-
కాగ్నిజెంట్లో కొలువుల జాతర: లక్ష ఉద్యోగాలు
సాక్షి, ముంబై: అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ గుడ్న్యూస్ చెప్పింది. ఈ ఏడాది సుమారు లక్ష మందిని ఒప్పంద ఉద్యోగులుగా నియమించుకోవాలని కాగ్నిజెంట్ భావిస్తోంది. సంస్థలో అట్రిషన్ రేటు అధికంగా నమోదవుతున్న కారణంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ ఏడాది 30 వేల మంది ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాలను కల్పించనుంది. 2022 ఏడాదిలో భారతదేశంలో ఫ్రెషర్లకు 45వేల ఆఫర్లను అందించాలని భావిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. కాగ్నిజెంట్కు ఇదొక అసాధారణమైన త్రైమాసికమనీ, అనేక సవాళ్ల మధ్య ముఖ్యంగా కోవిడ్-19 సంక్షోభంలో కూడా రెండవ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 15 శాతం ఎగిసి 4.6 బిలియన్ డాలర్లకు పెరిగిందనీ, 2015 నుండి ఇదే అత్యధిక త్రైమాసిక ఆదాయమని డిజిటల్ బిజినెస్ అండ్ టెక్నాలజీ ప్రెసిడెంట్, కాగ్నిజెంట్ ఛైర్మన్ రాజేష్ అబ్రహం తెలిపారు. కొత్త డిజిటల్ నైపుణ్యాలలో సుమారు 95,000 మందికి శిక్షణ ఇచ్చామన్నారు. 2021లో అత్యధికంగా క్యాంపస్ నియామకాల కింద 30 వేల మందిని, 2022లోఆన్బోర్డింగ్ కింద 45 వేల గ్రాడ్యుయేట్లకు ఆఫర్స్ ఇస్తామన్నారు. అలాగే ఈ ఏడాది సుమారు లక్షమందిని నియమించుకో నున్నట్టు తెలిపారు. తాజా అంచనాల ప్రకారం బీపీవో, ఐటీ సర్వీసుల్లో జూన్ త్రైమాసికం ముగిసే సమయానికి ట్రైనీలు, కార్పొరేట్ ఉద్యోగులు 3 లక్షలమంది సంస్థకు గుడ్బై చెప్పారు. ఈ కారణంగానే అట్రిషన్ను తగ్గించుకోవడంతోపాటు, కాంపెన్సేషన్, సర్దుబాట్లు, ఉద్యోగ భ్రమణాలు, నైపుణ్యాల మెరుగుదల, ప్రమోషన్లు లాంటి చర్యలపై దృష్టిపెట్టినట్టు కాగ్నిజెంట్ సీఈఓ బ్రియాన్ హంఫ్రీస్ చెప్పారు. దాదాపు లక్షమందిని కాంట్రాక్ట్ విధానంలో నియమించుకోవడంతోపాటు, 2021 లో మరో లక్షమంది అసోసియేట్లకు శిక్షణా కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. ఈ త్రైమాసికంలో డిజిటల్ రెవెన్యూ వృద్ధి సంవత్సరానికి 20 శాతానికి పెరిగిందని వెల్లడించిన ఆయన భవిష్యత్తు ఆశాజనకంగా ఉందన్నారు. మూడవ త్రైమాసిక ఆదాయం 4.69 - 4.74 బిలియన్ డాలర్ల పరిధిలో ఉండనుందని, 10.6-11.6 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్లు కాగ్నిజెంట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జాన్ సీగ్మండ్ చెప్పారు. కాగా జూన్ 2020 త్రైమాసికంలో కాగ్నిజెంట్ 41.8 శాతం వృద్దితో, 512 మిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 3,802 కోట్లు) నికర ఆదాయాన్ని నివేదించింది. అలాగే 10.2-11.2 శాతం (స్థిరమైన కరెన్సీలో 9-10 శాతం) వృద్ధి అంచనాలను ప్రకటించింది. కాగ్నిజెంట్కు భారతదేశంలో సుమారు 2 లక్షల మంది ఉద్యోగులున్నారు. -
23,000 క్యాంపస్ ఉద్యోగాలకు రెడీ
ముంబై, సాక్షి: వచ్చే ఏడాది అంటే 2021లో 23,000 మందిని క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నట్లు కాగ్నిజెంట్ టెక్నాలజీస్ తెలియజేసింది. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అధిక శాతం భారత్కే అవకాశముంటుందని కాగ్నిజెంట్ ఇండియా ఎండీ రాజేష్ నంబియార్ తాజాగా పేర్కొన్నారు. అక్టోబర్లో కాగ్నిజెంట్ బోర్డు సభ్యులైన నంబియార్ సీఈవో బ్రియాన్ హంఫ్రీస్ నిర్దేశనలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా సుమారు 17,000 మందిని ఎంపిక చేసుకున్నట్లు నంబియార్ తెలియజేశారు. 