-
'బిగ్బాస్' ఓటీటీ తెలుగు సీజన్ రద్దు? అదే అసలు కారణమా?
బిగ్బాస్ రియాలిటీ షో గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే మొన్నీమధ్యే డిసెంబరులో ఏడో సీజన్ పూర్తయింది. ఫినాలేలో రైతుబిడ్డ ప్రశాంత్ విజేతగా నిలవడం.. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట విధ్వంసం.. కార్లు, ఆర్టీసీ బస్సులు ధ్వంసం.. ఇలా ఎంత జరగాలో అంతా జరిగింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో ఓటీటీ సీజన్ ఉందన్నట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడేమో ఏకంగా అది రద్దయినట్లు చెబుతున్నారు. ఇంతకీ ఏమైంది? రద్దుకు కారణమేంటి? తెలుగులో బిగ్బాస్ షో ఇప్పటివరకు ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తొలి సీజన్ హిట్ అయింది. ఆ తర్వాత నుంచి మాత్రం ఏదో ఒక గొడవ అవుతూనే ఉంది. షో ఆపేయాలని విమర్శలు.. కోర్టు కేసులు.. ఇలా ప్రతిసారి రచ్చ అవుతూనే ఉంటుంది. ఇన్ని జరుగుతున్నా సరే షోని ఆపట్లేదు సరికదా ఓటీటీ సీజన్ కూడా ఆ మధ్యలో ఒకటి పెట్టారు. పాతవాళ్లతో పాటు కొత్తవాళ్లు పాల్గొన్న ఆ సీజన్లో బింధుమాధవి విన్నర్గా నిలిచింది. కాకపోతే ఆ సీజన్ ఫెయిలైంది. (ఇదీ చదవండి: స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న 'హనుమాన్' నటి?) అయితే రీసెంట్గా జరిగిన ఏడో సీజన్.. విమర్శల కారణంగా వార్తల్లో నిలిచింది. దీన్ని క్యాష్ చేసుకుందామని నిర్వహకులు పెద్ద ప్లాన్ వేశారు. ఫిబ్రవరిలో తొలి వారంలో ఓటీటీ సీజన్ మొదలుపెట్టేయాలని అనుకున్నారు. ఏడో సీజన్లో పాల్గొన్న భోలె షావళి, నయన పావని తోపాటు యావర్ కూడా ఈ సీజన్లో పాల్గొంటారని రూమర్స్ వచ్చాయి. కానీ వీళ్లు తప్పితే మిగతా వాళ్లు ఎవరూ దీనిపై కనీస ఆసక్తి చూపించట్లేదట. టీవీ సీజన్ అయితే వస్తాం గానీ ఓటీటీ సీజన్కి మాత్రం వచ్చేది లేదని చెబుతున్నారట. రెమ్యునరేషన్ పెంచి ఇస్తామని చెప్పినా సరే పెద్దగా ఆసక్తి చూపించట్లేదట. మరోవైపు నాగార్జున కూడా అందుబాటులో ఉండట్లేదు. దీంతో హోస్ట్ కూడా మారే ఛాన్స్ ఉంటుంది. ఇలా సమస్యలు ఎక్కువయ్యేసరికి నిర్వహకులు.. సీజన్ని రద్దు చేయాలని ఫిక్సయ్యారట. మరి ఇందులో నిజమేంటి అనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) -
డ్రెస్సింగ్పై ట్రోల్.. తనదైన స్టైల్లో నెటిజన్ నోరుమూయించిన బిందు
సోషల్ మీడియాలో తనపై నెగిటివ్ కామెంట్ చేసిన ఓ నెటిజన్కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది బిగ్బాస్ శివంగి బిందు మాధవి. అవకాయా బిర్యానీ, బంపర్ ఆఫర్ వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు పొందింది బిందు. తెలుగు అమ్మాయి అయిన బిందు ఇక్కడ అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్లో అదృష్టం పరీక్షించుకుంది. అక్కడ వరుస ఆఫర్లు అందుకుంటూ సౌత్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో తెలుగు బిగ్బాస్ నాన్స్టాప్ ఓటీటీ కంటెస్టెంట్గా దర్శనం ఇచ్చింది. హౌజ్లో తనదైన ఆట, యాటిటూడ్, మాటలతో గట్టి పోటి ఇస్తూ చివరికి బిగ్బాస్ నాన్స్టాప్ టైటిల్ గెలిచింది. చదవండి: నందమూరి ఫ్యామిలీకి కలిసిరాని ఆగస్టు, విషాదాలన్నీ ఈ నెలలోనే.. అంతేకాదు సంప్రాదాయమైన దుస్తులనే ధరించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న బిందుమాధవి తన తాజా పోస్ట్లో కాస్తా ట్రెండి డ్రెస్లో కనిపించింది. ఈ ఫొటోను తన ఇన్స్ట్రాగ్రామ్లో షేర్ చేయగా ఓ నెటిజన్ తన డ్రెస్సింగ్పై అభ్యంతరం వ్యక్తం చేసింది. బిగ్బాస్లో హౌజ్లో అందరు శరీరం కరిపించేలా డ్రెస్స్లు వేసుకుంటే.. తను