ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పేదలకు రెండు లక్షల రెండు పడక గదుల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. సోమవారం నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండలం భైరాపూర్లో రెండు పడకల ఇళ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తొలి విడతలో రాష్ట్రంలో 65 వేల ఇళ్లను నిర్మించనున్నట్టు చెప్పారు. మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో మిషన్ కాకతీయ పనులను కూడా మంత్రి ప్రారంభించారు.
2 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తాం: మంత్రి పోచారం
Published Mon, May 30 2016 10:56 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement