ThisIsDSP pic.twitter.com/2r1csytrMc — Mahesh Babu (@urstrulyMahesh) February 29, 2020 🙏🙏🙏 pic.twitter.com/iNbNtwqqxo — Anil Ravipudi (@AnilRavipudi) February 29, 2020 చదవండి: మణిశర్మ, తమన్.. ఇప్పుడు అనిరుద్? ఆవిడంటే నాకు చాలా ఇష్టం: నమ్రత సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ -
మహేష్, రష్మిక ఫుల్ వీడియో ‘మైండ్ బ్లాక్’!
‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని 'మైండ్ బ్లాక్' సాంగ్ ఫుల్ వీడియోను చిత్ర యూనిట్ శనివారం విడుదల చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందాన హీరోయిన్గా నటించింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా.. మైండ్ బ్లాక్ పాట మాస్ బీట్తో ప్రేక్షకుల్ని హుషారెత్తించింది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా హిట్ టాక్ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. దీంతోపాటు సినిమా విడుదలై 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను సైతం చిత్ర యూనిట్ ప్రేక్షకులకు అందించింది. మహేష్ బాబు గురించి ప్రకాశ్ రాజ్కు అజయ్ చెబుతున్న వీడియో అది. ‘కర్నూలు కొండారెడ్డి బురుజుకాడ అల్లూరి సీతారామరాజును చూసినా అన్నా. చుట్టూ 50 మంది. చేతిలో కత్తిలే.. గొడ్డలిలే.. ఎట్టా నిలబడినాడో.. అచ్చం ఈయన లెక్నే రొమ్మిరిసి.. (అల్లూరి సీతారామరాజు గెటప్లో ఉన్న కృష్ణను చూపిస్తూ) అని అజయ్ చెప్పిన నేపథ్యాన్ని పవర్ఫుల్గా చూపించారు. ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ విజయం తనకు మరో సంక్రాంతిని అందించిందని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. అద్భుతమైన విజయం ప్రసాదించింన ప్రేక్షక దేవుళ్లూ.. సరిలేరూ మీకెవ్వరూ! అని ఆయన ట్వీట్ చేశారు. మహేష్తో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఇదిలాఉండగా.. సూపర్స్టార్ మహేష్ అభిమానులు ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా.. మహేష్ పోస్టర్లను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. #SarileruNeekevvaru, #50DaysOfBBSLN అనే హ్యాష్ట్యాగ్లు ట్విటర్లో ట్రెండింగ్లో ఉన్నాయి. -
సరిలేరు నీకెవ్వరు ఫేమ్ పల్లవి లేటెస్ట్ ఫొటోస్
-
అది నా తప్పు కాదు, క్యారెక్టర్ అలాంటిది
ఇండస్స్త్రీలో రాణించడమంటే మాటలు కాదు.. అదృష్టం, ప్రతిభ.. ఈ రెండూ ఉంటేనే నిలదొక్కుకోగలరు. వీటిని సమానంగా బ్యాలెన్స్ చేస్తున్న రష్మిక మందన్నాకు ప్రస్తుతం మంచి రోజులు నడుస్తున్నాయి. ఆమె ఎంపిక చేసుకున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉన్నా హీరోయిన్కు మాత్రం అవకాశాలు గుమ్మం దగ్గరికి వస్తున్నాయి. సినిమా హిట్టు ఫట్టుతో సంబంధం లేకుండా ఆమె పాత్రకు ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటోంది. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఈ క్యూట్ హీరోయిన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సూపర్ స్టార్ మహేశ్బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’లో ‘హీ సో స్వీట్.. హీ సో క్యూట్’ అంటూ లవ్లీ ఎక్స్ప్రెషన్స్తో ఆడిపాడిన రష్మికను చూసి అభిమానులు మంత్రముగ్ధులైపోయారు. కానీ ఈ చిత్రంలో ఆమె కాస్త అతి చేసిందన్న విమర్శలూ లేకపోలేదు. ప్రతీదానికి అతిగా ఎగ్జైట్ అవుతూ ఓవర్ యాక్షన్ చేసిందని కొందరు నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. కాగా ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై వచ్చిన విమర్శలపై స్పందించింది. తాను అతిగా ప్రవర్తించానంటున్నారు.. కానీ తనకిచ్చిన పాత్రే అలాంటిదని సంజాయిషీ ఇచ్చుకుంది.(సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ) పాత్రకు పూర్తి న్యాయం చేయడం తన బాధ్యతగా అభివర్ణించింది. ‘ సినిమాలో నా పాత్ర ఎలా డిజైన్ చేశారో దానికి తగ్గట్టుగానే నేను ప్రవర్తించాను. నిజానికి ఆ పాత్ర కోసం చాలా శ్రమించాను. ఇక విమర్శలంటారా.. దాన్ని నేను మనసారా ఆస్వాదిస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడీ స్థాయిలో ఉన్నానంటే అవే కారణమని నమ్ముతున్నాను. నన్ను నేను మెరుగుపర్చుకోడానికి అవి ఎంతగానో దోహదం చేస్తాయని’ తెలిపింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ భామ నితిన్ సరసన నటించిన ‘భీష్మ’ చిత్రం విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అదేంటో కానీ.. నాకు వచ్చే పాత్రలన్నీ నా నిజజీవితానికి దగ్గరగా ఉంటున్నాయని పేర్కొంది. భీష్మలో తన పాత్ర ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంని భరోసాగా చెప్తోంది. (నిశ్చితార్థానికి ముందే నితిన్ లవ్స్టోరీ తెలుసు) -
తమన్నా స్టెప్పులేసిన సితార
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు, నమ్రతల గారాల పట్టీ సితార పాప మల్టీ ట్యాలెంటెడ్ అన్న విషయం తెలిసిందే. ఈ పసి ప్రాయంలోనే అటు యూట్యూబ్లో వీడియోలు, ఇంటర్వ్యూలు చేస్తూనే.. మరోవైపు నాట్యం నేర్చుకుంటుంది. క్లాసికల్ డ్యాన్స్తో పాటు తన తండ్రి సినిమా పాటలకు ఔరా అనిపించేలా స్టెప్పులు వేస్తుంటుంది. తాజాగా మహేశ్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సూపర్ డూపర్ హిట్ చిత్రంలోని ‘డాంగ్ డాంగ్’ సాంగ్కు స్టెప్పులేసింది. ఆ పాటలో తమన్నా వేసిన స్టెప్పులను అచ్చుగుద్దినట్టు సితార వేసింది. డాంగ్ డాంగ్ సాంగ్కు సితార చేసిన డ్యాన్స్ను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. అంతేకాకుండా సితార ప్రతిభను నెటిజన్లు కొనియాడుతున్నారు. కాగా మహేశ్ బాబు ముద్దుల తనయ సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కుమర్తె ఆద్య కలిసి ‘ఏ అండ్ ఎస్’ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న సంగతి తెలిసిందే. విభిన్న పోస్టులతో ఫాలోవర్స్ను పెంచుకుంటున్న ఈ చిచ్చర పిడుగులు.. ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమా హీరో మహేశ్ బాబు, హీరోయిన్ రష్మిక మందనలను ఇంటర్వ్యూ చేశారు. ఇక ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్ను మహేశ్ తన కుటుంబంతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదే టూర్లో మహేశ్ తన మోకాలి శస్త్ర చికిత్స చేయించుకోనున్నాడు. విశ్రాంతి అనంతరం స్వదేశానికి తిరిగొచ్చి వంశీ పైడిపల్లి చేయబోయే సినిమాను పట్టాలెక్కించనున్నాడు. View this post on Instagram absolutely nailed it💃💃👏👏 #SarileruNeekevvaru A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on Feb 13, 2020 at 5:33am PST -
‘ఆ సమయం వస్తుందో లేదో తెలియదు’
దాదాపు 13 ఏళ్ల తర్వాత వెండితెరపై కనిపించారు లేడీ సూపర్స్టార్ విజయశాంతి. రాజకీయాల్లో బీజిగా ఉన్న విజయశాంతి.. ఇటీవల మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ప్రొఫెసర్ భారతి పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ఈ చిత్రం తర్వాత విజయశాంతి మరిన్ని చిత్రాల్లో నటిస్తారా? లేక రాజకీయాలపైనే ఫోకస్ చేస్తారా? అనే చర్చ మొదలైంది. దీంతో తన భవిష్యతు కార్యచరణపై విజయశాంతి స్పందించారు. ఈ మేరకు ట్విటర్లో ఆమె ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, అనిల్ రావిపూడిలతోపాటు తనను ఆదరిస్తున్న అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మళ్లీ సినిమాల్లో నటించే సమయం వస్తుందో, లేదో తెలియదని.. ఇప్పటికి ఇక సెలవని విజయశాంతి పేర్కొన్నారు. ప్రజా జీవన పోరాటంలోనే తన ప్రయాణమని వెల్లడించారు. ‘సరిలేరు మీకెవ్వరు.. ఇంత గొప్ప విజయాన్ని నాకు అందించిన, నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా నట ప్రస్థానానికి కుళ్లుకుల్ ఇరమ్, కిలాడి కృష్ణుడు నుంచి నేటి సరిలేరు నీకెవ్వరు వరకు ఆ గౌరవాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం.. మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కల్పిస్తోందో, లేదో నాకు కూడా తెలియదు.. ఇప్పటికి సెలవు’ అని విజయశాంతి ట్వీట్ చేశారు. కాగా, సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని పాత్ర నచ్చడంతోనే తాను నటించేందుకు అంగీకరించానని విజయశాంతి పలు సందర్భాల్లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
మహేశ్బాబు చిత్రంలో విజయ్ దేవరకొండ?
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబు ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ గ్రాండ్ సక్సెస్ను విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. దీనిలో భాగంగా కుటుంబసమేతంగా విదేశాల్లో విహరిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నాడు మహేశ్. ఇక తన 27వ చిత్ర దర్శకత్వ బాధ్యతలను వంశీ పైడిపల్లికి అప్పగించిన విషయం తెలిసిందే. మహర్షితో సూపర్ డూపర్ హిట్ అందించిన వంశీపై నమ్మకంతో మరో సినిమాకు మహేశ్ సైన్ చేశాడు. ‘సరిలేరు’ సక్సెస్ మీట్లో ‘మహర్షి, సరిలేరు’ చిత్రాల కంటే గొప్ప చిత్రాన్ని అభిమానులకు అందిస్తానని వంశీ మాటిచ్చాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త టాలీవుడ్లో హల్చల్ చేస్తోంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే విజయ్ దేవరకొండ- మహేశ్ బాబు ఒకే స్క్రీన్పై కనిపించే అవకాశం ఉంది. మహేశ్-వంశీ కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రంలో టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్నట్టు సమాచారం. విజయ్ కోసం వంశీ స్పెషల్ క్యారెక్టర్ రూపొందిచనట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో విజయ్ది కీలక పాత్రన లేక అతిథి పాత్రనా అనేది తెలియాల్సి ఉంది. ఇక మహేశ్తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా విజయ్ కూడా ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించనట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇది నిజం కావాలిన అటు టాలీవుడ్ ఇటు అభిమానులు కోరుకుంటున్నారు. వీరిద్దరు ఒకే తెరపై కనిపిస్తే రచ్చరచ్చే అని అంటున్నారు. కాగా, మహేశ్ విదేశాల నుంచి తిరిగొచ్చాక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: శేఖర్ మాస్టర్కు మహేశ్ బాబు బంపర్ ఆఫర్.. సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ -
‘సరిలేరు నీకెవ్వరు’ గురించి కృష్ణ..
తన కుమారుడు మహేష్బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా గురించి సూపర్ కృష్ణ స్పందించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దర్శక, నిర్మాతలు ‘ బ్లాక్ బస్టర్ కా బాప్’ అని హెడ్డింగ్ పెట్టి ప్రచారం చేయడం బాగుందన్నారు. ఈ సినిమా ఇంకా మరికొన్ని రోజులు ఆడుతుందని, మరిన్ని వసూళ్లు సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చాలా బాగుందని, నిర్మాతలు రాజీలేకుంగా నిర్మించారని మెచ్చుకున్నారు. ఎక్కడా బోరు కొట్టకుండా సినిమాను దర్శకుడు అనిల్ రవిపూడి తెరకెక్కించారని కృష్ణ ప్రశంసించారు. తన తండ్రి మాటలపై మహేష్బాబు స్పందిస్తూ.. ‘థ్యాంక్యూ మై సూపర్స్టార్.. సరిలేరు నీకెవ్వరు’ అంటూ ట్వీట్ చేశారు. తమ సినిమాను సూపర్ స్టార్ మెచ్చుకోవడం పట్ల నిర్మాత అనిల్ సుంకర సంతోషం వ్యక్తం చేశారు. మూడు తరాలు కలిసి నటించే సినిమా కోసం ఎదురు చూస్తున్నామని ఆయన ట్వీట్ చేశారు. జనవరి 11న విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద నిలబడి మంచి వసూళ్లు రాబట్టింది. (చదవండి: సరిలేరు నీకెవ్వరు మూవీ రివ్యూ) Superstar Krishna Garu About#SarileruNeekevvaru #BlockBusterKaBAAP @urstrulyMahesh @AnilRavipudi @AnilSunkara1 @vijayashanthi_m @iamRashmika @ThisIsDSP @RathnaveluDop#AllTimeBlockBusterSLN 💥💥 pic.twitter.com/va6S19rZPq — Team Mahesh Babu (@MBofficialTeam) January 31, 2020 -
మహేశ్ బాబు భావోద్వేగ ట్వీట్
71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తన జీవితంలో మరపురానివని సూపర్స్టార్ మహేశ్బాబు అన్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా సరిలేరు నీకెవ్వరూ చిత్ర బృందం హైదరాబాద్లోని భద్రతా బలగాలను కలిసింది. దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ ధైర్య, సాహసాలతో విధులు నిర్వర్తించే మన జవాన్లను కలవడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని సినీనటుడు మహేశ్ బాబు వెల్లడించారు. ఈమేరకు ట్వీట్ చేశారు. (సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ చెప్పనున్న మహేశ్!) 'మనల్ని ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుతున్న భారత హీరోలకు సెల్యూట్ చేస్తూ.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు' తెలుపుతున్నట్టుగా సూపర్స్టార్ పేర్కొన్నారు. లేడీ అమితాబ్ విజయశాంతి, చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి కూడా మహేశ్తో ఉన్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు జవాన్గా నటించిన విషయం తెలిసిందే. (సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ) It was such an honour meeting all the brave soldiers. This was undoubtedly one of my most memorable days! Huge salute to the nation's heroes who continue to protect us everyday🙏🏼#SarileruMeekevvaru🙏🏻🙌#HappyRepublicDay! 🇮🇳 pic.twitter.com/YIqDafYuUg — Mahesh Babu (@urstrulyMahesh) January 26, 2020 -
నా కెరీర్లో ఇలాంటి సంక్రాంతి చూడలేదు
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి 22 ఏళ్లు అవుతోంది. నా కెరీర్లో ఇప్పటివరకు ఇలాంటి సంక్రాంతిని చూడలేదు’’ అని అన్నారు ‘దిల్’ రాజు. మహేశ్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర, మహేశ్బాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలైన సంగతి తెలిసిందే. తమ సినిమాకు మంచి స్పందన, కలెక్షన్స్ వస్తున్నాయని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కేవలం ఐదు నెలల్లో సినిమాను పూర్తి చేసి ‘సరిలేరు మాకెవ్వరు’ అనిపించారు మహేశ్బాబు, అనిల్ రావిపూడి. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని బ్లాక్ బస్టర్కా బాప్ అనే స్థాయిలో రెవెన్యూ క్రియేట్ చేసి డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ నిజమైన సంక్రాంతి అనుకునేలా చేశారు అనిల్. మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్కు, ఏకే ఎంటర్టైన్మెంట్స్కి హాయ్యస్ట్ రెవెన్యూ కలెక్ట్ చేసిన సినిమాగా చేశారు అనిల్. డిస్ట్రిబ్యూటర్స్కు ఎంత లాభాలు కావాలో అంత లాభం వచ్చింది. ఇంకా ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుందన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేం. ఈ సంక్రాంతికి ఇంత మంచి రెవెన్యూ ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘సంక్రాంతి పండగ ముగిసిపోయింది. కానీ పండక్కి విడుదలైన సినిమాలకు సంక్రాంతి ఇంకా నడుస్తూనే ఉంది. మహేశ్గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అంటే మామూలు విషయం కాదు. అనిల్ కష్టానికి తగిన ప్రతిఫలం మా అందరికీ వచ్చింది. మేము ఊహించిన కలెక్షన్స్ కన్నా ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీలోనే బెస్ట్ సంక్రాంతి అంటూ కొందరు డిస్ట్రిబ్యూటర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సంక్రాంతిలో మా సినిమా ఉండటం సంతోషంగా ఉంది’’ అన్నారు అనిల్ సుంకర. ‘‘సంక్రాంతికి బాక్సాఫీస్ దద్దరిల్లిపోయింది. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని మహేష్గారి కెరీర్లోనే పెద్ద హిట్గా నిలిపిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇంకా మూడు వారాల రన్ ఉంది. సినిమాలో కొత్తగా 90సెకన్లు ఉండే ఓ సీన్ను జోడించబోతున్నాం. దాంతో ఇంకొంచెం నవ్వులు బోనస్గా లభిస్తాయి. సినిమాను మళ్లీ చూడాలనుకునేవారికి, కొత్తగా చూడాలనుకునేవారి కోసం ఈ సీన్ను యాడ్ చేస్తున్నాం. ఎప్పుడు యాడ్ చేస్తామనేది త్వరలో చెబుతాం’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. -
అయ్య బాబోయ్ అసలు కలెక్షన్లు ఆగట్లా..
సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో చిత్ర బృందం వరంగల్లో ‘బ్లాక్బస్టర్ కా బాప్’ పేరుతో విజయోత్సవ సభ నిర్వహించింది. అంతేకాకుండా కలెక్షన్లకు సంబంధించిన వివరాలను చిత్ర బృందం ఎప్పటికప్పుడూ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రం వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిందని ప్రకటించింది. అలాగే కలెక్షన్లు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొంది. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన రెండు ప్రోమోలను చిత్రబృందం విడుదల చేసింది. అందులో ఒకదానిలో ప్రకాశ్ రాజ్తో మహేష్ అయ్య బాబోయ్.. ఫ్లో ఆగట్లేదని పలికే సన్నివేశాన్ని చూపించారు. ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ ఏకే ఎంటర్టైన్మెంట్స్.. ‘అయ్య బాబోయ్ అసలు కలెలక్షన్లు ఆగట్లా..’ అని పేర్కొంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్రాజ్, సంగీత కీలక పాత్రల్లో నటించారు. Ayya baboi asalu collections aagatlaa.. 😉 🤩 Never Before Ever After Blockbuster #SarileruNeekevvaru latest promo - https://t.co/vHT2tbBFww#BlockBusterKaBAAP Super ⭐ @urstrulyMahesh @AnilRavipudi @AnilSunkara1 @vijayashanthi_m @iamRashmika @ThisIsDSP — AK Entertainments (@AKentsOfficial) January 19, 2020 -
నేను తీసుకున్న మంచి నిర్ణయం సరిలేరు నీకెవ్వరు చేయటమే
‘‘నా కెరీర్లో నేను తీసుకున్న మంచి నిర్ణయం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేయటమే. 20 ఏళ్ల కెరీర్లో ఇంత అద్భుతమైన స్పందనను నేనెప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. నాన్న అభిమానులు, నా అభిమానుల తరఫున దర్శకుడు అనిల్కి థ్యాంక్స్’’ అన్నారు మహేశ్బాబు. సంక్రాంతి కానుకగా ఈ నెల 11న విడుదలైన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. మహేశ్బాబు, రష్మిక జంటగా ‘దిల్’ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్బాబు కూడా ఓ నిర్మాతగా వ్యవహరించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయశాంతి ప్రత్యేక పాత్రలో నటించారు. ‘బ్లాక్బస్టర్ కా బాప్’ పేరుతో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా 100 కోట్ల షేర్ పోస్టర్ను చిత్రం డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మహేశ్బాబు మాట్లాడుతూ– ‘‘అనిల్ రావిపూడి ఈ సినిమాలో ఎన్నో మంచి డైలాగులు రాశారు. కానీ, ‘రమణా.. లోడెత్తాలిరా’ అనే డైలాగ్ మాత్రం బీభత్సంగా పేలింది. కథ వినగానే దేవిశ్రీ ప్రసాద్ మాస్ సాంగ్ చేయటానికి మంచి అవకాశం ఉందని ముందే చెప్పారు. అలా వచ్చిందే ‘మైండ్ బ్లాంక్’ సాంగ్. ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రంలో విజయశాంతి గారితో నటించాను. ఆ సినిమా పెద్ద హిట్. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్బస్టరో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ సంక్రాంతిని ఎప్పటికీ మరచిపోను. నాలుగైదేళ్లుగా నా అభిమానులు, ప్రేక్షకులు కొత్త మహేశ్ను కోరుకుంటున్నారు. అది ఈ సినిమాతో సాధ్యం చేసిన నిర్మాత అనిల్ సుంకరగారికి థ్యాంక్స్’’ అన్నారు. విజయశాంతి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాని ‘బ్లాక్బస్టర్ కా బాప్గా నిలిపిన ప్రేక్షకులకు నమస్కరిస్తున్నాను. సైనికుల తల్లిదండ్రుల బాధ ఏంటో అనిల్ ఈ చిత్రంలో సందేశాత్మకంగా చూపించారు. మహేశ్బాబుతో పని చేయటం కంఫర్ట్గా ఉంటుంది. ఈ సినిమాలో చేసిన భారతి పాత్ర నా కెరీర్కి ఎంతో ప్రత్యేకం. రాములక్కా.. మళ్లీ సినిమాలు చేయండి అని అడుగుతున్నారు. ఈ రాములక్క సినిమా చేయాలంటే సబ్జెక్ట్ బాగుండాలి, పాత్ర దద్దరిల్లాలి’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘మహర్షి’ సినిమా సక్సెస్ మీట్లో అన్నాను... మహేశ్ సార్ నా సినిమా వల్ల మీ ముఖంలో నవ్వురావాలి, మిమ్మల్ని ఆనందంగా చూడాలి అని. సినిమా విడుదలైన రోజు నుండి నేను ఆయనతోనే ఉంటున్నాను. ఆయన ఎంతో సంతోషంగా ఉంటున్నారు. బాబు బ్యాటింగ్ మొదలయ్యింది, ఫస్ట్ వీక్ 100 కోట్లు కలెక్ట్ చేసింది’’ అన్నారు. ‘‘మహేశ్తో ఇలాంటి జోనర్లో సినిమా చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నా. ఎవరూ ఊహించని విధంగా ఆయన నటన ఉంది. అనిల్ రావిపూడికి థ్యాంక్స్’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, యం.ఎల్.ఏ వినయ్ భాస్కర్, వరంగల్ సీపీ రవీందర్తో పాటు నటుడు రాజేంద్రప్రసాద్, నిర్మాతలు ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, దర్శకులు వంశీ పైడిపల్లి, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
నా ఫేవరెట్ కో స్టార్ ఆమే: మహేష్ బాబు
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ సూపర్స్టార్... ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సూపర్హిట్ టాక్తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో మహేష్ చిత్ర బృందంతో కలిసి శుక్రవారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అదే రోజు రాత్రి.. హన్మకొండలో చిత్రం విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే సినిమా విడుదలకు ముందు, తర్వాత తాను పాల్గొన్న మూవీ ప్రమోషన్లలో చిన్నారులు ఆద్య, సితారకు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రత్యేమని మహేశ్ బాబు పేర్కొన్నారు. ‘‘నా చిట్టితల్లులకు ఇంటర్వ్యూ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. నాకు ఇంతకు మించిన సంతోషం ఏం ఉంటుంది! వాళ్ల ఎనర్జీ, స్టైల్ సూపర్. వాళ్లిద్దరికీ నా ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి’’ అని ఇంటర్వ్యూ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. కాగా మహేశ్ బాబు ముద్దుల తనయ సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కుమర్తె ఆద్య కలిసి ‘ఏ అండ్ ఎస్’ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న సంగతి తెలిసిందే. విభిన్న పోస్టులతో ఫాలోవర్స్ను పెంచుకుంటున్న ఈ చిచ్చర పిడుగులు.. ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమా హీరోయిన్ రష్మిక మందన్నను ఇంటర్వ్యూ చేశారు. ఇక తాజాగా మహేశ్ బాబును తమ ఛానెల్కు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి సూపర్స్టార్ అభిమానుల మనసు దోచుకున్నారు. కాగా ఇంటర్వ్యూలో భాగంగా సితార, ఆద్య అడిగిన పలు ప్రశ్నలకు మహేశ్ బాబు సమాధానమిచ్చారు. ఈ ఏడాదిలో జనవరి 11 తనకు ప్రత్యేకమైన రోజని... ఆర్మీ జవానుగా నటించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఇక తన సహనటుల్లో చాలా మంది ఫేవరెట్ యాక్టర్లు ఉన్నారని.. అయితే ప్రస్తుతానికి ఫేవరెట్ కోస్టార్ రష్మిక అని మహేశ్ సరదాగా వ్యాఖ్యానించారు.(‘రష్మికను ఓ ఆటాడుకున్న సితార’) సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ Being interviewed by my lil girls has been the best part of my promotions so far💞💞 Such a pleasure...what more can I ask for! Love their energy & style!!! ❤❤❤ Way to go Aadya and Sitara 🤗🤗 Love & blessings to both!https://t.co/Eb4n3ifmCB — Mahesh Babu (@urstrulyMahesh) January 18, 2020 -
మహేశ్బాబుకు జన నీరాజనం..
సాక్షి, హన్మకొండ: హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన “సరిలేరు నీకెవ్వరు’ విజయోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. సూపర్స్టార్ మహేష్బాబు, హీరోయిన్ రష్మిక, లేడీ అమితాబ్ విజయశాంతి, సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, అనిల్ సుంకర, నటులు రాజేంద్రప్రసాద్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు మూడు గంటల పాటు సాగిన వేడుకల్లో సత్య బృందం నృత్యాలు, సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ సమకూర్చిన పాటలతో గాయకులు అభిమానులను ఉర్రూతలూగించారు. అందరికీ ధన్యవాదాలు తనపై అభిమాన వర్ష కురిపించిన ప్రతి ఒక్కరికి హీరో మహేష్బాబు ధన్యవాదాలు తెలిపారు. కేవలం ఐదు సినిమాలకే దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి అన్ని సూపర్ డూపర్ హిట్లను ఇవ్వడం సంతోషకర విషయం అన్నారు. అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ కా బాప్గా సినిమాను ఆదరించిన అభిమాన దేవుళ్లకు రుణపడి ఉంటానని తెలిపారు. భవిష్యత్లో కూడా మంచి సందేశాత్మకమైన చిత్రాలే కాకుండా అభిమానులకు నచ్చే విధంగా తీస్తానని హీరో అన్నారు. మంచిగున్నారా... హీరోయిన్ రష్మిక మాట్లాడుతూ ‘హలో వరంగల్.. మంచిగున్నారా’ అంటూనే సినిమాలోని అర్థమవుతుందా అనే డైలాగ్ను చెప్పడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సభకు వేలాదిగా అభిమానులు హాజరుకాగా జేఎన్ఎస్ కిక్కిరిసిపోయింది. సినీ పరిశ్రమను వరంగల్ కు గుంజుకురండి రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ ‘సినిమాలు అనగానే విజయవాడ, వైజాగ్కు వెళ్తున్నారు.. అలా కాకుండా సిని పరిశ్రమను వరంగల్ అడ్డాగా గుంజుకురావాలి’ అని సినీ ప్రముఖులను ఉద్దేశించి కోరారు. అందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో తన వంతుగా సహకరిస్తానని అన్నారు. కాగా నిర్మాత దిల్ రాజు తన ప్రసంగంలో సినీ పరిశ్రమను వరంగల్కు గుంజుకురావడం కష్టమైనదేనని చెప్పారు. చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, డాక్టర్ టి.రాజయ్య, నగర పోలీసు కమిషనర్ వి.రవీందర్, గ్రేటర్ మేయర్ గుండా ప్రకాశ్రావుతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. కాగా, సభ అనంతరం చిత్ర యూనిట్ సభ్యులు పర్వతగిరిలో మంత్రి దయాకర్రావు స్వగృహానికి వెళ్లారు. చదవండి: నెవ్వర్ బిఫోర్ సంక్రాంతి -
వరంగల్ లో ’సరిలేరు నీకెవ్వరు‘ విజయోత్సవ సభ
-
లాభాల్లోకి ఎంటరైన సరిలేరు..
సాక్షి, హైదరాబాద్ : సంక్రాంతికి విడుదలైన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు బ్లాక్బస్టర్ కా బాప్ రేంజ్లోనే వసూళ్లనూ రాబడుతోంది. ఆరు రోజులకే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ఈవెన్ సాధించడంతో పాటు పలు ప్రాంతాల్లో డిస్ర్టిబ్యూటర్లకు లాభాలను పంచుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు పండుగ సినిమాల నుంచి పోటీని తట్టుకుంటూ కేవలం ఆరురోజుల్లోనే ఏపీ, తెలంగాణల్లో రూ 112.60 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. మహేష్ బాబు సినిమాల్లో తొలివారం అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. అన్ని ఏరియాల్లోనూ ప్రిన్స్ మూవీ నాన్ బాహుబలి 2 రికార్డులను కైవసం చేసుకుని సంక్రాంతి ఛాంపియన్గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో రూ 75.70 కోట్లకు థియేట్రికల్ హక్కులను విక్రయించగా ఆరు రోజుల్లోనే మూవీ రూ 77.94 కోట్ల షేర్ను రాబట్టి బయ్యర్లకు లాభాలను పంచింది. చదవండి : రేణిగుంట ఎయిర్పోర్ట్లో మహేశ్ బృందం.. -
శ్రీవారిని దర్శించుకున్న మహేష్ అండ్ టీమ్..
సాక్షి, తిరుపతి : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్బాబు తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు ఈ సంక్రాంతికి విడుదలై కలెక్షన్ల వర్షం కురుపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం మహేష్ చిత్ర బృందంతో కలిసి శుక్రవారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్నవారిలో మహేష్, నమ్రత, వారి పిల్లలు, విజయశాంతి, దిల్ రాజు, అనిల్ రావిపూడి, రాజేంద్రప్రసాద్, అనిల్ సుంకర, వంశీ పైడిపల్లి, ఆది శేషగిరిరావు ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికీ ఆశీర్వచనాలు అందజేశారు. శ్రీవారి దర్శనం కోసం గురువారం రాత్రే సరిలేరు నీకెవ్వరు చిత్ర బృందం తిరుమల చేరుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ చిత్రం విజయోత్సవ సభ శుక్రవారం సాయంత్రం హన్మకొండలోని జేఎన్ఎస్లో జరగనుంది. ఇందుకోసం శ్రేయాస్ మీడియా భారీ ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుందని నిర్వాహకులు తెలిపారు. -
రేణిగుంట ఎయిర్పోర్ట్లో మహేశ్ బృందం..
సరిలేరు నీకెవ్వరు చిత్రం విజయవంతం కావడంతో చిత్రబృందం మంచి జోష్లో ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు చిత్ర బృందం గురువారం తిరుమల వెళ్లింది. హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానశ్రయం చేరుకున్న చిత్రబృందంతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. అక్కడి నుంచి వారు రోడ్డు మార్గంలో తిరుమల వెళ్లారు. తిరుమల వెళ్లినవారిలో మహేశ్ బాబు, నమ్రత, వారి పిల్లలు, విజయశాంతి, దిల్ రాజు, అనిల్ రావిపూడి, రాజేంద్రప్రసాద్, అనిల్ సుంకర, వంశీ పైడిపల్లి ఉన్నారు. రేపు వేకువజామున సరిలేరు నీకెవ్వరు చిత్రబృందం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. -
మహేశ్ బాబుకు అనిల్ ఫ్యామిలీ మెసేజ్..
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అనిల్కు అవకాశం కల్పించినందుకు ఆయన కుటుంబ సభ్యులు మహేశ్కు కృతజ్ఞతలు తెలిపారు. పండగ ముందుగానే బ్లాక్బస్టర్కా బాప్ ఇచ్చారని అన్నారు. మహేశ్ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మహేశ్ ఈ చిత్రంలో డ్యాన్స్లు ఇరగదీశారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మహేశ్ సతీమణి నమ్రత ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అలాగే అనిల్ కుటుంబానికి నమ్రత కృతజ్ఞతలు తెలిపారు. బిగ్గెస్ట్ బ్లాక్బాస్టర్ ఇచ్చినందుకు అనిల్కు ధన్యవాదాలు చెప్పారు. కాగా, మహేశ్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత లేడి అమితాబ్ విజయశాంతి ఈ చిత్రంతో వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో మహేశ్, విజయశాంతిల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. View this post on Instagram My director @anilravipudi 's family !! Thankyou all for the sweetest message 🙏🙏😍 Anil sir ,Thank you for giving us the biggest blockbuster in #SarileruNeekevaru 😍😍 We at @gmbents and @urstrulymahesh are grateful and humbled by ur love, sincerity and passion🤗🤗 Looking forward to another blockbuster soon enough 🙏🙏🙏🙏 A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on Jan 14, 2020 at 7:58am PST -
మీకోసం.. మహేశ్బాబుని తీసుకొచ్చాం!
‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నారో.. ఆ సినిమా రిలీజ్ అయ్యాక అంతకుమించి బిజీగా ఉన్నారు హీరో మహేశ్బాబు! ‘నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్’ అంటూ.. ఫ్యాన్స్.. స్క్రీన్ మీద సంక్రాంతి చేసుకుంటుంటే.. ‘ఇది నాకు మెమొరబుల్ సంక్రాంతి’ అని మహేశ్ బాబు.. మూవీ హిట్ని టీమ్తో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు! సంక్రాంతికి పంట ఇంటికి వస్తుంది. మేము మీకోసం.. సంక్రాంతిని పండిస్తున్న మహేశ్బాబుని తీసుకొచ్చాం. హ్యాపీ సంక్రాంతి. ►హ్యాపీ సంక్రాంతి మహేశ్బాబు గారు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఎలా అనిపిస్తోంది మీకు? చాలా సంతోషంగా ఉంది. షూటింగ్ సమయంలో ఈ సినిమా హిట్ కొడుతుందని అనుకున్నాను కానీ ఇంత పెద్ద స్థాయిలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని ఊహించలేదు. అభిమానుల్లో చూస్తున్న ఆనందం.. నా సంతోషాన్ని రెట్టింపు చేసింది. ‘ఇలా కదా మహేశ్బాబును చూడాలని మేము అనుకున్నది’ అని ఒక్కొక్కరు అంటుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఈ క్రెడిట్ను అనిల్ రావిపూడికి ఇస్తాను. నా క్యారెక్టర్లో వేరియేషన్స్ ఉండటం, కామెడీ టైమింగ్ ఇవన్నీ బాగా కుదిరాయి. ►మీలాంటి సూపర్స్టార్ హీరోకు యువ దర్శకుడైన అనిల్ రావిపూడితో సినిమా ఎందుకు చేయాలనిపించింది? ‘సరిలేరునీకెవ్వరు’ సినిమాకు ముందు కొంతకాలంగా సిరీయస్ పాత్రలు చేశాను. దీంతో ఇందుకు భిన్నంగా అభిమానులకు నచ్చేలా ఏదైనా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ చేయాలనుకున్నాను. ఆ సమయంలో అనిల్ చెప్పిన ఈ కథ బాగా నచ్చింది. అనిల్ ఇదివరకు దర్శకత్వం వహించిన సినిమాలు చూశాను. నచ్చాయి. ‘ఎఫ్ 2’ ఇంకా బాగా నచ్చింది. అనిల్ కథ నేరేషన్ ఇచ్చిన తర్వాత రెండు నెలల్లో బ్రౌండ్ స్క్రిప్ట్తో వచ్చాడు. ఐదు నెలల్లో షూటింగ్ పూర్తి చేశాం. అనిల్ మంచి డైలాగ్స్ రాశాడు. సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ ప్రేక్షకులకు బాగా కనెకై్టపోయింది. ఆర్మీ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలను కూడా అనిల్ బాగా డిజైన్ చేశాడు. కశ్మీర్ షెడ్యూల్ టీమ్ అందరి ఎఫర్ట్. అక్కడి సైనికులు అందించిన సహకారం మర్చిపోలేం. ►సినిమాలో విజయశాంతిగారి సన్నివేశాలు చాలా ఎమోషనల్గా ఉన్నాయి. సినిమాలోని భారతి పాత్రకు విజయశాంతిగారు తప్ప ఇంకెవ్వరు న్యాయం చేయలేరనిపించింది. ఈ సినిమాను ఒప్పుకుని నటించినందుకు ఆమెకు థ్యాంక్స్. కొన్నేళ్ల క్రితం ‘కొడుకుదిద్దిన కాపురం’ సినిమాలో విజయశాంతిగారితో చేశాను. అప్పుటికి ఇప్పటికీ ఆమె ఏం మారలేదు. ►సినిమా విడుదలైనప్పుడు కలెక్షన్స్ గురించి ఆలోచిస్తారా? కలెక్షన్స్ను పట్టించుకోవాలి. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, నిర్మాతలు సంతోషంగా ఉండాలి. అందుకే నంబర్స్ అనేవి చాలా ముఖ్యమని నేను భావిస్తాను. ►కెరీర్ మొదట్లో ఉన్నప్పటితో పోల్చి చూసినప్పుడు సినిమా కథల ఎంపిక గురించి మీ ఆలోచన ఎలా ఉంది? ముందుగా నేను సినిమా చేయాలంటే స్క్రిప్ట్ నన్ను బాగా ఎగై్జట్ చేయాలి. నిజానికి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఈ ఏడాది తర్వాత చేయాల్సిన సినిమా. కథ బాగా నచ్చడంతో వెంటనే చేశాను. ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను అనిపించింది. ఇలాంటివి ఇంకా తీసుకుంటే నా కెరీర్కు, కానీ నా అభిమానులకు, సినిమా ట్రెండ్కు ఇంకా బాగుంటుందనిపిస్తోంది. ఎప్పుడూ కమిట్మెంట్కు కట్టుబడి ఉంటాను. పండక్కి ఒక సినిమా రావాలి. ఫ్యాన్స్కు ఓ సినిమా చేయాలనే స్వార్థంతో ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేయడం మా అందరికీ మంచిదైంది. చాలా సంతోషంగా ఉంది. ►ఓ కొత్తరకం సినిమాకు ఓకే చెప్పాలన్నప్పుడు మీ స్టార్డమ్ గురించి ఆలోచిస్తారా? తెలుగు సినిమా చాలా పెద్దదైపోయింది. ప్రేక్షకులు, అభిమానులు, ట్రెండ్, మార్కెట్ వంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయాలి. ఒక పెద్ద సినిమా చేయడం అనేది చాలా బాధ్యతతో కూడుకున్న పని. కేవలం కథ నచ్చింది కదా అని ఈ రోజుల్లో సినిమాలు చేయలేం. అన్ని కోణాల్లో ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. ►సోషల్ మీడియాను మీరు ఫాలో అవుతారా? సోషల్ మీడియాను అంతగా ఫాలో కాను. నాకు కష్టపడి పనిచేయడం ఇష్టం. ఇంటికి వెళ్లి పిల్లలతో సరదాగా ఆడుకోవడం ఇష్టం. ►ఈ ఏడాది సంక్రాంతి సెలబ్రేషన్స్ను ఎలా ప్లాన్ చేశారు? ఈ ఏడాది మాకు ఈ నెల 11నే (‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం విడుదలైన రోజు) సంక్రాంతి వేడుకలు మొదలయ్యాయి. ప్రతి రోజూ స్నేహితులతో ఇంట్లో పార్టీలు జరుగుతున్నాయి. అందరం కళకళలాడిపోతున్నాం. ఇది నా మోస్ట్ మెమొరబుల్ సంక్రాంతి. ►దేవుణ్ని నమ్ముతారా? నేను దేవుణ్ని బాగా నమ్ముతాను. ఇటీవలే షిరిడీ, తిరుపతి వెళ్లొచ్చాను. నమ్రతకు కూడా దైవభక్తి ఉంది. ►దర్శకులతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? నేను డైరెక్టర్స్ యాక్టర్ని. వారితో నేను ఎమోషనల్గా కనెక్ట్ కాలేకపోతే సినిమా చేయలేను. నేను ఎవరితో సినిమా చేస్తే ఆ సినిమా దర్శకుడితో నాకు ఓ భావోద్వేగంతో కూడిన ప్రయాణం తప్పక ఉంటుంది. నా దర్శక–నిర్మాతలతో నేను చాలా స్నేహపూర్వకంగా ఉంటాను. ►ఒక నిర్మాతగా మీ బ్యానర్లో ఎలాంటి సినిమాలను ప్రేక్షకులకు అందించాలనుకుంటున్నారు? మంచి కంటెంట్ ఉన్న సినిమాను మా బ్యానర్ లో తప్పకుండ ప్రొడ్యూస్ చేస్తాను. డిఫరెంట్ సినిమాలను నిర్మించాలనుకుంటున్నాను. డిజిటల్ ప్లాట్ఫామ్స్ విస్తృతి పెరుగుతోంది. నెట్ఫ్లిక్స్ వంటివారు పెద్ద పెద్ద హాలీవుడ్ స్టార్స్తో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం హీరోగా నా దృష్టి అంతా వెండితెరపైనే. ►పాన్–ఇండియా సినిమా ఎప్పుడు చేస్తారు? మనం పాన్–ఇండియా సినిమాయే చేయాలి అంటే కుదరదు. మనం చేసే సినిమాకు యూనివర్సిల్ అప్పీల్ ఉండి, అది ఒక పెద్ద సినిమా అయి భాషపరమైన హద్దులు దాటి, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తే అది నా దృష్టిలో పాన్–ఇండియా సినిమా. భవిష్యత్లో రాజమౌళిగారితో సినిమా ఉంది. ►ఇండస్ట్రీలో పెద్ద హీరోల మధ్య పోటీ గురించి ఏమంటారు? ఇండస్ట్రీలో పోటీ ఉండాలి. అప్పుడే ప్రేక్షకుల వద్దకు మంచి మంచి సినిమాలు వెళ్తాయి. కానీ ఆ పోటీ మంచి వాతావరణంలో ఉండాలి. ►మీరు చిన్న సినిమాలను బాగా ప్రొత్సహిస్తున్నారు? బేసిగ్గా నేను సినిమా లవర్నీ. భాషతో సంబంధం లేకుండా ఏ సినిమా విడుదల అయినా చూస్తాను. నచ్చితే ట్వీట్ చేస్తాను. షూటింగ్ లేకపోతే ఐదారు సినిమాలు చూస్తాను. సినిమాలు అంటే నాకు అంత ఇష్టం. యాక్టింగ్ తప్ప నాకు ఇంకేం తెలియదు. నాకు వందేళ్లు వచ్చేంతవరకు సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. ►మీ తర్వాతి చిత్రం గురించి? వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ‘మహర్షి’ చిత్రం కాస్త సందేశాత్మకంగా ఉంది. నెక్ట్స్ మేం ఇద్దరం చేయబోయే సినిమా మంచి కమర్షియల్ ఫార్మాట్లో ఉంటుంది. ►నాన్నగారు(సూపర్స్టార్ కృష్ణ) సినిమా చూసి ఏమన్నారు? ఇప్పటివరకు నీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్నారు. నీ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ అన్నారు. డైరెక్టర్ అనిల్ను ఓసారి కలవాలన్నాను అని చెప్పు అన్నారు. ఈ సమయంలో ఆయన ముఖంలో నవ్వు చూసి చాలా సంతోషపడ్డాను. ►మీ పిల్లల స్పందన మీకు సంతోషాన్ని ఇచ్చిందా? ఎప్పుడు నా సినిమాలను నా ఇంట్లోని హోమ్ థియేటర్లో చూస్తాను. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను కూడా చూశాను. పిల్లలు (కుమారుడు గౌతమ్, కూతురు సితార) బాగా ఎంజాయ్ చేశారు. సాధారణంగా గౌతమ్ సినిమాను రెండోసారి చూడడు. కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను మళ్లీ చూద్దామని నాతో కలిసి రెండోసారి కూడా చూశాడు. చాలా గర్వంగా ఫీలయ్యాను. నిజానికి గౌతమ్, సితారలతో సమయం గడపుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కూతురు సితారతో మహేశ్బాబు ►మీ సక్సెస్ జర్నీలో నమ్రత (మహేశ్బాబు సతీమణి) పాత్ర గురించి ఏమని చెబుతారు? నా సక్సెస్ జర్నీలో నా భార్య నమ్రత పాత్ర చాలా ప్రధానమైనది. ఎవరికైనా ఇల్లు అనేది చాలా ముఖ్యం. ఇల్లు బాగుంటే మనం బాగుంటాం. అది నేను నమ్ముతాను. ఇంత కష్టపడి మనం ఇంటికి వెళితే ఒక ప్రశాంతతో కూడిన వాతావరణం ఇంట్లో ఉండాలి. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ని. నమత్ర అన్నీ విషయాలు బాగా చూసుకుంటుంది. ►‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మీ డ్యాన్స్లు అదిరిపోయాయని ప్రేక్షకులు అంటున్నారు! (నవ్వుతూ) ఈ సినిమాలో డ్యాన్సులు బాగా చేశానని ప్రేక్షకులు అంటున్నారు. ఆ క్రెడిట్ దర్శకుడు అనిల్కు, శేఖర్ మాస్టర్కు, సంగీత దర్శకుడు దేవీలది. షూటింగ్ సగంలో ఉన్నప్పుడే నాకు తెలిసింది. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని. షూటింగ్ సమయంలో అనిల్కు మేసేజ్ చేశాను... ఈ సినిమాలో బాగా డ్యాన్స్ చేస్తానని. కానీ ప్రేక్షకుల నుంచి ఈ రేంజ్లో స్పందన వస్తుందనుకోలేదు. నా కెరీర్లో ‘మైండ్బ్లాక్’ సాంగ్కు మంచి స్పందన వచ్చింది. మిగతా పాటలు కూడా ప్రేక్షకులను మెప్పించాయి. -
శేఖర్ మాస్టర్కు మహేశ్ బాబు బంపర్ ఆఫర్..
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబు హీరోగా క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని దిల్రాజు, అనిల్ సుంకర, మహేశ్ బాబులు నిర్మించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్తో దూసుకపోతోంది. అంతేకాకుండా కలెక్షన్న సునామీ సృష్టిస్తోంది. చిత్రం విడుదలైన ఈ మూడు రోజుల్లోనే దాదాపు వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసినట్లు సమాచారం. ఇంకా పండగ సమయం ఉన్నందున మరిన్ని భారీ వసూళ్లు చేసే అవకాశం ఉంది. దీంతో మూవీ గ్రాండ్ సక్సెస్ను చిత్ర యూనిట్ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇక సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుండటంతో చిత్రయూనిట్ రోజుకొక ప్రొమో, ప్రమోషన్ వీడియోలతో హల్చల్ చేస్తోంది. దీనిలో భాగంగా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలను డైరెక్టర్ అనిల్ రావిపూడి మహేశ్కు చదివి వినిపించాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలన్నింటికి మహేశ్ కూల్గా సమాధానమిచ్చాడు. దీనిలో భాగంగా చిత్ర విశేషాలను, విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నాడో వివరించాడు. తదుపరి చిత్రంలో పోకిరి మహేశ్ అటిట్యూడ్ అండ్ ఇంటెన్స్ కావాలని ఓ అభిమాని కోరగా.. దానికి సమాధానంగా కచ్చితంగా భవిష్యత్లో గొప్ప చిత్రాలను చేద్దామని, పోకిరిని మించి చేద్దామని తెలిపాడు. అంతేకాకుండా ఈ సినిమాలో మైండ్ బ్లాక్ సాంగ్లో శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ బాగా చేశారని, ఇక నుంచి ప్రతీ సినిమాకు అతడినే కొరియోగ్రఫర్గా పెట్టుకోవాలని మరో ఫ్యాన్ సూచించాడు. తప్పకుండా తన చిత్రంలో కనీసం రెండు పాటలకు శేఖర్ మాస్టర్తో కలిసి పనిచేస్తామని మహేశ్ మాటిచ్చాడు. పూర్తి విశేషాల కోసం కింది వీడియోను చూడండి. చదవండి: సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ వందకోట్ల క్లబ్బులో సరిలేరు -
వందకోట్ల క్లబ్బులో సరిలేరు
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజామూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సంక్రాంతి పండుగ వేళ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేలా తెరకెక్కిన ఈ సినిమా తొలి మూడురోజుల్లోనే వందకోట్ల మార్క్ను దాటేసింది. బ్లాక్బస్టర్ కా బాప్గా బాక్సాఫీస్ వద్ద హల్చల్ చేస్తున్న ఈ సినిమా మూడు రోజుల్లో 103 కోట్ల రియల్ గ్రాస్ వసూలు చేసిందని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు మహేశ్బాబుతో కూడిన సరిలేరు నీకెవ్వరు పోస్టర్ను విడుదల చేసింది. ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.46.77 కోట్ల షేర్ సాధించిన విషయం తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ.32.77 కోట్ల షేర్ రాబట్టినట్లు సమాచారం. ఇక, రెండోరోజు శనివారం సుమారు 20 కోట్ల వరకు ఈ సినిమా రాబట్టిందని అంటున్నారు. మొత్తానికి తొలిమూడురోజుల్లోనే ఈ సినిమా వందకోట్లు వసూలు చేసిందని చిత్రయూనిట్ వెల్లడించింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్స్టార్ విజయశాంతి 13ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. భరత్ అనే నేను, మహర్షి వంటి హిట్స్ తర్వాత మహేశ్ నటిస్తున్న సినిమా కావడం.. పటాస్ నుంచి ఎఫ్2 వరకు కమర్షియల్ పంథాలో సినిమాలు తీస్తూ హిట్స్ ఇస్తున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో పెద్దగా కథ లేకపోయినా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే అంశాలపై దర్శకుడు అనిల్ బాగా ఫోకస్ చేశాడని రివ్యూలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పండుగ సీజన్లో బాక్సాఫీస్ వద్ద ‘సరిలేరు నీకెవ్వరు’ భారీగానే వసూళ్లు రాబట్టినట్టు ట్రెడ్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. -
లేడీ అమితాబ్ ‘కిక్’ మాములుగా లేదుగా..
దాదాపు పదమూడేళ్ల తరువాత వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు లేడీ అమితాబ్ విజయశాంతి. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో పవర్ఫుల్ పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ప్రొఫెసర్ భారతిగా అభిమానులను అలరించారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా విజయశాంతి చేసిన ఓ ఫీట్ను దర్శకుడు అనిల్ రావిపూడి ట్విటర్లో షేర్ చేశారు. ఆమె బ్రహ్మాజికి కిక్ ఇస్తున్న.. స్లో మోషన్ వీడియోను ఆయన అభిమానులతో పంచుకున్నారు. దానిని మాస్టర్ కిక్ అని పేర్కొన్నారు. అలాగే అందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై బ్రహ్మాజీ స్పందిస్తూ ‘కిక్ ఎవరికీ’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అనిల్ పోస్ట్పై నెటిజన్లు ‘వావ్ సూపర్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన జనవరి 11న విడుదలైన సరిలేరు నీకెవ్వరు చిత్రం హిట్ టాక్తో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో మహేశ్, విజయశాంతిల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్గా నిలిచాయి. After 13 years..... What a come back @vijayashanthi_m madam.... MASTER KICK 💥💥💥💥💥🤗🤗🤗🤗 భోగి శుభాకాంక్షలు pic.twitter.com/6X9qXLzclR — Anil Ravipudi (@AnilRavipudi) January 14, 2020 చదవండి : సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ రాములమ్మ మళ్లీ ఏడిపించింది అంటున్నారు -
వసూళ్ల వరద
అగ్ర రాజ్యం అమెరికాలో తెలుగు సినిమాలు సందడి చేస్తున్నాయి. సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో సినిమాలు అమెరికా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘దర్బార్’ కూడా అంచనాలకు తగ్గినట్టు వసూళ్లు రాబడుతోంది. ఈ మూడు సినిమాలు కలిసి ఇప్పటికే 31 కోట్ల రూపాయలు వసూలు చేసి సత్తా చాటాయి. దర్బార్ ఐదో రోజుల్లో రూ.10.11 కోట్లు సాధించగా, ‘సరిలేరు నీకెవ్వరు’ మూడు రోజుల్లోనే రూ.11.51 కోట్లు రాబట్టింది. ‘అల.. వైకుంఠపురంలో’ రెండు రోజుల్లేనే రూ.9.92 కోట్లు సాధించి దూసుకెళుతోంది. ఈ దక్షిణాది సినిమాలు కలిపి అమెరికా బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నాయని ప్రముఖ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ఇక అమెరికా వీకెండ్ బాక్సాఫీస్ చార్ట్లో మన దేశానికి చెందిన ఐదు సినిమాలు చోటు దక్కించుకోగా, ‘అల.. వైకుంఠపురంలో’ సినిమా టాప్లో నిలవడం విశేషం. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అల.. వైకుంఠపురంలో’ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 45 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్టు తెలుస్తోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ తొలిరోజు రూ.46.77 కోట్ల షేర్ సాధించినట్టు సమాచారం. ‘అల.. వైకుంఠపురములో’ మూవీ రివ్యూ సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ దర్బార్ : మూవీ రివ్యూ ఛపాక్ : మూవీ రివ్యూ -
రాములమ్మ మళ్లీ ఏడిపించింది అంటున్నారు
‘‘సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం అంటారే.. అలా సరైన సమయంలో సినిమాల నుంచి విరామం తీసుకున్నా.. మళ్లీ సరైన సమయంలో తెరపైకి వచ్చా. ‘సరిలేరు నీకెవ్వరు’ లో నా పాత్రకు మంచి స్పందన వస్తోంది. అనేక మంది ఫో¯Œ చేసి అభినందిస్తున్నారు. మిగతా భాషల పరిశ్రమల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. మహిళలకు బాగా నచ్చింది. మహిళలు ఫో¯Œ చేసి ‘రాములమ్మా.. మళ్లీ ఏడిపించావ్’ అంటున్నారు.. మగవాళ్లూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు’’ అని విజయశాంతి అన్నారు. మహేశ్బాబు, రష్మిక మందన్నా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ‘దిల్’ రాజు సమర్పణలో అనీల్ సుంకర, మహేశ్ బాబు నిర్మించిన ఈ సినిమా శనివారం విడుదలైంది. పదమూడేళ్ల విరామం తర్వాత ఈ చిత్రంలో ప్రొఫెసర్ భారతి పాత్రలో నటించిన విజయశాంతి విలేకరులతో పంచుకున్న విశేషాలు... ► చాలా ఏళ్ల నుంచి అనేక మంది సినిమా చేయమని అడిగారు. రాజకీయాల్లో తీరిక లేకుండా ఉండటం వల్ల నటించాలనే ఆలోచన రాలేదు. ఆ సమయంలో సినిమా, రాజకీయాలంటూ ఇబ్బంది పడలేను. గతంలోనూ అనిల్ రావిపూడిగారు ఓ సినిమా కోసం సంప్రదించినప్పుడు చేయలేను అని చెప్పాను. మహేశ్ బాబు హీరో అని, ‘సరిలేరు నీకెవ్వరు’ కి అడిగినప్పుడు కథ విన్నాను.. నచ్చడంతో చేశా.. ఇప్పుడు ప్రేక్షకులకూ నచ్చింది. సంక్రాంతికి రియల్ బ్లాక్ బస్టర్ మూవీ ఇది. ► గ్యాప్ తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రావడం కొత్తగా అనిపించలేదు.. నటిగా నలభై ఏళ్ల అనుభవం చూశాను. మనతో నటించే ఆర్టిస్టులు మారారు కానీ సినిమా ఎప్పటికీ ఒకటే. నటనలో అదే పట్టు ఉంటుంది. సినిమా పరిశ్రమను మిస్ అవుతున్నాననే భావన కలగలేదు. ఇన్నేళ్లు హీరోయి¯Œ గా పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంటే సులువు కాదు.. చాలా పెద్ద విషయమది. తెలుగమ్మాయిగా, ఏళ్లపాటు ఒక స్థాయిని కాపాడుకుంటూ సినిమాలు చేయడం ఒక చరిత్ర సృష్టించడమే. లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టుగానో, మరో పాత్రలకో వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చేది. దేవుడు ఎక్కడో నాకు మేలు చేశాడు, ప్రేక్షకులు ఆదరించారు. ► భారతి పాత్ర హుందాగా సాగుతుంది.. ఎక్కువగా తక్కువగా చేయకూడదు. ఆరంభం నుంచి చివరిదాకా ఒకేలా కనిపించాలి. తన బాధను బయ టపెట్టకుండా మనసులోనే దాచుకుంటుంది. విల¯Œ తో మాట్లాడేటప్పుడు తక్కువ డైలాగులున్నా సూది పెట్టి గుచ్చుతున్నట్లు ఉంటుంది. ఓవర్గా యాక్ట్ చేయడానికి లేదు. ప్రకాష్ రాజ్తో కళ్లలోకి చూస్తూ ‘ఏంటి భయమేస్తుందా? అడగటం వంటి డైలాగ్లు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి. ► కృష్ణగారి కుటుంబంతో నాకు ఏదో అనుబంధం ఉందనుకుంటా. ఈ బంధాన్ని దేవుడు నిర్ణయించినట్లు అనిపిస్తుంది. మహేశ్తో రీఎంట్రీ సినిమా చేస్తాననుకోలేదు.. ఆశ్చర్యం వేస్తోంది. ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమా చేస్తున్నప్పుడు మహేశ్ చిన్న పిల్లాడు. ఇప్పుడు సూపర్స్టార్ అయ్యాడు కదా! ఎలా ఉంటాడో అనుకున్నా. కానీ, తొలిరోజు నాతో మాట్లాడిన తీరు, చూపించిన అభిమానం చూసి నా భయాలన్నీ పోయాయి. కొన్ని రోజుల తర్వాత సరదాగా మాట్లాడేవాడు. ► ఒక్కొక్క సినిమాకు ఒక్కో తరహా పాత్ర దక్కుతుంటుంది. ‘ప్రతిఘటన’ సినిమాలో నేను నేరుగా ఏదీ చేయను.. చివరలో మాత్రం విల¯Œ ను గొడ్డలితో నరికి చంపేస్తాను. ‘సరిలేరు నీకెవ్వరు’ మహేశ్ సినిమా. హీరోతో పాటు నా పాత్ర కథలో సమాంతరంగా సాగుతుంటాయి. ఓ సన్నివేశంలో భారతి పాత్రకు సెల్యూట్ చేస్తాడు మహేశ్. నటిగా నాకు ఓ స్థాయి ఉండటం వల్లే హీరో సెల్యూట్ చేస్తే ప్రేక్షకులకు నచ్చింది.. వేరే వాళ్లు నటిస్తే వాళ్లు ఒప్పుకోరు. ► అందరూ బాధ్యతగా ఉండాలన్న ఒక మంచి విషయాన్ని ఈ చిత్రంలో దర్శకులు చెప్పారు. అది విన్నప్పుడు నిజమే కదా! అనిపించింది. ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉండాలి, సమాజాన్ని మనమే తీర్చిదిద్దాలి, ఆరోగ్యకరమైన వాతావరణం తీసుకురావాలి. మహిళలకు గౌరవం ఇవ్వాలి, మహిళల పట్ల క్రూరంగా ప్రవర్తించడం మన సంప్రదాయం కాదు కదా? అదే విషయాన్ని అనిల్ రావిపూడి చక్కగా చెప్పారు. ► ఈ సినిమాలో నటించకూడదని తొలుత అనుకున్నా. అనిల్ పట్టుబట్టి నాతో సినిమా చేయించారు.. ఆయనకేదో లెక్క ఉండి ఉంటుంది.. అది సరిగ్గా రీచ్ అయ్యింది. ఇందుకు అనిల్గారికి కృతజ్ఞతలు. దర్శకులకు ఒక ఆలోచన ఉంటుంది.. కొడితే బంతి బౌండరీ దాటుతుంది. అన్ని పాత్రలకు సరిపోయే నటీనటులను ఎంచుకున్నారు. రాజకీయాల్లో ఒత్తిడితో బీపీ వస్తుంటుంది.. సినిమా చేస్తున్నప్పుడు మనశ్శాంతిగా, హాయిగా ఉంది. ► మన దగ్గరున్న పేరున్న దర్శకులకు అనిల్ తక్కువేమీ కాదు. నలభై ఏళ్ల అనుభవంతో చెబుతున్నా.. అనిల్ గొప్ప దర్శకుడు అవుతాడు. ఇంత భారీ సినిమాని చాలా కూల్గా, ఒత్తిడి లేకుండా, గందరగోళం లేకుండా వేగంగా చిత్రీకరించారు. తను తీసిన ‘పటాస్, రాజా ది గ్రేట్, ఎఫ్2 ’ సినిమాలు చూశాను.. మంచి మానవీయత, సెంటిమెంట్ ఉంది. ఆయనకు రాములమ్మ కథ ఇచ్చినా తెరకెక్కించగలరు. నాతో ‘కర్తవ్యం, ప్రతిఘటన’ లాంటి హీరోయి¯Œ ఓరియంటెడ్ సినిమా చేయమని అనిల్ను కోరుతున్నా. ► ఇప్పటిదాకా 60 మంది హీరోలతో కలిసి పనిచేశాను. నాతో కలిపి 61 మంది అనుకోండి. 90వ దశకంలోనే నేను అత్యధిక పారితోషికం తీసుకున్నా. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో హీరో తర్వాత నాదే ఎక్కువ పారితోషికం. నటిగా ఎంతోమందికి స్ఫూర్తినివ్వడం నా అదృష్టం. ‘కర్తవ్యం’ సినిమా చూసి, అనేక మంది మహిళలు పోలీసు వృత్తిలోకి వచ్చారు.. మగవాళ్లు స్ఫూర్తిపొందారు. ‘రౌడీ ఇ¯Œ స్పెక్టర్’ చిత్రంలో ఆటోరాణి, ‘భారతరత్న’ చిత్రంలో సైనిక అధికారిగా నటించాను. ఇవన్నీ ప్రభావవంతమైన పాత్రలు. కొంతమంది మినీ విజయశాంతి అని పేర్లు పెట్టుకున్నారు కూడా. నాకు ఇంత పేరు తీసుకొచ్చిన ప్రజలకు రుణపడి ఉంటా. రాజకీయాల్లో ఉన్నా, సినిమాల్లో ఉన్నా ప్రజలు బాగుండాలని కోరుకుంటా. ► ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రీరిలీజ్ కార్యక్రమంలో చిరంజీవిగారిని కలవడం గొప్ప అనుభూతి. ఆయన రాజకీయాల ప్రస్తావన తీసుకొస్తారని ఊహించలేదు. ఆయన మనసులోని సందేహాలన్నీ ఆ వేదికపై తీరిపోయాయి. రాజకీయాల్లో మా మధ్య కొంత దూరం పెరిగింది.. ఆ రోజు కార్యక్రమంలో అది సమసిపోయింది. ► సాధారణ పాత్రలు వస్తే చేయను. అలాంటి పాత్రలు చేసి ప్రేక్షకుల్లో నాకున్న గౌరవాన్ని తగ్గించుకోలేను. రొటీ¯Œ అత్త పాత్రలు లాంటివి అస్సలు అంగీకరించను. బలమైన, శక్తిమంతమైన పాత్రలు వస్తే ఏడాదికి ఒక్కటైనా చాలు ఒప్పుకుంటా. నేను ఎక్కువగా తినను, వ్యాయామం చేస్తుంటాను. ఈ సినిమా కోసం కొంత జాగ్రత్తలు తీసుకుని బరువు తగ్గాను. మనసు నిర్మలంగా ఉంటుంది కాబట్టి అది మొహంలో కనిపిస్తుంటుంది అంతే. -
నువ్వు తీస్కో నాన్న.. హీరోలా ఉంటావు
సాక్షి, హైదరాబాద్ : జీ సినీ తెలుగు అవార్డుల వేడుక ఇటీవల హైదరాబాద్లో ఘనంగా జరిగింది. 2019 ఏడాదికిగాను ఈ అవార్డులు ప్రదానం చేశారు. నాచురల్ స్టార్ నానికి ‘జెర్సీ’ సినిమాకుగాను ఫేవరెట్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. నాని తండ్రి ఘంటా రాంబాబు కొడుకు తరఫున నటి జీవిత చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. ఈ విషయమై నాని ట్విటర్లో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘నువ్వు తీస్కో నాన్న. నువ్వు అవార్డు తీసుకుంటే హీరోలా ఉంటావు’ అని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ విజయం ‘జెర్సీ’ దర్శకుడు గౌతం తిన్ననూరిదని, జెర్సీకి ఏ విజయం దక్కినా అదే గౌతంకే దక్కుతుందని పేర్కొన్నారు. ఇక, ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో సినిమాల గురించి స్పందిస్తూ.. ‘ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అదరగొట్టారంటే.. బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది గొప్పగా ఉండబోతుందనే భరోసా కలుగుతోంది. రెండు సినిమాల చిత్రబృందాలకు అభినందనలు. రాబోయే చిత్రాలకు ఆల్ది బెస్ట్’ అని పేర్కొన్నారు. Nuvvu theesko Nanna .. nuvvu award theesukuntuntey hero la vuntavu :) This is yours @gowtam19 .. every win for #Jersey is yours 🤗#ZeeCineAwardsTelugu2020 pic.twitter.com/VNaCrRBS9F — Nani (@NameisNani) January 12, 2020 -
సరిలేరు సూపర్హిట్: థాంక్స్ చెప్పిన మహేశ్
సంక్రాంతి కానుకగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్హిట్ టాక్తో దూసుకుపోతుండటంతో.. ఆ సినిమా హీరో మహేశ్బాబు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ‘సరిలేరు నీకెవ్వరు సినిమాకు బ్లాక్బస్టర్ రెస్పాన్స్ ఇచ్చారు. అందుకు ప్రతి ఒక్కరికీ థాంక్స్’ అంటూ ట్వీట్ చేసిన మహేశ్.. అభిమానులతో ట్విటర్లో క్వశ్చన్-అన్వర్ సెషన్ కోసం ఎదురుచూస్తున్నానని, తనను ప్రశ్నలు అడగాలని కోరారు. ఇక, మహేష్ బాబు తాజామూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ వేళ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేలా తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుండటంతో చిత్రయూనిట్ రోజుకొక ప్రొమో, ప్రమోషన్ వీడియోలతో హల్చల్ చేస్తోంది. తాజాగా ‘బ్లాక్బస్టర్కా బాప్’ చిత్రయూనిట్ ప్రొమో వీడియోలను విడుదల చేసింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్స్టార్ విజయశాంతి 13ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. భరత్ అనే నేను, మహర్షి వంటి హిట్స్ తర్వాత మహేశ్ నటిస్తున్న సినిమా కావడం.. పటాస్ నుంచి ఎఫ్2 వరకు కమర్షియల్ పంథాలో సినిమాలు తీస్తూ హిట్స్ ఇస్తున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై భారీ అంచనాల మధ్య విడుదలైంది. Thank you all for the BLOCKBUSTER response🙏🏻 #SarileruNeekevvaru Looking forward to this Q & A session...shoot them :) pic.twitter.com/ImODfE8G4i — Mahesh Babu (@urstrulyMahesh) January 13, 2020 -
తగ్గని జోష్.. ‘సరిలేరు’కు భారీ వసూళ్లు!
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజామూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. సంక్రాంతి పండుగ వేళ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేలా తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఓపెనింగ్స్ భారీ స్థాయిలో ఉండటంతో తర్వలోనే ‘సరిలేరు నీకెవ్వరు’ వందకోట్ల మార్క్ను దాటేసే అవకాశముందని అంటున్నారు. తొలిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.46.77 కోట్ల షేర్ సాధించిన విషయం తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ.32.77 కోట్ల షేర్ రాబట్టినట్లు సమాచారం. ఇక, రెండోరోజు శనివారం సుమారు 20 కోట్ల వరకు ఈ సినిమా రాబట్టిందని అంటున్నారు. మొత్తానికి తొలిమూడురోజుల్లోనే ఈ సినిమా వందకోట్లకు చేరువగా వచ్చిందని అంటున్నారు. అధికారిక లెక్కలు వస్తే.. తొలి మూడురోజుల్లో ఈ సినిమా వందకోట్ల మార్క్ను దాటిందా? లేదా? అన్నది తెలిసే అవకాశముంది. మరోవైపు ఈ సినిమాకు భారీ వసూళ్లు దక్కుతుండటంతో రోజుకొక ప్రొమో, ప్రమోషన్ వీడియలతో ఈ చిత్రయూనిట్ హల్చల్ చేస్తోంది. తాజాగా ‘బ్లాక్బస్టర్కా బాప్’ ప్రొమో వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్స్టార్ విజయశాంతి 13ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. భరత్ అనే నేను, మహర్షి వంటి హిట్స్ తర్వాత మహేశ్ నటిస్తున్న సినిమా కావడం.. పటాస్ నుంచి ఎఫ్2 వరకు కమర్షియల్ పంథాలో సినిమాలు తీస్తూ హిట్స్ ఇస్తున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో పెద్దగా కథ లేకపోయినా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే అంశాలపై దర్శకుడు అనిల్ బాగా ఫోకస్ చేశాడని రివ్యూలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పండుగ సీజన్లో బాక్సాఫీస్ వద్ద ‘సరిలేరు నీకెవ్వరు’ భారీగానే వసూళ్లు రాబట్టినట్టు ట్రెడ్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. -
‘సరిలేరు నీకెవ్వరు’ థాంక్స్ మీట్
-
సరిలేరు నీకెవ్వరు సక్సెస్ మీట్
-
‘సరిలేరు నీకెవ్వరు’ తొలిరోజు కలెక్షన్స్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ రికార్డ్ కలెక్షన్స్తో దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా శనివారం (జనవరి 11న) విడుదలైన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో ఈ సినిమా ఓపెనింగ్స్ రాబట్టినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.32.77 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.46.77 కోట్ల షేర్ సాధించినట్టు చిత్రబృందం ప్రకటించింది. (చదవండి : సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ) నైజాంలో రూ. 8.66 కోట్లు, సీడెడ్లో రూ. 4.15 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.4 కోట్లు, కృష్ణాలో రూ. 3.07 కోట్లు, గుంటూరులో రూ. 5.15 కోట్లు, తూర్పుగోదావరిలో రూ. 3.35 కోట్లు, పశ్చిమగోదావరిలో రూ. 2.72 కోట్లు, నెల్లూరులో రూ. 1.27 కోట్ల షేర్ వసూలైనట్టు సినీ పీఆర్వో బీఏ రాజు తన ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాదు విదేశాల్లో సైతం ఈ సినిమా దద్దరిల్లిపోతుందట. మొత్తంగా చూసుకుంటే తొలిరోజే ‘సరిలేరు నీకెవ్వరు’ రికార్డు స్థాయిలో వసూలు చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో మహేశ్, అనిల్ సుంకరలు నిర్మించారు. విజయశాంతి, ప్రకాష్రాజ్, రాజేంద్రప్రసాద్, సంగీత, కౌముది తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. #SarileruNeekevvaru Day 1 shares RECORD BREAKING OPENINGS 💥 Nizam8.66Crs Ceeded 4.15Crs UA 4.4Crs Krishna 3.07Crs Guntur 5.15Crs East 3.35crs West 2.72crs Nellore 1.27Crs Total AP/TS Share on Day1 32.77 Crs 🤟🏻🥁 👌 🌟 @urstrulyMahesh#BoxOfficeKaBaap 🤙🏽 pic.twitter.com/S6SOzyjFoc — BARaju (@baraju_SuperHit) January 12, 2020 -
సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ
మూవీ: సరిలేరు నీకెవ్వరు జానర్: కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ నటీనటుల: మహేశ్బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్రాజ్, రాజేంద్రప్రసాద్, సంగీత సంగీతం: దేవిశ్రీప్రసాద్ దర్శకత్వం: అనిల్ రావిపూడి నిర్మాతలు: రామబ్రహ్మం సుంకర, దిల్రాజు, మహేశ్బాబు సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియెన్స్ను ఎంటర్టైన్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’. సూపర్ స్టార్ మహేశ్ బాబు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్స్టార్ విజయశాంతి 13ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. భరత్ అనే నేను, మహర్షి వంటి హిట్స్ తర్వాత మహేశ్ నటిస్తున్న సినిమా కావడం.. పటాస్ నుంచి ఎఫ్2 వరకు కమర్షియల్ పంథాలో సినిమాలు తీస్తూ హిట్స్ ఇస్తున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడం.. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడం.. సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్సాఫీస్ బరిలో సరిలేని జోరుతో ఈ బొమ్మ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనిపించుకుందా.. కథ: కర్నూలు వైద్యకళాశాలలో ప్రొఫెసర్గా పనిచేసే భారతి (విజయశాంతి) చాలా నిక్కచ్చి, నిజాయితీగల వ్యక్తి. తప్పును ఎప్పుడూ రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కుమారుడు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనయుడు కూడా ఆర్మీలోనే ఉంటూ ఓ ఆపరేషన్లో గాయపడి.. చావుబతుకుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురికి పెళ్లి నిశ్చయమై.. ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురుచూస్తున్న సమయంలో ఇలాంటి విషాదవార్తను చేరవేయాల్సి రావడంతో.. నైతిక కట్టుబాటుగా మేజర్ అజయ్ (మహేశ్బాబు)ను దగ్గరుండి పెళ్లి చేయించి.. ఈ వార్త చేరవేయాల్సిందిగా ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయి కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలులో స్థానిక మినిష్టర్ నాగేంద్ర (ప్రకాశ్రాజ్) వల్ల భారతి చిక్కుల్లో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతోంది. ఈ క్రమంలో శక్తిమంతుడైన నాగేంద్ర నుంచి భారతిని అజయ్ ఎలా కాపాడారు. ఈ మర్డర్ మిస్టరీని ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అన్నది మిగతా కథ.. నటీనటులు: సూపర్స్టార్ మహేశ్బాబు మరోసారి తన మ్యాజిక్ను తెరపై చూపాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్తో, సెటిల్డ్ యాక్టింగ్తో ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్తో అలరించడమే కాదు యాక్షన్ పార్టులోనూ మహేశ్ దుమ్మురేపాడు. మహేశ్ ఎంట్రీ సీన్, తమన్నాతో ‘డాంగ్ డాంగ్ సాంగ్’లో ఎనర్జిటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్.. ‘మైండ్ బ్లాంక్’ పాటలో మాస్ స్టెప్పులతో ఇలా తనదైన పర్ఫార్మెన్స్తో మహేశ్ అలరించాడు. ఫస్టాప్లో రైలు జర్నీ సీన్లలోనూ పంచ్ డైలాగులు, కామెడీ సీక్వెన్తో నవ్వించాడు. కొండారెడ్డి బురుజు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పార్టు, మహేశ్ హీరోయిజం ఎలివేషన్ షాట్లు ఫ్యాన్స్ ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ఫుల్గా ఉండటం ఫ్యాన్స్కు కిక్కు ఇస్తుంది. అల్లురి సీతారామరాజు సినిమాలోని సీన్ను సందర్భానుసారం వాడుకోవడం, సూపర్స్టార్ కృష్ణను గుర్తుచేయడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే, సెకండాఫ్ వచ్చేసరికి కథ పెద్దగా ఏమీ లేదని తేలిపోవడంతో మహేశ్ పాత్ర కొంచెం స్లో అయిపోతోంది. ఇక, చాలాకాలం తర్వాత తెరపై మీద కనిపించిన విజయశాంతి భారతిగా పవర్ఫుల్ పాత్రలో అలరించారు. ఆమె సహజమైన అభినయం, డైలాగ్ డెలివరీ సినిమాకు ఒకింత నిండుతనం తెచ్చాయి. నిజాయితీగా గల ప్రొఫెసర్గా, ఆర్మీలో కొడుకులను కోల్పోయిన తల్లిగా ఆమె అభినయం ప్రేక్షకుల్లో గౌరవభావాన్ని, కంటతడిని పెట్టిస్తాయి. ఇక, హీరోయిన్గా రష్మిక మందన్నా మహేశ్ సరసన తనదైన ఎనర్జిటిక్ యాక్టింగ్తో అలరించింది. మీకు ఏమైనా అర్థమవుతుందా.. ఐ యామ్ ఇంప్రెస్డ్.. వంటి పంచ్ డైలాగులతో నవ్వించింది. ‘హి ఈజ్ సో’ క్యూట్ పాటలో అందంగా కనిపించిన రష్మిక.. ‘మైండ్ బ్లాక్’ పాటలో.. మాసీలుక్తో గ్లామరస్ డోస్ను పెంచిందని చెప్పాలి. ఇక, మినిస్టర్ నాగేంద్రగా విలన్ పాత్రలో కనిపించిన ప్రకాశ్ తన పాత్ర మేరకు అలరించారు. తనదైన యాక్టింగ్తో ప్రకాశ్ రాజ్ మెప్పించినప్పటికీ.. సినిమా క్లైమాక్స్ వెళ్లేసరికి నాగేంద్ర పాత్ర అనేక మలుపులు తిరుగుతుంది. ఇక, రాజేంద్రప్రసాద్, కౌముది, సంగీత, రావు రమేశ్, హరితేజ తదితర నటులు తమ పరిధి మేరకు మెప్పించారు. విశ్లేషణ: పక్కా కమర్షియల్ సినిమాలు తీస్తూ.. వరుస హిట్స్ అందుకుంటున్న అనిల్ రావిపూడి మరోసారి పూర్తిగా తన ఫార్మెట్లోనే ‘సరిలేరు నీకెవ్వరు’ను తీశాడు. తన సినిమాల్లో ఉండే అన్ని దినుసులు ఈ సినిమాలోనూ జోడించాడు. హీరో-హీరోయిన్లతో కామెడీ చేయించడం, క్యాచీ పదాలు, పంచ్ డైలాగులతో ఇలా తనకు తెలిసిన అన్ని మాస్-మసాలా అంశాలు సినిమాలో ఉండేలా చూసుకున్నాడు. ఈ విషయంలో ఫస్టాప్ వరకు సక్సెస్ అయిన డైరెక్టర్.. సెకండాఫ్ వచ్చేసరికి ఎప్పటిలాగే కథను లైట్గా తీసుకున్నాడనే అభిప్రాయం కలుగుతుంది. సెకండాఫ్లో భారతి ఎందుకు కష్టాల్లో పడిందనే అంశాన్ని అంత గ్రిప్పింగ్గా, స్ట్రాంగ్గా అనిల్ చెప్పలేకపోయాడు. ఈ సినిమాలో జోడించిన మర్డర్ మిస్టరీ ఇన్వేస్టిగేషన్, దాని వెనుక ఉన్న నాగేంద్ర కరప్షన్ ఇలాంటి అంశాలు కొత్తగా ఉండకపోగా.. రోటిన్ అనిపించి బోర్ కొడతాయి. సెకండాప్ మొదట్లోనే ప్రకాశ్ రాజ్ను మహేశ్ ఢీకొనడంతో.. విలన్ పాత్ర వీక్ అవుతోంది. అయితే, కథపై అంతగా శ్రద్ధపెట్టకపోయినా.. ఎప్పటిలాగే కామెడీ, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే అంశాలపై అనిల్ ఫోకస్ చేశాడు. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్కు నివాళులర్పించే సీన్, తల్లి (విజయశాంతి) భావోద్వేగం కంటతడి పెట్టిస్తాయి. డైలాగులు అక్కడక్కడ పేలి.. ప్రేక్షకులతో ఈల వేయించినా.. కొన్ని డైలాగుల రిపిటేషన్ కనిపిస్తుంది. మరికొన్నిసార్లు క్యాచీ వర్డ్స్ను ఫోర్స్డ్గా పెట్టినట్టు అనిపిస్తోంది. ఇక, సీఎం, మంత్రులను బంధించి.. హీరో లెంగ్తీ లెక్చర్ ఇవ్వడం బాగానే ఉన్నా.. మరీ అవుట్ ఆఫ్ లాజిక్ అనిపిస్తోంది. కథ పెద్దగా లేకపోయినా.. ఇలాంటి అంశాలు, భారీ భారీ డైలాగులతో సెంకడాఫ్ను మరీ లెంగ్తీగా చేసిన ఫీలింగ్ కలుగుతోంది. అయితే, మహేశ్ ఫ్యాన్స్ ఎంటర్టైన్ చేసే అంశాలు ఉండటం, యాక్షన్పార్ట్ నీట్గా బాగుండటం, దేవీశ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ కావడంతో ఈ సంక్రాంతి సీజన్లో ఇది సూపర్స్టార్ అభిమానులు అలరించే కమర్షియల్ ఎంటర్టైనర్గా నిలిచే అవకాశముంది. సినిమాటోగ్రఫీ చక్కగా ఉండటంతోపాటు సినిమా నిర్మాణ విలువలు రిచ్ ఉన్నాయి. అయితే, ఎడిటింగ్ విషయంలో మరింత కత్తెరవేసి.. క్రిస్ప్గా ప్రజెంట్ చేస్తే బాగుండేదన్న ఫీలింగ్ రాకపోదు. ప్లస్ పాయింట్స్ మహేశ్బాబు యాక్టింగ్, కామెడీ విజయశాంతి పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫస్టాప్ మైనస్ పాయింట్స్ కథ పెద్దగా లేకపోవడం సెంకడాఫ్ లెంగ్తీగా ఉండటం - శ్రీకాంత్ కాంటేకర్ -
‘సరిలేరు నీకెవ్వరు’: బొమ్మ దద్దరిల్లడం పక్కా!
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబు హీరోగా క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో మహేశ్, అనిల్ సుంకరలు నిర్మించారు. సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ టాక్తో దూసుకపోతోంది. శుక్రవారం అర్దరాత్రి నుంచే ప్రత్యేక షోలు మొదలయ్యాయి. అంతేకాకుండా ఓవర్సీస్లో ప్రీమియర్ షోలు పడిపోయాయి. దీంతో సినిమా చూసిన ప్రేక్షకుల తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రత్యేక, ప్రీమియర్ షోలు చూసిన ప్రతీ ఒక్కరు చెబుతున్న మాట దూకుడు మహేశ్ ఈజ్ బ్యాక్ అని. ఈ మధ్య కాలంలో మహేశ్ వరుసగా సందేశాత్మక చిత్రాలు చేస్తుండటంతో అయన నుంచి మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ను ఫ్యాన్స్ ఆశించారు. అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ తో మహేశ్ అభిమానులు వారికి కావాల్సింది లభించింది. కేవలం మహేశ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఈ సినిమాను మెచ్చుకుంటున్నారు. ప్రధానంగా ఫస్టాఫ్ మొత్తం ఎక్కడ బోర్ కొట్టకుండా సాగిందని, ఇంటర్వెల్ బ్యాంగ్ అదరిపోయిందని అంటున్నారు. ముఖ్యంగా మహేశ్ లుక్స్ మార్వలెస్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ప్రథమార్థంలో వచ్చే కశ్మీర్ అందాలు, మహేశ్ యాక్షన్ సీన్స్, ఆర్మీ నేపథ్యంలో వచ్చే సంఘటనలు ప్రేక్షకులను కట్టిపడేసినటేకల అందరూ చెబుతున్నారు. ఇక సుదీర్ఘంగా సాగిన ట్రైన్ ఎపిసోడ్ పిచ్చెక్కించిందని కామెంట్ చేస్తున్నారు. హీరోయిన్ రష్మిక మందన అండ్ గ్యాంగ్తో పాటు బండ్ల గణేశ్ ట్రైన్ ఎపిసోడ్లో చేసే కామెడీ సూపరో సూపర్ అంటున్నారు. ‘ఒక్క మూడు నెలలు అర్మీలో పని చేస్తే నేను అనే ఫీలింగ్ పోయి నేషన్ అనే ఫీలింగ్ మొదలవుతుంది’, ‘దేశం విలువ మీరు పడిపోయే రూపాయిలో చూస్తారు.. నేను ఎగిరే జెండాలో చూస్తాను’ అని రచయిత అందించిన మాటలు రోమాలు నిక్క బొడిచేలా ఉన్నాయని అంటున్నారు. ఇక ఫస్టాఫ్ సరద సరదాగా సాగిపోగా.. సెకండాఫ్లో అసలు యాక్షన్ పార్ట్ మొదలవుతుందని చెబుతున్నారు. సెకండాఫ్లో ప్రకాష్ రాజ్, విజయశాంతి, మహేశ్ బాబుల మధ్య వచ్చే సీన్స్ సినిమాను ఎక్కడికో తీసుకపోతుందని పేర్కొంటున్నారు. ఇక యాక్షన్ సీన్స్ను ఫైట్ మాస్టర్ రామ్-లక్ష్మణ్లు కొత్తగా కంపోజ్ చేశారని, మైండ్ బ్లాక్ సాంగ్ కైతే ఆడియన్స్ సీట్లలో ఎవరూ కూర్చోలేదని ఎగిరి గంతేశారని, అదేవిధంగా ఈ పాటలో మహేశ్ వేసిన మాస్ స్టెప్స్ అదరహో అన్నట్టు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఓవరాల్గా ఇప్పటివరకు పబ్లిక్ టాక్, ట్విటర్ రివ్యూల ప్రకారం పండగకు ‘సరిలేరు నీకెవ్వరు’ బొమ్మ దద్దరిల్లడం పక్కా అని తెలుస్తోంది. -
ట్రెండింగ్లోకి రాగానే వాళ్లే సారీ చెబుతారు
‘‘మనం చేస్తున్న ప్రతి పనికీ అవార్డు వస్తుందన్న గ్యారంటీ లేదు. అలా అని వస్తేనే గొప్ప అనడం లేదు. అవార్డుల విషయంలో నా దృష్టిలో రెండు కోణాలు ఉన్నాయి. మన పని బయటకు వచ్చి ప్రేక్షకులందరికీ నచ్చినప్పుడు దాన్ని మించిన అవార్డు లేదు. అలాగే మన పనిని ఒకరు గుర్తించి పిలిచి అవార్డు ఇస్తున్నప్పడు దాన్నొక గొప్ప గౌరవంగా నేను భావిస్తాను. ఈ గౌరవం నా బాధ్యతను పెంచుతుంది’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. మహేశ్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మందన్నా కథానాయిక. ‘దిల్’ రాజు సమర్పణలో అనిల్ సుంకర, మహేశ్బాబు నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ చెప్పిన విశేషాలు.. ► మహేశ్బాబుగారితో నేను ఐదు (1: నేనొక్కడినే (2014), శ్రీమంతుడు (2015), భరత్ అనే నేను (2018), మహర్షి (2019), సరిలేరు నీకెవ్వరు (2020)) సినిమాలు చేశాను. చాలా సంతోషంగా ఉంది. నేనే కాదు...మహేశ్గారితో పని చేసిన ఎవరైనా ఆయనతో మళ్లీ మళ్లీ చేయాలనుకుంటారు. మహేశ్గారితో సినిమాలు చేసిన దర్శకులందరితో నేను పని చేయడం వల్ల ఈ విషయం నాకు తెలిసింది. ఆయన డైరెక్టర్స్ యాక్టర్. ఒక్కసారి కథ విని, ఆయన ఓకే అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా అండగా ఉంటారు. అంతపెద్ద స్టార్ మనపై నమ్మకం ఉంచినప్పుడు మనకు తెలియకుండానే మన పనిపై మనకు గౌరవం పెరుగుతుంది. మహేశ్ గారిది చిన్నపిల్లల మనస్తత్వం. ఏదైనా పాట లేదా సన్నివేశం నచ్చినప్పడు చాలా ఎగై్జటింగ్గా ఉంటారు. ఆ ఎగై్జట్మెంట్ వచ్చినప్పుడు ఆయన్ను పట్టుకో వడం కష్టం. ఆ లక్షణం చిరంజీవిగారిలోనూ చూశాను. ► ఇదివరకు మహేశ్గారికి నేను సంగీతం అందించిన సినిమాల్లో ఎక్కువగా ఆయన సందేశంతో కూడుకున్న బాధ్యతాయుతమైన పాత్రలు చేశారు. కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో వాణిజ్య అంశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో మంచి మాస్ సాంగ్స్ ఇస్తానని ఈ సినిమా ప్రారంభోత్సవం రోజున మహేశ్ అభిమానులకు ప్రామిస్ చేశాను. అన్నట్లుగానే మంచి పాటలు కుదిరాయి. ఈ సినిమాకే కాదు..దాదాపు నేను చేసిన అన్ని సినిమాలకు మొదటి సిట్టింగ్స్లోనే ట్యూన్స్ ఫైనలైజ్ అయ్యాయి. ఈ విషయంలో నేను కాస్త లక్కీ. ► అనిల్ రావిపూడిగారి ‘ఎఫ్ 2’ సినిమాకు నేను సంగీతం అందించాను. చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. భవిష్యత్లో మంచి స్థాయికి వెళతాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ కథను మొదట నాకు అనిల్ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. కథ విన్నప్పుడే ఈ సినిమా పాటల గురించి ఆలోచించుకున్నాను. ఎందుకంటే కథ ప్రకారం నేను పాటలు ఇవ్వడానికి ఇష్టపడతాను. అలాగే ఇస్తూ వస్తున్నాను. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కూడా సందర్భానుసారంగానే పాటలు వస్తాయి. ఈ సినిమాలోని సైనికుల యాంథమ్ సాంగ్కు నేను లిరిక్స్ రాశాను. సైనికులంటే నాకు విపరీతమైన అభిమానం. వారికి నివాళిగా ఉండాలని ఈ సాంగ్ చేశాం. మహేశ్గారు కూడా మెచ్చుకున్నారు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ‘సూర్యుడివో..చంద్రుడివో’, ‘డాంగ్ డాంగ్’ పాటలకు కూడా మంచి స్పందన లభించింది. అందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్. ఇక ‘మైండ్బ్లాక్’ సాంగ్లో మహేశ్గారి డ్యాన్స్ సూపర్బ్. ఆయన డ్యాన్స్ చూసి మేమందరం షాకయ్యాం. మహేశ్గారి కామెడీ టైమింగ్ బాగుంటుంది. అప్పుడప్పుడు ఆయన సరదాగా వెటకారంగా మాట్లాడుతుంటారు. ‘మైండ్ బ్లాక్’ సాంగ్లో అలా మహేశ్ వాయిస్ పెట్టాం. ► విజయశాంతిగారితో మా నాన్నగారు (రచయిత సత్యమూర్తి) పనిచేశారు. ఇప్పుడు నేను ఆమెతో ఈ సినిమాకు పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో మహేశ్, విజయశాంతిగార్ల మధ్య సన్నివేశాలు భలేగా ఉంటాయి. అలాగే మహేశ్, ప్రకాష్రాజ్గార్ల సన్నివేశాలు కూడా ప్రేక్షకులను అలరిస్తాయి. ► నా పాటలు బాగున్నాయో లేదో నా టీమ్ని నిర్మొహమాటంగా చెప్పమంటాను. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటోంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే నా పాటలపై నిజాయతీగా చెప్పేవారి అభిప్రాయాలను గౌరవిస్తాను. ఏవైనా పొరపాట్లు ఉంటే మళ్లీ జరగకుండా జాగ్రత్తపడతా. ఈ సందర్భంగా ఓ విషయం చెబుతాను.‘బాహుబలి’ సినిమా నా అంచనాల తగ్గట్లు లేదు’ అని నాతో ఎవరో అన్నారు. ఆ తర్వాత ‘బాహుబలి’ ఎక్కడికి వెళ్లింది? అంటే కొందరు భారీ అంచనాలు పెట్టుకుంటారు. మొదట్లో కాస్త నిరుత్సాహపడతారు. కాస్త ట్రెండింగ్లోకి రాగానే ఆ తర్వాత వాళ్లే సారీ చెబుతారు. ► సంగీతంపై నాకున్న ప్రేమవల్ల హీరోగా చేయలేకపోతున్నానేమో. తమిళ, తెలుగు భాషల్లో ఓ ద్విభాషా చిత్రం చేద్దామనుకుంటున్నా. ∙‘ఆర్య, ఆర్య 2’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్, నా కాంబినేషన్లో మరో సినిమా వస్తుంది. ఈ చిత్రానికి 3 పాటలు కంపోజ్ చేశా. ‘గుడ్లుక్ సఖి’, ‘రంగ్ దే’, ‘ఉప్పెన’ చిత్రాలకు మ్యూజిక్ అందించబోతున్నాను. ఓ హిందీ సినిమా చేయబోతున్నా. -
‘రష్మికను ఓ ఆటాడుకున్న సితార’
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కుమర్తె ఆద్య వీరిద్దరూ కలిసి ‘ఏ అండ్ ఎస్’ అనే యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. తొలుత త్రీ మార్కర్ ఛాలెంజ్ అంటూ తొలి వీడియో పోస్ట్ చేసిన వీర్దిదరూ.. అనంతరం పలు ఆసక్తికర వీడియోలను పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ను పెంచుకున్నారు. అంతేకాకుండా డిఫరెంట్ కంటెంట్ వీడియోలతో పాటు ఆద్యంతం వినోదభరితంగా, విజ్ఞానభరితంగా సాగే వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా సితార, ఆద్యలు ఇద్దరూ కలిసి క్యూట్ హీరోయిన్ రష్మిక మందనను ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక మహేశ్ సైతం ఈ వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేస్తూ ఈ ముగ్గురి ఎనర్జీ, ఉత్సాహం తనను ఆశ్చర్యపరిచిందని ట్వీట్లో పేర్కొన్నాడు. మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, దిల్ రాజు, మహేశ్ బాబులు ముగ్గురు కలిసి నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా రేపు(శనివారం) విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్లు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి. దీంతో సినిమా హిట్టు సాధించడం ఖాయమని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. విజయశాంతి, ప్రకాష్రాజ్, రాజేంద్రప్రసాద్, సంగీత, కౌముది తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. Next gen kids !! Their bubbling energy n enthusiasm never ceases to amaze me 😍😍!! @iamRashmika you are equally amazing 👏👏 Loved the banter !! Rock on, you girls! 👍👍👍 https://t.co/vHNIc232Kt — Mahesh Babu (@urstrulyMahesh) January 10, 2020 -
విచిత్రమైన జోన్లో ఉన్నాం
‘‘అనిల్ రావిపూడి ‘ఎఫ్ 2’ సినిమా చేస్తున్నప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ కథని నాకు 40 నిమిషాలు చెప్పాడు.. ఎగ్జైటింగ్గా అనిపించింది. అయితే ‘మహర్షి’ తర్వాత వేరే సినిమా కమిట్మెంట్ ఉంది.. దాని తర్వాత చేద్దామన్నాను.. తను కూడా ‘ఎఫ్ 2’ తర్వాత వేరే సినిమా చేస్తాను.. ఆ తర్వాత ఇద్దరం చేద్దాం సార్ అన్నాడు. కానీ, ‘ఎఫ్ 2’ సినిమా చూశాక ‘సరిలేరు నీకెవ్వరు’ ఈ సమయంలో నేను చేయడం కరెక్ట్ అనిపించింది. అనిల్కి చెప్పగానే చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు’’ అని మహేశ్బాబు అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్బాబు, రష్మిక మందన్నా జంటగా విజయశాంతి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ‘దిల్’ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర, మహేశ్బాబు నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మహేశ్బాబు విలేకరులతో చెప్పిన విశేషాలు. ► ‘శ్రీమంతుడు’ సినిమా నుంచి నేను అన్నీ సందేశాత్మక చిత్రాలే చేస్తున్నా. వాణిజ్య అంశాలతో కూడిన ‘దూకుడు’ లాంటి వినోదాత్మక చిత్రం రావాలని నా అభిమానులు కోరుకున్నారు.. నాక్కూడా చేయాలనిపించింది. జూలైలో ఈ సినిమా స్టార్ట్ చేసి, డిసెంబరులో పూర్తి చేశాం. ఐదు నెలల్లో సినిమా పూర్తి చేశాం. ఈ సినిమా ఈ టైమ్లో చేయడం నా కెరీర్లో తీసుకున్న మంచి నిర్ణయమని అనుకుంటున్నాను. ► సినిమా చాలా బాగా వచ్చింది.. బొమ్మ (సినిమాని ఉద్దేశించి) దద్దరిల్లిపోతుంది. నేను, నిర్మాతలు, డైరెక్టర్తో పాటు యూనిట్ అంతా హిట్ సాధించబోతున్నామనే పూర్తి నమ్మకంతో ఉన్నాం. సినిమాని మా టీమ్తో పాటు కొంతమంది చూశారు. మేము ఏదైతే ఫీల్ అయ్యామో సినిమా చూసినవాళ్లు కూడా అలాగే ఫీల్ అవడం చాలా సంతోషంగా అనిపించింది. తొలి రోజు షూటింగ్ నుంచి ఈ రోజు వరకూ అదే వైబ్స్ ఫీలయ్యాం. దీన్ని బట్టి చూస్తే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందనే వైబ్స్ కనిపిస్తున్నాయి. ► ‘బిజినెస్ మేన్’ సినిమా తర్వాత నేను త్వరగా చేసిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. కథ అనుకున్నప్పడు జూన్లో స్టార్ట్ చేసి సంక్రాంతికి విడుదల చేద్దామనుకున్నాం.. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా.. అందుకే జూలైలో సినిమా స్టార్ట్ చేసి, పూర్తయ్యేవరకూ నాన్స్టాప్గా పనిచేశాం. ఇందులో నేను ఆర్మీ మేజర్ పాత్ర చేస్తుండటంతో మేకోవర్ కోసం ఓ నెల టైమ్ పట్టింది. ఈ పాత్ర కోసం 6 కిలోలు బరువు తగ్గాను. ► టీమ్ చక్కగా కుదిరితే సినిమాలు త్వరగా పూర్తవుతాయి.. కొన్ని సినిమాలు అలా కుదురుతాయి.. మరికొన్ని మన చేతుల్లో ఉండవు. అన్నీ ఐదు నెలల్లోనే పూర్తి కావాలంటే ఎలా? మంచి క్వాలిటీ కావాలి కదా? అయితే ‘సరిలేరు నీకెవ్వరు’కు అన్నీ కుదిరాయి.. పైగా సంక్రాంతి లక్ష్యంగా పెట్టుకున్నాం కాబట్టి వచ్చాం. ► ఈ చిత్రంలో నాది బాధ్యతగల ఆర్మీ మేజర్ పాత్ర. ఇష్టం వచ్చినట్లు చేయలేం.. దాన్ని అనిల్ చక్కగా తెరకెక్కించాడు. ఇప్పటివరకూ అనిల్ తీసిన సినిమాలు ఒక ఎత్తు.. ఈ సినిమా వేరే ఎత్తు. ఈ సినిమాతో దర్శకుడిగా పది రెట్లు పెరుగుతాడు. అంత బాగా తీశాడు ఈ సినిమాని. ► నేను ఒక్కసారి డైరెక్టర్కి సరెండర్ అయిపోతే వాళ్లు చెప్పినట్లు చేస్తా. ‘దూకుడు’ తర్వాత మళ్లీ అంత వాణిజ్య అంశాలున్న చిత్రమిది. అలాగని ‘దూకుడు’లా ఉండదు.. ఫ్రెష్గా ఉంటుంది. ఈ క్రెడిట్ అంతా అనిల్దే. నా గత సినిమాలను చూసి ఈ పాత్రని అనిల్ తీర్చిదిద్దారు. ఈ సినిమాలో ఓ మాస్ సాంగ్ ఉండాలనేది అనిల్ కోరిక.. పైగా ఈ చిత్రంలో ఆ పాటకి అవకాశం ఉండటంతో పెట్టాం. ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా మరో ఎత్తు. నా అభిమానులు, ప్రేక్షకులు కొత్త మహేశ్ను చూస్తారు. ► విజయశాంతిగారితో ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమా తర్వాత, దాదాపు 30 ఏళ్లకు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేశాను. సెట్లో తొలిరోజు ఆమెను కలవగానే ‘కొడుకు దిద్దిన కాపురం’ షూటింగ్ నిన్ననే జరిగినట్టు అనిపించింది. ఈ సినిమా ఒప్పుకున్నందుకు ఆమెకు థ్యాంక్స్.. ఎందుకంటే ఈ సినిమాలోని భారతి పాత్ర ఆమె తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. పదేళ్ల తర్వాత సంగీతగారు ఇందులో నటించారు. ఆమెను అనిల్ ఒప్పించి తీసుకొచ్చారు. ► కృష్ణగారి సర్ప్రైజ్ ఏంటో సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రేక్షకులు తప్పకుండా థ్రిల్ ఫీల్ అవుతారు. ఈ సినిమాలో సైనికులపై వచ్చే థీమ్ సాంగ్ అంటే నాకు ఇష్టం. ఈ చిత్రంలో చాలా సర్ప్రైజ్ అంశాలున్నాయి.. ప్రేక్షకుల స్పందన కోసం వేచి చూస్తున్నా. ఈ పాత్ర చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను.. ఈ మధ్య కాలంలో అంత సరదాగా ఎప్పుడూ ఉండలేదు. సినిమా స్టార్ అయిన నాలుగో రోజు నుంచే సరదాగా ఉన్నా. ► ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి అడ్వాన్స్ తీసుకోకుండా చేశానని కాదు కానీ, ఈ సినిమా ఐదు నెలల్లో చేయాలనుకున్నాం.. ఎలా ఉంటుంది? బడ్జెట్ ఎంత? అనుకోలేదు. నేను కూడా ఈ సినిమాకి ఓ నిర్మాత కావడంతో అడ్వాన్స్ తీసుకోలేదు. ఒక నిర్మాతగా నేను తీసుకున్న నిర్ణయమది. నేను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఇది కూడా ఒకటి. భవిష్యత్తులో అందరూ ఇలాగే చేస్తే ఓ సినిమాకి ఆర్థికంగా చాలా మిగులుతుంది. ► ఒకే రోజు రెండు సినిమాలు విడుదలవడం మంచిది కాదు.. రెవెన్యూ షేర్ అయిపోతుంది. ‘అల.. వైకుంఠపురములో...’ మరుసటి రోజు విడుదలకు ఒప్పుకున్నందుకు నిర్మాతలకు థ్యాంక్స్. హీరోలెప్పుడూ థియేటర్ల గురించి పట్టించుకోరు.. సోలో రిలీజ్ కావాలని అంటారంతే. డబ్బులు నా ఒక్కడికే వస్తే ఎలా? సినిమా కొన్నవారికి కూడా రావాలి కదా? సంక్రాంతి కాబట్టి మూడు నాలుగు పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయంతే. ఈసారి ఒకేరోజు కాకుండా ఇండస్ట్రీ వారు మాట్లాడుకుని గ్యాప్తో విడుదల చేస్తున్నారు. ► నాన్నగారికి (కృష్ణ) ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు’ ఇవ్వాలని చిరంజీవిగారు కోరడం సంతోషాన్నిచ్చింది. ఆ మరుసటి రోజు నాన్నగారిని కలిసినప్పుడు.. ‘చిరంజీవి బాగా మాట్లాడారు.. నా తరఫున థ్యాంక్స్ చెప్పు’ అన్నారు. చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించేందుకు రెండు ఫౌండేషన్లు పని చేస్తున్నాయి. వాటికి నా వంతు సహాయం అందిస్తున్నా. భవిష్యత్లో పెద్దగా చేస్తా. ► ప్రయోగాలు, వైవిధ్యమైన సినిమాలు అనుకోవడానికి బాగుంటాయి. కానీ, 125 నుంచి 130 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు అన్ని యాంగిల్స్ చూడాలి.. ఫ్రెష్గా ఉండాలి.. పైగా పెద్ద హీరోలందరం ఒక విచిత్రమైన జోన్లో ఉన్నాం.. అన్నీ ఉండాలి.. లేకుంటే మార్కెట్కి ఇబ్బంది. అన్నీ కుదిరితే చిన్న సినిమా చేయొచ్చు. ► దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఎలాగూ బాగా ఇస్తాడు.. నేపథ్య సంగీతం చాలా బాధ్యతగా చేస్తాడని నా భావన. నేపథ్య సంగీతంలో మంచి అనుభవం గతంలో మణిశర్మగారికి ఉండేది.. ఇప్పుడు దేవిశ్రీకి ఉంది. ఇప్పటికి 25 సినిమాలు చేశాను.. ఇంకా కొత్తగా ఏం చేయాలి? ఏం చేయొచ్చు? అని ఆలోచిస్తుంటా. ► మా సినిమా నుంచి ముందు అనుకున్న కెమెరామేన్ తప్పుకున్నప్పుడు రత్నవేలుగారికి ఫోన్ చేయగానే గంట సమయం తీసుకుని ఓకే అన్నారు. తను లేకుంటే ఇంత స్పీడ్గా సినిమా పూర్తవ్వదు.. రామ్–లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ ఇరగ్గొట్టేశారు. ► ‘కేజీఎఫ్’ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ని కలిశాను.. కొన్ని స్టోరీ లైన్స్ విన్నా.. ఆ మాత్రానికే సినిమా ఫిక్స్ అయిపోదుగా? -
నన్ను మోసిన ప్రతి మెట్టూ నాకు ముఖ్యమే
‘‘మనం చేసే పని నచ్చేవారు వందలో అరవై నుంచి డెబ్బై మంది మాత్రమే ఉంటారు. ముప్పై మంది మనం ఏం తీసినా తిడతారు. అందుకే 70 మంది కోసమే సినిమా తీయాలి. నా సినిమాల కథలను ఏ కొందరో విమర్శించారని నేను పక్కకు పోయి ఓ ప్రయోగాత్మక సినిమా తీస్తే... అదేంటీ అనిల్ రావిపూడి అతని బలమైన జానర్ను వదిలేసి ఇలాంటి సినిమా తీశాడు? అనే వార్తలు వస్తాయి. నేను చేసిన ప్రతి సినిమా ఆ హీరోల కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ ఫిలింసే’’ అన్నారు అనిల్ రావిపూడి. మహేశ్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో అనిల్ సుంకర, మహేశ్బాబు నిర్మించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతున్న సందర్భంగా అనిల్ రావిపూడి చెప్పిన విశేషాలు. ► ‘సుప్రీమ్’ సినిమా కోసం జోధ్పూర్ నుంచి హైదరాబాద్కు ట్రైన్లో వస్తున్నప్పుడు ఒక సైనికుడిని కలిశాను. ఆయనతో మాట్లాడినప్పుడు సైనికులు ఏయే పరిస్థితుల్లో ఎలా ఉంటారో తెలుసుకున్నాను. ఆ సంఘటనల నుంచి ప్రేరణ పొంది ‘సరిలేరు నీకెవ్వరు’ కథ రాసుకున్నాను. ‘ఎఫ్ 2’ సినిమా సమయంలో మహేశ్బాబుగారికి ఈ కథ చెప్పాను. క్యారెక్టరైజేషన్ బాగా నచ్చి, నాపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చారు. ఈ సినిమాను మహేశ్గారి నమ్మకానికి నేను ఇచ్చే బహుమతిగా భావిస్తున్నా. మహేశ్గారి టైమింగ్ బాగుంటుంది. దర్శకులకు ఆయన పూర్తి స్వేచ్చ ఇస్తారు. దర్శకులకు కావాల్సింది వచ్చేంత వరకు కష్టపడుతూనే ఉంటారు. మహేశ్గారికి నేను కాదు.. ఆయన నా కెరీర్కు ప్లస్. విజయశాంతిగారు మొదట్లో చేయనన్నారు. ఒకసారి కథ వినమన్నాను. కథ విన్నాక భారతి పాత్ర చేయడానికి ఆమె ఒప్పుకున్నారు. ఆమె కోసమే ఈ పాత్ర రాశాను. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన పాటల పట్ల దర్శకుడిగా పూర్తి సంతృప్తిగా ఉన్నాను. నిర్మాతలు ‘దిల్’ రాజు, అనిల్ సుంకరగారు సహకరించారు. ► దేశభక్తి, వినోదం అనే అంశాలను ఒకేసారి డీల్ చేయడం కాస్త కష్టంతో కూడుకున్న పనే. కానీ దాన్నే హీరోగారి చేత ఎంటర్టైనింగ్గా ఎలా చెప్పించాం అనేది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. బోర్డర్ నుంచి అజయ్కృష్ణ (మహేశ్ పాత్ర పేరు) అనే ఆర్మీ ఆఫీసర్ ఓ బాధ్యతతో కర్నూలు వస్తాడు. ఒక యుద్ధ వాతావరణం నుంచి సాధారణ ప్రజల మధ్యలోకి వచ్చిన అతనికి ప్రజలు అమాయకులుగా కనిపిస్తారు. ఎందుకంటే సరిహద్దుల్లో శత్రువులు వేరు, సమాజంలోని శత్రువులు వేరు. వీరందరూ బాధ్యతతో ఉండాలనేది అజయ్కృష్ణ వ్యక్తిత్వం. యుద్ధంలో శత్రువును చంపడం కాదు. శత్రువును మార్చడం ముఖ్యమని మా సినిమా చెబుతుంది. ఇందులో వచ్చే ఆర్మీ ఎపిసోడ్ చాలా కీలకం. క్లైమాక్స్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను మెప్పిస్తాయి. ► ప్రస్తుతం నా సినిమా ప్రయాణం బాగానే సాగుతోంది. అయితే నన్ను మోసిన ప్రతి మెట్టూ నాకు ముఖ్యమే. ‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా కల్యాణ్రామ్గారు అవకాశం ఇచ్చారు. ‘సుప్రీమ్’తో సాయిధరమ్ తేజ్, ‘రాజా ది గ్రేట్’కి రవితేజగారు, ‘ఎఫ్ 2’కి వెంకటేష్, వరుణ్తేజ్ గార్లు వీరందరు నన్ను ఇంతదూరం తీసుకువచ్చారు. ఇప్పుడు సూపర్స్టార్ మహేశ్గారితో సినిమా చేశాను కాబట్టి నేను ఏదో గొప్ప అని ఊహించుకోవడం లేదు. నేను వచ్చిన దారి నాకు గుర్తు ఉంది. ► ఏ దర్శకుడికైనా అతని ప్రయాణంలో ఏదో సందర్భంలో ఫ్లాప్ వస్తుంది. మనకు తెలియకుండానే ఆ తప్పు జరిగిపోతుంది. కానీ ఆ తప్పుని ఎంత దూరంలో జరుపుకుంటామనేది మన చేతుల్లో ఉంటుంది. ఆ తప్పు తొందరగా జరగకూడదని ప్రయత్నిస్తున్నాను. నేను తీసిన ప్రతి సినిమా సూపర్హిట్ అవుతుందని నేను చెప్పలేను. ► చిరంజీవిగారితో సినిమా చేసే అవకాశం వస్తే ఎగిరి గంతేస్తా. బాలకృష్ణగారితో సినిమా చేయాల్సింది. కుదర్లేదు. భవిష్యత్లో ఉండొచ్చు. ‘ఎఫ్ 2’ సీక్వెల్ ఆలోచన ఉంది. ప్రస్తతానికి నా తర్వాతి చిత్రం గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. -
సర్.. ఆరోజు పార్టీ చేసుకుందాం: నమ్రత
టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ బాబు.. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ టీం ఫుల్ జోష్లో ఉంది. క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర బృందానికి మరింత బూస్ట్నిచ్చారు. ఈ సందర్భంగా మూవీ టీం ఒక్కచోట చేరి పార్టీ చేసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలను మహేష్ బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ‘బ్లాక్బస్టర్ దిశగా అడుగులు వేస్తూ.. చరిత్ర సృష్టించబోతున్న సరిలేరు నీకెవ్వరు టీంతో గత రాత్రి... అయితే మా డీవోపీ రత్నవేలును మిస్సవుతున్నాం. మరేం పర్లేదు సర్.. 11న ఇంతకంటే పెద్ద పార్టీ చేసుకుందాం’ అంటూ నమ్రత ఫొటోలను షేర్ చేశారు. ఇందులో మహేష్ కుటుంబంతో పాటు... డైరెక్టర్ అనిల్ రావిపూడి, రామజోగయ్య శాస్త్రి, విజయశాంతి, తమన్నా, రష్మిక మందన్న, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్తో పాటుగా మహేష్కు.. మహర్షి వంటి బ్లాక్బస్టర్ ఇచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఉన్నాడు. కాగా ఈ సరిలేరు నీకెవ్వరులో ప్రత్యేక గీతంలో నర్తించిన తమన్నా సైతం పార్టీకి సంబంధించిన ఫొటోలను షేర్ చేయడంతో.. అవి నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇక ‘దిల్’ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర, మహేశ్బాబు నిర్మించిన ఈ సినిమా.. జనవరి 11న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. View this post on Instagram #girlssquadgoals We are made of sugar , spice and everything nice, love you two my cuties #sitara #aadhya @namratashirodkar @urstrulymahesh @directorvamshi A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on Jan 5, 2020 at 11:27am PST -
అందర్నీ టార్చర్ పెట్టాను!
‘‘నేను చాలా సెటిల్డ్ యాక్టర్ని. ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో చాలా ఎమోషనల్గా నటించాను. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఫుల్ ఎనర్జీ ఉన్న పాత్ర చేశాను. ప్రస్తుతం అన్ని రకాల పాత్రలు చేస్తూ ప్రయోగాలు చేస్తున్నాను’’ అన్నారు రష్మికా మందన్నా. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మిక కథానాయిక. ‘దిల్’ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర, మహేశ్బాబు నిర్మించారు. ఈ నెల 11న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా రష్మికా చెప్పిన విశేషాలు. ► దర్శకుడు అనిల్గారు కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. ఆయన కథను మొత్తం యాక్ట్ చేసి చూపిస్తారు. ఈ సినిమాలో నా పాత్ర ఇలా వచ్చి అలా వెళ్లిపోయేది కాదు. నా పాత్రకో ముగింపు కూడా ఉంటుంది. సినిమాలో మంచి ఫీల్ ఉంది. మహేశ్బాబుగారు, విజయశాంతిగారితో కలసి యాక్ట్ చేయడం బోనస్. ► ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నా పాత్ర చాలా డ్రమాటిక్గా ఉంటుంది. హీరో వెంటపడి అల్లరి చేసే పాత్ర నాది. చాలా హైపర్ యాక్టివ్. ఫుల్ లెంగ్త్ నవ్వించే పాత్ర నాది. ట్రైన్ ఎపిసోడ్లో మహేశ్బాబు పాత్రను నా పాత్ర చాలా టార్చర్ పెడుతుంది. ఈ సినిమాలోనే కాదు సెట్లోనూ అందర్నీ టార్చర్ పెట్టాను. సెట్లో అందరూ కామ్గా ఉంటే అందర్నీ డిస్ట్రబ్ చేస్తుంటాను. అదే నా బలం అనుకుంటున్నాను (నవ్వుతూ). ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పుకునేటప్పుడు ‘మరీ అంత టార్చర్ పెట్టకే’ అని అనుకున్నాను. ► ఈ సినిమా ట్రైలర్లో కనిపించినంత హైపర్గా నిజజీవితంలో ఉండను. మా దర్శకుడు చెప్పినట్లు చేశాను. మీరు చేసి చూపించండి, దాన్ని కాపీ కొడతాను అని చెప్పి కాపీ కొట్టేశా. కాపీ అంటే పూర్తి కాపీ కాదు. ఆయన చెప్పినదానికి కొంచెం నా స్టయిల్ జత చేసి నటించాను. ► విజయశాంతిగారితో నాకు ఎక్కువ సన్నివేశాలు లేవు. మొదట్లో ఆమెతో మాట్లాడాలంటే కొంచెం టెన్షన్ పడ్డాను. ఆమెను లేడీ అమితాబ్ అంటారు కదా. అలాగే సీనియర్ యాక్టర్ అని చిన్న భయం ఉండేది. కానీ సెట్లో ఆమె ఎనర్జీ చూసి ఫ్యాన్ అయిపోయాను. చాలా పాజిటివ్గా ఉంటారు. కేరళలో షూటింగ్ అప్పుడు మేం ఫ్రెండ్స్ అయిపోయాం. రెండు రోజులు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు ఫోన్ చేసి కూడా విసిగిస్తున్నా. త్వరలోనే మేమిద్దరం కలసి ఓ సినిమా చేస్తాం (నవ్వు). ► ఈ సినిమాలోని ‘మైండ్ బ్లాక్..’ సాంగ్లో డ్యాన్స్ హైలైట్గా ఉంటుంది. నాకు డ్యాన్స్ అంతగా రాదేమో అని మా టీమ్ అనుకున్నారు. ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేస్తారో అని ఎదురు చూస్తున్నాను. ► వచ్చే నెలలో ‘భీష్మ’ విడుదల అవుతుంది. సుకుమార్– అల్లు అర్జున్ కాంబినేషన్లో హీరోయిన్గా చేయబోతున్నాను. రెండు మూడు నెల్లలో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. మిగతావి చర్చల్లో ఉన్నాయి. -
ఏదో తెలిసో.. తెలియకో టంగ్ స్లిప్పై..
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకలో సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తనదైన శైలిలో ప్రసంగిస్తూ నవ్వులు కురిపించాడు. ఈ సినిమాలో తాను బ్లేడ్ గణేష్ పాత్ర పోషించానని, కానీ, ఈ సినిమా తర్వాత దయచేసి ఎవరూ తనను బ్లేడ్ గణేష్ అని పిలువద్దని వేడుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గెలువకపోతే బ్లేడుతో గొంతు కోసుకుంటానని ప్రకటించి అప్పట్లో బండ్ల గణేష్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై పరోక్షంగా స్పందిస్తూ.. ‘ఏదో తెలిసో తెలియకో టంగ్ స్లిప్ అయ్యాను. అందరూ కలిసి ఎర్రీ బీప్ అంటున్నారు కాబట్టి.. బండ్ల గణేష్గానే మీ అందరి ముందు ఉండాలని కోరుకుంటున్నా. ఈ సినిమాలో పది నిమిషాలు నేనుకూడా చింపేసా. ఇకముందు కూడా సినిమాల్లో యాక్ట్ చేస్తా. సినిమాలు తీస్తా. సినిమానే నా జీవితం. ఇంకా వేరేవాటితో నాకు సంబంధం లేదు. అమ్మతోడు.. 30 ఏళ్ల నుంచి సినిమాల్లోనే ఉన్నాను. ఇంకో 30 ఏళ్లూ ఇక్కడే ఉంటాను’అని చెప్పుకొచ్చారు. సూపర్స్టార్ మహేశ్బాబు సినిమా ఈవెంట్కు చిరంజీవి రావడం ఆయన సంస్కారానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. మహేశ్, చిరు అన్నదమ్ములుగా నటిస్తే చూడాలని ఉందన్నారు. చిరంజీవి మళ్లీ యాక్ట్చేయాలని బలంగా కోరుకున్నది తానేనని, కానీ ఆయన ఇప్పుడు తనను మరిచిపోయి అన్ని సినిమాలు వాళ్ల అబ్బాయికే చేస్తున్నారని సరదాగా వ్యాఖ్యానించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్బాబు తీసిన ఈ సినిమా రూ. 250 కోట్లు కలెక్ట్చేయాలని, అన్ని రికార్డులు చెరిపేయాలని కోరుకున్నారు. -
‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ వేడుక
-
కృష్ణగారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలి
‘‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని ఐదు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి, ప్రీ రిలీజ్ ఫంక్షన్కి నన్ను పిలవగానే ఆశ్చర్యం వేసింది.. షాక్ తిన్నాను.. ఆనందం వేసింది. ప్రతి హీరో, ప్రతి డైరెక్టర్ ఇంత స్పీడ్గా, క్వాలిటీగా సినిమాలు చేస్తే ఇండస్ట్రీకి ఇంతకంటే ఇంకేం కావాలి.. అందరూ ఇలాగే చేయాలి.. అప్పుడే ఈ పరిశ్రమ పదికాలాల పాటు పచ్చగా ఉంటుంది.. ప్రతి ఒక్కరికీ ఉపాధి ఉంటుంది.. థియేటర్స్ కళకళలాడుతుంటాయి’’ అని చిరంజీవి అన్నారు. మహేశ్బాబు, రష్మిక మందన్నా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమాలో విజయశాంతి కీలకపాత్ర చేశారు. ‘దిల్’ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర, మహేశ్బాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ‘సరిలేరు నీకెవ్వరు మెగా సూపర్ ఈవెంట్’లో ముఖ్య అతిథి చిరంజీవి మాట్లాడుతూ– ‘‘అందరి అభిమానుల మధ్య ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం కావాలి.. ఇదే నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నా.. ఈరోజు నిరూపించినందుకు అభినందిస్తున్నా. మహేశ్ ఎంతో ప్యాషనేట్గా ఉంటాడు.. ముద్దొచ్చేలా ఉంటాడు.. బిడ్డలాంటి అనుభూతి. ఎప్పుడూ తనలో చెరగని చిరునవ్వు ఉంటుంది. ఆ నవ్వు వెనకాల చిన్న చిలిపితనం కూడా ఉంటుంది.. దొంగ(నవ్వుతూ). ‘సరిలేరు నీకెవ్వరు’ పూర్తయ్యే వరకూ మహేశ్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదంటే దాని వల్ల నిర్మాతలకి ఎన్నో కోట్లు, వడ్డీ డబ్బులు మిగులుతాయి.. అది మంచి ఆరోగ్యకరమైన సంప్రదాయం. నేను కూడా సినిమా పూర్తయ్యాకే డబ్బు తీసుకునేవాణ్ణి. దాన్నిప్పుడు రామ్చరణ్ కూడా ఆచరిస్తున్నాడు. మహేశ్కూడా అలా చేసి, నిర్మాతలకి వెన్నుదన్నుగా నిలబడటం గ్రేట్.. ఈ రోజుల్లో అది అవసరం. షూటింగ్ డేస్ పెరగడం వల్ల బడ్జెట్ వృథా అయిపోతోంది.. నా తర్వాతి చిత్రాన్ని కొరటాల శివ కూడా 80నుంచి 99 రోజుల్లోనే పూర్తి చేస్తానని మాటిచ్చాడు.. అలా చేయకుంటే మర్యాదగా ఉండదు(నవ్వుతూ). మన సౌత్ ఇండియాలోనే సీనియర్ మోస్ట్ యాక్టర్ కృష్ణగారు.. అలాంటి వ్యక్తికి దక్కాల్సిన గౌరవం ఇంకా దక్కలేదేమో? రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయనకి ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డు వచ్చేలా నిజాయతీగా కృషి చేయాలి.. ఈ అవార్డు కృష్ణగారికి వచ్చే గౌరవం కాదు.. మనకి వచ్చే గౌరవం.మహేశ్తండ్రి కృష్ణగారు అనిపించుకునే స్థాయికి మహేశ్ వస్తుండటం ఆయనకి గర్వకారణం.. చరణ్ విషయంలో నాకూ అంతే. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అనీల్ సుంకర, ‘దిల్’ రాజు లాంటి నిష్ణాతులున్నారు. ఈ సినిమాతో పాటు సంక్రాం తికి విడుదలవుతున్న ‘అల వైకుంఠపురములో.., మా ఫ్రెండ్ రజనీ ‘దర్బార్’తో పాటు విడుదలవుతున్న అన్ని సినిమాలూ సూపర్డూపర్ హిట్స్ అవ్వాలి.. సినిమా పరిశ్రమ బాగుండాలి.. వాటి దర్శక–నిర్మాతలు బాగుండాలి’’ అన్నారు. మహేశ్బాబు మాట్లాడుతూ– ‘‘ఒక్కడు’ సినిమా చూసిన చిరంజీవిగారు నాకు ఫోన్ చేశారు. ఆ తర్వాత కలిసి రెండు గంటలు మాట్లాడుకున్నాం. అప్పుడు ఆయన చెప్పిన మాటలు నాకు స్ఫూర్తినిచ్చాయి. ‘అర్జున్’ సినిమా షూటింగ్లో మా సెట్కు వచ్చి, ఆ సెట్ను చూసి నీలాంటి వారు ఇండస్ట్రీలో ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇంకా ముందుకు తీసుకుకెళ్లాలని చెప్పిన మాటలు గుర్తున్నాయి. ‘పోకిరి’లో నా నటన గురించి , సినిమా గురించి రెండు గంటలు మాట్లాడారు.. మీరు ఎప్పటికీ నాకు స్ఫూర్తి సార్. ‘భరత్ అనే నేను, మహర్షి’ రిలీజ్ అయినప్పుడు అభినందనలు చెబుతూ తొలి ఫోన్ కాల్ ఆయన నుంచే వచ్చింది.. జనవరి 11న కూడా మొదటి కాల్ మీ నుంచే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ‘కొడుకుదిద్దిన కాపురం’ సినిమా తర్వాత, దాదాపు 30 ఏళ్ల తర్వాత విజయశాంతిగారితో ‘సరిలేరు నీకెవ్వరు’ చేశాను. చిరంజీవిగారిలో, విజయశాంతిగారిలో మంచి క్రమశిక్షణ ఉండేది. ఈ సినిమాలోని భారతి పాత్ర విజయశాంతిగారు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. నా కెరీర్లోనే ఈ సినిమా షూటింగ్ చాలా తొందరగా పూర్తయిందంటే ఒక కారణం అనిల్ రావిపూడి. జనవరి 11న మీకు(అభిమానులు) కానుక ఇవ్వబోతున్నాం.. ఈ సినిమా ఫలితం కోసం ఎదురుచూస్తున్నా’’ అన్నారు. విజయశాంతి మాట్లాడుతూ– ‘‘1979 నుంచి 2020 వరకూ లాంగ్ జర్నీ. అందరితో కలిసి నడిచాను.. నన్ను ఈ స్థాయికి తీసుకెళ్లిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. తెలుగు చిత్రసీమకు నన్ను పరిచయం చేసింది హీరో కృష్ణగారు, విజయనిర్మలగారు. నా సక్సెస్ఫుల్ హీరో కృష్ణగారని చెప్పుకుంటాను. సినిమాల్లోకి నా రీ–ఎంట్రీ మహేశ్తో కావడం ఆశ్చర్యంగా ఉంది. మహేశ్ అబ్బాయి వచ్చినా తనతోనూ యాక్ట్ చేస్తాను. వెయ్యి మంది పిల్లలకు గుండె ఆపరేషన్ చేయిస్తున్న మహేశ్ సినిమాలోనే కాదు.. బయట కూడా సూపర్స్టారే. చిరంజీవిగారు, నేను ఎన్నో సినిమాలు కలిసి చేశాం.. అవన్నీ ఇప్పుడు గుర్తొచ్చాయి’’అన్నారు. అనీల్ సుంకర మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగార్ని చూసి మేమంతా నేర్చుకోవాలి.. మే 31న కృష్ణగారి పుట్టినరోజున ప్రారంభించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం విడుదల జనవరి 11న అని ఫిక్స్ అయ్యాం.. ఆ రోజున అద్భుతం జరుగుతుంది. ఈ సినిమా మహేశ్గారి అభిమానులతో పాటు, అన్నివర్గాల వారికీ నచ్చుతుంది. ఈ సినిమాతో మహేశ్బాబుపై అభిమానం పదింతలు పెరుగుతుంది. ఈ సినిమా తెలుగువాళ్లందరూ తలెత్తుకుని తిరిగేలా ఉంటుంది’’ అన్నారు. నిర్మాత ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ– ‘‘నేను ముప్పై ఏళ్ల క్రితం తీసిన సినిమా ‘కొడుకు దిద్దిన కాపురం’. ఆరోజునే ఇంతటి పాపులారిటీని సంపాదించుకున్నాడు మహేశ్. ఆ సినిమాలో కృష్ణ, విజయశాంతి, మోహన్బాబు గార్లవంటి పెద్ద నటుల మధ్య 14ఏళ్ల వయసులోనే నటించి లిటిల్ స్టార్ అనిపించుకుని ఈ రోజు సూపర్స్టార్ అయ్యాడు. ఏ సినిమా అయినా మొదలు పెట్టేముందు బడ్జెట్, షెడ్యూల్, రిలీజ్ విషయాలు క్రమశిక్షణతో చేస్తే చిత్ర పరిశ్రమ కలకాలం నిలబడుతుంది.. అది హీరోల సహకారం లేకుంటే అవదు. ‘సరిలేరు నీకెవ్వరు’ ఆల్టైమ్ ఇండస్ట్రీ రికార్డులు తేవాలి’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘‘అందరివాడు’ చిరంజీవిగారు ఇక్కడ ఉండటం సంతోషంగా ఉంది. నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఎందుకంటే మహేశ్బాబుగారితో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, ఇటీవల ‘మహర్షి’, ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’.... మన కాంబినేషన్ హ్యాట్రిక్.. ఫిక్స్ సార్ (మహేశ్ను ఉద్దేశిస్తూ). ‘పటాస్’ తర్వాత అనిల్ మాతో నాలుగు సినిమాలు చేశారు. మా బ్యానర్కు మంచి సినిమాలు ఇస్తున్నాడు. థ్యాంక్స్ అనిల్. ఈ సక్సెస్ ఇలాగే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. అనిల్ సుంకరగారితో కలిసి ఈ చిత్రం చేయడం హ్యాపీ. దేవిశ్రీ కాంబినేషన్లో మా బ్యానర్లో ఇది 12వ సినిమా. 1999లో ‘శత్రువు’ సినిమా షూటింగ్ సమయంలో విజయశాంతిగారిని చూశాను. మా భాగస్వామ్యం ఉన్న సినిమాతో ఆమె రీ ఎంట్రీ అవడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘పొద్దున్నే నాకు కొడుకు పుట్టాడు.. సాయత్రం ఈ వేడుక. ఇలాంటి రోజు.. నెవర్ బిఫోర్... ఎవర్ ఆఫ్టర్. స్వయంకృషితో, కష్టంతో మనం ఎలా ఎదగాలో నేర్పిన పేరు చిరంజీవిగారు. 40 ఏళ్లుగా వింటున్న పేరు అది. మనిషిలో ఒక కళ పుట్టడానికి ఒక కనెక్షన్ ఉంటుంది.. నాలో కళ పుట్టడానికి కారణం చిరంజీవిగారే. ‘సరిలేరు నీకెవ్వరు’ కథ విన్న మహేశ్గారు ‘షేక్ హ్యాండ్ ఇస్తూ సినిమా చేస్తున్నాం’ అని చెప్పిన క్షణాల నుంచి ఇప్పుడు ఈ ఫంక్షన్ జరుగుతున్నప్పటి వరకు సాగిన ఈ ప్రయాణంలోని ముఖ్యమైన క్షణాలను నా జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే అంత గొప్ప అవకాశం ఇచ్చారాయన. డబ్బింగ్ అయిపోయి సినిమా పూర్తయిన తర్వాత.. ‘బ్రదర్...నా లైఫ్లో చాలా పెద్ద పెద్ద సక్సెస్లను చూశాను. నువ్వు ఎదుగుతున్నావ్.. ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్ని నువ్వు ఎంజాయ్ చేయ్’ అంటూ మెసేజ్ చేసిన మహేశ్గారికి థ్యాంక్స్.. మీరు ఇచ్చిన దానికి నేను ఏం ఇవ్వగలను.. ఒక మంచి హిట్ ఇచ్చి తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. ట్రైలర్లో మహేశ్గారు చెప్పినట్లు బొమ్మ దద్దరిల్లి పోద్ది. ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. ఈ చిత్రంలో సూపర్స్టార్ కృష్ణగారు కూడా ఉన్నారు. దానికి దేవిశ్రీ ఎలాంటి ఆర్ఆర్ ఇచ్చారో సినిమాలో చూడండి. ఈ సినిమా స్టార్ట్ కావడానికి ఒక కారణమైన నమ్రతగారికి థ్యాంక్స్. ‘దిల్’ రాజు, అనీల్ సుంకరగార్లకు థ్యాంక్స్’’ అన్నారు. దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారిని, మహేశ్గారిని ఒకే ఫ్రేమ్లో చూడటం చాలా సంతోషంగా ఉంది. మహేశ్బాబుగారు సూపర్స్టారే కాదు. ఆయనకు సూపర్స్టార్ లాంటి హృదయం కూడా ఉంది. ఈ సినిమాలో మహేశ్గారి పెర్ఫార్మెన్స్ మైండ్బ్లాకింగ్గా ఉంటుంది. విజయశాంతిగారితో మా నాన్నగారు(రచయిత సత్యమూర్తి) పనిచేశారు. ఈ సినిమాకు ఆమెతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. అనీల్ సుంకర, ‘దిల్’ రాజుగార్లకు థ్యాంక్స్’’ అన్నారు. హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారు, మహేశ్బాబులకు ఓ కథ రాసి, వారి కాంబినేషన్లో సినిమా తీయాలని అనిల్ రావిపూడిగారిని కోరుతున్నా. మీరు అలా చేస్తే ఆ కాంబినేషన్ సౌండ్ ఇండియా మొత్తం వినిపిస్తుంది.. బాక్సాఫీస్ రేంజ్ హాలీవుడ్ సినిమాకి దీటుగా ఉంటుందని నమ్ముతున్నా. ఈ రోజు నేను ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నానంటే, మహేశ్లాంటి వ్యక్తిని మనకిచ్చిన సీనియర్ సూపర్స్టార్ కృష్ణ మావయ్యకి థ్యాంక్స్’’ అన్నారు. ఈ వేడుకలో రష్మిక మందన్నా, తమన్నా, నిర్మాతలు రవిశంకర్, పి.కిరణ్, రామ్ ఆచంట, గోపీ ఆచంట, దర్శకులు వంశీ పైడిపల్లి, మెహర్ రమేశ్, కొరటాల శివ, శ్రీనువైట్ల, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, నటుడు బండ్ల గణేశ్, నటీమణులు సంగీత, హరితేజ, కౌముది, పల్లవి డోరా, పాటల రచయితలు రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, గాయని మధుప్రియ తదితరులు పాల్గొన్నారు. విజయశాంతిని ఒక్కమాట కూడా అనలేదు ఈ సందర్భంగా విజయశాంతితో తనకున్న అనుబంధాన్ని చిరంజీవి పంచుకుంటూ– ‘‘రాజకీయాలు శత్రువులను పెంచుతుంది.. మా సినీ మాత, సినీ పరిశ్రమ స్నేహితుల్ని, స్నేహాన్ని పెంచుతుంది. కొన్ని పరిస్థితుల్లో విజయశాంతి నన్ను కామెంట్ చేసినా, తనపై నాకు ఉన్న ప్రేమ, సెంటిమెంట్ వల్ల ఒక్కమాట కూడా నేను తిరిగి అనలేదు.. నాకు మనసు రాదు.. ఎందుకంటే మా విజయశాంతి.. ఇన్నేళ్లు మా మధ్య గ్యాప్ వచ్చింది.. రాజకీయాలన్నది శాశ్వతం కాదు.. కొన్నాళ్లే.. ఇన్నేళ్లకు నా ఫ్రెండ్ని(విజయశాంతి) మళ్లీ కలిసేలా చేసినందుకు మహేశ్కి థ్యాంక్స్’’ అన్నారు. చిరంజీవి, విజయశాంతి, మహేశ్బాబు -
‘చుట్టూ వంద మంది.. మధ్యలో ఒక్కడు’
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు హీరోగా క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, దిల్ రాజు, మహేశ్ బాబులు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న వస్తున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో అంగరంగవైభవంగా జరుగుతోంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరంజీవితో పాటు డైరెక్టర్స్ కొరటాల శివ, వంశీ, శ్రీనువైట్ల, టాలీవుడ్కు చెందిన ప్రముఖులు, నటీనటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ప్రీరిలీజ్ ఈవెంట్లో అతిరథుల సమక్షంలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. అద్యంతం కామెడీగా సాగిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. రష్మిక అండ్ గ్యాంగ్ అల్లరి, మహేశ్ మ్యానరిజం సూపరో సూపర్. ‘ఇలాంటి ఎమోషన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్’, ‘మియావ్ మియావ్ పిల్లి.. మిల్స్ బాబుతో పెళ్లి’, ‘15ఏళ్ల ప్రొఫెషనల్ కెరీర్లో తప్పును రైటని కొట్టలేదు..’,‘‘చుట్టూ వంద మంది.. మధ్యలో ఒక్కడు’అంటూ ట్రైలర్లో వచ్చే డైలాగ్లు హైలెట్గా నిలిచాయి. ఇక ఆఖర్లో మహేశ్ చెప్పే లాస్ట్ డైలాగ్ ‘చిన్న బ్రేక్ ఇస్తున్నా.. తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది’ ట్రైలర్కు హైలెట్గా నిలిచింది. -
నమ్రతా హార్ట్ టచింగ్ మెసేజ్... వైరల్
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు సతీమణి, నటి, నిర్మాత నమ్రతా శిరోద్కర్ తన ఇన్స్టాలో చేసిన ఓ పోస్ట్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఆ ఫోటో సోషల్మీడియాల్ వైరల్ అవుతోంది. ఫోటోతో పాటు తన మనసులోని అంతరంగిక భావాలను జోడించి ఓ సందేశాన్ని సైతం పోస్ట్ చేశారు. నమ్రత పోస్ట్ చేసిన ఆ ఉద్వేగభరిత పోస్ట్ అందరి హృదయాలను హత్తుకుంటోంది. ఇంతకీ ఆ ఫోటోలో ఏముందంటే కృష్ణ, మహేశ్, గౌతమ్లు ఒకే విధంగా, ఒకేరకమైన క్యాస్టూమ్స్ అందంగా అంతకుమించి హుందాగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో చూపరుల మది దోచేస్తోంది. ఈ ఫోటోతో పాటు ‘వీరే నా సూపర్ హీరోలు. వీరే నా బలం. ఈ ముగ్గురితో నా జీవితం సంపూర్ణమైంది. నా మీద ఈ ముగ్గురు చూపిస్తున్న ప్రేమ, గౌరవాలకు నేను కృతజ్ఞురాలిని. ఇప్పటికీ ఈ ముగ్గురు నాకెన్నో కొత్త విషయాలు నేర్పిస్తున్నందుకు ఆనందంగా ఉంది’అంటూ నమ్రతా హార్ట్ టచింగ్ మెసేజ్ పోస్ట్ చేశారు. ఇక మహేశ్ బాబు హీరోగా క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, దిల్ రాజు, మహేశ్బాబులు నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు (ఆదివారం) హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరగనుంది. ఇక ‘మహర్షి’ వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత మహేశ్ చేస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్కు వెళ్లాయి. ఇక దాదాపు దశాబ్దం తర్వాత విజయశాంతి సినిమాల్లోకి ‘సరిలేరు నీకెవ్వరు’తో రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, సంగీత, కౌముది, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. View this post on Instagram My 3 super heroes ❤️❤️❤️life has come a full circle ⭕️ #gratitude for what these men do for me !! Greatful for these men who bring me each time a different learning 🤗🤗blessed to have them as my pillars of strength🙏🙏 A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on Jan 4, 2020 at 11:02am PST -
మహేశ్ అభిమానులకు నిరాశ
మచిలీపట్నం : సంక్రాంతి సంబురాల పేరిట మచిలీపట్నంలో నిర్వహించిన ఓ టీవీ షోకు వచ్చిన సినీ హీరో మహేష్బాబును చూసే అవకాశం అభిమానులకు దక్కలేదు. టీవీ షోలో పాల్గొనేందుకు మహేష్బాబు మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు శనివారం సాయంత్రం చేరుకున్నారు. కానీ ఇదే సమయంలో వర్షం పడటంతో సంబరాల్లో పాల్గొనకుండానే ఆయన వెనుదిరిగారు. ఆయన వెళ్లిన కొద్దిసేపటికి వర్షం తగ్గింది. రాత్రికి యధావిధిగా టీవీ షో నిర్వహించారు. కాగా, మహేష్ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగటంతో అధిక సంఖ్యలో అభిమానులు ఏజే కళాశాల ప్రాంగణానికి చేరుకున్నారు. కానీ మహేష్ బాబు వెళ్లిపోయారని తెలియటంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. కాగా, మహేశ్ తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరగనుంది. ఈ చిత్రం జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘సరిలేరు నీకెవ్వరూ’ ఈవెంట్, ట్రాఫిక్ మళ్లింపు
సాక్షి, హైదరాబాద్ : ఎల్బీ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 7 నుంచి రాత్రి 10 గంటల వరకూ ‘సరిలేరు నీకెవ్వరూ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండటంతో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టనున్నారు. ఆ సమయంలో ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా వాహనాల మళ్లింపు ఉంటుందని నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్కుమార్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఏఆర్ పెట్రోల్ పంప్, అబిడ్స్, గన్ఫౌండ్రీ, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, కింగ్కోఠి, లిబర్టీ, రవీంద్రభారతి నుంచి ఎల్బీ స్టేడియం మీదగా వెళ్లే వాహనాలకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ముఖ్య అతిథిగా చిరంజీవి కాగా మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరూ’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా హాజరు కానున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మికా మందన్నా కథానాయికగా నటించారు. ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేశ్బాబు నిర్మించారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది. -
సమస్యలను పరిష్కరించడమే గిల్డ్ టార్గెట్
మహేశ్బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో చిత్రాలు ఈ నెల 11, 12 తేదీల్లో విడుదల కానున్నాయి. అయితే ఈ చిత్రాల విడుదల తేదీలపై రెండు మూడురోజులుగా చిన్న అస్పష్టత ఏర్పడింది. విడుదల తేదీలు మారే అవకాశం ఉందనే వార్తలు వినిపించాయి. కానీ ‘ప్రొడ్యూసర్స్ గిల్డ్’ చొరవతో ఈ సినిమాలు ముందు ప్రకటించిన తేదీల్లోనే రిలీజ్ కానున్నాయి. ఈ విషయాన్ని తెలియజేయడానికి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నిర్మాత కె.ఎల్. దామోదర ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘చర్చల అనంతరం సినిమా విడుదల తేదీలపై క్లారిటీ వచ్చింది. కారణాలు ఏమైనా కావచ్చు. సమస్యలకు పరిష్కారం దొరకడమే ముఖ్యం. ఈ రోజు జరిగిన మీటింగ్లో అందరూ పాజిటివ్గానే స్పందించారు’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘గతంలో జరిగిన ‘ప్రొడ్యూసర్స్ గిల్డ్’ మీటింగ్లో నిర్మాతలతో మాట్లాడి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని 11వ తేదీన, అల వైకుంఠపురములో చిత్రాన్ని 12న విడుదల చేయాలనుకున్నాం. అయితే కొన్ని పరిణామాల మధ్య ‘అల వైకుంఠపురములో’ జనవరి 10 లేదా 11న విడుదల అవుతుందని వార్తలు వచ్చాయి. దాంతో మరోసారి గిల్డ్లో చర్చలు జరిగాయి. పెద్ద సినిమాలు విడుదలవుతున్నప్పుడు అందరూ బావుండాలనే ఉద్దేశంతో ముందు అనుకున్న తేదీలకే సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలను ఒప్పించాం. ఇండస్ట్రీలో ఇలాంటి సమస్యలు వస్తే పరిష్కరించడానికి గిల్డ్ ముందుంటుంది. ఎందుకు కన్ఫ్యూజన్ వచ్చింది అనేది పక్కన పెడితే సమస్యను పరిష్కరించడమే గిల్డ్ టార్గెట్’’ అన్నారు. నిర్మాత రాజీవ్ రెడ్డి కూడా పాల్గొన్నారు. -
‘నో కన్ఫ్యూజన్.. చెప్పిన డేట్కే వస్తున్నారు’
-
‘నో కన్ఫ్యూజన్.. చెప్పిన డేట్కే వస్తున్నారు’
సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో’ వంటి భారీ చిత్రాలు సంక్రాంతి బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు చిత్రాలపై సినీ ప్రేక్షకుల్లో హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఈ చిత్రాలకు సంబంధించిన టీజర్లు, పాటలు కూడా ఓ రేంజ్లో ఉన్నాయి. అయితే సంక్రాంతి రేసులో నువ్వా-నేనా అన్నట్లు ఉన్న ఈ చిత్రాల విడుదల తేదీపై గందరగొళం ఏర్పడింది. ముందుగా అనుకున్న ప్రకారం జనవరి 11న మహేశ్ సినిమా, జనవరి 12న బన్ని చిత్రం విడుదల కావాలి. అయితే న్యూఇయర్ విషెస్ తెలుపుతూ రిలీజ్ చేసిన ‘అల.. వైకుంఠపురములో’ చిత్ర పోస్టర్లో రిలీజ్ డేట్ కనిపించలేదు. అయితే ఈ సినిమా విడుదల తేదీని మార్చాలని నిర్మాతలు భావించారని దీంతో బన్ని మూవీ కూడా జనవరి 11నే వస్తుందని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరిగింది. దీంతో అటు సూపర్ స్టార్.. ఇటు బన్ని అభిమానుల్లో ఆయోమయం ఏర్పడింది. దీంతో ఇరు చిత్రాల నిర్మాతలు కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యను పరిష్కరించుకున్నారు. ముందుగా అనుకున్న ప్రకారమే జనవరి 11న ‘సరిలేరు నీకెవ్వరు’ , 12న అల.. వైకుంఠపురములో రిలీజ్ అవుతున్నట్లు ఇరు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దీంతో అభిమానుల్లో కన్ఫ్యూజన్ వీడింది. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘సమస్య సాల్వ్ అయింది. ముందు అనుకున్న డేట్స్ ప్రకారమే సరిలేరు నీకెవ్వరు (జనవరి 11న), అల.. వైకుంఠపురములో (జనవరి12న) సినిమాలు వస్తున్నాయి. ఈ రెండింటితో పాటు మరో నాలుగు సినిమాలు సంక్రాంతికి వస్తున్నాయి. అన్నీ బాగా ఆడాలి’ అని దిల్ రాజు ఆకాంక్షించాడు. ‘అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. ఈ సమస్యను ప్రొడ్యూసర్స్ గిల్డ్స్ పరిష్కరించింది. . అందరూ కన్వీన్స్ అయ్యారు. హ్యపీగా వారు ముందనుకున్న ప్రకారమే ఆ రెండు సినిమాలు విడుదల కానున్నాయి’అని మరో నిర్మాత దామోదర ప్రసాద్ పేర్కొన్నారు. ఇక రిలీజ్ తేదీపై ఏర్పడిన ఈ సమస్యకు ప్రొడ్యూసర్స్ గిల్డ్స్లో పరిష్కారం లభించింది. చదవండి: ‘సామజవరగమన’.. మరింత ‘అందం’గా! ‘డీజే దించుతాం.. సౌండ్ పెంచుతాం’ -
అవకాశాలు ముఖ్యం కాదు
సినిమా: నాకు అవకాశాలు ముఖ్యంకాదు అని చెప్పుకొచ్చింది నటి రష్మిక. టాలీవుడ్లో చాలా తక్కువ కాలంలో ఎక్కువ క్రేజ్ను సంపాధించుకున్న కన్నడ నటి ఈ బ్యూటీ. తొలి రోజుల్లోనే ప్రేమలో ఓలలాడడం, విడిపోవడం వంటి వాటితో వార్తల్లోకి ఎక్కిన రష్మిక ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తోంది. నిజానికి తెలుగులో ఈ అమ్మడు నటించిన నాలుగే చిత్రాలు తెరపైకి వచ్చాయి. వాటిలో ఛలో చిన్న చిత్రంగా విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది. ఆ తరువాత నటించిన గీతాగోవిందం చిత్రమే రష్కిక కేరీర్ను పెద్ద మలుపు తిప్పింది. ఆ తరువాత నటించిన డియర్ కామ్రేడ్, దేవదాస్ చిత్రాలు యావరేజ్గానే ఆడాయి. అయినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం మహేశ్బాబుతో నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఇక తమిళంలో డియర్ కామ్రేడ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం పెద్దగా ఆడక పోయినా రష్మికకు ఇక్కడ కార్తీతో సుల్తాన్ చిత్రంలో నటించే లక్కీ ఛాన్స్ వరించింది. ఈ చిత్రం కనుక హిట్ అయితే కోలీవుడ్లోనూ ఈ అమ్మడికి పట్ట పగ్గాలుండవు. కాగా ఇటీవల నటి రష్మిక ఒక భేటీలో పేర్కొంటూ విజయం ఎప్పుడూ ఉత్సాహాన్నిస్తుందన్నారు. అలాగని హిట్ అయిన చిత్రాలను, ప్లాప్ అయిన చిత్రాలను తాను వేర్వేరుగా చూడనని చెప్పింది. తనకు రెండూ సమానమేనని అంది. వాస్తవానికి సక్సెస్ అయిన చిత్రాల కారణంగా మరిన్ని అవకాశాలు రావచ్చునని, ఇంకా బాగా డబ్బు సంపాధించుకోవచ్చునని అంది. అయితే తన దృష్టిలో డబ్బు, అవకాశాలు ముఖ్యం కాదని అంది. ఆ చిత్రాల్లో తన శ్రమ ఎంత? వాటి ద్వారా ఏం నేర్చుకున్నాను అన్నదే ముఖ్యం అని చెప్పింది. సరైన ఫలం చేకూరలేదంటే మన శ్రమ వృథా అయ్యిందనే బాధ ఉంటుందని అంది. అయితే అవి నేర్పించిన విషయాలతో మనసును సర్ధి చెప్పుకోవాలని చెప్పుకోవాలంది. ఇకపోతే పారితోషికం విషయంలో హీరోహీరోయిన్ల మధ్య తారతమ్యాలు ఉండవచ్చునేమోగానీ, ఫలితాలు హీరోలపై ఎంత ప్రభావం చూపుతాయో, అంత ప్రభావాన్నీ హీరోయిన్లపై చూపుతాయని చెప్పింది. ఒక్కో సమయంలో హీరోలను మాత్రమే ఎక్కువ బాధించే అవకాశం ఉంటుందని రష్మిక చెప్పుకొచ్చింది. అయినా ఈ సక్సెస్, ప్లాప్ల గొడవ ఇప్పుడెందుకు ప్రస్థావిస్తుందో? భవిష్యత్లో ప్లాప్లు వస్తాయనే ముందు జాగ్రత్తలో భాగంగా రిష్మిక ఇలా ఏకరువు పెట్టడం లేదు కదా! ఏదేమైనా వినేవాళ్లుంటే ఏదైనా చెబుతారిలాంటోళ్లు. -
అంతా రెడీ
ఎప్పటిలాగే ఈ సంక్రాంతి పండగ ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి ముస్తాబు అవుతోంది. సినిమాలు కూడా రెడీ అవుతున్నాయి. పండగ బరిలో ఉన్న ‘సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో’ చిత్రాల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. మహేశ్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటించారు. రాజేంద్ర ప్రసాద్, విజయశాంతి, ప్రకాష్రాజ్ కీలక పాత్రలు చేశారు. ‘దిల్’ రాజు సమర్పణలో అనిల్ సుంకర, మహేశ్బాబు నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయి. యు/ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమా నిడివి 2గంటల 46 నిమిషాలని తెలిసింది. ఇక ‘జులాయి (2012), సన్నాఫ్ సత్యమూర్తి (2015)’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. ఇందులో పూజాహెగ్డే కథానాయికగా నటించారు. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్, మురళీ శర్మ, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి కూడా యు/ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ చిత్రం నిడివి 2గంటల 36 నిమిషాలని తెలిసింది. ఈ రెండు చిత్రాలు కాకుండా పండగకి సందడి చేయబోతున్న చిత్రాలు మూడు నాలుగు వరకూ ఉన్నాయి. -
ఈ కటౌట్కు సాటి లేదు!
-
ఈ కటౌట్కు సాటి లేదు!
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్బాబు తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ సినిమా ప్రిరీలిజ్ వేడుకను ఈనెల 5న ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అప్పుడే ధియేటర్ల వద్ద అభిమానుల సందడి మొదలైంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పెట్టిన మహేశ్బాబు 50 అడుగుల కటౌట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని వెంకట పద్మావతి ధియేటర్ వద్ద పెట్టిన కటౌట్లు కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల పాటు ఒడిశాలోనూ ప్రచారం పర్వం ఊపందుకోవడం విశేషం. అందరినీ అలరించేలా సినిమా ఉంటుందని చిత్రయూనిట్ నమ్మకంగా చెబుతోంది. -
సెన్సార్ పూర్తిచేసుకున్న ‘సరిలేరు నీకెవ్వరు’
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. గురువారం సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రాన్ని వీక్షించి ఎలాంటి సీన్లు కట్ చేయకుండా యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారని చిత్ర బృందం ప్రకటించింది. దాదాపు 160 నిమిషాల నిడివి గల ఈ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ అందరినీ ఆకట్టుకునేవిధంగా, మహేశ్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు తెరకెక్కించారని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా మహేశ్-అనిల్ రావిపూడి కాంబినేషన్లో బ్లాక్బస్టర్ హిట్గా ‘సరిలేరు నీకెవ్వరు’ నిలవడం ఖామయని జోస్యం చెబుతున్నారు. మామూలుగానే మహేశ్ సినిమా అంటే అభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. ఈ అంచనాలకు తోడు ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్లతో సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇక ఈ చిత్రంతో టాలీవుడ్ లేడీ సూపర్స్టార్ విజయశాంతి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో విజయశాంతి పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, సంగీత, కౌముది తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. అనిల్ సుంకర, ‘దిల్’ రాజు, మహేశ్బాబు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది. చదవండి: ‘డీజే దించుతాం.. సౌండ్ పెంచుతాం’ నెట్టింట్లో రచ్చరచ్చ.. దేవిశ్రీనా మజాకా! -
సరిలేరు నీకెవ్వరు
-
పండక్కి మరో పండగలా మా సినిమా ఉంటుంది
మహేశ్ హోస్ట్ చేస్తున్న ఫంక్షన్కు మెగాస్టార్ చిరంజీవిగారు అతిథిగా వస్తున్నారు. అందుకే మా ప్రీ–రిలీజ్ వేడుకను ‘మెగాసూపర్ ఈవెంట్’ అంటున్నాం. ఇటీవల జరిగిన మహేశ్ ఫ్యాన్స్ ఫొటోషూట్ మొదటిరోజు మేం ఊహించినదానికంటే చాలా ఎక్కువమంది అభిమానులు వచ్చారు. దాంతో చిన్న తొక్కిసలాట చోటు చేసుకుంది. తర్వాతి రోజు కార్యక్రమం సజావుగా సాగింది. చిరంజీవి, మహేశ్గార్ల క్రేజ్ని దృష్టిలో ఉంచుకునే మెగాసూపర్ ఈవెంట్కు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పోలీసుల సహకారం ఉంది. ►మహేశ్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మికా మందన్నా కథానాయికగా నటించారు. అనిల్ సుంకర, ‘దిల్’ రాజు, మహేశ్బాబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో అనిల్ సుంకర చెప్పిన విశేషాలు. మహేశ్బాబుగారితో నేను అసోసియేట్ అయిన నాలుగో చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. 2019 జూలై 5న ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాం. దాదాపు 140 రోజులు షూటింగ్ చేశాం. కశీ్మర్ షెడ్యూల్ అద్భుతంగా ముగిసింది. మాకు మంచి సపోర్ట్ లభించింది. అందుకే అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయగలుగుతున్నాం. ఈ చిత్రంలోని ట్రైన్ ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుం ది. సంక్రాంతికి విడుదల చేయాలని టీమ్ అందరూ కష్టపడి పనిచేశారు. ఈ సినిమాను నిరి్మంచినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా. ►ఇదివరకు సోల్జర్స్ బ్యాక్డ్రాప్లో వచి్చన సినిమాలకు ఈ చిత్రం భిన్నంగా ఉంటుంది. ఇప్పటివరకు వెండితెరపై రాని, మనం ఊహించని కథ ఇది. కర్నూలు ‘కొండారెడ్డి బురుజు’ సెట్ సన్నివేశాలను కథలో భాగంగానే షూట్ చేశాం. ‘ఒక్కడు’ సినిమాతో ఈ సీన్స్కు ఏ పోలిక ఉండదు. మహేశ్బాబుగారి కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ హిట్స్గా ఈ సినిమా నిలిచిపోతుందన్న నమ్మకం ఉంది. ఈ సినిమా మహేశ్ ఫ్యాన్స్కు పెద్ద పండగలా, ఈ సంక్రాంతి పండక్కి మరో పండగలా ఉంటుంది. ►మహేశ్ యాక్టింగ్లో మరో యాంగిల్ చూస్తారు. మేజర్ అజయ్కృష్ణ పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. మహేశ్ క్యారెక్టర్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. ఆడియన్స్ థ్రిల్ అవుతారు. దాదాపు 13ఏళ్ల తర్వాత విజయశాంతిగారు నటించారు. ఈ చిత్రంలో మహేశ్–విజయశాంతి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. వీరిద్దరూ స్క్రీన్పై ఉన్నప్పుడు ప్రేక్షకులు ఈలలు వేస్తారు. చప్పట్లు కొడతారు. ఈ రెండూ చేయనప్పుడు కన్నీళ్లు పెడతారు. ►కథలో ఎంటర్టైన్మెంటే కాదు మంచి ఎమోషన్ కూడా ఉంది. అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్ సినిమాలే కాదు మరో రకమైన సినిమాలు కూడా తీయగలడని ఈ సినిమాతో నిరూపితమవుతుంది. అలా అని సినిమాలో వినోదం లేదని కాదు. అనిల్ డైరెక్షన్లో కొత్త కోణాన్ని చూస్తారు. దేవిశ్రీప్రసాద్ మంచి సంగీతం అందించారు. విజువల్స్ పరంగా పాటలకు ఇంకా మంచి స్పందన వస్తుంది. ఈ సినిమాకు ‘దిల్’ రాజు సమర్పకులుగా ఉండటం ప్లస్ పాయింట్. డిస్ట్రిబ్యూషన్కు మరింత హెల్ప్ అవుతుంది. తొలుత ఈ సినిమాను జనవరి 12న రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సలహా మేరకు జనవరి 11న విడుదల చేస్తున్నాం. -
‘డీజే దించుతాం.. సౌండ్ పెంచుతాం’
దేవిశ్రీ ప్రసాద్ అదిరే బీట్ ఇవ్వగా.. రామజోగయ్యశాస్త్రి పార్టీ సాంగ్కు కావాల్సిన లిరిక్స్ అందించగా.. నకాష్ అజీజ్, లవిత లోబో సూపర్ ఎనర్జీతో పాటను ఆలపించగా.. శేఖర్ మాస్టర్ కొత్త స్టెప్పులు కంపోజ్ చేయగా.. మహేశ్-తమన్నాలు అదిరిపోయే డ్యాన్స్లతో పిచ్చెక్కించారు. ఇది కదా అసలు సిసలు మహేశ్ బాబు ఫ్యాన్స్ కోరుకునేది. న్యూఇయర్ కానుకగా మహేశ్ ఫ్యాన్స్కు కావాల్సిన ఫుల్ ధూంధాం సాంగ్ వచ్చేసింది. ఇక డాంగ్ డాంగ్ పార్టీ సాంగ్తో బ్యాంగ్ బ్యాంగ్ అంటూ న్యూఇయర్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి రెడీ అవుతున్నారు సరిలేరు నీకెవ్వరు టీం. మహేశ్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈచిత్రాన్ని రామబ్రహ్మం సుంకర, ‘దిల్’ రాజు, మహేశ్బాబులు నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలవుతున్న ఈ చిత్రంపై హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే విడుదలైన సినిమా పాటలు, టీజర్తో అంచనాలు పీక్స్కు తీసుకెళ్లాయి. తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి చివరి లిరికల్ సాంగ్ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తుండగా.. తాజాగా ఫుల్ లిరికల్ సాంగ్ను కొద్దిసేపటి క్రితమే చిత్ర బృందం విడుదల చేసింది. ‘డీజే దించుతాం.. సౌండ్ పెంచుతాం’, ‘లెట్స్ పార్టీ విత్ దిస్ సాంగ్.. గుర్తుండిపోవాలి లైఫ్ లాంగ్’, ‘వాటే స్కిన్ టోను.. నచ్చావే గ్లామర్ క్వీన్.. నిన్ను చూసి దిల్ మె గిర్రుమంది రొమాంటిక్ టోను’, ‘నువ్వు పక్కనున్న కిక్కు చాలు అదే చంద్రయాను’ అంటూ పాటలో వచ్చే లిరిక్స్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పాటతో సంగీత అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. ఇక దాదాపు దశాబ్దం తర్వాత ఈ సినిమాతో లేడీ సూపర్స్టార్ విజయశాంతి రీఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. రాజేంద్రప్రసాద్, ప్రకాష్రాజ్, సంగీత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటోంది. మహేశ్ కూడా తన పాత్రకు డబ్బింగ్ చెప్పేశాడు. -
అది ఐటమ్ సాంగ్ కాదు : మహేశ్బాబు
సూపర్స్టార్ మహేశ్బాబు, రష్మికా మందన్నా జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. డిసెంబర్లోని ప్రతి సోమవారం ఈ చిత్రంలోని ఒక్కో పాట విడుదల చేస్తూ వస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో చివరి పాట ‘డాంగ్ డాంగ్’ సాంగ్ వీడియో ప్రోమోను విశాఖ ఉత్సవ్ వేదికగా విడుదల చేశారు. ఈ సాంగ్లో మహేశ్, తమన్నాల డ్యాన్స్ హైలెట్గా నిలిచింది. ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వస్తోంది. అయితే ఈ వీడియోపై మహేశ్ స్పందిస్తూ.. ‘మా డైరక్టర్ చెప్పినట్టు ఇది ఐటమ్ సాంగ్ కాదు.. ఇది పార్టీ సాంగ్’ అని మహేశ్ పేర్కొన్నారు. ఎప్పటిలాగే దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ అందించారని పేర్కొన్నారు. ఈ సినిమాతో లేడీ సూపర్స్టార్ విజయశాంతి చాలా రోజుల తరువాత వెండితెరపై రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేశ్బాబు నిర్మించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జనవరి 5న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రాబోతున్నారు. -
విశాఖ ఉత్సవ్లో ‘సరిలేరు నీకెవ్వరు’ సందడి
-
బాబా సన్నిధిలో మహేశ్బాబు
సూపర్స్టార్ మహేశ్బాబు షిర్టీ సాయిబాబాను దర్శించుకున్నారు. ఫ్యామిలీతో కలిసి షిర్డీ వెళ్లిన మహేశ్.. బాబా ఆశీస్సులు తీసుకున్నారు. వారి వెంట దర్శకుడు మెహర్ రమేశ్ కూడా ఉన్నారు. త్వరలో మహేశ్ తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే తన పాత్రకు డబ్బింగ్ చెప్పేసిన మహేశ్.. వారం రోజుల పాటు ఫ్యామిలీతో గడపాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన షిర్డీ ఆలయానికి వెళ్లారు. అలాగే మరో వారం రోజుల తర్వాత మహేవ్.. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషన్స్తో బిజీ అయిపోతారు. మహేశ్బాబు సరసన రష్మికా మందన్నా నటించిన ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర చేశారు. హైదరాబాద్లో జనవరి 5న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ వేడుక జరగనుంది. ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేశ్బాబు నిర్మించిన ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది. -
నెట్టింట్లో రచ్చరచ్చ.. దేవిశ్రీనా మజాకా!
దేవిశ్రీప్రసాద్ మరోసారి తన మ్యాజిక్ చూపించాడు. పార్టీ సాంగ్లకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే ఈ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ తాజాగా మరోసారి తన మార్క్ పార్టీ సాంగ్తో దుమ్ములేపాడు. ఇప్పటివరకు ఎన్నో ఐటమ్, పార్టీ సాంగ్లను అందించిన దేవి తాజాగా ‘డాంగ్ డాంగ్’ సాంగ్తో ముఖ్యంగా యూత్ను ఉర్రూతలూగిస్తున్నాడు. టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. డిసెంబర్లో ప్రతి సోమవారం ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ ఇప్పటివరకు నాలుగు పాటలను రిలీజ్ చేసింది. చివరి పాటను రేపు(సోమవారం) విడుదల చేయనున్నారు. అయితే ఈ పాటకు సంబంధించిన చిన్న వీడియో ప్రోమోను శనివారం సాయంత్రం విడుదల చేశారు. ఈ వీడియోలో మహేశ్, తమన్నాల డ్యాన్స్ హైలెట్గా నిలిచింది. పాట ఎంత బాగుందో అంతకుమించి డ్యాన్స్ ఫార్మెషన్స్, మహేశ్-తమన్నాల స్టెప్పులు అదిరిపోయాయి. దీంతో ప్రస్తుతం ఆ చిన్న వీడియో ప్రోమో నెట్టింట్లో రచ్చరచ్చ చేస్తోంది. దేవిశ్రీ ఈజ్ బ్యాక్ అని కొందరు కామెంట్ చేస్తుండగా.. మహేశ్-తమన్నాలు స్టెప్పులు సూపర్బ్ అంటూ మరికొందరు పేర్కొంటున్నారు. ఈ ప్రోమో విడుదల సందర్భంగా అనిల్ రావిపూడి ఓ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సరిలేరు నీకెవ్వరు పాటలను ఇంత బాగా ఆదరించిన ప్రేక్షకులందరికీ మా కృతజ్ఞతలు. అలాగే దేవిశ్రీప్రసాద్కు నా స్పెషల్ థ్యాంక్స్. చాలా మంచి పాటలు ఇచ్చారు. ఈ నెలలో ప్రతీ సోమవారం ఒక్కొపాటతో మీ ముందుకు వచ్చాం. ప్రతీ పాటను మీరు అద్భుతంగా రిసీవ్ చేసుకుని, టిక్టాక్లలో వీడియోలు చేస్తూ ట్రెండ్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే గత సోమవారం వచ్చిన డిఫరెంట్ ఆంథమ్ సాంగ్ను కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ సోమవారం ఆల్బమ్లో చివరి పాటగా ఓ పార్టీ సాంగ్ రాబోతుంది. కొంతమంది సినీ స్టార్స్ను తీసుకెళ్లి, ఆర్మీతో ఇంట్రాక్ట్ చేయిస్తుంటారు. దానిని స్పూర్థిగా తీసుకుని ఈ సినిమాలో తమన్నా కూడా ఓ సినీ స్టార్గా వచ్చి ఆర్మీతో కలిసి సందడి చేస్తారు. ఇది కేవలం సరదా పాట మాత్రమే. ఐటమ్ సాంగ్ కాదు. ఈ పాట కూడా మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తున్నా. ఈ ఏడాది సంక్రాంతికి ‘ఎఫ్2’ తో మంచి విజయాన్ని అందించారు. రాబోయే సంక్రాంతికి అంతే వినోదంతో మహేశ్బాబు సరికొత్త పాత్రతో అలరించబోతున్నారు’అంటూ అనిల్ రావిపూడి ఆ వీడియోలో పేర్కొన్నాడు. Director @AnilRavipudi about the blockbuster #MassMBMonday's and the power packed party song #DaangDaang 🤙🏼 Daang Daang Song Promo will be launched today at Visakha Utsav 🔥 Super⭐@urstrulyMahesh @AnilSunkara1 @ThisIsDSP @tamannaahspeaks @RathnaveluDop @ramjowrites pic.twitter.com/0ZR085gGbR — AK Entertainments (@AKentsOfficial) December 28, 2019 మహేశ్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈచిత్రాన్ని రామబ్రహ్మం సుంకర, ‘దిల్’ రాజు, మహేశ్బాబులు నిర్మించారు. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్ పోస్టర్, టీజర్, పాటలతో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. దాదాపు దశాబ్దం తర్వాత ఈ సినిమాతో లేడీ సూపర్స్టార్ విజయశాంతి రీఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. రాజేంద్రప్రసాద్, ప్రకాష్రాజ్, సంగీత తదితరలు నటిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ పొడక్షన్స్ పనులు జరుపుకుంటోంది. మహేశ్ కూడా తన పాత్రకు డబ్బింగ్ చెప్పేశాడు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురాబోతుంది. చదవండి: జనవరి 5న కలుస్తానంటున్న రష్మిక సూపర్స్టార్ ఈవెంట్కు మెగాస్టార్ -
విశాఖకు సినీ పరిశ్రమ
మహారాణిపేట(విశాఖ దక్షిణ): విశాఖకు సినీ పరిశ్రమ రావాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయమని రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ ఉత్సవ్లో భాగంగా మహేష్బాబు నచించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఓ పాటను మంత్రి శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశాఖలో సినీ పరిశ్రమ రావడానికి అన్ని మౌలిక సదుపాయాలు, ప్రాంతాలు, పర్యాటక అందాలు ఉన్నాయన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే అన్నెంరెడ్డి అదీప్రాజ్ మాట్లాడుతూ సరిలేరు నీకెవ్వరు సినిమా విజయవంతం కావాలని కోరారు. నిర్మాత అనిల్ సుంకరి మాట్లాడుతూ ఈ సినిమాను జనవరి 11న విడుదల చేస్తున్నామన్నారు. విశాఖ ఉత్సవ్ పురస్కరించుకుని సి నిమాలో ఓ పాటను విడుదల చేసినట్టు తెలిపారు. నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ భీమిలి, అరకు తదితర ప్రాంతాల్లో అందాలు ఎంతో అద్భుతంగా ఉంటాయన్నారు. నిర్మాత శిరీష్, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, నాయకులు కొయ్య ప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. అలరించిన దేవిశ్రీ ఆట.. పాట విశాఖ ఉత్సవ్ భాగంగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీత విభావరి అలరించింది. పాటలు పాడి.. స్టెప్పులు వేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ప్రముఖ యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించి, కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించారు. ప్రధాన వేదికపై ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. శ్రావ్య, మానస, ధర్మేష్ నృత్యాలు బాగా నచ్చాయి. -
చిన్న బ్రేక్
ఒక సినిమా చేసేటప్పుడు వర్క్ మూడ్లో ఉండే మహేశ్బాబు అది పూర్తి కాగానే హాలిడే మూడ్లోకి వెళ్లిపోతారు. ఇప్పుడు ఆ మూడ్లోనే ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ ఇటీవల పూర్తయింది. ఆ వెంటనే తన పాత్రకు డబ్బింగ్ చెప్పేశారు మహేశ్. దాంతో రిలీఫ్ అయిపోయారు. ఫ్యామిలీతో చిన్న హాలిడే ట్రిప్ ప్లాన్ చేశారని సమాచారం. జస్ట్ వారం రోజులు ఫ్యామిలీతో రిలాక్స్ అయి, ఆ తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషన్స్తో బిజీ అయిపోతారు. మహేశ్బాబు సరసన రష్మికా మందన్నా నటించిన ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర చేశారు. హైదరాబాద్లో జనవరి 5న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ వేడుక జరగనుంది. ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేశ్బాబు నిర్మించిన ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది. -
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా స్టిల్స్
-
తమన్నా వచ్చేది ‘మైండ్ బ్లాక్’లో కాదు
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు హీరోగా క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుపుకుటుంది ఈ చిత్రం. అయితే మహేశ్ బాబు ఫ్యాన్స్కు న్యూఇయర్ కానుకగా ఓ సూపర్ గిప్ట్ ఇచ్చేందుకు చిత్ర బృందం భారీ ప్లాన్ చేస్తోంది. డిసెంబర్ 30(సోమవారం)న డాంగ్ డాంగ్ అంటూ సాగే పార్టీ సాంగ్ను విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా ఈ పార్టీ సాంగ్కు సంబంధించిన ప్రోమోను శనివారం సాయంత్రం 07:02 గంటలకు విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. కాగా, ఈ పాటలో మహేశ్తో కలిసి మిల్కీ బ్యూటీ తమన్నా డ్యాన్స్ చేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఇటీవలే ఈ పాట షూటింగ్ కూడా పూర్తయిందని టాక్. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’లో తమన్నా ఓ ఐటమ్ సాంగ్ చేయనుందని షూటింగ్ ప్రారంభంనుంచి వార్తలు వస్తున్నాయి. అయితే తొలుత విడుదలైన ‘మైండ్బ్లాక్’పాటనే తమన్నా నటించిన ఐటమ్ సాంగ్ అని అందరూ భావించారు. కానీ తాజాగా విడుదల చేసిన పోస్టర్ ప్రకారం తమన్నా నర్తించింది ఈ పాటలోనే అని స్పష్టమైంది. ఇక ‘పర్ఫెక్ట్ పెయిర్..పర్ఫెక్ట్ మూవీ..బ్లాస్ట్ మ్యూజిక్.. కంప్లీట్ విజువల్ ట్రీట్.. పండగ మూడ్రోజుల ముందే వస్తోంది’అంటూ రామజోగయ్య శాస్త్రి ట్వీట్ చేశారు. ఇప్పటికే విడుదలైన పాటలతో దేవిశ్రీ ప్రసాద్ తన మార్క్ చూపించుకోగా.. తాజాగా పార్టీ సాంగ్తో సంగీత శ్రోతలను ఉర్రూతలూగించేందుకు సిద్దమయ్యాడు. గత సోమవారం విడుదలైన ‘హీ ఈజ్ సో క్యూట్’నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలోని 5 పాటలను వారానికి ఒకటి చొప్పున 5 సోమవారాలు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. రామబ్రహ్మం సుంకర, ‘దిల్’ రాజు, మహేశ్బాబు నిర్మించిన ఈ చిత్రంలో విజయశాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. చదవండి: అమితాబ్ ఫస్ట్.. టాప్-10లో మహేష్ మన దగ్గర బేరాల్లేవమ్మా...: మహేశ్ THE.....PARTY SONG DAANG DAANG ...promo Today 7:02pm 🔥🔥🔥🔥 The perfect pair..perfect moves..blast music..complete visual treat👍 పండగ మూడ్రోజులు ముందే వస్తాంది 💕 Super⭐@urstrulyMahesh @AnilRavipudi @AnilSunkara1 @SVC_official @ThisIsDSP @tamannaahspeaks @RathnaveluDop pic.twitter.com/BalmFuBrhi — Ramajogaiah Sastry (@ramjowrites) December 28, 2019 -
మహేశ్ అభిమానుల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: సినీ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్పై హీరో మహేశ్బాబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరో మహేశ్బాబుతో ఫొటో దిగడానికి రమ్మని తమను తీవ్రంగా అవమానించారని మండి పడుతున్నారు. స్టార్ హీరోకు తగినట్టుగా ఏర్పాట్లు చేయలేదని వాపోయారు. మహేశ్బాబుతో ఫొటో దిగాలనుకుంటే గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీకి రావాలని నిర్వాహకులు ఆన్లైన్లో ప్రచారం చేయడంతో తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో తోపులాట జరిగి పలువురు అభిమానులు గాయపడ్డారు. ఇద్దరికి కాళ్లు విరిగినట్టు తెలుస్తోంది. బౌన్సర్లు దురుసుగా వ్యవహరించారని, తమపై చేయి చేసుకున్నారని ఫ్యాన్స్ ఆరోపించారు. తమను ఎందుకు కొట్టారో అర్థం కావడం లేదని వాపోయారు. అభిమానులను కొట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. రైళ్లో సీట్లు దొరక్కపోయినా రాత్రంతా ప్రయాణం చేసి 30 మందితో కలిసి వచ్చామని, ఇక్కడి వచ్చాక తమను కొట్టి తరిమేశారని ఒక అభిమాని వాపోయాడు. ఎవరి పైరవీలు వాళ్లవి జరుగుతున్నాయని ఆరోపించాడు. కార్యక్రమం రసాభాసగా మారడంతో బ్యారికేడ్లు విరిగిపోయాయి. కోపంతో అభిమానులు కుర్చీలు విరగొట్టారు. అయితే అనుమతి తీసుకుంటే భద్రతా ఏర్పాట్లు చేసేవాళ్లమని పోలీసులు చెబుతున్నారు. అనుమతి తీసుకోకుండా కార్యక్రమం చేపట్టిన నిర్వాహకులపై చందానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. (మహేశ్ ఫొటోషూట్లో తొక్కిసలాట..రభస) -
మహేశ్ ఫొటోషూట్లో తొక్కిసలాట..రభస
-
మహేశ్ ఫొటోషూట్లో తొక్కిసలాట..రభస
సాక్షి, హైదరాబాద్: సూపర్స్టార్ మహేశ్బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’.. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా బుధవారం గచ్చిబౌలిలోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీ వద్ద హీరో మహేశ్బాబుతో ఫ్యాన్స్ ఫొటోషూట్ను ఏర్పాటు చేశారు. చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే గచ్చిబౌలిలో ఈ ఫొటోషూట్ను ఏర్పాటుచేసినట్టు తెలుస్తోంది. అయితే, దీని గురించి తెలియడంతో మహేశ్బాబు అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. పలువురు అభిమానులు ఈ ఫొటోషూట్లో మహేశ్తో ఫొటోలు దిగినట్టు సోషల్ మీడియాలో, ట్విటర్లో వస్తున్న అప్డేట్స్ను బట్టి తెలుస్తోంది. అయితే, మహేశ్ అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఇక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకొని.. తీవ్ర గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఈ ఫొటోషూట్కు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో మహేశ్బాబు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమచారం. మహేశ్తో ఫొటోషూట్ పేరిట ఆన్లైన్లో పోస్టులు పెట్టిమరీ అభిమానుల్ని ఇక్కడికి రప్పించినట్టు తెలుస్తోంది. -
సైనికుడు గర్వపడేలా ‘సరిలేరు నీకెవ్వరు’ ఆంథమ్
-
సైనికుడు గర్వపడేలా ‘సరిలేరు నీకెవ్వరు’ ఆంథమ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిల్ సాంగ్ను సోమవారం సాయంత్రం విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలోని 5 పాటలను వారానికి ఒకటి చొప్పున 5 సోమవారాలు రిలీజ్ చేస్తామని ప్రకటించిన చిత్ర యూనిట్.. గత మూడు సోమవారాలు మూడు పాటలను విడుదల చేసింది. ఇప్పుడు అదే బాటలో మళ్ళీ ఈ సోమవారం (డిసెంబర్ 23) మరో పాటను ప్రేక్షకుల ముందుంచారు. సరిలేరు నీకెవ్వరు ఆంథమ్గా విడుదలైన ఈ పాట ఆర్మీ జవానుల గొప్పతనాన్ని చాటిచెప్పే విధంగా ఉంది. సైనికుల విలువలను గుర్తు చేస్తూ రూపొందించిన ఈ పాట ప్రతి ఒక్కరి మనసును కదిలించేదిగా ఉంది. ‘భగభగ మండే నిప్పుల వర్షం వచ్చినా.. జనగణమన అంటునే దూకేవాడె సైనికుడు’ అంటు సాగే ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ లిరిక్స్ అందించగా, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ఆలపించారు. ఈ పాట కోసం దేవిశ్రీ ప్రసాద్ యూరప్ వెళ్లి అక్కడి కళాకారులతో కంపోజ్ చేశాడు. ఎంతో అత్యద్భుతంగా సాగిన ఈ పాట యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిత్రంలో రష్మిక మండన్నకథానాయికగా నటించగా, లేడీ సూపర్స్టార్ విజయశాంతి, ప్రకాష్ రాజ్,రాజేంద్ర ప్రసాద్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. దేవీ శ్రీ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది. -
జనవరి 5న కలుస్తానంటున్న రష్మిక
మహేశ్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. తాజాగా రష్మిక తన పాత్రకు డబ్బింగ్ కూడా పూర్తిచేసింది. డబ్బింగ్ చెప్పే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ... తన ప్రస్తుత సినిమా షూటింగ్ పూర్తిచేసుకుందని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందని తెలిపింది. అందరిని ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జనవరి 5న కలుసుకుంటానని తెలిపింది. జనవరి 11న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ను వచ్చే ఏడాది జనవరి 5న భారీగా నిర్వహించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారు. రామబ్రహ్మం సుంకర, ‘దిల్’ రాజు, మహేశ్బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. Me before leaving to Rome 🐒😬 #SarileruNekkevvaru dubbing time! And now that's a wrap,, see you all soon on Jan 5th at the pre release event annndd get ready for this Sankranthi !😊♥️ #SarileruNeekevvaruOnJan11th @urstrulyMahesh @AnilRavipudi @ThisIsDSP @AKentsOfficial pic.twitter.com/AEJyaJcpkx — Rashmika Mandanna (@iamRashmika) December 22, 2019 -
పర్ఫెక్ట్ బర్త్ డే గిఫ్ట్
మహేశ్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటించారు. ఈ సినిమాలో తమన్నా ఓ ప్రత్యేక పాటకు డ్యాన్స్ చేశారు. శనివారం (డిసెంబరు 21) తమన్నా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ పాటలోని ఆమె లుక్ను విడుదల చేశారు. ఈ లుక్ని ఉద్దేశించి ‘పర్ఫెక్ట్ బర్త్డే గిఫ్ట్’ అని తమన్నా పేర్కొన్నారు. ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది. -
అతిథి
సూపర్స్టార్ మహేశ్బాబు ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రాబోతున్నారు. మహేశ్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటించారు. ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేశ్బాబు నిర్మించారు. జనవరి 5న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ వేడుకకు చిరంజీవి అతిథిగా రాబోతున్నారు. ‘మా ఆహ్వానాన్ని మన్నించి అతిథిగా వచ్చేందుకు అంగీకరించిన చిరంజీవిగారికి ధన్యవాదాలు’ అని మహేశ్బాబు పేర్కొన్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం జనవరి 11న విడుదల కానుంది. -
రామ్ చరణ్ కాదు.. చిరంజీవి!
