Top Stories
ప్రధాన వార్తలు

గ్రేట్ ఆంధ్రా మ్యాజిక్ షో!
పీసీ సర్కార్ ఇంద్రజాలం గొప్పదా... ఏపీ సర్కార్ ఇంద్ర జాలం గొప్పదా? పీసీ సర్కార్ మ్యాజిక్ ట్రిక్స్ ఈ దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తేవని విన్నాము. ఏపీ సర్కార్ ట్రిక్స్ మాత్రం ప్రజలను షాక్ మీద షాక్కు గురిచేస్తున్నాయి. అది... స్టేజ్ షో. అంతా మ్యాజిక్ అనే సంగతి ముందుగానే తెలుసు! కానీ, ఇది... జనజీవితంతో ఆటాడుకోవడం! మోసపోతున్నా మని ముందుగా ప్రజలకు తెలియదు. క్రమంగా అనుభవంలోకి వస్తుంది. ఎన్నికలకు ముందు ఇంటింటికీ ఓ వైకుంఠాన్ని వాగ్దానం చేసిన మ్యానిఫెస్టో కూడా మ్యాజిక్ షోలో భాగమని అప్పుడు అర్థం కాలేదు. మెజీషియన్ దాన్ని తన టోపీలో పడే శారు. ఇప్పుడా టోపీలోంచి కుందేళ్లు, కుక్కపిల్లలు వగైరాలే వస్తున్నాయి. మ్యానిఫెస్టో మాయమైంది.ఇంద్రజాల విద్యలతో జనాన్ని ఆహ్లాదపరచాలని, హామీల సంగతిని మరిపింపజేయాలని చంద్రబాబు సర్కార్ ప్రయాస పడుతున్నది. అందులో భాగంగా ఆయన నాలుగు రోజులకో కొత్త ట్రిక్కును నేర్చుకొస్తున్నారు. వేదికల మీద వాటిని ప్రదర్శి స్తున్నారు. కీలకమైన మూడు అంశాల్లో వాస్తవాలకు గంతలు కట్టడానికి, ప్రజలను భ్రమల్లో ముంచెత్తడానికి శతవిధాలైన విన్యాసాలను ఆయన ప్రదర్శిస్తున్నారు. ఇందులో మొదటి అంశం – అభివృద్ధి అనే పదానికి తననే నిర్వచనంగా చెప్పు కోవడం, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా తనను తాను ప్రమోట్ చేసుకోవడం! కానీ, వాస్తవ పరిస్థితి? ఈ పది మాసాల కాలంలోనే అప్పుల్లో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రజల కొనుగోలుశక్తి దారుణంగా పడిపోయింది. పన్నుల వసూళ్లు మందగించాయి. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు తిరోగమన పథంలోకి వెళ్లాయి. రైతు కుటుంబాలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నాయి. ప్రభుత్వ నిర్వాకం కారణంగానే ధాన్యం రైతుల దగ్గర్నుంచి ఆక్వా రైతుల వరకు అందరూ దయనీయ స్థితిలోకి జారిపోతున్నారు. విద్యుత్ బిల్లుల భారంతో వేలాది ఎమ్ఎస్ఎమ్ఈ పరిశ్రమలు మూతపడ్డాయి. ఇరవై వేలమంది ఉపాధి కోల్పోయారు.బాబు సర్కార్ మ్యాజిక్ చేయదలచుకున్న రెండో అంశం – సంక్షేమ రంగం. సంక్షేమం అంటేనే తెలుగుదేశం పార్టీ గుర్తు కొస్తుందని బహిరంగ సభల్లో చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. ఎన్నికలకు ముందు కూటమి తరఫున ఆయన చేసిన వాగ్దానాల సంగతిని కాసేపు మరిచిపోదాం. అంతకుముందు జగన్ ప్రభుత్వం అమలుచేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలను చాప చుట్టేసి అటకెక్కించారు. ‘అమ్మ ఒడి’ ఆగిపోయింది. మహిళలకు ‘చేయూత’ అందడం లేదు. ‘వైఎస్సార్ బీమా’ కనుమరుగైంది. ‘మత్స్యకార భరోసా’ మాయమైంది. ‘కల్యాణమస్తు’ కనిపించడం లేదు. ఆటో డ్రైవర్లకు ‘చేదోడు’ లేదు. చిల్లర వర్తకులకు తోడుగా నిలిచిన రుణ సదుపాయం నిలిచిపోయింది. ఇవి కొన్ని మాత్రమే! చెప్పుకుంటూ పోతే సంక్షేమం కథ చాలా పెద్దది.ఇక మూడో ఇంద్రజాల ఇతివృత్తం – తనను తాను గొప్ప ప్రజాస్వామికవాదిగా ప్రచారం చేసుకోవడం. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ హింసా రాజకీయాలు చేయలేదు. కక్షలూ కార్పణ్యాలకు పూనుకోలేదు. వ్యక్తిత్వ హననాలకు పాల్పడలేదని బాబు చాలా సందర్భాల్లో చెప్పుకుంటున్నారు. అనుబంధ మీడియా ఇంకో నాలుగడుగులు ముందుకెళ్లి ఆయన్ను ప్రమోట్ చేస్తున్నది. ఈ ప్రమోషన్కూ, వాస్తవ పరిస్థితికీ మధ్యన 180 డిగ్రీల దూరం ఉన్నదని పది నెలల కాలంలో జరిగిన అనేక ఘటనలు రుజువు చేశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరావడంతోనే ప్రత్యర్థుల వేట మొదలుపెట్టింది. వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లను బహిరంగంగా నరికి చంపుతున్న భయానక దృశ్యాలను చూడవలసి వచ్చింది. పల్నాడు వంటి ప్రాంతాల్లో వేలాదిమంది ప్రజలు దాడులకు భయపడి ప్రవాస జీవితాలు గడపవలసి వచ్చింది. సోషల్ మీడియాలో విమర్శలు చేసేవారి మీద దారుణమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. 50 పైచిలుకు మందిని అరెస్టు చేశారు. వందలాది మందిపై కేసులు నమోదయ్యాయి. బీఎన్ఎస్ 111 సెక్షన్ను దుర్వినియోగం చేస్తు న్నారని పోలీసులను పలుమార్లు ఉన్నత న్యాయస్థానం మంద లించవలసి వచ్చింది. ‘రెడ్బుక్’ గైడ్లైన్స్ ప్రకారం పనిచేయా లని పోలీసులను వారి ఉన్నతాధికారులే ఒత్తిడి చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో ఎన్నడూ ఎరుగని పరిణామాలివి.తనకు లేని ఘనతల్ని ఆపాదిస్తూ యెల్లో మీడియా తగిలించిన భుజకీర్తులను కాపాడుకోవడానికి చంద్రబాబు ఇప్పుడు మ్యాజిక్ షోలను ఆశ్రయించక తప్పడం లేదు. అమరావతి ప్రాంతంలో కొన్ని కృత్రిమ మెరుపుల్ని మెరిపించి, ‘అదిగో అభి వృద్ధి’ అని చెప్పుకోవాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతి పేరుతో 30 వేల కోట్ల అప్పులు ఇప్పటికే తీసు కొచ్చారు. రైల్వే స్టేషన్ ఎక్కడొస్తుందో ప్రకటించారు. బస్టాండ్ స్థలాన్ని గుర్తించడం జరిగింది. అద్భుతమైన స్టేడియం వస్తుందని ప్రచారం చేశారు. ఆకాశ హర్మ్యాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఐటీ పరిశ్రమను వేలు పట్టుకొని హైదరాబాద్కు తీసుకొచ్చిన తాను, అదే చందంగా ‘క్వాంటమ్ వ్యాలీ’ని అమ రావతికి పిలుచుకొస్తానని కూడా చంద్రబాబు పదేపదే ప్రక టిస్తున్నారు. ‘క్వాంటమ్ వ్యాలీ’ ఏర్పాటుకు అవసరమయ్యే భౌతిక, మే«ధాపరమైన పరిస్థితులు అమరావతిలోనే కాదు,ఆంధ్రప్రదేశ్లోనే లేవనేది నిపుణుల అభిప్రాయం. సమీప భవి ష్యత్తులో అటువంటి ఎకో సిస్టమ్ ఏర్పడే అవకాశాలు కూడా లేవని వారు చెబుతున్నారు.అయినా సరే, అమరావతి టైర్లలో గాలి నింపడానికి ఆయన ఇటువంటి అసంగతమైన సంగతులు ఇంకా ఎన్నయినా చెప్ప వచ్చు. అయినప్పటికీ అక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో కదలిక కనిపించడం లేదు. అక్కడ ప్లాట్లు కొనేందుకు జనం ఎగబడడం లేదు. చివరికి మొన్న అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంలో ఐదెకరాల పైచిలుకు విస్తీర్ణం (25 వేల చదరపు గజాలు)లో ఉన్న ప్లాట్లో స్వగృహ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. వెలగ పూడి గ్రామానికి చెందిన కంచర్ల కుటుంబం వారు తమ 29 ఎకరాల 51 సెంట్ల వ్యవసాయ భూమిని ల్యాండ్ పూలింగ్కు అప్పగించగా వారికి 25 వేల చదరపు గజాల ప్లాటు కోర్ క్యాపి టల్ ఏరియాలో లభించింది. 18 కోట్ల 75 లక్షల రూపాయలు వెచ్చించి ఈ భూమిని నారా బ్రాహ్మణి పేరుతో ఉన్న ట్రస్టు ద్వారా కొనుగోలు చేశారు. అంటే గజానికి 7,500 పడిందన్న మాట. కోర్ క్యాపిటల్ ప్రాంతంలో మరీ ఇంత తక్కువ రేటేమిటో?ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త మిగిలిన సొమ్మును బ్లాక్లో చెల్లించి ఉంటారని అనుకోలేము కదా! అమరావతిలోని చాలా ప్రాంతాల్లో రిజిస్ట్రే షన్ విలువ గజానికి ఐదు వేలు మాత్రమే ఉందట! చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఇంత తక్కువ విలువ ఎక్కడా లేదు. ప్రపంచంలోని ఐదు పెద్ద నగరాల్లో ఒకటిగా నిలబెట్టాలని తలపోస్తున్న అమరావతిలో ఈ విలువేమిటో అర్థం కాదు. ప్రస్తుతం అమరావతి పట్నం ‘బ్లాక్’ ఈజ్ బ్యూటీ అని కలవరిస్తున్నది. పిలు స్తున్నది. కానీ ఆ బ్యూటీ మాత్రం అమరావతిని ఇంకా కరుణించడం లేదు. ఎప్పుడు కరుణిస్తుందో, రియల్ ఎస్టేట్ ఎప్పుడు పుంజుకుంటుందో, ఆకాశహర్మ్యాలకు పునాదులు ఎప్పుడు పడతాయో! అప్పటికీ తన మీద అభివృద్ధి ప్రదాత అనే స్టాంపు వేయించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం చేయగలిగినంత మ్యాజిక్ను చేస్తూనే ఉన్నది.అభివృద్ధి ముద్ర కోసం అమరావతి ముసుగును వేసు కున్నట్టే... సంక్షేమం సర్టిఫికెట్ కోసం ఆయన ‘పీ–ఫోర్’ అనే దౌర్భాగ్య సిద్ధాంతాన్ని ముందుకు తెస్తున్నారు. పేదరిక నిర్మూలనకు కృషి చేయవలసిన ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేల మీద పుట్టిన ప్రతి జీవి ఈ దేశ సంపదలో హక్కుదారేనన్నది సహజ న్యాయం.ఆ సహజ న్యాయం రాజ్యాంగ హక్కుగా పౌరులందరికీ భరోసా నిచ్చింది. కానీ, దేశ సంపదను ప్రైవేటీకరించడంలో ఉత్సాహాన్ని ప్రదర్శించే చంద్రబాబు పేద ప్రజలను కూడా ప్రైవేటీకరించడానికి పూనుకున్నారు. తమ హక్కుల సాధన కోసం, తమ న్యాయమైన వాటా కోసం పిడికిళ్లు బిగించ వలసిన ప్రజలను మభ్యపెట్టి, తక్షణావసరాల కోసం సంప న్నుల ముందు సాగిలపడేట్టు ప్రోత్సహిస్తున్నారు. తన సంక్షేమ బాధ్యతల నుంచి తప్పుకొని తన అనుచరులకు సంపద సృష్టించే పథకాల గురించి ఆయన ఆలోచిస్తున్నారు. ‘పీ–ఫోర్’ మంత్రంతో పేదరికం పోదు. ఈ మ్యాజిక్ ఎక్కువ కాలం చెల్లదు. అనగనగా ఒక చిత్తకార్తె చతుష్పాద జీవి లాంటి వెధవొకడు టీడీపీకి అనుబంధ సోషల్ మీడియాలో కిరాయి సైనికుడు. వైసీపీ అగ్రనేత మీద సొల్లు వాగాడు. ఈ రకమైన వాగుడు, అటువంటి పోస్టింగులు అతడికి చిరకాలంగా అలవాటే! కానీ, మొన్నటి ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి ఖండించారు. అతడిని పార్టీ నుంచి తప్పిస్తున్నట్టు ప్రక టించారు. అరెస్ట్ చేశారు. స్వాగతించవలసిన విషయమే! కానీ, ఈ వ్యవహారంలో చిత్తశుద్ధి ఉండాలనేది సహజమైన ఆకాంక్ష. ఈ ఖండన వెలువడిన వెంటనే సిద్ధంగా ఉన్నట్టుగా యెల్లో మీడియా స్పందించింది. చంద్రబాబును ప్రశంసలతో ముంచె త్తింది. ఇమేజ్ మేకోవర్ ఎక్సర్సైజని అర్థమవుతూనే ఉన్నది. అదే బాధాకరం. రెడ్బుక్ రాజ్యాంగ పాలన జరుగుతున్నదని ఈ పది నెలల పాలనపై ఆరోపణలు వస్తున్నాయి. చిత్తశుద్ధి వుంటే దీన్ని సరిదిద్దుకోవాలి. కానీ హైకోర్టు హెచ్చరిస్తున్నా ఈ పాలనలో మార్పు రావడం లేదు. టీడీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఐటీడీపీలో వందలాదిమంది సైకోల్లాంటి కిరాయి సైనికులు పనిచేస్తున్నారు. వారి జుగుప్సాకరమైన రాతలతో, వాగుడుతో ఎంతోమంది కలతచెందిన ఘటనలున్నాయి. ఎన్ని కలకు ముందు గుంటూరు జిల్లాలో గీతాంజలి అనే గృహిణి ఈ వేట కుక్కల దాడి తట్టుకోలేక, ఆత్మహత్య చేసుకున్నది. అప్పుడే ఖండించి ఉంటే, చర్యలు తీసుకొని ఉంటే పరిస్థితులు ఇలా దిగజారి ఉండేవా? విజయవాడలో జగన్ మామ గురించి ఆప్యాయంగా మాట్లాడిన ఓ పసిబిడ్డ మీద అవాకులు చవాకులు పేలినప్పుడైనా ఈ ఖండన రావాల్సింది. ఇటువంటి అను భవాలు కోకొల్లలు. ఎప్పుడూ స్పందించలేదు. పైపెచ్చు ప్రోత్సహించారని మొన్నటి సొల్లు వెధవే ఒక వెబ్ చానల్లో చెప్పుకొచ్చాడు. ఈ కారణాల రీత్యా, దిగజారి పోతున్న ప్రతిష్ఠను కాపాడుకోవడానికే ఇలా స్పందించారని భావించవలసి వస్తున్నది. మ్యాజిక్ షోలెప్పుడూ మ్యానిఫెస్టో అమలుకు ప్రత్యామ్నాయం కాబోవు. అలా భావిస్తే భంగపాటు తప్పదు!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

మాతో స్నేహం అంటూనే దాడి చేస్తారా?.. రష్యాపై భారత్ సీరియస్
కీవ్: ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ను టార్గెట్ చేసిన రష్యా దళాలు.. భీకర దాడులు చేశాయి. ఈ క్రమంలో భారతీయ ఔషధ కంపెనీ గోదాముపై రష్యా దాడి చేసింది. దీంతో, పేలుడు సంభవించి దట్టమైన మంటలు చెలరేగాయి. మరోవైపు.. రష్యా దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్తో స్నేహం ఉందని చెప్పే రష్యా కావాలనే ఇలా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు.వివరాల ప్రకారం.. కీవ్లోని భారతీయ ఔషధ కంపెనీ కుసుమ్ అనే కంపెనీకి చెందిన గోదాముపై శనివారం రష్యా దాడి చేసింది. రష్యాకు చెందిన డ్రోన్ల దాడిలో గోదాం పూర్తిగా ధ్వంసమైంది. ఈ మేరకు గోదాంపై దాడి జరిగిందని ఢిల్లీలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. రష్యా కావాలనే భారతీయ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించింది. పిల్లలు, వృద్ధుల కోసం ఔషధాలు నిల్వ చేసిన గోదాములపై ఇలా దాడులు చేస్తోందని విమర్శించింది. భారత్తో స్నేహం ఉందని చెప్పే రష్యా కావాలనే ఇలా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించింది.Breaking⚡️ : #Ukraine allege Indian pharmaceutical company godown hit by Russia leading to loss of medicines meant for children and distress people. Still to receive any statement from India or Moscow. #RussiaUkraineWar pic.twitter.com/VfpYND8PNq— Neeraj Rajput (@neeraj_rajput) April 12, 2025ఇక, అంతకుముందు ఉక్రెయిన్లోని బ్రిటన్ రాయబారి మార్టిన్ హారిస్ దాడిని ధ్రువీకరించారు. రష్యా డ్రోన్ల దాడిలో ఔషధాల గోదాము పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్తోపాటు 29 దేశాల్లో తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని కుసుమ్ హెల్త్కేర్ వెబ్సైట్లో ఉంది. భారతీయ వ్యాపారవేత్త రాజీవ్ గుప్తా యాజమాన్యంలోని కుసుమ్, ఉక్రెయిన్లోని అతిపెద్ద ఫార్మా సంస్థలలో ఒకటి.

చంద్రబాబు మరో మహా ప్యాలెస్
సాక్షి, అమరావతి: సువిశాల విస్తీర్ణంలో హైదరాబాద్లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో కళ్లు జిగేల్మనేలా రూ.వందల కోట్ల విలువైన అత్యంత విలాసవంతమైన రాజభవనం..! నిజాం నవాబు తరహాలో హైదరాబాద్ నగరం నడిబొడ్డున కొండాపూర్లో హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఊహకు అందని రీతిలో ఐదెకరాలలో ఓ భారీ ఫాంహౌస్..! వీటికితోడు అమరావతిలో రూ.వందల కోట్లతో.. మరో ఐదు ఎకరాల్లో ఇంకో రాజభవనాన్ని నిర్మించుకుంటున్నారు సీఎం చంద్రబాబు..! అత్యాధునిక హంగులు.. కనీవిని ఎరుగని అధునాతన రీతిలో.. రాజధాని అమరావతి నడిబొడ్డున.. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం సమీపంలో చేపట్టే ఈ ప్యాలెస్ నిర్మాణ పనులను తనకు అత్యంత సన్నిహితుడికి చెందిన సంస్థకు అప్పగించారు. దీనికి ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు భూమి పూజ చేశారు. కాగా, దీనికోసం వెలగపూడిలో సర్వే నంబర్ 111, 112, 113, 122, 150, 152, 239లలోని 5.16 ఎకరాలను (25 వేల చదరపు గజాలు) చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి పేరుతో రూ.18.75 కోట్లకు కొనుగోలు చేయడం గమనార్హం. అంటే గజం రూ.7,500 చొప్పున ఖరీదు చేశారు. కాగా, చంద్రబాబు అమరావతి ప్రాంతంలో చదరపు గజం రూ.60 వేలు పలుకుతోందని చెబుతుంటారు. ఈ ప్రకారం చూస్తే నాలుగు వైపులా రోడ్డు ఉన్న వెలగపూడిలోని స్థలం విలువ సుమారు రూ.150 కోట్ల వరకు ఉంటుంది. మరి రాజభవనం నిర్మాణానికి ఇంకెన్ని రూ.వందల కోట్లు వ్యయం చేస్తారోనని రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు. బాబుకు ఉన్నవి అన్నీ ప్యాలెస్లే..చంద్రబాబుకు ఇప్పటికే హైదరాబాద్లో అత్యంత సంపన్నులు ఉండే జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ సమీపంలో రూ.వందల కోట్లతో నిర్మించిన భారీ ప్యాలెస్ ఉంది. దీనిని పక్కనున్న భవనాలు, స్థలాలు కొనేసి సువిశాల విస్తీర్ణంలో నిర్మించడం గమనార్హం. 2014–19 మధ్య అధికారంలో ఉండగా దీని నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించారు. 2019 ఎన్నికలకు ముందు గృహ ప్రవేశం చేశారు. అంతకుముందే జూబ్లీహిల్స్లో చంద్రబాబుకు సువిశాల విస్తీర్ణంలో ప్యాలెస్ ఉండేది. దానిని కూల్చివేసి.. అధునాతన సాంకేతికత, అత్యాధునిక హంగులతో రాజభవనం నిర్మించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి అత్యంత ఖరీదైన ఉపకరణాలను దిగుమతి చేసుకుని నిర్మాణంలో వినియోగించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో చంద్రబాబు ఇంద్రభవనం మదీనాగూడలో నిజాం నవాబును తలదన్నేలా..హైదరాబాద్లోని కొండాపూర్ ప్రాంతం హైటెక్ సిటీకి దగ్గరగా ఉంటుంది. చాలా ఖరీదైనదిగా పేరుగాంచింది. అక్కడికి సమీపంలోని మదీనాగూడలో చంద్రబాబుకు ఐదు ఎకరాల ఫాంహౌస్ ఉంది. దీని విలువ రూ.వందల కోట్లలోనే ఉంటుంది. నిజాం నవాబును తలపించే రీతిలో వైభోగం అన్నమాట. మరోవైపు హైదరాబాద్లో సంపన్న ప్రాంతమైన జూబ్లీహిల్స్లో రాజభవనం లాంటి నివాసం. బహుశా దేశంలో సంపన్నులు ఉండే ప్రాంతంలో రాజభవనం, ఫాంహౌస్ చంద్రబాబుకు ఒక్కరికే ఉందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.పదేళ్లుగా అక్రమ ప్యాలెస్లో విలాసంచంద్రబాబు.. పదేళ్లుగా ఉండవల్లి సమీపాన కృష్ణా నది కరకట్ట లోపల లింగమనేని రమేష్ అక్రమంగా నిర్మించిన విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తున్నారు. రమేష్ అత్యాధునిక హంగులతో ఈ భారీ బంగ్లాని నిర్మించారు. కాగా, 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. ఆడియో టేపుల సాక్షిగా ఆయన బండారం బయటపడింది. అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ చర్యలు తీసుకుంటుందోనన్న భయంతో హైదరాబాద్ను ఉన్నపళంగా వదిలి వచ్చేశారు. లింగమనేని అక్రమ బంగ్లాను నివాసంగా ఎంచుకున్నారు. అప్పటినుంచి.. అంటే పదేళ్లుగా అందులోనే ఉంటున్నారు.ఉండవల్లిలో కృష్ణానది కరకట్ట వెంట చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ భవనం పార్టీ వారికీ ప్రవేశం లేదు..చంద్రబాబు తాజాగా వెలగపూడిలో తలపెట్టిన రాజభవన నిర్మాణం భూమి పూజకు టీడీపీ నేతలను సైతం ఆహ్వానించకపోవడడం గమనార్హం. ఇక జూబ్లీహిల్స్లోని రాజభవనం గృహ ప్రవేశ కార్యక్రమానికి పార్టీ నేతలను ఎవరినీ ఆహ్వానించలేదని టీడీపీ సీనియర్ నేతలు చెబుతుంటారు. అందులోకి ఇప్పటికీ తమ పార్టీ నేతలకు ప్రవేశం లేదని అంటుంటారు.కొత్త రాజభవనం.. నిర్మాణానికి ఇంకెన్ని కోట్లో..?చంద్రబాబు హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఆరేళ్ల కిందట నిర్మించుకున్న రాజ భవనానికే రూ.వందల కోట్లు వ్యయం అయినట్లు చెబుతుంటారు. ఇప్పుడు అమరావతిలో తలపెట్టిన రాజభవనం మరింకెన్ని కోట్లు ఉంటుందోనని అంటున్నారు. భూమి కొనుగోలుకే రూ.18 కోట్లకు పైగా వ్యయం చేసిన నేపథ్యాన్ని గుర్తు చేస్తున్నారు. పైగా వెలగపూడిలో ఏకంగా 5.16 ఎకరాల్లో నిర్మాణం చేపట్టనుండడాన్ని ప్రస్తావిస్తున్నారు.అప్పుడు ఇప్పుడు అధికారంలో ఉండగానే..చంద్రబాబు జూబ్లీహిల్స్ రాజభవనం నిర్మాణాన్ని 2019కి ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే చేపట్టి పూర్తి చేశారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉండగానే వెలగపూడిలో మరింత భారీఎత్తున రాజభవనం నిర్మాణం చేపట్టడం గమనార్హం.అద్దాల మేడల్లో ఉంటూ అవతలి వారిపై దుష్ప్రచారంతాను 5.16 ఎకరాల్లో రాజభవనం కట్టుకుంటూ పేదవాడిననే బిల్డప్లుపార్టీ కార్యాలయం లేకుండానే భారీ విస్తీర్ణంలో నిర్మాణానికి ప్రయత్నంవైఎస్ జగన్ 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయం, ఇల్లు నిర్మించుకుంటే నిందలుతాడేపల్లి ప్యాలెస్ అంటూ తీవ్ర స్థాయిలో చంద్రబాబు దుష్ప్రచారంవిశాల విస్తీర్ణంలో జూబ్లీహిల్స్లో, మదీనాగూడలో రాజభవనాలు కలిగి.. ప్రస్తుతం అక్రమంగా కట్టిన విలాసవంతమైన భారీ బంగ్లాలో ఉంటూ.. కొత్తగా మరో భారీ రాజభవనం నిర్మాణానికి పూనుకున్న చంద్రబాబు తాను నిరుపేదను.. గుడిసె వాసిని అనే తరహాలో బీద అరుపులు అరుస్తుంటారు. అవతలివారిపై అకారణంగా నిందలు వేస్తుంటారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారు. వాటిని చూపుతూ తాడేపల్లి ప్యాలెస్ అంటూ తరచూ చంద్రబాబు, ఎల్లో మీడియా, పచ్చ దండు దుష్ప్రచారం చేస్తుంటారు. తాను ఉంటున్న ఇంద్ర భవనాలు మాత్రం పూరి గుడిసెలు అన్నట్లు ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రచారాలు తెరపైకి తెస్తుంటారు.

ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం....వీరికి అన్నింటా విజయాలే. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. కళారంగం వారికి కృషి ఫలిస్తుంది. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. నీలం, లేత గులాబీరంగులు. శ్రీ ఆదిత్య హృదయం పఠించండి.వృషభం..పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో పురోగతి ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. బంధువుల రాకతో సంతోషంగా గడుపుతారు. వాహనయోగం. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు విస్తరించడంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, లేత నీలం రంగులు. శ్రీ మేధా దక్షిణామూర్తి స్తుతి మంచిది.మిథునం.... గతంలో నిలిచిపోయిన కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి సహాయం కోరతారు. ఆర్థిక విషయాలలో పురోగతి సాధిస్తారు. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలలో అడుగు ముందుకు వేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు సాధిస్తారు. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో మిత్రులతో కలహాలు. కుటుంబంలో ఒత్తిడులు. నీలం, ఆకుపచ్చ రంగులు. శ్రీ భువనేశ్వరీదేవి స్తోత్రాలు పఠించండి.కర్కాటకం...పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. శ్రీ కాలభైరవాష్టకం పఠించండి.సింహం...ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఒత్తిడులు, సమస్యలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి, ఆత్మస్థైర్యంతో అడుగువేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు ఏర్పడవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో మార్పులు సంభవం. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. ఎరుపు, పసుపు రంగులు. శ్రీవారాహీ స్తోత్రం పఠించండి..కన్య...ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆసక్తికర సమాచారం అందుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆర్థికంగా కొంత బలం చేకూరి రుణాలు తీరతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. వాహన, గృహయోగాలు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం. వారం చివరిలో మిత్రులతో కలహాలు. శ్రమ పెరుగుతుంది. గులాబీ, తెలుపు రంగులు. శ్రీ గురుదత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.తుల...ఆర్థికంగా కొంత అనుకూలస్థితి ఉంటుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. సోదరుల నుంచి పిలుపు అందుతుంది. వాహనయోగం. వ్యాపారాలలో చిక్కులు తొలగి లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో మీకు ఎదురుండదు. కళారంగం వారికి సన్మానాలు జరుగుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. శ్రీ దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.వృశ్చికం...అనూహ్యమైన రీతిలో పనులు పూర్తి కాగలవు. అనుకున్న ఆశయాలు సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. ముఖ్య విషయాలపై బంధువులతో చర్చిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో మానసిక ఆందోళన. బంధువులతో అకారణ వైరం. దూరప్రయాణాలు. .శ్రీ ఆంజనేయ దండకం పఠించండి.ధనుస్సు..కొన్ని పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ఆప్తులతో సఖ్యత నెలకొంటుంది. ఆర్థికంగా బలం చే కూరుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. విహారాదియాత్రలు చేస్తారు. సంఘంలో పేరు గడిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. శుభకార్యాల నిర్వహణలో పాలుపంచుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలీకృతమవుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో వివాదాల నుంచి బయటపడతారు. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు. వారం చివరిలో ధనవ్యయం. విమర్శలు ఎదుర్కొంటారు. ఆరోగ్యసమస్యలు. లేత ఎరుపు, పసుపు రంగులు. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.మకరం...చేపట్టిన వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. రుణబాధలు చాలావరకూ తీరతాయి. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. బంధువుల ఆదరణ, ఆప్యాయత పొందుతారు. కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు తథ్యం. రాజకీయవర్గాలకు పదవులు లభిస్తాయి. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. భూవివాదాలు. మనశ్శాంతి లోపిస్తుంది. నీలం, నేరేడు రంగులు. శ్రీ అన్నపూర్ణాదేవి స్తోత్రాలు పఠించండి.కుంభం..ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధువుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరణలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కళాకారులకు నూతనోత్సాహం, అవార్డులు. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. ఆప్తుల నుండి సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు.. తెలుపు, నేరేడురంగులు. శ్రీవిష్ణుసహస్రనామ పారాయణ చేయండి.మీనం...మీమాటే శిరోధార్యంగా భావిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు ప్రతిభ నిరూపించుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు సత్కారాలు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, లేత పసుపు రంగులు. గణేశ్ను పూజించండి.

భారతీయులే లక్ష్యంగా ట్రంప్ మరో బాంబు
అమెరికాలోని మనోళ్లపై తెంపరి ట్రంప్ మరో బాంబు పేల్చారు. గ్రీన్కార్డు, హెచ్1బీ వీసాలపై అక్కడ చట్టబద్ధంగా నివసిస్తున్న భారతీయులే లక్ష్యంగా మరో వేధింపుల పర్వానికి తెరతీశారు. వాళ్లు నిరంతరం తమ ఐడీ కార్డును విధిగా వెంట ఉంచుకోవాల్సిందేనని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు కఠిన నిబంధనను శుక్రవారం (ఏప్రిల్ 11) నుంచే అమల్లోకి తెచ్చింది. లేదంటే జరిమానాలతో పాటు కఠినచర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఇంకా ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోని అక్రమ వలసదారులను గుర్తించడంలో ప్రభుత్వానికి దోహదపడుతుందంటూ అక్కడి న్యాయస్థానం కూడా ఈ కఠిన నిబంధనకు పచ్చజెండా ఊపింది. అమెరికా పౌరసత్వంలేని 18 ఏళ్లు నిండిన వారంతా తమ చట్టబద్ధ నివాసానికి సంబంధించిన ఐడీ కార్డును 24 గంటలూ వెంట ఉంచుకోవాల్సిందేనని కొత్త నిబంధన సూచిస్తోంది. విదేశీయుల నమోదు చట్టం (1940)లోని ఈ విదేశీయుల నమోదు ఆవశ్యకత (ఏఆర్ఆర్) నిబంధనలు గతంలో ఉన్నవే. కానీ వాటిని ఏనాడూ అమలుచేయలేదు. కోర్టు అనుమతితో కోట్ల మంది అక్రమవలసదారులే లక్ష్యంగా ఈ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని ట్రంప్ సర్కారు నిర్ణయించింది. హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రి క్రిస్టీ నోయెమ్ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ మేరకు వెల్లడించారు. అమెరికాలో ప్రస్తుతం దాదాపు 54 లక్షల మంది భారతీయులున్నారు. 2022 గణాంకాల ప్రకారం 2.,2 లక్షల మంది భారతీయులు అక్కడ అక్రమంగా నివసిస్తున్నారు. అయితే మొత్తం అక్రమ వలసదారుల్లో వీరు కేవలం 2 శాతమేనని సమాచారం. ఏమిటీ నిబంధనలు ? అక్రమంగా వలస వచ్చిన విదేశీయులు, చాన్నాళ్లుగా అమెరికాలో అక్రమంగా ఉంటూ ఇప్పటిదాకా వివరాలు నమోదు చేసుకోని వలసదారులను గుర్తించి దేశం నుంచి బహిష్కరించడమే లక్ష్యంగా ఈ కఠిన నిబంధనలను తెచ్చారు. వాటి ప్రకారం అమెరికాకు వచ్చి 30 రోజులకు మించి ఉండాలనుకునే వాళ్లు తమ వీసా, ఐడీ కార్డులను కచి్చతంగా అనుక్షణం వెంట ఉంచుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో అధికారులు సోదాలు, తనిఖీల వేళ ప్రశ్నిస్తే వెంటనే వాటిని చూపించాలి. లేదంటే జరిమానాలు, ఇతర కఠిన చర్యలను ఎదుర్కోక తప్పదు. దీని ప్రకారం అమెరికా పౌరసత్వం లేని 18 ఏళ్లు నిండిన వాళ్లంతా ఐడీ కార్డును వెంటే ఉంచుకోవాలి. అమెరికా పౌరులు కాని 14 ఏళ్లు నిండిన టీనేజర్ వివరాలను విధిగా నమోదు చేయించుకోవాలి. 14వ పుట్టినరోజుకు ముందు నమోదు చేసినా మళ్లీ కొత్తగా నమోదు చేసుకుని మరోసారి వేలిముద్రల వంటివి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు టీనేజర్ 325ఆర్ దరఖాస్తు సమరి్పంచాలి. వారి తల్లిదండ్రులు సైతం 30 రోజుల్లోపు కచి్చతంగా నమోదు చేయించుకోవాలి. ..అయినా ఉండనివ్వరు మరోసారి నమోదు చేసుకున్నా వారిని అమెరికాలో ఉండనిచ్చే ప్రసక్తే లేదని ట్రంప్ సర్కారు స్పష్టం చేసింది. అక్రమవలసదారుల వాస్తవిక సంఖ్యను తేల్చడం, వారిని కనిపెట్టి వెళ్లగొట్టడమే రీ రిజి్రస్టేషన్ లక్ష్యమని హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు చెప్పారు. తాజాగా నమోదు సమయంలో కొత్త అడ్రస్, వ్యక్తిగత, కుటుంబ వివరాలు తెలపాల్సి ఉంటుంది. వాటిని కావాలని మార్చి రాస్తే స్వదేశానికి బదులు జైలుకు పంపవచ్చని కూడా తెలుస్తోంది. కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాక కూడా పేర్లను నమోదు చేయనివారు సోదాలు, తనిఖీల్లో దొరికితే భారీ జరిమానా, ఆర్నెల్ల దాకా జైలుశిక్ష వేస్తారు. అడ్రస్ అప్డేట్ చేయకుంటే 5 వేల డాలర్ల జరిమానా గ్రీన్కార్డు, వీసాదారులు మరో చోటుకు మారితే కొత్త చిరునామాను ప్రభుత్వానికి కచ్చితంగా తెలియజేయాలి. 10 రోజుల్లోపు తెలపని పక్షంలో 5,000 డాలర్ల జరిమానా విధిస్తారు. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాక గ్రీన్కార్డు, హెచ్–1బీ వీసాదారులు తమ సమాచారాన్ని మరోసారి నమోదు చేయించుకోవాల్సిన పనిలేదు. కాకపోతే గ్రీన్కార్డ్, హెచ్1బీ ఐడీ కార్డును మాత్రం ఎప్పుడూ విధిగా వెంట ఉంచుకోవాల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్

ఎన్ఐఏ విచారణలో రాణా మూడు డిమాండ్లు
న్యూఢిల్లీ: మహానగరం ముంబై 26/11 దాడులకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(National Investigation Agency)(ఎన్ఐఏ) ప్రస్తుతం తమ కస్టడీలో ఉన్న కెనడా-పాకిస్తానీ పౌరుడు తహవ్వూర్ హుస్సేన్ రాణాను విచారిస్తోంది. ఈ నేపధ్యంలో పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇంతలో తహవ్వూర్ హుస్సేన్ రాణా ఎన్ఐఏ ముందు కొన్ని డిమాండ్లు ఉంచినట్లు తెలుస్తోంది. ఇది అతని మానసిక స్థితిని తెలియజేసేదిగా ఉందని ఎన్ఐఏ పేర్కొంది.వివరాల్లోకి వెళితే ఎన్ఐఏ విచారణలో ఉన్న తహవ్వూర్ రాణా(Tahawwur Rana) ఎన్ఐఏ ముందు ఉంచిన డిమాండ్ పలు చర్చలకు దారితీస్తున్నాయి. కస్టడీలో ఉన్న రాణా తనకు ఖురాన్ (ఇస్లామిక్ పవిత్ర గ్రంథం), ఒక పెన్ను, 26/11 దాడుల గురించి అధికారికంగా ప్రశ్నించే అవకాశాన్ని కోరాడు. ఇవి అతని మానసిక స్థితిని, మతపరమైన నమ్మకాన్ని, ఈ కేసులో అతని పాత్ర గురించిన అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. రాణా ఖురాన్ను అడగడం అతని మతపరమైన అభిరుచులను సూచిస్తుండగా, పెన్ను కావాలనడం ఏదైనా ముఖ్యమైన రాతపూర్వక ప్రకటన లేదా నోట్స్ తీసుకుంటాడని తెలుస్తోంది. ఇక ముడవది.. అతి ముఖ్యమైనది 26/11 దాడుల(26/11 attacks) గురించి ప్రశ్నించే అవకాశం కోరడం.. దీనిని చూస్తుంటే రాణా ఈ ఘటనలో తన పాత్రను వివరించాలనుకుంటున్నాడో లేక మరేదైనా సమాచారాన్ని బహిర్గతం చేయాలనుకుంటున్నాడో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాణా పాకిస్తాన్ ఆధారిత టెరరిస్ట్ సంస్థ లష్కర్-ఎ-తోయిబా (ఎల్ఈటీ)తో సంబంధం కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2008లో 166 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న 26/11 ముంబై దాడులలో అతని పాత్రను తెలుసుకునేందుకు ఎన్ఐఏ కఠినమైన విచారణ కొనసాగిస్తున్నది. ఇది భారత్-పాకిస్తాన్ టెరరిజం, అంతర్జాతీయ క్రిమినల్ న్యాయ వ్యవస్థకు సంబంధించిన సంక్లిష్టమైన కేసుగా మారింది. అలాగే ఈ కేసు భారత్.. ఉగ్రవాదంపై సాగిస్తున్న పోరాటంలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచింది. ఎన్ఐఏ విచారణలో తహవ్వూర్ రాణా 26/11 ముంబై దాడులకు సంబంధించి ఏఏ విషయాలు వెల్లడించనున్నాడనేది ఆసక్తికరంగా మారింది.ఇది కూడా చదవండి: ఈ ఇద్దరు అధికారులే.. తహవ్వూర్ రాణా విచారణ సారధులు

విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్పై 'బన్ని' నిర్మాత కామెంట్లు
చిరంజీవి- వశిష్ఠ సినిమా విశ్వంభర గ్లింప్స్ విడుదల సమయంలో గ్రాఫిక్స్ వర్క్స్పై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ ఖర్చుతో నిర్మిస్తోంది. దాదాపు రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేశారని సమాచారం. టీజర్ విడుదల తర్వాత గ్రాఫిక్స్ సరిగ్గా లేకపోవడంతో భారీగా ట్రోల్స్ వచ్చాయి. దీంతో ఈ సంక్రాంతికి రావాల్సిన సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. అయతే, తాజాగా విశ్వంభర గ్రాఫిక్స్ గురించి వశిష్ఠ తండ్రి సత్యనారాయణ రెడ్డి మల్లిడి పలు వ్యాఖ్యలు చేశారు.దర్శకుడు వశిష్ఠ అసలు పేరు మల్లిడి వెంకట నారాయణ రెడ్డి అని తెలిసిందే.. ఆయన తండ్రి నిర్మాతగా టాలీవుడ్లో ఢీ (మంచు విష్ణు), బన్ని (అల్లు అర్జున్), భగీరథ (రవితేజ) వంటి చిత్రాలు నిర్మించారు. అయితే, తాజాగా వశిష్ఠ తండ్రి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్ గురించి ఇలా చెప్పుకొచ్చారు. 'విశ్వంభర సినిమా షూటింగ్ కొంత పూర్తి అయిన తర్వాత గ్రాఫిక్స్ కోసం ఫుటేజ్ ఇచ్చారు. వీఎఫ్ఎక్స్ టీమ్ వారు మూడు నెలల్లోనే పూర్తి చేసి ఇస్తాం అన్నారు. కానీ, పెద్ద సినిమా కావడంతో ఆరు నెలలు టైమ్ తీసుకోమని మేకర్స్ సూచించారు. అలా లెక్కలు వేసుకుని 2025 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు తేదీ ప్రకటించారు. కానీ, తొమ్మిది నెలలు గడిచినా వారు గ్రాఫిక్స్ పని పూర్తి చేయలేకపోయారు. విడుదల తేదీ దగ్గరకు రావడంతో అలా టీజర్ను వదిలారు. ఆర్టిఫిషయల్ టెక్నాలజీ ఉపయోగించుకుని టీజర్ను క్రియేట్ చేశారు. అది గ్రాఫిక్స్ వర్క్ ఏంత మాత్రం కాదు. ప్రేక్షకుల నుంచి విమర్శలు రావడంతో గ్రాఫిక్స్ టీమ్లో భయం మొదలైంది. తర్వాత VFX నాణ్యతలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. త్వరలో విశ్వంభర నుంచి మరో టీజర్తో పాటు ట్రైలర్ రావచ్చు. అందులో అసలైన వీఎఫ్ఎక్స్ పనితీరు ఎలా ఉందో మీరందరూ చూస్తారు. అందరికీ తప్పకుండా నచ్చుతుంది.' అని ఆయన అన్నారు.విశ్వంభర టీజర్ విడుదల కాగానే మెగాస్టార్ అభిమానులు కూడా.. VFX వర్క్ బాగాలేదని విమర్శించారు. హాలీవుడ్ చిత్రాల నుండి సన్నివేశాలను కాపీ చేశారనే ఆరోపణలు వచ్చాయి. దెయ్యాల కోట చూపిస్తున్నారా అంటూ.. పాన్ ఇండియా రేంజ్ సినిమా అంటే ఎలా ఉండాలని తప్పబట్టారు. నాసిరకమైన విజువల్స్, గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ అంటూ ట్రోలింగ్ చేశారు. దీంతో విశ్వంభర విడుదలను వాయిదా వేశారు. ఫ్యాన్స్ కూడా వాయిదా పడటమే బెటర్ అని అనుకున్నారు. ఆ తప్పులు అన్నీ సరిచేసుకుని జులై 24న థియేటర్లలోకి విశ్వంభర రానున్నట్లు సమాచారం."Whatever you saw in the Vishwambhara teaser was AI-generated graphics, not the original CG. It won't be in the movie."- Producer Satyanarayana Reddy #Chiranjeevi #Vishwambhara pic.twitter.com/mgnGgLFpBr— Whynot Cinemas (@whynotcinemass_) April 12, 2025

సిక్సర్ల అభి ‘ షేక్ ’
తొలి ఐదు మ్యాచ్లలో కలిపి 51 పరుగులు...ఈ సీజన్లో అభిషేక్ శర్మ ప్రదర్శన ఇది. వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్న అతను తన గత ఏడాది ఆటను ఒక్కసారిగా గుర్తు తెచ్చుకున్న ట్లున్నాడు. పంజాబ్పై మ్యాచ్లో ఒక్కసారిగా తన కసినంతా ప్రదర్శిస్తూ వీర విధ్వంసం సృష్టించాడు. కేవలం బౌండరీలతోనే 116 పరుగులు బాది శతకనాదం చేశాడు. ఇది ఆరెంజ్ ఆర్మీ కోసం అంటూ రాసి ఉన్న కాగితాన్ని ప్రదర్శిస్తూ ఈ ఇన్నింగ్స్ విలువేమిటో చెప్పాడు. అభిషేక్కు హెడ్ మెరుపులు తోడవడంతో 246 పరుగుల లక్ష్యాన్ని కూడా మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి సన్రైజర్స్ సంచలనం సృష్టించింది. మరో వైపు సమష్టి ప్రదర్శనతో 245 పరుగులు చేసి కూడా ఓటమిపాలైన పంజాబ్ కింగ్స్ తీవ్ర నిరాశకు లోనైంది. ఓవరాల్గా 492 పరుగులతో అభిమానులకు ఫుల్ జోష్ దక్కింది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ సీజన్ నాలుగు వరుస పరాజయాల తర్వాత నిస్తేజంగా కనిపించిన సన్రైజర్స్ హైదరాబాద్ ఘనమైన రీతిలో కోలుకుంది. తమ అసలు ఆటను ప్రదర్శిస్తూ లీగ్లో తమను తక్కువగా అంచనా వేయవద్దనే సందేశాన్ని ఇచ్చింది. శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 82; 6 ఫోర్లు, 6 సిక్స్లు), ప్రభ్సిమ్రన్ సింగ్ (23 బంతుల్లో 42; 7 ఫోర్లు, 1 సిక్స్), ప్రియాన్‡్ష ఆర్య (13 బంతుల్లో 36; 2 ఫోర్లు, 4 సిక్స్లు) కీలక పరుగులు సాధించారు. అనంతరం సన్రైజర్స్ 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 247 పరుగులు సాధించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అభిషేక్ శర్మ (55 బంతుల్లో 141; 14 ఫోర్లు, 10 సిక్స్లు) ఐపీఎల్లో తన తొలి సెంచరీని నమోదు చేయగా, ట్రవిస్ హెడ్ (37 బంతుల్లో 66; 9 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించాడు. వీరిద్దరు తొలి వికెట్కు 75 బంతుల్లో 171 పరుగులు జోడించారు. మెరుపు బ్యాటింగ్...పవర్ప్లేలో 89 పరుగులు...10 ఓవర్లు ముగిసే సరికి 120. తర్వాతి 5 ఓవర్లలో 57 పరుగులు...ఆఖరి 5 ఓవర్లలో 68 పరుగులు... పంజాబ్ కింగ్స్ ఇలా దాదాపు అన్ని దశల్లోనూ ఒకే తరహాలో దూకుడుగా సాగింది. టాప్–7లో ఇద్దరు మినహా మిగతావారంతా చెలరేగిపోవడంతో భారీ స్కోరు సాధ్యమైంది. షమీ వేసిన తొలి ఓవర్లో ప్రభ్సిమ్రన్ వరుసగా 3 ఫోర్లతో మొదలు పెట్టగా, షమీ తర్వాతి ఓవర్లో ప్రియాన్ష్ వరుసగా 6, 6, 4 బాదాడు. కమిన్స్ తొలి ఓవర్లో కూడా 2 ఫోర్లు, సిక్స్తో పంజాబ్ 16 పరుగులు రాబట్టింది. అయితే తన తొలి రెండు ఓవర్లలో 28 పరుగులిచ్చిన హర్షల్...ప్రియాన్‡్షను అవుట్ చేయడంలో సఫలమయ్యాడు. ఈ మ్యాచ్తో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన మలింగ తన తొలి వికెట్గా ప్రభ్సిమ్రన్ను వెనక్కి పంపించాడు. ఆ తర్వాత శ్రేయస్, నేహల్ వధేరా (22 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) భాగస్వామ్యం కూడా జోరుగా సాగింది. వీరిద్దరు మూడో వికెట్కు 40 బంతుల్లోనే 73 పరుగులు జోడించారు. అన్సారీ ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్ బాదిన శ్రేయస్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. శశాంక్ సింగ్ (2) విఫలం కాగా, మలింగ ఓవర్లో శ్రేయస్ 4 ఫోర్లతో చెలరేగాడు. అయితే రెండు బంతుల వ్యవధిలో మ్యాక్స్వెల్ (3), శ్రేయస్లను హర్షల్ అవుట్ చేయడంతో 18, 19 ఓవర్లలో కలిపి 13 పరుగులే వచ్చాయి. ఒకే ఓవర్లో 27 పరుగులు...షమీ వేసిన ఆఖరి ఓవర్లో కింగ్స్ పండగ చేసుకుంది. ఫామ్లో లేక ఇబ్బంది పడుతున్న స్టొయినిస్ ఈ ఓవర్లో చెలరేగిపోయాడు. చివరి 4 బంతుల్లో అతను వరుసగా 6, 6, 6, 6 బాదడంతో మొత్తం 27 పరుగులు లభించాయి. బౌండరీల వర్షం...అర్ష్ దీప్ వేసిన తొలి ఓవర్లో హెడ్ 2 ఫోర్లు కొట్టడంతో రైజర్స్ విధ్వంసం మొదలైంది. యాన్సెన్ ఓవర్లో అభిషేక్ నాలుగు ఫోర్లు కొట్టగా, అర్ష్ దీప్ తర్వాతి ఓవర్లో హెడ్ వరుసగా మూడు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత యశ్ ఠాకూర్ ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్తో చెలరేగిపోయాడు. పవర్ప్లేలో జట్టు 83 పరుగులు సాధించింది. 19 బంతుల్లోనే అభిషేక్ హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. మరో వైపు మ్యాక్స్వెల్ ఓవర్లో రెండు భారీ సిక్స్లు బాదిన హెడ్ 31 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. యాన్సెన్ వేసిన ఓవర్లో మళ్లీ శివమెత్తిన అభిషేక్ 2 సిక్స్లు, 2 ఫోర్లు బాదాడు. చహల్ ఓవర్లో ఎట్టకేలకు హెడ్ వెనుదిరిగిన తర్వాత అదే ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసి 40 బంతుల్లో అభిషేక్ సెంచరీ మార్క్ను చేరుకొని గర్జించాడు. ఆ తర్వాత చెలరేగి బౌండరీల వర్షం కురిపించిన అభిషేక్ జట్టును అలవోకగా విజయం దిశగా నడిపించాడు. సాహసవంతులకే అదృష్టం కలిసి వస్తుందన్నట్లు అభిషేక్కు రెండు లైఫ్లు లభించాయి. 28 వద్ద ఠాకూర్ బౌలింగ్లో క్యాచ్ ఇవ్వగా అది నోబాల్గా తేలింది. ఆ తర్వాత 56 వద్ద చహల్ తన బౌలింగ్లోనే సునాయాస క్యాచ్ను వదిలేశాడు. దీనిని అతను బ్రహ్మండంగా వాడుకున్నాడు. స్కోరు వివరాలుపంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) నితీశ్ రెడ్డి (బి) హర్షల్ 36; ప్రభ్సిమ్రన్ (సి) కమిన్స్ (బి) మలింగ 42; శ్రేయస్ (సి) హెడ్ (బి) హర్షల్ 82; వధేరా (ఎల్బీ) (బి) మలింగ 27; శశాంక్ (ఎల్బీ) (బి) హర్షల్ 2; మ్యాక్స్వెల్ (బి) హర్షల్ 3; స్టొయినిస్ (నాటౌట్) 34; యాన్సెన్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 245. వికెట్ల పతనం: 1–66, 2–91, 3–164, 4–168, 5–205, 6–206. బౌలింగ్: మొహమ్మద్ షమీ 4–0–75–0, కమిన్స్ 4–0–40–0, హర్షల్ 4–0–42–4, ఇషాన్ మలింగ 4–0–45–2, అన్సారీ 4–0–41–0. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) మ్యాక్స్వెల్ (బి) చహల్ 66; అభిషేక్ (సి) (సబ్) దూబే (బి) అర్‡్షదీప్ 141; క్లాసెన్ (నాటౌట్) 21; ఇషాన్ కిషన్ (నాటౌట్) 9; ఎక్స్ట్రాలు 10; మొత్తం (18.3 ఓవర్లలో 2 వికెట్లకు) 247. వికెట్ల పతనం: 1–171, 2–222. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–37–1, యాన్సెన్ 2–0–39–0, యశ్ ఠాకూర్ 2.3–0–40–0, మ్యాక్స్వెల్ 3–0–40–0, ఫెర్గూసన్ 0.2–0–1–0, స్టొయినిస్ 0.4–0–6–0, చహల్ 4–0–56–1, శశాంక్ 2–0–27–0.75 ఐపీఎల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ల జాబితాలో షమీ రెండో స్థానంలో నిలిచాడు. అతను 75 పరుగులివ్వగా, ఇదే సీజన్లో రాజస్తాన్ బౌలర్ ఆర్చర్ 76 పరుగులు ఇచ్చాడు.1 ఐపీఎల్లో భారత బ్యాటర్ సాధించిన అత్యధిక స్కోరు ఇదే. కేఎల్ రాహుల్ (132) పేరిట ఉన్న రికార్డును అభిషేక్ శర్మ సవరించాడు.ఐపీఎల్లో నేడురాజస్తాన్ X బెంగళూరు వేదిక: జైపూర్మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి ఢిల్లీ X ముంబై వేదిక: ఢిల్లీ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం

అదానీ గ్రూప్లో రూ. 2,165 కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ చేపట్టిన బాండ్ల జారీలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం బ్లాక్రాక్ భారీగా ఇన్వెస్ట్ చేసింది. అదానీ గ్రూప్ 75 కోట్ల డాలర్ల(రూ. 6,500 కోట్లు) విలువైన బాండ్ల జారీని చేపట్టగా.. 25 కోట్ల డాలర్ల(సుమారు రూ. 2,165 కోట్లు)తో సబ్స్క్రయిబ్ చేసినట్లు తెలుస్తోంది.సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం 3–5ఏళ్ల కాలపరిమితితో అదానీ గ్రూప్ ఈ బాండ్లు విడుదల చేసింది. కాగా.. గతేడాది నవంబర్లో లంచం ఆఫర్ చేసిన కేసు నమోదుకావడంతో అదానీ గ్రూప్పై యూఎస్ న్యాయశాఖ పరిశోధనకు తెరతీసింది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ బాండ్లలో బ్లాక్రాక్ పెట్టుబడులకు ప్రాధాన్యత ఏర్పడినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.

ఈవీఎంలను సులువుగా హ్యాక్ చేయొచ్చు
సాక్షి, అమరావతి: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వ్యవస్థను సులువుగా హ్యాక్ చేయొచ్చని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ పేర్కొన్నారు. అందువల్ల దేశ (అమెరికా) వ్యాప్తంగా అన్ని ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లకు మారాలని పిలుపునిచ్చారు. దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన క్యాబినెట్ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతా లోపాలకు సంబంధించి పలు ఆధారాలను సమావేశం ముందుంచారు. 2020 ఎన్నికల సమయంలో మాజీ సైబర్ సెక్యూరిటీ చీఫ్ క్రిస్ క్రెబ్స్ చర్యలపై దర్యాప్తు చేయాలని జస్టిస్ డిపార్ట్మెంట్ (డీవోజే)ని ఆదేశిస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది.‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వ్యవస్థ చాలా కాలంగా హ్యాకర్లకు అందుబాటులో ఉంది. తద్వారా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో ఎన్నో ఉదాహరణలు మన ముందున్నాయి. ఈ విధానంలో ఫలితాలను తారుమారు చేయడానికి, దుర్వినియోగం చేసేందుకు అవకాశం ఉందని చెప్పేందుకు మా వద్ద పలు ఆధారాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పేపర్ బ్యాలెట్లను తీసుకురావాలనే మీ (ట్రంప్) ఆదేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. అప్పుడే ఓటర్లు ఎన్నికల సమగ్రతపై నమ్మకం కలిగి ఉంటారు’ అని గబ్బార్డ్ స్పష్టం చేసినట్లు ప్రముఖ జర్నలిస్ట్ స్మిత ప్రకాశ్ తెలిపారు. కాగా, గబ్బార్డ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. యునైటెడ్ స్టేట్స్లో ఎన్నికల భద్రతపై ఈ వ్యాఖ్యలు భారీ చర్చకు దారితీశాయి.ఇదిలా ఉండగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గురించి ఇటీవల టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ కూడా హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ఆధార పడటం సరికాదని చెప్పారు. అవి హ్యాకింగ్కు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలగించాలి. ‘సాంకేతికత, ఏఐ ద్వారా హ్యాక్ అవ్వడానికి ఉన్న అవకాశం చిన్నదైనా, అది ఎంతో పెద్ద సమస్యకు దారితీస్తుంది’ అని మస్క్ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ (మునుపటి ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. కాగా, తులసి గబ్బార్డ్ వ్యాఖ్యలపై మన దేశంలో కూడా చర్చ జరుగుతోంది. గత ఏడాది ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఈవీఎంలపై పలు అనుమానాలు వ్యక్తం అయిన సంగతి తెలిసిందే.
ఏపీకి వర్షసూచన.. ఈ జిల్లాల్లో రెండు రోజులు వర్షాలు
విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్పై 'బన్ని' నిర్మాత కామెంట్లు
అభినవ శ్రవణుడి ఆధ్యాత్మిక యాత్ర..!
భార్గవి.. ఎందుకమ్మా ఇలా చేశావు..!
పాలరాతి శిల్పంలా ఉండే నేహా శెట్టి ఇష్టపడే ఫ్యాషన్ ట్రెండ్స్ ఇవే..!
హనుమజ్జయంతి వేడుకల్లో ఉద్రిక్తత
సురేష్ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం
అనుమానాస్పద స్థితిలో తల్లి, కుమార్తె మృతి
అదానీ గ్రూప్లో రూ. 2,165 కోట్ల పెట్టుబడి
వెరైటీ వెడ్డింగ్ కార్డు.. బీజేపీ నేత సరికొత్త ఆలోచన
మెట్రోస్టేషన్లో ప్రేమికుల రొమాన్స్
'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు
తిరుమలలో మరో అపచారం
ఉప్పల్లో అభిషేక్ విధ్వంసం.. 40 బంతుల్లోనే సెంచరీ
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
ఈ రాశి వారికి వృత్తి,వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి
భారతీయులే లక్ష్యంగా ట్రంప్ మరో బాంబు
నా సినిమాలో ఆ సీన్ను అమ్మాయిలు షేర్ చేయడం చూసి బాధపడ్డాను.. డైరెక్టర్ క్షమాపణ
తెలుగు కథతో తీసిన హిందీ సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
దానివల్లే గెలిచానని నిత్యం పూజిస్తూ ఉంటార్సార్!
రెడ్బుక్ రాజ్యాంగానికి గురజాల డీఎస్పీ బలి
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
భారత విద్యార్థులపై ట్రంప్ సంచలన నిర్ణయం.. కేంద్రం అలర్ట్
అమెరికా దెబ్బకు చైనా ఔట్?
మారుతున్న ట్రెండ్: ఇప్పుడంతా ఇల్లు.. ఆఫీసు.. షాపింగ్
కిరాణ కొట్టు కుర్రాడు.. ఒక్క రాత్రిలో కోటీశ్వరుడయ్యాడు!
IPL 2025: మహ్మద్ షమీ అత్యంత చెత్త రికార్డు..
వీడియో: అరేయ్ బులుగు చొక్కా.. ఏం పనులు రా అవి?
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్లు.. టాప్ 5లో ముగ్గురు మనోళ్లే!
గోల్డెన్ డేస్..
గంట ప్రయాణం నిమిషంలో.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సగం కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15..
PSL 2025: చప్పగా సాగిన తొలి మ్యాచ్.. ఇలా అయితే కష్టమే!
నల్లకోటు లేదు.. గుండీలు పెట్టుకోలేదు
చంద్రబాబు మరో మహా ప్యాలెస్
పంజాబ్ కింగ్స్ ఫాస్టెస్ట్ ఫిప్టీ.. కేవలం 17 బంతుల్లోనే
'ఛావా' టాలీవుడ్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. తెలుగు వర్షన్ వచ్చేసింది
మహేష్ బాబు హిట్ సినిమా రీరిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
బేబీ.. ఇలా అయితే కష్టమే!
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
పంత్ నీవు ఇక మారవా.. రూ. 27 కోట్లు దండగ! ఫ్యాన్స్ ఫైర్
తలుపులు కనపడటం లేదంటే.. ట్రంప్ వచ్చి వెళ్లాడనుకుంటా సార్!
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. తొలి క్రికెటర్గా
టెస్టు మ్యాచ్ ఆడుతున్నారా?.. ఇప్పటికైనా పృథ్వీ షాను తీసుకోండి!
హింసాత్మకంగా‘వక్ఫ్’ నిరసనలు.. కేంద్ర బలగాలకు హైకోర్టు ఆదేశం
సిక్సర్ల అభి ‘ షేక్ ’
వాళ్లలా మేము ఆడలేం.. మాకు అది చేతకాదు కూడా.. అయితే: ధోని
భారత్లో వేగంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు ఇదే!
ప్రపంచానికి మహీంద్రా హెచ్చరిక.. ట్వీట్ వైరల్
స్టార్ సింగర్స్ మధ్య మనస్పర్థలు.. బ్రేకప్ ట్వీట్ వైరల్
మాతో స్నేహం అంటూనే దాడి చేస్తారా?.. రష్యాపై భారత్ సీరియస్
ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
రాజాసింగ్తో బండి సంజయ్ చర్చలు సఫలం
ఇన్స్టా లవర్తో వివాహిత పెళ్లి
LSG VS GT: డబుల్ సెంచరీ కొట్టిన శార్దూల్ ఠాకూర్
పృథ్వీ షాకు బంపరాఫర్.. ధోని టీమ్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!?
IPL 2025: గుజరాత్ టైటాన్స్కు షాక్.. అతడు సీజన్ మొత్తానికి దూరం
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం: 200 మంది ఉద్యోగులు బయటకు
ప్రాణం తీసిన వేగం
తిరుమల గోశాల ఘటనపై సుబ్రహ్మణ్యస్వామి సీరియస్
గ్రేట్ ఆంధ్రా మ్యాజిక్ షో!
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
తెలంగాణ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్స్
నేపాల్కి ఒకేఒక్కడు.. ఈ బిలియనీర్
అంత డబ్బు కళ్ల చూడలేదు!.. అతడు బ్యాటింగ్కు రాకపోవడమేంటి?
మరో ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం హిట్ సినిమా
మళ్లీ ఎప్పుడు కనబడతానో తెలీదు: ఎన్టీఆర్
‘భెల్’ ప్రశ్నాపత్రం లీక్
ఈవీఎంలను సులువుగా హ్యాక్ చేయొచ్చు
వచ్చేవారం స్టాక్మార్కెట్ ట్రేడింగ్ 3 రోజులే..
జాన్వీ కపూర్కు లంబోర్గిని కారు గిఫ్ట్.. అందుకోసమేనా?
ప్రపంచంలోని టాప్ 20 ఎయిర్పోర్ట్లు
KKR Vs CSK: అతడిని ఎనిమిదో ఓవర్లో పంపిస్తారా? అసలు మెదడు పనిచేస్తోందా?!
బక్కచిక్కిపోయిన రవితేజ హీరోయిన్
వివాదంలో యాంకర్ రవి, సుడిగాలి సుధీర్.. మరి చిరంజీవిది తప్పు కాదా?
శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్కు 10 కోట్లా, వీడియో వైరల్
LSG VS GT: రికార్డులు సృష్టించిన గిల్-సాయి సుదర్శన్ జోడీ
ఓలా ఎలక్ట్రిక్ తొలి ‘రోడ్స్టర్ ఎక్స్’ బైక్ విడుదల
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు
'ప్రావింకుడు షప్పు' సినిమా రివ్యూ (ఓటీటీ)
ఇంట్లో గొడవలు.. చనిపోదామనుకున్నా.. ఏడ్చేసిన గీతూ రాయల్
IPL 2025: పూరన్ సిక్సర్ల సునామీ.. గుజరాత్ను చిత్తు చేసిన లక్నో
ఐపీఎల్కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్.. స్టార్ క్రికెటర్లు వీరే
నేడు ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్
Hyderabad: అపార్ట్మెంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం
ఏఐ బేబీ కృత్రిమ మేధ ఐవీఎఫ్ విధానంలో తొలి శిశువు జననం
సుంకాలపై ట్రంప్ కీలక నిర్ణయం.. వీటికి మినహాయింపు
వారి చేతిలో బందీగా మారిన బానిసలు: ఎంకే స్టాలిన్
షేర్ చేసుకుందాం... కేర్ తీసుకుందాం
సార్ నాకు పెళ్లి చూపులు .. మా అన్నను వదిలేయండి..!
నేడు మధ్యాహ్నం ఓటీటీలోకి రానున్న ఫాంటసీ మూవీ
జైలర్ - 2లో నేనున్నా.. సీనియర్ హీరోయిన్
పంజాబ్ కింగ్స్పై ఎస్ఆర్హెచ్ ఘన విజయం
వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట
బ్రేక్ పడింది బాసు!
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్తో క్షణాల్లో చెక్ చేసుకోండిలా..
మాస్ జాతర.. మరోసారి 'ఇడియట్' స్టెప్పులేసిన రవితేజ
ప్రత్యేక బ్యాంక్ స్కీమ్ నిలిపివేత
మార్పు తథ్యమేనా?.. సీఎం పదవిపై మంత్రి శ్రీధర్బాబు రియాక్షన్
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
అమ్మా.. కాసేపు పడుకుంటా! అని శాశ్వత నిద్రలోకి..
నీకు 21, నాకు 43.. ఓ ఆడిటర్ ప్రేమ వివాహం
ఇలాంటి ఇళ్లకే డిమాండ్..
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
చైనాలో ఇసుక తుపాను బీభత్సం.. వందలాది విమాన, రైళ్ల సర్వీసులు రద్దు
మదరాసి విడుదల తేదీ ఖరారైందా..?
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' రివ్యూ.. నవ్వులతో మెప్పించారా?
ఏపీకి వర్షసూచన.. ఈ జిల్లాల్లో రెండు రోజులు వర్షాలు
విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్పై 'బన్ని' నిర్మాత కామెంట్లు
అభినవ శ్రవణుడి ఆధ్యాత్మిక యాత్ర..!
భార్గవి.. ఎందుకమ్మా ఇలా చేశావు..!
పాలరాతి శిల్పంలా ఉండే నేహా శెట్టి ఇష్టపడే ఫ్యాషన్ ట్రెండ్స్ ఇవే..!
హనుమజ్జయంతి వేడుకల్లో ఉద్రిక్తత
సురేష్ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం
అనుమానాస్పద స్థితిలో తల్లి, కుమార్తె మృతి
అదానీ గ్రూప్లో రూ. 2,165 కోట్ల పెట్టుబడి
వెరైటీ వెడ్డింగ్ కార్డు.. బీజేపీ నేత సరికొత్త ఆలోచన
మెట్రోస్టేషన్లో ప్రేమికుల రొమాన్స్
'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు
తిరుమలలో మరో అపచారం
ఉప్పల్లో అభిషేక్ విధ్వంసం.. 40 బంతుల్లోనే సెంచరీ
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
ఈ రాశి వారికి వృత్తి,వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి
భారతీయులే లక్ష్యంగా ట్రంప్ మరో బాంబు
నా సినిమాలో ఆ సీన్ను అమ్మాయిలు షేర్ చేయడం చూసి బాధపడ్డాను.. డైరెక్టర్ క్షమాపణ
తెలుగు కథతో తీసిన హిందీ సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
దానివల్లే గెలిచానని నిత్యం పూజిస్తూ ఉంటార్సార్!
రెడ్బుక్ రాజ్యాంగానికి గురజాల డీఎస్పీ బలి
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
భారత విద్యార్థులపై ట్రంప్ సంచలన నిర్ణయం.. కేంద్రం అలర్ట్
అమెరికా దెబ్బకు చైనా ఔట్?
మారుతున్న ట్రెండ్: ఇప్పుడంతా ఇల్లు.. ఆఫీసు.. షాపింగ్
కిరాణ కొట్టు కుర్రాడు.. ఒక్క రాత్రిలో కోటీశ్వరుడయ్యాడు!
IPL 2025: మహ్మద్ షమీ అత్యంత చెత్త రికార్డు..
వీడియో: అరేయ్ బులుగు చొక్కా.. ఏం పనులు రా అవి?
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్లు.. టాప్ 5లో ముగ్గురు మనోళ్లే!
గోల్డెన్ డేస్..
గంట ప్రయాణం నిమిషంలో.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సగం కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15..
PSL 2025: చప్పగా సాగిన తొలి మ్యాచ్.. ఇలా అయితే కష్టమే!
నల్లకోటు లేదు.. గుండీలు పెట్టుకోలేదు
చంద్రబాబు మరో మహా ప్యాలెస్
పంజాబ్ కింగ్స్ ఫాస్టెస్ట్ ఫిప్టీ.. కేవలం 17 బంతుల్లోనే
'ఛావా' టాలీవుడ్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. తెలుగు వర్షన్ వచ్చేసింది
మహేష్ బాబు హిట్ సినిమా రీరిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
బేబీ.. ఇలా అయితే కష్టమే!
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
పంత్ నీవు ఇక మారవా.. రూ. 27 కోట్లు దండగ! ఫ్యాన్స్ ఫైర్
తలుపులు కనపడటం లేదంటే.. ట్రంప్ వచ్చి వెళ్లాడనుకుంటా సార్!
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. తొలి క్రికెటర్గా
టెస్టు మ్యాచ్ ఆడుతున్నారా?.. ఇప్పటికైనా పృథ్వీ షాను తీసుకోండి!
హింసాత్మకంగా‘వక్ఫ్’ నిరసనలు.. కేంద్ర బలగాలకు హైకోర్టు ఆదేశం
సిక్సర్ల అభి ‘ షేక్ ’
వాళ్లలా మేము ఆడలేం.. మాకు అది చేతకాదు కూడా.. అయితే: ధోని
భారత్లో వేగంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు ఇదే!
ప్రపంచానికి మహీంద్రా హెచ్చరిక.. ట్వీట్ వైరల్
స్టార్ సింగర్స్ మధ్య మనస్పర్థలు.. బ్రేకప్ ట్వీట్ వైరల్
మాతో స్నేహం అంటూనే దాడి చేస్తారా?.. రష్యాపై భారత్ సీరియస్
ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
రాజాసింగ్తో బండి సంజయ్ చర్చలు సఫలం
ఇన్స్టా లవర్తో వివాహిత పెళ్లి
LSG VS GT: డబుల్ సెంచరీ కొట్టిన శార్దూల్ ఠాకూర్
పృథ్వీ షాకు బంపరాఫర్.. ధోని టీమ్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!?
IPL 2025: గుజరాత్ టైటాన్స్కు షాక్.. అతడు సీజన్ మొత్తానికి దూరం
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం: 200 మంది ఉద్యోగులు బయటకు
ప్రాణం తీసిన వేగం
తిరుమల గోశాల ఘటనపై సుబ్రహ్మణ్యస్వామి సీరియస్
గ్రేట్ ఆంధ్రా మ్యాజిక్ షో!
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
తెలంగాణ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్స్
నేపాల్కి ఒకేఒక్కడు.. ఈ బిలియనీర్
అంత డబ్బు కళ్ల చూడలేదు!.. అతడు బ్యాటింగ్కు రాకపోవడమేంటి?
మరో ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం హిట్ సినిమా
మళ్లీ ఎప్పుడు కనబడతానో తెలీదు: ఎన్టీఆర్
‘భెల్’ ప్రశ్నాపత్రం లీక్
ఈవీఎంలను సులువుగా హ్యాక్ చేయొచ్చు
వచ్చేవారం స్టాక్మార్కెట్ ట్రేడింగ్ 3 రోజులే..
జాన్వీ కపూర్కు లంబోర్గిని కారు గిఫ్ట్.. అందుకోసమేనా?
ప్రపంచంలోని టాప్ 20 ఎయిర్పోర్ట్లు
KKR Vs CSK: అతడిని ఎనిమిదో ఓవర్లో పంపిస్తారా? అసలు మెదడు పనిచేస్తోందా?!
బక్కచిక్కిపోయిన రవితేజ హీరోయిన్
వివాదంలో యాంకర్ రవి, సుడిగాలి సుధీర్.. మరి చిరంజీవిది తప్పు కాదా?
శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్కు 10 కోట్లా, వీడియో వైరల్
LSG VS GT: రికార్డులు సృష్టించిన గిల్-సాయి సుదర్శన్ జోడీ
ఓలా ఎలక్ట్రిక్ తొలి ‘రోడ్స్టర్ ఎక్స్’ బైక్ విడుదల
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు
'ప్రావింకుడు షప్పు' సినిమా రివ్యూ (ఓటీటీ)
ఇంట్లో గొడవలు.. చనిపోదామనుకున్నా.. ఏడ్చేసిన గీతూ రాయల్
IPL 2025: పూరన్ సిక్సర్ల సునామీ.. గుజరాత్ను చిత్తు చేసిన లక్నో
ఐపీఎల్కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్.. స్టార్ క్రికెటర్లు వీరే
నేడు ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్
Hyderabad: అపార్ట్మెంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం
ఏఐ బేబీ కృత్రిమ మేధ ఐవీఎఫ్ విధానంలో తొలి శిశువు జననం
సుంకాలపై ట్రంప్ కీలక నిర్ణయం.. వీటికి మినహాయింపు
వారి చేతిలో బందీగా మారిన బానిసలు: ఎంకే స్టాలిన్
షేర్ చేసుకుందాం... కేర్ తీసుకుందాం
సార్ నాకు పెళ్లి చూపులు .. మా అన్నను వదిలేయండి..!
నేడు మధ్యాహ్నం ఓటీటీలోకి రానున్న ఫాంటసీ మూవీ
జైలర్ - 2లో నేనున్నా.. సీనియర్ హీరోయిన్
పంజాబ్ కింగ్స్పై ఎస్ఆర్హెచ్ ఘన విజయం
వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట
బ్రేక్ పడింది బాసు!
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్తో క్షణాల్లో చెక్ చేసుకోండిలా..
మాస్ జాతర.. మరోసారి 'ఇడియట్' స్టెప్పులేసిన రవితేజ
ప్రత్యేక బ్యాంక్ స్కీమ్ నిలిపివేత
మార్పు తథ్యమేనా?.. సీఎం పదవిపై మంత్రి శ్రీధర్బాబు రియాక్షన్
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
అమ్మా.. కాసేపు పడుకుంటా! అని శాశ్వత నిద్రలోకి..
నీకు 21, నాకు 43.. ఓ ఆడిటర్ ప్రేమ వివాహం
ఇలాంటి ఇళ్లకే డిమాండ్..
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
చైనాలో ఇసుక తుపాను బీభత్సం.. వందలాది విమాన, రైళ్ల సర్వీసులు రద్దు
మదరాసి విడుదల తేదీ ఖరారైందా..?
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' రివ్యూ.. నవ్వులతో మెప్పించారా?
సినిమా

కనులు కనులు కలిసి...
‘‘మా రాజేంద్రప్రసాద్ అన్నయ్య నటించిన ‘షష్టి పూర్తి’ ఫీల్ గుడ్ సినిమా అవుతుందనిపిస్తోంది. అందరూ చూడండి’’ అని హీరో రవితేజ చెప్పారు. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో, రూపేష్, ఆకాంక్షా సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభ దర్శకత్వంలో హీరో రూపేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ‘ఇరు కనులు కనులు కలిసి మురిసె...’ అంటూ సాగే రెండో పాటని రవితేజ ఆవిష్కరించారు. రెహమాన్ రాసిన ఈ పాటను ఎస్పీ చరణ్, విభావరి ఆలపించారు. ఈశ్వర్ కొరియోగ్రఫీ చేశారు. ‘‘ఈ పాటకు ఇళయరాజాగారు బాణీ ఇవ్వగానే ‘సాగర సంగమం’ చిత్రంలోని ‘మౌనమేలనోయి’లా గొప్ప పాట అవుతుందనే అనుభూతి కలిగింది’’ అని తెలిపారు పవన్ ప్రభ.