మాత్రం కేవలం సంప్రదాయమైన అలంకరణకే ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో బిందు మాధవి అంటే రెస్పాక్ట్ పెరిగింది. కానీ ఇప్పుడు అది పోయింది. అందరి దగ్గర మార్కులు కొట్టాలనే ఉద్దేశంతోనే తను హౌజ్లో అలా ఉంది’ అంటూ విమర్శించారు. చదవండి: ‘కార్తీకేయ 2’ ప్రమోషన్స్కి అనుపమ డుమ్మా.. నిఖిల్ షాకింగ్ కామెంట్స్! Why this narrow minded people judge a women by her dressing they like a women by her clothes and not by her character. In telugu der is a saying "ఆడదానికీ ఆడదే శత్రువు" this is apt 4 dis girl🤨 Bindu gave slipper shot answer 👏 you go girl more power to you 🔥#BinduMadhavi pic.twitter.com/78NhUznHO3 — SiriKota (@SiriKota_04) August 2, 2022 దీంతో సదరు నెటిజన్ కామెంట్స్ బిందు స్పందించి తనదైన స్టైల్లో గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘హో.. మనం ధరించే దుస్తులను బట్టే వ్యక్తికి గౌరవం ఇస్తారంటే.. అలాంటి గౌరవం నాకు వద్దు’ అంటూ నెటిజన్ నోరు మూయించింది ఈ ఆడపులి. ప్రస్తుతం బిందు మాధవి సమాధానం నెట్టింట చర్చనీయాంశమైంది. బిందు ఇచ్చిన రిప్లైకు ఓ నెటిజన్ ఫిదా అయ్యాడు. ఈ కామెంట్సకు సంబంధించిన స్క్రీన్ షాట్ తీసి ట్విటర్లో పోస్ట్ చేస్తూ బిందుకు మద్దుతు తెలిపాడు. -
మనసులో మాట చెప్పమన్న అషూ, ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు
అషూ రెడ్డి.. బుల్లితెర ప్రేక్షకులకు, సోషల్ మీడియా యూజర్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉండే అషూ తరచూ తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ కనువిందు చేస్తోంది. టిక్టాక్ వీడియోస్తో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఆమె అదే క్రేజ్తో బిగ్బాస్ 3 ఆఫర్ కొట్టేసింది. దీంతో మరింత పాపులర్ అయిన అషూ రీసెంట్గా బిగ్బాస్ ఓటీటీలోను అడుగుపెట్టింది. చదవండి: ‘సమంత అలా ఒంటరిగా చనిపోవాలి’ కామెంట్పై సామ్ ఏమన్నదంటే.. ఫినాలేకు అతి దగ్గర్లో ఉండగా అనూహ్యాంగా హౌజ్ నుంచి బయటకు వచ్చింది అషూ. అప్పటి నుంచి హాట్హాట్ ఫొటోలకు ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె షేర్ చేసిన వీడియోపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె బిగ్బాస్ నాన్స్టాప్ సహా కంటెస్టెంట్ అజయ్తో కలిసి మిర్చి మూవీలోని అనుష్క డైలాగ్పై రీల్ చేసింది అషూ. ‘కాలం మారిపోయి పద్దతులు మారాయి కానీ నాకే కనుక స్వయంవరం పెడితే ఎంతమంది రాజులు గుర్రాలు వేసుకుని వచ్చెవారో తెలుసా?’ అని చెబుతుంది. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ చూసిన హాలీవుడ్ మూవీ రైటర్, జక్కన్నపై ఆసక్తికర వ్యాఖ్యలు ఈ డైలాగ్ విని పక్కనే ఉన్న అజయ్ అషూ తలపై ఒకట్టిస్తాడు. ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ‘మీ మనసులోని మాటను కామెంట్ చేయండి’ అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో రెచ్చిపోయిన నెటిజన్లు రకరకాలుగా వారి మనసులో మాటను బయటపెడుతూ అషూను దారుణంగగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. ‘ముందు మేకప్ తీసి రీల్ చేయ్ గుర్రాలు కాదు కదా.. కనీసం గాడిదలను వేసుకుని కూడా రారు’, ‘ముందు స్నానం చేయమ్మా.. కంపు కొడుతోంది.. ఆ తర్వాత రీల్ చేయ్’, ‘నీ ప్లాస్టిక్ సర్జరీ, మేకప్ ఫేస్కి అంత సీన్ లేదులే’ అంటూ దారుణంగా నెటిజన్లు దారుణంగా ల్రోల్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) -
బిగ్బాస్ నాన్స్టాప్ విన్నర్ బిందు మాధవికి బంపర్ ఆఫర్!
బిగ్బాస్ నాన్స్టాప్ విజేతగా బిందు మాధవి నిలిచిన విషయం తెలిసిందే. తెలుగు బిగ్బాస్ చరిత్రలో ఓ మహిళ విన్నర్గా నిలవడం ఇదే తొలిసారి. దీంతో తెలుగు బిగ్బాస్ విన్నర్గా నిలిచి బిందు మాధవి చరిత్ర సృష్టించింది. టాస్క్లో.. మాటల్లో ఆడపులిలా రెచ్చిపోయిన బిందుకి ఒక్కసారిగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ఇది వరకు ఆమె తెలుగులో పలు చిత్రాల్లో చేసిన రానీ గుర్తింపు ఒక్కసారిగా బిగ్బాస్ నాన్స్టాప్తో తెచ్చుకుంది. దీంతో ఆమెకు టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. చదవండి: కరణ్ జోహార్ బర్త్డే పార్టీ, ఒకే రంగు దుస్తుల్లో మెరిసిన రష్మిక, విజయ్ ఈ నేపథ్యంలో బిందుకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఏకంగా ఆమె ఓ స్టార్ డైరెక్టర్ సినిమాలో చాన్స్ కొట్టేసిందంటూ తాజాగా వార్తలు గుప్పుమన్నాయి. ఇండస్ట్రీలో వరుస హిట్స్తో దూసుకుపోతున్న యంగ్ డైరెక్టర్ అనిల్రావిపూడి తదుపరి ప్రాజెక్ట్లో నటించే చాన్స్ కొట్టేసిందని వినికిడి. కాగా ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 మూవీ ప్రమోషన్తో బిజీగా ఉన్నాడు. దగ్గుబాటి హీరో విక్టరి వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించి ఈ చిత్రం రేపు(మే 27న) ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని అనంతరం ఆయన బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. చదవండి: రాత్రి 11 గంటలు, కానిస్టేబుల్ వల్ల అభద్రతకు గురయ్యా: హీరోయిన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అనిల్ రావిపూడితో బాలయ్య సినిమా అనేసరికి అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో బిందు మాధవిని ఓ కీ రోల్ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా మెహ్రీన్ను ఖరారు చేసినట్లు సమాచారం. అంతేకాదు మరో యువ నటి శ్రీలీలా బాలయ్య కూతురిగా కనిపించబోతుందట. మరి ఇందులో బిందు మాధవి రోల్పై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే బాలయ్య కోసం తన కామెడీ టచ్ను పక్కన పెట్టి యాక్షన్పై దృష్టి పెట్టానని అనిల్ రావిపూడి ఇటీవల ఓ ఇంటర్య్వూలో చెప్పిన సంగతి తెలిసిందే. -
బిగ్బాస్ షోలో బిందుమాధవి పారితోషికం ఎంతో తెలుసా?
Bindu Madhavi Remuneration: బిగ్బాస్ తెలుగు ఓటీటీ విన్నర్గా నిలిచింది బిందు మాధవి. షో విజేతగా అవతరించడంతో ఆమెకు రూ.40 లక్షలు దక్కాయి. నిజానికి విన్నర్ ప్రైజ్మనీ అరకోటి. కానీ గ్రాండ్ ఫినాలే రోజు బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరీ రూ.10 లక్షలు తీసుకుని రేసు నుంచి తప్పుకుంది. దీంతో ఆ పది లక్షలు ప్రైజ్మనీలో నుంచి కోత పెట్టారు. అలా బిందు చేతికి 40 లక్షల రూపాయలు వచ్చాయి. ఇకపోతే బిగ్బాస్ నాన్స్టాప్ షో 12 వారాలు సాగింది. మరి 12 వారాలు హౌస్లో ఉన్నందుకు ఆమెకు ఎంత పారితోషికం వచ్చిందనుకుంటున్నారు? రూ. 55- 60 లక్షలు. అంటే మొత్తంగా బిందు ఇంచుమించు కోటి రూపాయలు గెల్చుకున్నట్లు తెలుస్తోంది. కానీ ట్యాక్స్ కటింగ్స్ వల్ల ఆమె చేతికి దాదాపు రూ.90 లక్షల మేరకు వచ్చే ఛాన్స్ ఉంది! మొత్తానికి బిందు ఈ రేంజ్లో రెమ్యునరేషన్ అందుకుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. కాగా బిందు తెలుగులో ఆవకాయ బిర్యానీ, బంపర్ ఆఫర్ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే! తమిళ బిగ్బాస్ మొదటి సీజన్లో పాల్గొన్న బిందు అక్కడ నాలుగో రన్నరప్గా నిలిచింది. ఇక తెలుగులో ఏకంగా ట్రోఫీ అందుకుని బిగ్బాస్ కప్పు గెలిచిన మొట్టమొదటి మహిళా విజేతగా అవతరించింది. చదవండి 👇 స్టార్ హీరో తండ్రికి అస్వస్థత, పొత్తికడుపులో రక్తస్రావం నా సినిమాను చంపేశారు: శేఖర్ నిర్మాత ఆవేదన
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
శబరి మూవీ.. వరలక్ష్మి శరత్కుమార్పై డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
Advertisement