సూపర్స్టార్ మహేష్బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇటీవలే సినిమా చిత్రీకరణ పూర్తి చేస్తున్న చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్, సాంగ్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. జనవరి 11న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ను భారీగా నిర్వహించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. దీని కోసం భారీ ఏర్పాట్లు చేయాలని, టాలీవుడ్కు చెందిన మరో అగ్ర హీరోను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని నిర్మాతలు భావిస్తున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. దీనిలో భాగంగా ఈ ఈవెంట్ అప్డేట్ కోసం సినీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా లాండ్ మార్క్ అనౌన్స్మెంట్కు సిద్ధంకండి అంటూ దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా పేజ్లో ఓ పోస్ట్ చేశారు. దీంతో అభిమానుల్లో ఈ అనౌన్స్మెంట్ మరింత ఆసక్తిని పెంచింది. కాగా ఈ ప్రకటన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు రానున్న ముఖ్య అతిథి గురించే అయ్యుంటుందని.. ఫంక్షన్కు రామ్ చరణ్ అతిథిగా రానున్నారని అందరూ ఊహించారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్కు రానున్న అతిథి విషయంలో మహేష్ క్లారిటీ ఇచ్చారు. జనవరి 5న జరగనున్న వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్లు మహేష్ బాబు కన్ఫర్మ్ చేశారు. ఈ విషయాన్ని తన ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్కు వచ్చేందుకు అంగీకరించిన చిరంజీవి గారికి ధన్యవాధాలు. మీరు విచ్చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ రాకతో మా ఆనందం రెట్టింపు అయ్యింది. మిమ్మల్ని కలవడానికి ఎంతోగానో ఎదురు చూస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశారు. #SarileruNeekevvaru pre-release event on JAN 5th! pic.twitter.com/cXkf1Wj1nG — Mahesh Babu (@urstrulyMahesh) December 20, 2019 -
తన డాన్స్తో మరోసారి అదరగొట్టిన బేబీ సితార
-
మళ్లీ అదరగొట్టిన బేబీ సితార
సితార.. సినిమా ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. సూపర్స్టార్ మహేష్ కూతురుగా అందరికి సుపరిచితురాలైన లిటిల్ క్వీన్ సితార చిన్నతనంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటుంది. తన టాలెంట్తో ఇప్పటికే స్టార్ అవుతున్న బేబీ సితార డిస్నీ సంస్థ తరఫున తెలుగులో వస్తున్న మూవీ ఫ్రాజెన్-2కు గొంతును అందిస్తున్న విషయం తెలిసిందే. అలాగే బాహుబలి-2 సినిమాలోని ‘కన్నా నిదురించరా.. నా కన్నా నిదురించరా’..పాటకు స్టెప్పులేసిన సితార తాజాగా తండ్రి నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని పాటకు చిందులు వేసింది. ‘‘హి ఈజ్ సో క్యూట్’’ అంటూ తన చిన్ని చిన్ని స్టేప్పులతో పాటను అదరగొట్టింది. ఈ పాటలోని సితార స్టెప్పులు మహేష్బాబు అభిమానుల చేత అదుర్స్ అనిపిస్తున్నాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. కమర్షియల్ ఎంటర్టైనర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న మహేష్కు జోడిగా నటిస్తోంది. దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ స్వయంగా నిర్మిస్తున్నఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన మూడు పాటలు సూపర్ టాక్ సంపాదిస్తుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నారు. -
పాటతో ప్యాకప్
మహేశ్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటించారు. రాజేంద్రప్రసాద్, విజయశాంతి, ప్రకాష్రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. దీంతో షూటింగ్కు చిత్రబృందం గుమ్మడికాయ కొట్టింది. హైదరాబాద్లో వేసిన ఓ ప్రత్యేకమైన సెట్లో చిత్రీకరించిన ‘మైండ్ బ్లాక్..’ పాటతో సినిమా పూర్తయిందని తెలిసింది. ‘‘ఈ ఏడాది జూలై 5న ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించి, డిసెంబరు 18న ముగించాం. ఈ సినిమా షూటింగ్ మంచి ప్రయాణంలా సాగింది’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేశ్బాబు నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి11న సంక్రాంతికి విడుదల కానుంది. -
ఇట్స్ ప్యాకప్ టైమ్..
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా విడుదలవ్వనున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ నేటితో ముగిసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి మూడు పాటలు విడుదలవ్వగా.. వాటికి విశేషమైన స్పందన వచ్చింది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి. ‘జూలై 5న షూటింగ్ ప్రారంభించాం.. డిసెంబర్ 18న ముగించాం. ఈ సంక్రాంతి సినీ ప్రేమికులకు, అభిమానులకు జ్ఞాపకంగా మిగిలిపోతుంద’ని అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. అలాగే నేడు నిర్మాత దిల్ రాజు జన్మదినం సందర్భంగా సరిలేరు నీకెవరు చిత్ర యూనిట్ ఆయనతో కేక్ కట్ చేయించారు. మహేశ్బాబు, రష్మికా మందన్నా జంటగా నటించిన ఈ చిత్రంలో విజయశాంతి, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. రామబ్రహ్మం సుంకర, ‘దిల్’ రాజు, మహేశ్బాబు నిర్మించిన ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది. -
‘సరిలేరు నీకెవ్వరు’మూడో పాట వచ్చేసింది
-
‘హి ఈజ్ సో క్యూట్’ అంటూ మహేష్ను ఆడుకుంటున్న రష్మిక
మహేశ్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని మూడో పాటని సోమవారం సాయంత్రం విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలోని 5 పాటలను వారానికి ఒకటి చొప్పున 5 సోమవారాలు రిలీజ్ చేస్తామని ప్రకటించిన చిత్ర యూనిట్.. గత రెండు సోమవారాలు రెండు పాటలను విడుదల చేసింది. ఇప్పుడు అదే బాటలో మళ్ళీ ఈ సోమవారం (డిసెంబర్ 16) మరో పాటను ప్రేక్షకుల ముందుంచారు. ‘హి ఈజ్ సో క్యూట్..’ అంటూ సాగిపోతున్న ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా, మధుప్రియ ఆలపించింది. మహేష్ బాబు అందాన్ని పొగుడుతూ సాగుతున్న ఈ పాట ‘ప్రిన్స్’ ఫ్యాన్స్లో జోష్ను నింపుతోంది. మహేష్ను ఆటపట్టిస్తూ రష్మిక వేస్తున్న స్టెప్పులు అదుర్స్ అనిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకి తోడు ఈ సాంగ్ కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిత్రంలో రష్మిక మండన్నకథానాయికగా నటించగా, లేడీ సూపర్స్టార్ విజయశాంతి, ప్రకాష్ రాజ్,రాజేంద్ర ప్రసాద్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. దేవీ శ్రీ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది. -
మహేష్ ఫ్యాన్స్కు మరో గుడ్ న్యూస్
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్. ‘సరిలేరు నీకెవ్వరు’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ, వేదిక ఖరారయ్యాయి. సినిమా విడుదలకు సరిగ్గా ఆరు రోజుల ముందు అంటే జనవరి 5న ‘సరిలేరు నీకెవ్వరు’ గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో అత్యంత భారీగా ఈ వేడుకను జరపనున్నారు. ఈ మేరకు ఆదివారం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్టర్ను దర్శకుడు అనిల్ రావిపూడి ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. జనవరి 5న సాయంత్రం 5.04 గంటలకు ప్రీ రిలీజ్ వేడుక ప్రారంభమవుతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మికా మండన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని. ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, లిరికల్ వీడియో సాంగ్స్కు మంచి స్పందన వస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సూర్యుడివో చంద్రుడివో...
మహేశ్బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని రెండో పాటని సోమవారం విడుదల చేశారు చిత్రబృందం. ‘సూర్యుడివో చంద్రుడివో...’ అనే పల్లవితో సాగే ఈ పాట ఫ్యామిలీ మెలోడీగా అలరిస్తోంది. మహేశ్బాబు, రష్మికా మందన్నా జంటగా విజయశాంతి ప్రత్యేక పాత్రలో నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర, ‘దిల్’ రాజు, మహేశ్బాబు నిర్మించిన ఈ సినిమా జనవరి 11 విడుదలవుతోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించిన ‘సూర్యుడివో చంద్రుడివో...’ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ పాటని ప్రముఖ పంజాబీ సింగర్, కంపోజర్ బి.ప్రాక్ పాడారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్కి అనూహ్యమైన స్పందన వచ్చింది. ‘సూర్యడివో...’ పాట ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకునేలా దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు’’ అన్నారు. -
‘సూర్యుడివో చంద్రుడివో.. ఆ ఇద్దరి కలయికవో’
మహేశ్ బాబు ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల మందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ ఉపందుకున్నాయి. డిసెంబర్లో ఈ సినిమాలోని 5 పాటలను వారానికి ఒకటి చొప్పున 5 సోమవారాలు రిలీజ్ చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ‘మైండ్ బ్లాక్’ సాంగ్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధిం రెండో సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. ‘సూర్యుడివో చంద్రుడివో.. ఆ ఇద్దరి కలయికవో’ అంటూ సాగే ఈ పాట లిరిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ముఖ్యంగా మహేశ్, విజయశాంతిల మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్టు ఈ లిరికల్ వీడియోను చూస్తే అర్థమవుతోంది. కుటుంబానికి మేజర్ అజయ్ కృష్ణ ఎలాంటి ప్రాధాన్యత ఇస్తాడో తెలిపేలా ఈ సాంగ్ను రూపొందించినట్టుగా తెలుస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేశ్కు జంటగా రష్మికా మందన్నా నటిస్తుంది. రామబ్రహ్మం సుంకర, ‘దిల్’ రాజు, మహేశ్బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. విజయ్శాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాశ్రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
నెక్ట్స్ ‘సూర్యుడివో చంద్రుడివో’
సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’మూవీ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రంపై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మూవీ టైటిల్ సాంగ్, ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ‘మైండ్ బ్లాక్’సాంగ్ ఓ రేంజ్లో ఉన్నాయి. ప్రస్తుతం టీజర్, మైండ్ బ్లాక్ సాంగ్ సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. మిలియన్ వ్యూస్ సాధించి రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇక ప్రమోషన్లో భాగంగా ఐదు సోమవారాలు ఐదు పాటలను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మైండ్ బ్లాక్ సాంగ్ను రిలీజ్ చేయగా వచ్చే సోమవారం మరో పాటను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ‘సూర్యుడివో చంద్రుడివో’అంటూ సాగే మెలోడీ పాటను సోమవారం సాయంత్రం 5:04 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సాంగ్కు సంబంధించి ఓ పోస్టర్ను కూడా రిలీజ్ చేసింది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. ఈ సందర్భంగా ‘మంగళకరమైన మాధుర్య ప్రధానమైన సంగీతానికి మనిషి తనం తాలూకు భావోద్వేగం తోడైతే ఇలాంటి పాట పుడుతుంది. చాలా సంతృప్తిగా ఉన్నా ఈ పాట రాసి’అంటూ రామజోగయ్య శాస్త్రి ట్వీట్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మహేశ్ సరసన రష్మికా మండన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. దాదాపు దశాబ్దంన్నర తర్వాత ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతీ రీఎంట్రీ ఇస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. "సూర్యుడివో చంద్రుడివో 🥁" #SuryudivoChandrudivo .. a SOULFUL MELODY.. from #SarileruNeekevvaru will be live on Monday @ 5:04 PM#maSSMBmondays మంగళకరమైన మాధుర్యప్రధానమైన సంగీతానికి మనిషితనం తాలూకు భావోద్వేగం తోడైతే ఇలాంటి పాట పుడుతుంది చాలా సంతృప్తిగా ఉన్నా ఈ పాట రాసి pic.twitter.com/CdoKLFEusE — Ramajogaiah Sastry (@ramjowrites) December 7, 2019 -
సూపర్ స్టార్ కోసం మెగాపవర్స్టార్?
అన్నీ కుదిరితే సూపర్ స్టార్ మహేశ్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్చరణ్లు ఒకే వేదికపై కనిపించి అభిమానులను అలరించే అవకాశం ఉంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, మైండ్ బ్లాక్ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రికార్డు స్థాయిలో వ్యూస్ను సొంతం చేసుకున్నాయి. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ ప్రమోషన్స్లో భాగంగా భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు టాక్. అయితే ఈ ఫంక్షన్కు మెగా పవర్ స్టార్ రామ్చరణ్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని అనుకుంటున్నారట. మహేశ్తో రామ్చరణ్కు మంచి సాన్నిహిత్యం ఉండటంతో ఈ ఈవెంట్కు అతడినే ఆహ్వానించాలని నిర్మాతలు కూడా భావిస్తున్నారట. ప్రస్తుతం టాలీవుడ్లో ఇదే హాట్ టాపిక్గా నడుస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఈ వార్త హల్చల్ చేస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక సమాచారం రాలేదు. ఫైల్ ఫోటో గతంలో మహేశ్ నటించిన ‘భరత్ అనే నేను’మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి రామ్చరణ్ కూడా హాజరుకావాల్సింది. కానీ చివరి నిమిషంలో రాలేకపోయాడు. అయితే ఫంక్షన్ అనంతరం ఓ స్టార్ హోటల్లో మహేశ్,ఎన్టీఆర్, రామ్చరణ్లు కలుసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’కోసం రామ్చరణ్ స్పందించినట్టు టాక్. అన్ని కుదిరితే సూపర్స్టార్-మెగాపవర్ స్టార్లు ఒకే వేదికపై కనిపించనున్నారు. మహర్షి వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత మహేశ్ చేస్తున్న చిత్రం కావడంతో పాటు క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక అభిమానుల్లో మరింత హైప్ క్రియేట్ చేసేందుకు చిత్ర యూనిట్ భారీగానే ప్రమోషన్స్ మొదలుపెట్టింది. దీనిలో భాగంగా టీజర్ను ఇప్పటికే విడుదల చేసింది. అంతేకాకుండా ఐదు సోమవారాలు ఐదు పాటలను రిలీజ్ చేయనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ‘మైండ్ బ్లాక్’ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కాగా, ఈ చిత్రంలో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్బాబు నిర్మించిన ఈ చిత్రంలో దాదాపు దశాబ్దం తర్వాత లేడీ సూపర్స్టార్ విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇక రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్ రాజ్లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. -
డెంగీతో బాధపడుతూ నటించాను..
సినిమా: అలా చేయకూడదని ఇప్పుడు అర్థమైంది. ఇకపై ఆ తప్పు చేయను అంటోంది నటి రష్మికమందనా. ఇంతకీ ఏమిటీ అమ్మడు చేసిన తప్పు. ఇప్పుడు ఏం అవగతం అయ్యింది? లాంటి సందేహాలు కలుగుతున్నాయా? ఇప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలిగిపోతున్న నటి రష్మిక. ఒక్క అడుగు జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్లుగా ఈ కన్నడ భామ జాతకాన్ని గీతగోవిందం అనే ఒక్క చిత్రం మార్చేసింది. అలా టాలీవుడ్లో రాత్రికి రాత్రే స్టార్ అయిన నటి రష్మిక అని చెప్పవచ్చు. ఈ తరువాత నటించిన ఏ చిత్రం పెద్దగా ఆడకపోయినా స్టార్ హీరోలతో నటించే అవకాశాలు ఈ చిన్నదానికి వరుస కట్టేస్తున్నాయి. తెలుగులో మహేశ్బాబు, అల్లుఅర్జున్ వంటి స్టార్స్తో జత కట్టేస్తోంది. ఇక కోలీవుడ్లోనూ ఈ అమ్మడి జోరు మొదలైంది. ఇక్కడ కార్తీకి జంటగా సుల్తాన్ అనే చిత్రంలో నటిస్తోంది. దీంతో రష్మికలో చాలా మార్పు వచ్చేసిందంటున్నారు సినీ వర్గాలు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి కాబట్టి పారితోషికం విషయంలో ఎటూ పెంచేసిందనుకోండి. దానితో పాటు అహంకారం పెరిగిందని చెవులు కొరుక్కుంటున్నారు. ఇకపోతే ఇటీవల ఈ అమ్మడు ఇటీవల గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ భారతీయ చిత్రోత్సవాల్లో పాల్గొంది. ఆ వేదికపైకి అందాలారబోసే దుస్తులు ధరించి అందరినీ ఆకర్షించింది. ఈ సందర్భంగా మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంటూ మూడేళ్లుగా విరామం లేకుండా నటించేస్తున్నాను అని చెప్పింది. ఇలా రెస్ట్ లేకుండా నటించడం వల్ల తనకు తానే శారీరకంగానూ, మానసికంగానూ అలసటను కొనితెచ్చుకుంటున్నాను అని చెప్పింది. వారంలో ఆదివారం అయినా విరామం దొరుకుంతేమోనని తన శరీరం తపిస్తోందని అంది. ప్రస్తుతం ఏక కాలంలో నాలుగు చిత్రాల్లో నటిస్తున్నానని చెప్పింది. అలా ఉదయం ఒక రాష్ట్రం, మధ్యాహ్నం ఒక రాష్ట్రం, సాయంత్రం ఒక రాష్ట్రం అంటూ పరుగులు తీస్తున్నానని చెప్పింది. దీంతో పనే ముఖ్యం కాదని, శరీరంపైనా శ్రద్ధచూపడం అవసరం అన్న విషయం అర్థమైందని పేర్కొంది. ప్రస్తుతం ఏక కాలంలో నాలుగు చిత్రాల్లో నటిస్తున్నానని, అయితే ఇకపై అలాంటి తప్పు చేయకూడదని భావిస్తున్నానని చెప్పింది. ఎన్ని చిత్రాలు చేసినా వాటి ద్వారా మనం ఏం నేర్చుకున్నామన్నది ముఖ్యం అని పేర్కొంది. రెండు నెలలకు ముందు తాను డెంగీ వ్యాధికి గురయ్యానని, ఆ సమయంలో అవుట్ డోర్ షూటింగ్లో ఉన్నానని చెప్పింది. అలా డెంగీతో బాధపడుతూ, శరీరం సహకరించకపోయినా నటించానని చెప్పింది. తాను పోరాడే గుణం కలదానినని, దేన్నీ సులభంగా వదలిపెట్టనని అని రష్మిక మందనా చెప్పుకొచ్చింది. -
బాబూ... నీ లుక్కు మైండ్ బ్లాకు
‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపొద్దో ఆడే పండుగాడు’ అంటూ ‘పోకిరి’ (2006) సినిమాలో మహేశ్బాబు పలికిన మైండ్ బ్లాక్ డైలాగ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అప్పుడు డైలాగ్. ఇప్పుడు ‘మైండ్ బ్లాక్’ సాంగ్ వచ్చింది. మహేశ్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం శ్రీమణి రాసిన ‘మైండ్ బ్లాక్.. మైండ్ బ్లాక్.. మైండ్ బ్లాక్.. బాబూ... నీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు’ అనే పాటను సోమవారం విడుదల చేశారు. బ్లేజ్, రెనినా రెడ్డి పాడారు. ఈ పాటలో మహేశ్ ‘నువ్వు కొట్టరా.., నువ్వు ఉండరా, నువ్వు దంచెహె’ అని కొన్ని డైలాగులు చెప్పడం స్పెషల్ ఎట్రాక్షన్. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు స్వరకర్త. ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్బాబు నిర్మించిన ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది. -
‘మైండ్ బ్లాక్’ చేసిన డీఎస్పీ.. మహేశ్ ఫ్యాన్స్ పుల్ హ్యాపీ
సూపర్స్టార్ మహేశ్బాబు ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నుంచి మొదటి సాంగ్ వచ్చేసింది. ఈ సినిమాలోని 5 పాటలను వారానికి ఒకటి చొప్పున 5 సోమవారాలు రిలీజ్ చేస్తామని ప్రకటించిన చిత్ర యూనిట్.. సోమవారం సాయంత్రం మొదటి పాటను విడుదల చేసింది. మాస్ బీట్తో వచ్చిన ఈ పాటలో మహేష్ డైలాగ్స్ ఉన్నాయి. మహేశ్ అభిమానులకు తగ్గట్టుగా, తనదైన శైలీలో దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ కట్టాడు. మాస్ బిట్స్తో, రైమింగ్ పదాలతో ‘మైండ్ బ్లాంక్’ చేసేశాడు. రెనైనా రెడ్డి, బ్లాజ్ ఆలపించిన ఈ పాటకు శ్రీమణి, దేవీ శ్రీ ప్రసాద్ లిరిక్స్ అందించారు. అప్పుడే ట్రెండింగ్ లోకెళ్ళిపోయిన ఈ ‘మైండ్ బ్లాంక్’ సాంగ్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిత్రంలో రష్మిక మండన్నకథానాయికగా నటించగా, లేడీ సూపర్స్టార్ విజయశాంతి, ప్రకాష్ రాజ్,రాజేంద్ర ప్రసాద్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. దేవీ శ్రీ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది. -
5 సోమవారాలు 5 పాటలు
డిసెంబర్ను మ్యూజికల్ డిసెంబర్గా మార్చేయాలని ప్లాన్ చేసింది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రబృందం. మహేశ్బాబు, రష్మికా మందన్నా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. రామబ్రహ్మం సుంకర, ‘దిల్’ రాజు, మహేశ్బాబు నిర్మిస్తున్నారు. విజయ్శాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాశ్రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలోని 5 పాటలను వారానికి ఒకటి చొప్పున 5 సోమవారాలు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి మా శక్తి మేరకు కష్టపడ్డాం. సినిమాలోని ప్రతీ పాట అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను’’ అన్నారు సంగీత దర్శకుడు దేవిశ్రీ్ర పసాద్. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 11న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. -
టాక్ఆఫ్ ది టాలీవుడ్గా 81 అడుగుల కటౌట్
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు అనిల్ రావిపూడిల కలయికలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా నుండి మొన్న రిలీజ్ అయిన టీజర్ తరువాత సినిమాపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్గా నటిస్తోన్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తాజాగా విడుదలైన టీజర్ వ్యూస్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ వద్ద దర్శనమిస్తున్న మహేశ్ బాబు భారీ కటౌటే నిదర్శనం. హైదరాబాద్లోని మహేష్ బాబు అడ్డాగా పేరుగాంచిన సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ వద్ద సూపర్ స్టార్ మహేష్ బాబు 81 అడుగుల కటౌట్ని థియేటర్ యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఈ కటౌట్ ప్రస్తుతం టాక్ఆఫ్ ది టాలీవుడ్గా మారిందని చెప్పొచ్చు. సాధారణంగా సినిమా విడుదలకు ముందు థియేటర్ల వద్ద కటౌట్లు పెట్టడం జరుగుతుంది. కానీ సంక్రాంతికి విడుదలయ్యే సినిమా కోసం ఇప్పుడే కటౌట్ పెట్టేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘హ్యపీ బర్త్డే టు మై డైరెక్టర్’
పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2 వంటి సక్సెస్ ఫుల్ సినిమాలు టాలీవుడ్కు అందించిన క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి బర్త్డే నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అనిల్ రావిపూడి పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్విటర్ వేదికగా విషెస్ తెలిపారు. ‘హ్యపీ బర్త్డే టు మై డైరెక్టర్ అనిల్ రావిపూడి. మీతో కలిసి సినిమా చేయడం నా జీవితంలో మధురానుభూతిగా నిలిచిపోతుంది. మీరు మరిన్నే బ్లాక్ బస్టర్ విజయాలతో మరింత సంతోషంగా ఉండాలని మనస్పూర్థిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు’అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. మెసేజ్తో పాటు అనిల్తో దిగిన ఫోటోను షేర్ చేశారు సూపర్ స్టార్. ఇక తాను ఎప్పటికీ ఎంటర్టైన్మెంట్ కా బాప్గా పిలిచే అనిల్ రావిపూడికి బర్త్డే విషెస్ అంటూ రామ్ పోతినేని ట్వీట్ చేశారు. అంతేకాకుండా సుధీర్ బాబు, లావణ్య త్రిపాఠి, అనసూయ, శ్రీనువైట్ల బాబి, హరీష్ శంకర్, అనిల్ సుంకర తదితరులు టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్కు హార్ట్ ఫుల్ విషెస్ తెలిపారు. ఇక తనపై ప్రేమను కురిపిస్తూ, ఆశీర్వదించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు. ‘ఇక ప్రతీ బర్త్డేకు కుటుంబం, ఫ్రెండ్స్తో గడిపేవాడిని. ఈసారి మహేశ్ బాబుతో ఉండబోతున్నా. అదో కిక్కు. ఆయనతో సరదాగా టైమ్ స్పెండ్ చేసే అవకాశం వచ్చింది. మంచి కిక్ ఇచ్చే బర్త్డే ఇది’అని యువ డైరెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి మహేశ్బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్ర టీజర్ను శుక్రవారం రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది. ఇప్పటికే 12 మిలియన్ వ్యూస్కి పైగా సొంతం చేసుకున్న ఈ టీజర్ యూట్యూబ్ ట్రెండింగ్లో నంబర్ వనగా కొనసాగుతోంది. అంతేకాకుండా టీజర్ విడుదలైన క్షణాల్లోనే అత్యధిక లైక్లు, వ్యూస్ సోంతం చేసుకున్న చిత్ర టీజర్గా ‘సరిలేరు’ నయా ట్రెంట్ సృష్టిస్తోంది. ఇప్పటికే ‘సరిలేరు నీకెవ్వరు’ హ్యాష్ ట్యాగ్ ట్విటర్లో తెగ ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. Thanks a lot for your wishes sir. You made the journey memorable and working with you is a learning experience I will cherish forever.... 🤗🤗🤗🤗😊😊 https://t.co/fNU4tERQYe — Anil Ravipudi (@AnilRavipudi) November 23, 2019 -
మహేశ్బాబు రఫ్ ఆడేశారు
హిట్ ట్రాక్లో దూసుకెళుతున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. మంచి దూకుడు మీద ఉన్న హీరో మహేశ్బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నారు. ఇప్పటివరకు అనిల్ చేసింది నాలుగు సినిమాలే. ఐదో సినిమాకే సూపర్ స్టార్ మహేశ్ కాంబినేషన్ కుదరడం అంటే చిన్న విషయం కాదు. ‘ఇంత పెద్ద స్టార్ని ఎలా డీల్ చేస్తాం?’ అనే కన్ఫ్యూజన్ లేకుండా తాను నమ్మిన ఫార్ములాతో ‘సరిలేరు నీకెవ్వరు’ని తెరకెక్కిస్తున్నారు. నేడు అనిల్ రావిపూడి పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు. ► ఐదేళ్లలో నాలుగు సక్సెస్ఫుల్ సినిమాలు (పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2) అందించారు. మీ సక్సెస్ ఫార్ములా ఏంటి? ప్రతి సినిమా ఫస్ట్ సినిమాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తున్నాను. ఒక సినిమా చేస్తున్నప్పుడు నా గత సినిమాలను మర్చిపోతాను. ప్రస్తుతం ఏం చేస్తున్నాం అన్నదే ముఖ్యం. గత సినిమా తాలూకు ప్రభావం ప్రస్తుత సినిమా మీద పడకూడదు. అది హిట్ అయినా ఫ్లాఫ్ అయినా.. మనం ఏం చేస్తున్నాం? అనే ఆలోచన, విశ్లేషణ ఉన్నప్పుడు మనకి మనం బోర్ కొట్టం. ఆడియన్స్కి కూడా బోర్ కొట్టం అని నేను నమ్ముతాను. అది నా ఫిలాసఫీ అనుకోవచ్చు.. స్ట్రాటజీ అనుకోవచ్చు. ► ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఎలా స్టార్ట్ అయింది? ఈ సినిమా ‘ఎఫ్ 2’ తర్వాత స్టార్ట్ అయిందని అందరూ అనుకుంటున్నారు. కాదు. ‘ఎఫ్ 2’ పూర్తయ్యేసరికే మహేశ్గారు ఈ కథను ఓకే చేశారు. ‘ఎఫ్ 2’ సమయంలో నిర్మాత అనిల్ సుంకరగారు మహేశ్గారికి నన్ను రిఫర్ చేశారు. నా దగ్గర ఉన్న పాయింట్ను 45 నిమిషాలు మహేశ్గారితో చెప్పాను. సినిమా ఓకే అయింది. సుకుమార్గారితో చేయబోయే సినిమా తర్వాత స్టార్ట్ చేయాలనుకున్నాం. అనుకోకుండా నా సినిమా ముందుకు రావడం జరిగింది. ► ఈ మధ్య మహేశ్ సినిమాలు సోషల్ మెసేజ్ చుట్టూ తిరిగాయి. మరి ఈ సినిమాలో? మహేశ్ లాంటి సూపర్ స్టార్ చేసే సినిమాలో ఎక్కడో ఒక చోట బాధ్యతాయుతమైన పాయింట్ను కచ్చితంగా చెప్పాలి. అలాగే ఆయన మాస్ లుక్లో కనబడి, పూర్తి స్థాయిలో కామెడీ చేసి చాలా రోజులైంది. ప్రేక్షకులు మహేశ్గారిని ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఈ సినిమా ఉంటుంది. మహేశ్బాబుగారు వెరైటీగా కనిపించబోతున్నారు, బాధ్యతాయుతంగా ఉంటారు. విపరీతంగా ఎంటర్టైన్ చేస్తారు. కథకు అవసరమైన యాక్షన్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. మిలటరీ ఆఫీసర్ ‘అజయ్ కృష్ణ’ పాత్రలో మహేశ్గారు కనిపిస్తారు. ఆయన పాత్ర గురించి కచ్చితంగా అందరూ మాట్లాడుకుంటారు. ఇది కచ్చితంగా స్పెషల్ సినిమా అవుతుంది. ► కాన్ఫిడెంట్గా చెబుతున్నారు. ఈ కాన్ఫిడెన్స్ అంచనాలను మరింత పెంచుతుంది కదా? పూర్తయినంతవరకు సినిమా చూశాం. ఈ సినిమా చూసిన ఏ ఒక్కరూ నిరుత్సాహపడరు అని చెప్పగలను. మహేశ్బాబుగారు ఉన్నారు కదా అని ఆడుతూపాడుతూ సినిమా చేసేయలేదు. ఇప్పటివరకూ ఏ సినిమాకీ నేనలా చేయలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మహేశ్బాబుగారు రఫ్ ఆడేశారు. కేవలం ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడటం లేదు. ఫ్యాన్స్కి కావాల్సినవన్నీ ఉన్నాయి. అది వాళ్లకు కిక్ ఇస్తుంది. అలాగే పండక్కి ఫ్యామిలీతో కలసి సినిమా చూడాలనుకునేవాళ్లు కూడా ఎంజాయ్ చేస్తారు. ► విజయశాంతిగారిని మళ్లీ స్క్రీన్ మీదకు తీసుకురావాలని ఎందుకు అనుకున్నారు? నా చిన్నప్పుడు చూసిన ‘కర్తవ్యం, ప్రతిఘటన, ఒసేయ్ రాములమ్మ’ లాంటి సినిమాల్లో విజయశాంతిగారి డైనమిజమ్కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అలాంటి యాక్టర్తో వర్క్ చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాను. కమ్బ్యాక్కి తగ్గ పాత్ర కూడా ఉండాలి. అలాంటి పాత్ర ఉంటే కచ్చితంగా చేస్తాను అని ఆవిడ అన్నారు. ‘రాజా ది గ్రేట్’ సినిమాను మొదట రామ్తో అనుకున్నప్పుడు రామ్ తల్లి పాత్రలో విజయశాంతిగారిని తీసుకోవాలనుకున్నాను. ఆ తర్వాత అది రవితేజగారితో చేశాను. ఆమెని అడగలేదు. ఈ సినిమాలో ప్రొఫెసర్ భారతి పాత్ర రాసుకున్నాక ఆమెని తప్ప మరెవ్వరినీ ఊహించలేదు. కథ విని, పాత్రతో పాటు కథ కూడా నచ్చి ఆమె ఒప్పుకున్నారు. ► దర్శకుడిగా మీ ప్లస్ పాయింట్ కామెడీ. దాన్ని ఈ సినిమాలో ఎంతవర కూ ఉపయోగించారు? నా సినిమాలో ఏం ఉంటాయో అవి కోరుకొని ఆడియన్స్ థియేటర్కి వస్తారు. అవి కచ్చితంగా అందించాలి. ప్రస్తుతం కమర్షియల్ ఎలిమెంట్స్, కామెడీ సినిమాలు చేస్తున్న దర్శకులం కొందరే ఉన్నాం. నేను శేఖర్ కమ్ముల స్టయిల్లో సినిమా చేయలేను. నేను నమ్ముకున్నదాన్ని ఎంత కొత్తగా చేస్తాను అన్నది ముఖ్యం. అన్ని జానర్లలో సినిమాలు చేయాలని ఉంది. ► బర్త్డే ప్లాన్స్ ఏంటి? ప్రతీసారి కుటుంబం, ఫ్రెండ్స్తో ఉండేవాణ్ణి. ఈసారి మహేశ్గారితో ఉండబోతున్నా. అదో కిక్కు. ఆయనతో సరదాగా టైమ్ స్పెండ్ చేసే అవకాశం వచ్చింది. మంచి కిక్ ఇచ్చే బర్త్డే ఇది. ► నెక్ట్స్ సినిమా? ఇంకా ఏం ఆలోచించలేదు. కానీ ఏం చేయాలనే ఐడియా మాత్రం ఉంది. ► ‘అల.. వెకుంఠపురములో.., సరిలేరు నీకెవ్వరు’ సినిమాలు ఒక రోజు గ్యాప్లో విడుదలవుతున్నాయి. అదేమైనా వసూళ్ల మీద ప్రభావం చూపిస్తుందా? ఈ రెండూ డిఫరెంట్ సినిమాలు. పండగ సమయాల్లో మూడు సినిమాలు రిలీజ్ అయినా ప్రాబ్లమ్ ఉండదు. ఇవాళ ఓ సినిమా చూస్తే రేపు మరో సినిమా చూస్తారు. ► ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ఎఫ్2’ చిత్రం ప్రదర్శనకు ఎంపికైంది. తెలుగు నుంచి ఎంపికైన సినిమా అదొక్కటే. ఎలా అనిపిస్తోంది? చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. షూటింగ్ ఉండి ఆ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్లలేకపోయాను. మా టీమ్ తరఫున ‘దిల్’రాజుగారు హాజరయ్యారు. ► ప్రస్తుతం ఉన్న యంగ్ కమర్షియల్ డైరెక్టర్స్లో ఫ్లాప్స్ని చూడని దర్శకుడు మీరు. హిట్ స్ట్రీక్ని ఎలా కంటిన్యూ చేస్తున్నారు? రాజమౌళిగారు అంత సక్సెస్ఫుల్ దర్శకుడు ఎలా అయ్యారు? ఒక్క సినిమా కూడా మిస్ అవ్వకుండా ఎలా హిట్ కొడుతున్నారు? అని గమనిస్తే, తెలిసింది ఏంటంటే ఆయన తన బలాన్ని వదిలి ఎప్పుడూ సినిమా చేయలేదు. ఆయన బలం ఎమోషన్. ‘ఈగ’ లాంటి ప్రయోగం అయినా, ‘బాహుబలి’ లాంటి ఫ్యాంటసీ అయినా ఆ బలాన్ని వదల్లేదు. ఆయనలా మన బలాన్ని మనం వదలకూడదు. అప్పుడు సినిమా మిస్ఫైర్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుందనుకుంటున్నాను. కథ రాసుకునే దశ నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నాను. బేరాల్లేవ్! ‘భయపడే వాడే బేరానికి వస్తాడు. మన దగ్గర బేరాల్లేవమ్మా!’ అంటున్నారు మహేశ్బాబు. ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ శుక్రవారం రిలీజ్ అయింది. ‘మీరెవరో మాకు తెలియదు. మీకు, మాకూ ఏ రక్తసంబంధం లేదు. కానీ, మీ పిల్లల కోసం పగలు, రాత్రి తేడా లేకుండా పోరాడుతూనే ఉంటాం. ఎందుకంటే మీరు మా బాధ్యత. గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడు బాబాయ్, సంక్రాంతికి అల్లుళ్లు వస్తారనుకుంటే మొగుడు వచ్చాడేంట్రా’ అనే డైలాగ్స్తో ఈ టీజర్ ఆకట్టుకునేలా ఉంది. రామబ్రహ్మం సుంకర, ‘దిల్’ రాజు, మహేశ్బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే జనవరి 11న రిలీజ్ కానుంది. -
మన దగ్గర బేరాల్లేవమ్మా...: మహేశ్
'మీరెవరో మాకు తెలియదు.. కానీ మిమ్మల్ని కాపాడడం మా బాధ్యత' అంటూ సూపర్స్టార్ మహేశ్బాబు పలికే పవర్ఫుల్ డైలాగ్తో శుక్రవారం 'సరిలేరు నీకెవ్వరు' సినిమా టీజర్ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో మహేశ్బాబు మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో రష్మిక మండన్నకథానాయికగా నటించగా, లేడీ సూపర్స్టార్ విజయశాంతి, ప్రకాష్ రాజ్,రాజేంద్ర ప్రసాద్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, బర్త్డే టీజర్, టైటిల్ సాంగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన 1.26 నిమిషాల నిడివి గల టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. దిల్ రాజు, మహేశ్బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాగా, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో కమర్షియల్ అంశాలతో పాటు అంతర్లీనంగా ఒక మేసేజ్ అందిస్తున్నట్లు టీజర్ ద్వారా చిత్ర బృందం తెలిపింది. -
‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ ఎప్పుడంటే?