2016 నుంచీ చూస్తే ఇవి అత్యధికంకాగా.. వీటిలో సింహభాగం భారత్ నుంచే ఎంపికలు జరిగినట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. చదవండి: (బ్యాంకింగ్: డిజిటల్ సేవల్లో సవాళ్లేంటి?) పలు బాధ్యతలు కాగ్నిజెంట్ తరఫున దేశీయంగా 2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిని పర్యవేక్షించే ఎగ్జిక్యూటివ్ కమిటీకి సైతం నంబియార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా.. దేశీ ప్రభుత్వ ఏజెన్సీలు, పాలసీ సంస్థలతో కాగ్నిజెంట్కున్న ఒప్పందాలను మరింత మెరుగు పరచవలసిన బాధ్యత నంబియార్పై ఉన్నట్లు పరిశ్రమ నిపుణులు ఈ సందర్భంగా తెలియజేశారు. దేశీయంగా కంపెనీ కార్యకలాపాలను మరింత పటిష్టపరచడం, నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా యూనివర్శిటీలతో భాగస్వామ్యలు ఏర్పాటు చేసుకోవడం వంటి లక్ష్యాలను నంబియార్ సాధించవలసి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బాటలో ప్రభుత్వ ఏజెన్సీలతోపాటు, నాస్కామ్, చాంబర్ ఆఫ్ కామర్స్ తదితర పరిశ్రమ సంబంధిత సంస్థలతోనూ కలసి పనిచేయవలసి ఉంటుందని సాఫ్ట్వేర్ రంగ నిపుణులు వివరించారు. -
లేఆఫ్స్తో టెకీల్లో గుబులు..
హైదరాబాద్ : ఉద్యోగం కోల్పోతాననే ఆందోళనతో హైదరాబాద్లో 24 సంవత్సరాల సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ హరిణి ఆత్మహత్య టెకీల్లో కలవరం రేపుతోంది. వేతన పెంపు, లేఆఫ్స్కు సంవత్సరాంతం అనువైన సమయం కావడంతో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోననే గుబులు ఐటీ ఉద్యోగులను వెంటాడుతోంది. ఆర్థిక మందగమనంతో ఉద్యోగుల తొలగింపుపై సర్వత్రా ఆందోళన నెలకొన్న క్రమంలో ఉద్యోగులకు బాసటగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ముందుకొచ్చింది. దాదాపు ప్రతి ప్రాజెక్టులో 18 శాతం ఉద్యోగులకు 4 రేటింగ్ ఇచ్చారని, అంటే వీరంతా 45 నుంచి 60 రోజుల్లో తమ సామర్ధ్యం మెరుగుపరుచుకోవాల్సి ఉంటుందని, లేని పక్షంలో వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తారని అసోసియేషన్ సభ్యులు సందీప్ కుమార్ మక్తానా ఓ టీవీ చానెల్తో మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను అసోసియేషన్తో పంచుకుని వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సంస్థల్లో సభ్యత్వాలు తీసుకునేందుకు ఐటీ ఉద్యోగులను ఆయా కార్పొరేట్ సంస్థలు అనుమతించడం లేదు. యూనియన్ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు కంపెనీలు అనుమతించవని, ఉద్యోగాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైతే తాము ఒంటరిగా ఎదుర్కోవాల్సి వస్తోందని, ఏ ఒక్కరూ సాయం చేయరని ఓ ఉద్యోగి వాపోయారు. అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం కాగ్నిజెంట్ 13,000 మందిని సాగనంపుతూ దేశంలోనే అతిపెద్ద ఉద్యోగాల కోతకు దిగడం ఐటీ ఉద్యోగుల్లో అలజడి రేపుతోంది. వీరిలో అత్యధికులు మధ్యశ్రేణి, సీనియర్ పొజిషన్స్లో పనిచేస్తున్నవారే. ఇతర ఐటీ కంపెనీల్లోనూ ఇదే ట్రెండ్ నెలకొనడంతో అది ఉద్యోగుల శారీరక, మానిసిక, ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఉద్యోగుల అభద్రతాభావం కుంగుబాటుకు చివరికి ఆత్మహత్యలకూ దారితీస్తోంది. ఉద్యోగులను తొలగించే ప్రక్రియలో భాగంగా యాజమాన్యం ఉద్యోగుల మానసిక స్థైర్యం దెబ్బతీసేలా వారి సామర్ధ్యం సరిగ్గాలేదని చూపే ప్రయత్నం చేస్తోందని ఐటీ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్యోగులను నిందించే బదులు నూతన ప్రాజెక్టులు లేదా క్లోజ్ చేసిన ప్రాజెక్టుల పునరుద్ధరణపై దృష్టిసారించాలని హితవు పలికింది. మరోవైపు ఉద్యోగులను తొలగించే క్రమంలో ప్రస్తుతం ఐటీ కంపెనీలు ఆఫర్ చేస్తున్న రెండు నెలల పరిహార ప్యాకేజ్ను ఆరు నెలలకు పెంచాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. తెలంగాణలో ఐదు లక్షల మందికి పైగా ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారని వీరిలో అత్యధికంగా మధ్యశ్రేణి ఉద్యోగులే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. -
కాగ్నిజెంట్ నిర్ణయంతో టెకీలకు షాక్..