చివరి ఇరవై నిమిషాలు కన్నీళ్లు ఆపుకోలేకపోయా: హీరో ఎన్టీఆర్
‘‘ఈ వేదికపైన ఎన్నోసార్లు నేను, అన్న (కల్యాణ్ రామ్) నిల్చొని ఉన్నప్పుడు మా నాన్నగారు (హరికృష్ణ) రావడం, మాట్లాడటం జరిగింది. ఈరోజు విజయశాంతిగారు మాట్లాడుతుంటే మొదటిసారి వేదికపైన మా నాన్నగారు లేరనే లోటు తీరినట్టయింది. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో నాన్నగారు ఉండుంటే ఎలా ఉంటుందో విజయశాంతిగారు మాట్లాడినప్పుడు నాకు ఆ లోటు భర్తీ అయిపోయింది’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. కల్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్ జంటగా విజయశాంతి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘భారతదేశ చిత్ర పటంలో హీరోలతో సమానంగా నిల్చున్న ఏకైక మహిళ ఎవరన్నా ఉన్నారంటే అది విజయశాంతిగారు ఒక్కరే. ‘కర్తవ్యం, ప్రతిఘటన, మగరాయుడు’... ఇలా ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేశారామె. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ని చూశాను.విజయశాంతిగారు లేకపోతే ఈ చిత్రం లేదు. పృథ్వీ, సోహైల్ ఖాన్, ప్రదీప్ చిలుకూరి, సునీల్, అశోక్గార్లు... ఇలా ఎవరు లేకున్నా ఈ సినిమా లేదు. 18న ఈ మూవీ మీ ముందుకొస్తోంది. రాసిపెట్టుకోండి... ఆఖరుగా వచ్చే ఇరవై నిమిషాలు ప్రేక్షకుల కళ్లల్లో నీళ్లు తిరక్కపోతే... అంత అద్భుతంగా తీశారు ప్రదీప్గారు. సినిమా చూస్తున్న నాకు కూడా కన్నీళ్లు ఆపుకోవడం కుదరలేదు. ఆ ఆఖరి ఇరవై నిమిషాలు అలా రావడానికి ఒకే ఒక్క కారణం కల్యాణ్ అన్న మాత్రమే. దర్శకుడి ఐడియాని ఆయన నమ్మారు. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అన్న కెరీర్లో ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుందని నా నమ్మకం. మనసు పెట్టి, ప్రాణం పెట్టి నటించారు. బహుశా అది విజయశాంతిగారు కాకుండా వేరే వారు అయ్యుంటే ఆయన అంత అద్భుతంగా చేసేవారో కాదో నాకు తెలీదు. ఆమెను ఓ తల్లిగా నమ్మారు కాబట్టి అంత అద్భతంగా నటించారు. ప్రేక్షకులు, మా ఫ్యాన్స్ అందరూ ముందుగా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ని ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న ‘వార్ 2’ (హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించారు) కూడా మిమ్మల్ని అలరిస్తుంది. పక్కాగా ప్లాన్ చేసి ఈ ఏడాది మిమ్మల్ని అందర్నీ తప్పకుండా కలుస్తాను’’ అని చెప్పారు. కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘మీరు చాలా సినిమాలు చూస్తారు. మేం కూడా చేస్తాం. సినిమా అయ్యాక పార్కింగ్కి వెళ్లి బైక్, కార్ స్టార్ట్ చేసుకోగానే సినిమాని మర్చిపోతాం. కానీ, చాలా అరుదుగా నటులుగా మాకు గానీ, ప్రేక్షకులుగా మీకు గానీ కొన్ని సినిమాలు ఇంటికెళ్లేదాకా మనసుని హత్తుకుంటాయి. అలాంటి సినిమా మా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’’ అన్నారు. విజయశాంతి మాట్లాడుతూ– ‘‘ఎన్టీ రామారావుగారు ఓ డిక్షనరీ. ఆయనలో కొంత వచ్చినా ఎవరైనా గొప్ప నటీనటులు అయిపోతారు. ఆయన వద్ద నుంచి ఆశీర్వాదాలు తీసుకోవడం నా అదృష్టం. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సెట్స్లో నేను అనుకున్నదానికంటే అద్భుతంగా, చాలా సౌకర్యంగా చూసుకున్నాడు కల్యాణ్ బాబు. ఈ సినిమాని అందరూ థియేటర్లో చూసి, సూపర్ హిట్ అని చెప్పాలి’’ అని అన్నారు. ఈ వేడుకలో కెమేరామేన్ రాంప్రసాద్, నటులు జోగినాయుడు, సందీప్, రచయిత శ్రీకాంత్ విస్సా, ్ర΄÷డక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి, రచయిత రఘురామ్ పాల్గొన్నారు.

క్రిష్ 4లో?
బాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజీ ‘క్రిష్’ నుంచి ‘క్రిష్ 4’ రానున్న సంగతి తెలిసిందే. ‘క్రిష్’ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు వచ్చిన మూడు సినిమాల్లో హీరోగా నటించిన హృతిక్ రోషన్... ‘క్రిష్ 4’ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించనున్నారు. రాకేష్ రోషన్, ఆదిత్యా చోప్రా నిర్మించనున్నారు.వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం కానుంది. ఇప్పటికే ఈ మూవీలో ప్రీతీ జింతా, వివేక్ ఓబెరాయ్ వంటి వారు నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. తాజాగా ప్రియాంకా చోప్రా పేరు తెరపైకి వచ్చింది. కాగా ఇటీవల ప్రియాంకా చోప్రా – నిక్ జోనస్ (ప్రియాంక భర్త)లను హృతిక్ అమెరికాలో కలిసి, మాట్లాడటంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లు అయింది. వీరి మధ్య ‘క్రిష్ 4’ అంశం కూడా చర్చకు వచ్చిందని, ఈ మూవీలో ప్రియాంకా చోప్రా దాదాపు ఖరారు అయ్యారని ప్రచారం జరుగుతోంది.

ప్రామిస్ని నిలబెట్టుకున్నాం: హీరో ప్రదీప్
‘‘ఈ వేసవిలో మంచి తెలుగు సినిమా చూసి నవ్వుకుందాం అని భావించే ప్రతి ఫ్యామిలీని ‘మా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’కి ఆహ్వానిస్తున్నాం. మా సినిమా చూసి, థియేటర్స్ నుంచి బయటకొచ్చే ప్రతి ఒక్కరి ముఖంలో నవ్వు కనిపిస్తోంది. మా సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుల పెదవులపై నవ్వు ఉంటుందని ప్రామిస్ చేశాను.ఆ ప్రామిస్ని నిలబెట్టుకున్నాం’’ అని ప్రదీప్ మాచిరాజు అన్నారు. ప్రదీప్ మాచిరాజు, దీపిక పిల్లి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. నితిన్–భరత్ దర్శకత్వంలో ఈ సినిమాను మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ నిర్మించింది. ఈ చిత్రం ఈ నెల 11న విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన సక్సెస్మీట్లో... ‘‘క్లీన్ కామెడీతో అందర్నీ నవ్విస్తామని చెప్పం. అదే చేశాం’’ అన్నారు నితిన్–భరత్. గెటప్ శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ రథన్, మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడారు.
న్యూస్ పాడ్కాస్ట్

కొత్త సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్కు మినహాయింపు. ట్రంప్ సర్కారు తాజా ప్రకటన. అమెరికా కంపెనీల ప్రయోజనాలే లక్ష్యం

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు 125 శాతానికి పెంపు... డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతానికి ప్రతీకారంగా చైనా నిర్ణయం

చర్యకు ప్రతి చర్య తప్పదు.. అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టికాయ వేస్తారు... ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరిక

చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన... చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టీకరణ

మీ కుటుంబానికి అండగా ఉంటాం... పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఆగిన ‘ఆరోగ్యశ్రీ’!. సమ్మెలో నెట్వర్క్ ఆస్పత్రులు

ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని ప్రభుత్వం... సమ్మె బాటలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు

ఏపీలో ఊరూ వాడా ఏరులై పారుతున్న వైనం. కూటమి నేతల సిండికేట్ కబంధ హస్తాల్లో మద్యం షాపులు.

వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింలను దగా చేసిన ఏపీ సీఎం చంద్రబాబు... మూడు సవరణలు ప్రతిపాదించామంటూ తెలుగుదేశం పార్టీ గొప్పలు... అవి పసలేని సవరణలేనని మైనార్టీల ఆగ్రహం

తక్షణమే పనులు నిలిపివేయండి కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు
క్రీడలు

ఇకపై వన్డేల్లో ఒకటే బంతి!
న్యూఢిల్లీ: బ్యాటర్లకు అనుకూలంగా ఉన్న నిబంధనలను మార్చి ఆటలో బ్యాటింగ్, బౌలింగ్కు సమానమైన ప్రాధాన్యత కల్పించడం... ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల కేటాయింపు విధానంలో మార్పులు... పురుషుల అండర్–19 ప్రపంచకప్ పోటీలను 50 ఓవర్ల నుంచి 20 ఓవర్లకు తగ్గించడం ఇలాంటి పలు అంశాలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆదివారం జింబాబ్వే రాజధాని హరారే వేదికగా ఐసీసీ బోర్డు సమావేశం జరగనుండగా... ఇందులో కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. వన్డే క్రికెట్ బ్యాటర్లకు అనుకూలంగా ఉందనే దీర్ఘకాలిక ఆందోళనను పరిష్కరించే దిశగా... 50 ఓవర్ల ఫార్మాట్లో రెండు బంతుల నియమాన్ని మార్చే అవకాశాలున్నాయి. దశాబ్ద కాలంగా రెండు కొత్త బంతుల విధానం కొనసాగుతుండగా... భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ వన్డేల్లో ఒకే బంతిని ఉపయోగించాలని సిఫార్సు చేసింది. ఆటలో పోటీతత్వం పెంపొందించేందుకు ఇది సహాయపడనుంది. ‘ఐసీసీ సమావేశంలో మూడు నిబంధనలపై చర్చ జరగనుంది. వన్డేల్లో ఒకే బంతి వినియోగం, టెస్టు క్రికెట్లో టైమర్ను ప్రవేశ పెట్టడం, పురుషుల అండర్–19 ప్రపంచకప్ను టి20 ఫార్మాట్లో నిర్వహించడంపై చర్చించే అవకాశం ఉంది’ అని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. టెస్టు క్రికెట్లో ఓవర్కు ఓవర్కు మధ్య విరామాన్ని ఇకపై 60 సెకన్లకే పరిమతం చేయడంతో పాటు... రోజుకు 90 ఓవర్లు పూర్తి చేసే దిశగా మరింత పకడ్బందీ నిబంధనలను రూపొందించనున్నారు. 2026లో జింబాబ్వే, నమీబియా వేదికగా జరగనున్న పురుషుల అండర్–19 వరల్డ్కప్ను టి20 ఫార్మాట్లో నిర్వహించే దిశగా చర్చ జరగనుంది. డబ్ల్యూటీసీ పాయింట్ల విధానంలోనూ మార్పులు!ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల కేటాయింపు విధానంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త నిబంధనలు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. ఈ ఏడాది జూన్లో జరగనున్న భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్తో 2025–27 సర్కిల్ ప్రారంభం కానుంది. రగ్బీ తరహాలో... ప్రత్యర్థుల బలం ఆధారంగా విజయాలకు పాయింట్లు కేటాయించడంతో పాటు స్వదేశంలో గెలిచిన మ్యాచ్లు, విదేశాల్లో గెలిచిన మ్యాచ్లకు మధ్య వ్యత్యాసం తీసుకొచ్చే చాన్స్ ఉంది. అలాగే గెలుపు అంతరాన్ని బట్టి బోనస్ పాయింట్లను కేటాయించే కొత్త వ్యవస్థను తీసుకురావాలిన క్రీడా పాలకమండలి యోచిస్తోంది. ఈ అంశంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ సర్కిల్లో టెస్టు మ్యాచ్ విజయానికి 12 పాయింట్లు, ‘టై’కు 6 పాయింట్లు, ‘డ్రా’కు 4 పాయింట్లు కేటాయిస్తున్నారు. ఈ విధానం వల్ల ఎక్కువ టెస్టు సిరీస్లు ఆడే ప్రధాన జట్లైన భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాకు పాయింట్ల విషయంలో అన్యాయం జరుగుతోంది. 2023–25 డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరిన దక్షిణాఫ్రికా జట్టు... ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి ప్రధాన జట్లతో సిరీస్లు ఆడకుండానే తుదిపోరుకు అర్హత సాధించింది. వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంకపై సిరీస్ విజయాలతో పాటు టీమిండియాతో సిరీస్ ‘డ్రా’ చేసుకోవడం ద్వారా ముందంజ వేసింది. ఇక ‘స్లో ఓవర్ రేట్’ జరిమానా విషయంలోనూ దృష్టి సారించే అవకాశం ఉంది. 2023–25 సర్కిల్లో స్లో ఓవర్రేట్ కారణంగా ఇంగ్లండ్ జట్టు 22 పాయింట్లు కోల్పోయింది. ఫలితంగా 41.5 విజయాల శాతంతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. స్లో ఓవర్రేట్ను పక్కన పెడితే ఇంగ్లండ్ విజయాల శాతం 51.5గా ఉండేది. అప్పుడు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తర్వాత పట్టికలో ఇంగ్లండ్ మూడో స్థానంలో నిలిచేది. టెస్టు క్రికెట్ను రెండంచెలుగా విభజించాలనే అంశంపై ఇప్పుడప్పుడే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. సుదీర్ఘ ఫార్మాట్ ఆడే ప్రధాన జట్లను ఒక గ్రూప్గా... మిగిలిన జట్లను మరో గ్రూప్గా విభజించి మ్యాచ్లు నిర్వహించాలని చాన్నాళ్లుగా యోచిస్తున్నప్పటికీ... అది ఇప్పట్లో జరిగే పనిలా లేదు.

ఫిలిప్స్కు గాయం... ఐపీఎల్కు దూరం
అహ్మదాబాద్: గుజరాత్ టైటాన్స్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు దూరమయ్యాడు. న్యూజిలాండ్కు చెందిన ఫిలిప్స్ గాయం కారణంగా మిగిలిన మ్యాచ్లకు అందుబాటులో ఉండబోడని గుజరాత్ ఫ్రాంచైజీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. తాజా సీజన్లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఫిలిప్స్... ఈ నెల 6న సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్ చివరి ఓవర్లో రైజర్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కొట్టిన బంతిని అడ్డుకునే ప్రయత్నంలో కిందపడ్డాడు. ఈ సమయంలో అతడి గజ్జల్లో గాయమైంది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడు కోలుకునేందుకు ఎక్కువ సమయం పట్టనుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి తిరుగు పయనం కాగా... ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ జట్టు గ్లెన్ ఫిలిప్స్ సేవలను కూడా కోల్పోయింది.

సిక్సర్ల అభి ‘ షేక్ ’
తొలి ఐదు మ్యాచ్లలో కలిపి 51 పరుగులు...ఈ సీజన్లో అభిషేక్ శర్మ ప్రదర్శన ఇది. వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్న అతను తన గత ఏడాది ఆటను ఒక్కసారిగా గుర్తు తెచ్చుకున్న ట్లున్నాడు. పంజాబ్పై మ్యాచ్లో ఒక్కసారిగా తన కసినంతా ప్రదర్శిస్తూ వీర విధ్వంసం సృష్టించాడు. కేవలం బౌండరీలతోనే 116 పరుగులు బాది శతకనాదం చేశాడు. ఇది ఆరెంజ్ ఆర్మీ కోసం అంటూ రాసి ఉన్న కాగితాన్ని ప్రదర్శిస్తూ ఈ ఇన్నింగ్స్ విలువేమిటో చెప్పాడు. అభిషేక్కు హెడ్ మెరుపులు తోడవడంతో 246 పరుగుల లక్ష్యాన్ని కూడా మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి సన్రైజర్స్ సంచలనం సృష్టించింది. మరో వైపు సమష్టి ప్రదర్శనతో 245 పరుగులు చేసి కూడా ఓటమిపాలైన పంజాబ్ కింగ్స్ తీవ్ర నిరాశకు లోనైంది. ఓవరాల్గా 492 పరుగులతో అభిమానులకు ఫుల్ జోష్ దక్కింది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ సీజన్ నాలుగు వరుస పరాజయాల తర్వాత నిస్తేజంగా కనిపించిన సన్రైజర్స్ హైదరాబాద్ ఘనమైన రీతిలో కోలుకుంది. తమ అసలు ఆటను ప్రదర్శిస్తూ లీగ్లో తమను తక్కువగా అంచనా వేయవద్దనే సందేశాన్ని ఇచ్చింది. శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 82; 6 ఫోర్లు, 6 సిక్స్లు), ప్రభ్సిమ్రన్ సింగ్ (23 బంతుల్లో 42; 7 ఫోర్లు, 1 సిక్స్), ప్రియాన్‡్ష ఆర్య (13 బంతుల్లో 36; 2 ఫోర్లు, 4 సిక్స్లు) కీలక పరుగులు సాధించారు. అనంతరం సన్రైజర్స్ 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 247 పరుగులు సాధించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అభిషేక్ శర్మ (55 బంతుల్లో 141; 14 ఫోర్లు, 10 సిక్స్లు) ఐపీఎల్లో తన తొలి సెంచరీని నమోదు చేయగా, ట్రవిస్ హెడ్ (37 బంతుల్లో 66; 9 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించాడు. వీరిద్దరు తొలి వికెట్కు 75 బంతుల్లో 171 పరుగులు జోడించారు. మెరుపు బ్యాటింగ్...పవర్ప్లేలో 89 పరుగులు...10 ఓవర్లు ముగిసే సరికి 120. తర్వాతి 5 ఓవర్లలో 57 పరుగులు...ఆఖరి 5 ఓవర్లలో 68 పరుగులు... పంజాబ్ కింగ్స్ ఇలా దాదాపు అన్ని దశల్లోనూ ఒకే తరహాలో దూకుడుగా సాగింది. టాప్–7లో ఇద్దరు మినహా మిగతావారంతా చెలరేగిపోవడంతో భారీ స్కోరు సాధ్యమైంది. షమీ వేసిన తొలి ఓవర్లో ప్రభ్సిమ్రన్ వరుసగా 3 ఫోర్లతో మొదలు పెట్టగా, షమీ తర్వాతి ఓవర్లో ప్రియాన్ష్ వరుసగా 6, 6, 4 బాదాడు. కమిన్స్ తొలి ఓవర్లో కూడా 2 ఫోర్లు, సిక్స్తో పంజాబ్ 16 పరుగులు రాబట్టింది. అయితే తన తొలి రెండు ఓవర్లలో 28 పరుగులిచ్చిన హర్షల్...ప్రియాన్‡్షను అవుట్ చేయడంలో సఫలమయ్యాడు. ఈ మ్యాచ్తో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన మలింగ తన తొలి వికెట్గా ప్రభ్సిమ్రన్ను వెనక్కి పంపించాడు. ఆ తర్వాత శ్రేయస్, నేహల్ వధేరా (22 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) భాగస్వామ్యం కూడా జోరుగా సాగింది. వీరిద్దరు మూడో వికెట్కు 40 బంతుల్లోనే 73 పరుగులు జోడించారు. అన్సారీ ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్ బాదిన శ్రేయస్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. శశాంక్ సింగ్ (2) విఫలం కాగా, మలింగ ఓవర్లో శ్రేయస్ 4 ఫోర్లతో చెలరేగాడు. అయితే రెండు బంతుల వ్యవధిలో మ్యాక్స్వెల్ (3), శ్రేయస్లను హర్షల్ అవుట్ చేయడంతో 18, 19 ఓవర్లలో కలిపి 13 పరుగులే వచ్చాయి. ఒకే ఓవర్లో 27 పరుగులు...షమీ వేసిన ఆఖరి ఓవర్లో కింగ్స్ పండగ చేసుకుంది. ఫామ్లో లేక ఇబ్బంది పడుతున్న స్టొయినిస్ ఈ ఓవర్లో చెలరేగిపోయాడు. చివరి 4 బంతుల్లో అతను వరుసగా 6, 6, 6, 6 బాదడంతో మొత్తం 27 పరుగులు లభించాయి. బౌండరీల వర్షం...అర్ష్ దీప్ వేసిన తొలి ఓవర్లో హెడ్ 2 ఫోర్లు కొట్టడంతో రైజర్స్ విధ్వంసం మొదలైంది. యాన్సెన్ ఓవర్లో అభిషేక్ నాలుగు ఫోర్లు కొట్టగా, అర్ష్ దీప్ తర్వాతి ఓవర్లో హెడ్ వరుసగా మూడు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత యశ్ ఠాకూర్ ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్తో చెలరేగిపోయాడు. పవర్ప్లేలో జట్టు 83 పరుగులు సాధించింది. 19 బంతుల్లోనే అభిషేక్ హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. మరో వైపు మ్యాక్స్వెల్ ఓవర్లో రెండు భారీ సిక్స్లు బాదిన హెడ్ 31 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. యాన్సెన్ వేసిన ఓవర్లో మళ్లీ శివమెత్తిన అభిషేక్ 2 సిక్స్లు, 2 ఫోర్లు బాదాడు. చహల్ ఓవర్లో ఎట్టకేలకు హెడ్ వెనుదిరిగిన తర్వాత అదే ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసి 40 బంతుల్లో అభిషేక్ సెంచరీ మార్క్ను చేరుకొని గర్జించాడు. ఆ తర్వాత చెలరేగి బౌండరీల వర్షం కురిపించిన అభిషేక్ జట్టును అలవోకగా విజయం దిశగా నడిపించాడు. సాహసవంతులకే అదృష్టం కలిసి వస్తుందన్నట్లు అభిషేక్కు రెండు లైఫ్లు లభించాయి. 28 వద్ద ఠాకూర్ బౌలింగ్లో క్యాచ్ ఇవ్వగా అది నోబాల్గా తేలింది. ఆ తర్వాత 56 వద్ద చహల్ తన బౌలింగ్లోనే సునాయాస క్యాచ్ను వదిలేశాడు. దీనిని అతను బ్రహ్మండంగా వాడుకున్నాడు. స్కోరు వివరాలుపంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) నితీశ్ రెడ్డి (బి) హర్షల్ 36; ప్రభ్సిమ్రన్ (సి) కమిన్స్ (బి) మలింగ 42; శ్రేయస్ (సి) హెడ్ (బి) హర్షల్ 82; వధేరా (ఎల్బీ) (బి) మలింగ 27; శశాంక్ (ఎల్బీ) (బి) హర్షల్ 2; మ్యాక్స్వెల్ (బి) హర్షల్ 3; స్టొయినిస్ (నాటౌట్) 34; యాన్సెన్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 245. వికెట్ల పతనం: 1–66, 2–91, 3–164, 4–168, 5–205, 6–206. బౌలింగ్: మొహమ్మద్ షమీ 4–0–75–0, కమిన్స్ 4–0–40–0, హర్షల్ 4–0–42–4, ఇషాన్ మలింగ 4–0–45–2, అన్సారీ 4–0–41–0. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) మ్యాక్స్వెల్ (బి) చహల్ 66; అభిషేక్ (సి) (సబ్) దూబే (బి) అర్‡్షదీప్ 141; క్లాసెన్ (నాటౌట్) 21; ఇషాన్ కిషన్ (నాటౌట్) 9; ఎక్స్ట్రాలు 10; మొత్తం (18.3 ఓవర్లలో 2 వికెట్లకు) 247. వికెట్ల పతనం: 1–171, 2–222. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–37–1, యాన్సెన్ 2–0–39–0, యశ్ ఠాకూర్ 2.3–0–40–0, మ్యాక్స్వెల్ 3–0–40–0, ఫెర్గూసన్ 0.2–0–1–0, స్టొయినిస్ 0.4–0–6–0, చహల్ 4–0–56–1, శశాంక్ 2–0–27–0.75 ఐపీఎల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ల జాబితాలో షమీ రెండో స్థానంలో నిలిచాడు. అతను 75 పరుగులివ్వగా, ఇదే సీజన్లో రాజస్తాన్ బౌలర్ ఆర్చర్ 76 పరుగులు ఇచ్చాడు.1 ఐపీఎల్లో భారత బ్యాటర్ సాధించిన అత్యధిక స్కోరు ఇదే. కేఎల్ రాహుల్ (132) పేరిట ఉన్న రికార్డును అభిషేక్ శర్మ సవరించాడు.ఐపీఎల్లో నేడురాజస్తాన్ X బెంగళూరు వేదిక: జైపూర్మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి ఢిల్లీ X ముంబై వేదిక: ఢిల్లీ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం

జ్యోతి సురేఖ జోడీ పసిడి గురి
సెంట్రల్ ఫ్లోరిడా: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ పసిడి వెలుగులు విరజిమ్మింది. శనివారం కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ–రిషభ్ యాదవ్ (భారత్) జోడీ 153–151 పాయింట్ల తేడాతో హువాంగ్ ఐజు–చెన్ చియె లున్ (చైనీస్ తైపీ) ద్వయంపై విజయం సాధించింది. తుదిపోరులో ఐదో సీడ్గా బరిలోకి దిగిన భారత జోడీ... రెండో సీడ్ చైనీస్ తైపీని వెనక్కినెడుతూ స్వర్ణం కైవసం చేసుకుంది. తొలి రెండు సిరీస్లను 37–38, 38–39తో కోల్పోయిన భారత ఆర్చర్లు... మూడో సెట్లో 39–38తో తిరిగి పోటీలోకి వచ్చారు. నాలుగో సిరీస్లో 39–36తో సునాయాసంగా నెగ్గి పసిడి పతకం చేజిక్కించుకున్నారు. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో ఆర్చరీ కాంపౌండ్ విభాగాన్ని చేర్చిన అనంతరం ఈ విజయం విశ్వక్రీడల్లో భారత పతక ఆశలను మరింత పెంచింది. ఈ టోర్నీలో భారత్కు ఇది మూడో పతకం కావడం విశేషం. అంతకుముందు కాంపౌండ్ పురుషుల టీమ్ ఈవెంట్లో భారత జట్టు కాంస్య పతకం నెగ్గగా... రికర్వ్ పురుషుల టీమ్ ఈవెంట్లో భారత జట్టు ఫైనల్కు చేరి కనీసం రజత పతకం ఖాయం చేసుకుంది.
బిజినెస్

డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ @ రూ.22,150 కోట్లు
న్యూఢిల్లీ: డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ స్థిరమైన వృద్ధిని చూస్తోంది. పరిశ్రమ విలువ 2024 మార్చి నాటికి రూ.22,150 కోట్లకు చేరుకున్నట్టు ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ (ఐడీఎస్ఏ) ప్రకటించింది. ఈ రంగంలో 470 వరకు చిన్న, పెద్ద సంస్థలు దేశంలో సేవలు అందిస్తుండగా, వీటి పరిధిలో కొత్తగా 1.86 లక్షల మంది ప్రత్యక్ష విక్రేతలు (డైరెక్ట్ సెల్లర్స్) 2023–24లో నమోదైనట్టు తెలిపింది. గత ఐదేళ్లలో (2019–20 నుంచి 2023–24) డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ ఏటా 7.15 శాతం చొప్పున వృద్ధి చెందుతూ.. రూ.16,800 కోట్ల నుంచి రూ.22,142 కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది. ఈ రంగంలో ఆరోగ్య సంరక్షణ, పోషకాహార ఉత్పత్తులు అధిక అమ్మకాలతో 64.15 శాతం వాటా కలిగి ఉన్నట్టు ఐడీఎస్ఏ వార్షిక నివేదిక తెలిపింది. కాస్మెటిక్స్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల అమ్మకాల వాటా 23.75 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. ఈ రెండు విభాగాల వాటా 2023–24 మొత్తం అమ్మకాల్లో 87.9 శాతంగా ఉన్నట్టు తెలిపింది. ప్రాంతాల వారీగా పరిశీలిస్తే డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ అమ్మకాల్లో ఉత్తరాది 29.8 శాతం వాటాతో ముఖ్య పాత్ర పోషిస్తోంది. తూర్పు భారత్ నుంచి 24.2 శాతం అమ్మకాలు కొనసాగగా, ఇందులో పశ్చిమబెంగాల్ నుంచే 11.3 శాతం సమకూరింది. పశ్చిమ భారత్లో అమ్మకాలు 22.4 శాతంగా ఉంటే, దక్షిణాదిన 15.3 శాతం అమ్మకాలు కొనసాగాయి. ఎనిమిది రాష్ట్రాలతో కూడిన ఈశాన్య భారత్లో అమ్మకాలు 8.3 శాతంగా ఉన్నాయి. మహారాష్ట్ర ప్రధాన మార్కెట్.. 13 శాతం వాటాతో డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ అమ్మకాల్లో (2023–24) మహారాష్ట్ర అతిపెద్ద మార్కెట్గా నిలిచింది. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, యూపీ, బీహార్, కర్ణాటక, ఒడిశా, హర్యానా, ఢిల్లీ, అసోం, గుజరాత్ టాప్ 10 రాష్ట్రాలుగా ఉన్నాయి. పరిశ్రమ మొత్తం ఆదాయంలో 70 శాతం ఈ రాష్ట్రాల నుంచే వచి్చంది. 2023 మార్చి నాటికి మొత్తం డైరెక్ట్ సెల్లర్స్ 88.06 లక్షలుగా ఉంటే, 2024 మార్చి నాటికి 86.2 లక్షలకు పెరిగారు. చురుగ్గా కార్యకలాపాలు నిర్వహించే ప్రత్యక్ష విక్రేతల్లో 56 శాతం మంది పురుషులు కాగా, 44 శాతం మహిళలు ఉన్నారు. మొత్తం విక్రేతల్లో 73.2 శాతం 25–54 ఏళ్ల వయసులోని వారు కావడం గమనార్హం. అంతేకాదు విక్రేతల్లో అత్యధికులకు ఉన్నత విద్యార్హతలున్నాయి. 52 శాతం మంది గ్రాడ్యుయేషన్, 26 శాతం మందికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారే. ప్రత్యక్ష విక్రయాల్లో ఇళ్ల నుంచి చేసేవి అధికంగా ఉన్నాయి. డిజిటల్ ఛానళ్ల ద్వారా అమ్మకాలు సైతం వేగంగా పెరుగుతున్నాయి. 17 శాతం విక్రేతలు ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ తదితర వాటి సాయంతో అమ్మకాలు పెంచుకుంటుంటే, 15 శాతం మంది వాట్సాప్, మెస్సేజింగ్ యాప్స్ సాయం తీసుకుంటున్నారు.

హైరింగ్ ప్రణాళికల్లో కంపెనీలు...
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున కంపెనీలు నియామకాలు చేపట్టే యోచనలో ఉన్నాయి. 45 శాతం సంస్థలు కొత్తగా పర్మనెంట్ ఉద్యోగులను తీసుకునే ప్రణాళికల్లో ఉన్నాయి. వర్క్ఫోర్స్ సొల్యూషన్స్, హెచ్ఆర్ సేవల సంస్థ జీనియస్ కన్సల్టెంట్స్ నిర్వహించిన ’హైరింగ్, కాంపన్సేషన్, అట్రిషన్ మేనేజ్మెంట్ అవుట్లుక్ సర్వే 2025–26’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వివిధ పరిశ్రమలవ్యాప్తంగా 1,520 మంది సీఎక్స్వోలు, సీనియర్ అధికారులు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ నివేదిక ప్రకారం 45 శాతం సంస్థలు కొత్తగా పర్మనెంట్ ఉద్యోగులను తీసుకువాలని భావిస్తుండగా 13 శాతం కంపెనీలు ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు లేక ఖాళీ కాబోతున్న పోస్టులను భర్తీ చేసుకునే ప్రణాళికల్లో ఉన్నాయి. కానీ మరికొన్ని సంస్థలు హైరింగ్ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హైరింగ్ ప్రణాళికలేమీ లేవని 16 శాతం సంస్థలు తెలిపాయి. తాత్కాలిక స్టాఫింగ్ వైపు మొగ్గు.. తాత్కాలిక కొలువులకు కూడా డిమాండ్ పెరుగుతోంది. 26 శాతం కంపెనీలు టెంపొరరీ, కాంట్రాక్ట్ లేదా ప్రాజెక్ట్ ఆధారిత పనుల కోసం ఉద్యోగులను తీసుకునే యోచనలో ఉన్నాయి. గిగ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అధారిత ఉద్యోగులు, అడ్వైజరీ సేవలందించే వారిని హైరింగ్ చేసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. పర్మనెంట్ ఉద్యోగులకు బదులుగా తాత్కాలిక సిబ్బందిని తీసుకునే ధోరణి పెరుగుతోందనడానికి ఇది నిదర్శనమని సర్వే పేర్కొంది. సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 37 శాతం కంపెనీలు మిడ్–లెవెల్ నిపుణులను నియమించుకోనున్నట్లు తెలిపాయి. మరోవైపు, 19 శాతం కంపెనీలు ఎంట్రీ లెవెల్ ఉద్యోగులను తీసుకోవాలని భావిస్తుండగా, 18 శాతం సంస్థలు సీనియర్ లీడర్షిప్ స్థానాల్లోకి సిబ్బందిని నియమించుకునే యోచనలో ఉన్నాయి. ‘ఆర్థిక అనిశ్చితులను దాటుకుంటూ కంపెనీలు ముందుకెళ్తున్న క్రమంలో ప్రతిభావంతులైన నిపుణులకు డిమాండ్ నెలకొంది. మిడ్–సీనియర్ ప్రొఫెషనల్స్కి భారీగా డిమాండ్ ఉండటంతో అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) రిసు్కలను అధిగమించి, సిబ్బందిని అట్టే పెట్టుకోవడంపై కంపెనీలు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. 2025–26లో కంపెనీలు సమర్ధవంతమైన విధంగా హైరింగ్ ప్రణాళికలను వేసుకునేందుకు ఈ విశేషాలు ఉపయోగపడతాయి‘ అని జీనియస్ కన్సల్టెంట్స్ చైర్మన్ ఆర్పీ యాదవ్ చెప్పారు. మరిన్ని విశేషాలు.. → 53 శాతం కంపెనీలు హైరింగ్ వృద్ధి ఒక మోస్తరుగా 5–10 శాతం స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నాయి. మరోవైపు 33 శాతం కంపెనీలు 10–15 శాతం అధికంగా నియామకాలు చేపట్టాలని భావిస్తున్నాయి. → పరిశ్రమలవారీగా చూస్తే రిటైల్, క్యూ–కామర్స్లో అత్యధికంగా 21 శాతం కంపెనీలు నియామకాలు చేపట్టనున్నాయి. లాజిస్టిక్స్, వేర్హౌసింగ్ విభాగాల్లోనూ సుమారు 9 శాతం సంస్థలు సిబ్బందిని తీసుకోనున్నాయి. → ఆటోమొబైల్స్, ఎలక్ట్రిక్ వాహనాల విభాగాల్లో రిక్రూట్మెంట్ అధికంగా ఉంటుందని 15 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. రెన్యూవబుల్స్, ఎనర్జీ, ఇంజినీరింగ్ ప్రాజెక్టుల విభాగాల్లో 11 శాతం కంపెనీలు రిక్రూట్మెంట్ చేపట్టనున్నాయి. → ఐటీ సర్వీసులు, టెలికం, టెక్నాలజీ విభాగాల్లో 13 శాతం, తయారీ, ఇంజినీరింగ్లో 11 శాతం, ఇన్ఫ్రా, రవాణా, రియల్ ఎస్టేట్లో 10 శాతం, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా)లో 9 శాతం సంస్థలు హైరింగ్ యోచనలో ఉన్నాయి. → ఇక, ఎఫ్ఎంసీజీ, హెల్త్కేర్, హాస్పిటాలిటీ, మీడియా..ఎంటర్టైన్మెంట్, విద్య తదితర రంగాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం హైరింగ్ ఒక మోస్తరుగానే ఉండవచ్చని అంచనా.

నేపాల్కి ఒకేఒక్కడు.. ఈ బిలియనీర్
సూపర్ మార్కెట్లు, డిపార్ట్మెంటల్ స్టోర్స్లో ఇన్స్టంట్ ఫుడ్ సెక్షన్లో ప్రసిద్ధ వాయ్ వాయ్ నూడుల్స్ (Wai Wai noodles) ప్యాక్లను చూస్తుంటాం. అయితే ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ నూడుల్స్ వెనుక ఎవరున్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆయనే బినోద్ కుమార్ చౌదరి (Binod Kumar Chaudhary). నేపాల్కు చెందిన ఈయన "నూడుల్స్ కింగ్" గా ప్రసిద్ధి చెందారు. బినోద్ కుమార్ చౌదరి ఎవరు.. భారత్తో ఆయనకున్న సంబంధం ఏంటి.. ఆసక్తికరమైన ఈ బిజినెస్మ్యాన్ కథేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.రాజస్థాన్ నుంచి నేపాల్కు..70వ ఏట అడుగుపెడుతున్న బినోద్ కుమార్ చౌదరి 1955 ఏప్రిల్ 14న నేపాల్ రాజధాని ఖాట్మండులో మార్వాడీ కుటుంబంలో జన్మించారు. ఆయన తాత భూరమల్ దాస్ చౌదరి భారత్లోని రాజస్థాన్ నుండి నేపాల్ కు వలస వచ్చి వస్త్ర వ్యాపారం ప్రారంభించారు. బినోద్ కుమార్ చౌదరి తండ్రి లుంకరణ్ దాస్ చౌదరి ఆ వ్యాపారాన్ని దేశంలో మొట్టమొదటి డిపార్ట్మెంటల్ స్టోర్గా విస్తరించారు. బినోద్ కుమార్ చౌదరికి సారిక చౌదరితో వివాహం కాగా వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరు కూడా వివిధ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు.వ్యాపారాలుడజన్ల కొద్దీ దేశాల్లో 160కి పైగా కంపెనీలను కలిగి ఉన్న బహుళజాతి సంస్థ చౌదరి గ్రూప్ (సీజీ కార్ప్ గ్లోబల్)కు చౌదరి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఈ కంపెనీ పేరుతో 120కి పైగా బ్రాండ్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 15,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఈ గ్రూప్నకు చెందిన వాయ్ వాయ్ బ్రాండ్ నూడుల్స్ నేపాల్, భారత్లలో బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతవుతున్నాయి. బినోద్ కుమార్ చౌదరికి రియల్ ఎస్టేట్, విద్య, ఎలక్ట్రానిక్స్, ఎనర్జీ, టెలికాం, బయోటెక్నాలజీ రంగాల్లో కూడా వ్యాపారాలు ఉన్నాయి.రాజకీయాలు, దాతృత్వంబినోద్ కుమార్ చౌదరి నేపాలీ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. దేశంలోని పలువురు ప్రముఖ రాజకీయ ప్రముఖులతో ఆయనకు అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. అలాగే ఆయన దాతృత్వ కార్యక్రమాలు కూడా చురుగ్గా నిర్వహిస్తుంటారు. 1995లో చౌదరి ఫౌండేషన్ను స్థాపించిన ఆయన 2015లో నేపాల్ లో భూకంపం సంభవించినప్పుడు 10,000 ఇళ్లు, 100 పాఠశాలల పునర్నిర్మాణానికి రూ.20 కోట్లకు పైగా విరాళం ఇచ్చారు. లక్షలాది ఆహార పొట్లాలు, ఇతర సామగ్రిని అందించారు.ఏకైక నేపాలీ బిలియనీర్పలు నివేదికల ప్రకారం.. బినోద్ కుమార్ చౌదరి నెట్వర్త్ 2 బిలియన్ డాలర్లు (రూ .17,200 కోట్లకు పైగా). నేపాల్లో మొదటి, ఏకైక బిలియర్ ఈయనే కావడం విశేషం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బినోద్ కుమార్ చౌదరి కఠినమైన శాఖాహారి. దీంతో ఆయన ప్రసిద్ధి చెందిన తమ వాయ్ వాయ్ బ్రాండ్ చికెన్ నూడుల్స్ ఎప్పుడూ రుచి చూడలేదు.

తెలంగాణ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్స్
హైదరాబాద్: ఎలక్ట్రిక్ మోటర్సైకిల్స్ తయారీ సంస్థ ఒబెన్ ఎలక్ట్రిక్ తెలంగాణ మార్కెట్లోకి ప్రవేశించింది. హైదరాబాద్లో రెండు, వరంగల్లో ఒకటి చొప్పున మొత్తం 3 షోరూమ్లను ప్రారంభించింది. వీటిలో సర్వీస్ సెంటర్లు కూడా ఉంటాయి. ఒక్కో కొత్త షోరూమ్లో రోర్ ఈజెడ్ వాహనాన్ని కొనుగోలు చేసిన తొలి 30 కస్టమర్లకు కాంప్లిమెంటరీగా బంగారు నాణెం అందిస్తున్నట్లు సీఈవో మధుమిత అగ్రవాల్ తెలిపారు.రోర్ ఈజెడ్ వాహనం ధర రూ. 89,999గా ఉంటుంది. ఒకసారి చార్జ్ చేస్తే 175 కి.మీ. రేంజి ఇస్తుంది. 2026 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 50 నగరాల్లో 100 పైచిలుకు షోరూమ్లు, సర్వీస్ సెంటర్లను ప్రారంభించనున్నట్లు వివరించారు. ప్రస్తుతం 35 షోరూమ్లు ఉన్నాయి. ఒబెన్ ఎలక్ట్రిక్ దేశవ్యాప్తంగా 15 కొత్త షోరూమ్లను ప్రారంభించగా పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొత్తగా అడుగు పెట్టింది. దీనితో పాటు ఇప్పటికే ఉన్న మార్కెట్లలో తన పరిధిని బలోపేతం చేసుకుంది. ఢిల్లీ ఎన్సీఆర్, మహారాష్ట్ర, కేరళ, ఉత్తర ప్రదేశ్లలో కొత్త అవుట్లెట్లను ప్రారంభించింది.
ఫ్యామిలీ

ఎక్స్ట్రీమ్ టాలెంట్ : ఇతను చాలా రిచ్ గురూ!
జేమ్స్ స్టీఫెన్ జిమ్మీ డొనాల్డ్సన్ అంటే ఎవరికీ తెలియదు. ‘మిస్టర్ బీస్ట్’ (MrBeast) అనండి... వెంటనే గుర్తుపట్టేస్తారు. అతను ప్రఖ్యాత యూట్యూబర్. ప్రపంచవ్యాప్తంగా 383 మిలియన్ల సబ్స్క్రైబర్లను కలిగిన యూట్యూబ్ ఛానెల్ ‘MrBeast’ ని అతనే నిర్వహిస్తున్నాడు. యూట్యూబ్ ద్వారా అత్యధిక ఆదాయం పొందుతున్న బీస్ట్ ప్రపంచంలోని అనేకమంది ధనవంతులను మించిపోతున్నాడు. అతని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా?మిస్టర్ బీస్ట్ పుట్టింది 1998 మే 7న. అమెరికాలోని కాన్సస్లో పుట్టి, ఉత్తర కరోలినాలోని గ్రీస్విల్లేలో పెరిగారు. 2012 నుంచి యూట్యూబ్లో వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. ఐదేళ్ల తర్వాత, 2017లో అతను చేసిన ‘కౌంటింగ్ టు 1,00,000’ వీడియో కొన్ని రోజుల్లోనే 10 వేల దాకా వ్యూస్ సాధించి, అతని ఛానెల్కి ప్రాచుర్యం తీసుకొచ్చింది. అలా మెల్లగా అతని వీడియోలకు వీక్షకులు పెరిగారు. విచిత్రమైన విన్యాసాలు, కొత్త కొత్త ప్రయోగాలు వంటివి మిస్టర్ బీస్ట్ ఛానెల్లో ప్రధానంగా కనిపిస్తాయి. ఫోర్బ్ నివేదిక ప్రకారం, మిస్టర్ బీస్ట్ 2023–2024లో సంపాదించిన మొత్తం 85 మిలియన్ డాలర్లు(సుమారు రూ.732 కోట్లు). ఇంత ఆదాయం కలిగిన మరొక యూట్యూబర్ ప్రపంచంలో మరెవరూ లేరు. యూట్యూబ్ వీడియోల ద్వారా అతను నెలకు సుమారు 50 మిలియన్ డాలర్లు (సుమారు రూ.430 కోట్లు) సంపాదిస్తున్నాడని అంచనా. ఛానెల్ ద్వారా వచ్చిన ఆదాయంతో ఆయన మరికొన్ని వ్యాపారాలను ప్రారంభించారు. వాటి ద్వారా రూ.కోట్లలో ఆదాయం వస్తోంది. అన్నీ కలిపి అతణ్ని అత్యంత ధనవంతుణ్ని చేశాయి. ఇదీ చదవండి: రోజులో 7 గంటలు దానికే : శాపమా, వరమా?!

రోజులో 7 గంటలు దానికే : శాపమా, వరమా?!
ఆధునిక సాంకేతికత కారణంగా నగర జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఉద్యోగాలు, వ్యాపారాలు తదితర నిత్య క్రియలతో పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకూ టెక్నికల్ లైఫ్గా మారిపోయింది. ప్రధానంగా నగరవాసులు తమ జీవితంలో గ్యాడ్జెట్లను ఒక భాగంగా మార్చుకున్నారని.. ఉదయాన్నే నిద్ర లేపే అలారమ్ మొదలు రాత్రి నిద్రించే ముందు గంటల తరబడి మొబైల్ స్క్రీన్ చూడటం వరకూ ప్రతి క్షణం గ్యాడ్జెట్ల మధ్యనే గడుస్తోందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇవి మనిషి ఆరోగ్యం, ఫిట్నెస్, కమ్యూనికేషన్, విజ్ఞానం, వినోదం మొదలైన అనేక అంశాల్లో ప్రభావం చూపుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో దైనందిన జీవితంలో విచ్చలవిడి వినియోగం విజ్ఞానం, వినియోగమూ ఎక్కువే..! గ్యాడ్జెట్స్ మన సౌలభ్యం కోసం ఆహ్వానించినవే ఐనప్పటికీ.. వీటి వినియోగంలో మంచి- చెడూ ప్రయోజనా లున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ గ్యాడ్జెట్స్పై ఎంత వరకూ ఆధారపడాలి, ఎంత వరకూ వినియోగించుకోవాలి, ఇవి చేస్తున్న మేలేంటి, కలిగిస్తున్న ముప్పు ఎంత అనేది విశ్లేíÙంచుకోవడం అవసరం. ముఖ్యంగా చిన్నారులు, యువతపై ఈ గ్యాడ్జెట్ల ప్రభావాన్ని నియంత్రించాల్సిన అవసరముందని ఎన్సీఈఆర్టీ వంటి సంస్థల అధ్యయనాలు చెబుతున్నాయి. స్మార్ట్ లైఫ్.. బ్యాడ్ రిజల్ట్.. ఆరోగ్య పరంగా ప్రస్తుతం స్మార్ట్ వాచ్లు, ఫిట్నెస్ బ్యాండ్లు వాడకం బాగా పెరిగింది. ముఖ్యంగా యాపిల్ వాచ్, ఫిట్బిట్, శామ్సంగ్ గెలాక్సీ వాచ్ వంటి డివైజ్లు మన హార్ట్ రేట్, నిద్ర, వాకింగ్ స్టెప్స్, క్యాలరీ బర్న్ వంటి వివరాలు మానిటర్ చేస్తాయి. ఇవి ఆరోగ్యంపై అవగాహన పెంచడంలో ఎంతో దోహదపడుతున్నా. అదే సమయంలో మితిమీరిన స్క్రీన్ టైం వల్ల మానసిక ఒత్తిడి, నిద్రలేమి, కళ్ల సమస్యలు వంటి దుష్పరిణామాలూ ఎదురవుతున్నాయి. ఫిట్నెస్ఫిట్నెస్ పరంగా షాఓమీ, ఎమ్ఐ బ్రాండ్, హానర్ బ్యాండ్లాంటివి మన వర్కౌట్ యాక్టివిటీలను ట్రాక్ చేస్తాయి. యూట్యూబ్, ఫిట్నెస్ యాప్ల ద్వారా ఇంట్లోనే వ్యాయామం చేయవచ్చు. దీని కోసం ఆన్లైన్ వేదికగా లెక్కకు మించిన వీడియోలు, సమాచారం అందుబాటులో ఉంది. కానీ ఈ గ్యాడ్జెట్లపై ఆధారపడుతూ నిజమైన ఫిజికల్ యాక్టివిటీకి, వ్యాయామానికి సమయం కేటాయించలేకపోతే ఫలితం కనబడదని కొందరు ఫిట్నెస్ ట్రైనర్ల సూచన. గ్యాడ్జెట్లతో 7 గంటలు.. స్మార్ట్ ఫోన్ సహాయంతో ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల్లో రోజంతా మునిగిపోయే స్థితికి చేరుకున్నారు. ఇది ఒంటరితనాన్ని, ఆత్మవిమర్శను పెంచే పెను ప్రమాదంగా మారింది. సోషల్ యాప్స్ సమాజానికీ, మనుషులకూ మధ్య సంధానకర్తగా మారాయి. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా క్షణాల్లో చేరిపోతుండటం సాంకేతికత మాయాజాలమే. సామాజిక అభివృద్ధిలో ఇదొక కీలక మలుపు. కానీ ఈ వేదికగా లభ్యమయ్యే సమాచారంలో వాస్తవికత, నిజాలను తేల్చిచెప్పే అవకాశం అంతగా లేకపోవడంతో మంచి-చెడూ రెండు అంశాలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. 2023లో ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎమ్ఏఐ), నిల్సెన్ సంయుక్తంగా నిర్వహించిన రిపోర్ట్ ప్రకారం.. భారతదేశంలో సగటు పౌరుడు రోజుకు సుమారు 7 గంటల పాటు డిజిటల్ గ్యాడ్జెట్లపై గడుపుతున్నాడు. ఇందులో 2.5 గంటలు సోషల్ మీడియా కోసం మాత్రమే వినియోగిస్తున్నాడని వెల్లడించారు. డిజిటల్ డిపెండెన్సీ.. వినోదం, గేమింగ్ రంగాల్లో ఈ గ్యాడ్జెట్లు మరో కొత్త యుగానికి నాంది పలికాయి. ఆక్యులస్ క్వెస్ట్, ప్లే స్టేషన్, వీఆర్ వంటి హెడ్సెట్లు వాస్తవిక అనుభూతిని అందిస్తూ, వినోదాన్ని సహజ అనుభూతిని పంచుతున్నాయి. ప్రస్తుత 5డీ టెక్నాలజీ గేమ్స్ అద్భుత వినోదంతో.. పాటు సమయాన్ని వృథా చేస్తోంది. భారతీయ పరిశోధన సంస్థ ఎయిమ్స్, ఐసీఎమ్ఆర్ నిర్వహించిన అధ్యయనంలో సుమారు 3000 మంది అత్యధిక స్క్రీన్ టైం వల్ల నిద్ర, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని తేల్చింది. మరీ ముఖ్యంగా యువతలో డిజిటల్ డిపెండెన్సీ పెరుగుతోందని పరిశోధకులు వెల్లడించాయి. ఆనందం.. ఆధిపత్యం కాకూడదు.. మొత్తానికి గ్యాడ్జెట్లు మన జీవితంలో అసాధారణ సౌలభ్యాలను, అనుకూలతలను తీసుచ్చినా, అవి మనిషిపై ఆధిపత్యం చెలాయించకుండా ఉండేందుకు మనమే జాగ్రత్తగా ఉండాలి. వాటిని సంతులితంగా వాడితే అవి వరంగా మారతాయి. లేకపోతే అవే మన స్వేచ్ఛను హరిస్తాయనడంతో ఎలాంటి సందేహం లేదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ చేపట్టిన పరిశోధనలో ఎక్కువగా మొబైల్ వాడకం వల్ల యువతలో ఆందోళన, ఒత్తిడి, ఒంటరితనం పెరిగినట్లు తేలింది. ఈ అధ్యయనంలో ‘నోమోఫోబియా’ (నో మొబైల్ ఫోబియా) అనే పరిస్థితి గురించి కూడా ప్రస్తావించారు.

Menopause Awareness: ఇల్లు అండగా ఉండాలి!
ఏడాది వరకు నెలసరి రాకపోతే అప్పుడు దాన్నిమెనోపాజ్ గా పరిగణిస్తారు. సాధారణంగా 45 నుంచి 52 ఏళ్ల మధ్య మెనోపాజ్ వస్తుంది. తొలి లక్షణంగా నెలసరి క్రమం తప్పుతుంది. అంటే రెండు నెలలకు ఒకసారి లేదా నాలుగు నెలలకు ఒకసారి వస్తూంటుంది. తర్వాత ఒంట్లో వేడి ఆవిర్లు, నిద్రలేమి, గుండె దడ, అలజడి, ఆందోళన, మూడ్ స్వింగ్స్, ఏకాగ్రత లోపించడం, జీవనాసక్తి తగ్గడం, బరువు పెరగడం, ఒంటరితనం వంటివీ ఉంటాయి. మూడు, నాలుగేళ్ల వరకు కొనసాగే ఈ దశను ప్రీమెమెనోపాజల్ స్టేజ్ అంటారు. అయితే ఆ ఫేజ్లో ఉన్న అందరికీ ఆ లక్షణాలు ఉండకపోవచ్చు. కొందరు ఏ లక్షణమూ లేక సాఫీగా ఆ దశను దాటేయవచ్చు. లక్షణాలు ఉంటే జీవనశైలిలో మార్పులు, యోగా, ఎక్సర్సైజ్తో మేనేజ్ చేయవచ్చు. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్ను సంప్రదించాలి. ముఖ్యమైన విషయం.. మెనోపాజ్ అని నిర్ధారణ అయ్యాక స్పాటింగ్ కానీ, బ్లీడింగ్ కానీ కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే గైనకాలజిస్ట్ను కలవాలి. మెనోపాజ్ తర్వాత.. స్త్రీ మేనికి మెరుపు, నిగారింపునిచ్చేవి ఫిమేల్ హార్మోన్సే. మెనోపాజ్ తర్వాత వాటి ఉత్పత్తి లేక గ్లో కూడా తగ్గిపోతుంది. చర్మం సాగి, ముడతలు పడుతుంటుంది. వెజైనా పొడిబారి పోతుంది. లైంగికాసక్తి తగ్గిపోతుంది. బ్లోటింగ్ ఉంటుంది. ఎముకల సాంద్రత తగ్గుతుంది. గుండె సంబంధిత సమస్యలూ మొదలయ్యే చాన్స్ ఉంటుంది. అయితే వీటన్నిటికీ భయ పడాల్సిన పనిలేదు. క్రమం తప్పకుండా వాకింగ్, వ్యాయామం చేయాలి. డాక్టర్ సూచనల మేరకు కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాలి. వెజైనల్ డ్రైనెస్ సమస్య కోసం ప్లాంట్ బేస్డ్ ఈస్ట్రోజన్ మెడిసిన్స్ తీసుకోవచ్చు లేదా జెల్లీని ఉపయోగించొచ్చు. ఆహారంలోనూ జాగ్రత్తలు పాటించాలి. మసాలా, వేపుళ్లకు దూరంగా ఉండాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారపదార్థాలను తీసుకుంటే మంచిది. హెల్త్ చెకప్స్ మరచిపోవద్దు. మామోగ్రఫీ, పాప్స్మియర్ పరీక్షలు తప్పనిసరి. ఇంకో విషయం.. సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ వచ్చింది. కాబట్టి.. పెద్దమనిషి అయిన అమ్మాయిల నుంచి 45 ఏళ్ల మహిళల వరకు ఈ వాక్సిన్ను తీసుకోవచ్చు. లైంగిక జీవితం మొదలుకాకముందే ఈ వాక్సిన్ తీసుకుంటే మంచిది. మెనోపాజ్ మూడు రకాలుగా వస్తుంది. ఒకటి.. సహజంగా వయసుతో వచ్చేది. రెండు.. వయసుతో సంబంధం లేకుండా జీవనశైలిలో మార్పులు, పొల్యుషన్, పెస్టిసైడ్స్ ఫుడ్ లాంటి వాటితో 40 ఏళ్లలోపే వచ్చే అర్లీ మెనోపాజ్. మూడవది.. శస్త్రచికిత్స ద్వారా గర్భసంచి, అండాశయాలను తొలగించడం వల్ల, క్యాన్సర్కు వాడే కొన్నిరకాల మందులు, రేడియేషన్ వల్ల కృత్రిమంగా వచ్చే మెనోపాజ్ మెనోపాజ్ లక్షణాల్లో ఒకటైన హాట్ ఫ్లషస్ను యూరప్, ఉత్తర అమెరికా దేశాలలో 60–90 శాతం మంది స్త్రీలు ఎదుర్కొంటున్నారని, వారితో పోలిస్తే ఆసియా ఖండంలో 10–20 శాతం మంది మహిళలు మాత్రమే ఈ సమస్యతో సతమతమవుతున్నారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అందుకు ఆసియా ఖండంలోని ఆహారపు అలవాట్లు అంటే వారు తీసుకునే ఆహారంలోని ప్లాంట్ బేస్డ్ ఈస్ట్రోజన్స్ కారణం కావచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఆ దేశాల్లో మెనోపాజ్ సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నవారు కౌన్సెలింగ్, జీవనశైలిలో మార్పులతో ఆ దశను సమర్థంగా ఎదుర్కొంటున్నారట. ధూమపానం, ΄ పొగాకు, ఊబకాయం, స్పైసీ ఫుడ్, పొగలుగక్కే ఆహారం తినడం, కాఫీ, టీలు ఎక్కువగా తాగడం, మద్యం, థైరాయిడ్ గ్రంథి లోపాలు, డయాబెటిస్, మానసిక ఒత్తిడి వంటివన్నీ హాట్ఫ్లషస్కి ప్రేరకాలు (ట్రిగర్) గా పనిచేస్తాయి. అయితే జీవన శైలిలో మార్పులు, వైద్య సలహా సూచనలతో ఆ సమస్యను అధిగమించవచ్చు. అంతేకాదు నువ్వులు, గడ్డి నువ్వులు, అవిసె గింజలు, సోయా బీన్స్, ముల్లంగి, నట్స్, క్యాబేజీ, కాలిఫ్లవర్ వంటి వాటితోనూ మెనోపాజ్ సమస్యలను తగ్గించుకోవచ్చు.మెనోపాజ్ అనేది సవాళ్లతో కూడిన మార్పు!‘శాస్త్రీయ అవగాహన ఉంటే సమర్థవంతంగా ఆ సవాళ్లను ఎదుర్కోవచ్చు.. ఆ మార్పును ఆస్వాదించొచ్చు’ అని చెబుతున్నారు హైదరాబాద్కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్లు డాక్టర్ కామేశ్వరి, డాక్టర్ ఆలియా రెడ్డి!శిల్పా శెట్టి మొదలు ట్వింకిల్ ఖన్నా, శ్వేతా బచ్చన్ (జయ బాధురి, అమితాబ్ బచ్చన్ల కూతురు), టెలివిజన్ హోస్ట్ మినీ మాథూర్ లాంటి వాళ్లందరూ హాట్ ఫ్లషస్, మూడ్ స్వింగ్స్, బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కొన్నవారే. ఆ లక్షణాల గురించి అవగాహనలేక చాలా ఇబ్బందులు పడ్డారట. వాళ్ల మూడ్ స్వింగ్స్ని చూసి కుటుంబ సభ్యులు నివ్వెర΄ోయేవారని, తామెందుకలా ప్రవర్తిస్తున్నామో అర్థంకాక .. ఆ పరిస్థితిని ఎలా మేనేజ్ చేయాలో తెలియక ఆందోళన చెందారని చెప్పారు. ఆ బాలీవుడ్ సెలెబ్స్ అందరూ ఇప్పుడు మెనోపాజ్ అవేర్నెస్ ప్రచారకర్తలుగా మారారు. మెనోపాజ్ దశ, లక్షణాల మీద విస్తృతంగా చర్చిస్తూ మహిళల్లో అవగాహన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. శాస్త్రీయ అవగాహన పెంచుకుంటూ.. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక్కటే.. మెనోపాజ్ అన్నది స్త్రీ జీవితంలో ఒక సహజమైన ప్రక్రియ. దాన్నో జబ్బుగా పరిగణించకుండా శాస్త్రీయ అవగాహనను పెంచుకుంటూ కుటుంబం ఆమెకు అండగా నిలబడాలి. జీవిత భాగస్వామి ఆమెకు ఓ ఫ్రెండ్గా మారాలి. పిల్లలు అమ్మ మానసిక పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఆమెకు అనుకూలంగా మెలగాలి. ఇలాంటి వాతావరణం ఉంటే.. అది ఆమెకు హార్మోన్స్ కన్నా ప్రభావంతంగా పనిచేస్తుంది. మెనోపాజ్ మీద సమాజంలోనూ అవగాహన పెరగాలంటే ఆరోగ్యశిబిరాల్లో దాని మీద చర్చించాలి. మీడియా కథనాల ద్వారా ప్రచారం జరగాలి. అంతేకాదు మహిళ ఆరోగ్యాన్ని పాఠ్యాంశాల్లోనూ భాగం చేయాలి. – శిరీష చల్లపల్లి ఉమనోపాజ్ అర్థం చేసుకుందాం: నిర్వహణ సరస్వతి రమ

నేడు స్ట్రీట్ చిల్డ్రన్ డే: వీధి నుంచి ఇంటికి
మన ఉరుకుల పరుగుల జీవనంలో ఒక్క కుదుపుతో ఆపే రెడ్ సిగ్నల్లా బాల్యం కూడలిలో భిక్షం ఎత్తుతూ కనిపిస్తుంది. జాతరలా తోసుకువెళుతున్న సమూహంలో నిలువెల్లా రంగు పూసుకుని చేతి కర్రతో గాంధీ తాతలా బాల్యం నిగ్గదీస్తుంది. చిన్న బొజ్జను నింపుకోలేని చిట్టి చేతులతో జీవితంతో పోరాడలేక దొంగ అవుతుంది, దోపిడీకి గురవుతుంది. బాలనేరస్తులుగా ముద్ర వేయించుకొని భవిష్యత్తును బందిఖానాలా మార్చుకుంటుంది. దేశవ్యాప్తంగా నాలుగు లక్షల మంది వీధి బాలలు ఉన్నట్టు యునిసెఫ్ అంచనా. హైదరాబాద్లో 28,000కు పైగా వీధి బాలలు ఉన్నట్టు అంచనా. పాట్నా పట్టణంలో వీధి బాలల సంఖ్య ఎక్కువ.వీధి బాల్యం ఎందుకు పెరుగుతోందంటే..గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాలకు బతుకుదెరువు కోసం వలస వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. పనులు దొరక్క, నిలువనీడ లేక, కనీస అవసరాలు తీరక తల్లిదండ్రులు గొడవలు పడటం, విడిపోవడం, కుటుంబాలు విచ్ఛిన్నమవడంతో దిక్కుతోచని స్థితిలో పిల్లలు రోడ్ల మీదకు వస్తున్నారు. మన దేశంలో గుర్తించినవే కాదు గుర్తింపునకు నోచుకోని స్లమ్స్ చాలా ఉన్నాయి. వీటిల్లో నివాసం, ఆహార భద్రత లేమి, చదువు నూ దూరం చేస్తుంది. ఇప్పటికే వీధి బాలల్లో 82 శాతం మంది చదువును ఆపేశారని నివేదికలు చూపుతున్నాయి. వీరంతా జీవనోపాధి కోసం చిత్తు కాగితాలు ఏరుకోవడం, కూలి పనులు, భిక్షాటన, షూ పాలిష్, పూలు అమ్మడం.. వంటి వాటిని ఎంచుకుంటుంటే కొంతమంది దొంగతనం, చైన్ స్నాచింగ్, పిక్ పాకెటింగ్, మాదక ద్రవ్యాల వ్యాపారం.. మొదలైన చట్ట వ్యతిరేక పనుల్లో పాల్గొంటున్నారు. హెచ్ఐవి/ఎయిడ్స్ బారిన పడటం, ఆడపిల్లలు చిన్నవయసులోనే గర్భం దాల్చడం, గర్భస్రావాలు.. వంటి సమస్యలనూ ఎదుర్కొంటున్నారు. సమాజంలో వీధి బాలల పట్ల ఉన్న వ్యతిరేకతను దూరం చేయడానికి అవగాహన శిబిరాలను ఏర్పాటు చేయడం, మహిళలకు, యువతకు జీవన నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడం తప్పనిసరిగా చేయాల్సిన పనులుగా వివరించారు. ఇందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సమాజంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలి. ఆత్మీయ ఆహ్వానంవీధి బాలల కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల్లో రెయిన్ బో హోమ్స్ ఒకటి. ఈ హోమ్స్ హైదరాబాద్లో 14 ఉంటే, దేశ వ్యాప్తంగా 50 వరకు ఉన్నాయి. ఒక్కో హోమ్లో 70 నుంచి 80 మంది పిల్లలు సంరక్షణను పొందుతున్నారు. రోడ్డు మీద నుంచి హోమ్లోకి వచ్చే పిల్లలకు సంరక్షణ పొందుతున్న పిల్లలు ఆత్మీయ ఆహ్వానం పలుకుతారు. ‘తమ కుటుంబంలో చేరిన కొత్తవారిని తోబుట్టువుల్లా దగ్గరకు తీసుకుంటారు’ అని తెలిపారు నిర్వాహకులు.మూలాన్ని సమీక్షించాలి...సుమతి చదువుకోలేదు. గ్రామీణ నేపథ్యం. తన ఈడు వయసున్న అతన్ని ప్రేమించి, కుటుంబాన్ని వదిలేసి అతనితో పాటు పట్టణం వచ్చేసింది. కొంతకాలం బాగానే ఉన్నా చెడు అలవాట్లకు బానిసైన అతను ఆమెను, పుట్టిన బిడ్డనూ వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. దీంతో సుమతిది మానసిక కుంగుబాటు, ఎలా బతకాలో తెలియని నిస్సహాయ స్థితి. బిడ్డను కాపాడుకోవడానికి ఎక్కడెక్కడో తిరిగి, సెక్స్వర్కర్గా మారింది. ‘ఇలాంటి వారిని గుర్తించి తల్లికి, బిడ్డకు సంరక్షణను అందించే బాధ్యతను తీసుకున్నామ’ని తెలిపారు రెయిన్ బో హోమ్స్ డైరెక్టర్ అనూరాధ. ఇలాంటి వేదనాభరితమైన జీవన కథనాలెన్నో సమాజంలో ఉన్నాయని, స్ట్రీట్ చిల్డ్రన్స్ సంరక్షణ విధానాల గురించి అనూరాధ వివరించారు.చిన్న భరోసా!దేశవ్యాప్తంగా వివిధ సమస్యలను ఎదుర్కొంటున్న 18 లక్షల మంది పిల్లలను గుర్తించాం. 6 నుంచి 18 ఏళ్ల వరకు ఉన్న వీధి బాలలను సంరక్షించి ఆ తర్వాత వదిలేయకుండా 23 ఏళ్ల వరకు స్కిల్స్ అందించి, భవిష్యత్తు బాగుండేలా చూస్తున్నాం. కొన్ని వేల మంది పిల్లలు చదువుకొని, వివిధ నైపుణ్యాలు పెంచుకొని తమ జీవితం తాము ఆనందం గడుపుతున్నారు. నర్సులుగా, వివిధ రంగాలలో ఉద్యోగాలు చేస్తున్నవారూ, ఉన్నవారు,, పెళ్లి్ల చేసుకొని తమ పిల్లలకు మంచి భవిష్యత్తును అందిస్తున్న వారున్నారు. మా చేయూతతో తమ బాల్యంలోని చేదును దూరం చేసుకొని, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. – అనూరాధ, ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్, రెయిన్ బో హోమ్స్ – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఫొటోలు


Arjun son of Vyjayanthi : ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)


Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 13-20)


SRH vs PBKS : ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)


హైదరాబాద్లో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర (ఫోటోలు)


చాహల్తో డేటింగ్ నిజమేనా? ఆర్జే మహ్వాష్ (ఫోటోలు)


సీరియల్ బ్యూటీ స్రవంతి.. భర్తతో సరదాగా ఇలా (ఫొటోలు)


సూర్య ‘రెట్రో’ మూవీ స్టిల్స్


ఒంటిమిట్ట : కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణం (ఫోటోలు)


తెలంగాణ అమరనాథ్గా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం బ్రహ్మోత్సవాలు ప్రారంభం (ఫొటోలు)


హరిత యాత్రలో అలసిన వనజీవి.. రామయ్య అరుదైన చిత్రాలు
అంతర్జాతీయం

గంట ప్రయాణం నిమిషంలో.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన
ఇప్పటికే అద్భుతాలకు నెలవైన చైనా త్వరలో ప్రపంచానికి మరో అద్భుతాన్ని చూపించబోతోంది. అదేమిటో తెలిసినవారంతా ఇప్పుటికే చైనా ప్రతిభకు కితాబిస్తున్నారు. చైనానోలోని గుయిజౌ ప్రావిన్స్లో నిర్మించిన హువాజియాంగ్ గ్రాండ్ కాన్యన్ బ్రిడ్జి(Huajiang Grand Canyon Bridge) జూన్ 25న ఆవిష్కృతం కానుంది. ఇదే ప్రపంచాన్ని అబ్బురపరిచే మరో వండర్. ఈ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా సరికొత్త రికార్డు సృష్టించనుంది.చైనా ఈ నూతన వంతెనను.. రెండు మైళ్ల దూరం మేరకు విస్తరించి ఉన్న ఒక భారీ లోయను దాటడానికి నిర్మించింది. ఈ నిర్మాణానికి చైనా సుమారు 216 మిలియన్ పౌండ్లు (₹2200 కోట్లు) వెచ్చించింది. ఇప్పటివరకూ ఈ లోయను వాహనాల్లో దాటేందుకు ఒక గంట సమయం పడుతుండగా, ఈ వంతెన నిర్మాణంతో కేవలం ఒక్క నిముషం(One minute)లో ఈ వెంతెనను దాటేయవచ్చని చైనా చెబుతోంది. ఈ వంతెన ఎత్తు పారిస్లోని ఈఫిల్ టవర్కు రెట్టింపు ఎత్తును కలిగి ఉంటుంది. China's Huajiang Grand Canyon Bridge is set to open this year, becoming the world's tallest bridge at 2050 feet high. Recent footage of the bridge has been released, showing crews putting on the finishing touches. One of the most insane facts about the bridge is that… pic.twitter.com/DLWuEV2sXQ— Collin Rugg (@CollinRugg) April 8, 2025ఈ వంతెన మీద ఒక గాజు నడక మార్గం ఏర్పాటవుతోంది. ఫలితంగా సందర్శకులు లోయలోని అద్భుత దృశ్యాలను చూడగలుగుతారు. ఈ వంతెన నుంచి అత్యంత ఎత్తైన బంజీ జంప్ను ఏర్పాటు చేయాలని చైనా యోచిస్తోంది. ఇది సాహస ప్రియులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వంతెన సమీపంలో నివాస ప్రాంతాలను కూడా చైనా అభివృద్ధి చేయనుంది. ఇది పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేస్తుంది.ఈ వంతెన చైనాకున్న ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని(Engineering ability) ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప నిర్మాణంగా నిలుస్తుంది. అగాథంలాంటి లోయ మీద, ఇంత పొడవైన వంతెనను నిర్మించడం అనేది సాంకేతికంగా సవాలుతో కూడుకున్న పని. ఈ వంతెన స్థానికుల జీవన విధానాన్ని మరింత మెరుగుపరుస్తుంది. వాణిజ్య కార్యకలాపాలను సులభతరం చేస్తుంది. ఈ వంతెన ప్రపంచంలోని అత్యంత పొడవైన స్పాన్ వంతెనగా కూడా రికార్డు సృష్టించనుంది. చైనా గతంలోనూ పలు అద్భుత వంతెనలను నిర్మించింది. అయితే ఈ కొత్త వంతెన ఈ జాబితాలో మరో మైలురాయిగా నిలిచిపోనుంది.ఇది కూడా చదవండి: హనుమజ్జయంతి ఏటా రెండుసార్లు.. ఎందుకంటే..

అమెరికాలో మరో విమాన ప్రమాదం.. ట్రంప్ వచ్చాక 12వ ప్రమాదం
ఫ్లోరిడా: అగ్రరాజ్యం అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. శుక్రవారం న్యూయార్క్లో హెలికాప్టర్ ప్రమాదం మరువకముందే.. ఈరోజు మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో చిన్న విమానం కూలిపోయిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. అమెరికాలోని ఫ్లోరిడాలో రహదారిపైనే చిన్న విమానం కూలిపోయింది. సాంకేతిక లోపం కారణంగా సెస్నా 310 అనే విమానం విమానాశ్రయానికి సమీపంలోని ఇంటర్స్టేట్-95 సమీపంలో కూలిపోయింది. బోకా రాటన్ విమానాశ్రయం నుండి బయలుదేరి తల్లాహస్సీ వైపు వెళుతున్న కొద్ది క్షణాల్లోనే విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం సందర్భంగా విమానం నుంచి మంటలు వచ్చి దట్టమైన పొగ చుట్టుపక్కల వ్యాపించింది. ప్రమాదం కారణంగా ముగ్గురు వ్యక్తులు మరణించినట్టు తెలుస్తోంది.another day in the presidency of the clown who only trusts white men as plane pilots, another plane crash, this time in Boca Raton, Florida. 3 dead, one injuredaccidents happen, but is it a coincidence everything in this country is crumbling under Trump?pic.twitter.com/T7BN9kjuhA— 𝕸𝖔𝖓𝖆𝖗𝖈𝖍𝖔 (@_monarcho) April 11, 2025ఒక్కసారిగా గాల్లో నుంచి విమానం.. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై పడిపోయింది. ఈ కారణంగా కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. హైవేపై ప్రమాదం కారణంగా అక్కడి రోడ్లను మూసివేసి సహాయక చర్యలు చేపట్టినట్టు రాటన్ ఫైర్ రెస్క్యూ అసిస్టెంట్ చీఫ్ మైఖేల్ లాసల్లె నివేదించారు. ఇక, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.Son 3 muertos por desplome de #avioneta en #BocaRatón, #FloridaDe acuerdo a autoridades locales, el incidente dejó un saldo de 3 personas fallecidas, una herida y un #incendio que alcanzó al menos un vehículo. Por ahora, autoridades ya investigan el siniestro. pic.twitter.com/AJVaENkCyT— Cuarto Poder (@CuartoPoderMX) April 11, 2025 రెండు రోజులలో రెండు ప్రమాదాలుఈ ఘటనకు ముందు రోజు, న్యూయార్క్లో ఓ హెలికాప్టర్ హడ్సన్ నదిలో కూలిపోయిన ఘటన కూడా చర్చనీయాంశంగా మారింది. వరుసగా రెండు రోజులలో రెండు గగనతల ప్రమాదాలు జరగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. విమాన రవాణా భద్రతపై సర్వత్రా ప్రశ్నలు వేగంగా వెల్లివిరుస్తున్నాయి. నిపుణులు ఈ ఘటనలపై విచారణ చేపట్టి, కారణాలు తెలియజేయాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది 12వ విమాన ప్రమాదం కావడం గమనార్హం. అమెరికాలో విమాన భద్రత ప్రమాణాలపై పునర్విచారణ చేయాల్సిన అవసరం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బెస్ట్ ఎయిర్పోర్టు ‘చాంగీ’
సింగపూర్: ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా సింగపూర్లో చాంగీ ఎయిర్పోర్టు మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఎయిర్పోర్టుకు ఈ ఘనత దక్కడం ఇది 13వసారి కావడం విశేషం. దోహా, టోక్యో ఎయిర్పోర్టులు రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ అవార్డ్స్–2025ను ఈ నెల 9న ప్రకటించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ‘బెస్టు ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా, సౌత్ అసియా’అవార్డు, బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ‘బెస్ట్ రీజినల్ ఎయిర్పోర్టు ఇన్ ఇండియా, సౌత్ ఆసియా’అవార్డు లభించింది. గోవాలోని మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ‘బెస్ట్ ఎయిర్పోర్ట్ అండర్ 5 మిలియన్ ప్యాసింజర్స్’కేటగిరీలో అవార్డు దక్కింది. అలాగే ‘క్లీనెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా, సౌత్ ఆసియా’గా నిలిచింది. హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ‘బెస్టు ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా, సౌత్ ఆసియా’అవార్డు సొంతం చేసుకుంది. ప్రపంచంలోని టాప్–20 విమానాశ్రయాలు 1. సింగపూర్ చాంగీ ఎయిర్పోర్టు, 2. దోహా హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, 3. టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, 4. ఇంచెయాన్ ఎయిర్పోర్టు, 5. నారిటా ఎయిర్పోర్టు, 6. హాంకాంగ్ ఎయిర్పోర్టు, 7. పారిస్ చార్లెస్ డిగాల్ ఎయిర్పోర్టు, 8. రోమ్ ఫుమిసినో ఎయిర్పోర్టు, 9. మ్యూనిక్ ఎయిర్పోర్టు, 10. జ్యూరిచ్ ఎయిర్పోర్టు, 11. దుబాయ్ ఎయిర్పోర్టు, 12. హెల్సింకీ–వాంటా ఎయిర్పోర్టు, 13. వాంకోవర్ ఎయిర్పోర్టు, 14. ఇస్తాంబుల్ ఎయిర్పోర్టు, 15. వియన్నా ఎయిర్పోర్టు, 16. మెల్బోర్న్ ఎయిర్పోర్టు, 17. చుబూ సెంట్రాయిర్ ఎయిర్పోర్టు, 18. కోపెనహగెన్ ఎయిర్పోర్టు, 19. అమ్స్టర్డ్యామ్ ఎయిర్పోర్టు, 20. బహ్రెయిన్ ఎయిర్పోర్టు.

ఒమన్లో నేడు ఇరాన్–అమెరికా అణు చర్చలు
మస్కట్: ఆకాశహర్మ్యాలు, హంగూ ఆర్భాటాలు కనిపించని ప్రశాంతమైన తీరప్రాంత మస్కట్ నగరం పశ్చిమాసియా భౌగోళిక రాజకీయాల్లో భాగమైన కీలక చర్చలకు మరోసారి వేదికగా మారనుంది. తమ అణు కార్యక్రమంపై ఒమన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ శనివారం అమెరికాతో చర్చలు జరపనుంది. రెండు దేశాల మధ్య అణు కార్యక్రమంపై ఒప్పందం కుదిరే అవకాశాలు పెద్దగా కనిపించకున్నా ఈ చర్చలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక అంగీకారానికి రాని పక్షంలో ఇరాన్ అణు కార్యక్రమం లక్ష్యంగా వైమానిక దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేస్తుండటం.. అణ్వాయుధాల తయారీకి అవసరమైన యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని మాత్రం ఆపేది లేదని ఇరాన్ కరాఖండిగా చెబుతుండటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ సమయంలో రెండు దేశాలకు సన్నిహితంగా ఉండే ఒమన్ కల్పించుకోవాల్సి వచ్చింది. ట్రంప్ కూడా చర్చలకు ఒమన్ మధ్యవర్తిత్వంపై అనూహ్యంగా సానుకూలత ప్రకటించారు. ఒమన్ వైపు మొగ్గు ఎందుకు? ఒమన్ కీలకంగా వ్యవహరించిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ‘గల్ఫ్ స్టేట్ అనాలిటిక్స్’సీఈవో జార్జియో కెఫియెరో అంటున్నారు. దౌత్యపరంగా ఒమన్ పాత్ర ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. చారిత్రకంగా చూసినా ప్రపంచ రాజకీయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించిన గత అనుభవం ఒమన్కు ఉందని హైడెల్బర్గ్ యూనివర్సిటీ చరిత్ర ప్రొఫెసర్ మార్క్ అంటున్నారు. ఒమన్ ప్రజల్లో అత్యధికులు ఇబాదీ ముస్లింలు. ఇది సున్నీ–షియా విభజనకు ముందు నుంచీ ఉన్న ఉదారవాద ఇస్లాం శాఖ అని వివరించారు. ఇరాన్తో వ్యవహరించే విషయంలో గత కొన్నేళ్లుగా అమెరికా ప్రధానంగా ఒమన్పైనే ఆధారపడుతోందని ఆయన అన్నారు. 2015లో ఇరాన్తో అణు ఒప్పందం కుదరటానికి అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామాకు రహస్య చర్చల్లో ఒమన్ ఎంతో సాయపడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే, ఆ దేశం ఎప్పుడూ వార్తల్లో ప్రధానంగా కనిపించేందుకు ప్రయతి్నంచలేదని, కేవలం తెరవెనుక ప్రభావవంతమైన పాత్ర పోషించిందన్నారు.అమెరికాతో నేరుగా చర్చలు జరపం: ఇరాన్ అమెరికాతో తాము నేరుగా చర్చల్లో పాల్గొనేది లేదని ఇరాన్ అంటోంది. అణు కార్యక్రమంపై ఒప్పందం విషయంలో ముందుగా ఒమన్ విదేశాంగ మంత్రితో మాట్లాడుతామని, తమ సందేశాన్ని ఆయనే అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్కు అందజేస్తారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ బద్ర్ తెలిపారు. 2015లో కుదిరిన అణు ఒప్పందం ప్రకారం ఇరాన్ 3.67 శాతం శుద్ధి చేసిన యురేనియంను కొద్ది మొత్తంలో మాత్రమే నిల్వ ఉంచుకునేందుకు అవకాశముంది. అయితే, ఆ దేశం వద్ద ప్రస్తుతం 60 శాతం వరకు శుద్ధి చేసిన యురేనియం పెద్ద మొత్తంలో నిల్వ ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో, ఇరాన్తో కుదిరిన ఒప్పందం నుంచి ఏకపక్షంగా బయటికి వస్తూ ట్రంప్ మొదటిసారి అధ్యక్ష పదవిలో ఉండగా ప్రకటించారు. ప్రస్తుతం అణ్వాయుధం తయారీ దిశగా సాంకేతికంగా ఇరాన్ అతి సమీపంలో ఉన్నట్లు లెక్క. ఈ నేపథ్యంలోనే ఇరాన్ అణు సదుపాయాలపై దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. ఆ దేశంపై ఒత్తిడి తెచ్చే చర్యల్లో భాగంగా హిందూ మహా సముద్రంలోని డీగో గార్సియా మిలటరీ స్థావరానికి ఆరు బీ2 బాంబర్లను తరలించారు. చమురు అన్వేషణ, అణు కార్యక్రమంపై మరిన్ని ఆంక్షలు తప్పవని కూడా ట్రంప్ అంటున్నారు. ఇలాంటి హెచ్చరికలు సుహృద్భావ వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయని, ఐరాస అణు పరిశీలకులను దేశం నుంచి బహిష్కరించడానికి కైనా వెనుకాడబోమని ఇరాన్ అంటోంది.
జాతీయం

హింసాత్మకంగా‘వక్ఫ్’ నిరసనలు.. కేంద్ర బలగాలకు హైకోర్టు ఆదేశం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో ఇప్పటివరకూ ముగ్గురు అసువులు బాసారు. నిన్న(శుక్రవారం) జరిగిన దాడుల్లో ఇద్దరు మృతి చెందగా, ఈరోజు(శనివారం) జరిగిన కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని లా అండ్ ఆర్డర్ ను చూసే అడిషనల్ డైరెక్టర్ జనరల్ జావేద్ షమీమ్ తెలిపారు. ముస్లిం జనాభా అధికంగా ఉండే ముర్షీదాబాద్ జిల్లాలో ఇప్పటివరకూ 118 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.కేంద్ర బలగాలను మోహరించండివక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ర్యాలీలు హింసాత్మకంగా మారడంతో కోల్ కతా హైకోర్టు స్పందించింది. నిరసన ర్యాలీలను అదుపులోకి తేవడంతో పాటు హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రధానంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న జంగీపూర్ లో కేంద్ర బలగాలను దింపాలని ఆదేశాల్లో పేర్కొంది.శాంతించండి.. వక్ఫ్ చట్టాన్ని అమలు చేయంనిరసన కార్యక్రమాలు తీవ్ర రూపం దాల్చడంతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు.వక్ఫ్ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని నిరసన కారులకు హామీ ఇచ్చారు. ‘ ప్రజలకు ఇదే నా విజ్ఞప్తి. రాష్ట్రంలోని అన్ని మతాలకు ప్రజలకు నేను ఒకటే విన్నపం చేస్తున్నా. ఎవరూ కూడా రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు చోటివ్వకండి. ఇక్కడ ఏమైనా జరిగితే ఓవరాల్ గా నష్టపోయేది ప్రజలే. అది ఏ వర్గమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా ప్రజలే ఇబ్బంది పడతారు. మీ నిరసనను హింసాత్మకంగా మారనివ్వకండి. ఎవరి జీవితమైనా ఒక్కటే. ప్రతీ మనిషి జీవితం చాలా ముఖ్యమైనదే విషయం మీరు గ్రహించండి.వక్ఫ్ సవరణ చట్టం అనేది రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదు. వక్ఫ్ సవరణ చట్టాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్న క్రమంలో దాన్ని మేము చట్టంగా గుర్తించడం లేదు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన చట్టం మాత్రమే. మనం దీనికి కేంద్రాన్నే అడుగుదాం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది. మనకు సమాధానం చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వమే. ఈ చట్టానికి మేము మద్దతు ఇవ్వడం లేదు. అదే సమయంలో ఇక్కడ అమలుకు కూడా నోచుకోదు. ఇది గుర్తుపెట్టుకుంది. అంతా నిరసనలు విరమించి శాంతించండి’ అంటూ మమతా బెనర్జీ ‘ఎక్స్( వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.Shopping malls and shops are being looted in Shamsherganj, Murshidabad, in the name of peaceful protests against Waqf Amendment Act...Bangladeshi style of loot is happening....Is West Bengal steadily transforming to West Bangladesh ! pic.twitter.com/R2NmSNpo11— Sourish Mukherjee (@me_sourish_) April 12, 2025 Anyone has the right to PEACEFULLY protest against the Wakf law if they have a problem with it : NO ONE has right to resort to arson and violence in name of religion . West Bengal govt must come down hard on ALL involved. Spare NO ONE irrespective of community. In a surcharged… pic.twitter.com/t8IWRq0UD3— Rajdeep Sardesai (@sardesairajdeep) April 12, 2025

వీడియో వైరల్: ఛత్తీస్గఢ్లో దారుణం.. ఎలుగుబంటిని కట్టేసి..
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఎలుగుబంటిని బంధించి.. శారీరకంగా చిత్రహింసలకు గురి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ క్రమంలోనే ఆ ఎలుగుబంటి ప్రాణాలు కూడా కోల్పోయింది. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పైశాచిక ఘటనపై విచారణకు ఆదేశించారు. మూగ జీవిని హింసించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.వీడియోలో ఎలుగుబంటి చేతిని ఉక్కు తీగతో చెక్క పలకకు కట్టేశారు. ఓ వ్యక్తి ఆ జీవి చెవులను లాగుతున్నట్లు కనిపిస్తుంది. నొప్పితో ఆ ఎలుగుబంటి అల్లాడిపోతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. మరొక వ్యక్తి తన చేతులతో ఎలుగుబంటి తలపై బలంగా కొట్టడాన్ని చూడవచ్చు. క్షణాల్లో, అదే వ్యక్తి ఎలుగుబంటి గోళ్లను పీకుతున్నట్లు చూడవచ్చు. తీవ్రమైన నొప్పి కారణంగా ఆ మూగ జీవి అరుపులు బిగ్గరగా వినిపించడం వీడియోలో రికార్డు అయ్యింది. నిందితులపై రూ. 10,000 రివార్డును ప్రకటించిన అటవీశాఖ.. వారి చిత్రాలను విడుదల చేసింది. వీడియోలో వ్యక్తుల కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. వారిపై వన్యప్రాణి చట్టం 1972 ప్రకారం చర్య తీసుకుంటామని అటవీ శాఖ తెలిపింది.

Waqf act:. పశ్చిమబెంగాల్లో నిరసన సెగ.. సీఎం మమతా విన్నపం ఇదే!
కోల్ కతా: వక్ఫ్ సవరణ చట్టం ఇప్పటికే అమల్లోకి వచ్చిన తరుణంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నిరసన జ్వాలలు రాజుకున్నాయి. వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రధానంగా రాష్ట్రంలో ముర్షీబాద్ తో పాటు పల్ల జిల్లాల్లో వరుసగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో శనివారం అది ఇంకా తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో వంద మందిని అరెస్టు చేశారు. దీనిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ‘ ప్రజలకు ఇదే నా విజ్ఞప్తి. రాష్ట్రంలోని అన్ని మతాలకు ప్రజలకు నేను ఒకటే విన్నపం చేస్తున్నా. ఎవరూ కూడా రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు చోటివ్వకండి. ఇక్కడ ఏమైనా జరిగితే ఓవరాల్ గా నష్టపోయేది ప్రజలే. అది ఏ వర్గమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా ప్రజలే ఇబ్బంది పడతారు. మీ నిరసనను హింసాత్మకంగా మారనివ్వకండి. ఎవరి జీవితమైనా ఒక్కటే. ప్రతీ మనిషి జీవితం చాలా ముఖ్యమైనదే విషయం మీరు గ్రహించండి.వక్ఫ్ సవరణ చట్టం అనేది రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదు. వక్ఫ్ సవరణ చట్టాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్న క్రమంలో దాన్ని మేము చట్టంగా గుర్తించడం లేదు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన చట్టం మాత్రమే. మనం దీనికి కేంద్రాన్నే అడుగుదాం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది. మనకు సమాధానం చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వమే. ఈ చట్టానికి మేము మద్దతు ఇవ్వడం లేదు. అదే సమయంలో ఇక్కడ అమలుకు కూడా నోచుకోదు. ఇది గుర్తుపెట్టుకుంది. అంతా నిరసనలు విరమించి శాంతించండి’ అంటూ మమతా బెనర్జీ ‘ఎక్స్( వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.সবার কাছে আবেদনসব ধর্মের সকল মানুষের কাছে আমার একান্ত আবেদন, আপনারা দয়া করে শান্ত থাকুন, সংযত থাকুন। ধর্মের নামে কোনো অ-ধার্মিক আচরণ করবেন না। প্রত্যেক মানুষের প্রাণই মূল্যবান, রাজনীতির স্বার্থে দাঙ্গা লাগাবেন না। দাঙ্গা যারা করছেন তারা সমাজের ক্ষতি করছেন।মনে রাখবেন, যে…— Mamata Banerjee (@MamataOfficial) April 12, 2025 కాగా, పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లు.. చట్ట రూపం దాల్చింది.ఏప్రిల్ 8వ తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. దీనికి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. మరోవైపు..సుప్రీంకోర్టులో వక్ఫ్ బిల్లును సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి., ఈ క్రమంలో.. తమ వాదనలు వినాలంటూ కేంద్రం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో 15, 16వ తేదీల్లో దేశ సర్వోన్నత న్యాయస్థానంలో జరగబోయే విచారణపై ఉత్కంఠ నెలకొంది. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుమారు 16 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటితో పాటు కేంద్రం వేసిన కేవియట్ను కలిపి విచారించాలని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయించింది.

వనజీవి రామయ్య మృతికి ప్రధాని మోదీ సంతాపం
న్యూఢిల్లీ, సాక్షి: సామాజిక కార్యకర్త, పర్యావరణ ప్రేమికుడు పద్మశ్రీ వనజీవి రామయ్య(85) మృతిపై దేశవ్యాప్తంగా ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు దిగ్భ్ర్భాంతి వ్యక్తం చేస్తూ.. ఆయన సేవలను కొనియాడారు. తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ తన సంతాపం తెలియజేశారు. ఈ మేరకు తెలుగులో ఓ పోస్ట్ ఉంచారాయన.‘‘దరిపల్లి రామయ్య గారు సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా గుర్తుండిపోతారు. లక్షలాది చెట్లను నాటడానికి, వాటిని రక్షించడానికి ఆయన తన జీవితాన్ని అంకితమిచ్చారు. ఆయన అవిశ్రాంత కృషి ప్రకృతి పట్ల గాఢమైన ప్రేమనూ,భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను ప్రతిబింబిస్తాయి. ఆయన చేసిన కృషి మన యువతలో, మరింత సుస్థిరమైన హరిత గ్రహాన్ని నిర్మించాలనే తపనను ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు,అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’ అని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. దశాబ్దాలుగా మొక్కలు నాటుతూ.. నలుగురితో మొక్కలు నాటిస్తూ.. వైవిధ్యమైన రీతిలో ప్రచారంతో హరిత ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ వచ్చారాయన. ఈ క్రమంలో కోటి మొక్కలకు పైనే నాటి అరుదైన ఘనత సాధించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం ఉదయం ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు.దరిపల్లి రామయ్య గారు సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా గుర్తుండిపోతారు. లక్షలాది చెట్లను నాటడానికి, వాటిని రక్షించడానికి ఆయన తన జీవితాన్ని అంకితమిచ్చారు. ఆయన అవిశ్రాంత కృషి ప్రకృతి పట్ల గాఢమైన ప్రేమనూ,భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను ప్రతిబింబిస్తాయి. ఆయన చేసిన కృషి మన యువతలో,…— Narendra Modi (@narendramodi) April 12, 2025
ఎన్ఆర్ఐ

Ugadi 2025 సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
'శ్రీ సాంస్కృతిక కళాసారథి' ఆధ్వర్యంలో సింగపూర్ లోని తెలుగువారి కోసం ప్రత్యేక 'విశ్వావసు ఉగాది వేడుకలు' కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం భారతదేశం నుండి ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు, రచయిత డాక్టర్ రామ్ మాధవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా లోక్సభ సభ్యులు డీకే అరుణ, ప్రముఖ రాజకీయవేత్త, సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి విచ్చేశారు.సింగపూర్ తెలుగు గాయనీ గాయకులు చక్కటి సాంప్రదాయబద్ధమైన పాటలతో ప్రేక్షకులను అలరించారు. నాట్య కళాకారుల ప్రత్యేక నృత్య ప్రదర్శనలు, చిన్నారుల పద్య పఠనాలు అందరినీ ఆకర్షించాయి. సింగపూర్ తెలుగు ప్రజలందరూ ఆనందంగా ఉగాది వేడుకలు జరుపుకున్నారు.సింగపూర్లోని తెలుగువారి సాంస్కృతిక ప్రతిభను ప్రదర్శించేందుందుకు వేదికను ఏర్పాటు చేయగలగడం, దానికి ప్రత్యేకించి భారతదేశం నుండి అతిథులు విచ్చేసి తమను అభినందించడం చాలా ఆనందంగా ఉందన్నారు కార్యక్రమ ప్రధాన నిర్వాహకులు, సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్. మరిన్ని NRI న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ సందర్బంగా సింగపూర్ కవయిత్రి కవిత కుందుర్తి రచించిన కవితా సంపుటి "Just A Housewife", రామ్ మాధవ్ రచించిన “Our Constitution Our Pride” అనే పుస్తకాలు ఆవిష్కరించారు. దాదాపు 350 మంది పైగా హాజరైన ఈ కార్యక్రమంలో సింగపూర్ లోని "స్వర" నాట్య సంస్థ నుండి కళాకారుల నాట్య ప్రదర్శనలు, చిన్నారులు ఉగాది పాటకు నాట్య ప్రదర్శన చేయగా, సంగీత విద్యాలయాలైన స్వరలయ ఆర్ట్స్, మహతి సంగీత విద్యాలయం, విద్య సంగీతం, జయలక్ష్మి ఆర్ట్స్ సంస్థల నుండి విద్యార్థులు గీతాలాపన చేశారు. చిన్నారుల వేద పఠనం, భగవద్గీత శ్లోక పఠనం వంటివి అందరినీ ఆకట్టుకున్నాయి.సింగపూర్ గాయనీమణులు తంగిరాల సౌభాగ్య లక్ష్మి, శైలజ చిలుకూరి, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, షర్మిల, శేషు కుమారి యడవల్లి, ఉషా గాయత్రి నిష్టల, రాధిక నడదూర్, శ్రీవాణి, విద్యాధరి, దీప తదితరులు సంప్రదాయ భక్తి పాటలు, ఉగాది పాటలు, శివ పదం కీర్తనలు మొదలైనవి వినిపించారు. వాద్య సంగీత ప్రక్రియలో వీణపై వేదుల శేషశ్రీ,, వయోలిన్ పై భమిడిపాటి ప్రభాత్ దర్శన్ తమ ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్యఅతిథి డాక్టర్ రామ్ మాధవ్ మాట్లాడుతూ తెలుగు భాషకు ఆదరణ తగ్గుతున్న ఈ రోజుల్లో తెలుగు భాష గొప్పతనం చాటేలా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఇళ్లలో తెలుగు రాయడం, చదవడం తగ్గిపోవడం వలన, తెలుగుభాష కనుమరుగు కావడానికి ముఖ్యకారణమన్నారు. ప్రపంచములో త్వరితగతిన అంతరించుకుపోతున్న భాషలో తెలుగు బాషా కూడా ఉండడం బాధాకరమని, దానిని కాపాడుకోవడం మన బాధ్యత అని తెలిపారు. వారి ప్రసంగం ఆధ్యంతం ఒక్క ఆంగ్ల పదం లేకుండా అచ్చతెలుగులో ప్రసంగించడం విశేషంగా నిలిచింది.కార్యక్రమ విశిష్ట అతిథి డీకే అరుణ మాట్లాడుతూ "నేను 14 ఏళ్ల తర్వాత ఎంపీ హోదాలో సింగపూర్ లో ఇలా ఉగాది వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే సంతోషిస్తున్నాం, కానీ తెలుగు భాష గొప్పతనాన్ని వాళ్లకు నేర్పించడం లేదు. విదేశాలలో ఉన్నటువంటి తెలుగువారు ఇలా తెలుగు భాష గొప్పతనాన్ని చాటుతూ, మన సంప్రదాయాలు, కట్టుబాట్లు చిన్న పిల్లలకు, భావి తరాలకు నేర్పుతుండటం అభినందనీయం" అని చెపుతూ అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమ ఆత్మీయ అతిధి వామరాజు సత్యమూర్తి మాట్లడుతూ "విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలలో సింగపూర్ లో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది, నేను సింగపూర్ కి వచ్చినప్పుడల్లా అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్ల పుట్టింటికి వచ్చినంత సంతోషం గా ఉందని" తెలియచేస్తూ కార్యక్రమములో పాల్గొన్న తన పాత మిత్రులను పేరు పేరున పలకరిస్తూ వారితో తనకున్న పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగిన వారి ప్రసంగములో అందరినీ నవ్విస్తూ, కొన్ని సామెతలను చెపుతూ, కవులను గుర్తుచేస్తూ, చివరలో కార్యక్రమ నిర్వాహుకులకు ఉండే కష్టాలను సోదాహరణంగా వివరించి అందరిని నవ్వించారు.ఈ కార్యక్రమములో తెలంగాణ కల్చరల్ సొసైటీ కార్యవర్గ సభ్యులు, తెలుగు సమాజం సభ్యులు, సింగపూర్ నలుమూలలు నుండి తెలుగువారు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ సభ్యులు రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, పాతూరి రాంబాబు, వ్యాఖ్యాతగా సౌజన్య బొమ్మకంటి తదితరులు పాల్గొన్నారు. GIIS స్కూల్ నిర్వాహకులు అతుల్ మరియు ప్రముఖ పారిశ్రామకవేత్త కుమార్ నిట్టల ప్రత్యేక సహాయ సహకారాలు అందించారు.స్కేటింగ్ లో విశేష ప్రతిభను ప్రపంచ స్థాయిలో ప్రదర్శితున్న నైనికా ముక్కాలను, తాను సాధించిన విజయాలను అభినందిస్తూ అతిధులు మరియు నిర్వాహుకులు నైనికా ఘనంగా సత్కరించారు. అతిథులని ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను బహుకరించి, కళాకారులకు అతిథులచే సర్టిఫికెట్ ప్రదానం చేయించారు, కాత్యాయనీ గణేశ్న ,వంశీకృష్ణ శిష్ట్లా సాంకేతిక సహాయం అందించగా, వీర మాంగోస్ వారు స్పాన్సర్ గా వ్యవహరించారు, అభిరుచులు, సరిగమ గ్రాండ్ వారు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. నిర్వాహకులు, సభా వేదిక అందించిన GIIS యాజమాన్యానికి, అతిథులకు సహకరించిన కళాకారులకు స్పాన్సర్స్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం
డాలస్, టెక్సస్, అమెరికా: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది పర్వదిన సందర్భంగా - “రైతన్నా! మానవజాతి మనుగడకు మూలాధారం నీవేనన్నా” అనే అంశంపై జరిపిన 78 వ అంతర్జాల అంతర్జాతీయ ఉగాది కవిసమ్మేళనం 30 మందికి పైగా పాల్గొన్న కవుల స్వీయ కవితా పఠనంతో ఎంతో ఉత్సాహభరితంగా జరిగింది.ముఖ్యఅతిథిగా పాల్గొన్న ‘పద్మశ్రీ పురస్కార గ్రహీత’ యడ్లపల్లి వెంకటేశ్వరరావు బ్రిటష్ కాలంనాటి ఆధునిక సేంద్రీయపద్దతుల వరకు వ్యవసాయపద్దతులలో వచ్చిన మార్పులను సోదాహరణంగా వివరించారు. రైతులకు వ్యవసాయసంబంధ విజ్ఞానాన్ని అందించేందుకు ‘రైతునేస్తం’ మాస పత్రిక, పశుఆరోగ్యం, సంరక్షణ కోసం ‘పశునేస్తం’ మాసపత్రిక, సేంద్రీయ పద్ధతులకోసం ‘ప్రకృతి నేస్తం’ మాసపత్రికలను, ‘రైతునేస్తం యూట్యూబ్’ చానెల్ ద్వారా సమగ్ర సమాచారం అందిస్తూ నిరంతరం రైతుసేవలో నిమగ్నమై ఉన్నామని తెలియజేశారు. రైతుకు ప్రాధ్యాన్యం ఇస్తూ తానా ప్రపంచసాహిత్యవేదిక ఇంత పెద్ద ఎత్తున కవిసమ్మేళనం నిర్వహించడం ముదాహవమని, ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరూ వ్రాసిన కవితలను పుస్తకరూపంలో తీసుకురావడం ఆనందంగా ఉందంటూ అందరి హర్షధ్వానాలమధ్య ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న ముఖ్యఅతిథి, కవి సమ్మేళనంలో పాల్గొన్న కవు లందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతు కుటుంబ నేపధ్యంనుండి వచ్చిన తనకు వ్యవసాయంలోఉన్న అన్ని కష్టాలు తెలుసునని, ప్రభుత్వాలు రైతులకు అన్ని విధాలా సహాయపడాలని, ‘రైతు క్షేమమే సమాజ క్షేమం’ అన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ - వివిధ రకాల పంటల ఉత్పత్తులలో, ఎగుమతులలో భారతదేశం ముందువరుసలోఉన్నా రైతు మాత్రం తరతరాలగా వెనుకబడిపోతూనే ఉన్నాడన్నారు. మహాకవి పోతన, కవిసార్వభౌమ శ్రీనాధుడులాంటి ప్రాచీన కవులు స్వయంగా వ్యసాయం చేసిన కవి కర్షకులని, గుర్రం జాషువా, ఇనగంటి పున్నయ్య చౌదరి, దువ్వూరి రామిరెడ్డి, తుమ్మల సీతారామమూర్తి లాంటి ఆధునిక కవులు రైతులపై వ్రాసిన కవితలను చదివి వారికి ఘన నివాళులర్పించారు. అలాగే రైతు నేపధ్యంలో వచ్చిన ‘పేద రైతు’, ‘కత్తిపట్టిన రైతు’, ‘రైతు కుటుంబం’, ‘రైతు బిడ్డ’, ‘పాడి పంటలు’, ‘రోజులు మారాయి’, ‘తోడి కోడళ్ళు’ లాంటి సినిమాలు, వాటిల్లోని పాటలు, అవి ఆనాటి సమాజంపై చూపిన ప్రభావం ఎంతైనా ఉందని, ఈ రోజుల్లో అలాంటి సినిమాలు కరువయ్యాయి అన్నారు. మన విద్యావిధానంలో సమూలమైన మార్పులు రావాలని, పసిప్రాయంనుండే పిల్లలకు అవగాహన కల్పించడానికి రైతు జీవన విధానాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలని, చట్టాలుచేసే నాయకులు కనీసం నెలకు నాల్గురోజులు విధిగా రైతులను పంటపొలాల్లో కలసి వారి కష్టనష్టాలు తెలుసుకుంటే, పరిస్థితులు చాలావరకు చక్కబడతాయని అభిప్రాయపడ్డారు.ఈ కవి సమ్మేళనంలో వివిధ ప్రాంతాలనుండి పాల్గొన్న 30 మందికి పైగా కవులు రైతు జీవితాన్ని బహు కోణాలలో కవితల రూపంలో అద్భుతంగా ఆవిష్కరించారు.పాల్గొన్న కవులు: దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి, ప్రకాశం జిల్లా; మంత్రి కృష్ణమోహన్, మార్కాపురం; పాయల మురళీకృష్ణ, విజయనగరం జిల్లా; నన్నపనేని రవి, ప్రకాశం జిల్లా; డా. తలారి డాకన్న, వికారాబాద్ జిల్లా; చొక్కర తాతారావు, విశాఖపట్నం; రామ్ డొక్కా, ఆస్టిన్, అమెరికా; దొండపాటి నాగజ్యోతి శేఖర్, కోనసీమ జిల్లా; ర్యాలి ప్రసాద్, కాకినాడ; సాలిపల్లి మంగామణి (శ్రీమణి), విశాఖపట్నం; సిరికి స్వామినాయుడు, మన్యం జిల్లా; తన్నీరు శశికళ, నెల్లూరు; చేబ్రోలు శశిబాల, హైదరాబాద్; లలిత రామ్, ఆరెగాన్, అమెరికా; బాలసుధాకర్ మౌళి, విజయనగరం; గంటేడ గౌరునాయుడు, విజయనగరం జిల్లా; కోసూరి రవికుమార్, పల్నాడు జిల్లా; మార్ని జానకిరామ చౌదరి, కాకినాడ; కె.ఎ. మునిసురేష్ పిళ్లె, శ్రీకాళహస్తి; డా. బీరం సుందరరావు, చీరాల; డా. వేంకట నక్త రాజు, డాలస్, అమెరికా; బండ్ల మాధవరావు, విజయవాడ; డా. కొండపల్లి నీహారిణి, హైదరాబాద్; నారదభట్ల అరుణ, హైదరాబాద్; పి. అమరజ్యోతి, అనకాపల్లి; యార్లగడ్డ రాఘవేంద్రరావు, హైదరాబాద్; చిటిప్రోలు సుబ్బారావు, హైదరాబాద్; డా. శ్రీరమ్య రావు, న్యూజెర్సీ, అమెరికా, డా. శ్రీదేవి శ్రీకాంత్, బోట్స్వానా, దక్షిణాఫ్రికా; డా. భాస్కర్ కొంపెల్ల, పెన్సిల్వేనియా, అమెరికా; ఆది మోపిదేవి, కాలిఫోర్నియా, అమెరికా; డా. కె. గీత, కాలిఫోర్నియా, అమెరికా; శ్రీ శ్రీధర్ రెడ్డి బిల్లా, కాలిఫోర్నియా, అమెరికా నుండి పాల్గొన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు శ్రమైక జీవన విధానం, తీరు తెన్నులపై తరచూ చర్చ జరపవలసిన అవసరం ఎంతైనా ఉందని, మన అందరికీ ఆహరం పంచే రైతన్న జీవితం విషాదగాధగా మిగలడం ఎవ్వరికీ శ్రేయస్కరంగాదన్నారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వార వీక్షించవచ్చును.https://youtube.com/live/qVbhijoUiX8అలాగే రైతు నేస్తం ఫౌండేషన్ సహకారంతో తానా ప్రపంచసాహిత్యవేదిక వెలువరించిన రైతు కవితల పుస్తకాన్ని కూడా ఇక్కడ పొందు పరుస్తున్నాము.

డా.గుడారు జగదీష్కు “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డు
మారిషస్ తెలుగు మహా సభ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ తెలుగు ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఫీనిక్స్లోని ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్లో తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని, శ్రీ విశ్వావసు నామ తెలుగు ఉగాదిని మారిషస్లోని తెలుగు వారు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ప్రముఖ సామాజిక-సాంస్కృతిక సంస్థ మారిషస్ తెలుగు మహా సభ నిర్వహించిన ఈ కార్యక్రమం, తెలుగు ప్రజల వారసత్వం మరియు సంప్రదాయాలను పరిరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఒక వేదికగా నిలచింది. కార్యక్రమం సాంప్రదాయ తెలుగు నూతన సంవత్సర ఆచారాలతో ప్రారంభమైంది, వీటిలో భాగంగా మా తెలుగు తల్లి, దీప ప్రజ్వలనం మరియు గణపతి వందనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్ గుడారు జగదీష్ వైద్య రంగంలో చేసిన అసాధారణ కృషికి, ముఖ్యంగా వికలాంగుల శ్రేయస్సు కోసం వారి యొక్క అచంచలమైన అంకితభావానికి గుర్తింపుగా మారిషస్ ప్రధాన మంత్రి సత్కరించారు.నాలుగు దశాబ్దాలుగా వికలాంగుల పునరావాసం మరియు సమాజ సేవకు అంకితమైన డాక్టర్ జగదీష్ దేశ విదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన అవిశ్రాంత సేవ ఎంతో మంది అభాగ్యుల జీవితాలను ప్రభావితం చేసింది. ఈ సేవలను గుర్తించిన మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్చంద్ర రామ్ గూలమ్ డాక్టర్ గుడారు జగదీష్ ను “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డుతో సత్కరించారు. డాక్టర్ జగదీష్ అసాధారణ మానవతా స్ఫూర్తిని మరియు అంకితభావాన్ని మారిషస్ ప్రధాని ప్రశంసించారు. డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ తనను ఈ గౌరవ పురస్కారానికి ఎంపిక చేసినందుకు మారిషస్ తెలుగు మహా సభ సభ్యులకు, మారిషస్ ప్రధాన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సంధర్భంగా మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్చంద్ర రామ్ గూలమ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన డాక్టర్ జగదీష్ కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ మరియు మంగళూరులోని మణిపాల్ విశ్వవిద్యాలయం వంటి ప్రఖ్యాత వైద్య సంస్థలలో వైద్య విద్యను అభ్యసించి ఆర్థోపెడిక్స్ విభాగంలో నైపుణ్యం పొంది, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ సంస్థల నుండి అత్యాధునిక పద్ధతులలో అధునాతన శిక్షణ సైతం తీసుకున్నారని తెలిపారు. అమెరికా, జర్మనీ, ఇంగ్లాండు, ఇటలీ, ఫ్రాన్స్, నైజీరియా, కెన్యా, ఒమన్, స్విట్జర్లాండ్ మరియు మారిషస్లలో కూడా ఉచిత క్యాంపులు నిర్వహించి తన సేవలను విస్తరించి, అనేక జాతీయ మరియు అంతర్జాతీయ జర్నల్స్లో తన పరిశోధనలు ప్రచురించారని తెలిపారు. రాబోయే రోజుల్లో మారిషస్కు కూడా డాక్టర్ జగదీష్ తన సేవలను అందించాలని ప్రధాని కోరారు.ప్రధానమంత్రి తన ప్రసంగంలో, తెలుగు సంస్కృతిని కాపాడటానికి, ప్రోత్సహించడానికి మరియు సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే వ్యక్తులను గుర్తించడంలో మారిషస్ తెలుగు మహాసభ యొక్క నిబద్ధతను ప్రశంసించారు. డాక్టర్ జగదీష్ అంకితభావం మరియు సమాజం పట్ల సేవానిరతిని ఆయన ప్రశంసించారు. ఆయన సేవ అందరికీ ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు."ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గుర్తింపు నాకే కాదు, సమాజానికి సేవ చేయడానికి తమ జీవితాలను అంకితం చేసే ప్రతి వైద్యునికి ఈ గౌరవం దక్కుతుంది. ప్రతి ఒక్కరికీ అవసరమైన ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండేలా నా సేవలను కొనసాగించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను" అని డాక్టర్ జగదీష్ అన్నారు.మారిషస్ తెలుగు మహా సభ ప్రతినిధులు మాట్లాడుతూ టి.టి.డి. బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్గా & గ్రీన్మెడ్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ అధిపతి . డాక్టర్ జగదీష్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా ఉచిత పోలియో సర్జికల్ మరియు స్క్రీనింగ్ శిబిరాలకు నాయకత్వం వహించారని, నలభై మూడు సంవత్సరాల తన సేవలో భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో వికలాంగుల జీవితాలను మెరుగుపరచడానికి అనేక క్యాంపులను నిర్వహించి, 1,83,000 కు పైగా శస్త్ర చికిత్సలు చేయడం ద్వారా ఎంతో మందిని అంగ వైకల్యం పై విజయం సాధించేలా చేశారని తెలిపారు. ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా అసమానమైనదని గుర్తు చేశారు.రాబోయే సంవత్సరాన్ని శ్రీ విశ్వావసు నామ సంవత్సరము అంటారు. దీని అర్థం ఇది విశ్వానికి సంబంధించినది. అదేవిధంగా, ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి తన సేవలను అందించిన డాక్టర్ గుడారు జగదీష్ కూడా మొత్తం విశ్వానికి సంబంధించిన వైద్యుడు కాబట్టి విశ్వావసు పేరిట “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డుతో ఆయనను సత్కరిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగు వారి యొక్క కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబించే శాస్త్రీయ నృత్యాలు, జానపద పాటలు మరియు సాంప్రదాయ సంగీతంతో సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. ఈ అవార్డు ప్రదానోత్సవంలో మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్చంద్ర రామ్ గూలమ్ తో పాటు ఉప ప్రధాన మంత్రి శ్రీ పాల్ రేమండ్ బెరెంజర్, ప్రజాసేవలు మరియు పరిపాలనా సంస్కరణల మంత్రి శ్రీ లుచ్మన్ రాజ్ పెంటియా, విద్య, కళలు మరియు సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీ మహేంద్ర గోండీయా, మారిషస్లో భారత హైకమిషనర్ అనురాగ్ శ్రీవాస్తవ, ఇందిరా గాంధీ భారత సంస్కృతి డైరెక్టర్ డాక్టర్ కాదంబినీ ఆచార్య, మారిషస్ తెలుగు మహా సభ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

సింగపూర్లో విశ్వావసు నామ ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్ లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో మార్చి 30న ఘనంగా జరిగాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో బాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. గంటల పంచాంగాన్ని ప్రముఖ పంచాంగ కర్తలు పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ (శ్ర శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి)సిద్ధం చేయడం జరిగింది. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి తదితర ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గాప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి , ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము,కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలను భక్తులు కొనియాడారు.ఉగాది వేడుకల నిర్వహణ, దాతలకు, స్పాన్సర్లతోపాటు, సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS ధన్యవాదాలు తెలిపింది. ఈ వేడుకలలో పాల్గొన్న వై.ఎస్.వి.ఎస్.ఆర్.కృష్ణ (పాస్స్పోర్ట్ అటాచ్, ఇండియన్ హై కమిషన్, సింగపూర్) గారికి అధ్యక్షులు గడప రమేష్ బాబు, కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే మై హోమ్ బిల్డర్స్, సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, గారాంటో అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, సౌజన్య డెకార్స్కు సొసైటీ కృతజ్ఞతలు తెలిపింది.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్రైమ్

కూతురు ప్రేమ వివాహం.. తండ్రి ఆత్మహత్య
చిట్యాల: కూతురు ఇంటి నుంచి వెళ్లిపో యి ప్రేమ వివాహం చేసుకోవటంతో మనస్తాపానికి గురైన తండ్రి గడ్డి నిర్మూలన మందు తాగి ఆత్మహ త్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా చిట్యాలలో ఈ ఘటన జరిగింది. చిట్యాలకు చెందిన రెముడాల గట్టయ్య (46) కూతురు (18) మార్చి 8వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. దీంతో గట్టయ్య ఫి ర్యాదుతో చిట్యాల పోలీసులు మిస్సింగ్ కేసు నమో దుచేశారు. అయితే, ఇంటినుంచి వెళ్లిపోయిన 3 రోజుల తర్వాత ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన గట్టయ్య కూతురు.. తాను ఊదరి యాదగిరి అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్నానని, తన కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని కోరింది. ఈ విషయాన్ని పోలీసులు గట్టయ్యకు చెప్పారు. దీంతో తన కూతురితో ఒక్కసారి మాట్లాడించాలని గట్టయ్య చిట్యాల పోలీసులను వేడుకున్నాడు. అందుకు పోలీసులు నిస్సహాయత వ్యక్తంచేయటంతో నెల రోజుల నుంచి గట్టయ్య పలువురు పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి మొరపెట్టుకున్నాడు. అయినా తనకు న్యాయం జరగటం లేదన్న మనోవేదనతో శుక్రవారం మధ్యాహ్నం చిట్యాల పట్టణ శివారులోని తన వ్యవసాయ భూమి వద్ద గడ్డి నివారణ మందు తాగాడు. గట్టయ్యను కుటుంబ సభ్యులు హైదరాబా ద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. గట్టయ్య మృతి విషయం తెలియగానే శనివారం ఉదయం చిట్యాల పోలీస్స్టేషన్ వద్దకు మృతుడి బంధువులు, కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున చేరుకొని నిరసనకు దిగారు. దీంతో నార్కట్పల్లి సీఐ కె.నాగరాజు అక్కడికి చేరుకుని గట్టయ్య కూతురుతో ఫోన్లో మాట్లాడారు. తండ్రి మృతి విషయం తనకు తెలిసిందని, అయినా ముంబైలో ఉన్న తాను తిరిగి రానని కరాఖండిగా చెప్పింది. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు నిరసనను విరమించారు.

విదేశాల్లో ఉద్యోగాలని.. ‘సైబర్’ బానిసలుగా మార్చారు
ముంబై: మయన్మార్లో సైబర్ బానిసలుగా బతుకీడుస్తున్న 60 మందికి పైగా భారతీయులను మహారాష్ట్ర పోలీసుల సైబర్ విభాగం రక్షించింది. ఒక విదేశీ పౌరుడు సహా ఐదుగురు ఏజెంట్లను అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. వివరాల మేరకు... థాయ్లాండ్లో మంచి ఉద్యోగావకాశాలున్నాయంటూ మొదట సోషల్ మీడియా ఫ్లాట్ఫాంల ద్వారా ఓ ముఠా ప్రకటనలిచ్చిందిది. ఈ ప్రకటనలకు ఆకర్షితులైన కొందరు అమాయకులను సదరు ముఠా ఏజెంట్లు పాస్పోర్టులు, విమాన టికెట్లు ఏర్పాటుచేసి పర్యాటక వీసాలపై థాయ్లాండ్కు, అక్కడినుంచి మయన్మార్ సరిహద్దుకు పంపారు. ఆ తరువాత చిన్న పడవల్లో వారిని నది దాటించి సాయుధ తిరుగుబాటు గ్రూపుల నియంత్రణలో ఉన్న ప్రదేశాల్లో దింపారు. అక్కడ వారితో బలవంతంగా చీడిజిటల్ అరెస్ట్’ స్కామ్ల నుంచి నకిలీ పెట్టుబడి పథకాల దాకా అనేక సైబర్ మోసాలు చేయించారు. దీనిపై సమాచారమందుకున్న మహారాష్ట్ర సైబర్ పోలీసు విభాగం , ఇతర ఏజెన్సీలతో కలిసి బాధితులను రక్షించింది. త్వరలోనే వీరిని స్వదేశానికి తీసుకురానున్నారు. చదవండి: సింగపూర్ ‘ట్రీ టాప్వాక్’ తరహాలో వాక్వే, క్యూ కడుతున్న పర్యాటకులుమనీష్ గ్రే సహా నలుగురి అరెస్టు రిక్రూట్మెంట్ ఏజెంట్లుగా వ్యవహరించారనే ఆరోపణలతో మనీష్ గ్రే అలియాస్ మాడీ, తైసన్ అలియాస్ ఆదిత్య రవి చంద్రన్, రూపనారాయణ్ రాంధర్ గుప్తా, జెన్సీ రాణి డి మరియు చైనీస్–కజకిస్తానీ జాతీయుడు తలానిటి నులాక్సీలను అరెస్టు చేసింది. వీరిలో మనీష్ గ్రే పలు వెబ్ సిరీస్లు టెలివిజన్ షోలలో నటించిన ప్రొఫెషనల్ నటుడు అని కొంతమంది వ్యక్తులను నియమించుకుని మయన్మార్కు మనుషులను అక్రమ రవాణా చేశాడని పోలీసులు తెలిపారు. తలానిటి నులాక్సీ భారతదేశంలో సైబర్ నేరాలకు పాల్పడేలా ఒక యూనిట్ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని, తదుపరి దర్యాప్తు కొనసా గుతోందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ టైటిల్ ఎగరేసుకుపోయాడు : ప్రైజ్మనీ ఎంతో?

కూతురి పెళ్లి రోజే.. నిండు ముత్తైదువుగా తల్లి కాటికి
తమిళనాడు: కుమార్తె పెళ్లికి భర్తతో కలిసి బైక్పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. అయితే తల్లి మరణవార్త కుమార్తెకు తెలియనివ్వకుండా బంధువులు పెళ్లి జరిపించారు. వివరాలు.. తంజావూరు జిల్లా అయ్యనార్పురం గ్రామానికి చెందిన రంగస్వామి (55). ఇతని భార్య మాలతి (50). ఇద్దరూ రోజువారీ కూలీలు. వీరి కుమార్తె సుకీర్త, సతీష్ కుమార్ వివాహం గురువారం ఊరణిపురంలోని ఆలయంలో జరిగింది. కుమార్తె వివాహానికి ఏర్పాట్లు చేసిన దంపతులు రంగస్వామి, మాలతి ఇంటి నుంచి మోటారు సైకిల్పై వివాహానికి వెళ్లారు. మోటారు సైకిల్ను రంగస్వామి నడిపాడు. మాలతి వెనక కూర్చుంది.తిరువోణం సమీపంలోని కాళయరాయన్ రోడ్డులోని నరియట్రు వంతెన వైపు వెళ్తుండగా.. ద్విచక్రవాహనం అనూహ్యంగా రోడ్డు పక్కన ఉన్న బ్రిడ్జి బారికేడ్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాలతి తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన రంగస్వామిని చికిత్స నిమిత్తం తంజావూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో అసుపత్రిలో చేర్చారు. కూతురు పెళ్లి చేయబోతున్న సమయంలో ప్రమాదంలో రంగస్వామి తీవ్రంగా గాయపడగా.. మాలతి మృతి చెందడం బంధువులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.కూతురు పెళ్లి చేయబోతున్న సమయంలో ప్రమాదంలో రంగస్వామికి తీవ్రగాయాలు కాగా మాలతి మృతి చెందడం బంధువులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే యాక్సిడెంట్లో తల్లి మరణించిన విషయాన్ని వధువుకు తెలియజేయకుండా పెళ్లి జరిపించాలని బంధువులు నిర్ణయించారు. ఆ ప్రకారమే సుకీర్త, సతీష్ పెళ్లి చేశారు. తర్వాత ప్రమాదంలో తల్లి చనిపోయిందని, తండ్రికి తీవ్రగాయాలు అయ్యాయని బంధువులు వధువు సుకీర్తకు తెలిపారు. అది విని బోరున ఏడ్చింది. బంధువులు ఆమెను ఓదార్చారు. కూతురి పెళ్లి రోజునే ప్రమాదంలో తల్లి మృతి చెందడం బంధువులు, గ్రామస్తుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
తమిళనాడు: విడదీస్తారనే భయంతో పెళ్లి చేసుకున్న ఓ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన వేలూరు జిల్లాలో చోటుచేసుకుంది. వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని అరుంబాక్కం గ్రామానికి చెందిన మణికంఠన్(27) ఇళ్లకు టైల్స్ వేసే పనిచేస్తుంటాడు. ఇదివరకే వివాహం జరిగిన ఇతను భార్యను వదిలి ఒంటరిగా జీవిస్తున్నాడు.ఈక్రమంలో కడలూరు జిల్లా నెల్లికుప్పం గ్రామానికి చెందిన కోకిల(19) కడలూరులోని ఓ ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. వీరిద్దరికి ఇన్స్ట్రాగామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారి రెండు నెలల క్రితం ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. విషయం తెలిసి కోకిల కుటుంబసభ్యులు కడలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకున్న ఇద్దరూ విచారణకు రావాలని పోలీసులు తరచూ ఫోన్ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో గురువారం ఉదయం బైకులో ఇద్దరూ కలిసి కడలూరుకు బయలుదేరారు. పోలీసులు ఇద్దరిని విడదీస్తారని భయంతో ఇద్దరూ లత్తేరి సమీపంలోని పట్టివూరు రైలు పట్టాల వద్దకు వెళ్లి ఇద్దరూ కౌగిలించుకొని పట్టాలపై తలపెట్టి పడుకున్నారు. ఆ సమయంలో రైలు వారిపై వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన ప్రయాణికులు జోలార్పేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి విచారణ చేస్తున్నారు.
వీడియోలు


KTR: సీఎం రేవంతే ఒక ఫేక్


రాజధాని బీజింగ్ లో భారీ వర్షం, చరిత్రలో చూడని రేంజ్ లో ఈదురు గాలులు


బీఆర్ఎస్ నేతలు కక్షగట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు : శ్రీధర్ బాబు


రెడ్ బుక్ రాజ్యాంగానికి గురజాల DSP జగదీష్ బలి


నేనే పోస్టులు పెడతా.. నీకు చేతనైనది చేసుకో జగదీశ్వరికి పుష్పశ్రీవాణి స్వీట్ వార్నింగ్


తిరుమల గోశాల ఘటనపై సుబ్రమణ్య స్వామి సీరియస్


వక్ఫ్ చట్టాన్ని బెంగాల్ లో అమలు చేయం: దీదీ


దేశ చరిత్రలో ఇదే తొలిసారి... సీఎం స్టాలిన్ సంచలనం


మీడియాను తీసుకురండి వెళ్దాం.. టీడీపీకి భూమన సవాల్


తిరుపతిలో గాంధీ విగ్రహం ఎదుట జర్నలిస్టుల నిరసన