మహేశ్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ఇందులో ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్ర చేస్తున్నారు మహేశ్బాబు. ఈ చిత్రంలో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటివకే విడుదలైన ప్రచార గీతం, మహేశ్ బాబు, విజయశాంతి ఫస్ట్ లుక్ పోస్టర్లు హైలైట్గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే మహేశ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అన్ని ఎదురు చూస్త్ను టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 22న ‘సరిలేరు నీకెవ్వరు’టీజర్ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే మేజర్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను త్వరగా కంప్లీట్ చేసుకొని ప్రమోషన్స్ భారీగా చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక్కొ అస్త్రాన్ని సంధించి అభిమానులకు సినిమాపై అంచనాలు పెరిగేలా చేయాలని భావిస్తోంది. దీనిలో భాగంగా ఈ సినిమా టీజర్ను అనిల్ రావిపూడి బర్త్డే సందర్భంగా ఈ నెల 23న విడుదల చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉందని తాజా సమాచారం. అంతేకాకుండా ఈ నెల చివర్లో మూవీ కొత్త పోస్టర్ను విడుదల చేస్తారనే టాక్ కూడా నడుస్తోంది. డిసెంబర్ మొదటివారంలో ఓ పాటను విడుదల చేస్తారని టాలీవుడ్ టాక్. ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. Witness Major Ajay Krishna on Nov 22nd @ 5:04 PM 💥#SarileruNeekevvaruTeaser Superstar @urstrulyMahesh @AnilRavipudi @AnilSunkara1 @vijayashanthi_m @iamRashmika @RathnaveluDop @ThisIsDSP @AKentsOfficial @GMBents @SVC_official #SarileruNeekevvaruTeaserOnNov22nd pic.twitter.com/1KFfq5DcbE — AK Entertainments (@AKentsOfficial) November 19, 2019 -
మహేశ్ ఫ్యాన్స్కు సర్ప్రైజ్
మహేశ్బాబు అభిమానులకు గుడ్ న్యూస్. ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా టీజర్ విడుదల తేదీ నేడు వెల్లడి కానుంది. ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు టీజర్ తేదీ వెల్లడిస్తామని ప్రకటించి చిత్రయూనిట్ సర్ప్రైజ్ ఇచ్చింది. దీంతో #UnlockSLNTeaserDate, #SarileruNeekevvaruTeaser హాష్ట్యాగ్లు ట్విటర్లో ట్రెండింగ్లో నిలిచాయి. టీజర్ లోడ్ అవుతోందంటూ దర్శకుడు అనిల్ రావిపూడి ఇంతకుముందే ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘ఎఫ్2’ తర్వాత అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మహేశ్బాబుకు జంటగా రష్మిక మందాన నటిస్తున్నారు. సీనియర్ నటి విజయశాంతి కీలకపాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. దిల్ రాజు సమర్పణలో జీఎంబీ, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బేనర్స్పై తెరకెక్కుతున్న ఈ సినిమాను జనవరి 12న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. -
టీజర్ రెడీ
గన్ ట్రిగ్గర్ లాగి లక్ష్యం వైపు ముందుకు వెళ్తున్న మేజర్ అజయ్కృష్ణ ఆపరేషన్ ఎలా విజయవంతమైందన్న విజువల్ సంక్రాంతి పండక్కి వెండితెరపై చూడొచ్చు. ఆ లోపు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని ఈ ఆపరేషన్ తాలూకు శాంపిల్ను ఈ వారంలో టీజర్గా విడుదల కాబోతుంది. మహేశ్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఇది. ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రంలో మేజర్ అజయ్కృష్ణ పాత్రలో మహేశ్బాబు నటిస్తున్నారు. రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ పాట చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. ఈ సినిమా టీజర్ను అనిల్ రావిపూడి బర్త్డే సందర్భంగా ఈ నెల 23న విడుదల చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉందని తాజా సమాచారం. టీజర్ను ఈ నెల 19న విడుదల చేసి, ఈ నెల 23న మూవీ కొత్త పోస్టర్ను విడుదల చేస్తారనే టాక్ కూడా నడుస్తోంది. డిసెంబర్ మొదటివారంలో ఓ పాటను విడుదల చేస్తారట. ఈ విషయాలపై అతి త్వరలో అధికారిక ప్రకటన వెల్లడి కానుంది. ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీప్రసాద్. -
టీజర్ లోడ్ అవుతోందట
టాలీవుడ్ ‘ప్రిన్స్’ మహేశ్బాబు తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ త్వరలో విడుదలకానుంది. టీజర్ లోడ్ అవుతోందంటూ దర్శకుడు అనిల్ రావిపూడి ట్విటర్ ద్వారా వెల్లడించారు. హీరో మహేశ్బాబు గన్ లోడ్ చేస్తున్న క్లిప్ను షేర్ చేసి ‘టీజర్ లోడ్ అవుతోంది’ అంటూ కామెంట్ పెట్టారు. అయితే టీజర్ ఏ తేదీన విడుదలవుతుందో ఇంకా వెల్లడించలేదు. వచ్చే వారం టీజర్ బయటకు వచ్చే అవకాశముందని సమాచారం. సరిలేరు నీకెవ్వరు టీజర్, మాస్ఎంబీ హ్యాష్ట్యాగ్లు ట్రెండింగ్లో నిలిచాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు మహేశ్బాబు, విజయశాంతి పోస్టర్లు, ఎంట్రీ సాంగ్ టీజర్ను మాత్రమే విడుదల చేశారు. ఈ చిత్రం టీజర్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వరుస విజయాలతో సక్సెస్పుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. గతేడాది సంక్రాంతికి ‘ఎఫ్2’ సినిమాతో విజయాన్ని అందుకున్న ఆయన మహేశ్బాబుతోనూ హిట్ కొట్టాలని భావిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. మహేశ్బాబు ఆర్మీ మేజర్గా కనిపించనున్న ఈ చిత్రంలో ఆయనకు జోడిగా రష్మిక మందాన నటించారు. రాజేంద్రప్రసాద్, విజయశాంతి, ప్రకాశ్రాజ్, ఆది పినిశెట్టి, వెన్నెల కిశోర్, అనుసూయ భరద్వాజ్ తదిరులు ఇతర పాత్రలు పోషించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. TEASER LOADING 💥💥#SarileruNeekevvaru Super Star @urstrulyMahesh @vijayashanthi_m @iamRashmika @RathnaveluDop @AnilSunkara1 @ThisIsDSP @AKentsOfficial @SVC_official @GMBents pic.twitter.com/6FaJTKzeJD — Anil Ravipudi (@AnilRavipudi) November 16, 2019 -
మార్పు కోసం బ్రేక్!
మహేశ్బాబు మారబోతున్నారు. అవును.. కొత్త లుక్లోకి మారబోతున్నారని సమాచారం. ‘సరి లేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత మహేశ్ ఓ చిన్న బ్రేక్ తీసుకుంటారని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కొత్త లుక్లోకి మారడానికే ఈ చిన్న విరామం అని తెలిసింది. ఈ మార్పు తన 27వ సినిమా కోసం అట. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని తెరకెక్కించనున్నారని టాక్. ఇందులో మహేశ్ కొత్త లుక్లో కనిపించడం మాత్రమే కాదు.. నాలుగు భాషల తెర మీద కనిపించనున్నారని భోగట్టా. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుందని తెలిసింది. ప్యాన్ ఇండియన్ సినిమాగా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ‘కేజీఎఫ్’కి సీక్వెల్గా ప్రశాంత్ తెరకెక్కిస్తున్న ‘కేజీఎఫ్ 2’ వచ్చే ఏడాది ఏప్రిల్లో రిలీజ్ కానుంది. మహేశ్తో చేయబోయే సినిమా మేలో ఆరంభం అవుతుందట. -
బన్నీ ట్వీట్.. రిలీజ్ డేట్ మారినట్టేనా?
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న లెటేస్ట్ సినిమా ‘అల వైకుంఠపురములో’. ఈ సినిమాకు సంబంధించి తాజా పోస్టర్ను.. ‘సమజవరగమన ఆన్ ద వే’ అంటూ బన్నీ ట్వీట్ చేశాడు. ఈ సినిమాలోని సామజవరగమన పాట లిరికల్ వీడియో ఇప్పటికే విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ లిరికల్ వీడియో యూట్యూబ్లో, సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ సాధించిన నేపథ్యంలో ‘సామజవరగమన’ సాంగ్ వీడియోను త్వరలో విడుదల చేయనున్నట్టు హింట్ ఇస్తూ అర్జున్ ఈ ట్వీట్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ ట్వీట్లో మరో విశేషం కూడా ఉంది. ‘అల వైకుంఠపురములో’ సినిమా విడుదల తేదీని ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. సంక్రాంతి రేసులో భాగంగా జనవరి 12ను ఈ సినిమాను విడుదల చేస్తామని త్రివిక్రమ్ టీవ్ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు అదేరోజున మహేష్ బాబు తన తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు'ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. రెండు పెద్ద సినిమాలు ఒకేరోజున విడుదల చేస్తున్నట్టు పోటాపోటీగా ప్రకటించడంతో సంక్రాంత్రి బాక్సాఫీస్ రేసు వేడెక్కింది. ఒకే రోజు ఇద్దరు అగ్రహీరోల సినిమాలు విడుదలైతే మాత్రం అది ఓపెనింగ్స్పై ప్రభావం చూపుతుందని, లాంగ్రన్లోనూ వసూళ్లపైన ఎఫెక్ట్ పడుతుందని ఆందోళన వ్యక్తమైంది. దీంతో ఈ సినిమాల విడుదల తేదీలపై నిర్మాతలు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అల వైకుంఠపురములో, సరిలేరునీకెవ్వరూ చిత్రాలు వరుసగా జనవరి 11, 13 తేదీల్లో విడుదల చేసేలా నిర్మాతల మధ్య రాజీ ఒప్పందం కుదిరినట్టు కథనాలు వచ్చాయి. ఈ క్రమంలోనే బన్నీ ట్వీట్ చేసిన ‘అల వైకుంఠపురములో’ తాజా పోస్టర్లో విడుదల తేదీ కనిపించకపోవడం గమనార్హం. ఆల్రెడీ ఫిక్స్ అయిన రిలీజ్ డేట్ (జనవరి 12)పై నిర్మాతల మధ్య చర్చలు జరుగుతుండటంతోనే రిలీజ్ డేట్ను ఈ పోస్టర్పై ముద్రించలేదని తెలుస్తోంది. ఈ సినిమా మలయాళం డబ్బింగ్ వెర్షన్ పోస్టర్లో మాత్రం రిలీజ్ డేట్ జనవరి 12 అని ముద్రించారు. తెలుగు పోస్టర్లో రిలీజ్ డేట్ లేకపోవడంతో అలవైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలు ఒకేరోజు విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. దీనిపై ఆ రెండు సినిమాల చిత్రయూనిట్లు కార్లిటీ ఇవ్వాల్సి ఉంది. Samajavaragamana on the way #Samajavaragama #AlaVaikunthapurramloo pic.twitter.com/x9Lr1Bqqix — Allu Arjun (@alluarjun) November 7, 2019 -
మూడు నెలలు బ్రేక్
బ్రేక్ లేకుండా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని పూర్తి చేస్తున్నారు మహేశ్బాబు. ఈ సినిమా పూర్తయిన తర్వాత మూడు నెలలు బ్రేక్ తీసుకోబోతున్నారని తెలిసింది. ఈ విషయాన్ని మహేశ్బాబు సతీమణి నమ్రత తెలిపారు. ‘‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ పూర్తి కావస్తోంది. ఈ సినిమా విడుదలైన తర్వాత మహేశ్ మూడు నెలలు విరామం తీసుకోవాలనుకుంటున్నారు. ‘మహర్షి’, సరిలేరు నీకెవ్వరు’ సినిమాలను పెద్ద గ్యాప్ లేకుండా పూర్తి చేశారు. అందుకే ‘సరిలేరు...’ తర్వాత హాలిడే ప్లాన్ చేయాలనుకుంటున్నారు. మహేశ్ గురించి నాకు తెలుసు కాబట్టి.. నెల విరామం తీసుకున్న తర్వాత మళ్లీ పని చేయాలనుకుంటారు’’ అని పేర్కొన్నారు నమ్రత. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. -
దీపావళి ఎఫెక్ట్: హల్చల్ చేస్తున్న సినిమాలు
సినీ అభిమానులకు దీపావళి రెట్టింపు పండగ వాతావరణం తెచ్చింది. దీపావళి కానుకగా తమ అభిమాన హీరోహీరోయిన్ల కొత్త సినిమాలకు సంబంధించిన విషయాలు, విశేషాలను చిత్ర బృందాలు విడుదల చేస్తున్నాయి. దీంతో సినీ అభిమానులు దీపావళికి డబుల్ ధమాకా అందుకున్నారు. ఇప్పటికే దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ పలు చిత్రాలకు సంబంధించిన టైటిల్స్ను అనౌన్స్ చేయడంతో పాటు.. మరికొన్ని చిత్రాల్లోని హీరోహీరోయిన్లతో పాటు ముఖ్య తారాగణం లుక్లను విడుదల చేశారు. అంతేకాకుండా ఆయా చిత్రాల టీజర్, ప్రి టీజర్, మోషన్ పోస్టర్లను కూడా అభిమానులపై వదులుతూ సినీ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో వంటి పెద్ద సినిమాలతో మొదలెడితే.. తిప్పరామీసం, అక్షర వంటి చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. భయపెడుత్నున సాయిపల్లవి సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘అధిరన్’. తెలుగులో ‘అనుకోని అతిధి’. ఈ మూవీలో సాయిపల్లవి ఇప్పటివరకు పోషించనట్టువంటి వైవిధ్యమైన పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్, సాయి పల్లవి లుక్ తెగ ఆకట్టుకున్నాయి. తాజాగా దీపావళి శుభాకంక్షలు తెలుపుతూ సినిమా టీజర్ను విడుదల చేశారు చిత్ర బృందం. టీజర్ను పరిశీలిస్తే సాయి పల్లవి ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. వివేక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతమందిస్తున్నాడు. కాగా ఈ సినిమా నవంబర్ 15న విడుదల కానుంది. సరిలేరు నీకెవ్వరు.. మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.దీపావళి సందర్భంగా దాదాపు పదమూడేళ్ల తర్వాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి లుక్తో పాటు టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు పోస్టర్ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఇక ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్బాబు నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. అల వైకుంఠపురంలో.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘అల వైకుంఠపురములో’ . వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు ఏ రేంజ్లో ఆకట్టుకున్నాయో తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, బన్నీ డైలాగ్తో పాటు ‘సామజవరగమన’, ‘రాములో రాములా’ పాటలు ఎంత పాపులర్ అయ్యాయో తెలిసింది. తాజాగా అల వైకుంఠపురములో చిత్ర బృందం దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ.. మరో పోస్టర్ను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్న సభ్యులందరూ దిగిన ఫోటోను షేర్ చేస్తూ దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. డిస్కో రాజా మాస్ మహారాజ్ రవితేజ తెరపై కనిపించి చాలా కాలమే అయింది. వరుస ఫెయిల్యూర్తో ఢీలా పడిన రవితేజ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. చాలా గ్యాప్ తర్వాత వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న చిత్రం ‘డిస్కో రాజా’ . పాయల్ రాజ్పుత్, నభా నటేష్, తాన్యాహోప్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. తాజాగా ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ డిస్కో రాజా పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్లో రవితేజ నభా నటేష్తో జంటగా కనిపించాడు. దీంతో ఈ చిత్రంలో యాక్షన్, ఎంటర్టైన్మెంట్, రొమాన్స్లు కొదువే లేదని స్పష్టం అవుతోంది. రజిని తాళ్లూరి, రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. తిప్పరా మీసం.. కెరీర్ ఆరంభం నుంచి విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శ్రీవిష్ణు మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తిప్పరామీసం. ఎల్ కృష్ణ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిక్కీ తంబోలి హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన శ్రీవిష్ణు ఫస్ట్ లుక్, టీజర్ విమర్శకులచే ప్రశంసలు అందుకున్నాయి. తాజాగా దీపావళి శుభాకాంక్షలు తెలపుతూ మరో పోస్టర్ను విడుదలు చేసింది. శ్రీ విష్ణు రఫ్ లుక్లో కనిపిస్తున్న ఈ చిత్రం నవంబర్ 8న విడుదల కానుంది. ఇక ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, ఎల్ కృష్ణ విజయ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘సూపర్ మచ్చి’అంటున్న చిరు అల్లుడు ‘విజేత’ఫలితం తర్వాత చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తున్న ‘సూపర్ మచ్చి’ . రిజ్వాన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పులివాసు దర్శకత్వం వహిస్తున్నాడు. దీపావళి కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. తాజాగా అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ హీరో, హీరోయిన్ల పోస్టర్లను చిత్ర బృందం విడుదల చేసింది. ఇక ఎలాగైనా ఈ చిత్రంతో విజయం సాధించాలని కళ్యాణ్ దేవ్తో పాటు మెగా అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ‘అశ్వథ్థామ’గా నాగశౌర్య అంతేకాకుండా నాగశౌర్య, మెహరీన్ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపావళి కానుకగా చిత్ర టైటిల్ను ‘అశ్వథ్థామ’గా ఫిక్స్ చేశారు. అంతేకాకుండా ఈ సినిమా టైటిల్ పోస్టర్ను విడుదల చేశారు. టైటిల్ లోగో అండ్ డిజైన్ ఆకట్టుకునేలా ఉంది. రమణ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. వచ్చే ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న ‘వెంకీ మామ’, నందమూరి బాలకృష్ణ ‘రూలర్’. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో కల్యాణ్రామ్ హీరోగా నటిస్తున్న ‘ఎంతమంచి వాడవురా’,సత్యదేవ్, ఇషారెబ్బ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న‘రాగల 24 గంటల్లో’ చిత్రాలు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ రిలీజ్ చేసిన పోస్టర్లు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి, . అంతేకాకుండా నిఖిల్ ‘అర్జున్ సురవరం’సినిమాకు సంబంధించిన అప్డేట్ను కూడా దీపావళి కానుకగా విడుదల చేసింది. ‘ఠాగూర్’ మధు సమర్పణలో రాజ్కుమార్ అకెళ్ల నిర్మాణంలో టి. సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబరు 29న విడుదల కానుంది. ఇక దీపావళి కానుకగా సోషల్ మీడియా వేదికగా ఆయా చిత్రాలకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. -
పండగ తెచ్చారు
ఈ దీపావళికి సినిమా అభిమానుల మనసుకి సంతోషమనే వెలుగును అందించింది టాలీవుడ్. కొత్త సినిమా ప్రకటనలు, చిత్రీకరణ విశేషాలు, కొత్త పోస్టర్స్తో దీపావళి సంబరాలను డబుల్ చేసింది. బాలకృష్ణ హీరోగా కేఎస్. రవికుమార్ దర్శకత్వంతో తెరకెక్కుతోన్న సినిమాకు ‘రూలర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాలో పోలీసాఫీసర్గా నటిస్తున్నారు బాలకృష్ణ. సి. కల్యాణ్, సి.వి. రావ్, పత్సా నాగరాజు నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబరు 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆర్మీ మేజర్ అజయ్కృష్ణ పాత్రలో మహేశ్బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. దాదాపు పదమూడేళ్ల తర్వాత ఈ సినిమాలో నటిస్తున్నారు విజయశాంతి. దీపావళి సందర్భంగా ఈ సినిమాలోని మహేశ్ కొత్త పోస్టర్తో పాటు, విజయశాంతి ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్బాబు నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ‘అల.. వైకుంఠపురమలో..’ని ‘రాములో రాములా’ పాట టీజర్ను ఇటీవల విడుదల చేశారు. సరిలేరు నీకెవ్వరులో విజయశాంతి అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. తమన్ స్వరకర్త. ‘రాములో రాములా’ పూర్తి పాటను విడుదల చేశారు. జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వెంకీమామ’. డి. సురేష్బాబు, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మాతలు. ఈ సినిమా కొత్త పోస్టర్స్ను విడుదల చేశారు. ఖాకీ తొడిగి, లాఠీ పట్టి మరోసారి పోలీసాఫీసర్గా డ్యూటీ చేయనున్నారు రవితేజ. పూజా హెగ్డే, అల్లు అర్జున్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో హీరోగా తన కొత్త సినిమా మొదలుకానున్నట్లు ప్రకటించారు రవితేజ. బి. మధు నిర్మించనున్నారు. రామ్గోపాల్వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’. ‘‘టైటిల్ని బట్టి ఇది రెండు బలమైన సామాజిక వర్గాల మధ్య జరిగే ఇతివృత్తం అనుకుంటారు కానీ, ఈ చిత్రకథాంశం అది కాదు. ట్రైలర్ను ఈరోజు విడుదల చేసి, సినిమాను నవంబర్లో విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో కల్యాణ్రామ్ హీరోగా నటిస్తున్న ‘ఎంతమంచి వాడవురా’ సినిమా చిత్రీకరణ ఈ నెల 31 నుంచి నవంబరు 10వరకు కేరళలో జరగనుంది. ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమాలో ఓ దృశ్యం శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 15న విడుదల కానుంది. సాయితేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘ప్రతిరోజూ పండగే’. ఈ సినిమా కొత్త పోస్టర్స్ను విడుదల చేశారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్కేఎన్ సహ–నిర్మాత. డిసెంబరు 20న విడుదల కానుంది. ఆది పినిశెట్టి నటిస్తున్న చిత్రం ‘క్లాప్’. పృథ్వీ ఆదిత్య దర్శకుడు. ఐబీ కార్తికేయన్ నిర్మాత. పి. ప్రభాప్రేమ్, మనోజ్, హర్ష సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. కల్యాణ్రామ్, మెహరీన్ నిఖిల్ హీరోగా నటించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. ‘ఠాగూర్’ మధు సమర్పణలో రాజ్కుమార్ అకెళ్ల నిర్మాణంలో టి. సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబరు 29న విడుదల కానుంది. చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తున్న ‘సూపర్ మచ్చి’ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. రిజ్వాన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు పులివాసు దర్శకుడు. నవీన్చంద్ర హీరోగా జి కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో భార్గవ్ మన్నె నిర్మిస్తున్న ‘హీరో హీరోయిన్’ కొత్త పోస్టర్ రిలీజ్ అయింది. ఈ దీపావళి పండగ ఇంకా చాలా పోస్టర్లను మోసుకొచ్చింది. బోలెడన్ని విశేషాలను తెచ్చింది. -
దీపావళి సందడి.. షేక్ చేస్తున్న తెలుగు హీరోల లుక్స్
దీపావళి సందడిని పురస్కరించుకొని మన తెలుగు హీరోలు వారి అభిమానులకు పండుగ గిఫ్ట్ ఇచ్చారు. మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు', బాలకృష్ణ ' రూలర్', వెంకీ- నాగచైతన్యల ' వెంకీమామ' , కళ్యాణ్రామ్ ' ఎంత మంచి వాడవురా' చిత్రాలకు సంబంధించి ఫస్ట్లుక్ను రిలీజ్ చేశారు. బులెట్ బైక్పై మహేశ్ అదుర్స్ సంక్రాంతి కానుకగా వస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు సంబంధించి మహేశ్ ఫస్ట్లుక్ అదిరిపోయింది. రౌడీల పని పట్టేందుకా అన్నట్లు బులెట్ బైకును నడుపుతున్నమహేశ్ సీరియస్ లుక్ అభిమానులకు పిచ్చెక్కిస్తోంది. ఇందులో మహేశ్ ఆర్మీ ఆఫీసర్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో 13 ఏళ్ల తర్వాత లేడీ సూపర్స్టార్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తుండగా ప్రకాశ్రాజ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. రష్మిక మండన కథానాయికగా నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12న థియోటర్లలోకి రాబోతుంది. 'రూలర్'గా గర్జిస్తానంటున్న బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీపావళి పండుగ సందర్భంగా చిత్ర టైటిల్, బాలకృష్ణ కొత్త లుక్ను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. తాజా చిత్రానికి 'రూలర్' అనే పేరును ఖరారు చేశారు. ఇందులో బాలకృష్ణ 'ధర్మ' అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన బాలకృష్ణ ఫస్ట్లుక్ ఆకట్టుకోగా, తాజాగా రిలీజైన పోస్టర్ అభిమానుల్ని అలరిస్తోంది. సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తుండగా ప్రకాశ్రాజ్ ,భూమిక కీలక పాత్రలు పోషించారు. రూలర్ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదరగొడుతున్న మామా అల్లుడి లుక్ విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య మొదటిసారిగా కలిసి నటిస్తున్న చిత్రం 'వెంకీమామ' . కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్పుత్, రాశీఖన్నాలు కథానాయికలుగా నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా వెంకీ, చైతూలకు సంబంధించిన లుక్ను చిత్రబృందం విడుదల చేసింది. తాజాగా రిలీజ్ చేసిన లుక్లో వెంకీ సాధారణ దుస్తుల్లో సాల్ట్ అండ్ పెపర్ లుక్తో, నాగచైతన్య ఆర్మీ అధికారిగా కనిపించారు. దసరాను పురస్కరించుకొని రిలీజ్ చేసిన టీజర్కు విశేష స్పందన రాగా, తాజాగా రిలీజ్ చేసిన లుక్ అభిమానులను విశేషంగా అలరిస్తోంది. సురేశ్ ప్రొడక్షన్స్లో తెరకెక్కుతున్న ఈ చిత్ర విడుదలకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. సంక్రాతికి కలుద్దామంటున్న' ఎంత మంచి వాడవురా' శతమానం భవతి చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సతీష్ వేగేశ్న నందమూరి కళ్యాణ్రామ్తో 'ఎంత మంచి వాడవురా' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా సంక్రాంతికి కలుద్దాం అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ ఫ్యామిలీ ఆడియెన్స్ను ఆకట్టుకుంటుంది. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో మెహరీన్ కథానాయికగా నటిస్తుండగా, సీనియర్ నటులు శరత్బాబు, సుహాసిని, నరేష్, విజయ్కుమార్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శతమానం భవతి చిత్రంతో మంచి హిట్ అందుకున్న సతీశ్ ఆ మ్యాజిక్ను రిపీట్ చేస్తాడా లేదా అనేది చూడాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే. -
‘సరిలేరు నీకెవ్వరు’.. విజయశాంతి ఫస్ట్ లుక్ ఇదే
బ్రేక్ ఇచ్చింది సినిమాలకు మాత్రమే కానీ తనలోని నటనకు, అభినయానికి కాదని ఒకేఒక్క స్టిల్తో అందరికి సమాధానమచ్చారు లేడీ అమితాబ్ విజయశాంతి. దాదాపు దశాబ్దకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ లేడీ సూపర్స్టార్.. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంలో విజయశాంతి పాత్రపై అందరిలోనూ ఆసక్తి, అంచనాలు భారీగా నెలకొన్నాయి. తాజాగా దీపావళి కానుకగా ‘సరిలేరు నీకెవ్వరూ’ టీం ఈ చిత్రంలో విజయశాంతి ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో విజయశాంతి భారతి పాత్రలో చాలా డీసెంట్ అండ్ క్లాస్గా కనిపించనున్నట్లు అర్థమవుతోంది. అయితే మరో యాంగిల్లో తన చూపుతోనే విలన్లకు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు కొట్టొచ్చినట్లు కనబడుతోంది. మరి ‘సరిలేరు నీకెవ్వరు’లో విజయశాంతి పవర్ ఫుల్ పాత్ర పోషిస్తుందా లేక క్లాస్గా కనిపించనుందా అనేది సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే. ఇక ప్రస్తుతం విజయశాంతి ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత తమ అభిమాన నటి ఫస్ట్ లుక్ చూసి ఫ్యాన్స్ తెగ ఆనందపడుతున్నారు. అంతేకాకుండా లేడీ సూపర్స్టార్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక విజయశాంతి ఫస్ట్ లుక్పై హీరో రానా స్పందించాడు. ‘తెరపై ఆమెను చూడటం అద్భుతంగా ఉంది’ అంటూ కామెంట్ చేశాడు. కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో మహేష్ ఒదిగిపోయారని, సూపర్ స్టార్ ఫ్యాన్స్కు సంక్రాంతికి డబుల్ ధమాకా అని చిత్ర యూనిట్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ సాంగ్తో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదల కానుంది. Introducing Lady Amitabh @vijayashanthi_m Garu as Bharathi in #SarileruNeekevvaru 😊 Can't-Wait for Sankranthi 2020 🤩 Wishing you all a Very Happy Diwali 💥@urstrulyMahesh @iamRashmika @AnilSunkara1 @ThisIsDSP @RathnaveluDop @prakashraaj#SarileruNeekevvaruOn12thJan pic.twitter.com/AlQlJ0ZFvR — Anil Ravipudi (@AnilRavipudi) October 26, 2019 -
చలో కేరళ
ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ కేరళకు వెళ్లనున్నారు. అక్కడ ఓ సీక్రెట్ మిషన్ను ప్లాన్ చేశారట. ఆ మిషన్ టార్గెట్ సంక్రాంతికి తెలుస్తుంది. మహేశ్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్ర చేస్తున్నారు మహేశ్బాబు. ఈ చిత్రంలో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంటోంది. త్వరలో ఓ షెడ్యూల్ను కేరళలో ప్లాన్ చేసినట్లు సమాచారం. అక్కడ ముఖ్యతారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. విజయశాంతి, ప్రకాష్రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ స్వరకర్త. ‘దిల్’ రాజు, మహేశ్ బాబు, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా జన వరి 12న విడుదల కానుంది. -
మహేష్బాబు ‘ఫ్యామిలీ’ ప్యాకేజీ!
సందేశాత్మక చిత్రాలతో వరుస హిట్లు కొట్టి అభిమానులను అలరిస్తున్నాడు సూపర్స్టార్ మహేష్బాబు. అయితే కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి టైం కేటాయించడంలోనూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. సినిమాల నుంచి కాస్త విరామం దొరికితే చాలు భార్య, పిల్లలతో కలిసి హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తాడు. అంతేకాదు అందుకు సంబంధించిన క్యూట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంటాడు. ఇక టాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల్లో ఒకడిగా వెలుగొందుతున్న మహేష్... ప్రచార ప్రకటనల్లోనూ అగ్ర స్థానంలోనే ఉన్నాడు. వరుస కమర్షియల్ యాడ్స్తో దూసుకుపోతున్నాడు. మహేష్బాబుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ అలాంటిది మరి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఏకంగా సూపర్స్టార్ ఫ్యామిలితో ఓ యాడ్ను రూపొందించింది. ఇందులో మహేష్తో పాటు అతడి భార్య నమ్రతా శిరోద్కర్, పిల్లలు గౌతం, సితారలు కూడా నటించారు. ఇందుకు సంబంధించిన విశేషాలను ట్విటర్లో షేర్ చేసుకున్న మహేష్... తమ కుటుంబమంతా కలిసి నటించడం ఇదే తొలిసారి అని.. ఇదో గొప్ప విశేషం అని పేర్కొన్నాడు. ఈ క్రమంలో సూపర్స్టార్ అభిమానులు.. ‘ అందరూ ఒకే ఫ్రేమ్లో కన్నుల పండువగా ఉంది. మిమ్మల్ని ఇలా చూడాలనుకున్న కల నేటికి నెరవేరింది. క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మహేష్ బాబు తన సొంత దుస్తుల బ్రాండ్ కూడా ఓపెన్ చేసి పక్కా బిజినెస్మ్యాన్ అనిపించుకున్న సంగతి తెలిసిందే. కాగా మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ వచ్చే ఏడాదిలో విడుదల కానున్నట్లు సమాచారం. It's a first for us ❤Had a great time on this one !! Thank you team Sai Surya Developers for making this happen!!https://t.co/lnIsOH5O0o — Mahesh Babu (@urstrulyMahesh) October 24, 2019 -
ఫైనల్కొచ్చేశారు
‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ తుది దశకు చేరుకుంది. చివరి షెడ్యూల్ మినహా షూటింగ్ పూర్తయిందని చిత్రబృందం తెలిపింది. మహేశ్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ సుంకర, ‘దిల్’ రాజు, మహేశ్బాబు నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా కథానాయిక. విజయ శాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే ఓ షెడ్యూల్ను ప్రత్యేకంగా వేసిన ఇంటి సెట్లో పూర్తి చేశారు. కథానుసారం ఇది విలన్ (ప్రకాశ్ రాజ్) ఇల్లు అని సమాచారం. ఈ సెట్ రూపొందించడానికి రెండున్నర కోట్లు ఖర్చు చేశారట. త్వరలో చివరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: రత్నవేలు. అసురన్ బావుంది ధనుష్ హీరోగా వెట్రిమారన్ రూపొందించిన తమిళ చిత్రం ‘అసురన్’. ఇటీవల విడుదలైన ఈ సినిమాను చూసిన మహేశ్ ఆ సినిమాను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ‘‘అసురన్’ సినిమా చాలా నిజాయతీగా అనిపించింది. అద్భుతంగా ఉంది. టీమ్కి నా అభినందనలు’’ అన్నారు. -
దసరా సరదాలు
దసరా పండగ వచ్చింది. సినీ ప్రియులకు కూడా పండగ తెచ్చింది. పలు సినిమాల అనౌన్స్మెంట్లు, ముహూర్తాలు, కొత్త లుక్స్ రిలీజ్తో సరదాలు తెచ్చింది. వెంకటేశ్, నాగచైతన్యల మల్టీస్టారర్ చిత్రం ‘వెంకీ మామ’ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ట్రాక్టర్ మీద జంటలతో మామాఅల్లుళ్ల సందడి చూడొచ్చు. మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో...’ దసరా స్పెషల్ లుక్స్ రిలీజ్ అయ్యాయి. ‘నిశ్శబ్ధం’లో మాధవన్ మ్యూజీషియన్ ఆంథనీలా కనిపించనున్నారు. ఇందులో అనుష్క ముఖ్య పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. సుబ్బు అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ సాయితేజ్ ‘సోలో బతుకే సో బెటర్’ అనే సినిమా ముహూర్తం జరిగింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. రాజ్ తరుణ్, షాలినీ పాండే జంటగా చేస్తున్న ‘ఇద్దరి లోకం ఒకటే’ లుక్ విడుదల అయింది. నందినీ రెడ్డి కొత్త చిత్రాన్ని స్వప్నాదత్, ప్రియాంకాదత్ నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. దసరా సందర్భంగా నేడు మరికొన్ని చిత్రాల టీజర్లు, ట్రైలర్లు విడుదలకానున్నాయి. ‘అల వైకుంఠపురములో’ అల్లు అర్జున్, ‘నిశ్శబ్ధం’లో మాధవన్ ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేశ్బాబు బీవీఎస్ఎన్ ప్రసాద్, సాయి తేజ్ రాజ్ తరుణ్, షాలినీ పాండే -
గొడ్డలి పట్టిన మహేశ్ బాబు
‘మహర్షి’తో బాక్సాఫీస్ను కొల్లగొట్టిన టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నాడు. ఆర్మీ ఆఫీసర్ అజయ్ కృష్ణ పాత్రలో మహేష్ బాబు కనిపించనున్నాడు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈసినిమాను సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. మహేశ్ బాబు అభిమానులకు దసరా కానుకగా సినిమాకు సంబంధించిన పోస్టర్ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. కొండారెడ్డి బురుజు ముందు గొడ్డలి పట్టిన సూపర్ స్టార్ మహేశ్ బాబు మాస్ లుక్ను చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెటిజన్లను తెగ ఆకట్టుకోవడంతో తెగ వైరల్గా మారుతోంది. కాగా, ప్రస్తుతం రిలీజ్ అయిన పోస్ట్ర్తో సినిమాపై మరింత హైప్ను క్రియేట్ చేశాయని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయినట్టు సమాచారం. సుమారు దశాబ్ద కాలం తర్వాత సీనియర్ నటి విజయశాంతి ‘సరి లేరు నీకెవ్వరు’ తో రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
కొండారెడ్డి బురుజు @ నాలుగున్నర కోట్లు
సరిగ్గా పదహారేళ్ల క్రితం కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్ దగ్గర కర్నూలు ఫేమస్ రౌడీ అయిన ఓబుల్ రెడ్డిని కొట్టి, స్వప్నను తన దగ్గర నుంచి తీసుకెళ్తాడు అజయ్. ‘ఒక్కడు’ సినిమాలో యాక్షన్ సన్నివేశం ఇది. తెలుగు సినిమాల్లో ఉత్కంఠకు గురి చేసే సన్నివేశాల్లో ఈ సీన్ కచ్చితంగా ఉంటుంది. 16 ఏళ్ల తర్వాత మళ్లీ కొండారెడ్డి బురుజు దగ్గర మహేశ్బాబు సినిమా షూటింగ్ జరుగుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ సుంకర, ‘దిల్’ రాజు నిర్మాతలు. రష్మికా మందన్నా కథానాయిక. ఈ సినిమా కోసం కర్నూల్ కొండారెడ్డి బురుజు సెట్ను హైదరాబాద్లో వేసిన సంగతి తెలిసిందే. ఈ సెట్ను నిర్మించడానికి సుమారు నాలుగున్నర కోట్లు ఖర్చయిందని సమాచారం. ఆర్ట్ డైరెక్టర్ ఏయస్ ప్రకాశ్ ఆధ్వర్యంలో సెట్ రూపకల్పన జరిగింది. ‘‘పదహారేళ్ల క్రితం ఈ లొకేషన్ (‘ఒక్కడు’ కర్నూల్ సీన్స్ని ఉద్దేశించి) సిల్వర్ స్క్రీన్ మీద ఐకానిక్ అయింది. ఈసారి దాన్ని మించేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాం’’ అని అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. -
‘ఒక్కడు’కు మించి హిట్ సాధిస్తాం
మహర్షి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నాడు. ఆర్మీ ఆఫీసర్ అజయ్ కృష్ణ పాత్రలో మహేష్ బాబు కనిపించనున్నాడు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈసినిమాను సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కొన్ని రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లోని ఫిలింసిటీలో జరుగుతోంది. సుమారు 4కోట్ల వ్యయంతో ఈ సెట్ను వేశారని తెలిసింది. కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్లో కొన్ని కీలకఘట్టాలు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలోని కొండారెడ్డి బురుజు సెంటర్ వద్ద మహేశ్కు సంబంధించిన స్టిల్ను దర్శకుడు అనిల్ రావిపూడి రివీల్ చేశాడు. ‘16 ఏళ్ల క్రితం ఈ కట్టడం(కొండారెడ్డి బురుజు) సిల్వర్ స్క్రీన్ మీద రికార్డును క్రియేట్ చేసింది(ఒక్కడు సినిమాతో). ఇప్పుడు అదే కట్టడం వద్ద అంతకుమించి హిట్ కోసం సిద్ధమవుతున్నాం. మా ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ గారు ఈ కట్టడాన్ని అద్భుతంగా రూపొందించారు. కర్నూల్ కొండారెడ్డి బురుజును ఆయన ఫిలిం సిటీకి తీసుకొచ్చారు’’ అంటూ అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు. అంతేకాకుండా ఆ లోకేశన్లో మహేశ్ దిగిన పోటోను కూడా జత చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. ‘ఒక్కడు’ సినిమాలో కొండా రెడ్డి బురుజు సెంటర్లో ప్రకాష్ రాజ్తో ఫైట్ చేశారు మహేశ్బాబు. ఆ సినిమాలో ఆ సీన్ ఓ హైలైట్గా నిలిచింది. ఇక ఇప్పుడు అదే కట్టడాన్ని మరోసారి మహేష్ కోసం రీ క్రియేట్ చేశారు. సుమారు దశాబ్ద కాలం తర్వాత సీనియర్ నటి విజయశాంతి ‘సరి లేరు నీకెవ్వరు’ తో రీఎంట్రీ ఇవ్వనుండటంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. 16 years ago, this location became iconic on the silver screen. Now we are back to the same location. This time we aim to make it bigger. Our production designer A.S prakash garu recreated the location spectacularly.The man who brought Kurnool Kondareddy Buruju to Ramoji FilmCity pic.twitter.com/OcAaWEA8K1 — Anil Ravipudi (@AnilRavipudi) September 23, 2019 -
‘అమ్మో.. దేవీ అదరగొట్టేశారు’
సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్. హీటెక్కించే మాస్ సాంగ్ అయినా.. ఎప్పటికీ నిలిచిపోయే క్లాసికల్ సాంగ్ అయినా, ప్రేమ పాటలు, విషాద పాటలు ఇలా అన్నింటిలో తన ముద్ర వేస్తూ.. సంగీత ప్రియుల్ని అలరిస్తున్నారు. టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్గా నిరంతరం బిజీగా ఉండే.. దేవీ ప్రస్తుతం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం కలిస్తే.. ఇక ఆ పాట ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలిసిందే. వీరి కాంబినేషన్లో మహేష్ బాబుకు చాలానే హిట్ సాంగ్స్ పడ్డాయి. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షిలతో హ్యాట్రిక్ కొట్టిన ఈ ద్వయం ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’కు పనిచేస్తున్నారు. తాజాగా ఈ మూవీకి ఓ పాట రాసినట్టు.. దానికి అద్భుతమైన ట్యూన్ ఇచ్చినట్టు రామజోగయ్య శాస్త్రి ట్వీట్ చేశారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. ఆమ్మో @ThisIsDSP గారు అదరగొట్టేసారు 💕పూర్తి సంతృప్తి I am sure Bro💕 will like it💕#SarileruNeekevvaru — Ramajogaiah Sastry (@ramjowrites) September 21, 2019 -
పూజకు వేళాయె!
కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్లో విలన్లను రప్ఫాడించిన అజయ్ కృష్ణ తర్వాత గుడిలో పూజలు చేయనున్నారు. మహేశ్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నారు మహేశ్బాబు. కొన్ని రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. అక్కడ వేసిన కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్లో ఇంట్రవెల్ బ్యాక్డ్రాప్ ఫైట్తో పాటు, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీక రించారని తెలిసింది. ఈ షెడ్యూల్కి మంగళవారంతో ప్యాకప్ చెప్పారు. నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభం అవుతుంది. దేవాలయం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను ప్లాన్ చేశారని సమాచారం. రాజేంద్రప్రసాద్, విజయశాంతి కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్బాబు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
‘మాకు విజయశాంతే కావాలి అనేవారు’
సుమారు దశాబ్ద కాలం తర్వాత సీనియర్ నటి విజయశాంతి ‘సరి లేరు నీకెవ్వరు’ తో రీఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు టాలీవుడ్లో తన నటన, డ్యాన్స్లతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న నాటి అగ్రనటి రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమాలకు దూరమయ్యారు. నాయుడమ్మ(2006) తర్వాత మళ్లీ మేకప్ వేసుకుని కెమెరా ముందుకు రాబొతున్న విజయశాంతి తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత హీరోయిన్లలో సినిమా పట్ల శ్రద్ద కొరవడిందని విమర్శించారు. ‘గతంలో మేము ఏడాదికి 17-18 సినిమాల్లో నటించేవాళ్లం. రోజుకు ఆరు షిఫ్టుల్లో పనిచేసేవాళ్లం. ఒక్కొసారి ఉదయం ఐదు గంటలకు షూటింగ్కు వెళితే మరుసటి రోజు ఉదయం ఐదు గంటలకు ఇంటికి వచ్చే వాళ్లం. అంతలా క్రమశిక్షణ, నిబద్ధతతో సినిమాలు చేసేవాళ్లం. అప్పట్లో అందరు డైరెక్టర్లు, నిర్మాతలు మాకు విజయశాంతే కావాలనేవారు. నేను మాత్రం ఎన్ని సినిమాల్లో నటించగలను. చాలా సినిమాలు డేట్స్ కుదరక వదిలేశాను. ఇక ప్రస్తుత హీరోయిన్లు జనాలను ఆకట్టుకునే విధంగా నటించడం లేదు’అంటూ విజయశాంతి వ్యాఖ్యానించారు. ఇక ‘మహర్షి’ బ్లాక్బస్టర్ హిట్ తర్వాత మహేశ్ బాబు నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా.. విజయశాంతి కీలకపాత్రలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాం విడుదల కానుంది. -
మహేష్ మూవీలో మిల్కీ బ్యూటీ
మహర్షి సినిమాతో మరో సూపర్హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నాడు. ఎఫ్ 2 తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాతో సీనియర్ హీరోయిన్ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సినిమాలో కీలక సందర్భంలో వచ్చే ఓ స్పెషల్ సాంగ్లో స్టార్ హీరోయిన్ ఆడిపాడనున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో బిజీగా ఉన్న మిల్కీ బ్యూటీ తమన్నా మహేష్ సినిమాలో ప్రత్యేక గీతంలో నటించేందుకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. గతంలో మహేష్ హీరోగా తెరకెక్కిన ఆగడు సినిమాలో హీరోయిన్గా నటించిన తమన్నా ఇప్పుడు మరోసారి సూపర్ స్టార్తో ఆడిపాడనున్నారు. -
టీనేజ్లోకి వచ్చావ్.. ఎంజాయ్ చెయ్
సూపర్స్టార్ కృష్ణ వెండితెరను ఏలుతున్న తరుణంలో.. మహేష్ బాబు బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో హీరోగా మారి టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం టాప్ హీరోల్లో ఒకడిగా ఉంటూ.. బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకుపోతున్నాడు. అలాగే మహేష్ తన కుమారుడు గౌతమ్ను కూడా బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేయించారు. నేటితో గౌతమ్ టీనేజ్లోకి వచ్చాడని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. సోషల్ మీడియాలో మహేష్ బాబుకు ఎంత ఫాలోయింగ్ ఉంటుందో.. గౌతమ్, సితారలకు కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ చేసిన వన్ నెనొక్కడినే చిత్రంలో గౌతమ్ నటించిన సంగతి తెలిసిందే. ‘పదమూడో పుట్టినరోజు జరుపుకుంటున్న గౌతమ్కు శుభాకాంక్షలు. నువ్వు అధికారికంగా ఓ యుక్తవయస్కుడివి అయ్యావు. నీ ఈ కౌమార దశను సరదాగా, అడ్వెంచర్స్తో సెలబ్రేట్ చేసుకోవాలి’ అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశాడు. మహేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా ఉన్నాడు. Wishing u a happy 13th my son, Gautam! Ur officially a teenager :) :) Celebrate your adolescence with loads of fun & adventure! ♥♥ pic.twitter.com/Ku3g0wU4ww — Mahesh Babu (@urstrulyMahesh) August 31, 2019 -
కొండారెడ్డి బురుజు సెంటర్లో...
‘ఒక్కడు’ సినిమాలో కొండా రెడ్డి బురుజు సెంటర్లో ప్రకాష్ రాజ్తో ఫైట్ చేశారు మహేశ్బాబు. ఆ సినిమాలో ఆ సీన్ ఓ హైలైట్గా నిలిచింది. ఇప్పుడు మరోసారి అదే సెంటర్లో అడుగుపెట్టారు మహేశ్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మికా మందన్నా కథానాయిక. ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేశ్బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం కర్నూల్లో ఫేమస్ కొండారెడ్డి బురుజు సెంటర్ను హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో సెట్ వేశారు. సుమారు 4కోట్ల వ్యయంతో ఈ సెట్ను వేశారని తెలిసింది. ఆ సెట్లోనే ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. రాజేంద్రప్రసాద్, మహేశ్బాబు మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాలో విజయ శాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. -
పోల్కంపల్లిలో కొండారెడ్డి బురుజు
సాక్షి, సంగారెడ్డి : ఆంధ్రప్రదేశ్ కర్నూలులో ఉండాల్సిన కొండారెడ్డి బురుజు మన జిల్లాకు వచ్చింది. అదెలా సాధ్యమనుకుంటున్నారా..? ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లిలో మహేష్బాబు సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ కోసం ఏర్పాటుచేశారు. గతంలో ‘ఒక్కడు’ సినిమాలో కొండారెడ్డి బురుజు వద్ద మహేష్బాబు, ప్రకాష్రాజ్తో ఫైట్ సీన్ గుర్తుంది కదా. ఇక్కడ ‘మీనాక్షి’, ‘మహర్షి’ తదితర సినిమాలకు భారీ సెట్టింగ్లు వేశారు. మళ్లీ ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా కోసం కొండారెడ్డి బురుజు సెట్టింగ్ తీర్చిదిద్దారు. 25 నుంచి షూటింగ్ ప్రారంభంకానుంది. – ఇబ్రహీంపట్నం రూరల్ -
సినిమా టైటిల్ లీక్ చేసిన హీరోయిన్
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న సాండల్వుడ్ బ్యూటీ రష్మిక మందన్న. ఇప్పటికే, కన్నడ, తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళనాట తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కోలీవుడ్లో కార్తీ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఫోటోను తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేసిన రష్మిక.. సుల్తాన్ (#Sultan) అనే హ్యాష్ ట్యాగ్ను షేర్ చేశారు. దీంతో సినిమా టైటిల్ ఇదే అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించకుండానే రష్మిక ఇలా టైటిల్ లీక్ చేయటంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఈ సినిమాతో పాటు తెలుగులో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు రష్మిక. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాలోనే రష్మికనే హీరోయిన్ అన్న ప్రచారం జరుగుతోంది. -
సరిలేరు మీకెవ్వరు
‘నిప్పుల వర్షమొచ్చినా జనగణమణ అంటూ దూకేవాడే సైనికుడు. మంచు తుఫాను వచ్చినా వెనకడుగు లేదంటూ దాటేవాడే సైనికుడు...’ అంటూ దేశ సరిహద్దుల్లో పోరాటం చేస్తున్న సైనికులను ‘సరిలేరు మీకెవ్వరు’ అంటోంది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రబృందం. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మహేశ్బాబు సైనికుడి పాత్ర చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలో ‘నిప్పుల వర్షమొచ్చినా....’ అంటూ సాగే టైటిల్ సాంగ్ను రిలీజ్ చేశారు. ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేశ్బాబు నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా కథానాయిక. విజయశాంతి, సంగీత ముఖ్య పాత్రలు చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది. -
మహేష్ ఇండిపెండెన్స్ డే గిఫ్ట్
సూపర్ స్టార్ మహేష్ బాబు స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇటీవల సరిలేరు నీకెవ్వరు టీజర్లో ఆకట్టుకున్న చిత్రయూనిట్ తాజాగా టైటిల్సాంగ్ను రిలీజ్ చేశారు. ఇండియన్ ఆర్మీకి ట్రిబ్యూట్గా ఈ పాటను విడుదల చేశారు సరిలేరు నీకెవ్వరు టీం. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ పాటను సైకిల్ ఫోటోలు వీడియోలతో రిలీజ్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో 13 ఏళ్ల తరువాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ 2020 సంక్రాంతికి విడుదల కానుంది. -
ఇట్స్ మేకప్ టైమ్
విజయశాంతి సినిమాలకు బ్రేక్ ఇచ్చి 13 ఏళ్లయింది. ఇప్పుడు ఆమె మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు.. అద్దం ముందు నిల్చుని డైలాగ్ పేపర్ చెక్ చేసుకుంటున్నారు. యాక్షన్, కట్ పదాల మధ్యలో మళ్లీ తన యాక్టింగ్ స్కిల్ని ఆడియన్స్కి చూపించడానికి రెడీ అయ్యారు. మహేశ్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనీల్ సుంకర, ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. రష్మికా మందన్నా కథానాయిక. ఇందులో విజయశాంతి కీలక పాత్ర చేస్తున్నారు. సోమవారం షూటింగ్లో జాయిన్ అయ్యారామె. ‘‘అదే క్రమశిక్షణ, అదే డైనమిజం, అదే యాటిట్యూడ్. 13 ఏళ్లలో విజయశాంతిగారు ఏం మారలేదు’’ అన్నారు అనిల్ రావిపూడి. కాగా విజయశాంతిది మహేశ్తో సమానంగా సాగే పాత్ర అని తెలిసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. -
13 ఏళ్ల తర్వాత విజయశాంతి తొలిసారిగా..
ప్రముఖ నటి విజయశాంతి.. చాలా కాలం తర్వాత సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి హీరో మహేశ్బాబు ఇంట్రోను చిత్ర బృందం విడుదల చేసింది. తాజాగా విజయశాంతి 13 ఏళ్ల తర్వాత మేకప్ వేసుకున్నారంటూ దర్శకుడు అనిల్ రావిపూడి ఓ ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘ఇట్స్ మేకప్ టైమ్ ఫర్ విజయశాంతి గారు’ అంటూ అనిల్ పేర్కొన్నాడు. ఈ 13 ఏళ్లలో ఆమె ఏ మాత్రం మారలేదు. అదే క్రమశిక్షణ, అదే వైఖరి, అదే డైనమిజమ్ అంటూ.. విజయశాంతి రీ ఎంట్రీకి స్వాగతం తెలిపాడు. మహేష్ బాబు కూడా విజయశాంతికి స్వాగతం తెలుపుతూ ట్వీట్ చేశాడు. అలాగే ఈ చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా ‘వెల్కమ్ మేడమ్’ అంటూ అనిల్ పోస్ట్ను రీట్వీట్ చేశాడు. ఒకప్పుడు లేడీ సూపర్స్టార్గా అభిమానులను అలరించిన విజయశాంతి గత కొన్నేళ్లుగా రాజకీయాలకే పరిమితం అయ్యారు. కాగా, ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు రానుంది. దృక్పథం మారదు.. అనిల్ రావిపూడి, మహేష్ ట్వీట్లపై స్పందించిన విజయశాంతి.. వారి స్వాగతాన్ని గౌరవిస్తున్నట్టు తెలిపారు. ‘దృక్పథం అనేది మనిషి గొప్పతనాన్ని తెలుపుతుంది. వాతావరణం అనేది మారచ్చు కానీ.. దృక్పథం మారదు’అని పేర్కొన్నారు. -
మహేష్ని ఆడేసుకుంటున్నారు!
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల పరంగా సక్సెస్ సాధిస్తూనే ఉన్నా... లుక్ పరంగా మాత్రం ప్రయోగాల చేయటం లేదన్న విమర్శ ఉంది. కథా కథనాలతో సంబంధం లేకుండా ప్రతీ సినిమాలోనూ ఒకే విధంగా కనిపించటంపై అభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు. ఇటీవల వచ్చిన మహర్షి సినిమాలో కొత్తగా ట్రై చేసి భారీగా మార్పు మాత్రం కనిపించలేదు. తాజాగా మహేష్ పుట్టిన రోజు సందర్భంగా సరిలేరు నీకెవ్వురు ఫస్ట్లుక్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో మిలటరీ మేజర్గా నటిస్తున్న మహేష్ రొటీన్ లుక్లోనే దర్శనమిచ్చాడు. గతంలో మిలటరీ ఆఫీసర్గా నటించిన అల్లు అర్జున్, పోలీస్ గా నటించిన రామ్చరణ్లు క్యారెక్టర్ కోసం చాలా మేకోవర్ అయ్యారు. మహేష్ మాత్రం అలాంటివేం లేకుండా తన రొటీన్ లుక్లోనే యూనీఫాంలో కనిపించాడు. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. మరి ఈ విమర్శలపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ఎలా స్పందిస్తారో చూడాలి. -
నువ్వెళ్లే రహదారికి జోహారు
మేజర్ అజయ్కృష్ణ రిపోర్ట్ చేశాడు. పుట్టినరోజు నాడు ఇంట్రో టీజర్తో ఆడియన్స్కు మంచి కిక్ ఇచ్చాడు. మహేశ్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటించారు. ఈ చిత్రంలో మేజర్ అజయ్కృష్ణ పాత్రలో నటిస్తున్నారు మహేశ్. శుక్రవారం (ఆగస్టు 9) మహేశ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా ఇంట్రో టీజర్తో పాటు మహేశ్ లుక్ను విడుదల చేశారు. ‘సరిలేరు నీకెవ్వరు.. నువ్వెళ్లే రహదారికి జోహారు... సరిలేరు నీకెవ్వరు.. ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు’ అనే లిరిక్స్తో ఇంట్రో టీజర్ అదరిపోయిందంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. రాజేంద్రప్రసాద్, విజయశాంతి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్బాబు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
మేజర్ అజయ్ కృష్ణ రిపోర్టింగ్..
సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా సరిలేరు నీకెవ్వరు చిత్ర బృందం అభిమానులను ఓ కానుకను అందజేసింది. ఈ చిత్రానికి సంబంధించి మహేష్ బాబు లుక్ను ది ఇంట్రో పేరుతో శుక్రవారం విడుదల చేశారు. మేజర్ అజయ్ కృష్ణ రిపోర్టింగ్ అంటూ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. ఆర్మీ మేజర్ లుక్లో మహేష్ చాలా స్టైలిష్గా ఉన్నాడు. సరిలేరు నీకెవ్వరు.. నువ్వేళ్లే రహదారికి జోహర్లు, ఎనలేని త్యాగానికి నువ్వే మారు పేరు అంటూ సాగే బ్యాగ్రౌండ్ బిట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రముఖ నటి విజయశాంతి ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నట్టు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది. మరోవైపు మహేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన నటుడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా మహేష్కు విషెస్ అందజేశారు. హరీశ్ శంకర్, రామజోగయ్య శాస్త్రి, మెహర్ రమేశ్, రకుల్ప్రీత్ సింగ్, సుషాంత్, శ్రీను వైట్ల, దేవీ శ్రీ ప్రసాద్, కోన వెంకట్, సంపత్ నంది, సీనియర్ నరేశ్, ఈషా రెబ్బా, అనిల్ సుంకర, వెన్నెల కిశోర్, అనిల్ రావిపూడి సూపర్ స్టార్కు ట్విటర్ వేదికగా బర్త్డే విషెస్ తెలిపారు. అలాగే సరిలేరు నీకెవ్వరు చిత్రానికి అల్ ది బెస్ట్ చెప్పారు. -
మూడు రోజుల్లో స్టెప్ ఇన్
పదమూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ స్క్రీన్ మీద కనిపించనున్నారు విజయశాంతి. మరో మూడు రోజుల్లో కెమెరా ముందుకు రాబోతున్నారని సమాచారం. మహేశ్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో విజయశాంతి కీలక పాత్ర చేస్తున్నారు. ‘దిల్’ రాజు, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా కథానాయిక. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఆగస్ట్ 9 నుంచి విజయశాంతి చిత్రీకరణలో పాల్గొంటారని తెలిసింది. 9 నుంచి ఓ వారంపాటు షూటింగ్లో పాల్గొంటారట. ఆ తర్వాత చిన్న బ్రేక్ తీసుకొని మళ్లీ జాయిన్ అవుతారు. ఈ సినిమా కోసం సుమారు 55 రోజులు డేట్స్ను కేటాయించారట విజయశాంతి. దీన్ని బట్టి ఆమె పాత్ర ఈ సినిమాలో ఎంత కీలకంగా ఉండబోతోందో ఊహించవచ్చు. మహేశ్బాబుతో పాటు సాగే పాత్రలో విజయశాంతి కనిపిస్తారని సమాచారం. ఈ పాత్ర కోసం విజయశాంతి ఫిట్గా మారిపోయారు కూడా. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
ట్రైన్లో ప్రయాణిస్తున్న సూపర్స్టార్
సూపర్స్టార్ మహేష్బాబు ప్రస్తుతం దూకుడు మీదున్నాడు. ఇటీవలె మహర్షి సినిమాతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టి.. మరో చిత్రంతో బిజీ అయ్యారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఆ సినిమాను దించేందుకు శరవేగంగా షూటింగ్ను పూర్తి చేస్తున్నారు. ఈ మూవీ యూనిట్ ఫస్ట్ షెడ్యూల్ను కశ్మీర్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. ఇక హైదరాబాద్ షెడ్యూల్లో బిజీ అయింది చిత్రబృందం. తాజాగా మహేష్కు సంబంధించిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో రైళ్లో మహేష్ ప్రయాణిస్తుండగా.. బ్యాక్ సైడ్ నుంచి తీసిన ఆ పిక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. యూనిట్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో వేసిన ట్రైన్ సెట్లో ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రష్మిక మందాన్నాతో కలిసి మహేష్ బాబు ఈ రైలు ప్రయాణం చేస్తుండగా.. చికుబుకు రైలులో ఆడిపాడతారో, తియ్యని కబుర్లు చెప్పుకుంటారో లేక మహేశ్బాబు విలన్లను రప్ఫాడిస్తారో తెలియాలంటే వచ్చే సంక్రాంతి వరకూ ఆగాల్సిందే. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన్న హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. -
బర్త్డేకి ఫస్ట్ లుక్?
‘సరిలేరు నీకెవ్వరు’లో మహేశ్బాబు గెటప్కు సంబంధించిన లుక్స్ కొన్ని నెట్టింట్లో వైరలయ్యాయి. కానీ అవి అంత క్లారిటీగా లేవు. ఫుల్ క్లారిటీగా ఉన్న ఫొటోలను త్వరలో చూసే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల 9న మహేశ్బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సరిలేరు నీకెవ్వరు’లోని మహేశ్ లుక్ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందట. ఇందులో మహేశ్బాబు ఆర్మీ మేజర్గా నటిస్తున్నారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. రైల్వేస్టేషన్ బ్యాక్డ్రాప్లో లవ్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
గిఫ్ట్ సిద్ధం చేస్తున్న సూపర్ స్టార్!
మహర్షి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన మహేష్ ఓ సర్ప్రైజ్ను సిద్ధం చేస్తున్నాడట. ఈ నెల 9న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఓ మైక్రో టీజర్తో పాటు మహేష్ లుక్ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించనున్నాడు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈసినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
చికుబుకు రైలే...
రైలు ప్రయాణం చేస్తున్నారు మహేశ్బాబు. ఒంటరిగా కాదు రష్మికా మండన్నాతో. చికుబుకు రైలులో ఆడిపాడతారో, తియ్యని కబుర్లు చెప్పుకుంటారో లేక మహేశ్బాబు విలన్లను రప్ఫాడిస్తారో తెలియాలంటే వచ్చే సంక్రాంతి వరకూ ఆగాల్సిందే. మహేశ్బాబు, రష్మికా మండన్నా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’లోనే ఈ ట్రైన్ సీన్ ఉంది. యూనిట్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో వేసిన ట్రైన్ సెట్లో ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మహేశ్, రష్మికలతో పాటు చిత్రంలోని కీలక తారాగణం ఈ షెడ్యూల్లో పాల్గొంటారు. వచ్చే నెల 10 వరకూ హైదరాబాద్ షెడ్యూల్ జరుగుతుందని తెలిసింది. ఇందులో మహేశ్బాబు ఆర్మీ ఆఫీసర్ పాత్ర చేస్తున్నారు. విజయశాంతి కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసింవే. ‘దిల్’ రాజు, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. మహేశ్ హంబుల్: గత ఏడాది థియేటర్ బిజినెస్లోకి అడుగుపెట్టిన మహేశ్బాబు లేటెస్ట్గా దుస్తుల బ్రాండ్లోకి అడుగుపెట్టారు. ‘హంబుల్’ పేరుతో మొదలుపెట్టిన క్లాతింగ్ లైన్ను ఆగస్ట్ 7న ప్రారంభించబోతున్నారు. -
సెట్కు నాలుగు కోట్లు?
వెండితెరపై కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్ దగ్గర అజయ్వర్మ దెబ్బకు బెంబేలెత్తిపోయాడు ఓబుల్రెడ్డి. అంతే.. కబడ్డీ ప్లేయర్ అజయ్వర్మ అదుర్స్ అన్నారు ప్రేక్షకులు. పైన చెప్పిన సీన్ మహేశ్బాబు ‘ఒక్కడు’ సినిమా లోనిదని గుర్తుండే ఉంటుంది. అజయ్వర్మగా మహేశ్, ఓబుల్రెడ్డి పాత్రలో ప్రకాశ్రాజ్ కనిపించారు. ఇప్పుడు అదే సెంటర్లోకి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్ కోసం అజయ్ కృష్ణ అడుగుపెట్టనున్నారట. మహేశ్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మేజర్ అజయ్కృష్ణ పాత్రలో నటిస్తున్నారు మహేశ్బాబు. తాజా షెడ్యూల్ రేపటి నుంచి హైదరాబాద్లో ప్రారంభం కానుంది.లవ్ సీన్స్ను తీస్తారట. అలాగే త్వరలో కర్నూలులోని కొండారెడ్డి బురుజు సెంటర్కు చెందిన సన్నివేశాలను తెరకెక్కిస్తారట. ఇందుకోసం దాదాపు నాలుగు కోట్ల రూపాయలతో ఆల్రెడీ సెట్ వర్క్ని కూడా స్టార్ట్ చేశారని టాక్. కశ్మీర్ షెడ్యూల్కు ముందు అనిల్ రావిపూడి కర్నూలు లొకేషన్స్ను పరిశీలించారు. రామబ్రహ్మం సుంకర, దిల్ రాజు, మహేశ్బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
‘స్టన్నింగ్గా మహేష్ ఆర్మీ లుక్’
‘ఎఫ్2’తో భారీ హిట్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి.. సూపర్స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మహర్షి సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన స్టామినాను చూపిన మహేష్.. సైనికుడిగా నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ప్రధాన పాత్రను జగపతి బాబు పోషించాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఆపాత్రలో ప్రకాశ్ రాజ్ నటించబోతోన్నారని తెలుస్తోంది. కశ్మీర్లో చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిందని, ఆర్మీ లుక్లో మహేష్ అదిరిపోయాడని కెమెరామెన్ రత్నవేలు ట్వీట్ చేశారు. తనకు ఫెవరేట్ అయిన మహేష్ బాబుతో పనిచేయడం ఎల్లప్పుడూ ఎక్సైట్గా ఉంటుందని, అనిల్ రావిపూడితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. రెండో షెడ్యూల్ను ఈనెల 26నుంచి హైదరాబాద్లో ప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. It’s always exciting to work with my favourite @urstrulyMahesh !! Completed the first schedule at Kashmir in style ! MB sir looks stunning in the army look!! Pleasure working with Dir @AnilRavipudi ,@AKentsOfficial and @ThisIsDSP !! pic.twitter.com/nqrs9K0Saj — Rathnavelu ISC (@RathnaveluDop) July 21, 2019 -
మహేష్ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో జగపతిబాబు నటించడం లేదని సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. మహేష్, జగపతి బాబు మధ్య విభేదాల కారణంగానే ఆయన సినిమా నుంచి తప్పుకున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలుగు సినీపరిశ్రమలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలపై జగపతిబాబు స్పందించారు. తనకు మహేష్తో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని.. అవన్నీ తప్పుడు వార్తలని కొట్టిపారేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. ‘సినీ పరిశ్రమ అనేది నాకు కుటుంబంతో సమానం. వారి గురించి మాట్లాడటం సరికాదు. కానీ నాపై వస్తున్న తప్పుడు కథనాల మూలంగా 33 ఏళ్ల సినీ జీవితంతో తొలిసారి వివరణ ఇస్తున్నా. మహేష్ బాబు సినిమా నుంచి నన్ను తప్పించారంటూ వార్తలు వస్తున్నాయి. అవన్నీ తప్పుడు వార్తలు. మహేష్ సినిమా కోసం రెండు చిత్రాలను కూడా వదులుకున్నాను. ఈ క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ నాకు చేయాలని ఉంది. కానీ కొన్ని అనుకోని సంఘటన మూలంగా ఆ చిత్రంలో నటించడం కుదరటంలేదు. సోషల్ మీడియాలో వస్తున్నదంతా అసత్యం. మహేష్కి, చిత్ర యూనిట్కి ఆల్ ద బెస్ట్’’ అంటూ జగపతిబాబు వివరణ ఇచ్చారు. అయితే జగపతిబాబు స్థానంలో ప్రకాశ్రాజ్ను తీసుకున్నట్లు తెలుస్తోంది. -
మహేష్ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఎఫ్ 2తో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసర్గా నటిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి సీనియర్ నటుడు జగపతి బాబు తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై చిత్రయూనిట్ స్పందించకపోయినా జగపతి బాబుకు బదులు ప్రకాష్రాజ్ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. షూటింగ్లో పాల్గొనేందుకు కాశ్మీర్ వెళ్లిన జగ్గుభాయ్ తన పాత్రను ముందుగా చెప్పినట్టుగా తెరకెక్కించకపోవటంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
మేజర్ అజయ్కృష్ణ
కశ్మీర్లో ఆపరేషన్ షురూ చేశారు మేజర్ అజయ్కృష్ణ. ఈ ఆపరేషన్ డీటైల్స్ వచ్చే ఏడాది సంక్రాంతికి సిల్వర్ స్క్రీన్పై చూడొచ్చు. మహేశ్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో మేజర్ అజయ్కృష్ణ పాత్రలో మహేశ్బాబు నటిస్తున్నారు. రష్మికా మండన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కశ్మీర్లో జరుగుతోంది. నెక్ట్స్ షెడ్యూల్ను టీమ్ హైదరాబాద్లో ప్లాన్ చేసినట్లు తెలిసింది. ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్ బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా విజయశాంతి నటిగా రీ–ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.