బెంగళూర్ : ఐటీ కంపెనీలు ఉద్యోగుల కోతకు దిగుతుండటంతో రానున్న నెలల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఊపందుకోనుంది. ప్రాజెక్టులు లేని ఉద్యోగుల బెంచ్ టైమ్ గరిష్ట పరిమితిని ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ తగ్గించడం ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. బిల్లింగ్ ప్రాజెక్టులపై లేని ఉద్యోగుల బెంచ్ టైమ్ను 60 రోజుల నుంచి 35 రోజులకు కాగ్నిజెంట్ తగ్గించింది. 35 రోజుల తర్వాత బెంచ్పై ఉన్న ఉద్యోగులను కంపెనీ సాగనంపుతుంది. ఈ ప్రక్రియ 60 నుంచి మూడు నెలల లోపు పూర్తవుతుంది. గతంలో బెంచ్పై ఉన్న ఉద్యోగులకు తమ బిజినెస్ యూనిట్లలో లేదా ఇతర ప్రాజెక్టుల్లో అవకాశం పొందేందుకు అధిక గ్రేస్ టైమ్ను కంపెనీ కల్పించేది. ఇతర నగరాలకు వెళ్లేందుకు ఇష్టపడని ఉద్యోగులు, ఇతర డొమైన్లను ఎంచుకోని వారు మాత్రమే కంపెనీని వీడాల్సివచ్చేది. బెంచ్పై ఉన్న ఉద్యోగులకు పలు అవకాశాలు ఇవ్వకుండా నూతన టెక్నాలజీలను అందిపుచ్చుకునే నైపుణ్యాలను వారు విధిగా మెరుగుపరుచుకునేలా ఒత్తిడి పెంచేందుకే కాగ్నిజెంట్ నూతన బెంచ్ విధానాన్ని అనుసరిస్తున్నట్టు భావిస్తున్నారు. సంవత్సరాల తరబడి రెండంకెల వృద్ధిని నమోదు చేసిన కాగ్నిజెంట్ వృద్ధి రేటు ఇటీవల పడిపోవడంతో తిరిగి మెరుగైన వృద్ధిని సాధించేందుకు పలు చర్యలు చేపడుతోంది. మారుతున్న క్లయింట్ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులు నైపుణ్యాలను సంతరిచుకునేలా కసరత్తు చేపట్టింది. -
7 వేల సీనియర్ ఉద్యోగులపై కాగ్నిజెంట్ వేటు
సాక్షి, బెంగళూరు: ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ మరోసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేయమనుంది. రాబోయే కొద్ది త్రైమాసికాల్లో 7వేల ఉద్యోగాలను తగ్గించుకోనుంది. కంటెంట్ మోడరేషన్ వ్యాపారం నుండి నిష్క్రమించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే క్లౌడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి వృద్ధి రంగాలలో పెట్టుబడులు పెట్టడం తో సహా, కొన్ని వ్యూహాత్మక పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా మరింత మంది ఉద్యోగులను తగ్గించుకోనుంది. ఇది మరో 6000 మంది ఉద్యోగులను ప్రభావితం చేయనుందని కంపెనీ తెలిపింది. కంటెంట్ మోడరేషన్ వ్యాపారంలో కొన్ని భాగాల నుండి నిష్క్రమించడం రాబోయే సంవత్సరంలో ఆర్థిక పనితీరును దెబ్బతీస్తుందని కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బ్రియాన్ హంఫ్రీస్ చెప్పారు. న్యూజెర్సీ ప్రధాన కార్యాలయంలో విశ్లేషకులతో పోస్ట్-ఎర్నింగ్స్ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలను వెల్లడించారు. 10,000-12,000 మధ్య సీనియర్ ఉద్యోగులను వారి ప్రస్తుత పాత్రల నుండి తొలగించనున్నామని వెల్లడించారు. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 2 శాతమని కంపెనీ అధికారులు తెలిపారు. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్కు కంటెంట్ రివ్యూ కాంట్రాక్టర్గా ఉన్న కాగ్నిజెంట్ తన కంటెంట్ మోడరేషన్ వ్యాపారం నుండి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటించింది. ఈ చర్య సంస్థ కొత్త వ్యూహాన్ని ప్రతిబింబిస్తుందనీ, అయితే కంటెంట్ మోడరేషన్ నుండి పూర్తిగా నిష్క్రమించలేదని సంస్థ ప్రతినిధి చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఫిల్ సాల్ట్ విధ్వంసం.. ఢిల్లీను చిత్తు చేసిన కేకేఆర్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement