European Union
-
అమెరికా ఉత్పత్తులపై ఈయూ ప్రతీకార సుంకాలు
బ్రస్సెల్స్: అమెరికా, యూరోపియన్ యూనియన్(ఈయూ) మధ్య టారిఫ్ల యుద్ధం జరుగుతోంది. ఈయూకు సంబంధించిన స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పెంచిన 25 శాతం టారిఫ్లు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. అందుకు ప్రతీకారంగా ఈయూ సైతం గంటల వ్యవధిలోనే అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లు ప్రకటించింది. అమెరికా నుంచి వచ్చే పారిశ్రామిక, పాడి ఉత్పత్తులపై కొత్త సుంకాలు వసూలు చేయనున్నట్లు బుధవారం ఈయూ తేల్చిచెప్పింది. 28 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై సుంకాలు అతిత్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఒత్తిడి పెంచడంలో భాగంగానే ఈయూ సైతం టారిఫ్లు విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ట్రంప్ వెనక్కి తగ్గితే ఈయూ దేశాలు సైతం వెనక్కి తగ్గే అవకాశం ఉంది. టారిఫ్ల విషయంలో అమెరికాతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్డెర్ లెవెన్ చెప్పారు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆర్థికవ్యవస్థలపై టారిఫ్ల పేరిట పెనుభారం మోపడం తమకు ఇష్టం లేదన్నారు. అయితే, అమెరికా చర్యలకు ప్రతిచర్యగా తాము సైతం టారిఫ్లు విధించాలని నిర్ణయించినట్లు తేల్చిచెప్పారు. -
ఉక్రెయిన్ భద్రత కోసం అవసరమైతే అణ్వాయుధాలు!
బ్రస్సెల్స్: ఉక్రెయిన్ భద్రత కోసం రష్యాను బెదిరించేందుకు అవసరమైతే తన అణ్వాయుధాలను నిరోధంగా వాడేందుకు సిద్ధమంటూ ఫ్రాన్స్ వివాదాస్పద ప్రతిపాదన చేసింది. గురువారం బెల్జియం రాజధాని బ్రసెల్స్లో యూరోపియన్ యూనియన్ దేశాల తాజా శిఖరాగ్ర సమావేశం ఇందుకు వేదికైంది. రష్యా బారినుంచి యూరప్కు రక్షణ కల్పించేందుకు ఫ్రాన్స్ అణుపాటవాన్ని ఆయుధంగా ఉపయోగించేందుకు సిద్ధమని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ సందర్భంగా ప్రకటించారు. సభ్య దేశాల నుంచి ఇందుకు భారీ స్పందన లభించింది. పోలండ్తో పాటు లిథువేనియా, లాతి్వయా వంటి పలు బాలి్టక్ దేశాలు ఈ ప్రతిపాదనను గట్టిగా సమరి్థంచాయి. యూరోపియన్ యూనియన్లో అణ్వాయుధ పాటమున్న దేశం ఫ్రాన్స్ ఒక్కటే కావడం విశేషం. ఫ్రాన్స్కున్న ఈ సానుకూలతను యూరప్ భద్రత కోసం ఉపయోగించేందుకు సిద్ధమని బుధవారం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కూడా మాక్రాన్ ప్రకటించారు. దీనిపై లోతుగా చర్చ జరగాలని ఈయూ భేటీలో ఆయన పునరుద్ఘాటించారు. దీనిపై రష్యా తీవ్రంగా స్పందించింది. మాక్రాన్ ప్రతిపాదన అత్యంత ప్రమాదకరమైనదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ అన్నారు. ‘‘శాంతి యత్నాలకు బదులు యుద్ధానికే ఫ్రాన్స్ మొగ్గుతోంది. ఉక్రెయిన్తో మా యుద్ధం కొనసాగాలనే ఆశిస్తోంది. మాక్రాన్ వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు రుజువు’’ అని ఆయన ఆరోపించారు. -
పట్టాలెక్కనున్న ఎఫ్టీయూ
న్యూఢిల్లీ: భారత్–యూరోపియన్ యూనియన్(ఈయూ) మధ్య చాలాఏళ్లుగా పెండింగ్లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం(ఎఫ్టీయూ) త్వరలో పట్టాలకెక్కే దిశగా అడుగు ముందుకు పడింది. చరిత్రాత్మకంగా భావిస్తున్న ఈ ఒప్పందాన్ని ఈ ఏడాది ఆఖరు నాటికి కుదుర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్డెర్ లెయెన్ నిర్ణయించారు. ఈ మేరకు ఒక డెడ్లైన్ విధించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ ఉత్పత్తులపై సుంకాలు విధిస్తుండడంతో వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలకు నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో భారత్, ఈయూ దేశాలకు ఎంతగానో ప్రయోజనం చేకూర్చే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా కుదుర్చుకోవాలని మోదీ, ఉర్సులా ఒక అంగీకారానికి వచ్చారు. వారిద్దరూ శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. నిజానికి ఇండియా, ఈయూ మధ్య ఈ ఒప్పందం కోసం గత 17 ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇరుపక్షాల మధ్య జరుగుతున్న సంప్రదింపులు ఒక కొలిక్కి రావడం లేదు. 2013లో సంప్రదింపులు నిలిచిపోయాయి. 2022 జూన్లో పునఃప్రారంభమయ్యాయి. కానీ, ఆశించిన విధంగా ముందుకు సాగడం లేదు. కొన్ని అంశాలపై ఈయూ గట్టిగా పట్టుబడుతుండగా, ఇండియా సమ్మతించడం లేదు. కార్లు, వైన్, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు రద్దు చేయాలని ఈయూ కోరుతుండగా, భారత ప్రభుత్వం తిరస్కరిస్తోంది. మోదీ, ఉర్సులా భేటీ కావడంతో ఇక ప్రతిష్టంభన తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. కలసికట్టుగా పనిచేద్దాం భారత్, ఈయూ మధ్య సంబంధాలపై మో దీ, ఉర్సులా విస్తృతంగా చర్చించారు. ఇరుపక్షాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించారు. ప్రధానంగా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఉమ్మడి ప్రయోజనాలు కాపాడుకొనేలా కలసికట్టుగా పనిచేయాలని తీర్మానించారు. ఇండియాతో రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్నదే తమ ఉద్దేశమని ఉర్సులా పేర్కొన్నారు. ఇండియా–ఈయూ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఒక కచి్చతమైన రోడ్మ్యాప్ రూపొందించుకోవాలని నిర్ణయించినట్లు మోదీ వెల్లడించారు. తదుపరి ఇండియా–ఈయూ శిఖరాగ్ర సదస్సు నాటికి రోడ్మ్యాప్ సిద్ధమవుతుందని అన్నారు. ఈ సదస్సు వచ్చే ఏడాది భారత్లో జరుగనుంది. మరోవైపు భేటీ తర్వాత మోదీ, ఉర్సులా ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. భారత్, ఈయూ మధ్య వ్యాపారం వాణిజ్యం, టెక్నాలజీ, పెట్టుబడులు, నవీన ఆవిష్కరణలు, గ్రీన్ ఎనర్జీ, భద్రత, నైపుణ్యాభివృద్ధి, రవాణా వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని, ఇరుపక్షాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడమే లక్ష్యంగా ఒక ప్రణాళిక సిద్ధం చేయబోతున్నట్లు పేర్కొన్నారు. -
ట్రేడ్ వార్ టెర్రర్
ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై అదనంగా 10%, యూరోపియన్ యూనియన్ ఉత్పత్తులపై 25% తాజా సుంకాల ప్రకటనతో ఈక్విటీ మార్కెట్లలో మరోసారి అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ 1,414 పాయింట్లు నష్టపోయి 74వేల స్థాయి దిగువన 73,198 వద్ద నిలిచింది. నిఫ్టీ 420 పాయింట్లు కోల్పోయి 22,125 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,471 పాయింట్లు క్షీణించి 73,141 వద్ద, నిఫ్టీ 440 పాయింట్లు కుప్పకూలి 22,105 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. → అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఇండెక్సుల వారీగా.. ఐటీ సూచీ 4.20% పతనమైంది. టెలి కమ్యూనికేషన్, ఆటో ఇండెక్సు 4%, కన్జూమర్ డి్రస్కేషనరీ 3%, ఆయిల్అండ్గ్యాస్ 2.50%, విద్యుత్ ఇండెక్స్ 2% నష్టపోయాయి. చిన్న, మధ్య తరహా షేర్లలోనూ అమ్మకాలు కొనసాగాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 2.33%, మిడ్ క్యాప్ ఇండెక్సు 2.16 క్షీణించాయి. → స్టాక్ మార్కెట్ 2% పతనంతో శుక్రవారం ఒక్కరోజే రూ.9.08 లక్షల కోట్లు హరించుకుపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.384.01 లక్షల కోట్లకు దిగివచ్చింది. → సెన్సెక్స్ సూచీలో ఒక్క హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2%) తప్ప మిగిలిన అన్ని షేర్లూ పతనమయ్యాయి. అత్యధికంగా టెక్ మహీంద్రా 6%, ఇండస్ఇండ్ బ్యాంక్ 5.5%, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎయిర్టెల్ 5%, టైటాన్ 4.5% పడ్డాయి.→ గతేడాది సెపె్టంబర్ 27 నాటి సెన్సెక్స్ రికార్డు గరిష్టం(85,978) నుంచి 12,780 పాయింట్లు(15%), నిఫ్టీ జీవితకాల గరిష్టం(26,277) నుంచి 4,153 పాయింట్లు(16%) క్షీణించాయి. ఆర్థిక వృద్ధి మందగమనం ఆందోళనలు, ట్రంప్ వాణిజ్య విధానాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు దీనికి కారణయ్యాయి. పతనానికి కారణాలుతారస్థాయికి వాణిజ్య యుద్ధ భయాలు: చైనా ఉత్పత్తులపై ఇప్పటికే 10% సుంకాలు విధించిన ట్రంప్.. అదనంగా మరో 10% విధిస్తున్నట్లు ప్రకటించారు. యూరోపియన్ యూనియన్ దిగుమతులపై 25% సుంకాల విధింపు ఉంటుందన్నారు. వీటికి తోడు భారత్తో సహా అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు ఏప్రిల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మెక్సికో, కెనడాల దిగుమతులపై ప్రతిపాదించిన 25% సుంకాలు మార్చి 4 నుంచి అమల్లోకి రానున్నాయి.టెక్ షేర్లు క్రాష్: టెక్ దిగ్గజం ఎన్విడియా త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చనే అంచనాలతో వాల్ స్ట్రీట్లో అధిక మార్కెట్ విలువ కలిగిన టెక్ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. ఈ ప్రభావం దేశీయ ఐటీ రంగ షేర్లపైనా పడింది. నెలరోజుల కనిష్టానికి ప్రపంచ మార్కెట్లు: వాణిజ్య యుద్ధ భయాలకు తోడు టెక్ రంగ షేర్ల పతనంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నెలరోజుల కనిష్టానికి దిగివచ్చాయి. ఆసియాలో దక్షిణ కొరియా, ఇండోనేషియా, హాంగ్కాంగ్, జపాన్ సూచీలు 3.50% నుంచి 3% కుప్పకూలాయి. చైనా, సింగపూర్ తైవాన్ ఇండెక్సులు 2–1% నష్టపోయాయి. యూరప్లో ఫ్రాన్స్, జర్మనీ దేశాల సూచీలు అరశాతం నష్టపోయాయి.బలపడుతున్న డాలర్ ఇండెక్స్: వాణిజ్య యుద్ధ భయాలతో అమెరికా కరెన్సీ డాలర్ ఇండెక్స్ 10 వారాల గరిష్టానికి (108) చేరుకుంది. దీంతో భారత్తో సహా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు ప్రతికూలాంశంగా మారింది. ఆగని ఎఫ్ఐఐల అమ్మకాలు: దేశీయ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండడం దలాల్ స్ట్రీట్ పతనానికి మరో ప్రధాన కారణం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.1.13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి. ఈ ఫిబ్రవరిలోనే రూ.58,988 కోట్ల ఈక్విటీలు అమ్మేశారు.రూపాయి 19 పైసలు పతనం డాలర్ మారకంలో రూపాయి విలువ 19 పైసలు క్షీణించి 87.37 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ రెండు నెలల గరిష్టానికి చేరుకోవడం, వాణిజ్య యుద్ధ భయాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలు దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. ఇంట్రాడేలో 35 పైసలు బలహీనపడి 87.53 వద్ద కనిష్టాన్ని తాకింది. కాగా, ఫిబ్రవరి 10న రూపాయి 87.94 వద్ద జీవితకాల కనిష్ట స్థాయిని తాకింది. -
ఈయూపై 25 శాతం సుంకాలు
వాషింగ్టన్: అమెరికా సుంకాల దెబ్బ యూరోపియన్ యూనియన్ (ఈయూ)నూ తాకింది. ఈయూ దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. బుధవారం తొలి కేబినెట్ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ ప్రకటన చేశారు. ఈయూతో వాణిజ్యంలో అమెరికాకు అన్యా యం జరుగుతోందని ఆరోపించారు. ‘‘27 దేశాలున్న ఈయూ అమెరికా కార్లు, వ్యవసాయోత్పత్తులను అంగీకరించదు. కానీ మేం మాత్రం వారి నుంచి అన్నీ దిగుమతి చేసుకుంటున్నాం. అమెరికా వాహన దిగుమతులపై ఈయూ 10 శాతం సుంకం విధిస్తోంది. ఈయూ ప్యాసింజర్ కార్ల దిగుమతులపై మేం విధిస్తున్న దానికంటే ఇది 4 రెట్లు ఎక్కువ’’ అంటూ మండిపడ్డారు. అసలు అమెరికాను ఇరుకున పెట్టేందుకే ఈయూ పుట్టిందని ట్రంప్ ఆరోపించారు. గట్టిగా బదులిస్తాం: ఈయూట్రంప్ వ్యాఖ్యలపై ఈయూ కార్యనిర్వాహక విభా గమైన యూరోపియన్ కమిషన్ దీటుగా స్పందించింది. ‘‘మాది ప్రపంచంలోనే అతి పెద్ద స్వేచ్ఛా విపణి. అమెరికాకు ఈయూ వరం. చట్టబద్ధం, వి వక్షారహితం అయిన మా విధానాలను ఎదుర్కొనేందుకు సుంకాలను ఉపయోగిస్తే, స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక వాణిజ్యానికి అడ్డంకులు కలిగిస్తే ఈయూ గట్టిగా బదులిస్తుంది’’ అని కమిషన్ అధికార ప్రతినిధి ప్రకటించారు. అమెరికా, ఈయూ ఉద్రిక్తతలురెండు ప్రపంచ యుద్ధాలతో దెబ్బతిన్న ఐరోపా ఖండంలో ఘర్షణలకు తెర దించేందుకు 1993లో ఈయూ ఏర్పాటైంది. అమెరికా కూడా దీన్ని ఓ చరిత్రాత్మక విజయంగానే చూసింది. ఐరోపా సమైక్యతను దశాబ్దాలుగా ప్రోత్సహించింది. కానీ రెండింటి మధ్య కొంతకాలంగా విభేదాలు పెరిగిపోతున్నాయి. ట్రంప్ రాకతో ఉక్రెయిన్కు మద్దతు విషయంలో అమెరికా ఉన్నట్టుండి యూ టర్న్ తీసుకోవడంతో కూటమి దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉక్రెయిన్ యుద్ధంపై ఐరాస తాజా తీర్మానం విషయంలోనూ రష్యాకు అను కూలంగా అమెరికా నిలవడం నివ్వెరపరిచింది. ఈ యూపై సుంకాల ప్రకటనను ఈ విభేదాలకు కొనసాగింపుగా చూస్తున్నారు. అమెరికాలో పర్య టిస్తున్న ఈయూ విదేశీ విధాన వ్యవహారాల సారథి కాజా కలాస్ ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భేటీ కావాల్సి ఉండగా సమయాభావం సాకుతో అది రద్దయింది! -
ఏకపక్ష నిర్ణయాలు.. ట్రంప్కు ఝలక్
బ్రస్సెల్స్: అమెరికాలోకి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజే 27దేశాల యూరప్ కూటమి ఘాటుగా స్పందించింది. అర్ధరహిత టారిఫ్లతో దుందుడుకుగా వ్యవహరిస్తున్న అమెరికా ప్రభుత్వానికి తగు సమాధానం చెప్తామని యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులావాన్ డీర్ లియాన్ మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా డీర్ లియాన్..‘ట్రంప్ టారిఫ్ సవాలుకు దీటుగా బదులిస్తాం. అవి చెడ్డ పన్నులు. వ్యాపారస్తులకూ చెడ్డవే. వినియోగదారులకు గుదిబండలు. యూరోపియన్ యూనియన్కు భారంగా మారిన ఈ టారిఫ్లకు దీటైన సమాధానం చెప్తాం’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇరువైపులా విపరిణామాలు ఈయూ కూటమిలో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ అయిన జర్మనీ సైతం అమెరికా స్టీల్, అల్యూమినియంలపై టారిఫ్లు పెంచడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. దీనిపై జర్మనీ చాన్స్లర్ ఒలాఫ్ స్కోల్జ్ స్పందించారు. అమెరికా మాకు మరో ప్రత్యామ్నాయం లేకుండా చేస్తే యురోపియన్ యూనియన్ మొత్తం ఏకతాటిమీదకొచ్చి ఐక్యంగా నిలబడుతుంది. అప్పుడు అంతిమంగా ఆర్థికయుద్ధం మొదలై ఇరువైపులా దాని విపరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’’అని ఒలాఫ్ వ్యాఖ్యానించారు. అయితే ఈయూ కూటమి ఏ స్థాయిలో టారిఫ్లు పెంచుతుందనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు. అయితే ట్రంప్కు చెందిన రిపబ్లికన్ పార్టీ పాలిత రాష్ట్రాల నుంచి దిగుమతులపైనే ముఖ్యంగా టారిఫ్ పెంచాలని యోచిస్తున్నట్లు వాణిజ్యరంగ విశ్లేషకులు చెబుతున్నారు. -
భారత్లో వ్యాపారంపై ఈఎఫ్టీఏ ఇన్వెస్టర్ల దృష్టి
న్యూఢిల్లీ: భారత్లో వ్యాపారావకాశాలను అందిపుచ్చుకోవడంపై విదేశీ ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోంది. నాలుగు యూరోపియన్ దేశాల కూటమి ఈఎఫ్టీఏ నుంచి 100 మంది, ఇజ్రాయెల్కి చెందిన 200 మంది ఇన్వెస్టర్లు వచ్చే వారం భారత్ను సందర్శించనున్నారు. ఫిబ్రవరి 10 నుంచి మూడు రోజుల పాటు వారు పర్యటించనున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు. టెక్నాలజీ, తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేయడంపై ఆసక్తి గల పెద్ద కంపెనీలు వస్తున్నట్లు వివరించారు. 2024లో ఈఎఫ్టీఏ, భారత్ వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈఎఫ్టీఏలో ఐస్ల్యాండ్, నార్వే, లీష్టెన్స్టెయిన్, స్విట్జర్లాండ్ సభ్యదేశాలుగా ఉన్నాయి. యూరోపియన్ యూనియన్లో చేరడానికి ఇష్టపడని దేశాలు ఏర్పాటు చేసుకున్న ఈ కూటమి.. వచ్చే 15 ఏళ్ల వ్యవధిలో భారత్లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు హామీనిచ్చింది. దానికి ప్రతిగా స్విస్ వాచీలు, చాక్లెట్లు, కట్.. పాలిష్డ్ డైమండ్లు తదితర ఉత్పత్తులపై సుంకాలను తగ్గించేందుకు భారత్ అంగీకరించింది. ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ ఒప్పందం అమల్లోకి రానుంది. 24 బిలియన్ డాలర్ల వాణిజ్యం.. ఈఎఫ్టీఏ–భారత్ మధ్య 2022–23లో ద్వైపాక్షిక వాణిజ్యం 18.65 బిలియన్ డాలర్లుగా ఉండగా 2023–24 నాటికి 24 బిలియన్ డాలర్లకు చేరింది. భారత్కు స్విట్జర్లాండ్ అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా, ఇన్వెస్టరుగా ఉంటోంది. తర్వాత స్థానంలో నార్వే ఉంది. 2000 ఏప్రిల్ నుంచి 2024 సెప్టెంబర్ మధ్య కాలంలో స్విట్జర్లాండ్ నుంచి 10.72 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. వచ్చే 15 ఏళ్లలో 100 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తామని హామీ ఇచి్చన ఈఎఫ్టీఏ బ్లాక్ .. ఇందులో 50 బిలియన్ డాలర్లను ఒప్పందం అమల్లోకి వచి్చన 10 ఏళ్ల వ్యవధిలో పెట్టుబడులు పెట్టనుంది. మిగతా మొత్తాన్ని అయిదేళ్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ పెట్టుబడులతో భారత్లో 10 లక్షల పైచిలుకు ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుందనే అంచనాలు నెలకొన్నాయి. -
ఐరోపా సమాఖ్యపైనా టారిఫ్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ వాణిజ్య యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాలపై అదనపు టారిఫ్లు విధించిన ట్రంప్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్ (ఈయూ)పై సుంకాలు విధిస్తానని సంకేతాలు ఇస్తున్నారు. ట్రంప్ సుంకాలు విధిస్తే తాము దీటుగా బదులిస్తామని ఐరోపా సమాఖ్య సైతం కుండబద్దలు కొట్టింది. చర్చల ద్వారా వాణిజ్య సంఘర్షణను నివారించవచ్చని వ్యాఖ్యానించింది. 27 దేశాల కూటమిపై సుంకాల విధింపు అంశాన్ని పరిశీలిస్తున్నారా? అని వైట్హౌజ్లో ట్రంప్ను మీడియా ప్రశ్నించింది.‘‘ దీనికి నిజమైన సమాధానం కావాలా లేక రాజకీయ సమాధానం కావాలా?. ఖచ్చితంగా విధిస్తా’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. యూరోపియన్ యూనియన్ అమెరికా పట్ల వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈయూకు వ్యతిరేకంగా ట్రంప్ గళమెత్తడం ఇది మొదటిసారి కాదు. వాణిజ్యం విషయంలో అమెరికా పట్ల చాలా అన్యాయంగా వ్యవహరిస్తోందని గతంలోనూ ఆయన ఆరోపించారు. ట్రంప్ తొలిసారిగా అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చున్నప్పుడూ స్టీల్, అల్యూమినియం ఎగుమతులకు సంబంధించి ఈయూపై సుంకాలు విధించారు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన ఈయూ కూటమి వెంటనే తగిన రీతిలో స్పందించింది. విస్కీ, మోటార్ సైకిళ్లతో సహా పలు అమెరికా వస్తువులపై టారిఫ్లు విధించి ప్రతీకారం తీర్చుకుంది.ప్రతీకారం తప్పదన్న ఈయూకెనడా, మెక్సికో, చైనాలపై అమెరికా టారిఫ్లు విధించడాన్ని ఈయూ వ్యతిరేకించింది. ‘‘సుంకాలు అనవసరమైన ఆర్థిక అంతరాయాలను సృష్టిస్తాయి. ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయి. అవి రెండు వైపులా ఇబ్బందులను కలగచేస్తాయి. అలాంటిది ఈయూ వస్తువులపైనే అన్యాయంగా లేదా ఏకపక్షంగా సుంకాలు విధించే ఏ వాణిజ్య భాగస్వామికైనా మేం గట్టిగా బదులిస్తాం’’ అని ఈయూ వ్యాఖ్యానించింది.మెక్సికోపై టారిఫ్ అమలుకు బ్రేక్మెక్సికో నుంచి దిగుమతి అయ్యే వస్తూత్ప త్తులపై 25 శాతం టారిఫ్ విధిస్తానని ప్రకటించిన అమెరికా అధ్యక్షడు ట్రంప్ ఆఖరి నిమిషంలో తన ఆదేశాల అమలును నిలుపుదల చేశారు. నేటి నుంచి కొత్త టారిఫ్ అమల్లోకి రావాల్సి ఉండగా తన ఉత్తర్వుల అమలును నెల రోజులపాటు వాయిదా వేస్తున్నట్లు సోమ వారం ట్రంప్ ప్రక టించారు. టారిఫ్ల అమలు నిలుపుదలపై అమె రికా సర్కార్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్బామ్ వెల్ల డించారు. సోమవారం ఆమె ట్రంప్తో దాదాపు 45 నిమిషాలు ఫోన్లో మంతనాలు జరిపారు. -
ఈఫిల్ టవర్పైకి విమానం!
ఈ ఫొటో చూస్తే ఏం గుర్తొస్తోంది? న్యూయార్క్ జంట టవర్లను విమానాలతో కూల్చేసిన 9/11 ఉగ్ర దాడే కదూ! కానీ నిజానికిది పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (పీఐఏ) రూపొందించిన ప్రకటన! భద్రతా ఆందోళనలతో పీఐఏపై విధించిన నిషేధాన్ని నాలుగేళ్ల అనంతరం ఇటీవలే యూరోపియన్ యూనియన్ తొలగించింది. దాంతో పాక్ నుంచి యూరప్కు విమాన సర్విసులు తిరిగి మొదలయ్యాయి. దీనికి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించే ప్రయత్నాల్లో భాగంగా పీఐఏ చేసిన ప్రయత్నమిది! కాకపోతే ప్రకటనలో పీఐఏ విమానం నేరుగా పారిస్లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్పైకి దూసుకెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. పైగా, ‘పారిస్! ఈ రోజే మేమొచ్చేస్తున్నాం!’అంటూ క్యాప్షన్ కూడా జోడించారు!! అలా అచ్చం అమెరికాపై ఉగ్ర దాడిని గుర్తుకు తెస్తుండటంతో పీఏఐ ప్రకటన పూర్తిగా బెడిసికొట్టింది. యాడ్ను 9/11 ఉగ్ర దాడితో పోలుస్తూ నెటిజన్లంతా తీవ్రంగా ఎద్దేవా చేస్తున్నారు. దీనిపై పుట్టుకొచ్చిన మీమ్లు సోషల్ మీడియాలో రోజంతా వైరలయ్యాయి. సరదా కామెంట్లు, వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తుతున్నాయి. పీఐఏకు కొత్త గ్రాఫిక్ డిజైనర్ చాలా అవసరమంటూ రాజకీయ విశ్లేషకుడు ఇయాన్ బ్రెమర్ చెణుకులు విసిరారు. పార్లమెంటులోనూ ప్రస్తావన! యాడ్ ఉదంతం అంతర్జాతీయంగా పరువు తీయడంతో తలపట్టుకోవడం పాక్ ప్రభుత్వం వంతయింది. ఇది మూర్ఖత్వానికి పరాకష్ట అంటూ ప్రధాని షహబాజ్ షరీఫ్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు కూడా ఆదేశించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు. పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇసాక్ దార్ అయితే ఈ అంశాన్ని ఏకంగా పార్లమెంటులోనే ప్రస్తావించారు. ‘ఫొటోయే చాలా అభ్యంతరకరం మొర్రో అంటే, క్యాప్షన్ మరింత దారుణంగా ఉంది’అంటూ వాపోయారు. ‘‘ప్రధాని కూడా దీనిపై చాల ఆగ్రహంగా ఉన్నారు. ఈ ప్రకటనను ఎవరు అనుమతించారో విచారణలో తేలుతుంది. వారిపై కఠిన చర్యలు తప్పవు’’అని చెప్పుకొచ్చారు. న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్పై 2001లో జరిగిన ఉగ్ర దాడిలో 3,000 మందికి పైగా మరణించడం తెలిసిందే. విమానాలను హైజాక్ చేసిన ఉగ్రవాదులు జంట టవర్లను వాటితో ఢీకొట్టారు. దాంతో టవర్లు నేలమట్టమయ్యాయి. తొలిసారేమీ కాదు అర్థంపర్థం లేని ప్రకటనతో అభాసుపాలు కావడం పీఐఏకు కొత్తేమీ కాదు. 2016లో ఇస్లామాబాద్ విమానాశ్రయంలోనే గ్రౌండ్ స్టాఫ్ మేకను బలివ్వడం అంతర్జాతీయంగా పతాక శీర్షికలకెక్కింది. అంతకుముందు 1979లో ఏకంగా పాక్కు చెందిన బోయింగ్ 747 విమానం నేరుగా న్యూయార్క్ జంట టవర్లపైకి దూసుకెళ్తున్నట్టుగా పీఐఏ యాడ్ రూపొందించింది. అది తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ గతానుభవాల నుంచి పీఐఏ ఏమీ నేర్చుకోలేదని తాజాగా రుజువైందని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పీఐఏ గ్రాఫిక్స్ హెడ్కు చరిత్రకు సంబంధించి క్రాష్ కోర్స్ చేయిస్తే మేలంటూ సలహాలిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రివైండ్ 2024: ప్రపంచం ఓటేసింది..
అత్యధిక దేశాల్లో ఎన్నికలు జరిగిన సంవత్సరంగా 2024 చరిత్రలో నిలిచిపోనుంది. అమెరికా నుంచి భారత్ దాకా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 73 దేశాలు ఓట్ల పండుగ జరుపుకోవడం విశేషం. 27 సభ్య దేశాలున్న యూరోపియన్ యూనియన్కు జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు వీటికి అదనం! ఈ దేశాల్లో దాదాపు 400 కోట్ల పై చిలుకు జనాభా ఉంది. అంటే ప్రపంచ జనాభాలో దాదాపుగా సగం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ఏడాది ఎన్నికల క్రతువులో పాల్గొన్నారు. వీటిలో చాలా ఎన్నికలు ఓటర్ల పరిణతికి అద్దం పట్టాయి. ఒక్కో దేశంలో ఒక్కోలా ప్రజలు తీర్పు వెలువరించడం విశేషం. పలు ఫలితాలు ఊహించినట్టు రాగా కొన్ని మాత్రం అనూహ్యాలతో ఆశ్చర్యపరిచాయి. అధికార పార్టీల అక్రమాల నడుమ ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేసినవీ ఉన్నాయి... భారత ఓటర్ల పరిణతి భారత్లో సాధారణ ఎన్నికలు ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రజాస్వామిక క్రతువుగా ఎప్పుడో రికార్డు సృష్టించాయి. ఇంతటి బృహత్తర కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ లేకుండా ప్రశాంతంగా జరిగే తీరు చూసి ప్రపంచమంతా ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే ఉంటుంది. ఈసారి కూడా అందుకు తగ్గట్టే ఏప్రిల్ నుంచి ఆరు వారాల వ్యవధిలో ఏడు విడతల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 64.64 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. ఈసారి ఏకంగా ‘400కు మించి’అన్న బీజేపీ చివరికి మెజారిటీకీ కాస్త తక్కువగా 240 లోక్సభ స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలా ఈసారి ఫలితాలు కూడా అందరినీ ఆశ్చర్యపరచడమే గాక భారత ఓటర్ల పరిణతికి అద్దం పట్టాయి.ట్రంప్.. తగ్గేదేలే...! నానారకాల వాదాలతో విడిపోయిన అమెరికాలో ఈసారి జరిగిన అధ్యక్ష ఎన్నికలు ప్రపంచమంతటినీ అమితంగా ఆకర్షించాయి. డొనాల్డ్ ట్రంప్ హవాకు అద్దం పట్టిన ఎన్నికలుగా నిలిచిపోయాయి. రిపబ్లికన్ల అభ్యరి్థత్వం సాధించడం మొదలుకుని ప్రధాన పోరు దాకా ఆద్యంతం ఆయన కనబరిచిన దూకుడు ఓటర్లను అమితంగా ఆకర్షించింది. ఆయన ‘అమెరికా ఫస్ట్’నినాదం రెండోసారి ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తిమంతమైన అధికార పీఠం ఎక్కించింది. డెమొక్రాట్లకు అధ్యక్షుడు జో బైడెనే భారంగా మారారు. సకాలంలో తప్పుకోకపోవడం ద్వారా పార్టీ విజయావకాశాలకు తీవ్రంగా గండి కొట్టిన అప్రతిష్టను మూటగట్టుకున్నారు. భారత మూలాలున్న వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ శాయశక్తులా ప్రయత్నించినా, ఆమెదే పైచేయి అని ప్రధాన మీడియా ఎంతగా హోరెత్తించినా ట్రంప్ ‘తగ్గేదే లే’అన్నారు. 538 ఎలక్టోరల్ ఓట్లలో ఏకంగా 312 ఓట్లను ఒడిసిపట్టి భారీ మెజారిటీతో విజయ దరహాసం చేశారు. రిషికి ఓటమి సమస్యలతో సతమతమవుతున్న బ్రిటన్ ప్రజలు తమ ఆగ్రహమంతటినీ అధికార కన్జర్వేటివ్ పార్టీపై చూపించారు. ఆ పార్టీ 14 ఏళ్ల ఏలుబడికి తెర దించారు. భారత మూలాలున్న తొలి బ్రిటన్ ప్రధానిగా చరిత్ర సృష్టించిన రిషి సునాక్ సారథ్యంలో కన్జర్వేటివ్లు దారుణ ఓటమి మూటగట్టుకున్నారు. లేబర్ పార్టీ నేత కియర్స్టార్మర్కు జనం పట్టం కట్టారు.పాక్లో ప్రహసనం పాకిస్తాన్లో ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలు అత్యంత వివాదాస్పదంగా నిలిచాయి. ప్రధాని షహబాజ్ షరీఫ్ కుటుంబ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్–ఎన్) ఆద్యంతం ఎన్నికల అక్రమాలకు పాల్పడిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్ని చేసినా జైలుపాలైన ఇమ్రా న్ఖాన్ ఆధ్వర్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ (పీటీఐ)ను అడ్డుకోలేకపోయింది. పీటీఐ గుర్తింపునే రద్దు చేసినా స్వతంత్రులుగానే నిలబడి అన్ని పారీ్టల కంటే ఎక్కువ సీట్లు నెగ్గి సత్తా చాటారు. దాంతో నానా పారీ్టలను కలుపుకుని షహబాజ్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచి్చంది. లంకలో నవోదయం : కల్లోల శ్రీలంకలో సుదీర్ఘ వాయిదాల తర్వాత ఎట్టకేలకు నవంబర్లో జరిగిన ఎన్నికల్లో వామపక్షవాది అనూర కుమార దిస్సనాయకే సాధించిన విజయం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దేశ దుస్థితికి ప్రధాన కారకులని భావించిన రాజపక్స కుటుంబాన్ని జనం రాజకీయంగా సమాధి చేశారు. పుతిన్ ఐదోసారి చెప్పుకోదగ్గ ప్రత్యర్థే లేకుండా జరిగిన ఎన్నికల్లో రష్యాలో పుతిన్ రికార్డు స్థాయిలో ఐదోసారి అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గారు. అది కూడా ఏకంగా 87 శాతం ఓట్లు సాధించారు. సోవియట్ అనంతర కాలంలో రష్యాలో ఇదే అత్యధిక మెజారిటీ. పుతిన్కు ప్రధాన అడ్డంకిగా మారడం ఖాయమని భావించిన విపక్ష నేత అలెక్సీ నావల్సీ ఎన్నికలకు ముందు జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించడం పెను దుమారమే రేపింది. వెనెజువెలాలో అధ్యక్షుడు నికొలస్ మదురో విజయమూ వివాదాస్పదమైంది. పారిపోయిన నేతలుపొరుగు దేశం బంగ్లాదేశ్లో అనూ హ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అది కూడా జనవరిలో సాధారణ ఎన్నికలు ముగిసి షేక్ హసీనా రికార్డు స్థాయిలో ఐదోసారి ప్రధాని కావడం ద్వారా అధికారాన్ని నిలబెట్టు్టకున్న ఐదు నెలలకే! అజ్ఞాత శక్తి కనుసన్నల్లో సాగినట్టు కని్పంచిన ‘ప్రజా ఉద్యమం’దెబ్బకు ఆమె పదవీచ్యుతురాలయ్యారు. అధికార నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టడంతో దాదాపుగా కట్టుబట్టలతో ఉన్నపళంగా దేశం వీడి భారత్లో రాజకీయ ఆశ్రయం పొందారు. నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక సర్కా రు కొలువుదీరింది. నాడు మొదలైన అల్లర్లు, అరాచకాలు బంగ్లాలో నేటికీ కొనసాగుతున్నా యి. హిందువులతో పాటు మైనారిటీల భద్రతను ప్రమాదంలో పడేశాయి. అసద్లకు అల్విదా సిరియాలో అసద్ల 50 ఏళ్ల కుటుంబ పాలనకు తిరుగుబాటుదారులు డిసెంబర్లో తెర దించారు. అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కుటుంబంతో పాటు రష్యాకు పారిపోయారు. అలా నియంతృత్వ పాలనకు తెర పడ్డా దేశం మాత్రం అనిశ్చితితో కూరుకుపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈయూలో చేరిక అంశం వాయిదా
టిబిలిసీ: యురోపియన్ యూనియన్(ఈయూ)లో జార్జియా చేరే అంశాన్ని నాలుగేళ్లపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రధాని ప్రకటించడంతో.. దేశంలో ఆగ్రహం వెల్లువెత్తింది. ప్రతిపక్షాలు పార్లమెంటును బహిష్కరించాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈయూ, జార్జియన్ జెండాలను ప్రదర్శిస్తూ పార్లమెంట్ వెలుపల ర్యాలీ నిర్వహించారు. రాజధాని టిబిలిసీ ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు శుక్రవారం నిరసనకారులపై బాష్పవాయువు, జలఫిరంగులను ప్రయోగించారు. కూటమి సిఫార్సులను నెరవేర్చాలనే షరతుతో ఈయూ 2023 డిసెంబరులో జార్జియాకు అభ్యర్థి హోదాను ఇచ్చింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ‘విదేశీ ప్రభావ’చట్టాన్ని ఆమోదించిన తరువాత దాని విలీనాన్ని నిలిపివేసింది. ఆర్థిక మద్దతును కూడా తగ్గించింది. ఈ నేపథ్యంలో జార్జియాలో అక్టోబర్ 26న ఎన్నికలు జరిగాయి. వీటిని యురోపియన్ యూనియన్లో చేరాలన్న దేశ ఆకాంక్షలకు రెఫరెండంగా భావించారు. అధికార జార్జియన్ డ్రీమ్ పార్టీనే ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే జార్జియాను తన అదీనంలోనే ఉంచుకోవాలనే రష్యా ప్రభావంతో ఓటింగ్లో రిగ్గింగ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. డబ్బు ప్రవాహం, డబుల్ ఓటింగ్, హింసాత్మక వాతావరణంలో ఓటింగ్ జరిగిందని యూరోపియన్ ఎన్నికల పరిశీలకులు సైతం తెలిపారు. అంతకుముందు, జార్జియన్ పార్లమెంటరీ ఎన్నికలు నిష్పాక్షికంగా జరగలేదని యురోపియన్ పార్లమెంటు గత నెలలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనికి అధికార జార్జియన్ డ్రీమ్ పార్టీదే పూర్తి బాధ్యతని తెలిపింది. ఏడాదిలోగా పార్లమెంటరీ ఓటింగ్ను పునఃసమీక్షించాలని, జార్జియాపై ఆంక్షలు విధించాలని, ప్రభుత్వంతో అధికారిక సంబంధాలను పరిమితం చేయాలని సభ్యులు ఈయూకు పిలుపునిచ్చారు. ఈయూ ఆరోపణలను జార్జియా ఖండించింది. ఇది బ్లాక్మెయిల్ రాజకీయాలని, జార్జియాను శాసించే అధికారం ఎవ్వరికీ ఇవ్వబోమని ప్రధాని ప్రకటించారు. అంతేకాదు.. యురోపియన్ యూనియన్ దిశగా మా పంథాను కొనసాగిస్తామని తెలిపారు. అయితే 2028 చివరివరకు చర్చలను ఎజెండాలో ఉంచబోమని ప్రధాని కొబాఖిడ్జే గురువారం చెప్పారు. ఈయూ నుంచి ఎలాంటి బడ్జెట్ గ్రాంట్లను తీసుకోబోమని తెలిపారు. ప్రధాని ప్రకటన తర్వాత వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. టిబిలిసీలోని పార్లమెంటు భవనం ఎదుట ర్యాలీ నిర్వహించారు. ఇతర నగరాల్లోనూ ప్రదర్శనలు నిర్వహించారు. జార్జియన్ డ్రీమ్పార్టీ నిరంకుశంగా మారి మాస్కో వైపు మొగ్గు చూపుతోందని విమర్శకులు అంటున్నారు. అధ్యక్షుడు సలోమ్ జౌరాబిచి్వలి అధికారిక ఫలితాలను తిరస్కరించారు. పార్లమెంటు చట్టబద్ధతను గుర్తించడానికి నిరాకరించారు. వచ్చే నెలలో అధ్యక్షుడి ఆరేళ్ల పదవీకాలం ముగియనుంది.. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. ఎన్నికలను దేశాన్ని ఐరోపా నుంచి, రష్యా వైపు తీసుకెళ్లేందుకు జరిగిన ‘తిరుగుబాటు’గా అభివరి్ణంచారు. దేశ భవిష్యత్తుపై పాలకపక్షం యుద్ధం చేస్తోందని ఆరోపించారు. -
యూఏఈ వీసా ఆన్ అరైవల్.. షరతులు వర్తిస్తాయి
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)సందర్శించాలనుకునే భారతీయులకు శుభవార్త. యూఏఈ ప్రభుత్వం భారత జాతీయుల కోసం నూతనంగా వీసా ఆన్ అరైవల్ విధానాన్ని ప్రకటించింది. అయితే, ఇందుకు ఓ షరతు విధించింది. అమెరికా, యూకే, ఇతర ఏదైనా యూరోపియన్ యూనియన్ దేశం శాశ్వత నివాస కార్డు లేదా వీసా ఉన్న వ్యక్తులే వీసా ఆన్ అరైవల్కు అర్హులు. ఈ విధానం ద్వారా యూఏఈలో అడుగు పెట్టిన వెంటనే వీరికి 14 రోజుల వీసా లభిస్తుంది. అవసరమైన ఫీజు చెల్లించిన పక్షంలో మరో 60 రోజుల వరకు దీనిని పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇందుకుగాను..అమెరికా వీసా, నివాస కార్డు లేక గ్రీన్ కార్డు ఉన్న వారు.. ఏదేని యూరోపియన్ యూనియన్ దేశం లేక యునైటెడ్ కింగ్డమ్ వీసా లేక నివాస ధ్రువీకరణ కార్డు ఉన్నవారు అర్హులు. కనీసం ఆరు నెలల వ్యాలిడిటీ ఉన్న పాస్పోర్టు కూడా వీరు చూపాల్సి ఉంటుంది. భారత్–యూఏఈల బంధం బలపడుతున్న వేళ ఈ నూతన విధానం అమల్లోకి రావడం విశేషం. యూఏఈలో ప్రస్తుతం 35 లక్షల మంది భారతీయులు ఉంటున్నారు. -
ఫ్రాన్స్ ప్రధానిగా మైకేల్ బార్నియర్
పారిస్: ఫ్రాన్ నూతన ప్రధాని మైకేల్ బార్నియర్ను దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ గురువారం నియమించారు. బ్రెగ్జిట్ చర్చల్లో యూరోపియన్ యూనియన్కు 73 ఏళ్ల బార్నియర్ ప్రాతినిధ్యం వహించారు. హంగ్ పార్లమెంటు ఏర్పడటం వామపక్షాలు అతిపెద్ద గ్రూపుగా అవతరించడంతో ప్రభుత్వం ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడింది. ఎన్నికల్లో ఓటమితో గాబ్రియెల్ అట్టల్ జూలై 16న ప్రధానిగా రాజీనామా చేసినా ఒలింపిక్స్ క్రీడల దృష్ట్యా మాక్రాన్ ఆయన్నే తాత్కాలిక ప్రధానిగా కొనసాగించారు. లెఫ్ట్ కూటమి ఇదివరకు ఒకరిని ప్రధానిగా ప్రతిపాదించగా మాక్రాన్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో అందరినీ కలుపుకొని వెళ్లి ప్రభుత్వాన్ని నడపగల అభ్యర్థి కోసం మాక్రాన్ శిబిరం అన్వేíÙంచింది. చివరకు బార్నియర్ను ఎంపిక చేసింది. ‘దేశానికి, ఫ్రెంచ్ ప్రజలకు సేవ చేయడానికి ఏకీకృత ప్రభుత్వాన్ని నడిపే బాధ్యతను బార్నియర్కు అప్పగించాం’ అని మాక్రాన్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బార్నియర్ గతంలో ఫ్రాన్స్ విదేశాంగ మంత్రిగా, పర్యావరణ, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. యూరోపియన్ యూనియన్ కమిషనర్గా రెండు పర్యాయాలు చేశారు. -
ఈయూ అనుభవం నేర్పే పాఠాలు
జన్యుమార్పిడి(జీఎం) పంటలపై కేంద్రప్రభుత్వం ఆమోదయోగ్యమైన విధానాన్ని తేవాలని సుప్రీంకోర్టు కోరింది. జీఎం పంటలను చాలా రాష్ట్రాల వ్యవ సాయ సంఘ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. మనుషులు, జంతువులు, మొక్కల మీద వీటి ప్రతికూల ప్రభావాలపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే యూరోపియన్ యూనియన్ దేశాలు తీవ్రమైన నియంత్రణలను రూపొందించాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ణయం, జీఎం జనరే టర్ల ఒత్తిడి ఉన్నప్పటికీ, ఈ పంటలను సులభంగా ఆమోదించడానికి దూరంగా ఉన్నాయి. ఒకనాటి హరిత విప్లవం ఫలితంగా ఉత్పాదకత పెరిగింది. కానీ ప్రతికూల ప్రభావాలు లేకుండా పోలేదు. అందుకే జీఎం సాంకేతికతకు సంబంధించిన ప్రభావాలను సమగ్రంగా అంచనా వేయాలి.జన్యుమార్పిడి పంటలపై ఒక జాతీయ విధానాన్ని రూపొందించాలని పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖను ఇటీవల సుప్రీంకోర్టు కోరింది. గత రెండు దశాబ్దాలుగా దేశంలో జన్యుమార్పిడి పంటల ప్రవేశాన్ని సంశయవాదులు అడ్డుకోగలిగారు. పర్యావరణం, వ్యవ సాయ వైవిధ్యం, మానవులు, జంతువుల ఆరోగ్యంపై జన్యుమార్పిడి పంటల ప్రభావాలపై 18 రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ సంఘాల నాయకులు గత వారం ఒక జాతీయ సదస్సును నిర్వహించారు. జన్యుమార్పిడి పంటలను వారు ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తున్నారు.జన్యుమార్పిడి జీవులకు సంబంధించి తగిన ఆమోదయోగ్యమైన విధానాన్ని రూపొందించడానికి భారతదేశం పోరాడుతోంది. యూరో పియన్ యూనియన్(ఈయూ) తన సభ్య దేశాలలో జన్యుమార్పిడి ఉత్పత్తులు, విత్తనాల ప్రవేశాన్ని నియంత్రించడానికి చాలా కాలం కుస్తీ పట్టింది. సమగ్రమైనది కానప్పటికీ, మంచి విధానాన్నిరూపొందించగలిగింది. ఇది భారత్కు పాఠాలను అందిస్తుంది.ప్రపంచం ఇప్పటివరకు మూడు ‘హరిత విప్లవాలను’ చూసిందని వ్యవసాయ వృద్ధి చరిత్ర చెబుతోంది. మొదటిది 1930లలో యూరప్, ఉత్తర అమెరికాలో ప్రారంభమైంది. ఎరువులు, పురుగు మందులు, యంత్రాలు, వ్యవసాయ నిర్వహణను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా ఇది మొక్కజొన్న, ఇతర సమశీతోష్ణ వాతా వరణ పంటలలో త్వరిత దిగుబడిని పెంచింది. రెండో హరిత విప్లవం కొన్ని భారతీయ రాష్ట్రాలతోపాటు 1960లు, 1970లలో చోటు చేసు కుంది. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ఉష్ణమండలంలోపండించే పంటలకు అదే విధమైన సాంకేతికతను బదలాయించింది. స్థానిక పరిశోధనలను ఉపయోగించడం ద్వారా ఈ సాంకేతికతలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రూపుదిద్దుకున్నాయి.జన్యుమార్పిడి ఉత్పత్తులు, ముఖ్యంగా వ్యవసాయంలో జన్యు ఇంజినీరింగ్ ఉపయోగించి ఉత్పత్తి చేసిన విత్తనాలు 1970లలో కని పించాయి. వీటిని 1990లలో ప్రధానంగా ఉత్తర అమెరికాలో వాణిజ్యీ కరించారు. ఈ సాంకేతికతను ప్రబోధించినవారు వ్యవసాయ ఉత్పాద కతలో ఇది మరొక అపారమైన పెరుగుదలకు దారితీస్తుందనీ, ఆహార సరఫరాలో గుణాత్మక మెరుగుదలను అందజేస్తుందనీ పేర్కొన్నారు. మొదటి రెండు హరిత విప్లవాలకూ, మూడవ దానికీ మధ్య ఉన్న పెద్ద తేడా ఏమిటంటే, నిశ్చయాత్మకమైన కుతూహలంతో దీనిని ప్రపంచం స్వీకరించలేదు. మానవులు, జంతువులు, మొక్కల ఆరోగ్యంపై ఈ సాంకేతికతలోని ప్రతికూల ప్రభావాలపై ఎన్నో సందేహాలు ఉన్నాయి.అందుకే వీటి ఉత్పత్తులపై యూరోపియన్ యూనియన్ దేశాలు తీవ్రమైన నియంత్రణలను రూపొందించాయి. అయితే అమెరికా, కెనడా, అర్జెంటీనా, బ్రెజిల్ చాలా వరకు వ్యవసాయ బయోటెక్ అను వర్తనాలను అనుమతించాయి. భారత్తో సహా చాలా ఇతర దేశాలు ఈ విషయంలో సరైన మార్గం కోసం పోరాడుతున్నాయి.యూరోపియన్ దేశాలు ఈ సాంకేతికతను మొట్టమొదట గట్టిగా వ్యతిరేకించి, తర్వాత తీవ్రమైన నియంత్రణ విధానాన్ని అనుసరించాయి. చాలా యూరోపియన్ ప్రభుత్వాలు, యూరోపియన్ యూని యన్ కూడా జన్యుమార్పిడి జీవులతో ముడిపడి ఉన్న ప్రమాదాల అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడా నికి బదులుగా ముందు జాగ్రత్త విధానాన్ని స్వీకరించాయి.ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల ప్రకారం, ‘అదే’ తరహా ఉత్పత్తుల దిగుమతిని పరిమితం చేయాలంటే, బలమైన శాస్త్రీయ సాక్ష్యం అవసరమని అమెరికా వాదిస్తోంది (అదే తరహా ఉత్పత్తిఅంటే నేరుగా పోటీ పడే లేదా ప్రత్యామ్నాయ ఉత్పత్తి). దిగుమతి దారులు లేదా దిగుమతి చేసుకునే దేశాలు తప్పనిసరిగా జీఎం విత్తనం లేదా ఉత్పత్తి మానవ లేదా జంతువు లేదా మొక్కల ఆరోగ్యానికి సుర క్షితం కాదని తిరస్కరించలేని శాస్త్రీయ ఆధారాలను అందించాలి.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, విత్తనం లేదా ఉత్పత్తి ‘సురక్షి తమైనది’ అని రుజువు చేయాల్సిన బాధ్యత జీఎం విత్తన ఉత్పత్తిదారు లపై లేదా దాని ఎగుమతిదారులపై లేదు; అది ‘సురక్షితం కానిది’ అని నిరూపించాల్సిన బాధ్యత దిగుమతిదారులపై ఉంది. మరో మాటలో చెప్పాలంటే, సురక్షితమని నిరూపించడం విక్రేత బాధ్యత కాదు, అది కొనుగోలుదారు బాధ్యత. కాబట్టి, హానికారకం అని రుజువయ్యేంత వరకూ అది సరైనదే అని అన్ని దేశాలూ భావించాల్సి ఉంటుంది. ఈ కారణంగా ప్రపంచ వాణిజ్య సంస్థ ఆమోదించిన స్వేచ్ఛా వాణిజ్య విధానంలో, బలమైన శాస్త్రీయ సాక్ష్యం లేనప్పుడు అమెరికా నుండి జన్యుమార్పిడి దిగుమతులను ఈయూ నియంత్రించలేదు. అయితే అమెరికా దృక్పథంతో విభేదిస్తూ, ఈయూ తన సభ్య దేశాలచే జన్యుమార్పిడి విత్తనాలు/ఉత్పత్తుల దిగుమతిని పరిమితం చేయడానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించింది. ఈ పంట రకాల ఆమోదాన్ని తాత్కాలికంగా నిలుపుదల (1998–2004) చేస్తూ దాని చర్యలను ప్రారంభించింది.ఈ నిలుపుదలను ఆగ్రహించిన అమెరికా, అర్జెంటీనా, కెనడా దేశాలు ఈయూ నియంత్రణ విధానానికి వ్యతిరేకంగా 2003లోప్రపంచ వాణిజ్య సంస్థలో ఒక దావాను ప్రారంభించాయి. ఈయూ విధానం చట్టవిరుద్ధమైన వాణిజ్య పరిమితులను సృష్టిస్తోందని పేర్కొ న్నాయి. దాంతో డబ్ల్యూటీవో వివాద పరిష్కార ప్యానెల్ 2006 సెప్టెంబరులో ఫిర్యాదు చేసిన దేశాలకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. డబ్ల్యూటీవో నిబంధనలకు అనుగుణంగా తన ఆమోద ప్రక్రియను తేవాలని యూరోపియన్ యూనియన్ను కోరింది.డబ్ల్యూటీవో నిర్ణయానికి ముందే యూరోపియన్ యూనియన్ తన విధాన ప్రక్రియను మార్చుకుంది. అయితే అది ఇప్పటికీ సంక్లిష్టంగానే ఉంది. సభ్య దేశాల శాస్త్రీయ సంస్థలతో సన్నిహిత సంప్రదింపుల ద్వారా నష్టంపై అంచనా వేయడం జరిగింది. ఈ అభిప్రాయాన్ని బహిరంగ సంప్రదింపుల కోసం ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఈయూ నిబంధనల ప్రకారం, అనేక రకాల కారణాల ఆధారంగాపంట సాగును నిలిపివేయడానికీ, నిషేధించడానికీ లేదా పరిమితం చేయడానికీ సభ్య దేశాలకు హక్కు ఉంటుంది. పర్యావరణం, వ్యవ సాయ విధాన లక్ష్యాలు, సామాజిక–ఆర్థిక ప్రభావం వంటివి కారణా లుగా చూపొచ్చు. ఫలితంగా, ఐరోపాలో వాణిజ్యీకరణ కోసం చాలా తక్కువ వ్యవసాయ బయోటెక్ అప్లికేషన్లను ఆమోదించారు.ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ, అమెరికా ప్రభుత్వం నుండి స్థిరమైన ఒత్తిడి ఉన్నప్పటికీ, ఈయూ సభ్యదేశాలు, ఇతర యూరప్ దేశాలు జన్యుమార్పిడి పంటలను, ముఖ్యంగా ఆహార గొలుసులో భాగమైన వాటిని సులభంగా ఆమోదించడానికి నిరంతరం దూరంగా ఉన్నాయి. ఈయూ, ఇతర దేశాల విముఖత అనేది ప్రభుత్వాలపై డబ్ల్యూటీవో, జన్యుమార్పిడీ టెక్నాలజీ జనరేటర్ల ఒత్తిడిని బలహీనపరిచింది. ఇది భారతదేశం తన స్వతంత్ర మార్గాన్ని ఎంచుకోవడానికి ఎంతో సాయపడుతుంది.జన్యుమార్పిడి జీవులపై సముచితమైన, ఆమోదయోగ్యమైన విధానాన్ని తీసుకురావాల్సిన బాధ్యతను సుప్రీంకోర్టు సరిగ్గానేకేంద్రానికి అప్పగించింది. భారతీయ విధాన రూపకర్తలు తప్పనిస రిగా యూరోపియన్ అనుభవాన్ని పరిశీలించాలి. ఇంతకుముందు మనం హరిత విప్లవ సాంకేతికతను అంగీకరించాం. దీని ఫలితంగా వ్యవసాయ ఉత్పాదకత పెరిగింది; కానీ కొన్ని దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలు లేకుండా పోలేదు. అందుకే ఈసారి, జన్యుమార్పిడిసాంకేతికతకు సంబంధించిన సానుకూల, ప్రతికూల ప్రభావాలను సమగ్రంగా అంచనా వేయాలి.- వ్యాసకర్త నార్తర్న్ బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీమాజీ ప్రొఫెసర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- అమర్జీత్ భుల్లర్ -
ఫ్రాన్స్ గమ్యం ఎటు?
అన్ని అంచనాలనూ తలకిందులు చేస్తూ ఆదివారం రెండో రౌండ్ ఎన్నికల్లో వోటర్లు ఇచ్చిన తీర్పు పర్యవసానంగా ఫ్రాన్స్లో సందిగ్ధత నెలకొంది. తొలి రౌండులో స్పష్టంగా మితవాదం వైపు మొగ్గినట్టు కనిపించిన వోటర్లు హఠాత్తుగా దారి మార్చి ఇతర పక్షాలను తలకెత్తుకున్న వైనం బహుశా దేశ చరిత్రలో కనీవినీ ఎరుగనిది. 577 మంది సభ్యులుండే దిగువసభ ‘అసెంబ్లీ నేషనల్’లో ప్రభుత్వం ఏర్పాటుచేసే పక్షానికి కనీసం 289 స్థానాలు రావాలి. కానీ తాజా ఫలితాల తర్వాత వామపక్ష న్యూ పాపులర్ ఫ్రంట్ 182 (తొలి రౌండ్లో రెండో స్థానం) సీట్లతో అగ్రభాగాన ఉండగా అధ్యక్షుడు ఇమ్మానియెల్ మేక్రాన్కు చెందిన ఎన్సెంబుల్కు 168 (తొలి రౌండ్లో మూడోస్థానం) వచ్చాయి. తొలి రౌండ్లో 32 శాతం వోట్లు సాధించుకుని అధికార పీఠానికి చేరువగా వెళ్లినట్టు కనబడిన తీవ్ర మితవాద పక్షం నేషనల్ ర్యాలీ (ఆర్ఎన్) రెండో రౌండ్లో సీట్లపరంగా 143తో మూడో స్థానానికి పరిమితమైంది. ఆర్ఎన్ పార్టీ తొలి రౌండ్లో అగ్రభాగాన ఉండటంతో ఇతర పక్షాల వోటర్లు అప్రమత్తమయ్యారు. మితవాద పక్షానికి పాలనాపగ్గాలు దక్కనీయరాదన్న కృతనిశ్చయంతో అటు మధ్యేవాద పక్షానికీ, ఇటు వామపక్షానికీ వోటేశారు. తొలి దశలో 65 శాతం, రెండో దశలో 63 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1981 తర్వాత ఈ స్థాయి వోటింగ్ ఎప్పుడూ లేదు. ఆర్ఎన్ గెలుపు ఖాయమని తేలినచోట్ల వామపక్ష కూటమి, మధ్యేవాద కూటమి అభ్యర్థులు స్వచ్ఛందంగా పోటీ నుంచి వైదొలగి ముఖాముఖి పోటీకి మార్గం సుగమం చేశారు. కనీసం 200 స్థానాల్లో బహుముఖ పోటీ బెడద తప్పింది. దీని ప్రభావం ఎంతగా ఉందంటే... ఫ్రాన్స్ పశ్చిమ ప్రాంతం లా సార్ద్లోని అయిదు స్థానాల్లో ఆర్ఎన్ తొలి రౌండ్లో నాలుగు స్థానాల్లో ముందంజలో ఉంది. తీరా ముఖాముఖి పోటీలో ఆ పార్టీకి ఒక్కటీ దక్కలేదు.రాజకీయ అస్థిరత ఫ్రాన్స్కు కొత్తగాదు. 1946–’58 మధ్య పన్నెండేళ్లలో ఆ దేశం 22 ప్రభుత్వాలను చూసింది. అయితే అది రెండో ప్రపంచ యుద్ధం ముగిసి ప్రచ్ఛన్న యుద్ధ దశ మొదలైన తొలినాళ్ల కాలం. భవిష్యత్తులో మరెప్పుడూ దేశం సంకీర్ణాల జోలికి పోకుండా నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు చార్లెస్ డీగాల్ నూతన రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇప్పటికీ అదే అమల్లోవుంది. ఎన్నికల్లో భిన్నపక్షాలు కూటమిగా పోటీ చేయటం, నెగ్గితే కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేయటం ఫ్రాన్స్లో సాధారణమే. కానీ కూటమిలో అధిక స్థానాలొచ్చిన పార్టీయే తన విధానాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడుపుతుంది. ఇప్పుడు ఏర్పడిన పరిస్థితి భిన్నమైనది. ఒక పార్టీగా అత్యధిక స్థానాలు గెల్చుకున్నది ఆర్ఎన్ ఒక్కటే. చిత్రమేమంటే అటు ఆర్ఎన్లోనూ, ఇటు న్యూ పాపులర్ ఫ్రంట్లోనూ మేక్రాన్పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయలేని స్థితిలో పాలనలో పాలుపంచుకోవటం వృథా అని ఇరుపక్షాల నేతలూ భావిస్తున్నారు. ఫ్రాన్స్ ప్రజల్లో మేక్రాన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన పార్టీతో కలిస్తే ఆ చీడ తమకూ అంటుతుందన్న భయాందోళనలు ఇరుపక్షాల్లోనూ ఉన్నాయి. అందుకే విస్తృత మధ్యేవాద కూటమిని ఏర్పాటు చేయాలన్న మేక్రాన్ ప్రయత్నం ఫలించకపోవచ్చన్నది విశ్లేషకుల మాట. ఈనెల 26న ప్యారిస్ ప్రధాన వేదికగా ప్రపంచ క్రీడా సంరంభం ఒలింపిక్స్ ఘట్టం ప్రారంభం కాబోతోంది. 16 నగరాల్లో ఆగస్టు 11 వరకూ వివిధ ఈవెంట్లు జరగబోతున్నాయి. ఈ దశలో దేశంలో రాజకీయ అస్థిరత అలుముకుంటే ఎలాగన్న ఆందోళన అన్ని పక్షాల్లోనూ ఉంది. తమ కూటమికి అత్యధిక స్థానాలొచ్చాయి గనుక ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే వామపక్ష అన్బౌడ్ నేత జీన్ లక్ మెలింకోన్ కోరుతున్నారు. మితవాద ఆర్ఎన్ పార్టీని రానీయకూడదన్న పట్టుదలతో సోషలిస్టులు, వివిధ వామపక్షాలూ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి తప్ప వాటి మధ్య లుకలుకలు తక్కువేమీ కాదు. అన్బౌడ్ పార్టీ భావసారూప్య పక్షాలన్నిటినీ ఒక గొడుగు కిందకు తెచ్చిందన్న మాటేగానీ ఆ పార్టీకి తలొగ్గి ఇతర పక్షాలు పనిచేస్తాయా అన్నది సందేహమే. సుస్థిర ప్రభుత్వాన్ని అందించలేకపోతే మళ్లీ ఎన్నికలకు వెళ్లకతప్పదు. అదే జరిగితే వామపక్ష కూటమికి ఇప్పుడు దక్కిన ఆదరణ ఆవిరయ్యే ప్రమాదం, ఆర్ఎన్ మరింత పుంజుకునే అవకాశం ఉంటాయి. మెలింకోన్ తీరుపై సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. ఆయన దుందుడుకు విధానాలు ఇంటా బయటా సమస్యాత్మకం కావొచ్చని, ముఖ్యంగా యూరప్ యూనియన్ (ఈయూ)తో పేచీలు తేవచ్చునని భయాందోళనలున్నాయి. ఈయూలో జర్మనీ తర్వాత రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఫ్రాన్స్దే. నాజీల దురాక్రమణతో సంక్షోభాన్నెదుర్కొన్న ఫ్రాన్స్లో మితవాదపక్షానికి ఆది నుంచీ ఆదరణ లేదు. కానీ ఆర్ఎన్ అధినేత మెరిన్ లీ పెన్ తెలివిగా జాత్యహంకారం, యూదు వ్యతిరేకత వంటి అంశాల్లో పార్టీ విధానాలను సవరించుకున్నారు. విద్వేష ప్రసంగాలతో తరచు జైలుపాలైన తన తండ్రి మెరీ లీపెన్ను పార్టీ నుంచి సాగనంపారు. గాజాలో ఇజ్రాయెల్ దురాక్రమణ యుద్ధాన్ని కూడా వెనకేసుకొచ్చారు. ఫ్రాన్స్ రాజ్యాంగంలోని 12వ అధికరణం కింద కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు నిర్దిష్ట వ్యవధంటూ లేదు. అలాగని దీర్ఘకాలం ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొనసాగనిస్తే అది మేక్రాన్కు రాజకీయంగా తీవ్ర నష్టం తీసుకొస్తుంది. మొత్తానికి మూడు పక్షాల్లోనూ ఎవరూ మరొకరితో కలవడానికి ఇష్టపడని వర్తమాన పరిస్థితుల్లో మేక్రాన్ ఏం చేస్తారన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఏ ప్రభుత్వం ఏర్పడినా అవిశ్వాస తీర్మాన గండం తప్పదు. మెడపై మితవాద బెడద వేలాడుతున్న తరుణంలో చివరకు ఫ్రాన్స్ గమ్యం ఏమిటన్నది మిలియన్ యూరోల ప్రశ్న! -
ఫ్రాన్స్ పార్లమెంట్ రద్దు
పారిస్: యూరోపియన్ యూనియన్ (ఈయూ) పార్లమెంటరీ ఎన్నికలు పరోక్షంగా ఫ్రాన్స్ పార్లమెంట్ ముందస్తు ఎన్నికలను మోసుకొచ్చాయి. యూరోపియన్ యూనియన్లో మొత్తం 720 సీట్లు ఉండగా 81 సభ్యులను ఫ్రాన్స్ ఎన్నుకోనుంది. ఇందుకోసం జరిగిన ఎన్నికల్లో ఫ్రాన్స్ విపక్ష నేషనల్ర్యాలీ పార్టీకి 32 శాతం ఓట్లు పడొచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్కు చెందిన రనీసాన్స్ పారీ్టకి కేవలం 15 శాతం ఓట్లు పడతాయని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. నిజంగానే ఈ ధోరణి ఇలాగే కొనసాగితే మూడేళ్ల తర్వాత అంటే 2027లో జరగబోయే ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ విపక్ష పార్టీ విజయం సాధించే ప్రమాదముందని దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ భావించారు. ఇందుకు బలం చేకూరుస్తూ ఆయన పార్లమెంట్ను రద్దుచేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. దీంతో వచ్చే 20 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 30న తొలి దశ, జూలై ఏడో తేదీన రెండో దశ పోలింగ్ జరగనుంది. మూడేళ్ల తర్వాత నిర్వహిస్తే ఓడిపోతామని, ప్రజాదరణ తగ్గేలోపు ఇప్పుడే నిర్వహిస్తే తమ రనీసాన్స్ పారీ్టయే గెలుస్తుందన్న అంచనాతో ఆయన ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారని వార్తలొచ్చాయి. సరైన నిర్ణయం తీసుకున్నా: మేక్రాన్ పార్లమెంట్ రద్దు నిర్ణయాన్ని మేక్రాన్ సమరి్థంచుకున్నారు. ‘‘ దేశం కోసం సరైన నిర్ణయం తీసుకున్నా. ఈయూ ఎన్నికల ద్వారా ప్రజలు మా ప్రభుత్వానికి ఏం చెప్పదల్చుకున్నారో అర్థమైంది. ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపకుండా వదిలేయలేను’ అని చెప్పారు. -
USA: రష్యాపై భారీ ఆంక్షలు
వాషింగ్టన్: ఉక్రెయిన్పై యుద్ధానికి తెగబడ్డ రష్యా మీద అమెరికా, యూరోపియన్ యూనియన్ శుక్రవారం మరిన్ని ఆంక్షలకు తెర తీశాయి. ఈసారి కూడా ప్రధానంగా ఆ దేశ ఆర్థిక, రక్షణ, పారిశ్రామిక నెట్వర్కులను లక్ష్యం చేసుకున్నాయి. రష్యా, దాని సన్నిహితులపై ఏకంగా 500పై చిలుకు ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు! మతిలేని హత్యాకాండకు, వినాశనానికి పుతిన్ మూల్యం చెల్లించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. మరోవైపు భారీ ఆయుధాల తయారీ తదితరాలకు ఉపయోగపడే నిషేధిత వస్తువులను రష్యాకు ఎగుమతి చేసిన ఆరోపణలపై పలు విదేశీ కంపెనీలపై కఠిన ఆంక్షలు విధిస్తున్నట్టు ఈయూ సమాఖ్య ప్రకటించింది. నవాల్నీ కుటుంబంతో బైడెన్ భేటీ: అంతకుముందు రష్యా విపక్ష నేత దివంగత అలెక్సీ నవాల్నీ భార్య యూలియా నవాల్నయా, కూతురు దషాతో బైడెన్ భేటీ అయ్యారు. నవాల్నీ మృతి పట్ల దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘నవాల్నీ సాటిలేని ధైర్యశాలి. ఆయన పోరాటాన్ని యూలియా, దషా ముందుకు తీసుకెళ్తారని పూర్తి విశ్వాసముంది’’ అన్నారు. నవాల్నీ మృతదేహానికి గోప్యంగా తక్షణ అంత్యక్రియలు జరిపేందుకు అంగీకరించేలా జైలు అధికారులు తనపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని తల్లి లుడ్మిలా ఆరోపించారు. ఆలస్యమైతే శవం కుళ్లిపోతుందంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. గురువారం కుమారుని మృతదేహాన్ని చూసిన అనంతరం ఆమె ఈ మేరకు వీడియో విడుదల చేశారు. -
Copernicus Climate Change Service: ఏడాదంతా భూతాపం 1.5 డిగ్రీల పెరుగుదల
న్యూఢిల్లీ: కాలుష్యం, భూతాపం కారణంగా భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయన్నది తెలిసిన సంగతే. కానీ, 2023 ఫిబ్రవరి నుంచి 2024 జనవరి దాకా ఏడాదంతా భూసగటు ఉష్ణోగ్రత 1.52 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైనట్లు యూరోపియన్ యూనియన్కు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసు (సీ3ఎస్) గురువారం వెల్లడించింది. 1850–1900 నాటి ఉష్ణోగ్రతల సగటుతో పోలిస్తే ఏడాది పొడవునా 1.52 డిగ్రీలు అధికంగా నమోదు కావడం ఇదే మొదటిసారి అని పేర్కొంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతాయని చెప్పడానికి ఇదొక సంకేతమని తెలియజేసింది. ఈ ఏడాది జనవరి నెల అత్యంత వేడి జనవరిగా రికార్డుకెక్కిందని వివరించింది. 1850–1900 నాటి కంటే ఈ జనవరిలో 1.66 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. వాతావరణంలో ఎల్ నినో పరిస్థితులే ఇందుకు కారణమని అభిప్రాయపడింది. వాతావరణ మార్పులతోపాటు సెంట్రల్ పసిఫిక్ సముద్రంలో ఉపరితల జలాలు వేడెక్కడం వల్ల భూఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని కోపరి్నకస్ క్లైమేట్ చేంజ్ సరీ్వసు స్పష్టం చేసింది. -
ఉక్రెయిన్కు ఈయూ భారీ సాయం
బ్రస్సెల్స్: రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్కు సాయం చేసేందుకు యూరోపియన్ యూనియన్ సిద్ధంగా ఉంటుందని యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మైకేల్ చెప్పారు. గురువారం బ్రస్సెల్స్లో సమావేశమైన ఈయూలోని 27 సభ్య దేశాల నేతలు ఉక్రెయిన్కు 54 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.48 లక్షల కోట్లు)సాయం ప్యాకేజీని అందించేందుకు అంగీకరించినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన తీర్మానంపై కేవలం గంటలోపే చర్చించి ఆమోదించినట్లు వివరించారు. సాయానికి సంబంధించిన తీర్మానాన్ని వీటో చేస్తామంటూ సభ్య దేశం హంగెరీ ప్రధాని విక్టర్ ఓర్బాన్ కొంతకాలం చేస్తున్న హెచ్చరికలను కూడా పట్టించుకోలేదన్నారు. -
మహ్సా అమినికి
స్ట్రాస్బర్గ్(ఫ్రాన్సు): గత ఏడాది ఇరాన్ పోలీస్ కస్టడీలో మృతి చెందిన కుర్దిష్–ఇరాన్ మహిళ మహ్సా అమిని(22)కి యూరోపియన్ యూనియన్ అత్యున్నత మానవ హక్కుల పురస్కారం ప్రకటించింది. మానవహక్కులు, ప్రాథమిక స్వేచ్ఛ కోసం పోరాడే వారికి సఖరోవ్ పురస్కారాన్ని యూరోపియన్ యూనియన్ ఏటా ప్రకటిస్తోంది. డిసెంబర్ 13న జరిగే కార్యక్రమంలో మహ్సా అమిని కుటుంబీకులకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. హిజాబ్ ధరించలేదనే కారణంతో మహ్సా అమినిని నైతిక విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉండగానే ఆమె గత ఏడాది సెప్టెంబర్ 16న మృతి చెందారు. ఇది ప్రభుత్వ హత్యేనంటూ దేశవ్యాప్తంగా కొన్ని నెలలపాటు తీవ్ర ఆందోళనలు కొనసాగాయి. ప్రభుత్వం వాటిని బలప్రయోగంతో అణచివేసింది. గత ఏడాది సఖరోవ్ పురస్కారాన్ని రష్యా దురాక్రమ ణను ఎదురొడ్డి పోరాడుతున్న ఉక్రెయిన్ పౌరులకు ప్రకటించారు. ఈ అవార్డును ఒకప్పటి సోవియెట్ యూనియన్ అసమ్మతి వాది ఆండ్రీ సఖరోవ్ పేరిట 1988లో నెలకొల్పారు. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న సఖరోవ్ 1989లో మరణించారు -
యూరప్ ఎకనమిక్ అవుట్లుక్ అధ్వాన్నం
ఫ్రాంక్ఫర్ట్: యూరోపియన్ యూనియన్ ఈ సంవత్సరం, వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి అంచనాను తగ్గించింది. తీవ్ర ద్రవ్యోల్బణంతో వినియోగదారులు వ్యయాలకు సుముఖత చూపడం లేదని, అధిక వడ్డీ రేట్లు పెట్టుబడికి అవసరమైన రుణాన్ని పరిమితం చేస్తున్నాయని యూరోపియన్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. సంబంధిత వర్గాల కథనం ప్రకారం, ఈయూ ప్రాంతంలో మాంద్యం భయాలు పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలోకి తీసుకురావాలనే లక్ష్యంతో వడ్డీరేట్లు మరింత పెంచాలా? వద్దా? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. తాజా ప్రకటన ప్రకారం, 2023లో యూరో కరెన్సీ వినియోగిస్తున్న 20 దేశాల వృద్ధి రేటు క్రితం అంచనా 1.1 శాతం నుంచి 0.8 శాతానికి తగ్గించడం జరిగింది. వచ్చే ఏడాది విషయంలో ఈ రేటు అంచనా 1.6 శాతం నుంచి 1.3 శాతానికి తగ్గింది. 27 దేశాల ఈయూ విషయంలో ఈ రేటును 2023కు సంబంధించి 1 శాతం నుంచి 0.8 శాతానికి, 2024లో 1.7 శాతం నుంచి 1.4 శాతానికి తగ్గించడం జరిగింది. రష్యా–యుక్రేయిన్ మధ్య ఉద్రిక్తతలు, రష్యా నుంచి క్రూడ్ దిగుమతులపై ఆంక్షలు యూరోపియన్ యూనియన్లో తీవ్ర ద్రవ్యోల్బణానికి దారితీస్తోంది. -
ఇండియా–మిడిల్ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్
న్యూఢిల్లీ: చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కు ధీటుగా, దేశాల మధ్య వేగవంతమైన అనుసంధానమే ధ్యేయంగా భారత్, అమెరికా తదితర దేశాలు ప్రతిష్టాత్మక ఆర్థిక నడవా(ఎకనామిక్ కారిడార్)ను తెరపైకి తీసుకొచ్చాయి. ఇండియా–మిడిల్ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్ నూతన ప్రాజెక్టును భారత్, అమెరికా, సౌదీ అరేబియా, యూఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ దేశాల నేతలు శనివారం సంయుక్తంగా ప్రకటించారు. ఈ మేరకు అవగాహనా ఒప్పందం(ఎంఓయూ)పై వారు సంతకాలు చేశారు. ఈ కారిడార్తో ఆసియా, అరేబియన్ గల్ఫ్, యూరప్ మధ్య భౌతిక అనుసంధానం మాత్రమే కాదు, ఆర్థిక అనుసంధానం సైతం మరింత పెరుగుతుందని నిర్ణయానికొచ్చారు. దేశాల నడుమ అనుసంధానాన్ని ప్రోత్సాహిస్తూనే అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రతను, సార్వ¿ౌమత్వాన్ని తాము గౌరవిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. కనెక్టివిటీని ప్రాంతీయ సరిహద్దుల వరకే పరిమితం చేయాలని తాను అనుకోవడం లేదన్నారు. దేశాల నడుమ పరస్పర నమ్మకం బలోపేతం కావాలంటే అనుసంధానం పెరగడం చాలా కీలకమని స్పష్టం చేశారు. రెండు భాగాలుగా ప్రాజెక్టు ఇండియా–మిడిల్ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్లో రెండు వేర్వేరు కారిడార్లో ఉంటాయి. ఇందులో ఈస్ట్ కారిడార్ ఇండియాను, పశి్చమ ఆసియా/మధ్య ప్రాచ్యాన్ని కలుపుతుంది. ఉత్తర కారిడార్ పశి్చమ ఆసియా/మిడిల్ఈస్ట్ను యూరప్తో అనుసంధానిస్తుంది. సముద్ర మార్గమే కాకుండా రైల్వే లైన్ కూడా ఈ ప్రాజెక్టులో అంతర్భాగమే. ఇదొక సీమాంతర షిప్–టు–రైలు ట్రాన్సిట్ నెట్వర్క్. దీంతో దేశాల నడుమ నమ్మకమైన, చౌకైన రవాణా సాధ్యమవుతుంది. వస్తువులను సులభంగా రవాణా చేయొచ్చు. రైలు మార్గం వెంట డిజిటల్, విద్యుత్ కేబుల్స్, క్లీన్ హైడ్రోజన్ ఎగుమతి కోసం పైపులు ఏర్పాటు చేస్తారు. ఇండియా–మిడిల్ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్ అనేది చరిత్రాత్మకమని ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభివరి్ణంచారంటే దీని ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. -
ఆన్లైన్ దిగ్గజాల కట్టడిపై ఈయూ దృష్టి - ఎక్కువ కానున్న నిఘా!
లండన్: ఆన్లైన్ కంపెనీల గుత్తాధిపత్యాన్ని కట్టడి చేయడంపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కొత్త డిజిటల్ చట్టాల కింద ఆరు కంపెనీలను ఆన్లైన్ ‘గేట్కీపర్స్‘ పరిధిలోకి చేర్చింది. వీటిలో యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా, టిక్టాక్ మాతృ సంస్థ బైట్డ్యాన్స్ ఉన్నాయి. గేట్కీపర్లుగా ఈ సంస్థలపై నిఘా మరింత ఎక్కువగా ఉంటుంది. ఆయా కంపెనీలు డిజిటల్ మార్కెట్స్ చట్టాలను పాటించడం మొదలుపెట్టేందుకు ఆరు నెలల గడువు ఉంటుంది. చట్టం ప్రకారం తమతో పాటు ఇతర కంపెనీలు కూడా తమ తమ ఉత్పత్తులు, సర్వీసుల పనితీరులో గణనీయంగా మార్పులు, చేర్పులు చేయాల్సి రానున్నట్లు గూగుల్ తెలిపింది. కొత్త చట్టం ప్రకారం.. మెసేజింగ్ సేవల సంస్థలు ఒకదానితో మరొకటి కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు టెలిగ్రామ్ లేదా సిగ్నల్ యూజర్లు తమ టెక్ట్స్ లేదా వీడియో ఫైల్స్ను వాట్సాప్ యూజర్లకు కూడా పంపించుకోవచ్చు. ఇక ప్లాట్ఫామ్లు సెర్చి రిజల్ట్లో తమ ఉత్పత్తులకు .. పోటీ సంస్థల ఉత్పత్తులు, సర్వీసులకు మించిన రేటింగ్ ఇచ్చుకోకూడదు. కాబట్టి అమెజాన్ లాంటివి థర్డ్ పార్టీ వ్యాపారుల ఉత్పత్తుల కన్నా తమ ఉత్పత్తులే సులభంగా కనిపించేలా చేయడానికి ఉండదు. అటు ఆన్లైన్ సేవల సంస్థలు .. నిర్దిష్ట యూజర్లు లక్ష్యంగా పంపే ప్రకటనల కోసం వివిధ వేదికల్లోని యూజర్ల వ్యక్తిగత డేటాను కలగలిపి వాడుకోవడానికి కుదరదు. ఉదాహరణకు ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, వాట్సాప్ సర్వీసులను వినియోగించుకునే యూజర్ల డేటాను వారి సమ్మతి లేకుండా ఆయా వేదికల మాతృసంస్థ మెటా కలగలిపి వినియోగించుకోవడానికి కుదరదు. -
యూరప్ పర్యటనలో రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ యూరప్లో వారంపాటు పర్యటించనున్నారు. మంగళవారమే ఆయన భారత్ నుంచి బయల్దేరారు. సెప్టెంబర్ ఏడున బ్రస్సెల్స్లో యురోపియన్ యూనియన్ పార్లమెంటేరియన్లతో రాహుల్ భేటీ అవుతారు. ఆ తర్వాత అక్కడే కొందరు ప్రవాస భారతీయులతో సమావేశమవుతారు. తర్వాతి రోజు ఉదయం కొందరు భారతీయ పారిశ్రామికవేత్తలతో భేటీ జరగనుంది. మధ్యా హ్నం పత్రికా సమావేశంలో పాల్గొంటారు. తర్వాత ఆయన పారిస్కు చేరుకుని సెపె్టంబర్ ఎనిమిదో తేదీన మరో పత్రికా సమావేశంలో పాల్గొంటారు. సెపె్టంబర్ తొమ్మిదో తేదీన ఫ్రాన్స్ పార్లమెంటేరియన్లతో ముచ్చటిస్తారు. తర్వాత అక్కడి సైన్స్ పొ విశ్వవిద్యాలయం విద్యార్థులతో మాట్లాడతారు. సెపె్టంబర్ పదో తేదీన రాహుల్ నెదర్లాండ్స్కు వెళ్తారు. 400 ఏళ్ల నాటి లీడెన్ యూనివర్సిటీలో పర్యటించి అక్కడి విద్యార్థులతో మాట్లాడతారు. సెప్టెంబర్ 11వ తేదీన నార్వేకు వెళ్తారు. ఓస్లోలో ఆ దేశ పార్లమెంటేరియన్లతో సమావేశమవుతారు. తర్వాత అక్కడి ప్రవాస భారతీయులతో, ఓస్లో వర్సిటీ విద్యార్థులతోనూ మాట్లాడతారు. సెప్టెంబర్ 12వ తేదీన రాత్రి రాహుల్ భారత్కు తిరుగుపయనమవుతారు. -
అక్రమ వలసలకు చెక్.. ఐరోపా దేశాలు-ట్యునీషియా మధ్య ఒప్పందం
మిలన్: ఆఫ్రికా దేశాల నుడి ఐరోపా దేశాలకు అక్రమంగా వలస వచ్చే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆర్ధికంగా వెనుకబడిన ఆఫ్రికా దేశాల నుండి వలసదారులు పొట్టకూటి కోసం పడవల మీద ప్రయాణించి ఇటలీ పరిసర ఐరోపా దేశాలకు వలస రావడం పరిపాటిగా మారింది. ఇదే క్రమంలోనే ఇటీవల కొన్ని పడవలు సముద్ర మధ్యలో బోల్తాపడి ఎందరో వలసదారులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐరోపా - ట్యునీషియా ఈ ఒప్పందానికి తెరతీశారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని. ఆదివారం రోమ్ వేదికగా జరిగిన ఈ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించగా ఐరోపా దేశాల ప్రతినిధులందరూ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా వలసదారులు అక్రమంగా చొరబడకుండా వారికి చట్టబద్ధమైన ప్రవేశం కల్పించడంపైనా, ఆయా దేశాల్లో ఉపాధి కల్పించే విషయంపైనా చర్చలు సాగాయి. ఐరోపా దేశాలు-ట్యునీషియా ఒప్పంద సమావేశంలో మొత్తం 27 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. సరిహద్దు భద్రత పటిష్టం చేసి వలసలను తగ్గించడమే అజెండాగా సమావేశంలో లిబియా, సిప్రస్, యూఏఈ, ట్యునీషియా దేశాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అత్యధిక వలసదారులు ఈ దేశాల నుండే వస్తున్నారని, ఇకపై ఈ దేశాల నుండి అక్రమ వలసలు లేకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు యూఏఈ అక్రమ వలసల నియంత్రణ కోసం పాటుపడే సంస్థలకు 100 మిలియన్ డాలర్లు సాయమందించనున్నట్లు ప్రకటించింది. ఇదే వేదికగా ఆఫ్రికా ఉత్తర దేశాలకు ఆర్ధిక ఊతాన్నిచ్చేనందుకు 27 దేశాల వారు కలిపి 1.1 బిలియన్ డాలర్లు కూడగట్టడానికి సంకల్పించారు. ఈ సందర్బంగా ఇటలీ ప్రధాని మెలోని మాట్లాడుతూ.. ఐరోపా దేశాలకు అక్రమంగా వచ్చే వలసదారుల వలన క్రిమినల్ సామ్రాజ్యం విస్తరించడం తప్ప మరో ప్రయోజనం లేదన్నారు. వారు వలసదారులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొల్పి డబ్బులు సంపాదించుకుంటున్నారని అన్నారు. మనం కఠినంగా ఉంటే క్రిమినల్స్ కు చెక్ పెట్టి వలసారులను ఆర్ధిక ప్రగతికి దోహద పడవచ్చని తెలిపారు. ఇది కూడా చదవండి: అమెరికా నౌకాదళానికి తొట్టతొలి మహిళా చీఫ్ -
యూజర్ల డేటా అమెరికాకు బదిలీ, మెటాకు భారీ జరిమానా!
ప్రముఖ సోషల్మీడియా దిగ్గజం మెటాకు భారీ షాక్ తగిలింది. సోషల్ మీడియా నిబంధనల్ని ఉల్లంఘించిందుకు ఈయూ యూజర్ల డేటాను అమెరికాకు తరలించిందని ఆరోపిస్తూ ఐర్లాండ్ రెగ్యులేటర్ రికార్డ్ స్థాయిలో మెటాకు 1.2 బిలియన్ యూరోల (1.3 బిలియన్ డాలర్లు) ఫైన్ విధించింది. యూరోపియన్ యూనియన్కి చెందిన ఐరిష్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ (డీపీసీ) 1.2 బిలియన్ యూరోలను మెటా నుంచి వసూలు చేసే బాధ్యతలను యూరోపియన్ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ (ఈడీపీబీ)కి అప్పగించింది. ఇక 2020 నుంచి ఫేస్బుక్ మాతృసంస్థ ఈయూ యూజర్ల డేటాను అమెరికాకు తరలించిన అంశంపై విచారణ ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా మెటా యురోపియన్ కేంద్ర కార్యాలయం డుబ్లిన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఆ కేంద్రం నుంచే మెటా యూజర్లు ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను హరించేలా వ్యహరించిందంటూ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్ (సీజేఈయూ) అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే ఈ జరిమానాను మెటా వ్యతిరేకించింది. లోపభూయిష్టంగా, అన్యాయంగా ఇచ్చిన తీర్పు ఇతర కంపెనీలను సైతం ప్రమాదంలోకి నెట్టేస్తుంది. రెగ్యులేటర్ విధించిన జరిమానా, ఇతర అంశాలపై చట్టపరంగా పోరాటం చేస్తామని మెటా సంస్థ అంతర్జాతీయ వ్యవహారాల అధ్యక్షుడు నిక్ క్లెగ్ చీఫ్ లీగర్ అధికారి జెన్నీఫెర్ న్యూస్టెడ్ బ్లాగ్ పోస్ట్లో వెల్లడించారు. చదవండి👉 అమెజాన్ ఉద్యోగుల తొలగింపుల్లో ఊహించని ట్విస్ట్! -
డేటా లీకేజీ ఉదంతం... చాట్జీపీటీపై ఇటలీ నిషేధం
పారిస్: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చాట్బాట్ చాట్జీపీటీపై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఇటలీ సంచలన నిర్ణయం తీసుకుంది. కఠినమైన యూరోపియన్ యూనియన్ డేటా పరిరక్షణ నియమాలను ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నట్టు సమాచారం. చాట్జీపీటీపై ఇలాంటి చర్య తీసుకున్న తొలి దేశం ఇటలీయే. ఎందుకు? యూజర్ల సంభాషణలు, చందాదారుల చెల్లింపులకు సంబంధించిన డేటా చాట్జీపీటీ ద్వారా లీకైందని ఇటలీ డేటా ప్రొటెక్షన్ అథారిటీ పేర్కొంది. అందుకే దాన్ని బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. డేటా గోప్యతను చాట్జీపీటీ పూర్తిస్థాయిలో గౌరవించేదాకా నిషేధం కొనసాగుతుందని తెలిపింది. దాని మాతృసంస్థ ఓపెన్ఏఐ ఎలాంటి చట్టపరమైన ఆధారమూ లేకుండానే భారీ పరిమాణంలో వ్యక్తిగత డేటాను సేకరించి ప్రాసెస్ చేస్తోందంటూ విస్మయం వ్యక్తం చేసింది. ‘‘పైగా డేటా సేకరిస్తున్న యూజర్లకు ఈ విషయాన్ని నోటిఫై చేయడం లేదు. పైగా చాట్జీపీటీ కొన్నిసార్లు వ్యక్తులను గురించిన తప్పుడు సమాచారాన్ని పుట్టించి స్టోర్ చేస్తోంది. అంతేకాదు, యూజర్ల వయసును నిర్ధారించుకునే వ్యవస్థేదీ చాట్జీపీటీలో లేదు. కనుక అభ్యంతరకర కంటెంట్ పిల్లల కంటపడే రిస్కుంది. పైగా 13 ఏళ్ల కంటే తక్కువ వయసు చిన్నారుల కోసం ఫిల్టర్లేవీ లేకపోవడం తీవ్ర అభ్యంతరకరం’’ అంటూ ఆక్షేపించింది. చాట్జీపీటీలో సాంకేతిక సమస్యలు కొత్తేమీ కాదు ఇతర యూజర్ల సబ్జెక్ట్ లైన్లు, చాట్ హిస్టరీ తదితరాలను కొందరు యూజర్లు చూసేందుకు వీలు కలుగుతుండటంతో సమస్యను సరిచేసేందుకు చాట్జీపీటీని కొంతకాలం ఆఫ్లైన్ చేస్తున్నట్టు మార్చి 20న ఓపెన్ఏఐ ప్రకటించడం తెలిసిందే. 1.2 శాతం మంది యూజర్లకు ఈ యాక్సెస్ లభించినట్టు విచారణలో తేలిందని సంస్థ పేర్కొంది. 20 రోజుల్లో నివేదించాలి నిషేధం నేపథ్యంలో యూజర్ల డేటా గోప్యత పరిరక్షణకు ఏం చర్యలు తీసుకున్నదీ ఓపెన్ఏఐ నివేదించాల్సి ఉంటుంది. లేదంటే 2.2 కోట్ల డాలర్లు/మొత్తం వార్షికాదాయంలో 4 శాతం జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థుల్లో అలసత్వానికి కారణమవుతుందంటూ ప్రపంచవ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలలు, యూనివర్సిటీలు ఇప్పటికే చాట్జీపీటీని నిషేధించాయి. -
Russia-Ukraine war: ఉక్రెయిన్ కోసం ఏడ్చేవాళ్లెవరు?
(ఎస్.రాజమహేంద్రారెడ్డి) : సరిగ్గా ఏడాది క్రితం యముని మహిషపు లోహపు గంటల గణగణలు విని ప్రపంచం యావత్తూ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ గణగణలు దిక్కులు పిక్కటిల్లేలా భూగోళమంతా మారుమోగుతాయేమోనని ఆందోళన పడింది. రష్యా సమరనాదం ఉక్రెయిన్ను ఉక్కిరిబిక్కిరి చేసి అనివార్యంగా ప్రపంచ దేశాలను రెండుగా చీల్చడం ఖాయమని పరిశీలకులూ భయంభయంగానే అంచనా వేశారు. మిత్ర దేశం బెలారస్ భుజం మీద ట్యాంకులను మోహరించి ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగింది. చిరుగాలికే వొణికిపోయే చిగురుటాకులా ఉక్రెయిన్ తలవంచడం ఖాయమనే అనుకున్నారంతా! యుద్ధమంటేనే చావులు కదా. మృతదేహాల ఎర్రటి తివాచీ మీద నుంచే విజయం నడిచో, పరుగెత్తో వస్తుంది. యుద్ధం కొనసాగుతున్న కొద్దీ, ప్రపంచం దృష్టంతా రణక్షేత్రంపైనే నిలిచింది. అయ్యో అన్నవాళ్లున్నారు, రెండు కన్నీటి చుక్కలతో జాలి పడ్డవారూ ఉన్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో వైరి పక్షాల వైపు నిలిచిన దేశాలు మాట సాయమో, మూట సాయమో, ఆయుధ సాయమో చేసి తమ వంతు పాత్రను పోషిస్తూనే ఉన్నాయి. తటస్థంగా ఉన్నవాళ్లూ ఉన్నారు. చమురు కోసమో, తిండిగింజల కోసమో రష్యాపై ఆధారపడ్డ దేశాలు ఇప్పుడెలా అని తల పట్టుకుని ఆలోచనలో పడ్డాయి. ఒకవైపు రష్యా వైఖరిని వ్యతిరేకిస్తూ మరోవైపు దిగుమతులను స్వాగతించడం ఎలాగన్నదే వాటిముందు నిలిచిన మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇండియాకు ఇవేమీ పట్టలేదు. ఉక్రెయిన్లో వైద్యవిద్య అభ్యసిస్తున్న భారత విద్యార్థులను స్వదేశానికి తీసుకు రావడాన్నే యుద్ధం తొలినాళ్లలో లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే భారత్ తటస్థ ధోరణికే కట్టుబడింది. నెలలు గడిచి యేడాది పూర్తయ్యేసరికి రెండు దేశాలు యుద్ధం చేస్తూనే ఉన్నాయి. మిగతా దేశాలు తమ సమస్యలను తమదైన రీతిలో, రష్యా మీద ఆధారపడాల్సిన అవసరం లేనంతగా పరిష్కరించుకున్నాయి. ఇప్పుడు యుద్ధం హాలీవుడ్ వార్ సినిమాయే.. ప్రాణ నష్టం గణాంకాలే! యుద్ధం కూడా రోజువారీ దినచర్యలా రొటీన్గా మారిపోయినప్పుడు ఒక్క కన్నీటి బొట్టయినా రాలుతుందా? అయినా ఉక్రెయిన్ కోసం ఏడ్చేవాళ్లెవరు? తండ్రినో, భర్తనో, కొడుకునో కోల్పోయిన అభాగ్యులు తప్ప! పక్కింటి గొడవ స్థాయికి... యుద్ధం తొలినాళ్లలో ఇకపై చమురెలా అన్నదే యూరప్ను వేధించిన ప్రశ్న. యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు తమ చమురు అవసరాల్లో దాదాపు 40 శాతం రష్యాపైనే ఆధారపడేవి. సహాయ నిరాకరణలో భాగంగా ఆ దిగుమతులను నిలిపివేయక తప్పలేదు. తప్పని పరిస్థితుల్లో జర్మనీ నుంచి ఇటలీ దాకా, పోలండ్ దాకా తమ దిగుమతుల పాలసీని మార్చుకుని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాయి. అధిక ధరకు చము రును ఇతర దేశాల నుంచి కొనాల్సి వచ్చినా, పొదుపు మంత్రంవేసి కుదుటపడ్డాయి. ప్రత్యామ్నా య మార్గం దొరికే వరకు యుద్ధం తమ గుమ్మం ముందే కరాళ నృత్యం చేస్తోందన్నంతగా హడలిపోయి ఉక్రెయిన్ పట్ల కాస్త సానుభూతిని, కాసిన్ని కన్నీటి బొట్లను రాల్చిన ఈ దేశాలన్నీ ఒక్కసారిగా కుదుటపడి ఊపిరి పీల్చుకున్నాయి. ఇప్పుడు యుద్ధం ఈ దేశాలకు పక్కింటి గొడవే..! ఇక భారత్ విషయానికొస్తే నాటో దేశాల సహాయ నిరాకర ణతో లాభపడిందనే చెప్పాలి. బ్యారెళ్లలో మూలుగుతున్న చమురును ఏదో ఒక ధరకు అమ్మేయాలన్న వ్యాపార సూత్రాన్ని అనుసరించి రష్యా భారత్కు డిస్కౌంట్ ఇస్తానని ప్రతిపాదించింది. ఫలితంగా గత ఏడాది మార్చి 31 దాకా రష్యా చమురు ఎగుమతుల్లో కేవలం 0.2 శాతంగా ఉన్న భారత్ వాటా ఈ ఏడాది ఏకంగా 22 శాతానికి చేరింది! యుద్ధమంటే బాంబుల మోత, నేలకొరిగిన సైనికులు, ఉసురు కోల్పోయిన సామాన్య పౌరులు మాత్రమే కాదు, కొందరికి వ్యాపారం కూడా! భారత్కు చమురు లాభమైతే ఆయుధ తయారీ దేశాలకు వ్యాపార లాభం. యుద్ధమంటే ఆయుధ నష్టం కూడా. జర్మనీ, ఫ్రాన్స్, చెక్ రిపబ్లిక్, పోలండ్ లాంటి దేశాలు సరిగ్గా దీన్నే తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. ఆయుధ ఉత్పత్తిని పెంచి, సొమ్ము చేసుకుంటున్నాయి. ఏడాది తిరిగేసరికి యుద్ధం చుట్టూ పరిస్థితులు ఇంతలా మారితే కదనరంగంలో పిట్టల్లా రాలుతున్న వారి గురించి ఎవరాలోచిస్తారు? ప్రాథమ్యాల జాబితాలో యుద్ధం ఇప్పుడు చిట్టచివరి స్థానానికి నెట్టివేతకు గురైంది. రణక్షేత్రంలోని వైరి పక్షాలకు తప్ప మిగతా దేశాలకు ఇప్పుడది కేవలం ఒక వార్త మాత్రమే! బావుకున్నదేమీ లేదు మిత్ర దేశాలు, శత్రు దేశాలు, తటస్థ దేశాలను, వాటి వైఖరులను పక్కన పెడితే వైరి పక్షాలైన రష్యా, ఉక్రెయిన్ కూడా బావుకున్నదేమీ లేదు. ప్రాణనష్టం, ఆయుధ నష్టాల్లో హెచ్చుతగ్గులే తప్ప రెండు దేశాలూ తమ పురోగతిని ఓ నలభై, యాభై ఏళ్ల వెనక్కు నెట్టేసుకున్నట్టే! శ్మశాన వాటికలా మొండి గోడలతో నిలిచిన ఉక్రెయిన్ మునుపటి స్థితికి చేరుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో యుద్ధం ముగిస్తే తప్ప అంచనా వేయలేం. యుద్ధం వల్ల పోగొట్టుకున్న పేరు ప్రతిష్టలను, కోల్పోయిన వీర సైనికులను రష్యా వెనక్కు తెచ్చుకోగలదా? ఏడాదైనా ఉక్రెయిన్పై పట్టు బిగించడంలో ఘోరంగా విఫలమైన రష్యా సైనిక శక్తి ప్రపంచం దృష్టిలో ప్రశ్నార్థకం కాలేదా? నియంత పోకడలతో రష్యాను జీవితాంతం ఏలాలన్న అధ్యక్షుడు పుతిన్ పేరు ప్రతిష్టలు యుద్ధంతో పాతాళానికి దిగజారలేదా? ఆయన తన రాజ్యకాంక్షను, తన అహాన్ని మాత్రమే తృప్తి పరచుకోగలిగారే తప్ప... ప్రపంచాన్ని కాదు, తన ప్రజలను కానే కాదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పరిస్థితి కూడా పుతిన్కు భిన్నంగా ఏమీ లేదు. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా రూపాంతరం చెందినట్టు జెలెన్స్కీ హాస్య నటుడి నుంచి హీరో అయ్యారు. రష్యా క్షిపణి దాడుల్లో దేశం వల్లకాడులా మారుతున్నా జెలెన్స్కీపై మాత్రం పొగడ్తల వర్షం కురుస్తూనే ఉంది. ఆయన ఎక్కడికెళ్లినా రాచ మర్యాదలతో స్వాగతం పలుకుతున్నారు. సాహసివంటూ పొగుడుతున్నారు. దేశం నాశనమవుతోందని బాధ పడాలో, ఎగురుతున్న తన కీర్తిబావుటాను చూసి సంతోషించాలో జెలెన్స్కీకి అర్థం కావడం లేదు. బహుశా ఆయన త్రిశంకుస్వర్గంలో ఉండి ఉంటారు. కొసమెరుపు కదనరంగంలో గెలుపోటములు ఇప్పుడప్పుడే తేలే అవకాశమే లేదు. ఎవరిది పైచేయి అంటే చెప్పడం కూడా కష్టమే. స్థూలంగా చెప్పాలంటే రష్యా ఆక్రమించుకున్న భూభాగంలో 54 శాతాన్ని ఉక్రెయిన్ మళ్లీ తన అధీనంలోకి తెచ్చుకుంది. అన్ని రోజులూ ఒక్కరివి కాదంటారు కదా! ఒకరోజు రష్యాదైతే మరో రోజు ఉక్రెయిన్ది..అంతే! ఇప్పుడు ఈ యుద్ధం ప్రపంచానిది ఎంతమాత్రం కాదు, రష్యా–ఉక్రెయిన్లది మాత్రమే. కొనసాగించడంతో పాటు ముగించడం కూడా ఆ రెండు దేశాల చేతుల్లోనే ఉంది. అయినా ఈ యుద్ధాన్ని ఎవరు పట్టించుకుంటున్నారిప్పుడు? -
Ukraine-Russia war: మాకు మరిన్ని ఆయుధాలు కావాలి
బ్రస్సెల్స్: రష్యాను ఎదుర్కొనేందుకు తమకు మరింత సైనిక సాయం కావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొమిదిర్ జెలెన్స్కీ కోరారు. ఉక్రెయిన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) కలిసి యూరప్ బద్దవ్యతిరేకి అయిన రష్యాతో తలపడుతున్నాయని చెప్పారు. గురువారం ఆయన బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లోని ఈయూ పార్లమెంట్నుద్దేశించి ప్రసంగించారు. ‘మనం కలిసి ఉన్నంత కాలం, మన యూరప్ను కాపాడుకున్నంత కాలం, మన యూరప్ జీవన విధానాన్ని పరిరక్షించుకున్నంత కాలం యూరప్ యూరప్గానే నిలిచి ఉంటుంది’అని జెలెన్స్కీ చెప్పారు. యూరప్ జీవన విధానాన్ని నాశనం చేయాలని రష్యా కోరుకుంటోంది. కానీ, మనం అలా జరగనివ్వరాదు’అని చెప్పారు. అంతకుముందు ఈయూ ప్రతినిధులు ఆయనకు పార్లమెంట్ భవనంలోకి ఘనంగా స్వాగతం పలికారు. ప్రసంగం పూర్తయిన అనంతరం, ప్రొటోకాల్ ప్రకారం ఉక్రెయిన్ జాతీయ గీతం, యూరోపియన్ గీతం వినిపించారు. ఆ సమయంలో జెలెన్స్కీ ఈయూ జెండాను చేబూనారు. అనంతరం యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడు రొబెర్టా మెట్సోలా మాట్లాడుతూ.. లాంగ్ రేంజ్ క్షిపణి వ్యవస్థలను, యుద్ధవిమానాలను సాధ్యమైనంత త్వరగా ఉక్రెయిన్కు అందించే విషయం పరిశీలించాలని సభ్య దేశాలను కోరారు. ఉక్రెయిన్కు రష్యాతో ఉన్న ముప్పునకు తగ్గట్లే చర్యలుండాలని సూచించారు. ఇది ఉక్రెయిన్ అస్తిత్వానికి సంబంధించిన విషయమన్నారు. ఈనెల 24వ తేదీతో ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించి ఏడాదవుతోంది. ఈ సందర్భంగా దాడులను మరో విడత తీవ్రతరం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అదనపు సైనిక సాయం కోసం జెలెన్స్కీ మిత్ర దేశాల్లో పర్యటనలు చేస్తున్నారు. అంతకుముందు ఫ్రాన్సు పర్యటనలో ఆ దేశాధ్యక్షుడు మేక్రాన్ ఆయన్ను లీజియన్ ఆఫ్ హానర్తో సన్మానించారు. బ్రస్సెల్స్లో ఈయూకు చెందిన 27 దేశాల నేతలతో జెలెన్స్కీ సమావేశమయ్యారు. -
బ్యారెల్ @ 60 డాలర్లు.. రష్యా తిరస్కరణ.. ఎగుమతులు నిలిపేస్తామని హెచ్చరిక
బ్రసెల్స్: ఉక్రెయిన్పై 9 నెలలుగా రష్యా చేస్తున్న యుద్ధానికి నిధుల లభ్యతను వీలైనంత తగ్గించడం. నానాటికీ పెరుగుతున్న ఇంధన ధరలకు అడ్డుకట్ట వేయడం. ఈ రెండు లక్ష్యాల సాధనకు యూరోపియన్ యూనియన్ ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి కొనుగోలు చేసే చమురు ధరకు బ్యారెల్కు 60 డాలర్ల పరిమితి విధించింది. సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం ఈయూ సభ్య దేశాల మధ్య చివరి నిమిషంలో ఎట్టకేలకు శుక్రవారం రాత్రి ఇందుకు అంగీకారం కుదిరింది. అమెరికా, జపాన్, కెనడా తదితర జీ 7 దేశాలు కూడా ఈ నిర్ణయానికి అంగీకారం తెలిపాయి. ఇది సోమవారం నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం ఈయూ, జీ 7 దేశాలకు చమురును బ్యారెల్ 60 డాలర్లు, అంతకంటే తక్కువకు మాత్రమే రష్యా విక్రయించాల్సి ఉంటుంది. అయితే ఈ పరిమితిని రష్యా తిరస్కరించింది. ఈయూ తదితర దేశాలకు చమురు ఎగుమతులను నిలిపేస్తామని హెచ్చరించింది. ‘‘ఈ ఏడాది నుంచి యూరప్ రష్యా చమురు లేకుండా మనుగడ సాగించాల్సి వస్తుంది’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్, అంతర్జాతీయ సంస్థల్లో రష్యా శాశ్వత ప్రతినిధి మిఖాయిల్ ఉల్యనోవ్ హెచ్చరించారు. ఈయూ పరిమితితో పెద్దగా ఒరిగేదేమీ ఉండబోదంటూ నిపుణులు కూడా పెదవి విరుస్తున్నారు. ‘‘రష్యా ఇప్పటికే భారత్, చైనా తదితర ఆసియా దేశాలకు అంతకంటే తక్కువకే చమురు విక్రయిస్తోంది. రష్యాను నిజంగా బలహీన పరచాలనుకుంటే బ్యారెల్కు 50 డాలర్లు, వీలైతే 40 డాలర్ల పరిమితి విధించాల్సింది’’ అని అభిప్రాయపడుతున్నారు. ఈయూ నిర్ణయం ప్రభావం రానున్న రోజుల్లో యూరప్ దేశాలపై, రష్యాపై, మిగతా ప్రపంచంపై ఎలా ఉంటుందన్న చర్చ మొదలైంది. రూటు మార్చిన రష్యా రష్యా ప్రపంచంలో రెండో అతి పెద్ద చమురు ఉత్పత్తిదారు. సగటున రోజుకు 50 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తోంది. ఉక్రెయిన్తో యుద్ధం మొదలయ్యేదాకా యూరప్ దేశాలే దానికి అతి పెద్ద చమురు మార్కెట్. వాటి కఠిన ఆంక్షల నేపథ్యంలో కథ మారింది. యూరప్ ఎగుమతుల్లో చాలావరకు భారత్, చైనాలకు మళ్లించింది. అయితే కరోనా కల్లోలం నేపథ్యంలో చైనా చమురు దిగుమతులను బాగా తగ్గించుకుంటోంది. ఇదిలాగే కొనసాగితే రష్యా తన చమురు ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి రావచ్చు. లభ్యత తగ్గి ధరలకు మళ్లీ రెక్కలు రావచ్చు. చలికాలం కావడంతో చమురు, సహజవాయువు వినియోగం భారీగా పెరిగే ఈయూ దేశాలను ఈ పరిణామం మరింతగా కలవరపెడుతోంది. ‘‘చమురు ధరలు ఏ 120 డాలర్లో ఉంటే 60 డాలర్ల పరిమితి రష్యాకు దెబ్బగా మారేది. కానీ ఇప్పుడున్నది 87 డాలర్లే. రష్యాకు ఉత్పాదక వ్యయం బ్యారెల్కు కేవలం 30 డాలర్లే! ’’ అని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. నల్ల మార్కెట్కూ తరలించొచ్చు... ఆర్థిక మందగమనం దెబ్బకు ఒకవేళ సమీప భవిష్యత్తులో అంతర్జాతీయంగా చమురు వాడకం తగ్గినా ఆ మేరకు ఉత్పత్తిని తగ్గించడం రష్యాకు సమస్యే అవుతుంది. ఎందుకంటే ఒకసారి చము రు ఉత్పత్తి ఆపితే పునఃప్రారంభించడం అత్యంత వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారం. కాబట్టి మధ్యేమార్గంగా ఇరాన్, వెనెజువెలా దారిలోనే రష్యా కూడా బ్లాక్ మార్కెట్లో చమురును అమ్ముకునే అవకాశాలూ లేకపోలేదని భావిస్తున్నారు. పైగా దీనిద్వారా హెచ్చు ఆదాయం కూడా సమకూరుతుంది. ఈ కోణంలో చూసినా ఈయూ పరిమితి వాటికే బెడిసికొట్టేలా కన్పిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2023 తొలి త్రైమాసికాంతం నాటికి చమురు ధరలు ఒకవేళ బాగా పెరిగితే పరిమితి రష్యాపై ఎంతోకొంత ప్రభావం చూపొచ్చని అంచనా వేస్తున్నారు. -
డిసెంబర్ క్వార్టర్లో మాంద్యంలోకి యూరప్ దేశాలు
ఫ్రాంక్ఫర్ట్: ఊహించిన దానికన్నా ఎక్కువ కాలం అధిక ద్రవ్యోల్బణం కొనసాగే పరిస్థితులు కనిపిస్తుండటంతో ఈ ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో యూరోపియన్ యూనియన్లోని (ఈయూ) చాలా మటుకు దేశాలు మాంద్యంలోకి జారుకోవచ్చని యూరోపియన్ కమిషన్ వెల్లడించింది. ద్రవ్యోల్బణంతో పాటు అధిక వడ్డీ రేట్లు, నెమ్మదిస్తున్న అంతర్జాతీయ వాణిజ్యం తదితర అంశాలు కూడా ఇందుకు కారణం కాగలవని పేర్కొంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది (2023) వృద్ధి అంచనాలను 0.3 శాతానికి తగ్గించింది. వాస్తవానికి ఇది 1.4 శాతంగా ఉండవచ్చని జూలైలో అంచనా వేశారు. ఈ ఏడాది ప్రథమార్ధంలో వృద్ధి ఆశ్చర్యకరంగా పటిష్టంగానే ఉన్నప్పటికీ, మూడో త్రైమాసికంలో ఈయూ ఎకానమీ వేగం తగ్గిందని యూరోపియన్ కమిషన్ తెలిపింది. దీంతో వచ్చే ఏడాదికి అంచనాలు గణనీయంగా బలహీనపడ్డాయని తెలిపింది. యూరప్లో అతి పెద్ద ఎకానమీ అయిన జర్మనీ పనితీరు 2023లో అత్యంత దుర్భరంగా ఉండవచ్చని పేర్కొంది. -
పెట్రోల్, డీజిల్ కార్ల తయారీపై... 2035 నుంచి ఈయూ నిషేధం
బ్రస్సెల్స్: 2035 నుంచి పెట్రోల్, డీజిల్ కార్లు, వ్యాన్ల తయారీపై యూరోపియన్ యూనియన్ దేశాలు నిషేధం విధించనున్నాయి. ఇందుకు సంబంధించిన మొట్టమొదటి ‘ఫిట్ ఫర్ 55’ప్యాకేజీపై ఈయూ ప్రతినిధులు గురువారం అంగీకారానికి వచ్చారు. ఈ దశాబ్దం చివరికల్లా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను 55% మేర తగ్గించడమే ఈ ప్యాకేజీ ఉద్దేశం. దీని ప్రకారం.. కార్లు, వ్యాన్ల నుంచి వెలువడే ఉద్గారాలను 2030 నాటికి 55 శాతానికి తగ్గించి, 2035 కల్లా వందశాతం లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంది. ఒప్పందం అమల్లోకి రావాలంటే ముందుగా ఈయూ పార్లమెంట్, సభ్యదేశాలు ఆమోదం తెలిపాల్సి ఉంటుంది. 2050 నాటికి వాయు ఉద్గారాలను పూర్తిగా తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహమివ్వాలని ఈయూ యోచిస్తోంది. -
యూరోపియన్ యూనియన్ సంచలన నిర్ణయం.. యాపిల్ కంపెనీకి పెద్ద దెబ్బే!
మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రిక్ డివైజ్ల విషయంలో కామన్ ఛార్జింగ్ పోర్ట్ కోసం యూరోపియన్ యూనియన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ పరికరాలకు సంబంధించి ఇకపై కామన్ ఛార్జింగ్ పోర్ట్ ఉండాలంటూ కొత్త నిబంధనలతో కూడిన చట్టాన్ని ఆమోదించింది. 2024 కల్లా ఈ నిబంధన పూర్తిగా అమలు చేసేందుకు అడుగులు వేస్తోంది. ఇకపై ఈయూ దేశాల్లో ఫోన్లతో సహా డివైజ్లన్నింటికి ఒకే పోర్ట్.. ఒకే ఛార్జర్ కనిపించనున్నాయి. యూనివర్సల్ ఛార్జింగ్ సొల్యూషన్ కోసం యూరోపియన్ కమిషన్ తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం.. యూఎస్బీ-సీ టైప్ పోర్టల్ ఛార్జర్లే అన్ని డివైజ్లకీ ఉండాలి. వీటితో పాటు ఇ-రీడర్లు, ఇయర్ బడ్స్తో పాటు ఇతర సాంకేతిక పరికరాలకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ క్రమంలో యాపిల్ ఐఫోన్ (Apple iPhone)లతో పాటు పలు సంస్థలు కూడా వారి ఛార్జింగ్ పోర్ట్ను మార్చవలసి ఉంది. యూరోపియన్ కస్టమర్లకు ఎలక్ట్రానిక్ పరికరాలను అందించే సంస్థలలో యాపిల్ ప్రధాన సరఫరాదారుడు, దీంతో ఈ నిర్ణయం ఐఫోన్ కంపెనీకి పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఈ నిబంధన ఎందుకంటే! కస్టమర్లు డివైజ్ కొనుగోలు చేసిన ప్రతీసారి కంపెనీలు కొత్త ఛార్జర్లను కూడా ఇస్తుంటాయి. దీంతో పాతది వాడకుండా వ్యర్థంగా మారడం సహజంగా మారుతోంది. ఈ క్రమంలో పాత ఛార్జర్లనే ఉపయోగించే విధంగా యూజర్లను ప్రోత్సహించడంతో పాటు, రీయూజింగ్ ద్వారా వేస్టేజ్ తగ్గించాలన్నది ఈయూ ముఖ్యోద్దేశం. ఈ అంశంపై ఈయూలో చాలా ఏళ్లుగా పోరాటం, చర్చలు నడుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సింగిల్ ఛార్జర్ వినియోగించడం వల్ల దాదాపు EUR 250 మిలియన్లు (దాదాపు రూ. 2016 కోట్లు) ఆదా అవుతుందని యూరోపియన్ కమిషన్ అంచనా. 2018లో మొబైల్ ఫోన్లతో విక్రయించిన సగం ఛార్జర్లు USB మైక్రో-USB కనెక్టర్ను కలిగి ఉండగా, 29 శాతం USB టైప్-సి కనెక్టర్ను కలిగి ఉన్నారు. 21 శాతం మంది లైట్నింగ్ కనెక్టర్ చార్జర్ను కలిగి ఉన్నారు. చదవండి: Youtube: యూజర్లకు భారీ షాకిచ్చిన యూట్యూబ్.. డబ్బులు చెల్లించాల్సిందేనా! -
Europe Drought 2022: జాడలేని వాన చినుకు.. అల్లాడిపోతున్న యూరప్
బ్రిటన్లో థేమ్స్ నది ఎండిపోతోంది. ఫ్రాన్స్లో ఎండ వేడిమికి కార్చిచ్చులు ఎగసిపడుతున్నాయి. నదుల్లో నీళ్లు లేక చచ్చిపోయిన చేపలు గుట్టలుగుట్టలుగా పడుతున్నాయి. స్పెయిన్లో రిజర్వాయర్లు నీళ్లు లేక బోసిపోతున్నాయి. మొత్తంగా యూరప్లో సగభాగాన్ని కరువు కమ్మేస్తోంది. లండన్: వాతావరణంలో మార్పుల ప్రభావం యూరప్ను అల్లాడిస్తోంది. బ్రిటన్, ఫ్రాన్స్, హంగేరి, సెర్బియా, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ తదితర దేశాల్లో కరువు ముంచుకొస్తోంది. పశ్చిమ, మధ్య, దక్షిణ యూరప్లో రెండు నెలలుగా వాన చినుకు జాడ కూడా లేదు! దాంతో యూరప్లోని సగం ప్రాంతాల్లో కరువు పడగ విప్పింది. యూరోపియన్ యూనియన్లో 46% ప్రాంతాల్లో ప్రమాదకంగా కరువు పరిస్థితులున్నాయి. వాటిలో 11% ప్రాంతాల్లోనైతే అతి తీవ్ర కరువు నెలకొంది! దక్షిణ ఇంగ్లండ్లో థేమ్స్ నదిలో ఏకంగా 356 కి.మీ. మేర ఇసుక మేటలు వేసింది. నది జన్మస్థానం వద్ద వానలు కురవకపోవడం, ఎగువ నుంచి నీళ్లు రాకపోవడంతో ఎన్నడూ లేనంతగా ఎండిపోయింది! ఫ్రాన్స్లోని టిల్లె నదిలో సెకనుకు సగటున 2,100 గాలన్లు నీరు ప్రవహించే చోట్ల కూడా ఇప్పుడు చుక్క నీరు కనిపించడం లేదు. దక్షిణ, మధ్య, తూర్పు ఇంగ్లండ్లో ఏకంగా 8 ప్రాంతాలను కరువు ప్రభావితమైనవిగా బ్రిటన్ ప్రకటించింది. 1935 తర్వాత ఇలాంటి పరిస్థితులు రావడం ఇదే తొలిసారి! ఇంగ్లండ్లో కొద్ది వారాలుగా ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీల సెల్సియస్ పైగానమోదవుతున్నాయి. ఈ ఏడాది జూలై అత్యంత పొడి మాసంగా రికార్డులకెక్కింది. ఇవే పరిస్థితులు తూర్పు ఆఫ్రికా, మెక్సికోల్లో కనబడుతున్నాయి. 500 ఏళ్లకోసారి మాత్రమే ఇంతటి కరువు పరిస్థితులను చూస్తామని నిపుణులు చెబుతున్నారు. నదులు ఎండిపోతూ ఉండడంతో జల విద్యుత్కేంద్రాలు మూతపడుతున్నాయి. 2018లో కూడా కరువు పరిస్థితులు వచ్చినా ఇంత టి పరిస్థితులను ఎదుర్కోలేదని అధ్యయనవేత్లలు అంటున్నారు. అక్టోబర్ దాకా ఇవే పరిస్థితులు కొనసాగుతాయన్న అంచనాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితులు తీవ్రమైతే ఇళ్లల్లో తోటలకు నీళ్లు పెట్టడం, కార్లు శుభ్రం చేయడం, ఇంట్లోని పూల్స్లో నీళ్లు నింపడంపై నిషేధం విధిస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్ ప్రమాద ఘంటికలు... ► బ్రిటన్లో జూలైలో సగటు వర్షపాతం 35% మాత్రమే నమోదైంది. ► దాంతో ఆవులు తాగే నీళ్లపై కూడా రోజుకు 100 లీటర్లు అంటూ రేషన్ విధిస్తున్నారు. ► మొక్కజొన్న ఉత్పత్తి 30%, పొద్దుతిరుగుడు ఉత్పత్తి 16 లక్షల టన్నులకు తగ్గనుందని అంచనా. ► బంగాళదుంప రైతులంతా నష్టపోయారు. ► జర్మనీలోని రైన్ నదిలో నీటి ప్రవాహం తగ్గిపోతూ వస్తోంది. చాలాచోట్ల 5 అడుగుల నీరు మాత్రమే ఉంది. ఈ నదిపై రవాణా ఆగిపోతే∙8 వేల కోట్ల డాలర్ల నష్టం సంభవిస్తుంది. ► ఇటలీలో గత 70 ఏళ్లలో చూడనంతటి అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. ► ఇటలీలోని అతి పెద్ద నది పో సగం వరకు ఎండిపోయింది. ► ఫ్రాన్స్లో 100కు పైగా మున్సిపాల్టీల్లో ట్యాంకర్ల ద్వారా నీళ్లు పంపిణీ చేస్తున్నారు. ► ఎండ తీవ్రతకు ఫ్రాన్స్లో గిర్నోడ్ లో 74 చదరపు కిలోమీటర్ల మేర కార్చిచ్చు వ్యాపించింది. ► స్పెయిన్లో ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు భారీగా పడిపోయాయి. ► హంగరీలో నదులన్నీ బురద గుంతలుగా మారిపోతున్నాయి. -
ఈయూలోకి ఉక్రెయిన్!
కీవ్: యూరోపియన్ యూనియన్లో ఉక్రెయిన్కు సభ్యత్వం కల్పించాలని ఈయూ కమిషన్ శుక్రవారం సిఫార్సు చేసింది. జర్మనీ, ఇటలీ, రొమేనియా, ఫ్రాన్స్ అధినేతలు గురువారం ఉక్రెయిన్లో పర్యటించి, ఈయూలో సభ్యత్వం విషయంలో పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఈయూ కమిషన్ సానుకూలంగా స్పందించి, సిఫార్సు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్ తన సుదీర్ఘ ఆకాంక్షను నెరవేర్చుకొనే క్రమంలో ఇది మొదటి అడుగు అని చెప్పొచ్చు. ఈయూ కమిషన్ సిఫార్సుపై వచ్చే వారం బ్రస్సెల్స్లో 27 సభ్యదేశాల నాయకులు సమావేశమై, చర్చించనున్నారు. అన్ని దేశాల నుంచి అంగీకరించే ఉక్రెయిన్కు ఈయూ సభ్యత్వం ఖరారైనట్లే. అయితే ఇది వెంటనే సాధ్యం కాదని, కార్యరూపం దాల్చడానికి మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. యూరప్ దేశాలకు గ్యాస్ సరఫరాలో కోత రష్యా మరోసారి యూరప్ దేశాలకు సహజ వాయువు సరఫరాలో కోత విధించింది. ఇటలీ, స్లొవేకియాకు సగం, ఫ్రాన్స్కు పూర్తిగా కోత విధించింది. దాంతో జర్మనీ, ఆస్ట్రియా ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. యూరప్లో ఇంధనం ధరలు, తద్వారా ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. యూరప్ దేశాల్లో విద్యుత్ ఉత్పత్తికి రష్యా నుంచి సరఫరా అయ్యే గ్యాస్ చాలా కీలకం. ఉక్రెయిన్లో బ్రిటిష్ ప్రధాని బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ శుక్రవారం ఉక్రెయిన్ పర్యటన ప్రారంభించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. కీవ్కు మరోసారి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడులు మొదలైన తర్వాత బోరిస్ జాన్సన్ ఇక్కడికి రావడం ఇది రెండోసారి. ఉక్రెయిన్పై రష్యా దాడులను జాన్సన్ మొదటినుంచీ గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఉక్రెయిన్కు అండగా ఉంటామని చెబుతున్నారు. బ్రిటిన్ ఇప్పటికే కోట్లాది పౌండ్ల సాయాన్ని ఉక్రెయిన్కు అందజేసింది. -
Russia-Ukraine war: రష్యాను ఒంటరిని చేయలేరు
మాస్కో/కీవ్: భారత్, చైనాతోనే గాక లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలోనూ భాగస్వామ్యం నెలకొల్పుకొనే అవకాశం తమకుందని రష్యా అధ్యక్షుడు శుక్రవారం పుతిన్ అన్నారు. రష్యాను ఒంటరిని చేయడం అసాధ్యమని పరోక్షంగా తేల్చిచెప్పారు. ‘‘ఆఫ్రికా నిద్రాణ స్థితిలో ఉన్నా ఎప్పటికైనా మేల్కొంటుంది. అక్కడ 150 కోట్ల మంది ఉన్నారు. రష్యా చుట్టూ బయటి నుంచి కంచె వేయడం అసాధ్యం. మా సార్వభౌమత్వాన్ని, భూభాగాలను తిరిగి తెచ్చుకోవడంతోపాటు బలోపేతం చేసుకొనే కార్యక్రమం చేపట్టాం. ఆ లక్ష్యాలను కచ్చితంగా సాధిస్తాం’’ అని ధీమా వ్యక్తం చేశారు. ఈయూలో చేర్చుకోండి: జెలెన్స్కీ తమకు యూరోపియన్ యూనియన్(ఈయూ)లో సభ్యత్వం కల్పించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం వేగంగా చర్యలు చేపట్టాలని కోరారు. మాట నిలబెట్టుకోవాలని సూచించారు.‘గ్రేజోన్’ పేరిట ఉక్రెయిన్ను నిర్లక్ష్యం చేస్తున్నారని, తద్వారా రష్యా దండయాత్రకు ఊతం ఇస్తున్నారని విమర్శించారు. ఫిన్లాండ్ నుంచి మరిన్ని ఆయుధాలు! ఉక్రెయిన్కు మరిన్ని ఆయుధాలు అందజేసేందుకు ఫిన్లాండ్ ముందుకొచ్చింది. ఫిన్లాండ్ గతంలోనే రైఫిళ్లు, యాంటీ–ట్యాంకు ఆయుధాలను ఉక్రెయిన్కు అందజేసింది. ► యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వోన్ డెర్ లెయేన్ తాజాగా పోప్ ఫ్రాన్సిస్తో సమావేశమయ్యారు. యుద్ధానికి ముగింపు, ఆహార సంక్షోభంపై చర్చించారు. యుద్ధం వల్ల నష్టపోయిన వారికి తాము అండగా ఉంటామని ట్వీట్ చేశారు. ► ఉక్రెయిన్లో ముగ్గురు విదేశీయులకు రష్యా అనుకూల వేర్పాటువాదుల కోర్టు మరణ శిక్ష విధించడంపై ఐరాస మానవ హక్కుల సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇది యుద్ధనేరమని వ్యాఖ్యానించింది. ► తూర్పు ఉక్రెయిన్లో తమ బలగాలు ప్రత్యర్థి రష్యా సైనికులపై పైచేయి సాధిస్తున్నాయని లుహాన్స్క్ గవర్నర్ సెర్హివ్ హైడై చెప్పారు. సీవిరోడోంటెస్క్లో కీలక పారిశ్రామిక ప్రాంతంతోపాటు ఇతర ప్రాంతాలను ఉక్రెయిన్ సేనలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయన్నారు. రష్యా కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన గాళ్ ఫ్రెండ్ మృతదేహం వద్ద రోదిస్తున్న వ్యక్తి ► తమ దేశానికి చెందిన ఇద్దరు పౌరులకు తూర్పు ఉక్రెయిన్లో మరణ శిక్ష విధించడం దారుణమని, ఇందుకు రష్యానే బాధ్యత వహించాలని బ్రిటిష్ మంత్రి రాబన్ వాకర్ డిమాండ్ చేశారు. బ్రిటిష్ పౌరులైన ఐడెన్ అస్లిన్(28), షౌన్ పిన్నర్(48)కు రష్యా అనుకూల కోర్టు మరణ శిక్ష ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మరో మొరాకో పౌరుడు సాదౌన్కు కూడా మరణశిక్ష విధించింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ► రష్యా దాడుల్లో ఉక్రెయిన్ సైన్యంలో నిత్యం 200 మంది దాకా జవాన్లు బలవుతున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు మైఖేలో పొడోల్యాక్ తెలిపారు. పశ్చిమ దేశాల నుంచి మరిన్ని ఆధునిక ఆయుధాలు వస్తేనే తమ సైనికుల ప్రాణత్యాగాలకు తెరపడుతుందన్నారు. ► ఉక్రెయిన్కు మరిన్ని భారీ ఆయుధాలు అందజేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఫ్రాన్స్ అధ్యక్షడు ఇమ్మానుయేల్ మాక్రాన్ చెప్పారు. ఆయన తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడారు. తమ సేనలు ఖర్కీవ్నుంచి రష్యా సైన్యాన్ని తరిమికొడుతున్నాయని జెలెన్స్కీ చెప్పారు. ► డోన్బాస్లోని రష్యా అనుకూల వేర్పాటువాదుల ఆధీనంలో ఉన్న స్టాఖనోవ్పై ఉక్రెయిన్యం వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 13 మంది మరణించారు. -
Russia Ukraine war: రష్యాపై ఆంక్షలకు ఈయూ ఆమోదం
కీవ్/మాస్కో: రష్యా నుంచి చమురు దిగుమతిపై నిషేధంతో సహా పలు ఆంక్షలను యూరోపియన్ యూనియన్(ఈయూ) శుక్రవారం అధికారికంగా ఆమోదముద్ర వేసింది. రాబోయే ఆరు నెలల్లో రష్యా నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని ఈయూ ప్రధాన కార్యాలయం వెల్లడించింది. ఇతర పెట్రోలియం ఉత్పత్తులపై నిషేధాన్ని వచ్చే ఎనిమిది నెలల్లో పూర్తిగా నిషేధిస్తామని పేర్కొంది. హంగేరి, చెక్ రిపబ్లిక్, స్లొవేకియా, బల్గేరియా, క్రొయేషియా తదితర దేశాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా కొన్ని మినహాయింపులు ఇచ్చినట్లు తెలిపింది. ఈ ఏడాది ఆఖరు నాటికి రష్యా నుంచి చమురు దిగుమతులను 90 శాతం నిలిపేస్తామని ఈయూ నేతలు ప్రకటించారు. అంతర్జాతీయ బ్యాంకు లావాదేవీలకు వేదిక అయిన ‘స్విఫ్ట్’ వ్యవస్థను రష్యా ఉపయోగించుకోకుండా ఈయూ ఇప్పటికే కట్టడి చేసింది. రష్యా టీవీ చానళ్లను కూడా ఈయూ నిషేధించింది. రష్యా క్రూర దాడులు: జెలెన్స్కీ తూర్పు డోన్బాస్లో భీకర యుద్ధం కొనసాగుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. రష్యా క్రూరంగా దాడులు చేస్తోందని ఆరోపించారు. సీవిరోడోంటెస్క్లో రష్యా దాడులను తిప్పికొట్టడంలో తాము కొంత పురోగతి సాధించామని అన్నారు. సమీపంలోని లీసిచాన్స్క్, బఖ్ముత్లో పరిస్థితి సంక్లిష్టంగానే ఉందని తెలిపారు. పలు నగరాలు, పట్టణాలపై రష్యా సేనలు క్షిపణి దాడులు కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. డోన్బాస్లో రష్యా అనుకూల వేర్పాటువాదుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల నుంచి జనాన్ని సమీకరించి, యుద్ధ రంగంలోకి దించుతున్నారని జెలెన్స్కీ ఆరోపించారు. సాధారణ ప్రజలను ముందు వరుసలో ఉంచి, వారి వెనుక రష్యా సైనికులు వస్తున్నారని వెల్లడించారు. మున్ముందు మరింత సిగ్గుమాలిన, హేయమైన పరిణామాలను చూడబోతున్నామని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్కు అత్యాధునిక రాకెట్ సిస్టమ్స్ ఇచ్చేందుకు అంగీకరించిన అమెరికాకు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. లీసిచాన్స్క్.. 60 శాతం ధ్వంసం తూర్పు ఉక్రెయిన్లోని రెండు ప్రధాన నగరాల్లో ఒకటైన లీసిచాన్స్క్లో రష్యా సేనలు క్షిపణుల మోత మోగిస్తున్నాయి. సిటీలో 60 శాతం మౌలిక సదుపాయాలు, నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. రష్యా నిరంతర దాడుల వల్ల విద్యుత్, సహజ వాయువు, టెలిఫోన్; ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయినట్లు స్థానిక అధికారి ఒలెగ్జాండ్రా జైకా చెప్పారు. బఖ్ముత్–లీసిచాన్స్క్ రహదారిపై రాకపోకలకు అంతరాయం కలుగుతోందన్నారు. లీసిచాన్స్క్ నుంచి ఇప్పటిదాకా 20,000 మంది పౌరులకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. గతంలో ఇక్కడ 97,000 జనాభా ఉండేది. షోల్జ్తో ఉక్రెయిన్ పార్లమెంట్ స్పీకర్ భేటీ ఉక్రెయిన్ పార్లమెంట్ స్పీకర్ రుస్లాన్ స్టెఫాన్చుక్ జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ షోల్జ్తో బెర్లిన్లో సమావేశమయ్యారు. తమ పార్లమెంట్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడాలని కోరారు. జర్మనీ పార్లమెంట్ సమావేశంలో స్టెఫాన్చుక్ పాల్గొన్నారు. జర్మనీ పార్లమెంట్ స్పీకర్ బెయిర్బెల్ బాస్ ఆయనకు స్వాగతం పలికారు. ఉక్రెయిన్లో పౌర మరణాలు 4,945: ఐరాస రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్లో 9,094 మంది సాధారణ పౌరులు బాధితులుగా మారారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం తాజా నివేదికలో వెల్లడించింది. 4,149 మంది ప్రాణాలు కోల్పోయారని, 4,945 మంది క్షతగాత్రులయ్యారని తెలియజేసింది. బలమైన పేలుడు సంభవించే ఆయుధాల వల్లే ఎక్కువ మంది మరణించారని, గాయపడ్డారని పేర్కొంది. ఉక్రెయిన్పై రష్యా సైన్యం భారీ వైమానిక దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. రష్యా ప్రారంభించిన యుద్ధంలో తమ దేశంలో 243 మంది చిన్నారులు బలయ్యారని, 446 మంది గాయాలపాలయ్యారని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం వివరించింది. -
పుతిన్కు ఊహించని షాక్.. అధికారానికి బీటలు!
ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు వరుస షాక్లు తగులుతున్నాయి. తాజాగా రష్యా మాజీ అధ్యక్షుడు బోరిస్ ఎల్త్సిన్ అల్లుడు వాలెంటిన్ యుమషేవ్ పుతిన్ సలహాదారు పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన ఎల్త్సిన్ హయాం నుంచీ అధ్యక్ష సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పుతిన్ అధికారానికి బీటలు పడుతున్నాయని, సైన్యం మీదా ఆయన పట్టు తగ్గుతోందని వస్తున్న వార్తలకు బలం చేకూరింది. యుమషేవ్ కూతురు ఉక్రెయిన్పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ కొద్ది నెలల క్రితం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ఇదిలా ఉండగా.. యుద్ధం కారణంగా రష్యాపై ఆంక్షలపర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగా యూరోపియన్ యూనియన్(ఈయూ) కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి చమురు దిగుమతులను వచ్చే ఆరు నెలల్లో ఏకంగా 90 శాతం తగ్గించుకునేందుకు యూరప్ దేశాలన్నీ అంగీకరించాయి. ఈ నిర్ణయంతో రష్యా నుంచి సముద్ర మార్గాన జరిగే యూరప్కు ఇంధన సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది. మరోవైపు.. డెన్మార్క్కు మంగళవారం నుంచి చమురు సరఫరాలు ఆపేస్తున్నట్టు రష్యా ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం గజ్ప్రోమ్ ప్రకటించింది. తమ పట్ల విద్వేషమే ఏకైక ప్రాతిపదికగా ఈయూ ఈ నిర్ణయం తీసుకుందని రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వేదేవ్ దుయ్యబట్టారు. అంతకుముందు బల్గేరియా, పోలాంట్, ఫిన్లాండ్లకు చమురు ఎగుమతులను రష్యా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: పెళ్లయిందని ప్రకటించిన 4 నెలలకే తల్లయిన స్టార్ హీరోయిన్ -
నకిలీ రివ్యూల కట్టడిపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఉత్పత్తులు, సర్వీసులను కొనుగోలు చేసేలా వినియోగదారులను తప్పుదోవ పట్టించేటువంటి రివ్యూలను.. ఈ–కామర్స్ సైట్లలో కట్టడి చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అడ్వర్టైజింగ్ ప్రమాణాల మండలితో (ఏఎస్సీఐ) కలిసి ఈ–కామర్స్ కంపెనీలు, సంబంధిత వర్గాలతో వినియోగదారుల వ్యవహారాల శాఖ శుక్రవారం వర్చువల్ సమావేశం నిర్వహించనుంది. నకిలీ, తప్పుదోవ పట్టించే రివ్యూల ప్రభావాలు, అలాంటి వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఇందులో చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనాలంటూ ఫ్లిప్కార్ట్, అమెజాన్ తదితర ఈ–కామర్స్ దిగ్గజాలతో పాటు వినియోగదారుల ఫోరమ్లు, లాయర్లు, ఫిక్కీ, సీఐఐ వంటి పరిశ్రమ వర్గాలకు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ లేఖలు రాశారు. యూరోపియన్ యూనియన్లో 223 బడా వెబ్సైట్లలో ఆన్లైన్ రివ్యూలపై జరిగిన సమీక్ష వివరాలను వాటిలో ప్రస్తావించారు. స్క్రీనింగ్ ఫలితాల ప్రకారం దాదాపు 55 శాతం వెబ్సైట్లు ఈయూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు తేలింది. దేశీయంగా ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగే కొద్దీ ఆన్లైన్ కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయని సింగ్ తెలిపారు. అయితే, ఈ–కామర్స్ సైట్లలో కనిపించే నకిలీ రివ్యూల వల్ల వినియోగదారులు పలు సందర్భాల్లో నష్టపోవాల్సి వస్తోందని సింగ్ వివరించారు. -
పార్లమెంట్లో అమ్మాయిల డ్యాన్స్ స్టెప్పులు.. వీడియో వైరల్
యూరప్ పార్లమెంట్లో డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో నెటిజన్లు ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐరోపా భవిష్యత్ ఇదేనా అంటూ సోషల్ మీడియాలో మండిపడ్డారు. వివరాల ప్రకారం.. ఇటీవల యూరప్ భవిష్యత్పై సమాలోచన జరిగింది. అందులో భాగంగా నాలుగు రోజుల పాటు ఫ్రాన్స్లోని స్ట్రాస్బర్గ్లో యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రధాన కార్యాలయంలోని ఐరోపా పార్లమెంట్లో సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో చివరి రోజు సందర్భంగా ఈయూ ఎలా అభివృద్ధి చెందుతుంది అన్న అంశంపై చర్చించారు. కాగా, ఈ సమావేశం మరికొద్ది నిమిషాల్లో ముగుస్తుందనగా కొందరు యువతీయువకులు ప్రత్యక్షమై 10 నిమిషాల పాటు డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో వీడియోపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ) భవిష్యత్తు ఇదే అయితే.. మీరంతా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నట్లేనని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్కు చెందిన మరో నెటిజన్ స్పందిస్తూ.. ఈయూతో బ్రేకప్ పట్ల సంతోషంగా ఉన్నానంటూ కామెంట్ చేశాడు. మరోవైపు తన కీలక ప్రసంగం ముందు జరిగిన ఈ డ్యాన్స్ ప్రదర్శనపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అసహనం వ్యక్తం చేశారు. #EU Interpretive dance performed at European Parliament But Emmanuel Macron looked unimpressed as the European Parliament was treated to a nine-minute youth dance session “to embody the French Presidency of the European Council” on Monday ahead of his key speech to the assembly pic.twitter.com/g9Gqe9Qamx — Freedom Truth Honor 🇺🇳 (@FreedomHonor666) May 10, 2022 ఇది కూడా చదవండి: ఆ దృశ్యాలు చూస్తే గుండె తరుక్కుపోతోంది: మనికే మగే హితె సింగర్ యోహానీ -
ఈయూతో ఎఫ్టీఏ దిశగా అడుగులు
ముంబై: యూరోపియన్ యూనియన్తో (ఈయూ) వచ్చే ఏడాది నాటికి భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్టీఏ) కుదుర్చుకుంటుందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఐఎంసీ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► దేశం ఇప్పటికే యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ), ఆస్ట్రేలియాతో ఒప్పందాలు కుదుర్చుకుంది. యూరోపియన్ యూనియన్, బ్రిటన్, కెనడా, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ)సహా ఇతర దేశాలు లేదా బ్లాక్లతో ఎఫ్టీఏపై చర్చలు జరుపుతోంది. ► ఇటలీకి చెందిన విదేశాంగ మంత్రితో సహా ఒక ప్రతినిధి బృందం దేశ రాజధానితో పర్యటిస్తోంది. ఎఫ్టీఏపై ఈ సందర్భంగా చర్చలు జరగనున్నాయి. ► ఇప్పటికే బ్రిటన్తో మూడు దఫాల చర్చలు జరిగాయి. త్వరలో నాలుగో రౌండ్ చర్చలు జరిగే అవకాశం ఉంది. మే 26–27 తేదీల్లో బ్రిటన్ ప్రతినిధులతో కీలక సమావేశం జరగనుంది. ► స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు భారతదేశంలో వృద్ధిని పెంచుతాయి. భారీ ఉపాధి కల్పనకు వీలు కలుగుతుంది. భారత్ ఇతర దేశాలు లేదా కూటములతో న్యాయమైన, పరస్పర ప్రయోజనకరమైన, విజయవంతమైన భాగస్వామ్యాల కోసం ఎదురు చూస్తోంది. ► 2021–22 ఆర్థిక సంవత్సరంలో భారత్ 400 బిలియన్ డాలర్లకుపైగా ఎగుమతులు జరిపి రికార్డు సృష్టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్లో దేశం ఎన్నడూ లేని విధంగా 38 బిలియన్ డాలర్ల ఎగుమతులను నమోదు చేసింది. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రికార్డు స్థాయి ఎగుమతులు నమోదవుతాయన్న విశ్వాసం ఉంది. అత్యంత నాణ్యతా ప్రమాణాలు కలిగిన ఉత్పత్తుల తయారీ కేంద్రంగా భారత్ అభివృద్ధి చెందుతోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ► ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, మౌలిక రంగం పురోగతికి చర్యల తత్సబంధ కార్యక్రమాల ద్వారా దేశం ఆశించిన ఫలితాలను సాధిస్తోంది. ► ఏప్రిల్లో చరిత్రాత్మక రికార్డు స్థాయలో రూ. 1.67 లక్షల కోట్లకు పైగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్ల జరిగాయి. విశ్లేషకుల అంచనాలను మించి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం ఆశాజనకం. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్లు కూడా ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన రికవరీ, పునరుద్ధరణను సూచిస్తున్నాయి. ► 2021లో దేశం 82 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఏ) ఆకర్షించింది. ఇది ఎన్నడూ లేనంత అత్యధికం. చట్టబద్ధమైన పాలన, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ, పారదర్శక న్యాయ వ్యవస్త, వ్యాపారాలను ఆకర్షించే స్థిరమైన విధానాల వంటి అంశాలు ఈ రికార్డుల సాధనకు కారణం. ఆస్ట్రేలియా దిగుమతుల్లో కొన్నింటికే సుంకాల మినహాయింపు ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకునే వాటిల్లో 29.8 శాతం ఉత్పత్తులకు సుంకాలపరమైన మినహాయింపులు వర్తించవని కేంద్రం వెల్లడించింది. డైరీ ఉత్పత్తులు, ఆహార ధాన్యాలు, విలువైన లోహాలు, ఆభరణాలు మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. దేశీ పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మినహాయింపులు వర్తించే ఉత్పత్తుల జాబితా నుంచి వీటిని తొలగించినట్లు కేంద్రం తెలిపింది. భారత్–ఆస్ట్రేలియా మధ్య కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (ఇండ్ఆస్ ఈసీటీఏ) సంబంధించిన సందేహాల నివృత్తి కోసం వాణిజ్య శాఖ ఈ మేరకు వివరణ (ఎఫ్ఏక్యూ) జారీ చేసింది. ఏప్రిల్ 2న కుదిరిన ఈ ఒప్పందం ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. ఎఫ్ఏక్యూ ప్రకారం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుత 27.5 బిలియన్ డాలర్ల నుంచి 45–50 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఇండ్ఆస్ ఈసీటీఏతో వచ్చే 5–7 ఏళ్లలో 10 లక్షల పైగా ఉద్యోగాల కల్పన జరగనుంది. -
మోదీతో ఈయూ చీఫ్ భేటీ
న్యూఢిల్లీ: యూరోపియన్ యూనియన్–ఇండియా ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ అంగీకారం తెలిపారు. భారత్లో పర్యటిస్తున్న ఉర్సులా సోమవారం మోదీతో భేటీ అయ్యారు. వాణిజ్యం, టెక్నాలజీ, భద్రత వంటి అంశాల్లో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించుకొనేందుకు ఈ కౌన్సిల్ను ఏర్పాటు చేసుకోవాలని వారు నిర్ణయించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో కూడా ఉర్సులా భేటీ అయ్యారు. భారత్, ఈయూ సంబంధాలు మరింత బలపడాలని రాష్ట్రపతి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. తర్వాత రైసినా డైలాగ్ కార్యక్రమంలో ఉర్సులా మాట్లాడారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం వ్యూహాత్మక వైఫల్యంగా మారుతుందన్నారు. -
మాక్రాన్ గెలుపుతో ఉక్రెయిన్కు ఊరట
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడిగా రెండోమారు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ విజయం సాధించడంతో ఉక్రెయిన్ ఊపిరి పీల్చుకుంది. అయితే గతంతో పోలిస్తే లీపెన్కు మద్దతు బాగా పెరిగినట్లు కనిపించింది. అతివాద నాయకురాలు లీపెన్ నెగ్గొచ్చన్న ఊహాగానాలు తొలుత యూరప్ హక్కుల సంఘాలకు, ఉక్రెయిన్ నాయకత్వానికి ఆందోళన కలిగించాయి. ఆమె బహిరంగంగా పుతిన్కు అనుకూలంగా మాట్లాడటం, ఈయూకు, నాటోకు వ్యతిరేకంగా గళమెత్తడంతో ఆమె అధ్యక్షురాలైతే తమకు ఒక పెద్ద అండ లోపిస్తుందని జెలెన్స్కీసహా ఉక్రెయిన్ నాయకత్వం భయపడింది. లీపెన్ పదవిలోకి వస్తే జీ7లాంటి కూటములు కూడా ప్రశ్నార్థకమయ్యేవని జపాన్ ఆందోళన చెందింది. లీపెన్పై మాక్రాన్ విజయం సాధించినప్పటికీ ఆయన్ను వ్యతిరేకిస్తున్నవారి సంఖ్య స్వదేశంలో పెరిగిపోతోంది. ఈ అంశాన్ని గుర్తించిన మాక్రాన్ స్వదేశంలో తనను వ్యతిరేకిస్తున్నవారి ధోరణికి కారణాలు కనుగొంటానని, వారిని సంతృప్తి పరిచే చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. తాను దేశీయులందరికీ అధ్యక్షుడినన్నారు. అయితే స్వదేశం ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోకుండా విదేశీ వ్యవహారాల్లో పెద్దమనిషి పాత్ర పోషిస్తున్న మాక్రాన్పై స్వదేశంలో చాలామంది గుర్రుగా ఉన్నారు. తొలి నుంచి మద్దతు ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా దాడి ఆరంభం కావడానికి ముందే యుద్ధ నివారణకు మాక్రాన్ చాలా యత్నాలు చేశారు. వ్యక్తిగతంగా పుతిన్తో చర్చలు జరిపారు. యుద్ధం ఆరంభమైన తర్వాత రష్యా చర్యను ఖండించడంలో ఉక్రెయిన్కు సాయం అందించడంలో ముందున్నారు. అందుకే మాక్రాన్ను నిజమైన స్నేహితుడు, నమ్మదగిన భాగస్వామిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కొనియాడారు. పుతిన్ చర్యకు వ్యతిరేకంగా రష్యాపై మాక్రాన్ ఆంక్షలను కూడా విధించారు. అలాగే రష్యా సహజవాయువు అవసరం ఫ్రాన్స్కు లేదని, తాము గ్యాస్ కోసం ఇతర దేశాలపై ఆధారపడతామని మాక్రాన్ బహిరంగంగానే ప్రకటించారు. దీంతో ఇకపై పుతిన్కు వ్యతిరేకంగా ఫ్రాన్స్ మరింత చురుగ్గా వ్యవహరిస్తుందని భావిస్తున్నారు. ఉక్రెయిన్కు మద్దతు కొనసాగిస్తామని మాక్రాన్ చెప్పారు. ఒకపక్క రష్యా చర్యను వ్యతిరేకిస్తూనే పుతిన్తో చర్చలకు తయారుగా ఉన్నానని ప్రకటించడం ద్వారా మాక్రాన్ హుందాగా వ్యవహరించారని నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం ముదురుతున్న ఈ తరుణంలో ఫ్రాన్స్ ఈ సమతుల్యతను కొనసాగిస్తుందని భావిస్తున్నారు. అయితే అస్తవ్యస్తంగా మారిన ఫ్రాన్స్ ఆర్థికవ్యవస్థను గాడిన పెట్టడమనే పెద్ద సవాలు ప్రస్తుతం మాక్రాన్ ముందున్నదని నిపుణులు అంటున్నారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అదంత సులభం కాబోదంటున్నారు. ఫ్రాన్స్ పీఠం మాక్రాన్దే ఫ్రాన్స్ అధ్యక్షునిగా ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (44) వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. దేశ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన మూడో నాయకునిగా నిలిచారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో జాతీయవాదిగా పేరున్న ఫైర్ బ్రాండ్ నాయకురాలు మరీన్ లీ పెన్ (53)పై మాక్రాన్ విజయం సాధించారు. ఇప్పటిదాకా ఐదింట నాలుగొంతుల ఓట్ల లెక్కింపు పూర్తయింది. మాక్రాన్కు 56 శాతానికి పైగా ఓట్లు రాగా పెన్ 44 శాతంతో సరిపెట్టుకున్నారు. 2017లో ఆయన 66 శాతం ఓట్లు సాధించారు. గెలుపు అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘‘ఉక్రెయిన్పై రష్యా యుద్ధం తదితరాల నేపథ్యంలో మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నానా అనుమానాలతో, పలు రకాల విభజనలతో అతలాకుతలంగా ఉన్న దేశాన్ని మళ్లీ ఒక్కతాటిపైకి తెస్తా’’ అని ప్రకటించారు. యూరప్ దేశాధినేతలంతా ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా మాక్రాన్ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఇండో–ఫ్రాన్స్ బంధాన్ని బలోపేతం చేసే దిశగా ఆయనతో మరింతగా కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. -
రికార్డులు బద్దలు.. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఎన్నిక
France election.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వరుసగా రెండోసారి ఎన్నికల్లో మాక్రాన్ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ఎన్నికల్లో మాక్రాన్కు 58 శాతం ఓట్లు రాగా, ప్రత్యర్థి మరీన్ లీపెన్కు 42 శాతం ఓట్లు పడ్డాయి. దీంతో, అధికారిక ఫలితాలు వెలువడక ముందే లీపెన్ తన ఓటమిని అంగీకరించారు. ఈ క్రమంలో మాక్రాన్ విజయం సాధించడంతో ఆయన మద్దతుదారులు ఈఫిల్ టవర్ ముందు జాతీయ గీతాన్ని పాడుతూ ఫ్రాన్స్, యూరోపియన్ జెండాలను ఊపారు. కాగా, ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో మరీన్ లీపెన్పై గెలిచి 39 ఏళ్ల మాక్రాన్ ఫ్రాన్స్ లో అతిపిన్న వయసు గల అధ్యక్షుడిగా రికార్డులకెక్కిన విషయం తెలిసిందే. ఇక, గడిచిన 20 ఏళ్లలో వరుసగా రెండు సార్లు ఫ్రాన్స్ అధ్యక్షుడైన వ్యక్తిగా మాక్రాన్ రికార్డు సృష్టించారు. ఇక, ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్న వేళ మాక్రాన్ రెండోసారి ఎన్నికవడం ఫ్రాన్స్ సహా యూరోపియన్ యూనియన్లో నాయకత్వ స్థిరత్వానికి హామీ ఇచ్చినట్టు అయిందని పలువురు రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. మాక్రాన్ మరోసారి విజయం సాధించడంతో ప్రపంచవ్యాప్తంగా నాయకుల నుండి అభినందనలు అందుతున్నాయి. మాక్రాన్తో కలిసి ఫ్రాన్స్, ఐరోపాలను మరింత అభివృద్ధి చేస్తామని ఈయూ చీఫ్ ఉర్సులా వాన్డర్ లేయెన్ ట్వీట్ చేశారు. ఈయూ, నాటోలో విస్తృతమైన సహకారాన్ని కొనసాగించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ.. "ఫ్రాన్స్ మా అత్యంత సన్నిహిత, ముఖ్యమైన మిత్రదేశాలలో ఒకటి. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మాక్రాన్ మళ్లీ ఎన్నికైనందుకు అభినందనలు" అని అన్నారు. ఇది కూడా చదవండి: ఉక్రెయిన్ ఆయుధాగారాలపై రష్యా ముమ్మర దాడులు -
Russia-Ukraine war: పుతిన్ కుమార్తెలపై ఈయూ ఆంక్షలు
బ్రసెల్స్: పుతిన్ కుమార్తెలిద్దరిపై యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించింది. రష్యాను నిలవరించేందుకు పలు కంపెనీలపై, వ్యక్తులపై ఆంక్షలు విధిస్తూ వస్తున్న ఈయూ తాజాగా మరి కొందరితో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇందులో పుతిన్ కుమార్తెలు మారియా, కేటరీనా ఉన్నట్లు అధికారులు చెప్పారు. వీరి ఆస్తులను స్తంభింపజేయడంతో పాటు వీరి ప్రయాణాలపై నిషేధాన్ని విధించారని ఈయూ అధికారులు తెలిపారు. ఇప్పటికే పుతిన్ కూతుర్లపై అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే! ఉక్రెయిన్లో రష్యా క్రూర చర్యలకు పాల్పడిందన్న వార్తలకు సాక్ష్యాలున్నాయంటూ ఈయూ తాజా ఆం క్షల జాబితాను విడుదల చేసింది. రష్యాలో రిజిస్టరైన నౌకల ను ఈయూ రేవుల్లోకి అనుమతించకూడదని నిర్ణయించారు. కోల్ బ్యాన్ రష్యా బొగ్గు దిగుమతులను నిషేధించాలని కూటమి దేశాలు నిర్ణయించుకున్నాయి. దీంతో తొలిసారి రష్యా ఇంధన ఉత్పత్తులు ఆంక్షల జాబితాలోకి చేరినట్లయింది. ఆగస్టు నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అయితే చమురు, సహజవాయు దిగుమతులపై మాత్రం సభ్యదేశాల్లో ఏకాభిప్రాయం రాలేదు. ఏటా దాదాపు 440 కోట్ల డాలర్ల బొగ్గును రష్యా నుంచి ఈయూ దిగుమతి చేసుకుంటోంది. యూఎస్ తదితర దేశాల నుంచి బొగ్గు దిగుమతులు పెంచుకోవడం ద్వారా రష్యా దిగుమతుల నిషేధ లోటును ఎదుర్కోవాలని ఈయూ నిర్ణయించింది. రష్యా బొగ్గుదిగుమతులపై నిషేధంతో ఈయూలోని కొన్ని దేశాల్లో కరెంటు చార్జీలు విపరీతంగా పెరగనున్నాయని రైస్టాడ్ ఎనర్జీ అంచనా వేసింది. చమురు, సహజవాయువుల విషయంలో మాత్రం ఈయూలోని చాలా దేశాలు అత్యధికంగా రష్యాపై ఆధారపడినందున నిషేధంపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఒకవేళ వీటిపై నిషేధం విధించినా రష్యాకు పెద్దగా సమస్య ఉండదని, తక్కువ ధరకు ఇండియా, చైనాకు రష్యా అమ్ముకోగలదని నిపుణులు భావిస్తున్నారు. ఇదే సమయంలో గల్ఫ్ దేశాలు భారీ రేట్లకు ఈయూ దేశాలకు వీటిని ఎగుమతి చేస్తాయని, దీనివల్ల ఆయా దేశాలపై పెను భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. -
Russia-Ukraine war: రష్యా గ్యాస్కు యూరప్ గుడ్బై!
బ్రసెల్స్: గ్యాస్ సరఫరాకు ప్రధానంగా రష్యాపై ఆధారపడుతూ వస్తున్న యూరప్ ఇకపై దానికి చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు అమెరికా, యూరోపియన్ యూనియన్ మధ్య శుక్రవారం కీలక వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. యూరప్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈయూ ఉన్నతాధికారులతో కలిసి ఒప్పంద వివరాలను వెల్లడించారు. దీని ప్రకారం యూరప్ దేశాల ఇంధన, ముఖ్యంగా గ్యాస్ అవసరాలను చాలావరకు అమెరికా, ఇతర దేశాలు తీరుస్తాయి. యూరప్కు అమెరికా, ఇతర దేశాలు వార్షిక గ్యాస్ ఎగుమతులను మరో 15 బిలియన్ క్యూబిక్ మీటర్ల మేరకు పెంచాలన్నది తాజా ఒప్పంద సారాంశం. దీన్ని మున్ముందు మరింత పెంచుతారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలని అంగీకారం కుదిరింది. యూరప్ తన గ్యాస్ అవసరాల్లో దాదాపుగా 40 శాతం రష్యా నుంచే దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. కొత్త ఒప్పందాలు: జర్మనీ బొగ్గు, గ్యాస్, చమురు కోసం రష్యాపై ఆధారపడటాన్ని వీలైనంతగా తగ్గించుకుంటామని జర్మనీ ప్రకటించింది. ఇందుకోసం కొత్త సప్లయర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టు ఆ దేశ ఆర్థిక మంత్రి రాబర్ట్ హెబెక్ వెల్లడించారు. జర్మనీ గ్యాస్ అవసరాల్లో 45 శాతానికి పైగా రష్యానే తీరుస్తోంది. తమతో స్నేహపూర్వకంగా మసులుకోని దేశాలు గ్యాస్ బిల్లులను రష్యా కరెన్సీ రూబుల్స్లోనే చెల్లించాల్సి ఉంటుందన్న పుతిన్ వ్యాఖ్యలపై యూరప్ దేశాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇది ఒప్పందాల ఉల్లంఘనేనని, ఆచరణసాధ్యం కాదని జర్మనీ చాన్స్లర్ ఒలాప్ స్కోల్జ్, ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ ప్రకటించారు. రష్యాతో నిమిత్తం లేకుండా యూరప్ గ్యాస్ అవసరాలను అమెరికా, ఇతర దేశాలు తీర్చడం సా ధ్యమేనా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిం ది. ఎందుకంటే అమెరికా ఇప్పటికే యూరప్కు భారీగా గ్యాస్ సరఫరా చేస్తోంది. తాజా ఒప్పందం నేపథ్యంలో అంతకుమించి సరఫరా చేసేందుకు అమెరికా సిద్ధపడ్డా దాన్ని దిగుమతి చేసుకునే, పంపిణీ చేసే వ్యవస్థలు యూరప్లో ప్రస్తుతానికి లేవు. -
Putin: పుతిన్.. ఏం మెలిక పెట్టావయ్యా!
ఆంక్షలతో రష్యాను ఇరకాటంలో పెట్టాలని అమెరికా, పాశ్చాత్య దేశాలు(ఈయూ దేశాలతో కలిపి) తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కానీ, తగ్గేదే లే అనుకుంటూ ఉక్రెయిన్పై మిలిటరీ చర్యలను కొనసాగిస్తూనే ఉంది రష్యా. ఈ క్రమంలో.. రష్యా ఆర్థిక స్థితి కొద్దికొద్దిగా దిగజారుతోంది. తాజాగా పుతిన్ ‘మిత్రపక్షంలో లేని దేశాలకు’ పెద్ద షాకే ఇచ్చాడు. సహజ వాయువుల ఉత్పత్తులు కావాలంటే చెల్లింపులను రష్యన్ కరెన్సీ రూబుల్స్లో మాత్రమే చెల్లించాలంటూ కండిషన్ విధించాడు. లేదంటే ఉత్పత్తిని ఆపేస్తానని హెచ్చరించాడు. క్రెమ్లిన్ను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు, రష్యన్ ఆస్తులను ఫ్రీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. యూరోపియన్ దేశాల కరెన్సీ విశ్వసనీయతపై ప్రభావవంతంగా ఒక గీతను గీయడం, ఆ కరెన్సీల నమ్మకాన్ని దెబ్బతీయడం ద్వారా.. తన దారికి తెచ్చుకోవాలన్నది పుతిన్ ఫ్లాన్ అయి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే యూరోలు, డాలర్లకు బదులు.. రష్యన్ రూబుల్స్లోనే రష్యన్ గ్యాస్ కోసం చెల్లింపు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. పైగా ఈ షరతు పుతిన్కు పెద్ద అడ్వాంటేజే. ఒకవేళ ఈ షరతు.. రష్యాకు మునుముందు ఇబ్బందికరంగా గనుక మారితే వెంటనే ఎత్తేసే ఆలోచనలోనూ పుతిన్ ఉన్నట్లు తెలుస్తోంది. యూరోపియన్ యూనియన్ మొత్తం 90 శాతం సహజ వాయువుల్ని దిగుమతి చేసుకుంటున్నాయి. కరెంట్ తయారీకి, ఇళ్ల వెచ్చదనానికి, పరిశ్రమల కోసం ఈ గ్యాస్లనే ఉపయోగించుకుంటున్నాయి. అందులో 40 శాతం ఉత్పత్తి రష్యా నుంచి కావడంతోనే.. ఈయూ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రూబుల్ ఎలా ఉంటుందో తెలీదు ఇదిలా ఉంటే పుతిన్ రూబుల్ షరతుపై యూరోపియన్ యూనియన్ దేశాలు గగ్గోలు మొదలుపెట్టాయి. ‘నాకు తెలిసి యూరప్లో.. ఏ దేశానికీ రష్యా రూబుల్ ఎలా ఉంటుందో తెలిసి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు రూబుల్స్లో ఎలా చెల్లిస్తారు?’ అని స్వోవేనియా ప్రధాని జనెజ్ జన్సా అంటున్నారు. జర్మన్ ఛాన్స్లర్ ఒలాఫ్ స్కోల్జ్, ఇటలీ ప్రధాని మరియో డ్రాఘి తదితరులు కూడా ఇవే అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బెల్జియం లాంటి దేశం.. ఆకాశాన్ని అంటిన గ్యాస్ ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఒకవేళ పుతిన్ గనుక ఇదే ధోరణితో ముందుకు వెళ్తే గనుక.. కాంట్రాక్ట్ ఉల్లంఘనల కింద చర్యలకు దిగుతామని కొన్ని దేశాలు చెబుతున్నాయి. చదవండి: పుతిన్ పక్కన కూర్చోవడమా? నా వల్ల కాదు! -
ముట్టడిలో మారియుపోల్.. నగరంలో 20 వేలకు పైగా పౌరుల మృతి?
కీవ్: ఉక్రెయిన్పై రష్యా ముట్టడి తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది. రేవుపట్టణం మారియుపోల్ను ఆక్రమించే ప్రయత్నాలను రష్యా సైన్యం తీవ్రతరం చేసింది. నగరం వీడాల్సిందిగా ఉక్రెయిన్ దళాలకు సోమవారం సూచించింది. ‘‘తెల్ల జెండాలు ఎగరేసి, ఆయుధాలు వదిలి వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డవాళ్లంతా హ్యుమానిటేరియన్ కారిడార్ల గుండా సురక్షితంగా వెళ్లిపోయేలా చూస్తాం. మరుక్షణమే నగరంలోకి అత్యవసరాల సరఫరాను అనుమతిస్తాం’’ అని కల్నల్ జనరల్ మిఖాయిల్ మిజింట్సెవ్ చెప్పారు. ఉక్రెయిన్ అందుకు నిరాకరించింది. దాంతో రష్యా దళాలు రెచ్చిపోయాయి. ఎడాపెడా క్షిపణి, బాంబు దాడులతో కనీవినీ ఎరగని రీతిలో నగరంపై విరుచుకుపడుతున్నాయి. ఒక్క మారియుపోల్లోనే కనీసం 20 వేల మంది దాకా మరణించి ఉంటారన్న వార్తలు అందరినీ కలచివేస్తున్నాయి! దీనిపై యూరోపియన్ యూనియన్ తీవ్రంగా స్పందించింది. రష్యా తీవ్ర యుద్ధ నేరాలకు పాల్పడుతోందంటూ దుమ్మెత్తిపోసింది. మారియుపోల్లో వేలాదిగా పౌరులను అతి కిరాతకంగా, విచక్షణారహితంగా పొట్టన పెట్టుకుంటున్న తీరు దుర్మార్గమని ఈయూ విదేశీ విధాన చీఫ్ జోసెఫ్ బోరెల్ విమర్శించారు. ‘‘రష్యా నైతికంగా అధఃపాతాళానికి దిగజారింది. యుద్ధంలోనూ నీతీ నియమాలుంటాయని మర్చిపోయింది’’ అంటూ దుయ్యబట్టారు. రష్యా యుద్ధ నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు సాక్ష్యాలను సేకరిస్తోంది. కీవ్... కదనరంగం: రాజధాని కీవ్ను ఆక్రమించే ప్రయత్నాలను రష్యా మరింత ముమ్మరం చేసింది. ఆదివారం అర్ధరాత్రి రష్యా సైన్యం జరిపిన బాంబు దాడుల్లో జనసమ్మర్ధ ప్రాంతంలోని ఓ షాపింగ్ సెంటర్ నేలమట్టమైంది. కనీసం ఎనిమిది మంది చనిపోయినట్టు సమాచారం. రాజధానిని చుట్టుముట్టి స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వీటిని ఉక్రెయిన్ సైనికులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. సమీలో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో 50 టన్నుల భారీ ట్యాంక్ నుంచి అమోనియా లీకయింది. దాంతో చుట్టుపక్కల రెండున్నర కిలోమీటర్ల మేర వాతావరణం బాగా కలుషితమైనట్టు సమాచారం. తీవ్ర ప్రయత్నాల తర్వాత లీకేజీని అరికట్టారు. ఇతర నగరాలనూ సుదూరాల నుంచి క్షిపణి దాడులతో రష్యా బెంబేలెత్తిస్తోంది. ఉక్రెయిన్ దళాలు రష్యా సైన్యంపై చాటునుంచి దాడులు చేసి పారిపోతూ గెరిల్లా వ్యూహం అనుసరిస్తున్నాయి. ఆహారం తదితర అత్యవసర సరఫరాలను అడ్డుకుంటున్నాయి. రివెన్ సమీపంలో సైనిక శిక్షణ కేంద్రంపై క్షిపణులతో దాడి చేసి 80 మందికి పైగా ఉక్రెయిన్, కిరాయి సైనికులను చంపేసినట్టు రష్యా చెప్పింది. రేవు పట్టణం ఒడెసాపై దాడులను తీవ్రతరం చేయాల్సిందిగా పుతిన్ ఆదేశించారు. దాంతో రష్యా సేనలు యుద్ధ నౌకల నుంచి పౌరులపైకి కూడా క్షిపణులు ప్రయోగిస్తున్నాయి. బెనెట్కు థాంక్స్: జెలెన్స్కీ చర్చల కోసం ఇజ్రాయెల్ ప్రధాని బెనెట్ చేస్తున్న ప్రయత్నాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్ట్ స్కూలుపై బాంబు వేసిన పైలట్ను హతమార్చి తీరతామన్నారు. చర్చల్లో సానుకూల సంకేతాలు కన్పిస్తున్నాయని బెనెట్ చెప్పారు. ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్లను రష్యా స్థానిక కోర్టు నిషేధించింది! మొరాయించిన చెర్నోబిల్ మానిటర్లు ఉక్రెయిన్లోని చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రంలోని రేడియేషన్ మానిటర్లు పని చేయడం లేదు! ఉక్రెయిన్ అణు నియంత్రణ సంస్థ సోమవారం ఒక ప్రకటనలో ఈ మేరకు వెల్లడించింది. ‘‘వాతావరణం క్రమంగా వేడెక్కుతున్న నేపథ్యంలో ప్లాంటు సమీపంలోని అడవులను కాపాడేందుకు అవసరమైన సంఖ్యలో అగ్నిప్రమాపక సిబ్బంది కూడా అందుబాటులో లేరు. ఫలితంగా రేడియేషన్ లీకేజీని అడ్డుకోవడం కష్టం కావచ్చు’’ అని హెచ్చరించింది. శనివారం పోలండ్కు బైడెన్ అత్యవసర చర్చల కోసం ఈ వారాంతంలో యూరప్ రానున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ట్రిప్లో భాగంగా శనివారం పోలండ్లో కూడా పర్యటించాలని నిర్ణయించుకున్నారు. గురువారం నాటో నేతలతో శిఖరాగ్ర భేటీలో బైడెన్ పాల్గొంటారు. తర్వాత బ్రసెల్స్ నుంచి పోలండ్ వెళ్తారని వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ జాన్ సాకీ తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, జర్మనీ చాన్సలర్ షోల్జ్, ఇటలీ, ఇంగ్లండ్ ప్రధానులు మారియో డ్రాగీ, బోరిస్ జాన్సన్లతో కూడా సోమవారం బైడెన్ చర్చలు జరిపారు. -
రష్యాది ఉగ్రవాదం.. ఎవరూ మర్చిపోబోరు, క్షమించలేరు
రష్యాది ఉగ్రవాదమంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ తూర్పారబట్టారు. నానాటికీ పాశవికంగా ప్రవర్తిస్తోందని, యుద్ధోన్మాదంతో పేట్రేగిపోతోందని దుయ్యబట్టారు. ఖర్కీవ్లో సెంట్రల్ ఫ్రీడం స్క్వేర్ భవనంపై మిసైల్ దాడి చేసిన తీరు యుద్ధం నేరానికి ఏమాత్రం తీసిపోదన్నారు. రష్యా పైశాచికత్వాన్ని ‘‘ఎవరూ మర్చిపోలేరు. ఎవరూ క్షమించబోరు’’ అన్నారు. తర్వాత యూరోపియన్ పార్లమెంటును ఉద్దేశించి ఆయన భావోద్వేగపూరితంగా మాట్లాడారు. ‘‘మేం శాయశక్తులా పోరాడుతున్నాం. ఈ పోరాట పటిమ ద్వారా మేమేంటో అందరికీ చూపిస్తున్నాం. తోటి యూరప్ దేశాలతో సమానులుగా నిలవాలన్నది మా ఉద్దేశం. మడమ తిప్పని పోరాటంతో దాన్నిప్పటికే రుజువు చేసుకున్నామని భావిస్తున్నాం’’ అన్నారు. ఇప్పటికైనా పోరాటంలో తమతో మరింతగా కలిసి రావాలని యూరప్ దేశాలకు విజ్ఞప్తి చేశారు. ఈయూలో చేర్చుకోవాలన్న తమ విజ్ఞప్తిపై తక్షణం నిర్ణయం తీసుకోవాలని కోరారు. చర్చల్లో ఏ విషయంలోనూ తాము వెనక్కు తగ్గబోమని స్పష్టం చేశారు. ఒకవైపు ప్రాణాంతక ఆయుధాలతో యుద్ధానికి దిగి, మరోవైపు సర్దుకుపొమ్మనడం ఏం న్యాయమని ప్రశ్నించారు. తగ్గేదే లేదు: రష్యా ప్రపంచమంతా దుమ్మెత్తిపోస్తున్నా రష్యా మాత్రం తగ్గేదే లేదంటోంది. తమ లక్ష్యాలను సాధించేదాకా వెనకడుగు వేసేది లేదని రష్యా రక్షణ మంత్రి మంగళవారం పునరుద్ఘాటించారు. యూరప్ తమపై ఆర్థిక యుద్ధానికి దిగుతోందని ఆంక్షలనుద్దేశించి ఆయన దుయ్యబట్టారు. అది నిజమైన యుద్ధంగా మారినా ఆశ్చర్యం లేదంటూ వాటిని హెచ్చరించారు. విధ్వంసం మధ్యే సేవలు... చుట్టూ బాంబులు, క్షిపణుల మోతలు హోరెత్తిపోతున్నా ఉక్రెయిన్ వైద్య సిబ్బంది మాత్రం వెరుపు లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ఖర్కీవ్లోని ఓ ఆస్పత్రిలో ప్రసూతి వార్డును తాత్కాలికంగా బాంబ్షెల్టర్గా మార్చారు. గర్భిణులను, నవజాత శిశువులను జాగ్రత్తగా అందులోకి చేర్చి కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. -
Russia - Ukraine war: ఉక్రెయిన్ అధ్యక్షుడి సంచలన నిర్ణయం
గత కొద్ది రోజులుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇరు దేశాల అధ్యక్షుల మధ్య జరిగిన శాంతి చర్చలు కూడా విఫలం కావడంతో ఎవరూ తగ్గేదేలే అంటున్నారు. ఎవరికి వారు యుద్ధ ప్రణాళికలు రచిస్తూ ఇరు దేశాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాపై పోరాటంలో పాల్గొనేందుకు తమ దేశంలోని యుద్ధ అనుభవం ఉన్న ఖైదీలను విడుదల చేస్తానని ప్రకటించారు. యుద్ధంలో పాల్గొనే ఖైదీలకు విముక్తి ప్రసాదిస్తానని పేర్కొన్నారు. మీ ప్రాణాలు కాపాడుకోండి ఉక్రెయిన్లోని రష్యన్ సైనికులను తమ ఆయుధాలు వదిలి తిరిగి వెల్లాల్సిందిగా పిలుపునిచ్చాడు. దాంతో పాటు ‘మీ ప్రాణాలను కాపాడుకోండి లేదా వదిలివేయండి’ అంటూ వారికి జెలెన్స్కీ హెచ్చరికను కూడా జారీచేశారు. అంతేగాక జెలెన్స్కీ రష్యన్ సైనికులనుద్దేశించి మాట్లాడుతూ.. మీరు మీ కమాండర్లను, ప్రచారకర్తలను నమ్మవద్దు. మీ ప్రాణాలను మీరు కాపాడుకోవాలని తెలిపారు. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 4,500 మంది రష్యా సైనికులు మరణించారని ఆయన ప్రకటించారు. రాబోయే 24 గంటలు తమ దేశానికి కీలకమైన కాలమని జెలెన్స్కీ పేర్కొన్నారు. శాంతి చర్చల కోసం బెలారస్ దేశ సరిహద్దులో ఉక్రెయిన్ ప్రతినిధుల బృందం, రష్యా ప్రతినిధులు సమావేశమైన సందర్భంగా దేశ రాజధాని కీవ్లో ప్రసంగించిన సందర్భంగా జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా తమ దేశానికి వెంటనే యూరోపియన్ యూనియన్(ఈయూ)లో సభ్యత్వం ఇవ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభ్యర్థించారు. యూరోపియన్లందరితో కలిసి ఉండాలనేది తమ లక్ష్యమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తమ న్యాయమైన హక్కుగా భావిస్తున్నానని, అలాగే ఇది సాధ్యమవుతుందని కూడా భావిస్తున్నట్టు జెలెన్స్కీ తెలిపారు. -
ఉక్రెయిన్పై రష్యా దాడి: ప్రపంచదేశాలు ఏమంటున్నాయంటే..?
బ్రస్సెల్స్: ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. మరింత తీవ్రమైన ఆంక్షలతో రష్యాను దారికి తీసుకువస్తామని ప్రతినబూనాయి. ఉక్రెయిన్ను సైనికపరంగా రక్షించలేని పరిస్థితుల్లో యూరప్లో యుద్ధమేఘాలు కమ్ముకోకుండా చూడటమే వారి ఉద్దేశంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. నాటో ఇప్పటికే రష్యా వైపు తన పశ్చిమ విభాగం సైనికదళాలను సిద్ధం చేసింది. ►తన వ్యవహారంలో ఇతర దేశాలు జోక్యం చేసుకుంటే చరిత్రలో ఎన్నడూ చూడని పరిస్థితులను చవిచూస్తారంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో శుక్రవారం నాటో నేతల వర్చువల్ సమావేశం జరగనుంది. ►యూరోపియన్ యూనియన్(ఈయూ), నాటో సభ్యదేశం లిథువేనియా దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. రష్యాలోని కలినిన్గ్రాడ్కు, రష్యా మిత్రదేశం బెలారస్కు అతి సమీపంలో ఈదేశం ఉంది. ►నాటో దేశాలు తమకున్న 100 జెట్ విమానాలు, 120 యుద్ధ నౌకలను యుద్ధసన్నద్ధం చేశాయి. నాటో సభ్య దేశాలపై ఎలాంటి దాడి జరిగినా, అంగుళం భూమిని ఆక్రమించినా కాపాడుకుని తీరుతామని నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ ప్రకటించారు. ఉక్రెయిన్ నాటో సభ్యదేశం కాదు. ►ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య ఒక స్వతంత్ర దేశంపై రాక్షసత్వంగా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా పేర్కొన్నారు. రష్యా చర్యలతో యూరప్ మాత్రమే కాదు, ప్రపంచదేశాల భద్రతకు ముప్పువాటిల్లిందన్నారు. ఈ పరిస్థితుల్లో ఈయూ దేశాలు బ్రస్సెల్స్లో అత్యవసర భేటీ అయి, రష్యాలోని కీలక రంగాలపై కఠిన ఆంక్షల ప్రతిపాదనలపై చర్చించనున్నాయి. ►యుద్ధ జ్వాలలు యూరప్లో వ్యాపించడం ఎవరికీ ఇష్టం లేకపోవడంతో ఏ దేశం కూడా ఉక్రెయిన్కు సైన్యాన్ని పంపి ఆదుకుంటామని హామీ ఇవ్వకపోవడం గమనార్హం. ఉక్రెయిన్కు సాయంగా ఇప్పట్లో తమ సైన్యాన్ని పంపిస్తామంటూ అమెరికా సహా పశ్చిమదేశాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ►‘ఆర్థికంగా, దౌత్యపరంగా, రాజకీయంగా కఠిన ఆంక్షలు విధించి రష్యాను మా దారికి తెచ్చు కుంటాం. చివరికి పుతిన్ విఫలం కాకతప్పదు’ అని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హెచ్చ రించారు. ప్రస్తుత పరిణామాలను అంచనా వేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జాతీయ భద్రతా మండలిని సమావేశపరిచారు. చదవండి: (గ్యాసో లక్ష్మణా!.. యుద్ధంతో యూరప్ ఉక్కిరిబిక్కిరి) చైనా ఏం చేసింది? చైనా మినహా దాదాపు అన్ని దేశాలు కూడా రష్యా చర్యను ఖండించాయి. రష్యాపై చర్యల విషయంలో అగ్రదేశాల మధ్య ఏకాభిప్రాయం కొరవడింది. రష్యా దురాక్రమణను చైనా ఖండించకపోగా అమెరికా, దాని మిత్ర దేశాలే ఈ పరిస్థితులకు కారణమంటూ నిందించింది. ప్రపంచంలోనే అతిపెద్ద గోధుమల ఎగుమతిదారైన రష్యాపై పశ్చిమదేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీనికి విరుగుడుగా, ఆ దేశం నుంచి గోధుమలను దిగుమతి చేసుకుంటామంటూ చైనా ప్రకటించింది. ఫలితంగా, ఆంక్షల ప్రభావం చాలా వరకు తగ్గి, రష్యాకు ఆర్థిక వెసులుబాటు లభించనుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: (30 ఏళ్ల వివాదం: ఉప్పునిప్పుగా ఉక్రెయిన్–రష్యా బంధం) -
30 ఏళ్ల వివాదం: ఉప్పునిప్పుగా ఉక్రెయిన్–రష్యా బంధం
నేషనల్ డెస్క్, సాక్షి: ఉక్రెయిన్తో రష్యా వివాదం ఇప్పటిది కాదు. ఉక్రెయిన్ వందలాది ఏళ్లుగా రష్యన్ సామ్రాజ్యంలో భాగమే. తర్వాత కూడా అవిభక్త సోవియట్ యూనియన్లో భాగంగానే కొనసాగుతూ వచ్చింది. 30 ఏళ్ల క్రితం, అంటే 1991లో ప్రచ్ఛనయుద్ధానంతరం సోవియట్ విచ్ఛిన్నం తర్వాత ఉక్రెయిన్ స్వతంత్ర దేశమైంది. నాటి నుంచీ రష్యాతో విభేదాలు రగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ యూరప్ దేశాల వైపు మొగ్గుతుండటం రష్యాను కలవరపెడుతూ వచ్చింది. యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం కోరడంతో పాటు తనను నాటోలో చేర్చుకోవాలని కూడా ఉక్రెయిన్ విజ్ఞప్తి చేసింది. ఈ పరిణామం రష్యాను మరింత కలవరపెట్టింది. నాటో కూటమి ఉక్రెయిన్లో తిష్ట వేస్తే తన భద్రతకు పెను ముప్పన్నది రష్యా ఆందోళన. పైగా నాటోలో చేరితే అమెరికా సహా సభ్య దేశాల సైనిక దన్నుతో ఉక్రెయిన్ బలోపేతమవుతుంది. ఈ పరిణామం రష్యా అధ్యక్షుడు పుతిన్ను కలవరపెట్టింది. 2000లో రష్యా పగ్గాలు చేపట్టిన నాటినుంచే ఉక్రెయిన్పై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నాటో సభ్యత్వం ఇవ్వకూడదని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. చదవండి: (రష్యాకు స్ట్రాంగ్ వార్నింగ్.. ఆ దేశాల జోలికొస్తే ఖబడ్దార్) వివాదాల్ని ఎగదోసి... ఉక్రెయిన్లో తమ కీలుబొమ్మ సర్కార్లను ఏర్పరచడం ద్వారా ఆ దేశ వ్యవహారాలను నియంత్రించేందుకు పుతిన్ ప్రయత్నించారు. పుతిన్ దన్నుతో ఉక్రెయిన్ అధ్యక్షుడైన విక్టర్ యాంకోవిచ్ రష్యా అనుకూల వ్యవహారాలతో వివాదాస్పదునిగా నిలిచారు. 2014లో యూరోపియన్ యూనియన్లో చేరేందుకు నిరాకరించారు. దీనిపై జనాగ్రహం పెల్లుబికి ఆందోళనలు చెలరేగడంతో పదవి నుంచి దిగిపోయారు. ఈ కల్లోల సమయంలో రష్యా హఠాత్తుగా దాడికి దిగి దక్షిణ ఉక్రెయిన్లోని రష్యన్ల మెజారిటీ ప్రాంతమైన క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించి తనలో కలిపేసుకుంది. అంతటితో ఆగకుండా తూర్పు ఉక్రెయిన్లో డొనెట్స్క్, లుహాన్స్క్ల సమాహారమైన డోన్బాస్ ప్రాంతంలో వేర్పాటువాద ఆందోళనలకు అన్నివిధాలా మద్దతిస్తూ వచ్చింది. అక్కడ చెలరేగిన హింసాకాండకు 14 వేల మందికి పైగా బలయ్యారు. చదవండి: (Russia-Ukraine War: నా పదవీకాలంలో అత్యంత విషాద క్షణాలు!) మిన్స్క్ ఒప్పందం ఉద్రిక్తతలను చల్లార్చేందుకు యూరప్ దేశాలు రంగంలోకి దిగాయి. ఫలితంగా 2015లో బెలారస్ రాజధాని మిన్స్క్లో జర్మనీ, ఫ్రాన్స్ మధ్యవర్తిత్వంలో రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం వేర్పాటువాదులు ఆక్రమించుకున్న డొనెట్స్క్, లుహాన్స్క్ వ్యవహారాల్లో ఉక్రెయిన్ వేలు పెట్టరాదు. యథాతథ స్థితి కొనసాగింపునకు రష్యా అంగీకరించాలి. కానీ ఒప్పందాన్ని గౌరవించడం లేదంటూ రెండు దేశాలూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొద్ది నెలలుగా ఉక్రెయిన్కు మూడువైపులా భారీ సైనిక మోహరింపులకు పుతిన్ తెర తీసి పశ్చిమ దేశాలకు కంటిపై కునుకు లేకుండా చేశారు. యుద్ధం ఆలోచన లేదంటూనే మోహరింపులను రెండు లక్షల దాకా పెంచారు. బెలారస్లో వేలాది సైనికులతో అణు విన్యాసాలు చేస్తూ వచ్చారు. తాజాగా డోన్బాస్కు స్వతంత్ర హోదా ఇస్తున్నట్టు ప్రకటించడమే గాక, ఉక్రెయిన్కు చరిత్రలో ఎన్నడూ ప్రత్యేక అస్తిత్వం లేదంటూ తన ఉద్దేశాలను చెప్పకనే చెప్పారు. వెనువెంటనే దానిపైకి యుద్ధానికి దిగి యూరప్లో పెను సంక్షోభానికి తెర తీశారు. ఇలా మొదలైంది.. 2021 మార్చి ఉక్రెయిన్ సరిహద్దుల వెంబడి రష్యా సైన్యాల మోహరింపు ఆరంభం 2021 డిసెంబర్ సరిహద్దుల వద్ద దాదాపుగా లక్ష దాకా మోహరించిన రష్యా సైన్యాలు 2022 జనవరి ►ఉద్రిక్తతలను చల్లార్చేందుకు రష్యా, నాటో మధ్య చర్చలు. ►సేనలను అప్రమత్తం చేసిన నాటో 2022 ఫిబ్రవరి ►తూర్పు ఉక్రెయిన్లోని 2 రెబెల్ ప్రాబల్య ప్రాంతాల్లోకి రష్యా సైన్యం ►రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించిన పశ్చిమ దేశాలు ►ఉక్రెయిన్పై పూర్తిస్థాయి దాడికి రష్యా శ్రీకారం -
పోర్చుగల్లో సోషలిస్టుల గెలుపు
లిస్బన్: పోర్చుగల్లోని లెఫ్టిస్టు ఆలోచనాధోరణితో కూడిన సోషలిస్ట్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోమారు విజయం సాధించింది. కోవిడ్తో కునారిల్లిన పోర్చుగల్ ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు యూరోపియన్ యూనియన్ వందల కోట్ల యూరోల సాయాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సోషలిస్టుపార్టీ మరోమారు విజయదుందుభి మోగించింది. కరోనా వైరస్ కేసుల పెరుగుదల సమయంలో జరిగిన ఈ ఎన్నికలలో 230 సీట్ల పార్లమెంటులో సోషలిస్టులు 106 సీట్లు గెలుచుకున్నారు. ఆదివారానికి ఎన్నికల్లో 98.5 శాతం ఓట్లను లెక్కించగా ఇందులో సోషలిస్టులు 41 శాతం ఓట్లను పొందారు. సోషలిస్టుల ప్రధాన ప్రత్యర్థి సెంటర్–రైట్ సోషల్ డెమోక్రటిక్ పార్టీకి 28 శాతం ఓట్లు వచ్చాయి. ఈ పార్టీ 65 పార్లమెంటరీ స్థానాలను గెలుచుకుంది. దేశంలోని 1.08 కోట్ల అర్హులైన ఓటర్లలో ఈ దఫా విదేశాల్లో నివసిస్తూ మెయిల్ ద్వారా ఓటు వేసే 15 లక్షల మంది ఓట్లను పరిగణనలోకి తీసుకోలేదు. మరోదఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న ప్రధాని ఆంటినో కోస్టాకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పోర్చుగల్తో బలమైన బంధాన్ని కోరుకుంటున్నామన్నారు. 116 సీట్ల మెజార్టీ.. పార్లమెంట్లో మెజార్టీకి అవసరమైన 116 సీట్లను సోషలిస్టులు గెలుచుకుంటారా? లేక చిన్న పార్టీల మద్దతు అవసరంపడుతుందా అనే విషయమై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. పోర్చుగీస్ టెలివిజన్ చానెళ్ల ప్రత్యేక ఎగ్జిట్ పోల్స్ మాత్రం సోషలిస్టులకు పూర్తి మెజార్టీ రావచ్చని అంచనా వేశాయి. పోర్చుగల్లో కొత్త ప్రభుత్వంపై అంచనాలు అధికంగా ఉన్నాయి. పశ్చిమ యూరప్లో పేదదైన ఈ దేశానికి ఈయూ 5000 కోట్ల డాలర్ల సాయం అందించనుంది. ఈ మొత్తంలో మూడింట రెండు వంతులు ప్రధాన మౌలిక సదుపాయాలు కోసం ఉద్దేశించారు. మిగిలిన మొత్తాన్ని ప్రైవేట్ కంపెనీలకు అందిస్తారు. పార్లమెంట్లో పూర్తి మెజార్టీ ఉన్న ప్రభుత్వం ఏర్పడితే ఈ నిధుల కేటాయింపు, వ్యయం సజావుగా సాగుతాయని నిపుణులు భావిస్తున్నారు. 2022 కోసం అప్పటి మైనారిటీ సోషలిస్ట్ ప్రభుత్వం రూపొందించిన వ్యయ ప్రణాళికను పార్లమెంటు గత నవంబర్లో తిరస్కరించింది. దీంతో నూతన వ్యయప్రణాళిక అమలుకు స్థిర ప్రభుత్వ అవసరం ఉంది. 2015లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి, వార్షిక బడ్జెట్ను ఆమోదానికి ప్రతిసారీ మిత్రపక్షాలైన లెఫ్ట్ బ్లాక్, పోర్చుగీస్ కమ్యూనిస్ట్ పార్టీల మద్దతుపై సోషలిస్టు పార్టీ ఆధారపడుతోంది. కానీ రెండు నెలల క్రితం ఈపార్టీల మధ్య విభేదాలు ముదిరాయి. దీంతో పార్లమెంట్లో సోషలిస్ట్ ప్రధాన మంత్రి ఆంటినో కోస్టాకు మెజార్టీ మద్దతు గగనమైంది. ఈ ఎన్నికల్లో మెజార్టీ సోషలిస్టులకు తగినంత బలాన్ని ఇవ్వనుంది. చేగా.. గెలుపు పోర్చుగల్లో వరుసగా రెండుమార్లు సోషలిస్టు పార్టీనే అధికారంలో ఉంది. దీని ప్రధాన ప్రత్యర్థి సోషల్ డెమొక్రాటిక్ పార్టీ. ఈ రెండు పార్టీలే దేశంలో దశాబ్దాలుగా అధికారం అనుభవిస్తున్నాయి. కానీ ఈసారి చేగా అనే పార్టీ సత్తా చూపింది. మూడు సంవత్సరాల క్రితం దేశంలో ఆవిర్భవించిన ప్రజాకర్షక మరియు జాతీయవాద పార్టీ చేగా (చాలు అని అర్థం) ఈ ఎన్నికల్లో 5– 8 శాతం ఓట్లను కొల్లగొట్టినట్లు ఆర్టీపీ పోల్స్ అంచనా వేసింది. దీంతో ఈ పార్టీకి పార్లమెంట్లో 13 సీట్లు దక్కవచ్చని అంచనా. గత ఎన్నికల్లో ఈ పార్టీ కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. పోర్చుగీస్ కమ్యూనిస్ట్ పార్టీకి 3– 5 శాతం ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో 46– 51 శాతం మధ్య పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో 48.6 శాతం పోలింగ్ నమోదైంది. కరోనా కారణంగా అర్హులైన ఓటర్లలో దాదాపు 10 లక్షలమంది ఇంకా ఐసోలేషన్లోనే ఉన్నారు. దేశాధ్యక్షుడు మార్సెలో రెబోలో డీసౌజా సైతం ఓటు వేయమని ప్రజలకు పిలుపునిచ్చారు. -
ప్రపంచాన్ని వణికిస్తున్న బి.1.1.529.. డబ్ల్యూహెచ్ఓ ఏమంటోంది?
బ్రస్సెల్స్/జెనీవా: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కుప్పకూలిన స్టాక్మార్కెట్లు.. పతనమైన సెన్సెక్స్.. భారీగా నష్టపోయిన మదుపరులు.. పెరిగిన ముడి చమురు ధరలు.. విమాన ప్రయాణాలపై ఆంక్షలు.. వీటన్నంటికీ కారణం ఒకేఒక్క కొత్త రకం కరోనా వైరస్. అదే బి.1.1.529. ఆఫ్రికా ఖండం బోట్స్వానా దేశంలో బయటపడిన ఈ వేరియంట్ దక్షిణాఫ్రికా, హాంకాంగ్, బెల్జియం, ఇజ్రాయెల్కు సైతం విస్తరించింది. ఇది అత్యధిక వేగంతో వ్యాప్తిచెందే వేరియంట్ అని సమాచారం అందుతుండడంతో ఆసియా, యూరప్ దేశాలు అప్రమత్తమయ్యాయి. నియంత్రణ చర్యలు ప్రారంభించాయి. కొత్త వేరియంట్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఆఫ్రికా ఖండం దక్షిణ ప్రాంతం నుంచి విమాన ప్రయాణాలపై నిషేధానికి 27 దేశాల యూరోపియన్ యూనియన్ కూటమి అంగీకరించింది. బి.1.1.529 వేరియంట్ తమ దేశంలోకి ప్రవేశిస్తే కష్టాలు తప్పవని జర్మనీ ఆరోగ్యమంత్రి జెన్స్ స్పాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా సంబంధిత మరణాల సంఖ్య ఇప్పటికే 50 లక్షల మార్కును దాటేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదకరమైన కొత్త వేరియంట్ పంజా విసిరితే భరించే శక్తి లేదని చాలా దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ల ప్రభావాన్ని ఢీకొట్టే శక్తి కొత్త వేరియంట్కు ఉందన్న సమాచారం బెంబేలెత్తిస్తోంది. మనిషి శరీరంలోని రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకొనే సామర్థ్యం దీనికి ఉందని పరిశోధకులంటున్నారు. కరోనా టీకా తీసుకున్నా కొత్త వేరియంట్ జనాభాలో ఎక్కువ శాతం మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. తమ దేశంలో కొత్త వేరియంట్ తొలి కేసును గుర్తించినట్లు ఇజ్రాయెల్ శుక్రవారం ప్రకటించింది. మలావీ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిలో ఈ వేరియంట్ బయటపడిందని వెల్లడించింది. అతడితోపాటు మరో ఇద్దరు అనుమానితులను ఐసోలేషన్లో ఉంచామని తెలిపింది. వీరు గతంలో టీకా తీసుకున్నారంది. ఆంక్షలు వద్దంటున్న డబ్ల్యూహెచ్ఓ బి.1.1.529 వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను కూడా కుదిపేసింది. యూరప్, ఆసియాలో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. కొత్త వేరియంట్ విషయంలో ఇప్పుడే తుది నిర్ణయానికి రావొద్దని, భయాందోళనలు అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రతినిధి డాక్టర్ మైఖేల్ ర్యాన్ భరోసానిచ్చారు. దేశాలు సరిహద్దులను మూసివేయొద్దని, ప్రయాణాలపై ఆంక్షలు సరికాదని సూచించారు. మైఖేల్ ర్యాన్ వినతిని బ్రిటన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. దక్షిణాఫ్రికాతోపాటు ఆఫ్రికా ఖండంలోని మరో ఐదు దేశాల నుంచి విమానాల రాకను నిషేధించింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. ఇటీవలి కాలంలో ఆయా దేశాల నుంచి వచ్చినవాళ్లు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని ఆదేశించింది. ఆఫ్రికా నుంచి వస్తే క్వారంటైన్ దక్షిణాఫ్రికా నుంచి విమానాల రాకను నిలిపివేసినట్లు జర్మనీ ప్రకటించింది. కేవలం జర్మన్ పౌరులు మాత్రం రావొచ్చని, స్వదేశానికి వచ్చాక 14 రోజులపాటు క్వారంటైన్లో ఉండాలని సూచించింది. దక్షిణాఫ్రికా ప్రాంతంలోని ఏడు దేశాల నుంచి ఎవరూ తమ దేశంలోకి అడుగుపెట్టొద్దని ఇటలీ ఆరోగ్య శాఖ చెప్పింది. ఆఫ్రికాలోని కొన్ని దేశాల నుంచి వచ్చిన తమ పౌరులు క్వారంటైన్లో ఉండాలని జపాన్ ప్రభుత్వం పేర్కొంది. బోట్స్వానా, ఎస్వాటినీ, లెసోతో, మొజాంబిక్, నమీబియా, దక్షిణాఫ్రికా, జింబాబ్వే దేశాల నుంచి వచ్చే వారిపై సింగపూర్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. భారత్ సంగతేంటి? ప్రయాణ ఆంక్షలపై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల నుంచి భారత్కు వచ్చినవారికి కరోనా నిర్ధారణ పరీ క్షలు కచ్చితంగా నిర్వహించాలంటూ ఆదే శాలు జారీ చేసింది. డబ్ల్యూహెచ్ఓ సలహాదారుల ప్రత్యేక భేటీ బి.1.1.529 వేరియంట్పై ప్రపంచమంతటా ఆందోళన వ్యక్తమవుతుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సాంకేతిక సలహాదారుల బృందం శుక్రవారం ప్రత్యేకంగా భేటీ అయ్యింది. రూపాంతరం చెందిన వైరస్ లక్షణాలు, వ్యాప్తి తీరుపై చర్చించింది. బి.1.1.529 గురించి తమకు పెద్దగా తెలియదని, కానీ, ఇందులో ఎక్కువ సంఖ్యలో మ్యుటేషన్లు ఉన్నట్లు తెలుస్తోందని, వైరస్ ప్రవర్తనపై ఈ మ్యుటేషన్ల ప్రభావం ఉంటుందని సాంకేతిక సలహా బృందం సభ్యుడు మారియావాన్ కెర్ఖోవ్ చెప్పారు. కొత్త వేరియంట్పై వ్యాక్సిన్ల పనితీరు తెలుసుకోవడానికి మరికొన్ని వారాలు అవసరమన్నారు. బి.1.1.529 వేరియంట్పై ఇప్పుడే వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుందని సాంకేతిక సలహా బృందం చైర్మన్, న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్, ఇంటిగ్రేటివ్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ చెప్పారు. -
ముప్ఫై వేల ఫోన్.. 65 లక్షలకు అమ్మేశాడు!!
ఇందులో ఎలాంటి జిమ్మిక్కు లేదు. పైగా మోసానికి పాల్పడలేదు. ఫోన్ను పద్ధతిగానే.. అదీ ఆన్లైన్లో అమ్మేశాడు. ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? ప్రపంచంలో మొట్టమొదటి సీ టైప్ ఛార్జ్ సపోర్ట్ ఉన్న యాపిల్ ఫోన్ ఇదే కాబట్టి. కానీ, ఇది యాపిల్ కంపెనీ రూపొందించింది కాదు. ఓ యంగ్ స్టూడెంట్ డెవలప్ చేశాడు. యూకేకి చెందిన రోబోటిక్స్ ఇంజినీరింగ్ స్టూడెంట్ కెన్ పిల్లోనెల్ ‘ఐఫోన్ X’(64జీబీ, 3జీబీ ర్యామ్) ఫోన్ను చాలా శ్రమించి సీ టైప్ ఛార్జర్ పోర్ట్కు మార్చేశాడు. ఈ-బేలో ఈ ఫోన్ ఒరిజినల్ ధర 299 పౌండ్లు (401 యూఎస్ డాలర్లు.. మన కరెన్సీలో దాదాపు 30 వేల రూపాయలు). కానీ, కెన్ తాను మోడిఫై చేసిన ఐఫోన్ను ఏకంగా 86 వేల యూఎస్ డాలర్లకు అమ్మకానికి పెట్టగా.. అది అమ్ముడుపోయింది. అంటే కొన్ని పదుల రేట్లకు హాట్ కేక్లా పోయింది అది. మన కరెన్సీలో అది 65 లక్షల రూపాయలు అన్నమాట. అంతేకాదు కెన్ ఇప్పుడు వాటర్ ప్రూఫ్తో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే యూఎస్బీ-సీ ఐఫోన్ను మోడిఫై చేసే పనిలో బిజీగా ఉన్నాడు. యాపిల్కు తప్పని పరిస్థితి సాధారణంగా యాపిల్ ఐఫోన్లకు లైట్నింగ్ కనెక్టర్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అయితే యూనివర్సల్ ఛార్జింగ్ సొల్యూషన్ కోసం ఆమధ్య యూరోపియన్ కమిషన్ కొత్త చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం.. యాపిల్తో సహా ఏ మొబైల్ తయారీ కంపెనీ అయినా సరే యూఎస్బీ-సీ టైప్ పోర్టల్, టైప్ సీ ఛార్జర్లనే మార్కెట్లోకి తేవాలి. ఈ లెక్కన కొత్త ఫోన్గానీ, డివైజ్గానీ కొన్నప్పుడు మళ్లీ ఛార్జర్ ఇవ్వరు. వినియోగదారులు పాతదే వినియోగించుకోవాలి. ఒకవేళ పాడైతే మాత్రం అప్పుడు కొత్తది కొనుక్కునేందుకు వీలు కల్పిస్తారు. ఈ ఆదేశాలతో వచ్చే ఏడాది నుంచి సీ టైప్ పోర్ట్ సపోర్ట్ చేసేలా ఫోన్లను రీ డిజైన్ చేయబోతోంది యాపిల్. ఇక యూనివర్సల్ ఛార్జర్ల ద్వారా రీయూజింగ్ ద్వారా వేస్టేజ్ తగ్గించాలన్నది ఈయూ ముఖ్యోద్దేశం. పాత, ఉపయోగించని ఛార్జర్ల కారణంగా ప్రతీ ఏటా పదకొండు వేల టన్నుల కంటే ఎక్కువ చెత్త పేరుకుపోతోంది ఈయూలో!!. కిందటి ఏడాది 420 మిలియన్ మొబైల్ ఫోన్స్, ఇతరత్ర పోర్టబుల్ డివైజ్లు అమ్ముడు పోయాయి. ఈ లెక్కల ప్రకారం.. సగటున ప్రతీ యూజర్ దగ్గర మూడు ఛార్జర్లు ఉండగా.. వాటిలో రెండింటిని నిత్యం ఉపయోగిస్తున్నారు. యూరోపియన్ కమిషన్ నిర్ణయం వల్ల మొబైల్ యూజర్లు, ఛార్జర్ల మీద ఒక ఏడాదికి 250 మిలియన్ల యూరోలు(రెండు వేల కోట్ల రూపాయలపైనే) ఖర్చు గణనీయంగా తగ్గనుంది. చదవండి: ఇక కొత్త ఫోన్లకు ఛార్జర్లు ఇవ్వరంట! -
టెక్ దిగ్గజం గూగుల్కు భారీ షాక్!
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్కు యూరోపియన్ యూనియన్ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గూగుల్పై 2.42 బిలియన్ యూరోల జరిమానా విధిస్తూ యూరోపియన్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ గూగుల్ చేసిన అభ్యర్థనను యూరోపియన్ యూనియన్ ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో గూగుల్పై జరిమానా సరైందేనని న్యాయస్థానం అభిప్రాయపడింది. అసలు విషయానికి వస్తే.. 2017లో పోటీదారులకు హాని కలిగించేలా సందర్శకులను దాని స్వంత షాపింగ్ సర్వీసుకు అనుకూలంగా వ్యవహరించడం కోసం గూగుల్ యాంటీ ట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై యూరోపియన్ కమిషన్ గూగుల్పై 2.4 బిలియన్ యూరోల జరిమానా విధించింది. అయితే, ఈ జరిమానాను వ్యతిరేకిస్తూ యూరోపియన్ కమిషన్ జనరల్ కోర్టులో గూగుల్ అప్పీల్ చేసింది. గూగుల్ చేసుకున్న ఈ అప్పీల్ను కోర్టు తోసిపుచ్చడంతో పాటు జరిమానాను సమర్థించింది. యూరోపియన్ కమిషన్ నిర్ణయానికి అనుగుణంగా 2017లో మార్పులు చేసినట్లు గూగుల్ తెలిపింది. "మా కొత్త విధానం మూడు సంవత్సరాలకు పైగా విజయవంతంగా పనిచేసినట్లు" గూగుల్ ప్రకటనలో తెలిపింది. యూరోపియన్ ఖండంలో ఆన్లైన్ దిగ్గజం ప్రాబల్యాన్ని అరికట్టడానికి యూరోపియన్ రెగ్యులేటర్లు చేసిన ప్రయత్నంలో ఈ జరిమానా భాగం. ఆ తర్వాత గూగుల్పై మరో రెండు యాంటీట్రస్ట్ పెనాల్టీలు విధించాయి. మొత్తం 8.25 బిలియన్ యూరోల($9.5 బిలియన్)కు సంబంధించి కంపెనీ కూడా అప్పీల్ చేసుకుంది. (చదవండి: కొత్త ఎలక్ట్రిక్ ఆటోపై అదిరిపోయే ప్రారంభ ఆఫర్!) -
జన్యుమార్పిడి బియ్యం కలకలం
సాక్షి, అమరావతి: ప్రస్తుతం జన్యుమార్పిడి (జీఎం) బియ్యం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. భారత్ నుంచి ఎగుమతి అయిన బియ్యపు నూకల్లో జన్యుమార్పిడి రకాలున్నట్లు యూరోపియన్ యూనియన్ ఫిర్యాదు చేసింది. వీటి వినియోగంతో అనారోగ్యం బారిన పడడమే కాకుండా..పలు దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయనే వాదనలను తెరపైకి తీసుకొచ్చింది. అయితే జీఎం అవశేషాలున్న బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతించబోదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే.. భారత్ నుంచి జూన్లో ఎగుమతి అయిన 500 టన్నుల బియ్యం ప్రస్తుతం పలు యూరోపియన్ యూనియన్ దేశాలతో సహా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వివాదానికి కేంద్రబిందువయ్యాయి. వివిధ దేశాల నుంచి వచ్చే ఆహార పదార్థాలను తనిఖీ చేసే యూరోపియన్ కమిషన్ చేసిన ఆకస్మిక తనిఖీల్లో ఈ జన్యుమార్పిడి బియ్యం ఉన్న విషయం బయటపడింది. ఫ్రాన్స్కు చెందిన వెస్తోవ్ కంపెనీ ఈ విషయాన్ని బయటపెట్టింది. ఈ విషయంపై ఫ్రాన్స్ ప్రభుత్వం పలు దేశాలను అప్రమత్తం చేసింది. దీంతో అమెరికాకు చెందిన మార్స్ ఆహార ఉత్పత్తుల కంపెనీ జీఎం అవశేషాలున్నాయనే భయంతో తాను ఉత్పత్తి చేసిన క్రిస్పీ ఎంఅండ్ఎం ప్రోడక్ట్ను మార్కెట్ నుంచి వెనక్కు తెప్పించింది. సేంద్రియ బియ్యంగా భావించి తాము ఇండియా నుంచి వచ్చిన ఆ బియ్యంతో ఈ ప్రోడక్ట్ను తయారు చేసినట్లు వివరించింది. అమెరికా కంపెనీ చేసిన ఈ పనితో ప్రపంచ వ్యాప్తంగా ఇండియా నుంచి వచ్చిన బియ్యాన్ని చాలా దేశాలు మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నాయి. రంగంలోకి ఐఏఆర్ఐ.. భారత్ నుంచే జన్యుమార్పిడి బియ్యం ఎగుమతి జరిగిందని పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇండియన్ వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్ఐ) రంగంలోకి దిగింది. దేశంలో ఎక్కడెక్కడ జన్యుమార్పిడి వంగడాలను సాగు చేస్తున్నారనే దానిపై ముమ్మర తనిఖీ ప్రారంభించింది. అందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఏపీలోనూ ఏవైనా ప్రభుత్వ, ప్రైవేటు విత్తన సంస్థలు లేదా వ్యవసాయ పరిశోధన కేంద్రాలు జీఎం రైస్ను ప్రయోగాత్మకంగానైనా పండిస్తున్నాయా అనే విషయంపై ఆరా తీస్తోంది. తమిళనాడుకు చెందిన నాలుగు సేంద్రీయ విత్తన ధ్రువీకరణ సంస్థల లైసెన్సులను రద్దు చేయడం, కొన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో వరిపై చేస్తున్న క్షేత్రస్థాయి పరిశీలనలే ఇందుకు సాక్ష్యమని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రూ.65వేల కోట్ల నష్టం? భారత్ నుంచి ఏటా సుమారు రూ.65 వేల కోట్ల విలువైన వరి ఉత్పత్తులు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. యూరోపియన్ యూనియన్ చేసిన ఫిర్యాదే గనుక నిజమైతే భారత్కు భారీగా నష్టం వాటిల్లుతుంది. జీఎం అవశేషాలున్న బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతించదు. అయితే కొన్ని పరిశోధన కేంద్రాల్లో జీఎం రైస్పై క్షేత్రస్థాయి పరిశీలనలు సాగుతున్నాయి. దీన్ని ఐఏఆర్ఐ కూడా ధ్రువీకరించింది. ఇదే సందర్భంలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ దేశంలోని నాలుగైదు సేంద్రియ విత్తన ధ్రువీకరణ సంస్థల లైసెన్సులు రద్దు చేసింది. ఏమీ లేనప్పుడు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందని యూరోపియన్ యూనియన్ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నది. ఎక్కడి నుంచి బియ్యం వెళ్లాయి? మహారాష్ట్ర అఖోలాలోని హోల్సేల్ బియ్యం వ్యాపారి ఓమ్ ప్రకాష్ శివప్రకాష్కి చెందిన సంస్థ నుంచి యూరప్కి పంపిన బియ్యంలో జీఎం అవశేషాలున్నట్లు తేలింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై జెనిటికల్ ఇంజనీరింగ్ మదింపు కమిటీ, ఐఏఆర్ఐకి చెందిన వ్యవసాయ నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. వచ్చే నెలాఖరులోపు ఈ నిపుణుల బృందం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ప్రైవేటు విత్తన సంస్థల ప్రయోగ క్షేత్రాలను, ఇటీవల విడుదల చేసిన హైబ్రీడ్ వరి వంగడాలను కూడా ఈ బృందం తనిఖీ చేస్తోంది. -
ఈయూతో బంధం పదిలం
రోమ్: యూరోపియన్ యూనియన్(ఈయూ), భారత్ మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. జి–20 సదస్సులో పాల్గొనడానికి యూరప్ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఇటలీలోని రోమ్లో ఈయూ అత్యున్నత అధికారులతో సమావేశమై చర్చలు జరిపారు. కోవిడ్–19 మహమ్మారి విసురుతున్న సవాళ్లు, ఈయూ–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం, అఫ్గానిస్తాన్, ఇండో–ఫసిఫిక్ ప్రాంతంలో పరిస్థితులపై విస్తృతంగా చర్చలు జరిపారు. కరోనా నేపథ్యంలో ఆరోగ్యం, వాణిజ్యం, సంస్కృతి, పర్యాటకం తదితర రంగాల్లో భారత్, ఈయూ మధ్య బంధాన్ని మరింత సుదృఢం చేసుకోవాలని నిర్ణయించారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మిషెల్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వన్ డెర్ లెయన్తో లోతైన చర్చలు జరిగాయని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ట్వీట్ చేసింది. ఆర్థిక రంగంలో సహకారంతో పాటు, ప్రజలకు ప్రజలకు మధ్య సంబంధాలను పెంచి, మెరుగైన సమాజాన్ని స్థాపించడానికి కృషి చేయాలని ఇరుపక్షాలు ఒక అంగీకారానికి వచ్చినట్టుగా పేర్కొంది. మరోవైపు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ పచ్చదనం నెలకొల్పడంలో భారత్ కీలకమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నారు. ఇండో–ఫసిఫిక్ ప్రాంతంలో పట్టు కోసం చైనా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భారత్ అభిప్రాయాలను గౌరవిస్తామని ఈయూ హామీ ఇచ్చింది. ప్రధాని మోదీ శనివారం నుంచి జి–20 భేటీకి రానున్నారు. మోదీకి ఈయూ అభినందనలు భారత్లో తక్కువ వ్యవధిలోనే 100 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినందుకు గాను ప్రధాని మోదీని ఈయూ అధికారులు అభినందించారు. ఆయనను కలుసుకోవడం ఆనందంగా ఉందని, ఇరుపక్షాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం సరైన పట్టాలు ఎక్కిందని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు లెయెన్ పేర్కొన్నారు. జాతిపితకు ప్రధాని నివాళులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోమ్లో శుక్రవారం భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ‘‘ఎవరి ఆదర్శాలైతే ప్రజల్లో ధైర్య సాహసాలను నింపుతాయో, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తాయో అలాంటి మహాత్ముడికి రోమ్లో నివాళులర్పించే అరుదైన అవకాశం నాకు లభించింది’’ అని మోదీ అనంతరం ట్విట్టర్లో పేర్కొన్నారు. అనంతరం ప్రధాని రోమ్లో ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీతో సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. అంతకుముందు మోదీకి డ్రాఘీ ఘన స్వాగతం పలికారు. సైనికులు గౌరవ వందనం సమర్పించారు. -
ఛార్జర్ ఒక్కటే.. కొత్త ఫోన్లకు ఛార్జర్లు ఇవ్వరు!!
మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రిక్ డివైజ్ల విషయంలో కామన్ ఛార్జింగ్ పోర్ట్ కోసం యూరోపియన్ యూనియన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు కొత్త నిబంధనలతో కూడిన చట్టం చేసింది ఎగ్జిక్యూటివ్ బాడీ యూరోపియన్ కమిషన్(ఈసీ). ఈ నిబంధన గనుక అమలులోకి వస్తే ఈయూ దేశాల్లో ఫోన్లతో సహా డివైజ్లన్నింటికి ఒకే పోర్ట్.. ఒకే ఛార్జర్ కనిపిస్తాయి. యూనివర్సల్ ఛార్జింగ్ సొల్యూషన్ కోసం యూరోపియన్ కమిషన్ కొత్త చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం.. యూఎస్బీ-సీ టైప్ పోర్టల్, టైప్ సీ ఛార్జర్లే అన్నింటికీ ఉండాలి. అంతేకాదు కొత్త ఫోన్గానీ, డివైజ్గానీ కొన్నప్పుడు మళ్లీ ఛార్జర్ ఇవ్వరు. పాతదే వినియోగించుకోవాలి. ఒకవేళ పాడైతే మాత్రం అప్పుడు కొత్తది కొనుక్కునేందుకు వీలు కల్పిస్తారు. కారణం.. డివైజ్ కొన్న ప్రతీసారి కొత్త ఛార్జర్లు ఇస్తుంటాయి తయారీ కంపెనీలు. ఈ క్రమంలో పాత ఛార్జర్లనే ఉపయోగించే విధంగా యూజర్లను ప్రోత్సహించాలన్నది, రీయూజింగ్ ద్వారా వేస్టేజ్ తగ్గించాలన్నది ఈయూ ముఖ్యోద్దేశం. ఈ అంశంపై పదేళ్లుగా పోరాటం, చర్చలు నడుస్తున్నాయి అక్కడ. పాత, ఉపయోగించని ఛార్జర్ల కారణంగా ప్రతీ ఏటా పదకొండు వేల టన్నుల కంటే ఎక్కువ చెత్త పేరుకుపోతోంది ఈయూలో!!. కిందటి ఏడాది 420 మిలియన్ మొబైల్ ఫోన్స్, ఇతరత్ర పోర్టబుల్ డివైజ్లు అమ్ముడు పోయాయి. ఈ లెక్కల ప్రకారం.. సగటున ప్రతీ యూజర్ దగ్గర మూడు ఛార్జర్లు ఉండగా.. వాటిలో రెండింటిని నిత్యం ఉపయోగిస్తున్నారు. ఒకవేళ యూరోపియన్ కమిషన్ నిర్ణయం గనుక అమలు అయితే యూజర్లు ఛార్జర్ల మీద ఒక ఏడాదికి 250 మిలియన్ల యూరోలు(రెండు వేల కోట్ల రూపాయల) ఖర్చు పెట్టడం తగ్గుతుంది. 2009లో.. ముప్ఫై రకాల ఛార్జర్లు మార్కెట్లో ఉండేవి. ప్రస్తుతం యూఎస్బీ టైప్ సీ, యూఎస్బీ మైక్రో బీ, లైట్నింగ్ ఛార్జ్లను ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. యాపిల్కు ఎదురుదెబ్బ ఆండ్రాయిడ్ ఫోన్లను మినహాయిస్తే.. యాపిల్ తన ఐఫోన్ల కోసం లైట్నింగ్ కనెక్టర్ ఛార్జింగ్ పోర్ట్లను, ఛార్జర్లను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే మొదటి నుంచి ఈయూ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈయూ నిబంధనలు కొత్త ఆవిష్కరణలను దెబ్బతీస్తాయని, యూరప్తో పాటు వరల్డ్ డివైజ్ మార్కెట్పై ప్రభావం చూపెడుతుందని చెబుతోంది. అంతేకాదు 2030 నాటికి కార్బన్ రహిత యాపిల్ డివైజ్ల దిశగా అడుగు వేస్తున్న తరుణంలో.. యాపిల్కు ఈసీ తీసుకున్న నిర్ణయం అడ్డుతగులుతుందని అంటోంది. అయినప్పటికీ ఈయూ ప్రత్యేక చట్టం ద్వారా ముందుకెళ్తుండడం విశేషం. యాపిల్లో సీ ఉందిగా! ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది యూజర్లు ఉన్న యాపిల్.. లైట్నింగ్ కనెక్టర్ అందించాలనే లైన్ మీద నిల్చుంటోంది. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే.. ఐప్యాడ్ ప్రో, మ్యాక్బుక్లు మాత్రం యూఎస్బీ-సీ స్టాండర్డ్ మోడర్న్తో వస్తున్నాయి. ఇక ఫ్లగ్కు కనెక్ట్ అయ్యే వైపు మాత్రం యూఎస్బీ-సీ, యూఎస్బీ-ఏ ఉపయోగిస్తున్నారు. వేటి వేటి కంటే.. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్స్, కెమెరాలు, హెడ్ఫోన్స్, పోర్టబుల్ స్పీకర్లు, వీడియో గేమ్ కన్సోల్స్.. మొదలైనవి. అయితే ఇయర్బడ్స్, స్మార్ట్ వాచీలు, ఫిట్నెస్ ట్రాకర్లను ఉపయోగించే విధానం, సైజు కారణాల వల్ల టైప్ సీ తప్పనిసరి నిబంధనల్లో చేర్చట్లేదు. డిజిటల్ అండ్ గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా ఈయూ సభ్య దేశాల్లో ఈ చట్టం(డైరెక్టివ్) మీద విస్తృత చర్చ నడిచింది. ఈ చర్చ ఆధారంగా సభ్య దేశాల చట్టసభ్యులు కొన్ని సలహాలు ఇస్తారు. ఈ తతంగం అంతా పూర్తయ్యాక.. యూరోపియన్ కమిషన్ ఆమోదం చెప్పగానే ఈ నిబంధనను అమలులోకి వస్తుంది. బహుశా వచ్చే ఏడాది చివర్లో ఈ చట్టం అమలులోకి రావొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఛార్జర్ల పోర్టులు మార్చుకునేందుకు వీలుగా కంపెనీలకు రెండు సంవత్సరాల గడువునిచ్చే ప్రతిపాదన చేస్తోంది యూరోపియన్ కమిషన్. - సాక్షి, వెబ్స్ఫెషల్ చదవండి: ఆవులించినా చర్యలు తీసుకునే కెమెరాలు ఇవి! -
అమెజాన్కు ఈయూ భారీ షాక్!
ఈయూ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్(జీడీపీఆర్)ను ఉల్లంఘిస్తూ వ్యక్తిగత డేటాను సేకరించినందుకు అమెజాన్ పై యూరోపియన్ యూనియన్ 886.6 మిలియన్ డాలర్ల (రూ.6,593 కోట్లు) జరిమానా విధించినట్లు ఈ కామర్స్ దిగ్గజం నేడు(జూలై 30) తెలిపింది. లగ్జెమ్బర్గ్ నేషనల్ కమిషన్ ఫర్ డేటా ప్రొటెక్షన్(సీఎన్ పీడీ) అమెజాన్ యూరోప్ కోర్ పై జూలై 16న జరిమానా విధించినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ లో వెల్లడించింది. "అర్హత లేకుండా సీఎన్ పీడీ నిర్ణయం ఉందని మేము నమ్ముతున్నాము, ఈ విషయంలో మమ్మల్ని మేము రక్షించుకోవాలని భావిస్తున్నాము" అని అమెజాన్ తన ఫైలింగ్ లో తెలిపింది. జీడీపీఆర్ కంపెనీలు తమ వ్యక్తిగత డేటాను ఉపయోగించడానికి ముందు ప్రజల సమ్మతిని కోరాలి లేకపోతే అక్కడి చట్టాల ప్రకారం తీవ్రమైన జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా నిబందనలను ఉల్లంఘిస్తే యూరోపియన్ యూనియన్ గోప్యతా చట్టం కింద సంస్థకు 425 మిలియన్ డాలర్లకు పైగా జరిమానా విధించవచ్చని వాల్ స్ట్రీట్ జర్నల్ జూన్ లో నివేదించింది. గతంలో అమెజాన్ 300 మిలియన్ డాలర్ల(250 మిలియన్ యూరోలు) పన్నులు చెల్లించాలంటూ యూరోపియన్ కమీషన్ జారీ చేసిన ఆదేశాలను స్థానిక కోర్టు రద్దు చేసింది. లగ్జెమ్బర్గ్ ప్రభుత్వంతో అమెజాన్ కుదుర్చుకున్న పన్ను ఒప్పందానికి సంబంధించి 2017లో యూరోపియన్ యూనియన్(ఈయూ) ఎగ్జిక్యూటివ్ బెంచ్ పన్ను ఆదేశాలను జారీ చేసింది. -
కార్ల కంపెనీలకు భారీ షాక్, ఏకంగా రూ.7,470 కోట్ల జరిమానా
బ్రసెల్స్: కాలుష్య ఉద్గారాలను తగ్గించే సాంకేతికతను అమలు చేయకుండా కుమ్మక్కయినందుకు గాను జర్మనీకి చెందిన నాలుగు దిగ్గజ కార్ల కంపెనీలపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) గట్టి చర్యలు తీసుకుంది. 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 7,470 కోట్లు) జరిమానా విధించింది. దైమ్లర్, బీఎండబ్ల్యూ, ఫోక్స్వ్యాగన్, ఆడి, పోర్షె కంపెనీలు పెట్రోల్, డీజిల్ ప్యాసింజర్ కార్ల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించే టెక్నాలజీ విషయంలో పోటీపడకుండా కుమ్మక్కై వ్యవహరించాయని ఆరోపణలు ఉన్నాయి. వీటిపై దర్యాప్తు చేసిన ఈయూ నాలుగు సంస్థలపై తాజా పెనాల్టీ ప్రకటించింది. ఈ వ్యవహారాన్ని వెల్లడించినందుకు గాను దైమ్లర్ను విడిచిపెట్టింది. ధరల విషయంలో కుమ్మక్కయినందుకు కాకుండా టెక్నాలజీలను అమలు చేయనందుకు గాను యూరోపియన్ యూనియన్ జరిమానా విధించడం ఇదే ప్రథమం. ‘ఈయూ ఉద్గారాల ప్రమాణాలకు తగిన టెక్నాలజీలు అందుబాటులో ఉన్నప్పటికీ తయారీ సంస్థలు వాటిని ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టాయి. ఇది చట్టవిరుద్ధమైన చర్య. దీనివల్ల తక్కువ ఉద్గారాలను విడుదల చేసే వాహనాలను కొనుగోలు చేసే అవకాశాన్ని కస్టమర్లు కోల్పోయారు‘ అని ఈయూ యాంటీట్రస్ట్ చీఫ్ మార్గరెత్ వెస్టాజెర్ వ్యాఖ్యానించారు. సాధారణంగా డీజిల్ ఇంజిన్ల నుంచి వెలువడే ఉద్గారాలను తగ్గించేందుకు కార్లలో యాడ్బ్లూ అనే యూరియా సొల్యూషన్ను ఉపయోగిస్తుంటారు. దీనికోసం వాహనాల్లో ప్రత్యేక ట్యాంకు ఉంటుంది. దీని పరిమాణం పెద్దగా ఉంటే ఉద్గారాల విడుదల మరింత తగ్గుతుంది. అయితే, వ్యయాలు తగ్గించుకునే ఉద్దేశ్యంతో సదరు వాహన తయారీ సంస్థలు తమ కార్లలో యాడ్బ్లూకి సంబంధించి చిన్న ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నాయనేది ఆరోపణ. -
Corona Vaccine: ఒప్పుకోండి లేకుంటే ఇబ్బందులే!
వాక్సినేషన్ పాస్పోర్ట్ విషయంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ సర్టిఫికేషన్ను యూరోపియన్ యూనియన్ అనుమతించకపోవడంపై కేంద్రం సీరియస్ అయ్యింది. బదులుగా యూరోపియన్ దేశాల నుంచి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని పరోక్షంగా హెచ్చరించింది. న్యూఢిల్లీ: ఈయూ దేశాల్లో.. అలాగే సభ్యదేశాల మధ్య ప్రయాణించేవారికి డిజిటల్ కొవిడ్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు. అలాగే డిజిటల్ గ్రీన్పాస్ ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. అయితే ఈయూ ఆమోదిత వ్యాక్సిన్ల లిస్ట్లో భారత్లో తయారవుతున్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లను అనుమతించకపోతుండడం తెలిసిందే. ఎక్కువ మంది భారతీయలు తీసుకుంటున్న కొవిషీల్డ్కూ సైతం చోటు దక్కకపోవడంతో.. భారతీయ ప్రయాణికులకు ఇబ్బందికర అంశమనే ఆందోళన వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో జోక్యం చేసుకోవాలని సీరం సంస్థ భారత ప్రభుత్వాన్ని కోరడంతో.. కేంద్రం త్వరగతిన స్పందించింది. తక్షణమే రెండు వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాలని, లేకుండా ఈయూ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఇబ్బందులు తప్పదని పేర్కొంది. ఆ ప్రయాణికుల వ్యాక్సిన్ పాస్పోర్ట్లను అనుమతించమని, పైగా కఠిన క్వారంటైన్ నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుందని పరోక్షంగా ఈయూ ఏజెన్సీ(27 దేశాల సమాఖ్య)ని హెచ్చరించింది కేంద్రం. ఒకవేళ అనుమతిస్తే మాత్రం.. క్వారంటైన్ నిబంధనలను సడలిస్తామని కూడా తెలిపింది. ఇక ఈయూ డిజిటల్ కోవిడ్ సర్టిఫికెట్ లిస్ట్లో మనదగ్గర తయారైన రెండు వ్యాక్సిన్లకు మొదటి ఫేజ్లోనే చోటు ఇవ్వలేదు. గ్రీన్ పాస్ ప్రకారం.. కనీసం కొవిషీల్డ్ తీసుకున్నవాళ్లకైనా అనుమతి ఇవ్వాలనే విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. అయినప్పటికీ యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ స్పందించలేదు. అనుమతులు ఉన్న ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా, జనస్సెన్ వ్యాక్సిన్లకు చోటిచ్చింది. ఇండియన్ వెర్షన్ ఆస్ట్రాజెనెకా ‘కొవిషీల్డ్’కు కూడా చోటు ఇవ్వలేదు. ఇక ఈ అనుమతులు మెరిట్ ప్రతిపాదికన మాత్రమే ఉంటాయని యూరోపియన్ యూనియన్ రాయబారి ఉగో అస్టుటో వెల్లడించాడు. ఈయూ వివరణ ఇక తాజా పరిణామాలపై యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ(ఈఎంఏ) స్పందించింది. కొవిడ్ నేపథ్యంలో ఈయూ సభ్యదేశాల మధ్య ఆటంకాల్లేని ప్రయాణం కోసం గ్రీన్పాస్ జారీ చేస్తున్నారని వివరించింది. ‘వ్యాక్సిన్ తీసుకున్నట్టు ధ్రువీకరించడమే గ్రీన్ పాస్ జారీ లక్ష్యం. ఈ సర్టిఫికెట్ కోసం ఫైజర్/బయోఎన్టెక్, మెడెర్నా, వాక్స్జెర్విరియా, జన్స్సెన్ వ్యాక్సిన్లను మాత్రమే ఈఎంఏ ఆమోదించింది’ అని ఈయూ వర్గాలు తెలిపాయి. అయితే కొవిషీల్డ్ను గ్రీన్ పాస్ జాబితాలో చేర్చాలంటూ అభ్యర్థనలేవీ రాలేదని ఇంతవరకు అందలేదని వ్యాఖ్యానించడం కొసమెరుపు. ఇక ఈ వ్యవహారంపై సీరం సీఈవో అదర్ పూనావాలా స్పందించాడు. ఈయూ కొవీషీల్డ్ను అనుమతిస్తుందన్న విశ్వాసం ఉందని, అందుకు నెల టైం పట్టొచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. చదవండి: కొవిషీల్డ్ డోస్ గడువు మళ్లీ పెంపు.. ఈసారి ఎంతంటే.. -
Ryanair: ‘అతడి కళ్లల్లో భయం.. చావు తప్పదని చెప్పాడు’
‘‘అతడు భయంతో వణికిపోవడం నేను చూశాను. అతడి కళ్లు విషాదంతో నిండిపోవడం గమనించాను. ఇంతలో తను మా వైపు తిరిగి.. తాను మరణశిక్ష ఎదుర్కోబోతున్నట్లు చెప్పాడు’’ వెబ్డెస్క్: గ్రీస్ నుంచి లిథువేనియా వెళ్లాల్సిన రియాన్ఎయిర్ విమానం 4978 అది. దాదాపు పన్నెండు దేశాలకు చెందిన 170 మంది అందులో ప్రయాణిస్తున్నారు. అయితే, అకస్మాత్తుగా ఆ విమానం బెలారస్ వైపు మళ్లింది. యుద్ధ విమానం వెంబడి రాగా ఆ దేశ రాజధాని మింక్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యింది. లోపల ఉన్న ప్రయాణికులకు అసలేమీ అర్థం కాలేదు. లిథువేనియా వెళ్లాల్సిన విమానం ఇలా మధ్యలో ఎందుకు ఆపేశారు.. ఇందుకు గల కారణాలేమీటో వారికి అంతుపట్టలేదు.. అయితే, ఓ వ్యక్తి మాత్రం వెంటనే జరిగే పరిణామాలను ఊహించి, లగేజ్బ్యాగ్ నుంచి వడివడిగా తన లాప్టాప్, మొబైల్ తీసుకుని పక్కనే ఉన్న అమ్మాయికి అందించాడు. అంతలోనే అక్కడికి చేరుకున్న బెలారస్ పోలీసులు 26 ఏళ్ల ఆయువకుడిని అరెస్టు చేశారు. ఎట్టకేలకు 7 గంటల ఆలస్యం తర్వాత ఫ్లైట్ లిథువేనియాకు చేరుకోవడంతో ప్రయాణికులైతే ఊపిరి పీల్చుకున్నారు గానీ ఆ యువకుడి పరిస్థితి ఏమౌతుందో అనే ఆలోచన వాళ్ల మెదళ్లను తొలచివేస్తోంది. ఈ ఘటనపై అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. యూరోపియన్ దేశాలు సహా అమెరికా బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో తీరుపై తీవ్ర ఆగ్రహం చేస్తోంది. అసలు ఆ విమానాన్ని ఎందుకు ఆపారు? ఇందుకు బెలారస్ చెప్పిన కారణం ఏమిటి? ఇంతకీ ఆ యువకుడు ఎవరు? అతడిని ఎందుకు తీసుకువెళ్లారు? ఫొటో కర్టెసీ: రాయిటర్స్ ఎవరా యువకుడు? రోమన్ ప్రొటాసెవిక్.. జర్నలిస్టు. నెక్స్టా గ్రూపు మాజీ ఎడిటర్. గతేడాది బెలారస్లో జరిగిన ఆందోళనకు సంబంధించి వరుస కథనాలు ప్రచురించాడు. అందుకుగానూ అతడిపై ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఇప్పటికే రోమన్పై అనేక అభియోగాలు నమోదుకాగా.. ఎప్పుడెప్పుడు అతడిని అరెస్టు చేయాలా అన్న అలోచనలో ఉంది. దీంతో అతడు పొలాండ్లో తలదాచుకుంటున్నాడు. అయితే, ఆదివారం లిథువేనియాకు వెళ్లే క్రమంలో బెలారస్లో రోమన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరణం తప్పదన్నాడు ఈ విషయం గురించి విమానంలో ఉన్న ప్రయాణికులు అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ అతడు భయంతో వణికిపోవడం నేను చూశాను. అతడి కళ్లు విషాదంతో నిండిపోవడం గమనించాను. ఇంతలో తను మా వైపు తిరిగి.. తాను మరణశిక్ష ఎదుర్కోబోతున్నట్లు చెప్పాడు. నిజానికి అతడు అరవడం లేదు, కానీ తను చాలా భయపడిపోతున్నట్లు అర్థమైంది. ఒకవేళ కిటికీ గనుక తెరిచే అవకాశం ఉంటే, కచ్చితంగా దూకేవాడేనేమో. తనను కిందకి తీసుకువెళ్లి ఏవేవో ప్రశ్నలు అడిగి తీసుకువెళ్లారు’’ అని పేర్కొన్నారు. హైడ్రామా.. ఏం చెప్పి విమానాన్ని ఆపారు? విమానంలో బాంబు ఉందన్న బెదిరింపులు రావడంతో అత్యవసరంగా మింక్ ఎయిర్పోర్టులో ల్యాండ్ చేయాలంటూ బెలారస్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సందేశం వచ్చింది. అంతలోనే ఓ యుద్ధ విమానం ఎస్కార్టుగా వస్తున్న విషయాన్ని ప్రయాణికులు గమనించారు. ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత సాధారణ తనిఖీ చేశారు. కానీ అందులో బాంబు ఉన్న ఆనవాలు కనిపించలేదు. కానీ, రోమన్ను బయటకు పిలిచారు. అతడితో పాటు ఓ మహిళను పోలీసులు తమతో పాటు తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని బెలారస్ అధికార మీడియా ధ్రువీకరించింది. ‘‘బాంబు బెదిరింపు రావడంతో మిస్టర్ లుకాషెంకో వ్యక్తిగత ఆదేశాలు జారీ చేశారు. విమానాన్ని మింక్లో ల్యాండ్ చేయాలని ఆదేశించారు. ఇందుకు మిగ్-29 ఫైటర్ ఎస్కార్టుగా ఉండేందుకు అనుమతించారు’’ అని పేర్కొంది. అయితే, అప్పటికే విమానం మింక్ కంటే కూడా, లిథువవేనియా విల్నూయిస్కే దగ్గరగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో బెలారస్ ఉద్దేశపూర్వకంగానే రోమన్ కోసం ఫ్లైట్ను మళ్లించి, బాంబు నాటకం ఆడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా రియాన్ ఎయిర్.. ప్రయాణికులను క్షమాపణ కోరుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే రోమన్ మద్దతుదారులు మాత్రం. ‘‘రియాన్ఎయిర్ ... రోమన్ ఎక్కడ’’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఫొటో కర్టెసీ: రాయిటర్స్ భగ్గుమంటున్న అంతర్జాతీయ సమాజం ఒక జర్నలిస్టును అరెస్టు చేసేందుకు బెలారస్ ఇంతటి సాహసానికి పూనుకోవడం సరికాదంటూ అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బెలారస్పై ఆంక్షలు విధించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన ఐక్యరాజ్య సమితి విమానయాన విభాగం ఐసీఏఓ.. బలవంతంగా విమానాన్ని ల్యాండ్ చేయించారు. ఇది చికాగో కన్వెన్షన్ నిబంధనలు ఉల్లంఘించడమే’’ అని పేర్కొంది. కాగా చికాగో కన్వెన్షన్లో గగనతలం, విమానాల సురక్షిత ప్రయాణాలకై పలు నిబంధనలు ఉన్నాయి. ‘‘సాధారణ పౌరులతో వెళ్తున్న విమానాన్ని ఇలా ఆపడం అంటే హైజాక్ చేసినట్లే. ఇంతటి దుస్సాహసానికి పూనుకున్న బెలారస్ కచ్చితంగా శిక్షను ఎదుర్కోవాల్సిందే’’ అని పోలండ్ ప్రధాని మండిపడ్డారు. ఇక బెలారస్లోని అమెరికా రాయబారి జూలీ ఫిషర్.. ‘‘అంతర్జాతీయ సమాజం, పౌరులకు వ్యతిరేకంగా లుకాషెంకో ప్రభుత్వం వ్యవహరించింది. బాంబు ఉందన్న అబద్ధపు సందేశంతో మిగ్-29ను పంపించి రేనార్ను మళ్లించింది. నెక్స్టా జర్నలిస్టుపై రాజకీయ కక్షతో నమోదైన అభియోగాల నేపథ్యంలో అతడిని అరెస్టు చేసేందుకు చేపట్టిన ఈ చర్య చాలా ప్రమాదకరం’’ అని ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇక లాటివియా, లిథువేనియా ఏకంగా బెలారస్ గగనతలాన్ని అసురక్షిత గగనతలంగా గుర్తించాలని విజ్ఞప్తి చేయడం విశేషం. రాజకీయ ప్యత్యర్థిని కిడ్నాప్ చేయడం కోసం వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలోకి నెట్టిన బెలారస్ గగనతలంలో అంతర్జాతీయ విమానాలు ప్రయాణించకుండా ఆంక్షలు విధించాలని సూచిస్తున్నాయి. కాగా ఈ ఘటనపై విచారణ జరిపే విధంగా అమెరికా యూరోపియన్ దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. Lukashenka and his regime today showed again its contempt for international community and its citizens. Faking a bomb threat and sending MiG-29s to force @RyanAir to Minsk in order to arrest a @Nexta journalist on politically motivated charges is dangerous and abhorrent. — Julie Fisher (@USAmbBelarus) May 23, 2021 Today’s hijacking of #Ryanair flight by Lukashenko regime shows that Belarusian airspace is not safe, people’s lives were put at risk and kidnaping of a political opponent took place. Belarusian airspace must be closed for all international flights. — Edgars Rinkēvičs (@edgarsrinkevics) May 23, 2021 -
వచ్చేవారం అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు
బ్రసెల్స్: ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరాన్, అమెరికా దేశాల మధ్య వచ్చేవారం పరోక్ష చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ చర్చలతో ఇరాన్ అణు కార్యక్రమంపై పరిమితి విధించే దిశగా ఒప్పందం కుదిరే అవకాశముంది. మధ్యవర్తుల ద్వారా ఈ చర్చలు జరుగుతాయని శుక్రవారం ఇరాన్, అమెరికా ప్రకటించాయి. ఇప్పటికే ఈ అంశంపై ఇరుదేశాల మధ్య 2015లో కుదిరిన ఒప్పందం నుంచి డొనాల్డ్ ట్రంప్ హయాంలో మూడేళ్ల కిత్రం అమెరికా వైదొలగింది. 2015 నాటి ఒప్పందం మేరకు ఇరాన్ తన అణు కార్యక్రమంపై స్వీయ ఆంక్షలు విధించుకోవాలి. అలాగే, అమెరికా, ఇతర అంతర్జాతీయ సంస్థలు ఇరాన్కు ఆంక్షల సడలింపుతో పాటు ఆర్థిక సాయం అందించాలి. ఇరాన్తో ఒప్పందానికి ప్రాధాన్యత ఇస్తామని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. చర్చలు వియెన్నాలో మంగళవారం ప్రారంభమవుతాయని అమెరికా హోం శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ వెల్లడించారు. ఇది సరైన ముందడుగు అని, అయితే, వెంటనే సానుకూల ఫలితాలను ఆశించలేమని వ్యాఖ్యానించారు. అమెరికా–ఇరాన్ మధ్య ఈ పరోక్ష చర్చలు ప్రారంభం కావడానికి యూరోపియన్ యూనియన్ మధ్యవర్తిత్వం చేసింది. -
జీతం పెరిగింది.. ఎవరికి ఎంత?
స్త్రీ పురుష ఉద్యోగుల జీతాలు, వేతనాల్లో అసమానతలను తొలగించాలని ఇ.యు. తన పరిధిలోని దేశాలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఫలిస్తే.. తక్కిన దేశాలూ ఆచరిస్తే.. స్త్రీ పురుషులు ఇక ఈక్వల్ ఈక్వల్. సమాన పనికి సమాన వేతనం. లిస్ట్ ఇవ్వండి జెండర్ ‘పే గ్యాప్’ను తొలగించే చర్యలలో భాగంగా.. 27 సభ్య దేశాల్లోని కంపెనీలు తమ సిబ్బందిలో ఎవరికి ఎంత జీతం ఇస్తున్నాయో తక్షణం బహిర్గత పరచాలని ‘ఐరోపా సమాఖ్య’ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సుల వాన్ డెర్లెయన్ అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. సంస్థలు తమ సిబ్బందికి గోప్యంగా, విడివిడిగా జీతాలు పెంచుకుంటూపోతున్న కారణంగానే సమానమైన పనికి కూడా స్త్రీలకు తక్కువ ప్రతిఫలం లభిస్తోందని ఆమె గుర్తించడం.. ఈ ఏడాది ‘ఉమెన్స్ డే’ కి తమకు లభించిన బోనస్ అని ఆ దేశాలలోని మహిళా ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకే పని. ఒకే విధమైన పని గంటలు. కానీ వేతనం ఒకటే కాదు. పురుషులకు ఎక్కువ, స్త్రీలకు తక్కువ! ప్రపంచమంతటా ఇంతే. ఏళ్లుగా ఇంతే. సమాజంలో స్త్రీ పురుష సమానత్వం రావడానికి ఎన్ని శతాబ్దాలు పడుతుందో చెప్పలేం. స్త్రీ పురుషుల వేతనాల్లో హెచ్చు తగ్గుల్ని లేకుండా చేయడానికైతే శతాబ్దాలు అక్కర్లేదు. దశాబ్దాలూ అక్కర్లేదు. కొంత టైమ్ ఇచ్చి, ఆ టైమ్ లోపు ‘ఈక్వల్ పే’ ఉండాలని ప్రభుత్వం ఒక ఆదేశం జారీ చేస్తే చాలు.. వేతనాల్లో, జీతాల్లో అసమానత్వాలు, అంతరాలు సమసిపోతాయి. మరి ప్రభుత్వాలు చెయ్యకనేనా నేటికీ మహిళా ఉద్యోగులు, మహిళా శ్రామికులు పురుషులకన్నా తక్కువ ప్రతిఫలాన్ని పొందుతున్నారు! శ్రమదోపిడికి గురవుతున్నారు! కాదు. కంపెనీలే స్త్రీ పురుష వివక్ష ను పాటిస్తున్నాయి. ‘మీరు చెప్పినట్లే ఈక్వల్ ఈక్వల్గా ఇస్తున్నాం’ అని పైపై లెక్కలు చూపిస్తున్నాయి. ఒక స్త్రీ, ఒక పురుషుడు ఒకే విధమైన పనిని, ఒకే పనిగంటల్లో చేస్తే వారిద్దరికీ ఒకే విధమైన జీతభత్యాలు ఇస్తున్నామని చెబుతున్నాయి. చెప్పడం వరకే. చేస్తున్నది వేరే. పురుషులకు ఎక్కువ. స్త్రీలకు తక్కువ! అలా ఎలా చేయగలుగుతున్నాయంటే.. గోప్యత. రహస్యం! నిజంగా ఎంతిస్తున్నదీ కంపెనీలు బయటపెట్టడం లేదు. ఇక ఇలాక్కాదని చెప్పి, ప్రతి ఉద్యోగికీ మీరెంత జీతం ఇస్తున్నదీ పేర్లతో సహా బహిర్గతం చేయండి అని ఐరోపా దేశాల్లోని పెద్ద పెద్ద కంపెనీలన్నిటికీ ‘యూరోపియన్ యూనియన్’ (ఇ.యు) కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్లెయన్. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి కాస్త ముందు ఆమె ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం యాదృచ్ఛికమే అవొచ్చు కానీ ఇ.యు. పరిధిలోని 27 దేశాల మహిళా ఉద్యోగులు దీనినొక ఉమెన్స్ డే బోనస్గా భావిస్తున్నారు. ∙∙∙ నిజమే. వేతనాల్లో వివక్షతో కూడిన వ్యత్యాసం తగ్గాలంటే.. అసలు ఎవరికి ఎంత వేతనం ఇస్తున్నదీ ముందు తెలియాలి. అందుకే ఆ లిస్ట్ను బహిర్గతం చెయ్యమని వాన్ డెర్లియన్ ఆదేశించారు. ఇ.యు. దేశాలు స్త్రీల పట్ల సహానుభూతితో ఉంటాయనే పేరుంది. అయితే అక్కడ కూడా వేతనాలలో మిగతా దేశాలలో ఉన్నట్లే మహిళలపై వివక్ష ఉంది! ఇ.యు. 1957లో ఏర్పడింది. అప్పట్నుంచీ ‘పే గ్యాప్’ ను తొలగించడానికి ఆ సంస్థ ప్రయత్నిస్తోంది. కావడం లేదు. జీతాలు, వేతనాలు, పని వేళలు, పెన్షన్లు, ఇతర సదుపాయాలు, సౌకర్యాలు అన్నిటా సంస్థల యాజమాన్యాలు ఈ గ్యాప్ను పాటిస్తూనే ఉన్నాయి. గత 30–40 ఏళ్లలో ఇ.యు. ఎంతగానో పాటు పాడితే తగ్గిన వేతన అంతరం 30 శాతం మాత్రమే. ఇది నూరు శాతం అవడానికి ఇంకెన్ని దశాబ్దాలు పడతాయో! అయితే వాన్ డెర్లెయన్ అంతవరకు ఆగదలచుకోలేదు. ఏడాది క్రితం కమిషన్ అధ్యక్షురాలిగా వచ్చిన నాటి నుంచీ ఐరోపా వ్యాప్తంగా మహిళా ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ఆ క్రమంలో బుధవారం జారీ చేసినవే.. ప్రతి కంపెనీ తమ పే లిస్ట్ను బయటపెట్టి తీరాలన్న ఆదేశాలు. అప్పుడు ఎవరికి ఎంతిస్తున్నదీ తెలుస్తుంది. స్త్రీలకు ఎంత వస్తున్నదీ బయటపడుతుంది. ఆ ప్రకారం కంపెనీలపై చట్టపరంగా చర్యలు తీసుకోడానికి వీలుంటుంది. చర్యల భయం ఉంటే కంపెనీలూ వాటికై అవి వేతన అంతరాలను తొలగించేందుకు ముందుకు వస్తాయి. ∙∙∙ ఆదేశాలతోపాటు కొన్ని ప్రతిపాదనలకు ఆదేశ రూపం ఇచ్చేందుకు కూడా కమిషన్ సభ్యులను సోమవారం సమావేశ పరచబోతున్నారు వాన్ డెర్లెయన్! కంపెనీలు ఇకపై ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానించే ముందు కానీ, అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసేటప్పుడు గానీ వారి పూర్వపు వేతనాన్ని (మునుపటి కంపెనీలో వాళ్లకు వస్తున్న వేతనం) అడగకూడదు. ఫలాన పోస్టుకు ఇంత జీతం అని ప్రకటించాక ఆ తర్వాత పురుషుడు అని పెంచడం గానీ, స్త్రీ అని తగ్గించడం కానీ చేయకూడదు. ఉద్యోగానికే జీతం తప్ప ఉద్యోగం చేస్తున్న వ్యక్తి జీతం కాదు అన్నట్లు ఉండాలి. మహిళలైతే తాము చేరబోయే సంస్థలో స్త్రీ పురుషుల జీతాలలో వ్యత్యాసం ఏ మేరకైనా ఉందా అని ముందే ఆ సంస్థ యాజమాన్యాన్ని అడిగే హక్కు కలిగి ఉండాలి. కనీసం 250 మంది ఉద్యోగులు ఉన్న ప్రతి కంపెనీ తమ జీతాల్లోన్ని జెండర్ వ్యత్యాసం గురించి విధిగా తమ మహిళా అభ్యర్థులకు తెలియపరచాలి. ఇప్పటికే పని చేస్తున్న మహిళా ఉద్యోగులు తాము ఎంతకాలంగా తక్కువ జీతాన్ని పొందుతున్నారో, ఆ తగ్గిన మొత్తాన్ని అడగవచ్చు. ఆ కారణంగా వారిని ఉద్యోగం నుంచి యాజమాన్యాలు తొలగించకూడదు. ఇవీ.. ఆ ప్రతిపాదనలు. కంపెనీలతోపాటు, కోవిడ్ కూడా మహిళల శ్రమకు తగిన ప్రతిఫలం, గుర్తింపు, ఆఖరికి ఉపాధిని కూడా లేకుండా చేసింది. ఆ పరిహారాన్ని కూడా కంపెనీలు తమ మహిళా ఉద్యోగులకు చెల్లించేలా చర్యలు తీసుకునేందుకు వాన్ డెర్లెయన్ మరొక ఆదేశ పత్రం ముసాయిదాను రూపొందించే పనిలో ఉన్నారు. చదవండి: చిన్న వయసులోనే పెద్ద కష్టం.. నిమ్మరసం అమ్ముతూ.. -
బ్రెగ్జిట్తో మారేవేంటంటే...
లండన్: బ్రెగ్జిట్ ట్రాన్సిషన్ కాలం ముగియడంతో యూకే–ఈయూ ఒప్పందం అమల్లోకి వచ్చింది. అయితే బ్రిటిష్ పౌరులు దీని కారణంగా కొన్ని మార్పులను చవిచూడనున్నారు. అవేంటంటే.. 1. ఈయూ పరిధిలోని ఇతర దేశాల్లో యూకే ప్రజలు స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవాలంటే తప్పనిసరిగా ఇమ్మిగ్రేషన్ నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఇతర దేశాలకు వెళ్లడానికి వీసాలు, రెడ్టేప్ వంటి ప్రక్రియలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబాలు వివిధ దేశాల్లో ఉన్నవారికి ఇది ప్రధాన సమస్యగా మారే అవకాశం ఉంది. 2. గతంలో ఉన్నట్లుగా ఈయూ కూటమిలోని దేశాల్లోకి అంత సులువుగా ప్రయాణించలేరు. అయితే సెలవుల్లో వీసా–ఫ్రీ ప్రక్రియతో వెళ్లే అవకాశాలు ఉన్నాయి. బ్రిటీషర్లకు యూరోపియన్ ఆరోగ్య బీమా కార్డులు కూడా ఉండవు. కోవిడ్ ప్రయాణ నిబంధనలు కూడా జతకావచ్చు. 3. ఎరాస్మస్ ప్రక్రియ కింద బ్రిటిష్ వారు గతంలోలా ఈయూ దేశాల్లో చదువుకోవడం, పనిచేయడం, బోధించడం, శిక్షణ ఇవ్వడం వంటివి చేయలేరు. అప్పట్లో ఈయూ పథకం కింద నేర్చుకునేవారికి, చదువుకునేవారికి గ్రాంట్లు కూడా ఉండేవి. 4. యూకే వారికి ఇకపై ఫ్రీ రోమింగ్ సదుపాయం ముగిసినట్లే. దేశం దాటి ఈయూ కూటమిలో ప్రవేశిస్తే రోమింగ్ చార్జీలు ఉంటాయి. అయితే అక్కడున్న ఈఈ, ఓటూ, వొడాఫోన్ వంటి కంపెనీలు ప్రస్తుతానికి రోమింగ్ సంబంధించి ప్లాన్లేమీ లేవన్నాయి. 5. తమ వాహన లైసెన్స్తో బ్రిటిషర్లు.. యూరోపియన్ యూనియన్ దేశాల్లో తిరగవచ్చు. అయితే ప్రయాణసమయాల్లో గ్రీన్ కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. వాహనం మీద జీబీ స్టిక్కర్ తప్పనిసరి. 6. యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో బ్రిటన్ దేశస్తుల ప్రాధాన్యత తగ్గిపోనుంది. ఎన్నికల్లో పోటీచేసే అధికారాలు, ఓటు వేసే హక్కులు బ్రిటిషర్లకు బాగా తగ్గిపోతాయి. 7. ఈయూ భాగస్వాములతో వ్యాపారం చేయడానికి ఇకపై అధిక పేపర్ వర్క్, అదనపు రుసుములు ఉండవచ్చు. ఫ్రెంచ్ పౌరసత్వానికి బోరిస్ తండ్రి దరఖాస్తు.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తండ్రి స్టాన్లీ జాన్సన్ ఫ్రెంచ్ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. తానెల్లప్పుడూ యూరోపియన్గానే ఉంటానని ఫ్రెంచ్ రేడియో స్టేషన్ ఆర్టీఎల్లో పేర్కొన్నారు. ఈయూ నుంచి యూకే బయటికొస్తున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తన తల్లి, అమ్మమ్మ ఇద్దరూ ఫ్రెంచ్ వారేనని, అందువల్ల తానూ ఫ్రెంచ్వాడినేనని పేర్కొన్నారు. బ్రిటిష్ ప్రజలకు యూరోపియన్లుగా ఉండాలో వద్దో వేరేవారు చెప్పలేరని అన్నారు. యూరోపియన్ యూనియన్తో సంబంధాలు కలిగి ఉండటం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. -
చైనా–ఈయూ ఒప్పందం
కరోనా అనంతర కాలంలో ఆర్థికంగా దెబ్బతిన్న దేశాలు దాన్నుంచి కోలుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. సహజంగానే ఈ పరిణామం వేరే దేశాలతో పోలిస్తే కాస్త మెరుగైన స్థితిలో వున్న చైనాకు లాభించే అంశం. అమెరికాకు సమస్యాత్మకం. అందులోనూ దీర్ఘకాలంగా అమెరికాతో సన్నిహితంగా వుంటూ, దాని నేతృత్వంలోని నాటో కూటమిలో కొనసాగుతున్న యూరొపియన్ యూనియన్(ఈయూ) సైతం చైనా వైపు చూడటం మరింతగా కంటగింపయ్యే విషయం. ఇప్పుడు జరిగింది అదే. చైనా–ఈయూల మధ్య బుధవారం పెట్టుబడులకు సంబంధించి సూత్రప్రాయమైన అవగాహన కుదిరింది. ఆన్లైన్లో అటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, ఈయూ కమిషన్ అధ్యక్షు రాలు ఉర్సులా వోన్డెర్ లెయన్, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, యూరొపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైకేల్ తదితరుల సమక్షంలో ఇదంతా పూర్తయింది. ఒప్పందంపై లాంఛనంగా సంతకాలు పూర్తికావటమే మిగిలింది. అమెరికా అభ్యంతరం, యూరప్ దేశాల్లో వినబడుతున్న నిరసన స్వరాల సంగతలా వుంచితే అవసరం ఎంత పని చేయిస్తుందో చెప్ప టానికి ఈ తాజా ఒప్పందం ఉదాహరణ. మరే దేశంతోనూ చైనా ఇంత సరళమైన ఒప్పందం కుదు ర్చుకోలేదని, ఇది ఎంతో ప్రయోజనకరమైనదని ఈయూ వాణిజ్య కమిషనర్ వాల్డిస్ అంటున్నారు. అటు చైనా సైతం ఒప్పందంపై చాలా ఉత్సాహంగా వుంది. వాస్తవానికి ఇదేమీ ఇప్పుడే హడావుడిగా కుదిరిన ఒప్పందం కాదు. ఏడేళ్లుగా దీనిపై చర్చలు సాగుతున్నాయి. అప్పటినుంచీ అమెరికా ఈయూను వెనక్కి లాగుతూనే వుంది. అమెరికాతో ఈయూకి ఇతరత్రా వుండే అవసరాలు, చైనా విధిస్తున్న షరతులు ఈ ఒప్పందం సాకారం కావటానికి ఇన్నాళ్లూ అవరోధంగా మారాయి. ఇప్పుడు మారిన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రెండు పక్షాలూ ఒప్పందానికి సిద్ధపడ్డాయి. అమెరి కాలో అధికార మార్పిడి పూర్తయ్యాక ఈయూపై ఒత్తిళ్లు పెరుగుతాయని గ్రహించిన చైనా చకచకా పావులు కదిపింది. అందువల్లే ఇది సాధ్యమైంది. అమెరికాలో నాలుగేళ్ల డోనాల్డ్ ట్రంప్ పాలన మరికొన్ని రోజుల్లో ముగుస్తోంది. ఆయన స్థానంలో జో బైడెన్ రాబోతున్నారు. బైడెన్, ట్రంప్ల మధ్య ఇతరత్రా అంశాల్లో ఎన్ని విభేదాలున్నా చైనా విషయంలో వారిది ఏకాభిప్రాయం. అమెరికా అధ్యక్ష పీఠంపై ఎవరున్నా దేశానికి చెందిన బహుళజాతి కార్పొరేషన్ల ప్రయోజనాలు కాపాడటానికి ప్రాధాన్యతనిస్తారు. హార్లీ డేవిడ్సన్ బైక్లపై భారత్లో అధిక టారిఫ్లు విధిస్తున్నారని ట్రంప్ తన హయాంలో ఎన్నిసార్లు విరుచుకుపడ్డారో అందరికీ తెలుసు. ట్రంప్ తన నోటి దురుసుతో, ఏకపక్ష విధానాలతో సన్నిహిత దేశాలపై సైతం ఇష్టానుసారం వ్యాఖ్యానాలు చేసి వాటిని దూరం చేసుకున్నారు. అందువల్లే ఎవరూ ఆయనతో కలిసి రాలేదు. చివరకు చైనాతో ఒంటరి పోరాటం చేయాల్సివచ్చింది. దీన్ని బైడెన్ సరిచేయదల్చు కున్నారు. చైనా టెక్నాలజీ పరిశ్రమలపై ఆంక్షలు విధించటం ద్వారా దాన్ని ఆర్థికంగా ఊపిరాడ కుండా చేసి దారికి తేవాలన్న ఉద్దేశంతో ట్రంప్ ఇప్పటికే కొన్ని ఉత్తర్వులు జారీ చేశారు. వాటిని కొనసాగిస్తూనే మళ్లీ పాత నేస్తాలకు సన్నిహితం కావాలని బైడెన్ ఆలోచిస్తున్నారు. ఇందుకోసమే ఈయూ–చైనాల ఒప్పందంపై చర్చలు తుది దశలో వున్నాయని తెలిసిన వెంటనే ఈయూ కమిషన్ అధ్యక్షురాలు, జర్మనీ చాన్సలర్ వగైరాలకు బైడెన్ బృందం వర్తమానం పంపింది. ఒప్పందానికి తొందరపడొద్దని కోరింది. చైనా వాణిజ్య విధానాలకూ, వీగర్ ప్రాంతంలో ముస్లింలపట్ల అది అనుసరిస్తున్న అమానుష ధోరణులకూ వ్యతిరేకంగా సమష్టిగా పోరాడి, ఒత్తిడి తేవాల్సివుంటుందని సూచించింది. బైడెన్ హయాంలో జాతీయ భద్రతా సలహాదారు కాబోతున్న జేక్ సులివాన్ గత వారం ట్విటర్ వేదికగా ఈయూ నేతలకు మరోసారి విజ్ఞప్తిచేశారు. అయినా ఈయూ వెనక్కి తగ్గలేదు. నిజానికి ఈ విషయంలో చైనానే మెచ్చుకోవాలి. అమెరికా కదలికలను పసిగట్టిన వెంటనే అది ఒప్పందంలోని సమస్యాత్మక అంశాలు కొన్నిటిపై రాజీకొచ్చి, ఆన్లైన్ భేటీకి ఆగమేఘాలపై అందరినీ ఒప్పించింది. దీనిపై అమెరికాకు అభ్యంతరాలుంటాయన్న వాదనను ఈయూ పెద్దలు తోసిపుచ్చుతున్నారు. ట్రంప్ హయాంలో కుదిరిన ఒప్పందం పర్యవసానంగా అమెరికా–చైనాల వాణిజ్యంలో కొంతమేర సమతుల్యత ఏర్పడిందని, తాజా ఒప్పందంతో ఆ ప్రయోజనమే తమకూ కలిగే అవకాశం వున్నదని ఈయూ వాణిజ్య కమిషనర్ అభిప్రాయం. అసలే అంతంతమాత్రంగా వున్న ఈయూ ఆర్థిక వ్యవస్థ కరోనా మహమ్మారి దెబ్బకు మరింత కుదేలైంది. దాని వాణిజ్యావసరాలకు విస్తృతమైన మార్కెట్లు తక్షణావసరం. అటు చైనా తన విద్యుత్ ఆధారిత వాహనాల విక్రయానికి ఆటంకాలు వుండరాదని చూస్తోంది. ఈయూ కమిషన్ లేవనెత్తు తున్న అభ్యంతరాలు దానికి అవరోధంగా వున్నాయి. ఈ ఒప్పందం సాకారమైతే సమస్యలు సమసి పోతాయని చైనా ఆశ. అలాగే పునర్వినియోగ ఇంధన వనరులకు సంబంధించిన సాంకేతికతకు ఈయూలో మరిన్ని అవకాశాలు వస్తాయి. ఇటు ప్రభుత్వ రంగ సంస్థలకు చైనా ఇస్తున్న రహస్య సబ్సిడీలకు తాజా ఒప్పందంతో వీలుండదని ఈయూ అంటున్నది. వీగర్ ముస్లింలతో బలవం తంగా వెట్టి చేయిస్తున్నారన్న అంశంలో చైనా నుంచి గట్టి హామీ తీసుకున్నామని, అది అంతర్జాతీయ కార్మిక సంస్థ ఒడంబడికలకు లోబడి వుండటానికి అంగీకరించిందని, కనుక మానవ హక్కుల ఉల్లంఘన జరగబోదని ఈయూ పెద్దలు చెబుతున్న మాటలు అక్కడి మానవ హక్కుల కార్యకర్తలకు రుచించటం లేదు. యూరప్ దేశాలు నమ్ముతున్న విలువలకు ఈయూ పోకడ విఘాతం కలిగిస్తుం దని వారి ఆరోపణ. పైగా ఒప్పందం వల్ల అన్నివిధాలా చైనాకే మేలు కలుగుతుందని ఆర్థిక నిపు ణులు వాదిస్తున్నారు. తాజా ఒప్పందం వల్ల ఈయూకి కలిగే ప్రయోజనమెంతో, దీని పర్యవసా నంగా అమెరికా–ఈయూ సంబంధాల్లో కలిగే మార్పులేమిటో మున్ముందు చూడాల్సివుంది. -
బ్రెగ్జిట్ డీల్కు యూకే ఆమోదం
లండన్: యూరోపియన్ యూనియన్తో కుదుర్చుకున్న బ్రెగ్జిట్ వాణిజ్య ఒప్పందానికి బ్రిటిష్ ఎంపీలు బుధవారం ఆమోదం తెలిపారు. అనంతరం వాణిజ్య ఒప్పందంపై బ్రిటన్ ప్రధాని సంతకం చేశారు. దీంతో వచ్చేనెల 1నుంచి ఒప్పందం అమల్లోకి వచ్చేందుకు మార్గం మరింత సుగమం అయింది. హౌస్ ఆఫ్ కామన్స్లో జరిగిన డీల్ ఓటింగ్లో 521 మంది ఎంపీలు అనుకూలంగా, 73 మంది వ్యతిరేకంగా ఓట్ వేశారు. హౌస్ ఆఫ్ లార్డ్స్లో ఆమోదం పొందిన అనంతరం బిల్లు బ్రిటన్రాణి ఆమోదం కోసం వెళ్లనుంది. అది కూడా పూర్తయితే చట్టరూపం దాలుస్తుంది. యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్, యూరోపియన్ కమీషనర్ బుధవారం డీల్పై సంతకాలు చేశారు. -
అమెరికా ప్యాకేజీ జోష్..!
ముంబై: అమెరికా ఉద్దీపన ప్యాకేజీకి ఆమోదం లభించడంతో సోమవారం మార్కెట్ లాభాలతో ముగిసింది. బ్రెగ్జిట్ చర్చల విజయవంతం నుంచి కూడా సానుకూల సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్ 380 పాయింట్ల లాభంతో 47,354 వద్ద ముగిసింది. నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి 13,873 వద్ద నిలిచింది. సూచీలకిది నాలుగోరోజూ లాభాల ముగింపు కావడం విశేషం. ఒక్క ఫార్మా తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా మెటల్ షేర్లు లాభపడ్డాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మద్దతు ఇవ్వడంతో ఒక సెన్సెక్స్ 433 పాయింట్లు లాభపడి 47,407 వద్ద, నిఫ్టీ 136 పాయింట్లు పెరిగి 13,885 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి. కరోనా వైరస్తో చిన్నాభిన్నమైన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అమెరికా ప్రతినిధుల సభ గతవారం 2.3 ట్రిలియన్ డాలర్ల బిల్లును ఆమోదించి.. సంతకం కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్దకు పంపింది. ముందు బిల్లు ఆమోదానికి ట్రంప్ నిరాకరించారు. అయితే అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఆదివారం రాత్రి 2.3 ట్రిలియన్ డాలర్ల బిల్లుపై సంతకం చేశారు. మరోవైపు ఐరోపా సమాఖ్య(ఈయూ)–బ్రిటన్ల మధ్య ఎట్టకేలకు కీలక వాణిజ్య ఒప్పందం పూర్తవడంతో ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారింది. ఆసియా, ఐరోపా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇక దేశీయంగా పరిణామాలను పరిశీలిస్తే ... కోవిడ్–19 వ్యాక్సిన్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్రం నాలుగు రాష్ట్రాల్లో ట్రయల్ డ్రై–రన్ను మొదలుపెట్టడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 6 పైసలు బలపడి 73.49 వద్ద స్థిరపడింది. రూ.11వేల కోట్లను తాకిన టీసీఎస్ మార్కెట్ క్యాప్... దేశీయ ఐటీ సేవల సంస్థ టీసీఎస్ కంపెనీ మార్కెట్ క్యాప్ ఇంట్రాడేలో రూ.11 వేల కోట్లను తాకింది. రిలయన్స్ తర్వాత ఈ ఘనతను సాధించిన రెండో దేశీయ కంపెనీగా టీసీఎస్ రికార్డుకెక్కింది. డాయిష్ బ్యాంక్ నుంచి పోస్ట్బ్యాంక్ సిస్టమ్ను చేజిక్కించుకోవడంతో పాటు ఈ డిసెంబర్ 18న ప్రారంభించిన రూ.16 వేల కోట్ల బైబ్యాక్ ఇష్యూతో టీసీఎస్ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం ట్రేడింగ్లో ఈ షేరు 1% పైగా లాభపడి రూ.2949.70 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. 4 రోజుల్లో 8.22 లక్షల కోట్లు! సూచీల నాలుగురోజుల ర్యాలీతో రూ.8.22 లక్షల కోట్ల సంపద ఇన్వెస్టర్ల సొంతమైంది. ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.187 లక్షల కోట్లకు చేరుకుంది. జాతీయ, అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో ఈ నాలుగు రోజుల ట్రేడింగ్లో సెన్సెక్స్ 1,800 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 742 పాయింట్లను ఆర్జించింది. -
ఈయూలో టీకా షురూ
లండన్/రోమ్: ఐరోపా దేశాల సమాఖ్య(ఈయూ)లో కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. డాక్టర్లు, నర్సులు, వృద్ధులకు ఫైజర్/బయోఎన్టెక్ వ్యాక్సిన్ మొదటి డోసు ఇచ్చారు. వీరికి మూడు వారాల్లో మరో డోసు ఇవ్వాల్సి ఉంటుంది. ఈయూలో 27 సభ్య దేశాలు ఉండగా, జర్మనీ, హంగేరి, స్లోవేకియా తదితర దేశాలు ఒకరోజు ముందే అంటే శనివారం వ్యాక్సినేషన్కు శ్రీకారం చుట్టాయి. కరోనా బారినపడే ప్రమాదం అధికంగా ఉన్న ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ ఇచ్చారు. స్పెయిన్లో 96 ఏళ్ల వ్యక్తికి తొలి డోసు ఇచ్చారు. చెక్ రిపబ్లిక్ ప్రధానమంత్రి అండ్రెజ్ బబీస్ కూడా ఆదివారం వ్యాక్సిన్ తీసుకున్నారు. జర్మనీలో 101 ఏళ్ల మహిళ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈయూలో ఇప్పటివరకు 1.60 కోట్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,36,000 మంది బాధితులు మరణించారు. వారికే మొదటి ప్రాధాన్యత.. ఆక్స్ఫర్డ్, అస్ట్రాజెనెకా కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్కు గురువారంలోగా యూకే ప్రభుత్వం అనుమతి లభిస్తుందని భావిస్తున్నారు. కరోనా వైరస్ సోకితే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉన్న 1.2 కోట్ల నుంచి 1.5 కోట్ల మందికి తొలుత వ్యాక్సిన్ అందజేస్తామని, వారే తమ మొదటి ప్రాధాన్యత అని ప్రభుత్వం తెలిపింది. ఒక్కో డోసు కేవలం 2 పౌండ్లు ఫైజర్, మోడెర్నా టీకాల తరహాలోనే ఆక్స్ఫర్డ్/అస్ట్రాజెనెకా టీకా కూడా ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు అధ్యయనంలో తేలిందని అస్ట్రాజెనెకా చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాస్కాల్ సొరియొట్ చెప్పారు. కరోనా బాధితులపై 95 శాతం ప్రభావవంతంగా పని చేస్తుందని, ఆసుపత్రిలో చికిత్స అవసరమైన వారికి 100 శాతం రక్షణ కల్పిస్తుందని వెల్లడించారు. ఈ టీకాను సాధారణ రిఫ్రిజిరేటర్లలో నిల్వ చేయవచ్చు. ధర ఒక్కో డోసుకు కేవలం 2 పౌండ్లు. 10 కోట్ల ఆక్స్ఫర్డ్/అస్ట్రాజెనెకా టీకా డోసుల కోసం యూకే ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. మార్చికల్లా 4 కోట్ల డోసులు అందుబాటులోకి రానున్నాయి. -
ఈయూ, బ్రిటన్లతో వేర్వేరు వాణిజ్య ఒప్పందాలు!
న్యూఢిల్లీ: బ్రెగ్జిట్ తదనంతర వాణిజ్య ఒప్పందానికి యూరోపియన్ యూనియన్ (ఈయూ), బ్రిటన్ సిద్ధమవుతున్న నేపథ్యంలో, భారత్ కూడా ఆ రెండు ప్రాంతాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (ఎఫ్టీఏ) సిద్ధమవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ ఎఫ్టీఏల వల్ల ప్రయోజనం ఎంత ఉంటుందన్నది ఇప్పుడే పూర్తి స్థాయిలో మదింపుచేయడం కష్టమని విశ్లేషిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), నిర్మాణం, పరిశోధనా–అభివృద్ధి, ఇంజనీరింగ్ రంగాలకు సంబంధించి సేవల విషయంలో ఎఫ్టీఏల వల్ల ప్రయోజనం ఉంటుందని వారి విశ్లేషిస్తున్నారు. ఈయూ–బ్రిటన్ ఒప్పందం సేవల రంగానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఈ అంచనాకు ప్రధాన కారణం. జనవరి 1వ తేదీ నుంచి యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ పూర్తిగా వైదొలగనుంది (బ్రెగ్జిట్). ఈ పరిస్థితుల్లో రెండు ప్రాంతాల మధ్య వాణిజ్య సంబంధాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ఒప్పందంపై అవరోధాలను తొలగించుకోవడానికి గురువారం జరిగిన చర్చలు కొంతవరకూ సఫలీకృతం అయ్యాయి. సేవల రంగానికి ప్రయోజనం... భారత్ వస్తువులకు ఎఫ్టీఏల వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు. అయితే అటు బ్రిటన్ ఇటు ఈయూ మార్కెట్లలో సేవల రంగానికి సంబంధించి మనం చక్కటి అవకాశాలను సొంతం చేసు కోవచ్చు. దీనికి తగిన వ్యూహముండాలి. – అజయ్ సాహి, ఎఫ్ఐఈఓ డీజీ కేంద్రానికి సిఫారసు చేశాం... యూరోపియన్ యూనియన్, బ్రిటన్లతో ఎఫ్టీఏలకు ఇప్పటికే ప్రారంభమైన చర్చలను మరింత ముందుకు తీసుకువెళ్లాలి. వచ్చే నెల్లో భారత్కు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ విచ్చేస్తున్న సందర్భంగా దీనిపై చర్చలు జరగాలని ప్రభుత్వాన్ని కోరాం. – శరద్ షరాఫ్, ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ బ్రిటన్తో వాణిజ్య అవకాశాలు... ఈయూతో ఎఫ్టీఏ చర్చలను ముందుకు తీసుకుని వెళ్లడానికి భారత్కు ఎన్నో క్లిష్టమైన అంశాలు ఉన్నాయి. అయితే బ్రెగ్జిట్ తర్వాత బ్రిటన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి భారత్కు మంచి అవకాశాలే ఉన్నాయని భావించవచ్చు. – బిశ్వజిత్ ధర్, జేఎన్యూ ప్రొఫెసర్ -
ఈయూతో యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
లండన్: యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కూటమితో యునైటెడ్ కింగ్డమ్(యూకే) భారీ ఒప్పందం కుదుర్చుకుంది. పోస్ట్–బ్రెగ్జిట్స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని(ఎఫ్టీఏ) ఇరు వర్గాలు గురువారం ఖరారు చేసుకున్నాయి. ఇందుకు తుది గడువు డిసెంబర్ 31 కాగా, వారం రోజుల ముందే ఒప్పందం కుదరడం విశేషం. ఇందుకు బెల్జియంలోని బ్రస్సెల్స్ నగరం వేదికగా మారింది. ఇది అతిపెద్ద ద్వైపాక్షిక ఒప్పందమని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. ఈ అగ్రిమెంట్ పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో బహిర్గతం కానున్నాయి. ఒక స్వతంత్ర వాణిజ్య దేశంగా ఇకపై తమకు ఎన్నో కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఇతర భాగస్వామ్య దేశాలతో మరిన్ని వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి మార్గం సుగమమైందని యూకే అధికార వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. జీరో టారిఫ్లు, జీరో కోటాల ఆధారంగా ఈయూతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించాయి. దీంతో ధనం, సరిహద్దులు, చట్టాలు, వాణిజ్యం, సముద్ర జలాలపై తమ ఆధిపత్యం మళ్లీ తిరిగి వస్తుందని తెలిపాయి. ఒక్కమాటలో చెప్పాలంటే 2021 జనవరి 1వ తేదీన తాము పూర్తిగా రాజకీయ, ఆర్థిక స్వేచ్ఛ పొందుతామని స్పష్టం చేశాయి. ఇదొక పారదర్శక, బాధ్యతాయుతమైన ఒప్పందమని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వన్డెర్ లెయెన్ అభివర్ణించారు. ఈయూకు యూకే దీర్ఘకాలిక భాగస్వామ్య దేశమని గుర్తుచేశారు. ఈయూ నుంచి విడిపోవడం కొంత బాధాకరమే అయినప్పటికీ, ఇది భవిష్యత్తు వైపు దృష్టి సారించాల్సిన సమయమన్నారు. ప్రధాని బోరిస్ హర్షం పోస్ట్–బ్రెగ్జిట్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం పట్ల యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ‘ద డీల్ ఈజ్ డన్’ అంటూ ఒక మెసేజ్ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అనంతరం 10 డౌనింగ్ స్ట్రీట్లోని తన నివాసం వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బ్రిటిష్ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని చెప్పారు. అతి పెద్ద ఒప్పందాన్ని నేడు ఖరారు చేసుకున్నామని, ప్రజలు కోరుకున్నదే జరిగిందని తెలిపారు. మన ఉత్పత్తులు, వస్తువులను ఇకపై ఈయూ మార్కెట్లలో ఎలాంటి టారిఫ్లు, నియంత్రణల భారం లేకుండా విక్రయించుకోవచ్చని అన్నారు. తద్వారా యూకేలో కొత్త ఉద్యోగాలను, గ్రీన్ ఇండస్ట్రియల్ జోన్లను సృష్టించావచ్చని పేర్కొన్నారు. 1973 తర్వాత తొలిసారిగా మన సముద్ర జలాలపై పూర్తి నియంత్రణతో యూకే ఒక స్వతంత్ర తీరప్రాంతం ఉన్న దేశంగా మారుతుందని తెలిపారు. సముద్ర జలాల్లో చేపల వేటపై యథాతథ స్థితి ఒప్పందం మరో ఐదున్నరేళ్లు మాత్రమే అమల్లో ఉంటుందని, ఆ తర్వాత మన జాలర్లు మన సముద్ర జలాల్లో ఎన్ని చేపలయినా పట్టుకోవచ్చని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. యూకే ఎప్పటికీ యూరప్తో సాంస్కృతికంగా, చరిత్రకంగా, వ్యూహాత్మకంగా, భౌగోళికంగా అనుసంధానమైన ఉంటుందని ఉద్ఘాటించారు. బ్రిటిష్ ఎంపీలు డిసెంబర్ 30న సమావేశమై, ఈ ఒప్పందానికి ఆమోదం తెలుపుతారని పేర్కొన్నారు. -
పాకిస్తాన్కు భారీ షాక్..!
న్యూఢిల్లీ: తమ దేశంలో ఉన్న 860 మంది పైలట్లలో దాదాపు 262 మంది బోగస్ పైలట్లేనన్న ప్రకటన పాకిస్తాన్ ఎయిర్లైన్స్పై తీవ్ర ప్రభావం చూపనుంది. లైసెన్స్ కుంభకోణం కారణంగా దాదాపు 188 దేశాల్లో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(పీఐఏ) రాకపోకలపై నిషేధం విధించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్(ఐసీఏవో) ప్రమాణాలు పాటించకుండా ఇష్టారీతిన పైలట్ లైసెన్సులు జారీ చేసిన నేపథ్యంలో సంస్థ, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కాగా పైలట్ శిక్షణ, లైసెన్సింగ్ జారీ ప్రక్రియ అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లు లేవంటూ ఐసీఏవో, నవంబరు 3న పాకిస్తాన్ ఏవియేషన్ అథారిటీకి లేఖ రాసింది. ఈ విషయం గురించి అనేకమార్లు హెచ్చరించినప్పటికీ పాక్ తీరు మారడం లేదని, కాబట్టి పాకిస్తాన్ విమానాలు, పైలట్లపై నిషేధం విధించే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ విషయం గురించి పాకిస్తాన్ ఎయిర్లైన్స్ పైలట్స్ అసోసియేషన్(పీఏఎల్పీఏ) అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘ఇదే గనుక నిజమైతే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుంది. పాక్ పౌరవిమాన రంగం కుప్పకూలిపోతుంది. గత ఆర్నెళ్లుగా ఈ విషయం గురించి మేం అధికారుల దృష్టికి తీసుకువెళ్తూనే ఉన్నాం. కానీ వారు పట్టించుకోలేదు. నిర్లక్ష్య వైఖరి కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ విషయంలో జోక్యం చేసుకుని, స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి తమ సమస్యలు పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. లైసెన్స్ స్కామ్ కారణంగా యూరోపియన్ యూనియన్ ఎయిర్ సేఫ్టీ ఏజెన్సీ(ఈఏఎస్ఏ) ఇప్పటికే పాకిస్తాన్కు భారీ షాకిచ్చిన విషయం తెలిసిందే. పాక్ ఎయిర్లైన్స్ విమానాలను ఈయూ సభ్య దేశాల్లోకి అనుమతించే ప్రసక్తే లేదని పేర్కొంటూ జూలైలో నిషేధం విధించింది. ఇక ఇప్పుడు ఏకంగా 188 దేశాలకు వీటి రాకపోకలు నిషేధించేందుకు ఐసీఏవో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.(చదవండి: పాక్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: భారత్) కాగా పాకిస్తాన్లోని కరాచీలో ఈ ఏడాది మే 22న జనావాసాల్లో విమానం కుప్పకూలిన విషయం విదితమే. ఈ దుర్ఘటనలో 97 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ క్రమంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా దర్యాప్తు ప్రారంభించిన ఇమ్రాన్ ఖాన్ సర్కారు.. ప్రమాదానికి పైలట్ నిర్లక్ష్యమే కారణమని తేల్చింది. ఇందుకు సంబంధించిన నివేదికను పార్లమెంటుకు సమర్పించిన పాక్ విమానయాన శాఖ మంత్రి గులాం సర్వార్ ఖాన్.. విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం లేదని, తప్పంతా పైలట్దేనంటూ ప్రకటన చేశారు. అదే విధంగా ఈ ఘటనపై లోతుగా విచారణ చేపట్టిన పాక్ ప్రభుత్వం.. తమ దేశంలో సుమారు 262 మంది బోగస్ పైలట్లు ఉన్నారని తేల్చింది. వీరంతా వేరొకరితో పరీక్ష రాయించి విధుల్లో చేరినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో పీఐఏపై నిషేధం విధిస్తూ ఈఏఎస్ఏ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
నారికేళం.. యూరప్ పయనం!
అమలాపురం: ఆంధ్రా నుంచి కొబ్బరి దిగుమతి చేసుకునేందుకు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలైన యునైటెడ్ కింగ్డమ్ (యూకే), బెల్జియం, నెదర్లాండ్స్, స్పెయిన్, జర్మనీ ఆసక్తి చూపుతున్నాయి. మన రాష్ట్రంలోని కొబ్బరి రైతులు, ఎగుమతిదారులతో చర్చలు జరిపేందుకు యూరోపియన్ వ్యాపారులు సిద్ధమయ్యారు. విశాఖ కేంద్రంగా డిసెంబర్లో ఓ సదస్సు నిర్వహించనున్నారు. అన్నీ అనుకూలిస్తే.. మన రాష్ట్రం నుంచి కొబ్బరితోపాటు కోకో, అరటి, మిరియాల ఎగుమతులకూ మార్గం సుగమం కానుంది. కొబ్బరి ముక్క, నీరు, నూనె, కొబ్బరి పాలు, ఇతర ఉత్పత్తులు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ కారణంగా యూరప్ వాసుల ఆహారంలో కొబ్బరి వినియోగం పెరుగుతోంది. ఇప్పటికే మలేషియా, థాయ్లాండ్, మన దేశంలోని కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి యూరప్కు కొబ్బరి ఎగుమతి అవుతోంది. అవసరాలకు తగినట్టు దిగుమతులు లేకపోవడంతో ఆంధ్రా నుంచి కూడా దిగుమతి చేసుకోవాలని అక్కడి వ్యాపారులు నిర్ణయించారు. డిసెంబర్లో సదస్సు యూరోపియన్ దేశాలకు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో)తో పాటు కొందరు దిగుమతిదారులు మన రాష్ట్రంలోని కొబ్బరి వ్యాపారులు, రైతులతో ఇప్పటికే ఓ దఫా చర్చలు జరిపారు. గడచిన సెప్టెంబర్లోనే ఇక్కడి రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, వ్యాపారులతో యూరోపియన్ యూనియన్ దిగుమతిదారులు సదస్సు నిర్వహించాలని యోచించారు. కానీ.. కరోనా ఉధృతి వల్ల వాయిదా పడింది. వచ్చే డిసెంబర్లో ఈ సదస్సు నిర్వహించనున్నారు. చర్చలు ఫలించి కొబ్బరి ఎగుమతులు ప్రారంభమైతే అరటి, కోకో, మిరియం వంటి ఎగుమతులు కూడా పెరుగుతాయి. కాగా, తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లికి చెందిన ఆదర్శ కొబ్బరి రైతు విళ్ల దొరబాబును యూరోపియన్ యూనియన్ దిగుమతిదారులు ఏపీలో తమ ప్రతినిధిగా ఎంపిక చేసుకున్నారు. -
తప్పుడు ప్రచారం తడాఖా
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కూ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కూ రూపురేఖల్లోనే కాదు... అభిప్రాయాల్లోనూ పోలికలుంటాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ విషయంలోనూ తమ దృక్పథాలు ఒకటేనని ఇప్పుడు జాన్సన్ నిరూపించారు. యూరప్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ విడిపో వాలా వద్దా అన్న అంశంపై నాలుగేళ్లనాడు జరిగిన రెఫరెండంను ప్రభావితం చేయడానికి రష్యా ప్రయత్నించిందన్న ఆరోపణలపై విచారణ జరిపిన పార్లమెంటరీ కమిటీ వెలువరించిన నివేదిక గమనిస్తే జాన్సన్ ప్రభుత్వ సహాయ నిరాకరణ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. వాస్తవానికి ఈ నివేదిక తయారై తొమ్మిది నెలలు దాటింది. గత ఏడాది అక్టోబర్లో దాన్ని ప్రభుత్వానికి అందజేశారు. కానీ నివేదికను బయటపెట్టడానికి ప్రభుత్వం సిద్ధపడలేదు. ఇందులోని అంశాలు తెలిస్తే జనంలో ఆగ్రహా వేశాలు పెల్లుబుకుతాయని, డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో జనం తమను తిరస్కరించే అవకాశం వున్నదని కన్సర్వేటివ్ పార్టీ భయపడింది. ఆ తర్వాత కూడా ప్రభుత్వం మొరాయిస్తూనే వుంది. కానీ ఈ విషయంలో న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు కావడంతో గత్యంతరం లేక నివేదికను బయట పెట్టింది. అయితే ఇది రష్యా ప్రమేయం వుండొచ్చునని మాత్రమే తేల్చింది. లోతుగా దర్యాప్తు జరి పించి నేర నిర్ధారణ చేయాల్సింది మాత్రం జాన్సన్ ప్రభుత్వమే. ప్రపంచంలోని రెండు అగ్రరాజ్యాలు అమెరికా, బ్రిటన్లు శక్తిమంతమైనవి. ప్రపంచ రాజకీయా లను అవి దశాబ్దాలపాటు శాసించాయి. ఎన్నో దేశాల్లో వాటి మాటే చెల్లుబాటయింది. ఇప్పటికీ అవుతోంది. తాము చెప్పినట్టు వినడానికి సిద్ధపడని నేతల్ని అధికారం నుంచి కూలదోసిన చరిత్ర కూడా ఆ దేశాలకుంది. అలాంటి దేశాల అంతర్గత రాజకీయాల్లో రష్యా గుట్టు చప్పుడు కాకుండా జోక్యం చేసుకుని, తనకు అనుకూలంగా వుండే నేతల్ని అధికార పీఠాలపై కూర్చోబెట్టిందంటే వినడానికి ఎబ్బెట్టుగా వుంటుంది. కానీ ఇది వాస్తవమని నిరుడు అమెరికాలో రాబర్ట్ మ్యూలర్ నివేదిక చెప్పింది. ఇప్పుడు బ్రిటన్ పార్లమెంటరీ నివేదిక చెబుతోంది. ఇంతకూ రష్యా తన కార్య సాధన కోసం ఏం చేస్తుంది? కోట్లాదిమంది ఓటర్లను మాయా జాలంలో ముంచెత్తే మంత్రదండం ఏమైనా పుతిన్ దగ్గర వుందా? బయటి దేశాలవారెవరో చేసిన ప్రచారానికి అమెరికా, బ్రిటన్ ప్రజలు బోల్తా పడ్డారా? ఈ ప్రశ్నలకు ఎవరిదగ్గరా ఖచ్చితమైన జవాబుల్లేవు. కానీ నిరుడు ఏప్రిల్లో అమెరికాలో వెల్లడైన రాబర్ట్ మ్యూలర్ నివేదిక 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయం వున్నదని నిర్ధారించింది. ఇందులో నేరుగా ట్రంప్ బాధ్యత ఎంత అన్న అంశంపై ఆ నివేదిక ఏం చెప్పిందో ఇంతవరకూ తెలియదు. ఏ నివేదికనైనా ఎంతవరకూ బయటపెట్టాలో నిర్ణయించే అధికారం అధ్యక్షుడిగా ట్రంప్కు వుంటుంది. ఆయన ఆ అధికారాన్ని వినియోగించుకున్నారు. నివేదిక తనకు క్లీన్ చిట్ ఇచ్చిందని ట్రంప్ చేసుకున్న ప్రచారాన్ని మాత్రం స్వయానా మ్యూలరే ఖండించారు. రష్యా తీరుపై గత అయిదారేళ్లుగా కథలు కథలుగా మీడియాలో వెల్లడవుతూనే వున్నాయి. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే అవకాశం దండిగా వున్న డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ను దెబ్బతీయడానికి సామాజిక మాధ్యమాల నిండా ఆమెకు వ్యతిరేకంగా భారీయెత్తున అబద్ధాలు ప్రచారమయ్యాయి. అవి ఏ స్థాయిలో వున్నాయంటే వాటిని ఖండించడానికి హిల్లరీ టీమ్కు బోలెడంత సమయం పట్టింది. వాటికి జవాబిచ్చేలోగా మరిన్ని ప్రచారంలోకొచ్చేవి. బ్రిటన్లోనూ స్కాట్లాండ్ రెఫరెండం సమయంలో, బ్రెగ్జిట్ ఓటింగ్ సమయంలో మార్ఫింగ్ ఫొటోలనూ, తప్పుడు కథనాలనూ విస్తృతంగా ప్రచారం చేశారు. అమెరికాలో ట్రంప్ వ్యాపార సంస్థల ఎగ్జిక్యూటివ్లు, ఇతరులు రష్యా ప్రచారానికి అండదండగా నిలిచారు. వీరు కేంబ్రిడ్జి ఎనలిటికా ఆసరా తీసుకోవడంతోపాటు ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వగైరా సామాజిక మాధ్యమాల్లో దొంగ పేర్లతో అకౌంట్లు తెరిచి నకిలీ సమాచారాన్ని, తప్పుడు వార్తల్ని వ్యాప్తిలోకి తెచ్చారని మ్యూలర్ నివేదిక తేల్చింది. తమ దర్యాప్తును అడుగడుగునా అడ్డుకోవడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలనూ ప్రస్తావించింది. ఇప్పుడు బ్రిటన్ పార్లమెంటరీ నివేదిక చూసినా ఇలాంటి అంశాల ప్రస్తావనే వుంది. బ్రిటన్లో న్యాయవాదులు, అకౌంటెంట్లు, ఎస్టేట్ ఏజెంట్లు తెలిసో తెలియకో రష్యా ప్రచారంలో వాహకులుగా మారారని, హౌస్ ఆఫ్ లార్డ్స్లోని కొందరు ఎంపీలు సైతం రష్యాలో తమ కున్న వ్యాపార ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ఇందులో తలదూర్చారని ఆ నివేదిక అంటోంది. బ్రిటన్లో కామన్స్ సభ సభ్యులతో పోలిస్తే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యులకు అదనపు హక్కులుంటాయి. ఈ పారదర్శకత లేమినే రష్యా ఉపయోగించుకుంటున్నదని పార్లమెంటరీ కమిటీ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ నివేదిక వెల్లడయ్యాక ఎప్పటిలాగే బ్రిటన్ ప్రభుత్వం రష్యా ప్రమేయాన్ని తోసిపుచ్చింది. 2019 ఎన్నికల్లో వారు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించిన మాట వాస్తవమే అయినా అదేమీ ఫలించలేదన్నది ప్రభుత్వ వాదన. కమిటీ కోరుతున్నట్టు దర్యాప్తు అవసరం లేదన్నదే దాని భావన. కానీ ఇదంత తేలిగ్గా కొట్టిపారేసేది కాదు. 2014లో స్కాట్లాండ్ రెఫరెండం జరిగినప్పుడు ట్విటర్లోని 4,000కుపైగా ఖాతాల ద్వారా తప్పుడు ప్రచారం సాగింది. అందులో 3,841 ఖాతాలు రష్యాకు, 770 ఖాతాలు ఇరాన్కి చెందినవని ఇంటర్నెట్ రీసెర్చ్ ఏజెన్సీ 2018లోనే వెల్లడించింది. ఈ ఖాతాల ద్వారా ఒక రోజంతా కోటి ట్వీట్లు విడుదలయ్యాయని కూడా అది లెక్కేసింది. ఈ విషయంలో సామాజిక మాధ్యమాలు కూడా నిస్సహాయంగా వుండటం, జవాబుదారీతనాన్ని ప్రదర్శించలేక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది బ్రిటన్ లేదా అమెరికా సమస్య మాత్రమే కాదు... రష్యాను ఆద ర్శంగా తీసుకుని తప్పుడు ప్రచారాలతో లబ్ధి పొందాలని చూసేవారు అన్ని దేశాల్లోనూ బయల్దేరారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోమని ప్రభుత్వాలపై ఒత్తిళ్లు తీసుకురావడంతోపాటు, ప్రజల్లో చైతన్యం కలిగించడం ప్రజాస్వామికవాదుల కర్తవ్యం. -
ఉపాధికి నైపుణ్య మంత్రం
న్యూఢిల్లీ: కోవిడ్–19 విజృంభిస్తున్న నేపథ్యంలో యువతలో నైపుణ్యానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వాణిజ్య స్థితిగతులు, మార్కెట్ రంగంలో అనూహ్య మార్పులు చేసుకుంటున్న వేళ నైపుణ్యం, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం, ఇతరుల్ని నిపుణులుగా తీర్చిదిద్దడం అత్యంత కీలకమని యువతకు పిలుపునిచ్చారు. వరల్డ్ యూత్ స్కిల్ డేని పురస్కరించుకొని మోదీ బుధవారం యువతకు వీడియో ద్వారా సందేశాన్నిచ్చారు. అయిదేళ్ల క్రితం ఇదే రోజున స్కిల్ ఇండియా మిషన్ను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ మిషన్ ద్వారా గత అయిదేళ్లలో 5 కోట్ల మందికి పైగా వివిధ రంగాల్లో తమ నైపుణ్యాల్ని మెరుగుపరచుకున్నారన్నారు. తద్వారా యువతకి స్థానికంగా, అంతర్జాతీయంగా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని మోదీ తెలిపారు. కరోనాతో మారిన ప్రపంచం కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రపంచంలో త్వరితగతిన మార్పులు వస్తున్నాయని, ముఖ్యంగా ఆరోగ్య రంగంలో నిపుణులైన యువతకి చాలా ప్రాధాన్యముంటుందని మోదీ చెప్పారు. కరోనా వైరస్తో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల స్వరూపాలు పూర్తిగా మారిపోయాయని, పనిచేసే పరిస్థితుల్లో కూడా అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. కొత్తగా వస్తున్న టెక్నాలజీ కూడా దీనిపై ప్రభావం చూపిస్తోందన్నారు. కొత్త తరహా ఉద్యోగాలు, కొత్త తరహా పనితీరుతో మన దేశంలో యువత కొత్త నైపుణ్యాలను పెంచుకుంటోందని ప్రధాని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య విధానాలు, మార్కెట్ పరిస్థితుల్లో త్వరితగతిన వస్తున్న మార్పులకు తగ్గట్టుగా ఎలా మారాలన్న ప్రశ్నలు ఎక్కువమంది తనను అడుగుతున్నారని, దానికి తన దగ్గరున్న ఒకే ఒక్క సమాధానం ‘స్కిల్, రీ స్కిల్, అప్ స్కిల్’ అని చెప్పారు. నైపుణ్యం, దానిని మెరుగుపరచుకోవడం, ఇతరులకు నైపుణ్యాన్ని నేర్పించడమే యువతకు ఉపాధి కల్పించే మంత్రమని ప్రధాని స్పష్టం చేశారు. ‘‘నైపుణ్యం వంటిది మరోటి లేదు. అది మిమ్మల్ని విభిన్నంగా తీర్చిదిద్దుతుంది. నైపుణ్యం ఒక జ్ఞాన సంపద వంటిది. దానిని మీ నుంచి ఎవరూ తీసుకువెళ్లలేరు. నైపుణ్యం స్వయంసమృద్ధి వంటిది. దాని వల్ల మీ కాళ్ల మీద మీరు నిలబడడమే కాదు, మీరే ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు’’అని నైపుణ్యం ప్రాధాన్యతను వివరించారు. నిపుణులైన కార్మికుల్ని గుర్తించడానికి ఇటీవల ఒక పోర్టల్ ప్రారంభించామని, తిరిగి గ్రామాలకు వెళ్లిన వలస కార్మికులకు ఉపాధినివ్వడంలో దీనిని వినియోగించుకోవాలన్నారు. చర్చల ద్వారా వాణిజ్య వివాదాలు పరిష్కారం భారత్, ఈయూ సదస్సులో నిర్ణయం స్వేచ్ఛాయుత వాణిజ్యంలో దీర్ఘకాలంగా నెలకొన్న విభేదాలను పరిష్కరించడానికి అత్యున్నత స్థాయి చర్చలు జరపాలని భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) నిర్ణయించాయి. రక్షణ, అణు ఇంధనశక్తి, ఆరోగ్య రంగాల్లో పరస్పరం సహకరించుకునేలా సంబంధా లను బలోపేతం చేయాలని, దానికి పంచవర్ష ప్రణాళికను రూపొందించాలని ఇరుపక్షాలు ఒక అంగీకారానికి వచ్చాయి. బుధవారం జరిగిన 15వ ఈయూ– ఇండియా సదస్సు వీడియో సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. ఈయూలో ఉన్న 27 దేశాలతో సత్సంబంధాల ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. -
పాక్ ఎయిర్లైన్స్కు ఈయూ షాక్!
పారిస్: యూరోపియన్ యూనియన్ ఎయిర్ సేఫ్టీ ఏజెన్సీ(ఈఏఎస్ఏ) పాకిస్తాన్కు గట్టి షాకిచ్చింది. ఆరు నెలల పాటు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(పీఐఏ) విమానాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈయూ సభ్య దేశాల్లో(27)కి పీఐఏ విమానాలను అనుమతించబోమని.. జూలై 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇక ఈ విషయంపై మంగళవారం స్పందించిన పీఐఏ.. ‘‘ఈయూ సభ్య దేశాల్లోకి ఆర్నెళ్ల పాటు పీఐఏ విమానాలకు అనుమతిని ఈఏఎస్ఏ నిషేధించింది. జూలై 1, 2020 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. పీఐఏ ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతోంది. త్వరలోనే ఈ నిషేధాన్ని ఎత్తివేస్తారని ఆశిస్తున్నాం’’ అని పేర్కొంది. (సరిహద్దులు తెరిచిన ఈయూ) కాగా పాకిస్తాన్లోని కరాచీలో మే 22న జనావాసాల్లో విమానం కుప్పకూలిన ఘటనలో 97 మంది దుర్మరణం పాలైన విషయం విదితమే. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా దర్యాప్తు ప్రారంభించిన ప్రభుత్వం.. ప్రమాదానికి పైలట్ నిర్లక్ష్యమే కారణమని తేల్చింది. ఇందుకు సంబంధించిన నివేదికను పార్లమెంటుకు సమర్పించిన పాక్ విమానయాన శాఖ మంత్రి గులాం సర్వార్ ఖాన్.. విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం లేదని, తప్పంతా పైలట్దేనని పేర్కొన్నారు. (ఆ భయం వల్లే విమానం కుప్పకూలింది!) ఇక ఈ విషయంపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం.. దేశంలో ఉన్న 860 మంది పైలట్లలో దాదాపు 262 మంది బోగస్ పైలట్లేనని తేల్చింది. వీరంతా వేరొకరితో పరీక్ష రాయించి విధుల్లో చేరినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈఏఎస్ఏ.. పీఐఏ విమానాలపై నిషేధం విధించడం గమనార్హం. కాగా ఈఏఎస్ఏ తాజా నిర్ణయంతో పాక్ ఎయిర్లైన్స్లో ఈయూ దేశాలకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్న వారు తమ ప్రయాణాన్ని ఆర్నెళ్లపాటు వాయిదా వేసుకోవచ్చని.. లేని పక్షంలో టికెట్ డబ్బు రీఫండ్ చేసేందుకు సంస్థ సిద్ధంగా ఉన్నట్లు స్థానిక మీడియా డాన్ పేర్కొంది. ఇదిలా ఉండగా.. జూలై 1వ తేదీనుంచి 15 దేశాల సరిహద్దులను మళ్లీ తెరుస్తున్నట్లు ఈయూ ప్రకటించిన విషయం తెలిసిందే. (పాక్లో 30 శాతం బోగస్ పైలట్లు) EASA has suspended PIA's permission to operate to EU member states for 6 months w.e.f July 1, 2020: 0000Hrs UTC. PIA is in touch with EASA to allay their concerns and hopes that the suspension will be revoked with our CBMs soon. — PIA (@Official_PIA) June 30, 2020 -
సరిహద్దులు తెరిచిన ఈయూ
పారిస్: యూరోపియన్ యూనియన్ జూలై 1వ తేదీనుంచి 15 దేశాల సరిహద్దులను మళ్లీ తెరుస్తున్నట్లు ప్రకటించింది. అయితే కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న అమెరికాను ఈ జాబితా నుంచి మినహాయించారు. చైనాను ఈ జాబితాలో చేర్చి, రెండు వారాలకు ఒకసారి సమీక్షిస్తామని తెలిపారు. అలాగే చైనా కూడా యూరోపియన్ దేశాలకు సహకరించాలనే షరతుతో యూరోపియన్ యూనియన్ ఈ నిర్ణయం తీసుకుంది. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఉరుగ్వే దేశాలకు షరతులు లేకుండా సరిహద్దులను తెరిచారు. 27 సభ్య దేశాలున్న యూరోపియన్ యూనియన్ ఓటింగ్ విధానం ద్వారా అల్జీరియా, జార్జియా, జపాన్, మాంటేనెగ్రో, మొరాకో, రువాండా, సెర్బియా, దక్షిణ కొరియా, థాయ్లాండ్, ట్యునీషియా దేశాల సరిహద్దులను తెరిచింది. ఈ నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యత సభ్య దేశాలపై ఉంటుందని యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. (ముప్పున్న వారికే ముందుగా టీకా!) -
లక్ష దాటిన కోవిడ్ మరణాలు
జెనీవా/వాషింగ్టన్/రోమ్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కరాళ నృత్యం చేస్తోంది. ఈ వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య శుక్రవారం 1,01,485కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 16లక్షల 75వేల మందికిపైగా కరోనా వైరస్ బారినపడ్డారు. ఈస్టర్ సంబరాల వేళ ప్రపంచ జనాభాలో సగం మంది ఇంటి పట్టునే ఉండడంతో ఎక్కడా సందడి కనిపించడం లేదు. సామాజిక, ఆర్థిక ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొనడంతో మార్కెట్లన్నీ కళావిహీనంగా మారిపోయాయి. కోవిడ్ బారిన పడి విలవిలలాడుతున్న దేశాల్లో అమెరికాయే ముందు వరసలో ఉంది. 24 గంటల్లో 1,700 మంది మృతి చెందారు. వైరస్ దెబ్బకి అగ్రరాజ్యంలో ప్రతీ 10 మందిలో ఒకరు ఉద్యోగం కోల్పోతే, తమ సభ్యదేశాల్లో సహాయ కార్యక్రమాల కోసం 50 వేల కోట్ల యూరోలతో ప్రత్యేక ప్యాకేజీని అందించడానికి ఈయూ ఆర్థిక మంత్రులు అంగీకరించారు. ప్రపంచ శాంతికి భంగకరం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో శాంతి భద్రతల్ని భగ్నం చేస్తుందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియా గ్యుటెరాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మొండి వ్యాధిపై కొన్ని తరాల వారు పోరాడాల్సి ఉంటుందని ఆయన అంచనా వేశారు. త్వరలోనే ప్రపంచ దేశాల్లో సామాజిక అస్థిరత, హింసాత్మక పరిస్థితులు వస్తాయని భద్రతా మండలిని హెచ్చరించారు. కోలుకుంటున్న జాన్సన్ బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కోవిడ్ నుంచి కోలుకుంటున్నారు. ఆయనను ఐసీయూ నుంచి వార్డుకి మార్చారు. జాన్సన్ ఆరోగ్యాన్ని రేయింబవళ్లు వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. జాన్సన్తో ఆయన తండ్రి స్టాన్లీ జాన్సన్ మాట్లాడారు. ఇటలీలో మాఫియా కదలికలు కోవిడ్తో అతలాకుతలమైన ఇటలీపై పట్టు బిగించడానికి మాఫియా పన్నాగాలు పన్నుతోంది. వివిధ నేరగాళ్ల ముఠాలు పెద్ద ఎత్తున ఆహార పదార్థాలను కొనుగోలు చేసి, ఆకలితో అలమటిస్తున్న వారికి పంపిణీ చేస్తున్నాయి. నిరుపేదల్ని ఆదుకొని వారందరినీ తమ నియంత్రణలోకి తీసుకోవాలని కుట్రలు పన్నుతున్నాయని రచయిత రోబెర్టో సావియానో అనుమానం వ్యక్తం చేశారు. యెమన్లో తొలి కరోనా కేసు యుద్ధంతో అతలాకుతలమవుతున్న యెమన్లో మొట్టమొదటి కరోనా వైరస్ నమోదైంది. తీవ్రస్థాయిలో మానవ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న యెమన్లో కోవిడ్ జాడలు ఎలాంటి విధ్వంసానికి దారితీస్తుందోనని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. క్లినికల్ ట్రయల్స్ దశలో ప్లాస్మా థెరపీ న్యూఢిల్లీ: కరోనా చికిత్సకు కొత్తగా అందుబాటులోకి వచ్చిన కొన్వాలెసెంట్ ప్లాస్మా థెరపీ విధానం క్లినికల్ ట్రయల్స్ దశలో ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. కరోనా బారిన పడి కోలుకున్న వారి రక్తం నుంచి సేకరించిన యాంటీ బాడీస్ను కరోనా వైరస్తో తీవ్రంగా బాధపడుతున్న వారికి ఎక్కించడమే ప్లాస్మా థెరపీ. ఈ విధానాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా కేరళలోని శ్రీచిత్ర పెరుమాళ్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలోని రోగులపై ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. అయితే, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) కూడా ట్రయల్స్కు అంగీకారం తెలపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇటీవల కొన్ని దేశాల్లో కరోనా సోకి విషమంగా ఉన్న రోగులకు, వెంటిలేటర్పై ఉన్న వారికి ఈ విధానాన్ని పరిమిత సంఖ్యలో ప్రయోగాత్మకంగా పరిశీలించగా మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొంది. -
‘కోవిడ్’ దిగ్బంధనం
న్యూఢిల్లీ: కోవిడ్–19 (కరోనా వైరస్) విజృంభిస్తుండటంతో వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం మరికొన్ని చర్యలు తీసుకుంది. యూరోపియన్ యూనియన్, బ్రిటన్, టర్కీ నుంచి వచ్చే ప్రయాణికులు భారత్లో ప్రవేశించడంపై మార్చి 31 వరకూ నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న కారణంగా ఈ ముందు జాగ్రత్త చర్య తీసుకున్నట్లు సోమవారం ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మార్చి 18న అర్ధరాత్రి నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుందని సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. సోమవారం నుంచి దేశ అంతర్జాతీయ సరిహద్దుల ద్వారా అన్ని రకాల ప్రయాణికుల రాకపోకలను నిషేధించారు. దేశం మొత్తమ్మీద వైరస్ నియంత్రణ చర్యల పుణ్యమా అని అధికశాతం విద్యార్థులకు ఇళ్లకు పరిమితమైపోగా, ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేసే పరిస్థితి ఏర్పడింది. జిమ్లు, సినిమాహాళ్లు, స్విమ్మింగ్ పూల్స్ వంటివి దాదాపు అన్ని రాష్ట్రాల్లో మూసేశారు. కొత్త టోల్ఫ్రీ నంబర్ వైరస్కు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం కేంద్రం సోమవారం నుంచి కొత్త టోల్ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకూ ఉన్న 011– 23978046తోపాటు 1075 నంబర్కు ఫోన్ చేయడం ద్వారా కోవిడ్కు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చునని ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ncov2019 @gmail. comకు ఈ మెయిల్ చేయడం ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు. (కరోనా బారిన పడ్డాను) నవోదయకు ముందుగానే సెలవులు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలోని 600 జవహర్ నవోదయ విద్యాలయాలకు ముందుగానే సెలవులు ప్రకటించనున్నారు. పరీక్షలు అయిపోతున్న నేపథ్యంలో వేసవి సెలవులను ముందుగానే ప్రకటిస్తున్నామని మార్చి 21 నుంచి మే 25 వరకూ సెలవులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఒడిశాలో తొలి కేసు భారతదేశంలో కరోనా కోరలు చాస్తూనే ఉంది. ఒడిశాలో సోమవారం తొలి కరోనా కేసు నమోదైంది. ఇటలీ నుంచి మార్చి 6న ఢిల్లీకి వచ్చి ఆ తరువాత రైలు మార్గం ద్వారా మార్చి 12న భువనేశ్వర్కు వచ్చిన 33 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతానికి అతడి పరిస్థితి నిలకడగానే ఉంది. లదాఖ్, కశ్మీర్, కేరళల్లో నమోదైన ఒక్కో కేసును పరిగణనలోకి తీసుకుంటే దేశం మొత్తమ్మీద సోమవారానికి ఈ వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 114కు చేరుకున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వ్యాధి కారణంగా మరణించిన ఇద్దరితోపాటు 17 మంది విదేశీయులు, చికిత్స పొంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారు ఈ 114 మందిలో ఉన్నారు. ముంబైలో నలుగురు వ్యక్తులు కరోనా వైరస్ బారిన పడటంతో మహారాష్ట్రలో ఈ వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 37కు చేరుకుంది. దేవాలయాలకు తాళాలు కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మహారాష్ట్రలోని ప్రముఖ దేవాలయాలు, ముంబైలోని సిద్ధి వినాయక ఆలయం, ఒస్మానాబాద్లోని తుల్జా భవానీ ఆలయాలను మూసివేయనున్నట్లు దేవాలయ అధికారులు తెలిపారు. సిద్ధి వినాయక ఆలయం తదుపరి ఉత్తర్వుల వరకూ మూతపడగా.. తుల్జాభవానీ ఆలయం మంగళవారం నుంచి ఈ నెలాఖరు వరకూ మూతపడనుంది. సామూహిక సమావేశాలను నివారించాలన్న ప్రభుత్వం పిలుపు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు సిద్ధివినాయక ఆలయం ట్రస్టు చైర్మన్ అదేశ్ భండేకర్ తెలిపారు. శక్తివంచన లేకుండా కృషి: మోదీ వైరస్ నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం శక్తి వంచన లేకుండా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. వ్యాప్తి నిరోధాల విషయంలో వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. (కరోనా మరణాలు @ 7007) పరిష్కారాలు సూచించండి వైరస్ నియంత్రణకు mygov. in వెబ్సైట్లో టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలు సూచించాల్సిందిగా దేశ ప్రధాని మోదీ కోరారు. వ్యాధిని ఎక్కడికక్కడ నియంత్రించేందుకు పౌరులకు తగిన సమాచారం అందడం చాలా ముఖ్యం. కొంతమంది వ్యక్తులు, కంపెనీలు బయో ఇన్ఫర్మాటిక్స్, డేటాసెట్స్, వ్యాధి నిర్ధారణకు అప్లికేషన్ వంటివి అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీలన్నింటినీ వినియోగించుకోవడం ద్వారా వైరస్ను కట్టడి చేయవచ్చునని పేర్కొన్నారు. వ్యాక్సిన్ పరీక్షలు షురూ వాషింగ్టన్: ప్రాణాంతక కోవిడ్కు విరుగుడుగా అభివృద్ధి చేసిన ఓ టీకాను అమెరికా పరీక్షిస్తోంది. అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ ఆర్థిక సాయంతో ఒక మహిళా వాలంటీర్కు ప్రయోగాత్మక టీకా వేశారు. అన్నీ సవ్యంగా సాగి ఈ పరీక్షలు విజయవంతమైతే అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు మరో ఏడాదిన్నర సమయం పట్టే అవకాశముందని అధికారులు చెప్పారు. సియాటెల్లోని కైసర్ పెర్మనెంటే వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఆరోగ్యంగా ఉన్న 45 మంది స్వచ్ఛంద కార్యకర్తలకు ఎన్ఐహెచ్, మోడెర్నా అనే కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకాలు ఇస్తాయి. తీవ్రమైన దుష్ప్రభావాలేవీ లేనట్టు నిర్ధారించుకునేందుకు మాత్రమే ఈ ప్రయోగం చేస్తున్నామని, ఇందులో వైరస్ ఏదీ లేని కారణంగా టీకా తీసుకున్న వ్యక్తికి కోవిడ్ సోకే అవకాశమూ లేదని వివరించారు. సియెటెల్లో టీకా వేస్తున్న దృశ్యం అమెరికా, జర్మనీ మాటల యుద్ధం క్యూర్వ్యాక్ అనే కంపెనీ తయారు చేస్తున్న కరోనా నిరోధక టీకా ఒకటి అమెరికా, జర్మనీల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. జర్మనీకి చెందిన ఈ కంపెనీ అభివృద్ధి చేస్తున్న టీకాపై తాము హక్కులు కొనుక్కుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంపై జర్మన్లు విరుచుకుపడుతున్నారు. జర్మనీ అమ్మకానికి లేదని ఆ దేశ ఆర్థిక శాఖ మంత్రి పీటర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. డైవెల్ట్ అనే పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం.. క్యూర్వ్యాక్ అభివృద్ధి చేస్తున్న టీకాపై హక్కుల కోసం అమెరికా 100 కోట్ల డాలర్లు ఇవ్వచూపింది. ఆ టీకా అమెరికాలో వాడాలన్నది షరతు. మరోవైపు, క్యూర్వ్యాక్లో పెట్టుబడులు పెట్టిన వారు మాట్లాడుతూ ఏ ఒక్క ప్రభుత్వానికో తాము టీకా అమ్మబోమని స్పష్టం చేశారు. సమర్థమైన టీకా అందుబాటులోకి వస్తే అది ప్రపంచ ప్రజలందరినీ రక్షించాలని కోరుకుంటున్నట్లు డైట్ హాప్ అనే పెట్టుబడిదారు వ్యాఖ్యానించారు. -
లగేరహో లక్సెంబర్గ్
యూరోపియన్ యూనియన్లోని లక్సెంబర్గ్ ఇప్పుడు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రజారవాణా వ్యవస్థని పటిష్టపరచడం ద్వారా ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు సరికొత్త మార్గానికి లగ్జెంబర్గ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బస్సులు, ట్రామ్లు, రైళ్లు ఈ మూడింటిలో ఏ రవాణామార్గాన్ని ఎంచుకున్నప్పటికీ అందులో మీరు హాయిగా పైసా ఖర్చు లేకుండా ప్రయాణం చేసేయొచ్చు. ప్రజలందరికీ ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తోంది. యావత్ ప్రజారవాణా వ్యవస్థని నిజంగానే ప్రజలకు అంకితమిచ్చింది. ఒకరోజో, రెండ్రోజులో కాదుసుమండీ. లక్సెంబర్గ్లో ప్రజలందరికీ ఇక ప్రయాణం ప్రతిరోజూ ఉచితమే. యూరప్లోని అతిచిన్న దేశమైన లక్సెంబర్గ్ జనాభా కేవలం 6,14,000. జనాభా గత 20 ఏళ్లలో 40 శాతం పెరిగింది. దీంతో విపరీతంగా పెరిగిన రద్దీని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకుంది. రద్దీని తగ్గించేందుకే.. ప్రపంచ ప్రజల ముందున్న ప్రధానమైన సవాళ్ళలో ట్రాఫిక్, పర్యావరణ సమస్యలు అత్యంత కీలకమైనవి. పర్యావరణం, రద్దీ (ట్రాఫిక్ సమస్య) ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్న సమస్యలు కూడా. ఇక లక్సెంబర్గ్ సంగతి సరేసరి. విపరీతమైన ట్రాఫిక్ సమస్య. ప్రధాన రోడ్లన్నీ పాడైపోయాయి. బస్సులు పాతబడిపోయాయి. రైళ్ళ రాకపోకలు అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రభుత్వం విమర్శలనెదుర్కొంటోంది. దీనికి తోడు లక్సెంబర్గ్లో పనిచేస్తోన్న ఉద్యోగుల్లో సగానికి సగం మంది అంటే 2 లక్షల మంది బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీల నుంచి లక్సెంబర్గ్కి వచ్చేవారే. అక్కడ అధిక వేతనాలు ఉండడమే అందుకు కారణం. ఖర్చు మోపెడు దీనివల్ల టిక్కెట్ల ద్వారా నష్టపోయే మొత్తం 44 మిలియన్ డాలర్లు. అయితే ఈ మొత్తాన్ని పన్ను చెల్లింపుదారుల నుంచి వసూలు చేస్తారు. ఉచిత రవాణా మొత్తానికి అయ్యే ఖర్చు 50 కోట్ల యూరోలు. ఈ ప్రాజెక్టు కారణంగా ఎవ్వరూ ఉద్యోగాలు కోల్పోరు. ఫస్ట్క్లాస్ ప్రయాణికులే టిక్కెట్లు కొంటారు కనుక టిక్కెట్ల తనిఖీకి వెచ్చించాల్సిన సమయం తగ్గుతుంది. లక్సెంబర్గ్లో చాలా మంది కార్మికులకు సబ్సిడీతో కూడిన పాస్లు ఉంటాయి. టిక్కెట్టు కొనుక్కునేవారు తక్కువగానే ఉంటారు. ఇప్పుడు మిగిలిన వారికి కూడా ప్రయాణం ఉచితం కావడంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో వ్యక్తిపై 600 యూరోలు ఉచిత ప్రయాణ సౌకర్యానికి మరో కారణం ప్రజారవాణా వ్యవస్థని బలోపేతం చేయడం. రాబోయే ఐదేళ్లలో ప్రజారవాణాని ఉపయోగించే వారి సంఖ్య 20 శాతం పెంచాలని అక్కడి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇతర యూరోపియన్ దేశాలకంటే లక్సెంబర్గ్ ప్రజారవాణా వ్యవస్థపై అత్యధికంగా ఖర్చు చేస్తోంది. ఒక్కో వ్యక్తిపై ఏడాదికి 600 యూరోలు ఖర్చు చేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువ లక్సెంబర్గ్లో కార్లు అధికం. వేతనాలు ఎక్కువ. పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా కావడంతో కార్ల వాడకం ఎక్కువ. ఈ ట్రాఫిక్ను తగ్గించేందుకే ఈ ఉచిత బాట. లక్సెంబర్గ్ ప్రజలతో పాటే పర్యాటకులకు సైతం అక్కడ ప్రయాణం ఉచితమే. అయితే ఫస్ట్ క్లాస్లో ప్రయాణించే వారికి మాత్రం టిక్కెట్టు వడ్డింపులు భారీగానే ఉంటాయి. -
బ్రిటన్ కొత్త వీసాకు తుదిమెరుగులు
లండన్: ఈయూ నుంచి వైదొలగిన బ్రిటన్ బ్రెగ్జిట్ పాయింట్స్ బేస్డ్ వీసా, ఇమిగ్రేషన్ వ్యవస్థ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. దీనికి సంబంధించిన వ్యవహారాలకు ప్రధాని బోరిస్ జాన్సన్, హోంమంత్రి ప్రీతి పటేల్లు తుదిమెరుగులు దిద్దినట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా నిపుణులను భారత్ సహా ప్రపంచ నలుమూలల నుంచి రప్పించుకోవచ్చని ఆ దేశం భావిస్తోంది. గత వారం జరిగిన సమావేశంలో యూకే మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీ సూచించిన సలహాలను ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకుంది. ఇందులోనే కనీస వేతనాలు సంబంధించిన వివరాలున్నాయి. నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగావకాశాలను కల్పించేందుకు అవసరమైన ప్రతిపాదనలు కూడా అందులో ఉన్నాయి. గురువారం మంత్రివర్గ విస్తరణ జరగనుండగా, శుక్రవారం వీసాల వ్యవహారానికి సంబంధించిన వివరాలను ప్రీతి పటేల్ వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిపుణుల రంగంలో యూకే వీసాల్లో అత్యధికులు భారతీయులే ఉన్నారు. గతేడాదిలో 56 వేలకు పైగా టైర్–2 వీసాలను యూకే ఇచ్చింది. బ్రెగ్జిట్ వల్ల ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
షెంగన్ వీసా రుసుం పెంచిన ఈయూ
న్యూఢిల్లీ: యూరప్లోని 26 దేశాల్లో పర్యటించడానికి అవసరమయ్యే షెంగన్ వీసా ఫీజును యూరోపియన్ యూనియన్ (ఈయూ) పెంచింది. ఇన్నాళ్లూ 60 యూరోలుగా (సుమారు రూ.4,750) ఉన్న ఫీజును 80 యూరోలకు (రూ.6,350) పెంచినట్టు ఈయూ ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం నుంచి ఈ కొత్త ఫీజులు అమల్లోకి వచ్చాయి. ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, స్విట్జర్లాండ్, స్పెయిన్ వంటి దేశాల పర్యటనకు షెంగన్ వీసా అవసరం. ఆర్థిక మాంద్యం కారణంగానే వీసా ఫీజుల్ని పెంచాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. వీసా ఫీజు పెంపుతో ఆయా దేశాలు వీసా ప్రక్రియను మరింత వేగవంతంగా, సులభంగా జారీ చేయడానికి అవసరమయ్యే సదుపాయాలు కల్పిస్తాయని వెల్లడించారు. యూరప్ పర్యాటకులు ఇప్పుడు ఆరు నెలల ముందుగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 2018లో షెంగన్ వీసా కోసం అత్యధిక దరఖాస్తులు వచ్చిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలింది. -
ఈయూకు టాటా..
లండన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో బ్రిటన్ తన 47 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంది. ఈ చారిత్రక సందర్భం బ్రెగ్జిట్ను పురస్కరించుకుని బ్రిటన్ వాసులు సంబరాలు చేసుకుంటున్నారు. స్థానిక కాలమానం ప్రకారం బ్రెగ్జిట్ శుక్రవారం అర్ధరాత్రి 11 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. బ్రెగ్జిట్ మరో కొత్త శకానికి నాంది అని ఈ సందర్భంగా ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఆయన ప్రత్యేకంగా విడుదల చేసిన వీడియోలో.. ‘చీకట్లు తొలగిపోతున్న వేళ ఘనమైన మన జాతి కొత్త పాత్ర ఆవిష్కృతం కానుంది. బ్రస్సెల్స్లోని ఈయూ ప్రధాన కార్యాలయం వద్ద బ్రిటన్ జెండాను తీసేస్తున్న అధికారులు ప్రతి ప్రాంత వాసుల కలలు సాకారం కానున్నాయి. బ్రెగ్జిట్ కేవలం న్యాయపరమైన చర్య కాదు. జాతి పరివర్తన, పునరుత్తేజం పొందే క్షణం’అని పేర్కొన్నారు. ‘ఈయూ నుంచి విడిపోవడంతో మన విధానాలను స్వేచ్ఛగా అమలు చేసే అవకాశం వచ్చింది. భారత్ సహా 13 దేశాలతో వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకుంటాం’అనిఅన్నారు. దేశ చరిత్రలో ఇది గొప్ప ఘటన అని బ్రెగ్జిట్ అనుకూల నేత నిగెల్ ఫరాజ్ వ్యాఖ్యానించారు. సంబరాలు.. నిరసనలు ఈ ప్రత్యేక సందర్భంలో లండన్లోని పార్లమెంట్ స్వే్వర్తోపాటు డౌనింగ్ స్ట్రీట్ వద్ద బ్రెగ్జిట్ కౌంట్డౌన్ తెలుపుతూ భారీ డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పబ్బులు, క్లబ్బుల్లో ప్రజలు బ్రెగ్జిట్ విందులు చేసుకున్నారు. ఈ సందర్భంగా బ్రిటన్ ‘అన్ని దేశాలకు శాంతి, శ్రేయస్సు, స్నేహం’నినాదంతో కూడిన 50 పెన్స్(అరపౌండ్) నాణేన్ని విడుదల చేసింది. యూరోపియన్ యూనియన్కు చెందిన అన్ని సంస్థలపైనా బ్రిటన్ యూనియన్ జాక్ జెండాను తొలగించారు. కాగా, ఈయూలోనే కొనసాగాలంటూ కొన్ని చోట్ల బ్రెగ్జిట్ వ్యతిరేక ర్యాలీలు కూడా జరిగాయి. బ్రిటన్తోపాటు తమను కూడా ఈయూ నుంచి వేరు చేయడాన్ని నిరసిస్తూ స్కాట్లాండ్లోని కొన్ని ప్రాంతాల్లో కొవ్వొత్తులతో ర్యాలీలు చేపట్టారు. మరోసారి బ్రెగ్జిట్పై రెఫరెండం పెట్టాలని డిమాండ్ చేశారు. కాగా, బ్రెగ్జిట్తో బ్రిటన్, ఈయూ మధ్య ఒక్కసారిగా ఎలాంటి మార్పులు రావు. ఒప్పందం ప్రకారం.. శనివారం నుంచి ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి స్థాయిలో బ్రెగ్జిట్ అమలుకానుంది. మిశ్రమ స్పందన బ్రెగ్జిట్పై బ్రిటన్ పత్రికల్లో మిశ్రమ స్పందన కనిపించింది. డైలీ ఎక్స్ప్రెస్, ది సన్ వంటి పత్రికలు బ్రిటన్ శక్తివంతమవుతుందని వ్యాఖ్యానించగా, ముందున్నది గతులకు బాట అంటూ స్టాండర్డ్ పత్రిక, ది గార్డియన్ ఆందోళన వ్యక్తం చేశాయి. ఈయూను వీడిన బ్రిటన్ అంటూ బీబీసీ ప్రసారం చేసిన కథనంపై ప్రశంసలతోపాటు విమర్శలు కూడా వచ్చాయి. కాగా, బ్రెగ్జిట్ అమల్లోకి వచ్చే సమయంలోనే.. శుక్రవారం అర్ధరాత్రి ఫ్రాన్సులోని కలైస్ పోర్టు నుంచి బ్రిటన్లోని డోవర్కు బయలుదేరిన ఓడలో మాత్రం ఎలాంటి సందడి కనిపించలేదు. ఆ ఓడ బయలుదేరిన సమయానికి ఈయూలో 28 సభ్యుదేశాలుండగా బ్రిటన్లోకి అడుగిడే సమయానికి ఈయూ 27 దేశాల సమాఖ్యగా మారనుంది. కాగా, కోట్ డెస్ డ్యూన్స్ అనే ఆ ఓడలో ప్రయాణీకుల్లో చాలామంది అప్పటికే నిద్రలోకి జారుకున్నారు. ఆడ్రే సెంటినెల్లా అనే మహిళ మాత్రం..‘ఇది విచారకరమైన రోజు. ఈ రోజుతో ఒక శకం ముగియనుంది. ఏం జరుగుతుందో తెలియని భవిష్యత్తులోకి వెళ్తున్నాం. ఎన్ని లోటుపాట్లున్నా ఈయూతోనే బ్రిటన్ ముందుకు సాగితే బాగుండేది’అని పేర్కొన్నారు. ఈమె స్విట్జర్లాండ్లో ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తూ బ్రిటన్లో నివాసం ఉంటున్నారు. రేపటి నుంచి ఫెర్రీ క్యాంటిన్లో బ్రిటిష్ ఫిష్, చిప్స్ తినే వారు కనిపించరని ఓడ కెప్టెన్ ఆంటోయిన్ పకెట్ అన్నారు. బ్రెగ్జిట్ కారణంగా బ్రిటన్కు, ఈయూకు నిత్యం రాకపోకలు సాగించడం పెద్ద తలనొప్పిగా మారబోతోందని మరో ప్రయాణికుడు అలెస్సో బార్టన్ అన్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా 27 దేశాల్లో తిరగగలిగే అవకాశాన్ని చాలా మంది కోల్పోనుండటం విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు. సరిహద్దులు చెరిగిపోవాల్సిన సమయంలో పెరుగుతున్నాయని పేర్కొన్నారు. బ్రెగ్జిట్ పరిణామం భవిష్యత్తుకు మంచిది కాదని జర్మనీకి చెందిన మొహమ్మద్ మజోకా తెలిపారు. -
‘బ్రెగ్జిట్’కు బ్రిటన్ పార్లమెంట్ ఓకే
లండన్: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయే బ్రెగ్జిట్ ఒప్పందానికి బ్రిటన్ పార్లమెంటు ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. హౌజ్ ఆఫ్ కామన్స్లో గురువారం జరిగిన ఓటింగ్లో బ్రెగ్జిట్ బిల్లుకు అనుకూలంగా 330 ఓట్లు, వ్యతిరేకంగా 231 ఓట్లు వచ్చాయి. విపక్ష లేబర్ పార్టీ బ్రెగ్జిట్ను వ్యతిరేకిస్తూ ఓటేసింది. తాజా ఓటింగ్తో బ్రెగ్జిట్పై సంవత్సరాలుగా కొనసాగిన ఉత్కంఠ, రాజకీయ డ్రామా, అనుకూల, ప్రతికూలతలపై చర్చోపచర్చలు.. అన్నింటికీ కొంతవరకు తెరపడింది. ‘జనవరి 31న ఈయూ నుంచి విడిపోబోతున్నాం. ప్రధాని బోరిస్ జాన్సన్ ఇచ్చిన హామీ నెరవేరబోతోంది’ అని జాన్సన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ప్రకటించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బోరిస్ జాన్సన్ నేతృత్వంలోని కన్సర్వేటివ్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రావడంతో పార్లమెంట్లో బ్రెగ్జిట్ బిల్లు సునాయాసంగా గట్టెక్కింది. గత 50 ఏళ్లుగా ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉన్న ఈయూ నుంచి బ్రిటన్ వేరుపడనుంది. ఈయూ నుంచి వేరుపడ్తున్న తొలి దేశంగా బ్రిటన్ నిలవనుంది. బ్రెగ్జిట్పై తొలి నుంచి వాదోపవాదాలు కొనసాగాయి. ఈయూ నుంచి విడిపోతే బ్రిటన్ సామాన్య దేశంగా మిగిలిపోతుందని, వాణిజ్యపరంగా నష్టపోతుందని పలువురు వాదించగా.. బ్రెగ్జిట్తో బ్రిటన్కు లాభమేనని, గతవైభవం సాధించేందుకు ఇదే మార్గమని మరి కొందరు వాదించారు. ఇక బ్రెగ్జిట్ బిల్లు హౌజ్ ఆఫ్ లార్డ్స్, యూరోపియన్ పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంది. అయితే, అది లాంఛనమేనని భావిస్తున్నారు. పార్లమెంట్లో ప్రధాని జాన్సన్ (మధ్యలో) -
రికార్డుల ర్యాలీ కొనసాగేనా..?
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్ గతవారం వరుస రికార్డులతో దూసుకెళ్లింది. మొత్తం ఐదు ట్రేడింగ్ రోజుల్లో.. ఏకంగా నాలుగు రోజులు సూచీలు కొత్త శిఖరాలకు ఎగబాకాయి. జీఎస్టీలో వడ్డనలు లేకపోవడం, అమెరికా–చైనాల మధ్య కుదిరిన తొలి దశ వాణిజ్య ఒప్పందం, యూరోపియన్ యూనియన్తో బ్రిటన్ ఒప్పందానికి ప్రధాని బోరిస్ జాన్సన్ అంగీకారం తెలపడం వంటి సానుకూల అంశాల నేపథ్యంలో గడిచిన వారంలో సెన్సెక్స్ 672 పాయింట్లు, నిఫ్టీ 185 పాయింట్ల మేర పెరిగాయి. శుక్రవారం 12,294 పాయింట్లకు చేరుకుని ఇంట్రాడే గరిష్టస్థాయిని నమోదుచేసిన నిఫ్టీ చివరకు 12,272 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 41,810 పాయింట్లకు చేరుకుని.. చివరకు 41,682 వద్ద నిలిచింది. ఈ స్థాయి రికార్డులతో జోరుమీదున్న మన మార్కెట్.. ఈవారంలో ఏ విధంగా ఉండనుందనే అంశానికి, ప్రధానంగా అంతర్జాతీయ అంశాలే కీలకంగా ఉండనున్నాయని దలాల్ స్ట్రీట్ పండితులు అంచనా వేస్తున్నారు. కన్సాలిడేషన్కు చాన్స్..! వరుసగా రెండు వారాల పాటు ర్యాలీ కొనసాగించిన దేశీ మార్కెట్ ఈ వారంలో దిద్దుబాటుకు గురయ్యే అవకాశం ఉందని అంచనా. వాల్యుయేషన్స్ ప్రియంగా మారడమే ఇందుకు కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఫండమెంటల్గా బలంగా ఉన్న కంపెనీల షేర్లను మాత్రమే ఈ వారంలో కొనుగోలు చేయడం వివేకవంతమైన విధానమని, మార్కెట్ బాగా పెరిగినందున కన్సాలిడేషన్కు అవకాశం ఉందని రెలిగేర్ బ్రోకింగ్ పరిశోధన విభాగం వీపీ అజిత్ మిశ్రా అన్నారు. బాగా పెరిగిన షేర్ల నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగి వ్యాల్యూ పిక్స్ వైపునకు పెట్టుబడులు మారే అవకాశం ఉన్నందున తాను కూడా కన్సాలిడేషన్ జరగవచ్చని భావిస్తున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ నాయర్ చెప్పా రు. ఏడాది చివరి రోజులు కావడంతో స్టాక్ స్పెసి ఫిక్ ర్యాలీకి మాత్రమే అవకాశం ఉందని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ విశ్లేషించారు. సెన్సెక్స్ 30 సూచీ నుంచి యస్ బ్యాంక్ అవుట్ బొంబే స్టాక్ ఎక్సే్ఛంజ్ (బీఎస్ఈ) బెంచ్మార్క్ సూచీ (సెన్సెక్స్)లోని 30 షేర్ల జాబితాలో ఈ వారంలోనే భారీ మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి టాటా మోటార్స్, టాటా మోటార్స్ డీవీఆర్, యస్ బ్యాంక్, వేదాంత షేర్లను ఇండెక్స్ నుంచి తొలగించి.. వీటి స్థానంలో అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, నెస్లే ఇండియా షేర్లను బీఎస్ఈ చేర్చనుంది. ఇదే విధంగా బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ వంటి పలు సూచీల్లో కూడా మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మార్పుల కారణంగా ఫండ్ మేనేజర్లు వారి పోర్ట్ఫోలియోలో భారీ మార్పులను చేయనున్నారని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక డిసెంబర్ సిరీస్ ఎఫ్ అండ్ ఓ ముగింపు ఉండడం వల్ల రికార్డుల ర్యాలీ కొనసాగేందుకు అవకాశాలు తక్కువని అంచనా వేస్తున్నారు. ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులే.. క్రిస్మస్ సందర్భంగా బుధవారం (25న) దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలు సెలవు ప్రకటించాయి. దీంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. గురువారం (26న) ఉదయం మార్కెట్ యథావిధిగా ప్రారంభమవుతుంది. -
జనవరి 31న ‘బిగ్బెన్’ బ్రెగ్జిట్ గంటలు
లండన్: లండన్లోని ప్రపంచ ప్రఖ్యాత బిగ్బెన్ గడియారం బ్రెగ్జిట్ను పురస్కరించుకుని జనవరి 31వ తేదీ రాత్రి ప్రత్యేకంగా గంటలు మోగించనుంది. పార్లమెంట్ ఆవరణలోని ఎలిజబెత్ టవర్లో ఉన్న 160 ఏళ్లనాటి ఈ గడియారానికి ప్రస్తుతం రూ.554 కోట్లతో మరమ్మతులు చేపడుతున్నారు. పనుల్లో పాల్గొంటున్న సిబ్బందికి ఇబ్బంది కలగరాదని ప్రస్తుతం ఈ గడియారం ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే గంటలు కొట్టేలా ఏర్పాటు చేశారు. కొత్త సంవత్సరాదిన డిసెంబర్ 31వ తేదీ రాత్రి మోగేందుకు ఏర్పాట్లు చేశారు. దీనిలో గంటలు మోగాలంటే ప్రత్యేకంగా పార్లమెంట్ తీర్మానం చేయాల్సి ఉంటుంది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వేరు పడుతున్న బ్రెగ్జిట్ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 31వ తేదీ రాత్రి 11 గంటలకు బిగ్బెన్ గంటలు కొట్టేలా చూడాలంటూ 50 మంది ఎంపీలు చేసిన విజ్ఞప్తికి స్పీకర్ సానుకూలంగా స్పందించారని ‘ది సండే టెలిగ్రాఫ్’ పత్రిక తెలిపింది. -
జాన్సన్ జయకేతనం
లండన్/బ్రస్సెల్స్: పదేపదే వస్తున్న ఎన్నికలతో విసిగిన బ్రిటిష్ ఓటర్లు ఈసారి నిర్ణాయక తీర్పునిచ్చారు. ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్కు చెందిన కన్జర్వేటివ్ పార్టీకి ఘన విజయం కట్టబెట్టారు. ఈ చారిత్రక విజయంతో వచ్చే జనవరి ఆఖరులోగా యూరోపియన్ యూనియన్(ఈయూ)నుంచి వైదొలిగేందుకు అవకాశం లభించిందని బోరిస్ జాన్సన్(55) తెలిపారు. ‘బ్రెగ్జిట్ పూర్తి చేసుకుందాం’ అనే ఏకైక నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన జాన్సన్..1980వ దశకంలో ప్రధాని మార్గరెట్ థాచర్ నేతృత్వంలో కన్జర్వేటివ్ పార్టీ సాధించిన ఘన విజయాన్ని పునరావృతం చేశారు. జెరెమి కార్బిన్ నేతృత్వంలో ప్రతిపక్ష లేబర్ పార్టీ కేవలం 203 సీట్లను సాధించింది. అక్టోబర్ 31వ తేదీలోగా బ్రెగ్జిట్ అమలే లక్ష్యంగా జూలైలో థెరిసా మే నుంచి ప్రధాని పగ్గాలు చేపట్టిన బోరిస్ జాన్సన్, పార్లమెంట్లో మెజారిటీ లేకపోవడంతో అనుకున్నది సాధించలేక ఎన్నికలకు సిద్ధమయ్యారు. అయితే, గత అయిదేళ్లలో మూడోసారి ఎన్నికలు రావడంతో ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు. దాదాపు వందేళ్ల తర్వాత శీతాకాలంలో గురువారం జరిగిన ఈ ఎన్నికల్లో 67 శాతం మంది ఓట్లేశారు. పార్లమెంట్(కామన్స్ సభ)లోని 650 సీట్లకు గాను కన్జర్వేటివ్ పార్టీ 365 స్థానాలను సాధించింది. విజయోత్సవ ర్యాలీలో బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ.. ‘బ్రిటన్కు ఇది మరో శుభోదయం. గడువులోగా బ్రెగ్జిట్ సాధిస్తాం. ప్రతిష్టంభనను తొలగిస్తాం. ఓటర్ల నమ్మకాన్ని వమ్ముచేయను’ అని ప్రకటించారు. బ్రిటన్ ఎన్నికల్లో ప్రధాని బోరిస్ జాన్సన్ విజయంపై ఈయూ వెంటనే స్పందించింది. బ్రిటన్తో బ్రెగ్జిట్పై తదుపరి చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రకటించింది. -
ఇక ప్రతి కారులో ‘బ్రెతలైజర్’
సాక్షి, న్యూఢిల్లీ : మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా వారి నేరాలు పునరావతం అవుతూనే ఉన్నాయి. వాటిని అరికట్టేందుక ఐరోపా కూటమి సరికొత్త సాంకేతిక చర్యకు పూనుకుంది. 2022 సంవత్సరం నుంచి తయారయ్యే అన్ని కార్లలో ‘బ్రెతలైజర్స్’ను విధిగా అమర్చాలని ఆదేశించే చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని ఎప్పుడో రూపొందించినప్పటికీ ఐరోపా మండలి గత వారమే ఆమోదముద్ర వేసింది. 2024 నుంచి అన్ని కార్లలో, అంటే పాత కార్లలో కూడా ‘బ్రెతలైజర్స్’ను తప్పని సరి చేసింది. డ్రైవర్ ఇంజన్ను స్టార్ట్ చేసే ముందు తప్పనిసరిగా బ్రెతలెజర్స్ను ఊదాల్సి ఉంటుంది. అప్పుడే ఇంజన్ స్టార్ట్ అవుతుంది. సరిగ్గా ఊదక పోయినా ఇంజన్ స్ట్రార్ట్ కాదు. కారు స్టార్ట్ అయ్యాక మార్గమధ్యంలో మద్యం సేవించకుండా నివారించేందుకు మధ్య మధ్యలో కూడా బ్రెతలెజర్స్ను ఊదాల్సి ఉంటుంది. ఈ నిబంధనను మద్యం తాగి కారును నడిపిన కేసులో శిక్ష పడిన డ్రైవర్లకు మాత్రమే అమలు చేస్తామని బ్రిటన్ అధికారులు చెబుతున్నారు. సాంకేతికంగా అది సాధ్యమా? అన్ని కార్లలో బ్రెతలెజర్స్ను అమర్చినప్పుడు, కారు నడిపే డ్రైవర్కు అంతకుముందు శిక్ష పడిందా, లేదా అన్న విషయాన్ని బ్రెతలైజర్స్ అనుసంధాన వ్యవస్థ ఎలా తెల్సుకుంటుంది ? మద్యం తాగి కారు నడుపుతున్న డ్రైవర్ అప్పుడు ఏ కారు నడిపారో ఆ కారుకు మాత్రమే వర్తింప చేస్తారా? అద్దె డ్రైవర్లను పెట్టుకున్నప్పుడు మరి ఏం చేస్తారు? ఇంతకుముందు శిక్ష పడిన డ్రైవర్, తనకు బదులుగా ఇతరులతోని బ్రెతలెజర్ను ఊదిస్తే...అప్పుడు ఏమిటీ? ఇత్యాది ప్రశ్నలకు బ్రిటన్ అధికారుల వద్ద ప్రస్తుతానికి సమాధానం లేదు. రానున్న కాలంలో వీటికి పరిష్కారం కనుక్కుంటారట. -
అడవులను అంటించమంటున్న ‘ఐసిస్’
సాక్షి, న్యూఢిల్లీ : క్లైమేట్ ఛేంజ్పై ఆందోళన వ్యక్తం చేస్తూ పర్యావరణ పరిస్థితుల పరిరక్షణకు పిలుపునిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చేస్తుంటే.. జిహాదీలో భాగంగా అమెరికా, యూరప్ దేశాల్లో అడవులను తగులబెట్టండంటూ ఐఎస్ఐఎస్ (ఐసిస్) క్యాడర్కు దాని ప్రచార సంస్థ ‘ఖురేశ్’ పిలుపునిచ్చింది. కాలిఫోర్నియా, స్పెయిన్లో ఇటీవల చెలరేగిన కార్చిచ్చు పట్ల ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ దేశాల్లో అడవులను తగులబెట్టి ప్రజల్లో భయాందోళనలను రేపాలని, పర్యావరణ పరిస్థితులను మరింత దిగజార్చాలని సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన పోస్టర్లలో ఖురేశ్ ఐసిస్) సానుభూతిపరులకు విజ్ఞప్తి చేసింది. సిరియాలో గత నెల ఐఎస్ఐఎస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదిని అమెరికా సైనికులు హతమార్చినప్పటికీ ఐసిస్ సోషల్ మీడియా ద్వారా ఖలీఫా రాజ్యం గురించి ప్రచారం సాగిస్తూనే ఉంది. పారిస్లోని నాత్రే డ్యామ్ కథడ్రల్ గత ఏప్రిల్లో మంటల్లో చిక్కుకోవడం క్రైస్తవుల శాపంగా, తమ విజయంగా ఐసిస్) ప్రచారం చేసుకుంటోంది. అప్పటినుంచే అడవులను తగులబెట్టాలంటూ అప్పుడప్పుడు పిలుపునిస్తోంది. -
ముందస్తుకు బ్రిటన్ జై
లండన్: బ్రెగ్జిట్ సంక్షోభాన్ని నివారించడానికి బ్రిటన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధమైంది. బ్రిటిష్ పార్లమెంటుకి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రధానమంత్రి బొరిస్ జాన్సన్ ఇచ్చిన పిలుపుకి ప్రజాప్రతినిధులందరూ అనుకూలంగా స్పందించారు. దీంతో డిసెంబర్ 12న ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగడానికి జనవరి నెలఖారువరకు ఈయూ గడువు పొడిగించడంతో ఈలోగా ఎన్నికలు నిర్వహించాలని బొరిస్ జాన్సన్ భావించారు. బ్రిటన్లో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలంటే ప్రధానమంత్రి ఎంపీల మద్దతుతో మాత్రమే ఆ పని చేయగలరు. ఎన్నికలకు పార్లమెంటు ఆమోదం ప్రధాని బొరిస్ జాన్సన్ ముందస్తు ఎన్నికల ప్రతిపాదనపై చర్చించిన హౌస్ ఆఫ్ కామన్స్ 438–20 తేడాతో ఆమోద ముద్ర వేసింది. బ్రెగ్జిట్ ప్రణాళికకు అనుకూలంగా ప్రజా మద్దతు కూడగట్టుకోవడానికి జాన్సన్ క్రిస్మస్ పండుగకి ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని వ్యూహరచన చేశారు. ఓటు హక్కు వయసుని 16కి తగ్గించాలని, ఓటింగ్లో ఈయూ పౌరులు కూడా పాల్గొనాలని, డిసెంబర్ 9న ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష లేబర్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇరు పార్టీలకూ ప్రతిష్టాత్మకమే మైనార్టీ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న కన్జర్వేటివ్ పార్టీ ఎలాగైనా బ్రెగ్జిట్ ఒప్పందానికి ఆమోద ముద్ర పడేలా ఎప్పటికప్పుడు వ్యూహాలు పన్నుతోంది. కానీ బ్రెగ్జిట్ ఒప్పందాన్ని విపక్ష లేబర్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉండడంతో అది సాధ్యం కావడం లేదు. బ్రెగ్జిట్కు ఈయూ గడువును అక్టోబర్ 31 నుంచి 2020 జనవరి 31 వరకు పెంచిన వెంటనే ప్రధాని బొరిస్ జాన్సన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ప్రతిపక్ష లేబర్ పార్టీ కూడా సహకరించింది. పార్లమెంటులో మరింత బలం పెంచుకొని ఈయూకి గుడ్బై కొట్టేయాలని లెక్కలు వేసుకుంటున్న బొరిస్ దేశ భవిష్యత్ను నిర్ణయించే ఈ ఎన్నికలు అత్యంత కీలకమని ప్రజలందరూ గ్రహించాలన్నారు. బ్రిటన్ బ్రెగ్జిట్ కల సాకారమవడానికి ప్రజలందరూ చేతులు కలపాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. వామపక్షభావజాలం కలిగిన లేబర్ పార్టీ నాయకుడు జెర్మీ కార్బన్ కూడా మార్పు కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఒపీనియన్ పోల్స్ అన్నీ కన్జర్వేటివ్ పార్టీకే అధికారం దక్కుతుందని అంచనా వేస్తూ ఉండడంతో కార్బన్ నేతృత్వంలో ఎలాంటి ఫలితాలు వస్తాయోనన్న ఆందోళన ఆ పార్టీ ఎంపీల్లో నెలకొని ఉంది. నాలుగేళ్లలో మూడో ఎన్నికలు బ్రిటన్లో గత నాలుగేళ్లలో మూడోసారి జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఈ నాలుగేళ్ల కాలంలో ప్రజా తీర్పులో చాలా వైరుధ్యాలు ఉన్నాయి. 2015, 2017 ఎన్నికల్లో ప్రజల మూడ్లో వచ్చిన మార్పు చూస్తే ఈ ఎన్నికల్లో జాన్సన్ చావో రేవో తేల్చుకోవాల్సిందేనని రాజకీయ నిపుణులు అంటున్నారు. బ్రెగ్జిట్ ఒప్పందం ముందుకు వెళ్లాలంటే బొరిస్ జాన్సన్ కచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలి. హంగ్ పార్లమెంటు వస్తే మళ్లీ దేశంలో అనిశ్చితి తప్పదని నిపుణుల అభిప్రాయంగా ఉంది. -
‘370’ భారత అంతర్గత వ్యవహారం
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు అనేది భారత అంతర్గత వ్యవహారమని కశ్మీర్లో పర్యటిస్తున్న యూరోపియన్ యూనియన్ పార్లమెంటేరియన్ల బృందం పేర్కొంది. ఉగ్రవాదంపై పోరులో భారత్కు తమ సంపూర్ణ మద్దతుంటుందని స్పష్టం చేసింది. కశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ అధికరణ 370ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాక కశ్మీర్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించేందుకు ఈయూ పార్లమెంటేరియన్ల బృందం భారత్కు రావడం తెల్సిందే. కశ్మీర్పై అంతర్జాతీయ మీడియా వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని, అక్కడికి వెళ్లాక ఇక్కడి వాస్తవ పరిస్థితిని వారికి వివరిస్తామని తమ పర్యటన అనంతరం ఈయూ ఎంపీలు తెలిపారు. కశ్మీరీలు తాము భారతీయులమనే భావిస్తున్నారని, వారు శాంతియుత భవిష్యత్తునే కోరుకుంటున్నారని వివరించారు. తమను ఫాసిస్టులు అంటూ ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. అతిపెద్ద తప్పు.. కశ్మీర్లోకి ఈయూ పార్లమెంటేరియన్ల బృందాన్ని అనుమతించడం భారత విదేశాంగ విధాన చరిత్రలోనే అతిపెద్ద తప్పిదంగా కాంగ్రెస్ అభివర్ణించింది. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం భారత్ను అవమానపరుస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సింగ్ సూర్జేవాలా ఆరోపించారు. -
కశ్మీర్లో.. మహాపాపం చేశారు!!
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో పర్యటించేందుకు యూరోపియన్ యూనియన్ ఎంపీల బృందానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఈ చర్య ద్వారా కేంద్రం మహాపాపం చేసిందని, చాలాకాలంగా కశ్మీర్ అంతర్గత అంశమన్న భారత్ విధానాన్ని ఈ చర్య ద్వారా కేంద్రం ఉల్లంఘించిందని మండిపడింది. ‘ఎన్నో పరీక్షలకు నిలబడి కశ్మీర్ అంతర్గత అంశమన్న విధానానికి గత 72 ఏళ్లుగా భారత్ కట్టుబడి ఉంది. ఇప్పుడు కానీ, ఇకముందు కానీ ఈ విషయంలో థర్డ్పార్టీ జోక్యం సహించబోమని, ఏ ప్రభుత్వం, సంస్థ లేదా వ్యక్తి మధ్యవర్తిత్వం అంగీకరించబోమని చెప్తూ వస్తోంది. ఈ విధానాన్ని తలకిందులుగా చేయడం ద్వారా మోదీ సర్కార్ మహాపాపానికి ఒడిగట్టింది’ అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్సింగ్ సుర్జేవాలా మండిపడ్డారు. కశ్మీర్ అంతర్గత అంశమన్న భారత విధానాన్ని ఉల్లంఘించడం ద్వారా మోదీ సర్కార్ కశ్మీర్ను అంతర్జాతీయ అంశంగా మార్చివేసిందని విరుచుకుపడ్డారు. కశ్మీర్లోకి మూడో వ్యక్తి జోక్యాన్ని అనుమతించడం ద్వారా దేశ సార్వభౌమత్వాన్ని, జాతీయభద్రతను మోదీ సర్కార్ సవాలు చేస్తోందని, అంతేకాకుండా దేశ పార్లమెంటును కూడా అవమానిస్తోందని సుర్జేవాలా విమర్శించారు. యూరోపియన్ యూనియన్ పార్లమెంటు సభ్యుల బృందం రెండురోజులపాటు జమ్మూకశ్మీర్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఓ విదేశీ ప్రతినిధుల బృందం కశ్మీర్లో పర్యటించడం ఇదే తొలిసారి. దేశ రాజకీయ నాయకులే కశ్మీర్ వెళ్లేందుకు అనుమతించని పరిస్థితుల నేపథ్యంలో ఈయూ బృందాన్ని ఎలా పంపారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
కశ్మీర్ మరో సిరియా కాకూడదు!
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో పర్యటిస్తున్న యూరోపియన్ యూనియన్ పార్లమెంటు సభ్యులు భారత రాజకీయాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. రేపటి (అక్టోబర్ 31)తో జమ్మూకశ్మీర్ విభజన అధికారికంగా అమల్లోకి రానుంది. జమ్మూకశ్మీర్, లడఖ్ అనే కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఆ రాష్ట్రం విడిపోనుంది. ఈ నేపథ్యంలో విదేశీ ప్రతినిధుల బృందం కశ్మీర్లో పర్యటించేందుకు అనుమతించడం పలు విమర్శలకు కారణమవుతోంది. దేశ రాజకీయ నాయకులే కశ్మీర్ వెళ్లేందుకు అనుమతించడం లేదు. మరి ఈయూ బృందాన్ని ఎలా పంపారని పలువురు రాజకీయ పరిశీకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈయూ ప్రతినిధుల బృందం బుధవారం మీడియాతో మాట్లాడింది. ప్రపంచమంతాటా నెలకొన్న ఉగ్రవాదంపై ఈయూ ఆందోళనతో ఉందని, కశ్మీర్ సమస్యను అర్థంచేసుకోవడానికే తాము వచ్చామని ఈయూ సభ్యులు తెలిపారు. ‘కశ్మీర్లో శాంతిస్థాపన, ఉగ్రవాద నిర్మూలన కోసం భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలకు అంతర్జాతీయ ప్రతినిధులుగా మేం పూర్తి మద్దతు తెలుపుతున్నాం. చక్కని ఆతిథ్యం ఇచ్చినందుకు భారత్ ప్రభుత్వానికి, స్థానిక ప్రభుత్వానికి కృతజ్ఞతలు’ అని ఓ ఈయూ ఎంపీ అభిప్రాయపడగా.. మరో ఎంపీ మాట్లాడుతూ.. ‘ఉగ్రవాదం ఒక ప్రాంతాన్ని, దేశాన్ని ఎలా నాశనం చేస్తుందో నేను ప్రత్యక్షంగా చూశాను. గతంలో నేను సిరియాలో పర్యటించాను. ఉగ్రవాదం కారణంగా చోటుచేసుకున్న విధ్వంసాన్ని చూశాను. అలాంటి పరిస్థితి కశ్మీర్లో రాకూడదని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. ఈయూ ఎంపీ నికోలస్ ఫెస్ట్ మాత్రం తమను కశ్మీర్లోకి అనుమతించి.. భారత రాజకీయ నాయకులను అనుమతించకపోవడం మంచిది కాదని, వారిని కూడా అనుమతించి.. ఈ అసమతుల్య వాతావరణాన్ని సరిచేయాలని కోరారు. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దుచేసి.. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం విభజించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆందోళనలు, అల్లర్లు చెలరేగకుండా కశ్మీర్లో పెద్ద ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు క్రమంగా ఎత్తివేసిన నేపథ్యంలో తాజాగా తొలిసారి ఈయూ పార్లమెంటు సభ్యుల విదేశీ బృందం కశ్మీర్లో పర్యటించేందుకు కేంద్రం అనుమతించింది. -
‘కశ్మీర్’లో పరువు పోతుందా !?
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఐరోపా పార్లమెంట్కు చెందిన 27 మంది సభ్యులు వ్యక్తిగత హోదాలో మంగళవారం నాడు పర్యటిస్తున్నారు. కశ్మీర్ భారత్ అంతర్గత సమస్య అంటూ మొదటి నుంచి చెబుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు ఐరోపా బందాన్ని కశ్మీర్లోకి ఎందుకు అనుమతిస్తున్నారో అర్థంకాని స్థానిక రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యపోతున్నారు. అయితే దీని వెనక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణను కొట్టివేయడమే కాకుండా కశ్మీర్ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టిన ఆగస్టు ఐదవ తేదీ నుంచి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెల్సిందే. అనాటి నుంచి కశ్మీర్లోకి జాతీయ, అంతర్జాతీయ పత్రికల ప్రతినిధులను అనుమతించని స్థానిక ప్రభుత్వం ఇప్పుడు జాతీయ పత్రికల జర్నలిస్ట్ ప్రతినిధులను కొంత అనుమతిస్తోంది. అంతర్జాతీయ రిపోర్టర్లను ఇప్పటివరకు అనుమతించలేదు. ఈ రోజు ఐరోపా పార్లమెంట్ సభ్యుల పర్యటన కవరేజీకి కూడా అనుమతించకుండా ఢిల్లీ నుంచి ఎంపిక చేసిన కొంతమంది జర్నలిస్టులను మాత్రమే అనుమతించిందని తెలుస్తోంది. మొదట్లో టెలికమ్యూనికేషన్లను, విద్యాసంస్థలను పూర్తిగా మూసి వేసిన ప్రభుత్వం ఇప్పుడు విద్యాసంస్థలను తెరవడంతోపాటు టెలిఫోన్, మొబైల్ సర్వీసులను పునరుద్ధరించింది. ఇప్పటికీ ఇంటర్నెట్ సర్వీసులను పూర్తిగా పునరుద్ధరించలేదు. నేటికి కశ్మీర్లోని అన్ని వ్యాపార సంస్థలు, దుకాణాలు తెరచుకోలేదు. రోడ్లపై ప్రజల సందడి అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటికీ ఖాళీ రోడ్లపై భద్రతా దళాల మోహరింపు ఎప్పటిలాగే కొనసాగుతోంది. కశ్మీర్లో ప్రశాంత పరిస్థితులే కొనసాగుతున్నాయని వాదిస్తూ వస్తోన్న కేంద్రం, ప్రతిపక్షాల ప్రత్యక్ష పర్యటనను అడ్డుకుంది. అమెరికా కాంగ్రెస్ సభ్యులు, ఐక్యరాజ్య సమితి ప్రతినిధి బృందాన్ని కూడా కశ్మీర్ పర్యటనకు అనుమతించలేదు. మరోపక్క ‘దక్షిణాసియా శాంతి పరిస్థితుల’పై జరిగిన చర్చలో భాగంగా అమెరికా పార్లమెంట్లో మొన్న కొంతమంది సభ్యులు కశ్మీర్ పరిస్థితిపై భారత ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఇప్పుడు ఐరోపా పార్లమెంట్ బృందాన్ని అనుమతించింది. ఈ సందర్భంగా కశ్మీర్లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించేందుకు గత రెండు రోజులుగా స్థానిక అధికారులు తెగ హైరానా పడుతున్నారు. దాదాపు మూడు నెలలుగా సాధ్యంకాని సాధారణ పరిస్థితులు రెండు రోజుల్లో ఎలా సాధ్యం అవుతాయి? ఈ ఐరోపా బృందం పర్యటన విషయమై సోమవారం నాడు సమావేశమైన నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పర్యటనకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. షరతులూ విధించారు. ఐరోపా పార్లమెంట్ బృందాన్ని అధికార ప్రతినిధి బృందంగా కాకుండా వ్యక్తిగత స్థాయిలో రావాల్సిందిగా ఆహ్వానించారు. 27మంది సభ్యులను కూడా మోదీ బృందమే ఎంపిక చేసింది. బ్రిటన్లోని బ్రెక్సిట్ పార్టీ, ఫ్రాన్స్లోని నేషనల్ ర్యాలీ, పోలాండ్లోని లా అండ్ జస్టిస్, స్పెయిన్లోని వోక్స్, ఫ్లెమిష్ నేషనల్ పార్టీల సభ్యులను ఎంపిక చేశారు. ఈ పార్టీలన్నీ బీజేపీ తరహాలో మైనారిటీ వ్యతిరేక, వలసల వ్యతిరేక, నియంతృత్వ పార్టీలే. అంతర్జాతీయ మీడియాను కూడా అనుమతించడం లేదు కనుక ఆ ప్రతినిధి బృందం భారత్కు అనుకూలంగానే నివేదిక ఇస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇంతకుముందు అజిత్ దోవా పర్యటించినప్పుడు చేసిన ఏర్పాట్లే ఇప్పుడు చేయవచ్చు. నాడు ప్రజల సందడి కనిపించడం కోసం పలుచోట్ల మూసిన షట్టర్ల ముందు తక్కువ డబ్బులకు పసందైన భోజనాన్ని పెట్టించారు. నేడు కూడా అలాంటి తంతు ఉండవచ్చు. ఏర్పాట్లలో ఎక్కడైనా పొరపాటు జరిగితే, ఐరోపా పార్లమెంట్ బందం సభ్యులలో మన సుబ్రమణియన్ స్వామి లాంటి నాయకుడుంటే కశ్మీర్ అసలు పరిస్థితిని బయట పెట్టరా? అప్పుడు మన పరువు పోతుంది గదా! అన్న ఆందోళనలో బీజేపీ మేధావులు ఉన్నారు. కశ్మీర్ అంతర్గత సమస్యని గట్టిగా వాదిస్తున్నప్పుడు ఆ వాదనకే కట్టుబడి వ్యవహరిస్తే ఈ తిప్పలు తప్పేవి గదా! అని వారు అభిప్రాయపడుతున్నారు. -
క్షేత్రస్థాయిలో కశ్మీర్ ఎలా ఉందో తెలుసుకుంటాం!
శ్రీనగర్: ఐరోపా సమాఖ్యకు చెందిన 27 మంది పార్లమెంట్సభ్యుల బృందం మంగళవారం కశ్మీర్లో పర్యటిస్తోంది. గట్టి భద్రత మధ్య ఢిల్లీ నుంచి ప్రత్యేక వాహనంలో ఈ బృందం శ్రీనగర్కు చేరుకుంది. కశీర్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఐరోపా ఎంపీల బృందం అధ్యయనం చేపట్టనుంది. స్థానికులతోపాటు దాల్ లేక్లో పడవ నడిపేవారితోనూ మాట్లాడి వాస్తవిక పరిస్థితులను తెలుసుకోనుంది. ‘విదేశీ ప్రతినిధుల బృందంగా మేం కశ్మీర్లో పర్యటిస్తుండటం మంచి అవకాశంగా భావిస్తున్నాం. అక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో నేరుగా తెలుసుకునేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది’ అని యూరోపియన్ యూనియన్ పార్లమెంటు సభ్యుడు నాథన్ గిల్ మంగళవారం ఏఎన్ఐ వార్తాసంస్థతో పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన అనంతరం విదేశీ ప్రతినిధులు కశ్మీర్లో పర్యటించటం ఇదే తొలిసారి. ఇది పూర్తిగా అనధికారిక పర్యటన అని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. అంతకుముందు భారత్లో పర్యటిస్తున్న ఈయూ ఎంపీలు.. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో భేటీ అయ్యారు. -
బ్రెగ్జిట్ గడువు జనవరి 31
లండన్/బ్రసెల్స్: బ్రిటన్ పార్లమెంట్లో బ్రెగ్జిట్ ఒప్పందం ఆమోదం పొందడంలో తలెత్తిన అనిశ్చితి నేపథ్యంలో మరో కీలక పరిణామం సంభవించింది. బ్రిటన్కు మరింత వెసులుబాటు ఇచ్చేందుకు యూరోపియన్ యూనియన్(ఈయూ) అంగీకరించింది. బ్రెగ్జిట్పై ఈనెలాఖరు వరకు ఉన్న గడువును మరో మూడు నెలలపాటు అంటే వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు పొడిగించేందుకు ఈయూ సుముఖత వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంపై యూనియన్లోని 27 సభ్య దేశాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయని ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ తాజాగా ట్విట్టర్లో ప్రకటించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే రాత పూర్వకంగా వెల్లడిస్తామన్నారు. బ్రెగ్జిట్ ఒప్పందాన్ని బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించిన పక్షంలో సాధ్యమైనంత త్వరగా..తాజాగా ప్రకటించిన గడువులోగానే ఈయూతో తెగదెంపులు చేసుకునే అవకాశం బ్రిటన్కు ఉందన్నారు. బ్రెగ్జిట్ గడువు పొడిగింపుపై ఈయూ పార్లమెంట్ చర్చించి, ఆమోదం తెలపాలంటే సత్వరమే దీనిపై బ్రిటన్ లాంఛనప్రాయంగా ఆమోదముద్ర వేయాల్సి ఉందని తెలిపారు. బ్రెగ్జిట్ పొడిగింపుపై ఈయూ ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఈయూ పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై చర్చించి, రెండు రోజుల్లో సానుకూల నిర్ణయం వెలువరించనుంది. దీని ప్రకారం.. జాన్సన్ ప్రభుత్వం తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పార్లమెంట్ నవంబర్ 30, డిసెంబర్ 31, జనవరి 31వ తేదీల్లో ఎప్పుడు ఆమోదించినా.. ఆ వెంటనే బ్రెగ్జిట్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేయనుంది. డిసెంబర్ 12వ తేదీన సాధారణ ఎన్నికలు జరపాలంటూ ప్రవేశపెట్టనున్న తీర్మానంపై వచ్చే సోమవారం పార్లమెంట్లో ఓటింగ్ జరగనుంది. -
ఉగ్ర ప్రోత్సాహకులపై చర్యలు
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిపై తక్షణ చర్యలు అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్(ఈయూ)కు చెందిన 28 మంది పార్లమెంట్ సభ్యులతో సోమవారం మోదీ మాట్లాడారు. ‘ఉగ్రవాదంపై పోరుకు సన్నిహిత అంతర్జాతీయ సహకారం కీలకం. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి, ప్రేరేపించడంతోపాటు దానిని ఒక దేశీయ విధానంగా మార్చుకున్న దేశాలపై తక్షణ చర్యలు అవసరం. దీనిని ఏమాత్రం ఉపేక్షించరాదు’అని పరోక్షంగా పాకిస్తాన్నుద్దేశించి పేర్కొన్నారు. కశ్మీర్లో పర్యటించడం ద్వారా జమ్మూ, కశ్మీర్, లదాఖ్ ప్రాంతాల సాంస్కృతిక, మతపరమైన వైవిధ్యంతోపాటు అక్కడ జరుగుతున్న అభివృద్ధి, పాలనపరమైన అంశాలపై అవగాహన ఏర్పడుతుందన్నారు. సాధ్యమైనంత త్వరగా ఈయూతో సముచిత, సమతుల్య వాణిజ్య, పెట్టుబడి ఒప్పందం కుదుర్చుకునేందుకు తమ ప్రభుత్వం ఆసక్తిగా ఉందన్నారు. సులభతర వాణిజ్యం ర్యాంకింగ్స్లో 2014తో పోలిస్తే భారత్ ఎంతో మెరుగైందని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్..జమ్మూకశ్మీర్లో సీమాంతర ఉగ్రవాదం ఫలితంగా ఉత్పన్నమైన పరిస్థితిని ఈయూ ప్రతినిధి బృందానికి వివరించారు. ఈయూ బృందం నేడు కశ్మీర్లో పర్యటించి, ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఏర్పడిన పరిస్థితులను ప్రజలను అడిగి తెలుసుకోనుంది. పార్లమెంట్కు అవమానకరం: కాంగ్రెస్ కశ్మీర్లో పర్యటించకుండా, అక్కడి ప్రజలతో మాట్లాడకుండా దేశంలోని రాజకీయ పార్టీల నేతలను నిర్బంధించిన ప్రభుత్వం..ఈయూ బృందానికి అనుమతి ఇవ్వడం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర అవమానకరమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ ప్రభుత్వ నిర్ణయం భారత ఎంపీల హక్కులకు భంగకరమని తెలిపారు. కశ్మీర్ అంతర్గత విషయమని చెప్పే ప్రభుత్వం ఈయూకు స్వాగతం పలికి విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. జవాన్లతో మోదీ దీపావళి జమ్మూ: దీపావళి వేడుకలను ప్రధాని మోదీ ఆదివారం జమ్మూకశ్మీర్లోని దేశ సరిహద్దుల సమీపంలో జవాన్లతో కలిసి జరుపుకున్నారు. ఆదివారం ఉదయం ఎల్వోసీకి సమీపంలోని రాజౌరి ఆర్మీ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఆయన అక్కడున్న వెయ్యిమంది సైనికులకు పండగ శుభాకాంక్షలు తెలిపి, స్వీట్లు పంచారు. సైనికుల మాదిరిగా ఆర్మీ జాకెట్ ధరించిన ఆయన జవాన్లతో రెండు గంటలపాటు గడిపారని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎంతో కఠిన తరమైన నిర్ణయాలను సైతం ధైర్యసాహసాలతోనే అమలు చేయగలిగామని ఈ సందర్భంగా అన్నారు. దీపావళి పండగను కుటుంబసభ్యులతో జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తారని, అందుకే, తన కుటుంబంలాంటి జవాన్లతో గడిపేందుకే ఇక్కడి వచ్చానన్నారు. అమర జవాన్లకు నివాళులర్పించారు. ప్రధాని వెంట ఆర్మీ చీఫ్ జనరల్ రావత్ ఉన్నారు. 2014లో ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి మోదీ ఏటా సరిహద్దుల్లో జవాన్లతో గడుపుతున్నారు. -
బ్రెగ్జిట్ ఆలస్యానికే ఓటు
లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు ఎదురుదెబ్బ తగిలింది. యూరోపియన్ యూనియన్(ఈయూ)తో కుదుర్చుకున్న బ్రెగ్జిట్ ఒప్పందం జాప్యం కానుంది. ఈ మేరకు శనివారం జరిగిన చారిత్రక సమావేశం నిర్ణయం తీసుకుంది. బ్రెగ్జిట్ కోసం ఈయూతో కుదుర్చుకున్న గొప్ప ఒప్పందానికి మద్దతు తెలపాలంటూ ఈ అంశంపై ప్రధాని జాన్సన్ పార్లమెంట్లో చర్చను ప్రారంభించారు. ఇప్పటి వరకు బ్రెగ్జిట్ తర్వాత అవసరమయ్యే చట్టాలు రూపొందనందున ఈ గడువును 31వ తేదీ నుంచి పొడిగించాలని శనివారం అర్థరాత్రిలోగా ఈయూను కోరాలంటూ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ ఆలివర్ లెట్విన్ సవరణ తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో ఈ తీర్మానానికి అనుకూలంగా 322 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 306 ఎంపీలు ఓట్లేశారు. ప్రధాని కుదుర్చుకున్న బ్రెగ్జిట్ ఒప్పందానికి ఎంపీల మద్దతు లేదనేందుకు ఈ ఫలితాలే నిదర్శనమని లేబర్ పార్టీ నేత కార్బైన్ వ్యాఖ్యానించారు. ప్రధాని జాన్సన్ మాట్లాడుతూ.. ‘ఈ ఓటింగ్ అర్థరహితం. అక్టోబర్ ఆఖరు కల్లా బ్రెగ్జిట్ అమలు చేయాలన్న నిర్ణయానికే తాను కట్టుబడి ఉంటానని, తాజా ఓటింగ్ మేరకు ఈయూను గడువు పొడిగించాలని కోరబోను’అని స్పష్టం చేయడం గమనార్హం. బ్రెగ్జిట్తో తాము కుదుర్చుకున్న ఒప్పందాన్ని వచ్చే సోమవారం సభలో ప్రవేశపెట్టి, మంగళవారం ఓటింగ్కు కోరతామన్నారు. కాగా, పార్లమెంట్లో చర్చ జరుగుతుండగా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న ప్రజలు ప్రధాని జాన్సన్ ఈయూతో కుదుర్చుకున్న ఒప్పందంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా, శనివారం జరిగిన ‘ప్రతినిధుల సభ’ సమావేశాన్ని విశ్లేషకులు ‘సూపర్ సాటర్డే సెషన్’అని అంటున్నారు. ఇలాంటి అసాధారణ సమావేశం 1982లో మార్గరెట్ థాచర్ ప్రధానిగా ఉండగా ఫాక్ల్యాండ్ యుద్ధంపై ఓటింగ్ కోసం ఏర్పాటైంది. -
బ్రెగ్జిట్ డీల్.. జోష్!
గత కొంతకాలంగా ప్రతిష్టంభన నెలకొన్న బ్రెగ్జిట్ డీల్ ఎట్టకేలకు సాకారం కావడంతో గురువారం స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగిసింది. మరిన్ని ఉద్దీపన చర్యలు తీసుకుంటామని, మన దేశంలో మదుపు చేయాల్సిందిగా అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్కు జోష్నిచ్చింది. బీఎస్ఈ సెన్సెక్స్ 39,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,500 పాయింట్లపైకి ఎగిశాయి. స్వల్పంగానైనా, ముడి చమురు ధరలు తగ్గడం, డాలర్తో రూపాయి మారకం విలువ 24 పైసలు పెరిగి 71.19కు చేరడం సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్, నిఫ్టీలు లాభపడటం ఇది వరుసగా ఐదో రోజు. సెన్సెక్స్ 453 పాయింట్లు లాభపడి 39,052 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 122 పాయింట్లు పెరిగి 11,586 పాయింట్ల వద్ద ముగిశాయి. బీఎస్ఈ అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. ఇక నిఫ్టీ సూచీల్లో ఐటీ సూచీ మినహా మిగిలిన అన్ని సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ‘రికవరీ’ ఆశలు...: ఉద్దీపన చర్యలు, పండుగల డిమాండ్, మంచి వర్షాలు కురియడం, వడ్డీరేట్లు తక్కువగా ఉండటం... ఇవన్నీ ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆశలను పెంచుతున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ చెప్పారు. ఫలితంగా నష్ట భయం భరించైనా సరే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలనే ఉద్దేశం పెరిగిందని, కొనుగోళ్లు జోరుగా సాగాయని వివరించారు. మరిన్ని విశేషాలు... ► యస్ బ్యాంక్ షేర్ 15% లాభంతో రూ.47.4 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా లాభపడిన షేర్ ఇదే. భారతీ ఎయిర్టెల్ సునీల్ మిట్టల్, సునీల్ ముంజాల్లు ఈ బ్యాంక్లో వాటాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారన్న వార్తలు ఈ లాభాలకు కారణం. ► బ్రెగ్జిట్ డీల్పై అనిశ్చితి తొలగిపోవడంతో టాటా మోటార్స్ షేర్ జోరుగా పెరిగింది. టాటా మోటార్స్ లగ్జరీ కార్ల విభాగం, జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్లాంట్ ఇంగ్లాండ్లోనే ఉండటంతో తాజా బ్రెగ్జిట్ డీల్ ఈ కంపెనీకి ప్రయోజనకరమన్న అంచనాలతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. టాటా మోటార్స్ షేర్ 10 శాతం లాభంతో రూ.138 వద్ద ముగిసింది. లాభాలు ఎందుకంటే.... ► బ్రెగ్జిట్ డీల్ బ్రెగ్జిట్ డీల్ ఎట్టకేలకు సాకారమైంది. దీంతో యూరోపియన్ యూనియన్తో ఉన్న 46 ఏళ్ల అనుబంధానికి బ్రిటన్ వీడ్కోలు పలకనున్నది. సూత్రప్రాయంగా కుదిరిన ఈ ఒప్పందానికి బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలపాల్సి ఉంది. ►సుంకాల పోరుకు స్వస్తి ! సుంకాల పోరుకు వీలైనంత త్వరగా ముగింపు పలకాలని, దీనికనుగుణంగా సంప్రదింపులు వేగవంతం చేయాలని అమెరికాను చైనా కోరడం సానుకూల ప్రభావం చూపించింది. ►మరిన్ని ఉద్దీపన చర్యలు ఆర్థిక వ్యవస్థలో జోష్ను పెంచడానికి మరిన్ని ఉద్దీపన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని నిర్మలా సీతారామన్ తాజాగా పేర్కొన్నారు. ► వాహన స్క్రాప్ పాలసీ ముసాయిదా భారత్లో వాహన స్క్రాప్ పరిశ్రమను చట్టబద్ధం చే యడంలో భాగంగా రవాణా మంత్రిత్వ శాఖ వాహ న స్క్రాప్ పాలసీకి సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పాలసీ అమల్లోకి వస్తే, అమ్మకాలు మరింతగా పుంజుకోగలవన్న అంచనాలతో వాహన షేర్లు లాభపడ్డాయి. ►జోరుగా విదేశీ కొనుగోళ్లు ఈ నెల తొలి 2 వారాల్లో నికర అమ్మకాలు జరిపిన విదేశీ ఇన్వెస్టర్లు గత 4 ట్రేడింగ్ సెషన్లలో రూ.2,000 కోట్ల మేర నికర కొనుగోళ్లు జరిపారు. రూ.1.59 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.59 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.59 లక్షల కోట్లు పెరిగి రూ.147.90 లక్షల కోట్లకు చేరింది. -
బ్రెగ్జిట్కు కొత్త డీల్
లండన్: యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ విడిపోవడానికి (బ్రెగ్జిట్) ఉద్దేశించిన నూతన ఒప్పందంపై ఒక అంగీకారానికి వచ్చినట్లు బ్రిటన్, ఈయూ గురువారం ప్రకటించాయి. ఈ కొత్త ఒప్పందం అద్భుతంగా ఉన్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఈయూ అధ్యక్షుడు జీన్ క్లాడ్ జంకర్ పేర్కొన్నారు. ఇది న్యాయంగా, సమతూకంతో ఉందన్న జంకర్.. దీన్ని ఆమోదించాల్సిందిగా ఈయూ సభ్య దేశాలను అభ్యర్థించారు. బెల్జియం రాజధాని బ్రసెల్స్లో ప్రస్తుతం ఈయూ సభ్యదేశాల సదస్సు జరుగుతోంది. బ్రెగ్జిట్ ప్రక్రియ సజావుగా సాగేందుకిదే సరైన సమయమని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్కు జంకర్ ఒక లేఖ రాశారు. బ్రెగ్జిట్ గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఈ ఒప్పందం కూడా శనివారం బ్రిటన్ పార్లమెంటు ముందు వస్తుంది. బోరిస్ జాన్సన్కు చెందిన కన్సర్వేటివ్ పార్టీ ప్రభుత్వానికి హౌజ్ ఆఫ్ కామన్స్లో మద్దతిస్తున్న డెమొక్రాటిక్ యూనియనిస్ట్ పార్టీ (డీయూపీ) ఇటీవలే బోరిస్ జాన్సన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పింది. 2017 ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీకి మెజారిటీ వచ్చినప్పటికీ.. కొందరు ఎంపీల రాజీనామా, దాదపు 20 ఎంపీల బహిష్కరణ నేపథ్యంలో ఆ పార్టీకి మెజారిటీ తగ్గి, ప్రస్తుతం డీయూపీ మద్దతుపై ఆధారపడింది. ఇదీ ఒప్పందం... ప్రస్తుత ఒప్పందం.. గతంలో బ్రిటన్ మాజీ ప్రధాని థెరెసా మే హయాంలో రూపొందించిన ఒప్పందం దాదాపు ఒకలాగే ఉన్నాయి. అయితే, బ్రెగ్జిట్ తరవాత కూడా కొన్ని విషయాల్లో ఈయూ నిబంధనలు కొనసాగుతాయన్న మునుపటి నిబంధన తాజా ఒప్పందలో లేదు. తాజా ఒప్పందం ఇదీ... బ్రెగ్జిట్ తరవాత ఐర్లాండ్కు, యూకేలో భాగంగా ఉండే ఉత్తర ఐర్లాండ్కు మధ్య మరీ కఠినతరమైన సరిహద్దు ఉండకూడదని అన్ని పక్షాలూ భావిస్తున్నాయి. తాజా ఒప్పందాన్ని కూడా దీన్ని పరిష్కరించటంలో భాగంగానే తీసుకొచ్చారు. ► యూరోపియన్ కస్టమ్స్ యూనియన్ నుంచి యూకే పూర్తిగా బయటకు వెళ్లిపోతుంది. దీంతో భవిష్యత్తులో ఇతర దేశాలతో యూకే స్వతంత్రంగా వాణిజ్య ఒప్పందాలు చేసుకోగలుగుతుంది. ► ఐర్లాండ్కు– ఉత్తర ఐర్లాండ్కు మధ్య చట్టబద్ధమైన కస్టమ్స్ సరిహద్దు ఉంటుంది. కానీ ఆచరణలో అది ఐర్లాండ్– యూకే సరిహద్దుగా ఉంటుంది. ఉత్తర ఐర్లాండ్లోకి ప్రవేశించే చోట సరుకుల తనిఖీలుంటాయి. ► బ్రిటన్ నుంచి ఉత్తర ఐర్లాండ్కు వచ్చే సరుకులపై ఆటోమేటిగ్గా సుంకాలు చెల్లించటమనేది ఉండదు. కానీ ఈయూలో భాగమైన ఐర్లాండ్కు వచ్చే సరుకుల్ని గనక ఇబ్బందికరమైనవిగా పరిగణిస్తే... వాటిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ► అయితే ఈ ‘ఇబ్బందికరమైన’ సరుకులు ఏంటనేది యూకే– ఈయూ ప్రతినిధుల ఉమ్మడి కమిటీ ఒకటి నిర్ణయిస్తుంది. ► ఈ సరిహద్దుల మధ్య వ్యక్తులు పంపించుకునే సరుకులపై పన్నులు విధించకపోవటం... ఉత్తర ఐర్లాండ్ రైతులకివ్వాల్సిన సాయం... సరుకుల నియంత్రణకు సంబంధించి ఈయూ సింగిల్ మార్కెట్ నిబంధనల్ని ఉత్తర ఐర్లాండ్ పాటించటం... సరిహద్దులో యూకే అధికారులతో పాటు ఈయూ అధికారులూ ఉండటం... సేవలకు మినహాయించి సరుకులకు మాత్రం ఉత్తర ఐర్లాండ్లో ఈయూ చట్టాలే అమలుకావటం... ఈయూలోని యూకే పౌరులు– యూకేలోని ఈయూ పౌరులు ఇకపైనా తమ నివాస, సోషల్ సెక్యూరిటీ హక్కుల్ని యథాతథంగా పొందగలగటం... ఇలాంటివన్నీ తాజా ఒప్పందంలో ఉన్నాయి. -
అడుగడుగునా అడ్డంకుల్లో బ్రెగ్జిట్
యూరోపియన్ యూనియన్ నుంచి ఏ క్షణంలో బ్రిటన్ వైదొలగాలని నిర్ణయించుకుందో అప్పటినుంచి ఆ నిర్ణయానికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. దాని దెబ్బకు ఒక ప్రధాని ఇప్పటికే పదవి నుంచి దిగిపోగా ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ సమస్యను పరిష్కరించలేక బ్రిటన్ చరిత్రలోనే అత్యంత స్వల్పకాలంలో ప్రధాని పదవిలో ఉన్న బలహీనుడిగా చరిత్రకెక్కనున్నారని సంకేతాలు వెలువడుతున్నాయి. ఎలాంటి ఒప్పందమూ లేకుండానే ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడంపై జాన్సన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హౌస్ ఆఫ్ కామన్స్ ఈ మంగళవారమే అడ్డుకట్టవేసింది. ప్రతినిధుల సభలో చుక్కెదురు కావడంతో జాన్సన్ మెజారిటీ కోల్పోయినప్పటికీ అధికారంలో ఉంటున్న వ్యక్తిగా మిగిలిపోయారు. ఫిక్స్డ్ టర్మ్ పార్లమెంట్ యాక్ట్ను పక్కనపెట్టడానికి పార్లమెంటు అనుమతి తీసుకుని, అక్టోబర్ 15లోగా బ్రిటన్లో ఎన్నికలు జరిపించాలని జాన్సన్ ప్రయత్నించారు. దానికి పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. కానీ ప్రభుత్వ గెలుపునకు 133 ఓట్లు తక్కువయ్యాయి. బ్రెగ్జిట్ నుంచి తప్పుకోవడానికి అక్టోబర్ 31ని తుది గడువుగా నిర్దేశించారు. ఈలోగా బ్రిటన్లో ఎన్నికలు జరపకుండా చేయాలని లేబర్ పార్టీ, స్కాటిష్ నేషనలిస్టులు ఉమ్మడి వ్యూహం సిద్ధం చేశారు. జాన్సన్ మెజారిటీ కోల్పోయిన నేపథ్యంలో ప్రతిపక్షాల కలయికతో తాను బ్రిటన్ ప్రధాని కావాలని లేబర్ పార్టీ నేత జెరెమి కోర్బిన్ చేస్తున్న ప్రయత్నాలకు ఎవరూ అండగా నిలబడటం లేదు. అక్టోబర్ 31లోగా బ్రిటన్లో ఎన్నికలు జరపడానికి ప్రతిపక్ష లేబర్ పార్టీతో పాటు స్కాటిష్ నేషనలిస్టులు, లిబరల్స్ వంటి ఇతర చిన్నా చితకా పార్టీలు కూడా తమ ఆమోదం తెలుపటం లేదు. అక్టోబర్ 31లోగా యూరోపియన్ యూని యన్ నుంచి బ్రిటన్ వైదొలిగేలా చేయాలన్న తన నిర్ణయం కూడా అమల్లోకి వచ్చే పరిస్థితులు లేవు. పైగా, ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడానికి పెట్టిన అక్టోబర్ 31 గడువు ముగిశాక పార్లమెంటు ఎన్నికలు నిర్వహిస్తే బ్రెగ్జిట్పై తాను చేసిన ప్రతిజ్ఞ విషయంలో విఫలమయ్యాడనే కారణంతో బ్రిటన్ ఓటర్ల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. జాన్సన్ స్వచర్మ సంరక్షణకోసం రెండు ఎత్తులు వేయవచ్చు. అక్టోబర్ 31లోగా బ్రిటన్ ఈయూని వదిలి వెళ్లడానికి నేరుగా బ్రస్సెల్స్ తోనే కొత్తగా ఒప్పందానికి ప్రయత్నించవచ్చు. తనకున్న ఆకర్షణ శక్తితో దీన్ని సాధిస్తానని ఆయన చెబుతున్నప్పటికీ తనపై పెద్దగా నమ్మకాల్లేవు. బ్రిటన్ ప్రధానిపై ఈయూకి కూడా నమ్మ కం లేకుండా పోవడం గమనార్హం. ఇక రెండోది ఏమిటంటే, బ్రిటన్ పార్లమెంటు తీసుకున్న నిర్ణయాన్ని పక్కనబెట్టి ఈయూతో ఎలాంటి ఒప్పం దమూ లేకుండానే బ్రెగ్జిట్ నుంచి బయటపడటం. ఇది శాసనోల్ఘంఘనే అవుతుంది. పైగా ఈయూనుంచి వైదొలిగేందుకు ఎలాంటి శాసనపరమైన అనుమతుల జోలికి తాను వెళ్లనని, ఈ విషయంలో ఆలస్యాన్ని తాను ఏమాత్రం కోరుకోవడం లేదని జాన్సన్ తేల్చి చెప్పారు కూడా. మూడో అవకాశం కూడా ఉంది. బ్రెగ్జిట్ నుంచి వైదొలగడాన్ని వాయిదా వేయాలని, గడువును మరింతగా విస్తరించాలని ఈయూను కోరడానికి బదులుగా జాన్సన్ తన ప్రధానపదవికి రాజీనామా చేయడం. ఇది వ్యక్తిగతంగా తన ప్రతిష్టను పెంచుతుందేమో కానీ రాజకీయ భవి ష్యత్తు ముగిసిపోతుంది. పైగా బ్రెగ్జిట్ గడువును పెంచాలంటున్న ప్రతిపక్షంతో కలిసి తనకు వ్యతి రేకంగా ఓటేసిన 21 మంది టోరీ ఎంపీలపై జాన్సన్ కఠిన చర్యతీసుకున్నారు. వీరిలో విన్స్టన్ చర్చిల్ మనవడు నికోలస్ సోమ్స్ కూడా ఉన్నారు. మరోవైపున నూరుమందికిపైగా కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ఈ బహిష్కరణ వేటును తీవ్రంగా అభిశంసిస్తూ ఉత్తరం రాశారు. ఈ నేపథ్యంలో వచ్చే సోమవారం బ్రిటన్ రాజకీయాలకు సంబంధించి గడ్డుదినంగా మారనుంది. అసాధారణ ఘటనల కారణంగా రాజ కీయ పరిస్థితి ఆకస్మిక మార్పులకు గురికావచ్చు. జాన్సన్ ఆశ మొత్తంగా ఇదేమరి. కానీ అలా జరగకపోతే, బ్రేకులు పనిచేయని కారు స్లోమోషన్లో గోడకు గుద్దుకున్న పరిస్థితిలో జాన్సన్ ఇరుక్కుపోవచ్చు కూడా. వ్యాసకర్త: కరణ్ థాపర్, సీనియర్ పాత్రికేయులు -
గందరగోళంలో బ్రెగ్జిట్
బ్రెగ్జిట్ పీటముడి మరింత జటిలమైపోయింది. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం బ్రిటన్ అక్టోబర్ 31కల్లా యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాల్సి ఉండగా.. ప్రధాని బోరిస్ జాన్సన్ కాస్తా పార్లమెంటును సస్పెండ్ చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఒప్పందంలో మార్పులు జరిగితే బ్రిటన్ వైదొలగేందుకు తనకు అభ్యంతరం లేదని బోరిస్ అంటూండగా.. విపక్షాలు తమకు అనుకూలమైన మార్పులు జరిగితేనే వీడాలని పట్టుపడుతున్నాయి. లేదంటే బ్రిటన్కు ఆర్థికంగా నష్టమని హెచ్చరిస్తున్నాయి. ఇంతకీ అక్టోబర్ 31లోగా బ్రెగ్జిట్ సాధ్యమేనా? అధికార, విపక్షల ముందున్న అవకాశాలు ఏంటి? రహస్య పద్ధతితో సాధిస్తారా? మెరుగైన ఒప్పందం లేకుండా విడిపోవడంపై పార్లమెంటు సభ్యులు అత్యధికుల్లో అభ్యంతరాలున్నాయి. కానీ ఇది జరక్కుండా ఉండాలంటే పార్లమెంటు పనిచేయాల్సి ఉంటుంది. పార్లమెంటు సస్పెన్షన్లో ఉన్న నేపథ్యంలో పరిస్థితులు జటిలంగా మారినా.. ప్రతిపక్ష నేతలు జో స్విన్సన్ లాంటి వాళ్లు తమ గళాన్ని పెంచారు. ఇటీవలి బీబీసీ ఇంటర్వ్యూలో లిబరల్ డెమొక్రాట్స్ నేత అయిన జో స్విన్సన్ మాట్లాడుతూ తామూ బోరిస్ జాన్సన్ మాదిరిగా ఒక సీక్రెట్ పద్ధతి ద్వారా తమకు కావాల్సింది సాధించుకుంటామని సూచించారు. అదేంటో ఇప్పటికి స్పష్టం కాకపోయినా... అనూహ్య పరిణామమేదైనా జరగవచ్చునని మాత్రం తెలుస్తోంది. తుది అస్త్రంగా అవిశ్వాసం... మెరుగైన బ్రెగ్జిట్ ఒప్పందంపై చట్టం చేయలేని పరిస్థితి ఏర్పడితే బోరిస్ జాన్సన్ను ప్రధాని పదవి నుంచి తప్పించేందుకు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశముంది. ప్రస్తుతానికి ఇందుకు తగ్గ బలం లేకపోగా.. దీనివల్ల సమస్య పరిష్కారమవుతుందన్న నమ్మకమూ లేదు. అవిశ్వాస తీర్మానం మేరకు ఒకవేళ బోరిస్ జాన్సన్ దిగిపోయినా రెండు వారాల్లోగా కొత్త ప్రభుత్వం ఏర్పడటం, లేదంటే సాధారణ ఎన్నికలు నిర్వహించడం జరగాలని బ్రిటన్ చట్టాలు చెబుతూండటం దీనికి కారణం. ఆపద్ధర్మ ప్రధాని నియామకం ద్వారా బ్రెగ్జిట్ను వాయిదా వేసి ఎన్నికలు నిర్వహించవచ్చు. కానీ.. ఆపద్ధర్మ ప్రధాని ఎవరన్న అంశంపై ప్రతిపక్షాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవచ్చు. లేబర్ పార్టీ తరఫున జెరెమీ కార్బిన్... ఆపద్ధర్మ ప్రధాని అభ్యర్థి కావచ్చుగానీ... యూనియన్ వ్యతిరేకిగా ముద్ర ఉన్న కారణంగా అతడిని బ్రెగ్జిట్ను వ్యతిరేకిస్తున్న వారు ఒప్పుకోకపోవచ్చు. ఒకవేళ అన్నీ సవ్యంగా జరిగి ఆపద్ధర్మ ప్రధాని బాధ్యతలు చేపడతాడు అనుకుంటే.. బోరిస్ మరో ఎత్తు వేయవచ్చు. రాజీనామా చేయకుండా నవంబర్లోనే ఎన్నికలు నిర్వహించవచ్చు. దీంతో మెరుగైన ఒప్పందం లేకుండానే అక్టోబర్ 31 తరువాత బ్రెగ్జిట్ అమల్లోకి వచ్చేస్తుంది. ఒప్పందంతో బయటకు... థెరెసా మే ప్రధానిగా ఉండగా సిద్ధమైన ఒప్పందాన్ని బ్రిటన్ పార్లమెంటు ఇప్పటికే మూడుసార్లు తిరస్కరించిన నేపథ్యంలో ఒప్పందం కుదిరే అవకాశాలు తక్కువే. మరోవైపు యూరోపియన్ యూనియన్ కూడా మరోసారి చర్చలు లేవని భీష్మించుకుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 17 –18లలో జరిగే యూనియన్ నేతల సమావేశం కీలకం కానుంది. ప్రధాని బోరిస్ ఏదో ఒక రకంగా యూనియన్ నేతలను ఒప్పించి ఒప్పందంలో మార్పులు తీసుకు వస్తే.. ఆ మార్పులను బ్రిటన్ పార్లమెంటు ఆమోదిస్తేనే బ్రిటన్కు నష్టదాయకం కాని ఒప్పందంతో బ్రెగ్జిట్ అమల్లోకి వస్తుంది. ఒప్పందం లేకుండానే వీడుతుందా..? మెరుగైన ఒప్పందం కుదుర్చుకునేందుకు బోరిస్ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాకపోతే ఒప్పందం లేకుండానే యూనియన్ను వీడేందుకు ఆయన సిద్ధం కావచ్చు. కాలపరిమితి కారణంగా పార్లమెంటు కూడా దీన్ని అడ్డుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఒప్పందంలో మార్పులు జరిగినా, జరక్కపోయినా అక్టోబర్ 31 తరువాత బ్రిటన్ యూరోపియన్ యూనియన్లో భాగం కాదు కాబట్టి. ఇదే జరిగితే జాన్సన్ బ్రెగ్జిట్ మద్దతుదార్లను కూడగట్టుకుని ఈ ఏడాది చివర లేదంటే వచ్చే ఏడాది మొదట్లో సాధారణ ఎన్నికలకు సిద్ధం కావచ్చు. కానీ యూనియన్ నుంచి వైదొలగిన తరువాతి ఆర్థిక పరిణామాల కారణంగా ఆ ఎన్నికలను గెలవడం బోరిస్కు కష్టం కావచ్చు. ముందస్తు ఎన్నికలు..? పార్లమెంటు సస్పెన్షన్ మొదలయ్యేలోపు ఎంపీలు అందరూ మెరుగైన ఒప్పందం లేకుండా బ్రెగ్జిట్ కుదరదని చట్టం చేయగలిగితే.. ఆ వెంటనే బోరిస్ జాన్సన్ సాధారణ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావచ్చు. ప్రస్తుతం ఒకే ఒక్క సభ్యుడి ఆధిక్యంతో సభ నడుస్తూండగా.. ఎన్నికలు జరిగితే జాన్సన్కు మద్దతు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ముందస్తు ఎన్నికలు జరిగితే అవి అక్టోబర్ 17 లోగానే జరగవచ్చునని తద్వారా బోరిస్ గెలిస్తే.. యూరోపియన్ యూనియన్ సదస్సుకు వెళ్లి తన బలాన్ని ప్రదర్శించవచ్చునని అంచనా. కానీ.. ఎన్నికలు నిర్వహించాలంటే హౌస్ ఆఫ్ కామన్స్లో మూడింట రెండు వంతుల మంది మద్దతు కావాల్సి ఉంటుంది. అంటే.. బోరిస్కు ప్రతిపక్ష నేతల సభ్యులు కొందరు మద్దతు పలకాలి. లేబర్ పార్టీ కూడా తక్షణ ఎన్నికలు కోరుకుంటున్నా బోరిస్పై ఉన్న అపనమ్మకం కారణంగా అతడికి మద్దతిచ్చే అవకాశాలు తక్కువే. న్యాయస్థానాలు నిర్ణయిస్తాయా? పార్లమెంటును సస్పెండ్ చేయడంపై ఇప్పటికే బ్రిటన్ న్యాయస్థానాల్లో మూడు కేసులు నమోదయ్యాయి. గతంలో పార్లమెంటును కాదని యూనియన్తో చర్చలకు సిద్ధమైన థెరెసా మే నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో సవాలు చేసి గెలుపొందిన గినా మిల్లర్ ఇప్పుడు కూడా బోరిస్ నిర్ణయాన్ని సవాలు చేస్తున్నారు. దీంతో బ్రెగ్జిట్ బంతి బ్రిటన్ కోర్టులో పడిపోతుంది! -
అత్యంత వేడి మాసం జూలై
వాషింగ్టన్: భూ గ్రహ చరిత్రలోనే ఈ ఏడాది జూలై నెల అత్యంత వేడి మాసంగా నమోదైంది. ఈ విషయాన్ని గతంలోనే యూరోపియన్ యూనియన్ వెల్లడించగా, తాజాగా అమెరికా జాతీయ వాతావరణ, సముద్ర పరిశీలన సంస్థ (ఎన్వోఏఏ) కూడా గురువారం ధ్రువీకరించింది. ‘ప్రపంచంలోని అనేక చోట్ల జూలై నెలలో ఎన్నడూ లేనంత వేడిగా వాతావరణం ఉంది. భూ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నెల 2019 జూలై. ఈ వేడిమి కారణంగా ఆర్కిటిక్, అంటార్కిటిక్ సముద్రాల్లోనూ మంచు భారీగా కరిగింది’ అని ఎన్వోఏఏ తెలిపింది. ఆ వివరాల ప్రకారం, 20వ శతాబ్దంలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 15.8 డిగ్రీ సెల్సియస్ కాగా, తాజాగా ఈ జూలైలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 16.75 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. 2016 జూలై రెండో ఇప్పుడు ప్రపంచంలో రెండో అత్యంత వేడి మాసంగా ఉంది. పది అత్యంత వేడి జూలై మాసాల్లో తొమ్మిది 2005 తర్వాతనే నమోదవడం గమనార్హం. ఇక ఆర్కిటిక్ సముద్రంలో మంచు సాధారణంగా జూలై నెలలో ఉండే సగటు కన్నా ఈ ఏడాది జూలై నెలలో 19.8 శాతం తక్కువగా ఉంది. అంటార్కిటికాలోనూ సగటు కన్నా 4.3 శాతం తక్కువ మంచు ఉంది. -
ఇదేమీ బౌలింగ్ యాక్షన్ రా బాబు!
అప్పుడప్పుడు రవిచంద్రన్ అశ్విన్ వెరైటీ బౌలింగ్ వేసి అలరించడం మనకు తెలిసిందే. తాజాగా ఓ రొమేనియన్ బౌలర్ కూడా తన బౌలింగ్ యాక్షన్తో ఇంటర్నెట్లో కితకితలు పంచుతున్నాడు. యూరోపియన్ యూనియన్ టీ10 క్రికెట్ లీగ్లో రొమేనియా బౌలర్ పావెల్ ఫ్లోరిన్ తన బౌలింగ్తో సోషల్ మీడియా సెన్సేషనల్గా మారిపోయాడు. అతడేమీ చండప్రచండంగా బంతులు విసిరి.. బ్యాట్స్మెన్ను బెదరగొట్టి వికెట్లు తీయలేదు. పరిగెత్తుకొని వచ్చి.. చాలా నెమ్మదిగా మొత్తం గాలిలోకి బంతిని విసిరేస్తున్నాడు ఈ బౌలర్. అసలు బ్యాట్స్మెన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా.. విచిత్రమైన బౌలింగ్ శైలితో వికెట్లకు దూరంగా ఫుల్టాస్ బంతిని విసురుతున్నాడు. అతని బౌలింగ్ వీడియోలు చూసిన నెటిజన్లు.. ఇదేమీ బౌలింగ్ యాక్షన్రా బాబు అని కామెంట్ చేస్తున్నారు. ఈ ఏడాది ఇదే బెస్ట్ క్రికెట్ మూమెంట్ అయి ఉంటుందని, ఇతని బౌలింగ్ యాక్షన్ చూస్తే.. కితకితలు ఖాయమని నెటిజన్లుఅంటున్నారు. మీరు ఓసారి లుక్కేయండి Ladies and gentlemen ... welcome to the #EuropeanCricketLeague 🤷🤷🤷 pic.twitter.com/ctrhyJvs4b — Fox Cricket (@FoxCricket) July 30, 2019 -
గ్రీస్లో అధికార మార్పిడి
ఏథెన్స్ : గ్రీస్లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ ఓటమి పాలయ్యారు. కిరియాకోస్ మిత్సోటకిస్ నేతృత్వంలోని న్యూడెమోక్రసీ పార్టీ, సిప్రాస్ నేతృత్వంలోని సిరిజా పార్టీపై గెలుపు సాధించింది. 75 శాతానికి పైగా ఓటింగ్ జరిగిన ఈ ఎన్నికల్లో న్యూడెమోక్రసీ పార్టీ 39.6 ఓట్లు సాధించి అధికారం కైవసం చేసుకొంది. ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న దశాబ్ద కాలం తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు వచ్చింది. ఓటమిని అంగీకరించిన సిప్రాస్ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెంకించడానికి చేయాల్సిందంతా చేశానని, అయితే గ్రీకు ప్రజల తాజా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు. గ్రీక్ ప్రజలకు కిరియాకోస్ మిత్సోటకిస్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానిగా అధ్యక్ష నివాసంలో ఆయన పదవీ స్వీకార ప్రమాణం చేశారు. గ్రీస్కు ముందున్న సవాళ్లు తెలుసని.. పారదర్శక పాలన, మరింత యోగ్యతతో మనం స్వరం యూరప్లో ఇకనుంచి గట్టిగా వినిపిస్తుందని మిత్సోటకిస్ అన్నారు. దేశాన్ని మరింత ప్రైవేటీకరణ దిశగా, బిజినెస్ ఫ్రెండ్లీగా మారుస్తానని హామీ ఇచ్చారు. బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేసిన ఈ పూర్వ హార్వర్డ్ విద్యార్థి 2013-15 మధ్య మంత్రిగా కూడా పనిచేశారు. గ్రీస్ సంక్షోభం దశాబ్దకాలంగా ఆర్థిక సంక్షభంలో కూరుకొని ‘యూరప్ సమస్యల పిల్లాడు’ అని ముద్ర వేసుకున్న గ్రీస్లో ఏ రాజకీయ పరిణామం జరిగినా యూరప్ యూనియన్ దేశాలు నిశితంగా గమనిస్తాయి. 2015కు పూర్వం గ్రీస్ దివాళా తీసే దిశగా ప్రయాణించింది. దీంతో వామపక్ష భావాలు ఉన్న ఆకర్షణగల నేత సిప్రాస్ నేతృత్వంలోని సిరాజ్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలకు సరికొత్త పాలన అందిస్తానని, గ్రీస్ కష్టాలు తొలగాలంటే గ్రెగ్జిట్(యూరోపియన్ యూనియన్నుంచి బయటికి రావడం) కావాలని ఎన్నికల సమయంలో సిప్రాస్ పదేపదే చెప్పారు. పెట్టుబడీదారీ వ్యవస్థతో ముడిపడి ఉన్న ఈ దేశంలో వామపక్ష పార్టీ అధికారంలోకి రావడం జరగదని రాజకీయ పండితులు భావించారు. కానీ అనూహ్యంగా సిప్రాస్ అధికారంలోకి వచ్చారు. గ్రెగ్జిట్పై రెఫరెండం నిర్వహించగా మెజార్టీ ప్రజలు అనుకూలంగానే తీర్పుఇచ్చారు. ఈ పరిమాణంతో యూరోపియన్ యూనియన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కానీ సిప్రాస్ చివరి నిమిషంలో యూరప్ ఆర్థిక శక్తివంతులు జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల ఒత్తిడికి తలొగ్గారు. గ్రెగ్జిట్ను పక్కన పెట్టడమే గాక ఎన్నికల సమయంలో వ్యతిరేకించిన బెయిల్ అవుట్ ఒప్పందాన్ని తిరిగి చేసుకుని ప్రభుత్వం పెట్టే సంక్షేమ ఖర్చులో కోత విధించడం మొదలుపెట్టారు. దీంతో ప్రజలలో తీవ్ర ఆగ్రహం వక్తమైంది. గ్రీస్ ఆందోళనలతో అట్టుడుకింది. దీనికితోడు సిరియా, ఇరాక్ల నుంచి శరణార్థుల వలసలు కూడా గ్రీకు ప్రజలలో ఆందోళన పెంచాయి. దీంతో జాతీయతవాదం బయలుదేరి ఈ ఎన్నికలలో సిప్రాస్ ఓటమి పాలయ్యారని విశ్లేషకులు అంటున్నారు. సిప్రాస్ పాలనలో యూరప్కు దూరం జరిగిన గ్రీస్, సంస్కరణవాదిగా పేరుతెచ్చుకున్న కిరియాకోస్ వల్ల తిరిగి యూరప్ ప్రధాన స్రవంతిలో కలుస్తుందని, ఈ విజయంతో యూరప్ను ఆవహించిన వామపక్ష ఆకర్షణ భయాలకు కొంతకాలం తెరపడినట్లేనని అభిప్రాయపడుతున్నారు. -
చనిపోవడమూ ఓ హక్కేనా?
సాక్షి, ఇంటర్నేషనల్ : మరణం వాయిదా వేయడం మినహా మరే ఆశ లేనప్పుడు, శారీరక బాధను భరించలేని దయనీయ పరిస్థితిలో.. రోగి లేదా అతని తరపున నమ్మకమైన వ్యక్తి అనుమతితో కారుణ్య మరణం ప్రసాదించవచ్చు. గౌరవప్రదమైన మరణం కూడా జీవించే హక్కులో భాగమే. - భారత సుప్రీంకోర్టు 42 ఏళ్లుగా మంచానికే పరిమితమై తీవ్ర దుఃఖం అనుభవించిన అరుణ రామచంద్ర షాన్బాగ్(ముంబయి).. కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టుపై విధంగా వ్యాఖ్యానించింది. అయితే ఇలాంటి కేసే ఇప్పుడు ఫ్రాన్స్ దేశంలో ప్రజలను రెండుగా చీల్చింది. పది సంవత్సరాలనుంచి అచేతన స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి కారుణ్య మరణం ప్రసాదించాలని సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత కోర్టు తీర్పునిచ్చింది. ఈ నిర్ణయంపై కొందరు విమర్శలు చేస్తుండగా, మరికొందరు తమ మద్దతును తెలిపారు. ఫ్రాన్స్కు చెందిన విన్సెంట్ లాంబార్ట్ 2008లో రోడ్డు ప్రమాదంలో గాయపడి అచేతన స్థితిలోకి వెళ్లిపోయాడు. వైద్య నిపుణులు కూడా అతడిని మామూలు స్థితికి తీసుకు రావడం కష్టమని తేల్చారు. దీంతో విన్సెంట్ భార్య కూడా కారుణ్య మరణానికి ఒప్పుకుంది. ప్రమాదం జరిగాక తనకు మరణం ప్రసాదించమని తనని కోరాడని తెలిపింది. దీంతో పదేళ్ల సుదీర్ఘకాలంలో జీవించే హక్కా?, చనిపోయే హక్కా? అంటూ నాటి నుంచి ఫ్రెంచ్ రాజకీయ నాయకుల చేతితో అతడు బంతిలా మారాడు. విన్సెంట్ కేసు ఫ్రెంచ్ న్యాయస్థానాలతో పాటు, యూరోపియన్ యూనియన్ కోర్టుకు వెళ్లింది. చివరకు న్యాయస్థానం కారుణ్య మరణానికి అంగీకరించింది. ఇంతవరకూ బాగానే ఉన్నా, విన్సెంట్ తల్లి మాత్రం కారుణ్య మరణానికి ససేమిరా అంటోంది. తన కుమారునికి వైద్య సేవలు నిలిపివేయడాన్ని హింసగానే భావించాలని కోరుతూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయెల్ మెక్రాన్కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన అధ్యక్షుడు ‘ఏ నిర్ణయం తీసుకునేది న్యాయపరంగా సంరక్షణ ఉన్న బాధితుని భార్యకే ఉంటుందని’ తేల్చి చెప్పారు. దీంతో మనకు ఇష్టమైన వారు మన కళ్లముందే దూరం అవుతున్నారని బాధ పడుతున్నతల్లికి సంఘీభావంగా కొందరు, ఇంత కష్టమైన బతుకు బతికే కన్నా చనిపోవడమే మేలని సర్దిచెప్పుకొంటున్న భార్యవైపు కొందరు మద్దతు తెలుపుతూ ఈ ‘విషాద పరీక్ష’పై ఫ్రెంచ్ దేశీయులు చర్చించుకుంటున్నారు. -
ట్రిపుల్ ఐటీ విద్యార్థికి అరుదైన అవకాశం
సాక్షి, కృష్ణా జిల్లా : నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థి నజ్మా సుల్తానాకు అరుదైన అవకాశం లభించింది. యూరోపియన్ యూనియన్ విద్యార్థులకు అందజేసే 20 లక్షల రూపాయల స్కాలర్షిప్ ఆమెను వరించింది. ప్రపంచ దేశాల్లో వివిధ యూనివర్సిటీల నుంచి ఈ స్కాలర్షిప్ కోసం వందలాది మంది విద్యార్థులు పోటీపడ్డారు. అయితే వీరందిరిలో భారతదేశం నుంచి ఇద్దరు విద్యార్థులను మాత్రమే యూరోపియన్ యూనియన్ ఎంపిక చేయడం విశేషం. కాగా నజ్మా స్వస్థలం గుంటూరు. ప్రతిష్టాత్మక స్కాలర్షిప్ అందుకున్న నేపథ్యంలో పలువురు ఆమెను ప్రశంసిస్తున్నారు. -
పార్టీ నాయకత్వానికి మే రాజీనామా
లండన్: బ్రెగ్జిట్ ఒప్పందంపై ఏకాభిప్రాయ సాధనకు మూడేళ్ల పాటు అటు ప్రతిపక్షాలతో ఇటు సొంత పార్టీలోని అసమ్మతివాదులతో పోరాడి ఓడిన బ్రిటన్ ప్రధాని థెరీసా మే గతంలో (మే 23న) చెప్పిన ప్రకారం శుక్రవారం కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేశారు. కొత్త ప్రధాని వచ్చేంత వరకు ఆమె తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతారు. కన్జర్వేటివ్ పార్టీ కొత్త నేతను ఎన్నుకునే ప్రక్రియ సోమవారం మొదలుకానుంది. బ్రెగ్జిట్ ఒప్పందాన్ని అమలు పరచలేకపోయానన్న బాధ ఎప్పటికీ ఉంటుందని మే 23వ తేదీన చేసిన ప్రసంగంలో థెరీసా భావోద్వేగం వ్యక్తం చేశారు. బ్రెగ్జిట్ను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నా వారసునిపై ఉంది. పార్లమెంటులో ఏకాభ్రిప్రాయం సాధించడం ద్వారానే వారు దీన్ని సాధించగలరు. బలమైన, సుస్థిర నాయకత్వంతో బ్రిటిష్ సమాజంలోని అన్యాయాలపై పోరాటమే తన కర్తవ్యమని ప్రకటించి ప్రధాని పదవి చేపట్టిన థెరీసాకు బ్రెగ్జిట్ పుణ్యమా అని ఆ అవకాశమే లభించలేదు.ç పదవిలో ఉన్న మూడేళ్లూ బ్రెగ్జిట్తోనే సరిపోయింది. 2016లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మెజారిటీ ప్రజలు బ్రెగ్జిట్కు అనుకూలంగా ఓటు వేశారు. ఆ నేపథ్యంలో ప్రధాని డేవిడ్ కామెరాన్ పదవీచ్యుతుడవడంతో థెరీసా ప్రధాని పగ్గాలు చేపట్టారు. ఈయూతో కుదుర్చుకున్న బ్రెగ్జిట్ ఒప్పందాన్ని పార్లమెంటులో నెగ్గించుకోవడానికి, ఏకాభిప్రాయ సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ నేతలను కూడా బుజ్జగించేందుకు విఫలయత్నం చేశారు. అయితే, మూడుసార్లు పార్లమెంటులో జరిగిన ఓటింగులో థెరీసా ఒప్పందం వీగిపోయింది. 2017లో జరిగిన ఎన్నికల్లో థెరీసా పార్లమెంటులో మెజారిటీ కూడా కోల్పోవడంతో బ్రెగ్జిట్ భవిష్యత్తు మరింత సంక్లిష్టమయింది. వరుసగా మూడో సారి కూడా పార్లమెంటులో ఒప్పందం వీగిపోయింది. ఫలితంగా 62 ఏళ్ల థెరీసా రాజీనామాకు సిద్ధపడ్డారు. ప్రధాని పదవికి పోటీలో 11 మంది ప్రధాని పదవి కోసం 11 మంది పోటీ పడుతున్నారు. ప్రధాని పదవి కోసం పోటీ చేసే అభ్యర్థి కనీసం 8 మంది ఎంపీల మద్దతు చూపించాల్సి ఉంటుంది. జూన్ 13, 18, 19 తేదీల్లో జరిగే రహస్య బ్యాలెట్లో పార్టీ ఎంపీలు ఓటు వేస్తారు. జూన్ 22 న కొత్త ప్రధానిని ప్రకటించే అవకాశం ఉంది. -
ఈయూలో కొత్త గాలి
‘సరిహద్దులు లేని ఒకే దేశం’ ఆకాంక్షతో ఆవిర్భవించిన యూరప్ యూనియన్(ఈయూ)కు ఈ నెల 23–26 మధ్య జరిగిన ఎన్నికల్లో ఓటర్లు చిత్రమైన తీర్పునిచ్చి సంస్థ మనుగడను చిక్కుల్లో పడేశారు. ఈయూలో నాలుగు దశాబ్దాలుగా పెత్తనం చలాయిస్తూ వచ్చిన మధ్యేవాద పక్షాల బలాన్ని తగ్గించి, పరస్పరం తీవ్రంగా విభేదించుకునే పర్యావరణ అనుకూలవాదులనూ, ఉదార వాదులనూ, తీవ్ర మితవాదులనూ అధికంగా గెలిపించారు. పర్యవసానంగా మున్ముందు ఈయూ అస్థిత్వం ఒడిదుడుకులను ఎదుర్కొనక తప్పేలా లేదు. ఒకపక్క ఈయూలో బ్రిటన్ మనుగడ ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. ఈలోగానే పులి మీద పుట్రలా వచ్చిన ఈయూ ఫలితాలు అందరిలోనూ వణుకు పుట్టిస్తున్నాయి. ప్రధానంగా జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్లలో పర్యావరణ అనుకూల హరిత పార్టీలకు ఆదరణ లభించింది. పర్యావరణ అనుకూలురతో పోలిస్తే తీవ్ర మితవాదులు అనుకున్న స్థాయిలో సీట్లు సంపాదించుకోలేకపోయినా సంస్థలో మధ్యేవాద పక్షాలకు పెను సవాల్గా మార బోతున్నారు. 751 స్థానాలుండే యూరొపియన్ పార్లమెంటులో వారికి 25 శాతం స్థానాలు దక్కు తాయి. ఇది గత ఎన్నికలతో పోలిస్తే 5 శాతం ఎక్కువ. అమెరికాకు దీటుగా పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా, భవిష్యత్తులో సరిహద్దులు లేని ఒకే దేశంగా రూపొందాలన్న బలమైన ఆకాంక్షే ఈయూ ఆవిర్భావానికి మూలకారణం. 1957లో ఆరు దేశాల కూటమిగా మొదలైన ఈ సంస్థలో ప్రస్తుతం 28 దేశాలకు సభ్యత్వముంది. ఉమ్మడి పార్లమెంట్, ఉమ్మడి చట్టాలు, ఉమ్మడి న్యాయవ్యవస్థ ఏర్పరుచుకోవాలన్నది ఈ దేశాల ఆశయం. అయితే ఈ దిశగా ముందడుగులు పడుతున్నకొద్దీ సభ్య దేశాల పౌరుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. సము న్నత ప్రజాస్వామ్య దేశంగా ఉన్న తాము ఈయూ నీడలో కుంచించుకుపోతామన్న సందేహాలు అంకురించాయి. బ్రిటన్లో రగుల్కొన్న ఈ అసంతృప్తి క్రమేపీ విస్తరించి చివరకు మూడేళ్లక్రితం జరి గిన రిఫరెండమ్లో సంస్థ నుంచి వైదొలగడానికి 51.9 శాతంమంది మొగ్గుచూపారు. ఈయూలోనే కొనసాగాలన్నవారి శాతం 48.1 శాతం మించలేదు. తమ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలేమిట న్నది పట్టించుకోకుండా ఈయూ చట్టాల పేరిట ఇష్టానుసారం వలసదారుల్ని ప్రోత్సహిస్తున్నారని, ఆ రకంగా తమ ఆర్థిక వనరులకు గండికొడుతున్నారని బ్రిటన్లో మాత్రమే కాదు... చాలా దేశాల పౌరుల్లో అసంతృప్తి రగుల్కొంది. ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల్లో ఏర్పడ్డ సంక్షోభంతో లక్షలాది మంది ఈయూ దేశాలకు వలసబాట పట్టడం ఈ అసంతృప్తికి మూలకారణం. ఈయూలో పలుకు బడి ఉన్న మధ్యేవాద పక్షాలు మొదట్లో వలసల విషయంలో ఉదారంగానే వ్యవహరించినా వివిధ దేశాల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకత గమనించి విధానాలను సవరించాయి. వలసల నియంత్రణకు ప్రయత్నించాయి. కానీ అసంతృప్తి చల్లారలేదు. తీవ్ర మితవాద పక్షాల ప్రభావం తగ్గలేదు. వాస్తవా నికి బ్రిటన్ ఈపాటికే ఈయూ నుంచి నిష్క్రమించాల్సి ఉంది. అందుకోసం అనుసరించాల్సిన విధివిధానాలపై బ్రిటన్ ప్రధాని థెరిసా మే ఈయూతో కుదుర్చుకొచ్చిన ఒప్పందం ఆ దేశ పార్ల మెంటులో వీగిపోవడం పర్యవసానంగా అది అనిశ్చితిలో పడింది. ఒప్పందం ఉన్నా, లేకున్నా వచ్చే అక్టోబర్లో ఎటూ ఈయూ నుంచి బయటకు రాకతప్పదు. అయినా నిబంధనల ప్రకారం ఈయూ ఎన్నికల్లో బ్రిటన్ పాల్గొనక తప్పలేదు. సహజంగానే ఈయూ నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ వచ్చిన యూకే ఇండిపెండెంట్ పార్టీ(యూకేఐపీ) ఈ ఎన్నికల్లో 31శాతం ఓట్లు గెల్చుకుంది. అధికార పక్షం కన్సర్వేటివ్ పార్టీ ఓట్లను అది భారీగా కొల్లగొట్టింది. ఫలితంగా కన్సర్వేటివ్లో అయిదో స్థానంలో నిలిచారు. అటు ఈయూలో కొనసాగాలంటున్న లిబరల్ డెమొక్రాట్లు 20 శాతం ఓట్లు సాధించి రెండో స్థానంలో ఉంటే, ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ మూడో స్థానంలో నిలిచింది. ఈయూను నాలుగు దశాబ్దాలుగా ఏలుతున్న మధ్యేవాద మితవాద పక్షమైన యూరొపియన్ పీపుల్స్ పార్టీ(ఈపీపీ), మధ్యేవాద వామపక్ష కూటమి(ఎస్డీ) ప్రాభవం కోల్పోయాయి. జర్మనీ చాన్సలర్ నేతృత్వంలోని ఈపీపీ 180 స్థానాలు, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ నాయకత్వం వహించిన ఎస్డీ 146 స్థానాలు గెల్చుకున్నాయి. ఫ్రాన్స్ ప్రధాని మేక్రోన్ నాయకత్వంలోని ఉదార వాదులు 109 స్థానాలు సాధించారు. పర్యావరణ అనుకూల హరిత పక్షాలు 70 స్థానాలు కైవసం చేసుకున్నాయి. కర్బన ఉద్గారాలతో పర్యావరణం నాశనమై భూగోళానికి ముప్పు ముంచుకొస్తున్నం దున తక్షణ చర్యలు అవసరమని కోరుతున్న ఈ పక్షాలు జర్మనీలో రెండో స్థానాన్ని, ఫ్రాన్స్లో మూడో స్థానాన్ని తెచ్చుకున్నాయి. ఇతరచోట్ల సైతం ప్రభావాన్ని చూపాయి. ముందూ మునుపూ ఇవి ఒక రాజకీయ శక్తిగా అవతరిస్తాయన్న అభిప్రాయం కలిగించాయి. వలసలను తీవ్రంగా వ్యతి రేకించే వివిధ రకాల మితవాద పక్షాలు 175 స్థానాలు గెల్చుకున్నాయి. ఇలా పరస్పర విరుద్ధ భావాలకు ప్రాతినిధ్యంవహించే పక్షాలు బలం పుంజుకోవడం వల్ల ఈయూ నిర్వహణ ఇకపై కత్తి మీది సామే. ఈయూ పార్లమెంటుకు ప్రతినిధులను ఎన్నుకోవడానికే ఈ ఎన్నికలు జరిగినా అందులోని సభ్య దేశాల పౌరులు తమ తమ ప్రయోజనాల దృష్టితోనే ప్రతినిధులను ఎంచుకు న్నారు. ఒక సంస్థగా ఇది ఈయూ వైఫల్యమనే చెప్పాలి. దశాబ్దాలు గడిచినా 28 దేశాల పౌరుల్లోనూ అది ఉమ్మడి భావనను తీసుకురాలేకపోయింది. హరితవాదులు గణనీయమైన సంఖ్యలో సీట్లు సంపా దించుకోవడం వల్ల జర్మనీ తదితరచోట్ల శిలాజ ఇంధనాల వినియోగం తగ్గించాలన్న ఒత్తిళ్లు పెరుగు తాయి. ఆ సంగతలా ఉంచి ఈయూను నడిపించే యూరొపియన్ కమిషన్కు సారథిగా ఎవ రుండాలన్న విషయంలో జర్మనీ, ఫ్రాన్స్ల మధ్య ఇప్పటికే విభేదాలు తలెత్తాయి. పౌరుల్లో ఈయూ పట్ల వ్యతిరేకత క్రమేపీ పెరుగుతున్నదని అర్ధమయ్యాక మరికొన్ని దేశాలు కూడా బ్రిటన్ బాటపట్టే అవకాశం లేకపోలేదు. మొత్తానికి ఎన్నో వైరుధ్యాలతో నాలుగు దశాబ్దాలు నెట్టుకొచ్చిన ఈయూ వచ్చే అయిదేళ్లూ ఏ దిశగా సాగుతుందో వేచిచూడాలి. -
ఒక్క అవకాశం ఇవ్వండి: బ్రిటన్ ప్రధాని
లండన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగే విషయమై ప్రధాని థెరెసా మే మంగళవారం పార్లమెంటులో నూతన బ్రెగ్జిట్ విధానాన్ని ప్రతిపాదించారు. దీనిపై అవసరమైతే రెండోసారి ప్రజాభిప్రాయ సేకరణ జరిపించాలన్న అంశాన్నీ పొందుపరిచారు. ప్రతిపక్షాలు కోరుతున్న డిమాండ్లకు చోటు కల్పించారు. బిల్లులో కార్మికులు, దేశ రక్షణ, పర్యావరణం, వలసలకు సంబంధించి మరికొన్ని ప్రతిపాదనలు చేశారు. ఈయూ నుంచి వైదొలగాలన్న తమ నిర్ణయానికి చివరి అవకాశం ఇవ్వాలని బ్రిటన్ ఎంపీలను థెరిసా కోరారు. ప్రజల నిర్ణయం కొరకు అవసరమైతే మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపడదామని, దీనికి సంబందించిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈయూ నుంచి బయటకు రావాలంటూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు పలుమార్లు వీగిపోయిన విషయం తెలిసిందే. ఆమె సొంత పార్టీ సభ్యులే ఓటింగ్లో ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేశారు. కాగా బ్రెగ్జిట్ గడువు ఏప్రిల్ 12తో ముగియనున్న నేపథ్యంలో మరో 6 నెలలు అంటే అక్టోబర్ 31 వరకూ పొడిగిస్తున్నట్లు ఈయూ తెలిపింది.మరోవైపు ఈయూతో ఒక అంగీకారానికి రాలేని పరిస్థితుల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని థెరిసా మే రాజీనామాకు ఆమె కేబినెట్ సహచరులే ఒత్తిడి తెస్తున్నారు. మే ప్రభుత్వ బ్రెగ్జిట్ ప్రతిపాదనలపై పార్లమెంట్లో మరోసారి ఓటింగ్కు రానున్న నేపథ్యంలో కొందరు మంత్రులు, ఎంపీలు పదవి నుంచి వైదొలగాలంటూ ఆమెను హెచ్చరించేందుకు కుట్ర పన్నుతున్నారంటూ అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగా 2016లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ఈయూ నుంచి వైదొలగాలన్న ప్రతిపాదనకు ఆమోదం లభించింది. -
బ్రెగ్జిట్ గడువు అక్టోబర్ 31 వరకు పెంపు
లండన్: యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ విడిపోయేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ గడువు మరోసారి పెరిగింది. బ్రెగ్జిట్ గడువు ఏప్రిల్ 12తో ముగియనున్న నేపథ్యంలో మరో 6 నెలలు అంటే అక్టోబర్ 31 వరకూ పొడిగిస్తున్నట్లు ఈయూ తెలిపింది. ఈ గడువులోగా బ్రెగ్జిట్ బిల్లును బ్రిటన్ పార్లమెంటు ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రధాని థెరెసా మేకు సూచించింది. బెల్జియంలోని బ్రస్సెల్స్లో గురువారం సమావేశమైన 28 ఈయూ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. నిబంధనల మేరకు వచ్చే నెల 23న జరిగే ఈయూ ఎన్నికల్లో బ్రిటన్ పాల్గొనాల్సి ఉంటుందని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్క్లౌడే జంకర్ తెలిపారు. -
మూడోసారీ బ్రెగ్జిట్కు తిరస్కరణే
లండన్: మూడోసారి కూడా బ్రిటన్ ప్రధాని థెరెసా మే తెచ్చిన బ్రెగ్జిట్ బిల్లును ఆ దేశ పార్లమెంటు శుక్రవారం తిరస్కరించింది. దీంతో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకొచ్చే పద్ధతి మరింత సంక్లిష్టమైంది. మే తెచ్చిన తాజా బిల్లుకు పార్లమెంటులో అనుకూలంగా 286 ఓట్లు, వ్యతిరేకంగా 344 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే బ్రెగ్జిట్కు సంబంధించిన అన్ని బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు థెరెసాకు మే 22వ తేదీ వరకు సమయం దొరికేది. వాస్తవానికి గత ప్రణాళిక ప్రకారం శుక్రవారం నుంచే (మార్చి 29) బ్రెగ్జిట్ ప్రక్రియ మొదలు కావాల్సి ఉంది. బ్రెగ్జిట్ బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందక పోవడంతో అది వాయిదా పడింది. -
బ్రెగ్జిట్ అనిశ్చితి.. మే రాజీనామాకు ఒత్తిడి
లండన్: బ్రెగ్జిట్పై యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో ఒక అంగీకారానికి రాలేని పరిస్థితుల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని థెరిసా మే రాజీనామాకు ఆమె కేబినెట్ సహచరులే ఒత్తిడి తెస్తున్నారు. మే ప్రభుత్వ బ్రెగ్జిట్ ప్రతిపాదనలపై వచ్చే వారం పార్లమెంట్లో మరోసారి ఓటింగ్కు రానున్న నేపథ్యంలో కొందరు మంత్రులు, ఎంపీలు పదవి నుంచి వైదొలగాలంటూ ఆమెను హెచ్చరించేందుకు కుట్ర పన్నుతున్నారంటూ అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నేడు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దిగిపోవాలంటూ మే ను హెచ్చరించాలని వారు భావిస్తున్నారనేది ఆ కథనాల సారాంశం. అలా జరిగితే, ఆమె స్థానంలో డిప్యూటీ ప్రధానిగా ఉన్న డేవిడ్ లిడింగ్టన్ ఆపద్ధర్మ ప్రధానిగా అవుతారని పేర్కొన్నాయి. -
ఈ ఏడాది ఇక రేట్ల పెంపు లేదు..!
వాషింగ్టన్: ఈ ఏడాది ఇక రేట్ల పెంపు లేదని అమెరికా ఫెడరల్ రిజర్వ్ స్పష్టమైన సంకేతాలిచ్చింది. అమెరికాలో ఆర్థిక వ్యవస్థ మందగమనంగా ఉండటంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అంచనాలను తగ్గించిన ఫెడరల్ రిజర్వ్ ఫండ్స్ రేటును ప్రస్తుత స్థాయిల్లోనే (2.25 శాతం నుంచి 2.50 శాతం) కొనసాగించాలని నిర్ణయించింది. ఈ ఏడాది మొత్తం దాదాపు ఇదే రేటు కొనసాగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మరోవైపు క్వాంటిటేటివ్ ఈజింగ్(ఉద్దీపన ప్యాకేజీ–క్యూఈ)ని కూడా పూర్తిగా నిలిపేయనున్నది. ఈ విధానంలో మార్కెట్ నుంచి ప్రభుత్వ సెక్యూరిటీలు(బాండ్లు), ఇతర సెక్యూరిటీలను ఫెడరల్ రిజర్వ్ కొనుగోలు చేస్తుంది. తద్వారా వ్యవస్థలోకి నిధులు పంపిస్తూ వడ్డీరేట్లను తక్కువ స్థాయిల్లో ఉండేట్లు చేస్తుంది. ప్రస్తుతం ఫెడరల్ రిజర్వ్ నెలకు 3,000 కోట్ల డాలర్ల మేర సెక్యూరిటీలను కొనుగోలు చేస్తోంది. ఈ ఏడాది మే నుంచి దీనిని నెలకు 1,500 కోట్ల డాలర్లకు తగ్గించనున్నది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ కొనుగోళ్లను పూర్తిగా నిలిపేయనున్నది. కాగా 2020లో మాత్రం ఫండ్స్ రేట్ 2.6 శాతానికి పెరగవచ్చని అంచనా. మరింత స్పష్టత... ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం అంశాలపై స్పష్టత రావడానికి మరింత సమయం పడుతుందని, అప్పుడు పాలసీ మార్పుపై కూడా స్పష్టత వస్తుందని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యానించారు. రేట్ల పెంపు విషయమై నిర్ణయం తీసుకోవడానికి మరింత ఓపికతో ఎదురుచూస్తామని ఆయన మరోసారి పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మంచి స్థాయిలో ఉందని, ఆర్థిక వ్యవస్థ అంచనాలు సానుకూలంగానే ఉన్నాయని పావెల్ పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం, అమెరికా–చైనాల మధ్య చర్చలు, అమెరికా ఆర్థిక వ్యవస్థ అవుట్లుక్ తదితర అంశాలు సమస్యాత్మకంగానే ఉన్నాయని, వీటన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తున్నామని వివరించారు. 2018లో భారీగా పన్నులు తగ్గించడం, ప్రభుత్వ వ్యయం పెంచడం వల్ల వృద్ధి పుంజుకుంది. అయితే ఈ ఏడాది ఆరంభంలో కుటుంబాల వ్యయాలు తగ్గడం, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గడం వల్ల ఆర్థిక వ్యవస్థలో మందగమనం చోటు చేసుకుందేమోనన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అందుకే ఈ ఏడాది రేట్లను పెంచకూడదని ఫెడరల్ రిజర్వ్ నిర్ణయించిందని నిపుణులు అంటున్నారు. గతేడాది 3 శాతంగా ఉన్న అమెరికా వృద్ధి ఈ ఏడాది 2.1 శాతానికే పరిమితం కావచ్చని ఫెడరల్ రిజర్వ్ అంచనా వేస్తోంది. నిరుద్యోగ రేటు 3.7 శాతంగా, ద్రవ్యోల్బణం 1.8 శాతంగా ఉండొచ్చన్న అంచనాలను వెలువరించింది. మార్కెట్లకు బూస్ట్.... ఫెడ్ ప్రకటన వెలువడగానే బుధవారం అమెరికా స్టాక్ సూచీలు దూసుకుపోయాయి. కానీ చివరకు ఆ లాభాలన్నీ కోల్పోయి ఫ్లాట్గా ముగిశాయి. గురువారం హాంగ్సెంగ్ మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు, డ్యాక్స్ మినహా మిగిలిన యూరప్ మార్కెట్లు కూడా మంచి లాభాల్లో ట్రేడయ్యాయి. గురువారం అమెరికా మార్కెట్లు కూడా మళ్లీ పుంజుకుని భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఊ ఫెడ్ తాజా నిర్ణయాలు మన మార్కెట్లపై బాగానే ప్రభావం చూపుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వారి అంచనాల ప్రకారం... శుక్రవారం భారత్ స్టాక్ సూచీలు భారీగా లాభపడే అవకాశాలున్నాయి. ► ఫెడ్ నిర్ణయంతో డాలర్ ఇప్పటికే పడిపోయింది. దీంతో రూపాయి మరింతగా పుంజుకోవచ్చు. ► ఆర్థిక వ్యవస్థ మందగమనంగా ఉండగలదన్న ఫెడ్ అంచనాల కారణంగా సురక్షిత పెట్టుబడి సాధనంగా పుత్తడికి మరింత డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయి. బంగారం ధరలు పెరుగుతాయి. -
గూగుల్కు భారీ జరిమానా
ఆన్లైన్ సెర్చి ఇంజీన్ దిగ్గజం గూగుల్కు మరో భారీ షాక్ తగిలింది. యూరొపియన్ యూనియన్కి చెందిన కాంపిటిషన్ కమిషన్ గూగుల్కు భారీ జరిమానా విధించింది. నిబంధనలకు విరుద్ధంగా ఓ సంస్థకు ప్రకటనల రూపంలో మేలు చేసినందుకుగాను యురొపియన్ యూనియన్లోని కాంపిటిషన్ కమిషన్ 1.49 బిలియన్ యూరోల పెనాల్టీ విధించింది. గూగుల్ తన విధులను మర్చిపోయి నమ్మకాన్ని కోల్పోయిందంటూ.. యూరోపియన్ యూనియన్ యాంటీ ట్రస్ట్ రెగ్యులేటరీ గూగుల్పై భారీ మొత్తంలో జరిమానా విధించింది. ఈ మేరకు కాంపిటిషన్ కమిషనర్ మార్గరెట్ వెస్టగర్ బుధవారం ఆదేశాలు జారీచేశారు. గూగుల్ తన అధికారాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోంది.. దాని వల్ల కొన్ని కంపెనీలు లాభాలు గడిస్తున్నాయన్నారు. వినియోగదారులు మోసపోతున్నారని వెస్టాగర్ వెల్లడించారు. కాగా గత రెండేళ్లలో ఇంత పెద్ద మొత్తంలో పెనాల్టీ విధించడం ఇది మూడవసారి అని తెలుస్తోంది. -
బ్రెగ్జిట్కు జూన్ 30 దాకా గడువివ్వండి
లండన్: యురోపియన్ యూనియన్ నుంచి వైదొలిగేందుకు జూన్ 30 వరకు గడువు ఇవ్వాలని బ్రిటన్ ఈయూ నాయకులను కోరింది. ఈ మేరకు ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్కు లేఖ రాసినట్లు బ్రిటన్ ప్రధాని థెరిసా మే బుధవారం పార్లమెంట్లో చెప్పారు. జూన్ 30కి మించి గడువు కోరుకోవడం లేదని, అంతకన్నా ఆలస్యమైతే మే నెల చివరన ఈయూ పార్లమెంట్ ఎన్నికలను బ్రిటనే నిర్వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాగా, గురువారం, శుక్రవారం బ్రసెల్స్లో జరిగే శిఖరాగ్ర సమావేశంలో ఈయూ సభ్య దేశాలు బ్రిటన్ వినతిపై ఏకాభిప్రాయంతో ఓ నిర్ణయం తీసుకోనున్నాయి. -
డీల్ లేని ‘బ్రెగ్జిట్’ వద్దు
లండన్: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వెనుదిరిగే బ్రెగ్జిట్ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒప్పందం లేకుండానే నిష్క్రమించాలని ప్రధాని థెరిసా మే చేసిన తాజా ప్రతిపాదన దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్లో గట్టెక్కలేకపోయింది. బిల్లుపై జరిగిన ఓటింగ్లో ప్రభుత్వం 43 ఓట్ల తేడాతో ఓటమిపాలైంది. 321 మంది సభ్యులు అనుకూలంగా, 278 మంది వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో బ్రెగ్జిట్ ప్రక్రియకు సంబంధించి మే ప్రభుత్వం తెచ్చిన ప్రతిపాదనలు రెండుసార్లు వీగిపోయినట్లయింది.షెడ్యూల్ ప్రకారమైతే మార్చి 29న యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటికి రావాల్సి ఉంది. కానీ తాజా పరిణామం నేపథ్యంలో ఆ తేదీన ఒప్పందం లేకుండా నిష్క్రమించడం సాధ్యం కాదని ప్రభుత్వం ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. బ్రెగ్జిట్ ప్రక్రియ పర్యవేక్షణను పార్లమెంట్కు అప్పగించాలని విపక్ష లేబర్ పార్టీ నాయకుడు జెరెమీ కోర్బిన్ డిమాండ్ చేశారు. సభ్యుల మధ్య రాజీకి ప్రయత్నిస్తానని చెప్పారు. రెండో రెఫరెండానికి తిరస్కరణ బ్రెగ్జిట్ కోసం రెండో రెఫరెండం నిర్వహించాలన్న ప్రతిపాదనను బ్రిటన్ పార్లమెంట్ గురువారం భారీ మెజారిటీతో తిరస్కరించింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా 334 మంది, అనుకూలంగా 85 మంది ఓటేశారు. విపక్ష లేబర్ పార్టీ సభ్యులు చాలా మంది ఓటింగ్కు దూరంగా ఉన్నారు. ఒకవేళ ఈ సవరణ దిగువ సభ హౌజ్ ఆఫ్ కామన్స్లో గట్టెక్కినా, ప్రభుత్వం దానిని తప్పకుండా అమలుచేయాల్సిన అవసరం లేదు. -
‘బ్రెగ్జిట్ జరగకుంటే సంక్షోభమే’
గ్రిమ్స్బై: బ్రెగ్జిట్ విషయంలో యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలు మరో అడుగు ముందుకేయాలని బ్రిటన్ ప్రధాని థెరెసా మే విజ్ఞప్తి చేశారు. లేదంటే బ్రెగ్జిట్ ఎన్నటికీ జరగదనీ, సంక్షోభం నెలకొంటుందని హెచ్చరించారు. ఈయూ నుంచి బ్రిటన్ విడిపోయేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ బిల్లును బ్రిటిష్ పార్లమెంటు తిరస్కరించింది. ‘వచ్చే మంగళవారం జరిగే ఓటింగ్లో బ్రెగ్జిట్ బిల్లు తిరస్కరణకు గురైతే మిగిలేది సంక్షోభమే. అంతిమంగా బ్రిటన్ ఈయూ నుంచి ఎన్నటికీ విడిపోదు’ అని మే అన్నారు. 2016లో జరిగిన బ్రెగ్టిట్ లో ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవాలని 51.9 శాతం మంది బ్రిటిషర్లు ఓటేశారు. -
భారత్ మంచిపని చేసింది
సాక్షి, న్యూఢిల్లీ: భారత వైమానిక దళాలు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద స్థావరాలపై జరిపిన దాడికి ప్రపంచ దేశాలు బాసటగా నిలుస్తున్నాయి. భారత దళాల దాడులను యూరోపియన్ యూనియన్ సమర్థించింది. పాకిస్తాన్ భూభాగంపై గల ఉగ్రవాద సంస్థలను నిర్మూలించాలని ఈయూ పేర్కొంది. ఉగ్రవాదాన్ని అంతంచేయడంలో భారత చర్యను తాము సమర్థిస్తున్నామని ఈయూ అధికార ప్రతినిధి మాజా కొసిజనీక్ తెలిపారు. భారత వైమానిక దాడులపై ఆస్ట్రేలియా స్పందించింది. ఉగ్రవాదాన్ని అరికట్టడం అత్యవసరమని ఆ దేశ విదేశాంగ మంత్రి మారిజ్ పేనే అభిప్రాయపడ్డారు. ఉగ్రవాద స్థావరాలకు ఆశ్రయం ఇస్తున్న పాక్.. వెంటనే వాటిని నిర్మూలించాలని ఆదేశించారు. పుల్వామా దాడికి కారణమైన జైషే మహ్మద్ సహా పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలన్నిటికీ తక్షణమే చెక్ పెట్టాలని ఆస్ట్రేలియా కోరింది. పుల్వామా ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మారిజ్ పేనే పేర్కొన్నారు. పుల్వామా ఉగ్రదాడి, ఆ తరువాత భారత వైమానిక దాడుల నేపథ్యంలో ఆమె స్పందిస్తూ.. ‘‘పాకిస్తాన్లో స్థావరం పొందుతున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ను నిర్మూలించేందుకు పాక్ సాధ్యమైన ప్రయత్నాలన్నీ చేయాలి. లష్కరే తొయిబా మూకలను కూడా తుదముట్టించాలి. పాక్ గడ్డపై కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థలకు ఇకపై చట్టపరంగా, భౌతికంగా ఏమాత్రం చోటివ్వకూడదు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించి, వివాదాలు పరిష్కరించుకునేందుకు ఇదొక్కటే మార్గం...’’ అని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య శాంతికి విఘాతం కలిగించే ఎలాంటి చర్యలకు దిగరాదని భారత్, పాకిస్తాన్లను ఆస్ట్రేలియా కోరింది. కాగా ఉగ్రవాదాన్ని అణచివేయడంలో భారత్ మంచిపని చేసింది అఫ్గానిస్తాన్ వ్యాఖ్యానించింది. పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానికి దళాలు చేసిన దాడులన అఫ్గాన్ సమర్థించింది. ఇరు దేశాలు సమయం పాటించాలని చైనా సూచించిన విషయం తెలిసిందే. -
తీవ్ర ఒడిదుడుకులు
తీవ్ర హెచ్చుతగ్గుల్లో సాగిన బుధవారం నాటి ట్రేడింగ్లో స్టాక్ మార్కెట్ అక్కడక్కడే ముగిసింది. ప్రపంచ భౌగోళిక, రాజకీయ అనిశ్చితిల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవడం, డాలర్తో రూపాయి మారకం విలువ పడిపోవడం ప్రతికూల ప్రభావం చూపించాయి. ట్రేడింగ్ మొత్తంలో 184 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 3 పాయింట్ల లాభంతో 36,321 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 3 పాయింట్లు పెరిగి 10,890 పాయింట్ల వద్దకు చేరింది. ఆరంభ లాభాలు ఆవిరి... చైనా కేంద్ర బ్యాంక్ బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా 8,300 కోట్ల డాలర్ల నిధులను గుమ్మరించనున్నదన్న వార్తల కారణంగా ఆసియా మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. దీంతో సెన్సెక్స్ 50 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ను ఆరంభించింది. బ్రెగ్జిట్ బిల్లు వీగిపోవడంతో యూరప్ మార్కెట్లు మిశ్రమంగా మొదలయ్యాయి. దీంతో మన మార్కెట్లో ఆటు పోట్లు నెలకొన్నాయి. సెన్సెక్స్ ఒక దశలో 144 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 40 పాయింట్ల వరకూ పతనమైంది. మొత్తం మీద రోజంతా 184 పాయింట్ల రేంజ్లో కదలాడింది. బ్రిటన్లో అనిశ్చితి... యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి వైదొలిగే బ్రెగ్జిట్ బిల్లు బ్రిటన్ పార్లమెంట్లో భారీ మెజారిటీతో వీగిపోయింది. దీంతో ఈ బిల్లును ప్రవేశపెట్టిన బ్రిటన్ ప్రధాని థెరిసా మేపై అవిశ్వాస తీర్మానం వచ్చే అవకాశముందని, ఎన్నికలు కూడా రావచ్చనే రాజకీయ అనిశ్చితి నెలకొన్నది. దీంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. లండన్ ఎఫ్టీఎస్ఈ 0.6 శాతం పతనం కాగా, ఇతర యూరప్ మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్ల లిస్టింగ్ ఐడీఎఫ్సీ బ్యాంక్లో క్యాపిటల్ ఫస్ట్ కంపెనీ విలీనం కారణంగా ఏర్పడిన ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు బుధవారం స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. బీఎస్ఈలో ఈ షేర్ రూ.47 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. 2.7 శాతం లాభంతో రూ.48 వద్ద ముగిసింది. ఈ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.23,071 కోట్లుగా ఉంది. ఈ బ్యాంక్ రుణాలు రూ.1.02 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొత్తం రుణాల్లో రిటైల్ రుణాలు 32 శాతంగా ఉన్నాయి. ► జెట్ ఎయిర్వేస్ కంపెనీ పునరుజ్జీవన ప్రణాళికపై అనిశ్చితి నెలకొనడంతో జెట్ ఎయిర్వేస్ షేర్లు నష్టపోయాయి. ఈ కంపెనీ భాగస్వామి ఎతిహాద్ జెట్ ఎయిర్వేస్లో మరింత వాటాను కొనుగోలు చేయనున్నదని, అయితే ఒక్కో షేర్ను రూ.150కు మాత్రమే ఆఫర్ ఇచ్చిందన్న వార్తల కారణంగా ఈ షేర్ భారీగా పతనమైంది. బీఎస్ఈలో జెట్ ఎయిర్వేస్ షేర్ 8 శాతం తగ్గి రూ.271 వద్ద ముగిసింది. ► క్యూ3లో ఆర్థిక ఫలితాలు అదిరిపోవడంతో స్పెషాల్టీ రెస్టారెంట్ షేర్ 20 శాతం అప్పర్ సర్క్యూట్తో రూ.98 వద్ద ముగిసింది. -
బ్రిటన్లో కొత్త వీసా విధానం!
లండన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ బయటకొచ్చిన (బ్రెగ్జిట్) అనంతరం ఆ దేశ వలస విధానంలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత బ్రిటన్ తన వలస నిబంధనల్లో భారీ మార్పులు చేపడుతోంది. బ్రెగ్జిట్ అనంతరం వీసాలు, వలసల విషయంలో అవలంబించాల్సిన వ్యూహాలపై రూపొందించిన శ్వేతపత్రాన్ని బుధవారం ఆ దేశ పార్లమెంటులో హోంశాఖ మంత్రి సాజిద్ జావీద్ ప్రవేశపెట్టారు. అత్యున్నత నైపుణ్యానికి పట్టం గట్టేలా ఉన్న ప్రతిపాదిత విధానం భారతీయ విద్యార్థులకు, వృత్తి నిపుణులకు ప్రయోజనకరమని నిపుణులు భావిస్తున్నారు. ఈ విధానం ప్రకారం ప్రపంచంలోని ఏ ప్రాంతం వారైనా తగిన ప్రతిభా సంపత్తి ఉన్నట్టయితే బ్రిటన్లో పని చేసేందుకు వీలవుతుంది. విదేశీ విద్యార్థులు బ్రిటన్లో చదువుకుంటే వారి విద్యాభ్యాసం పూర్తయిన అనంతరం పనిచేసుకునే అవకాశాలు కూడా మెరుగవుతాయి. ఈ విధానం బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత (2021 డిసెంబర్ తర్వాత) 2025 వరకూ దశలవారీగా అమలవుతుంది. దీని ప్రకారం ఈయూ సహా ప్రపంచం మొత్తానికీ ఒకే రకమైన వలస విధానాన్ని బ్రిటన్ అమలులోకి తెస్తుంది. ఇప్పటిలా ఈయూలోని 28 దేశాల ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు వీలుండదు. అయితే ఈయూ నుంచి వచ్చే సందర్శకులు మాత్రం వీసా లేకుండా బ్రిటన్ సందర్శించవచ్చు. వీసాల సంఖ్యపై పరిమితులుండవు.. ప్రస్తుతం బ్రిటన్ ఏడాదికి 20,700 ఉద్యోగ వీసాలు (టైర్ 2 వీసాలు) జారీ చేస్తోంది. బ్రెగ్జిట్ తర్వాత ఇలాంటి పరిమితులు ఏమీ ఉండబోవు. దీంతో వైద్యం, ఐటీ సహా వివిధ రంగాలకు చెందిన భారతీయ నిపుణులకు ఈ విధానం లబ్ధి చేకూర్చగలదని భావిస్తున్నారు. కొద్దిపాటి నైపుణాలు ఉన్న ఉద్యోగులు/కార్మికులు ఏడాది వీసాపై వెళ్లి పని చేసేందుకు కూడా ఈ విధానం వీలు కల్పిస్తుంది. అయితే ఇలాంటి వారు తమతో కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు, యూకేలో నివాస హక్కులు అడిగేందుకు అంగీకరించబోమని బ్రిటన్æ హోం మంత్రిత్వ కార్యాలయం తెలిపింది. ఈ తరహా వీసాలు కొన్ని దేశాలకు మాత్రమే ఇవ్వాలనేది వలస విధానంలోని ఒక అంశం. ఇందులో భారత్ కూడా ఉన్నదా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. బ్రిటన్లో ఇప్పటివరకు నైపుణ్యాలు అంతగా అవసరం లేని ఉద్యోగాలను అధికభాగం యూరప్ దేశాల ప్రజలే చేస్తున్నారు. అయితే ఐదేళ్లపాటు విదేశీ నిపుణులను కంపెనీలు నియమించుకుంటే వారికి కనీస వేతనం 30,000 పౌండ్లు ఉండాలనే అంశం వివాదాస్పదంగా మారింది. దీనిపై కంపెనీలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులు ఆరునెలల పాటు బ్రిటన్లో ఉండి ఉద్యోగం చేసుకునేందుకు ఈ విధానం అవకాశం కల్పిస్తుంది. -
బ్రెగ్జిట్ ఒప్పందానికి ఈయూ ఓకే
లండన్/బ్రస్సెల్స్: బ్రెగ్జిట్ కోసం యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో బ్రిటన్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆదివారం ఈయూ నేతలు ఆమోదించారు. బ్రిటన్ మినహా ఈయూలో మిగిలిన మొత్తం 27 దేశాలూ ఈ ఒప్పందానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఇక డిసెంబర్లో బ్రెగ్జిట్ ఒప్పందాన్ని బ్రిటన్ పార్లమెంటు ఆమోదించాల్సి ఉంది. అయితే ఇది అంత సులభమైన విషయంలా కనిపించడం లేదు. బ్రిటన్ ప్రధాని థెరెసా మే కుదుర్చుకున్న ఒప్పందం బ్రిటన్కు నష్టం చేకూర్చేలా ఉందంటూ ఆమె సొంత మంత్రివర్గంలోని వ్యక్తులే రాజీనామా చేసి వెళ్లిపోవడం, సొంత పార్టీ ఎంపీలే మేపై అవిశ్వాస నోటీసులు ఇవ్వడం తెలిసిందే. ఇది బ్రిటన్కు ఎంతో మేలు చేసే ఒప్పందమేననీ, ఇంతకన్నా మంచి ఒప్పందాన్ని ఎవరూ కుదర్చలేరనీ ఆమె వాదిస్తున్నప్పటికీ చాలా మంది ఆమెకు వ్యతిరేకంగానే ఉన్నారు. బ్రిటన్ పార్లమెంటు ఆమోదం అనంతరం ఈ ఒప్పందాన్ని ఈయూ పార్లమెంటు కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఇదంతా 2019 మార్చి 29కి ముందే పూర్తయ్యి, అప్పటి నుంచి ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడం ప్రారంభం కావాల్సి ఉంది. ఈ ప్రక్రియ మొత్తానికి 21 నెలలు పడుతుంది. ఒకవేళ ఒప్పందాన్ని బ్రిటన్ పార్లమెంటు ఆమోదించకపోతే పరిస్థితి దిగజారి, అసలు ఒప్పందమే లేకుండా ఈయూ నుంచి బ్రిటన్ బయటకు రావాల్సి రావచ్చు, లేదా కొత్త ఒప్పందం కోసం మళ్లీ చర్చలు జరగొచ్చు. మే ప్రభుత్వం కూలిపోయి బ్రిటన్లో మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం కూడా ఉంది. -
నన్ను తొలగిస్తే ‘బ్రెగ్జిట్’ సంక్లిష్టం: థెరిసా
లండన్: తనని పదవి నుంచి తొలగిస్తే యూరోపియన్ యూనియన్(ఈయూ)తో బ్రెగ్జిట్ చర్చలు క్లిష్టతరమవుతాయని బ్రిటన్ ప్రధాని థెరిసా మే తన పార్టీ ఎంపీలను హెచ్చరించారు. భవిష్యత్లో బ్రిటన్–ఈయూ సంబంధాలపై కూడా ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమించేందుకు కుదుర్చుకున్న ఒప్పందం ముసాయిదా విషయంలో ప్రధానితో అధికార కన్జర్వేటివ్ ఎంపీలు పలువురు విభేదించిన సంగతి తెలిసిందే. వచ్చే వారం రోజులు బ్రిటన్కు కీలకమని, ఈయూ నాయకులతో సమావేశమై మరిన్ని చర్చలు జరుపుతానని చెప్పారు. అవిశ్వాస తీర్మానానికి అవసరమైన 48 మంది సభ్యుల మద్దతును రెబెల్ ఎంపీలు కూడగట్టారా? అని ప్రశ్నించగా..ఇప్పటి వరకైతే లేదని బదులిచ్చారు. -
యూరోప్ దేశాల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
యూరోపియన్ దేశాలైన డెన్మార్క్, స్వీడన్, ఫ్రాన్స్, నార్వే, లాత్వియా, జర్మనీల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. యూరోప్ తెలంగాణ అసోసియేషన్ (ఈటా) ఆధ్వర్యంలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయని ఈటా వ్యవస్థాపకుడు శ్యామ్ బాబు ఆకుల తెలిపారు. డెన్మార్క్లో రాజిరెడ్డి గడ్డం, రూపేష్ జైస్వాల్ నిర్వహించగా, స్వీడన్లో మహేందర్ శర్మ, ఫ్రాన్స్లో నీల శ్రీనివాస్, నార్వేలో వై వీ శ్రీనివాస్, లాత్వియాలో క్రాంతి పాశికంటి, జర్మనీలో ఈటా సభ్యుల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. -
బ్రిటన్ వీసా రుసుము రెట్టింపు!
లండన్: యూరోపియన్ యూనియన్ బయటి దేశాల నుంచి బ్రిటన్కు వచ్చే వలసదారులపై విధించే హెల్త్ సర్చార్జీని ఆ దేశం డిసెంబరు నుంచి రెండింతలు చేయనుంది. దీంతో భారత్ సహా పలు దేశాల నుంచి బ్రిటన్కు వెళ్లే పౌరులు, విద్యార్థులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వీసా ఫీజు కింద మరింత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వలస వీసాదారులు ఏడాదికి 200 (దాదాపు రూ. 19,400) పౌండ్లు, విద్యార్థి వీసా కలిగినవారు ఏడాదికి 150 (దాదాపు రూ. 14,540) పౌండ్లు సర్చార్జీ కింద చెల్లిస్తున్నారు. ఈ రుసుము వీసా ఫీజులో కలిపి ఉంటుంది. తాజాగా ఈ మొత్తాన్ని బ్రిటన్ రెండింతలు చేయాలని నిర్ణయించింది. దీంతో వలస వీసాదారులు 400 (దాదాపు రూ. 38,800) పౌండ్లు, విద్యార్థి వీసాదారులు 300 (దాదాపు రూ. 29,080) పౌండ్లను చెల్లించాల్సి ఉంటుంది. బ్రిటన్ జాతీయ ఆరోగ్య సేవల పథకం (ఎన్హెచ్ఎస్)కు నిధుల సమీకరణ కోసం హెల్త్ సర్చార్జీని 2015లో ప్రవేశపెట్టారు. తాజా పెంపు కారణంగా ఎన్హెచ్ఎస్కు ఏడాదికి 22 కోట్ల పౌండ్ల అదనపు నిధులు అందుతాయి. బ్రిటన్ పౌరులతోపాటు 6 నెలలకు పైగా ఆ దేశంలో ఉండేందుకు వీసా మంజూరైన వారంతా ఈ రుసుము చెల్లించాలి. అయితే తాజా పెంపు నుంచి యూరోపియన్ యూనియన్ దేశాల పౌరులను మినహాయించారు. వారూ చెల్లించడం సమంజసమే: మంత్రి ఆరోగ్య పథకాన్ని వలసదారులకూ వర్తింపజేస్తున్నందున వారి నుంచి ఈ పథకానికి నిధులను సేకరించడం సమంజసమేనని బ్రిటన్ వలసల శాఖ మంత్రి కరోలిన్ నోక్స్ చెప్పారు. ‘అవసరమైనప్పుడు మా ఆరోగ్యసేవల పథకం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. దీర్ఘకాలం బ్రిటన్లో ఉండే వలసదారులు ఈ సేవలను వాడుకోవడాన్ని మేం స్వాగతిస్తాం. కానీ ఇది మా దేశానికి సంబంధించినది, అంతర్జాతీయ ఆరోగ్య పథకం కాదు. వలసదారులకూ మేం ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నందున వారు కూడా ఇందుకు కొంత మొత్తం చెల్లించడం సమంజసంగా ఉంటుంది.’ అని ఆమె వివరించారు. బ్రిటన్ పార్లమెంటు ఆమోదం తర్వాత డిసెంబరులో సర్చార్జీ పంపు అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన బిల్లును గురువారమే హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రవేశపెట్టారు. బ్రిటన్లో ఆరు నెలల కన్నా ఎక్కువ కాలం ఉండాలనుకునే వలసదారులు.. స్వదేశానికి తిరిగొచ్చే వరకూ ఈ హెల్త్ సర్చార్జీని ప్రతి ఏటా చెల్లించాలి. -
హార్లీ డేవిడ్సన్ బాయ్కాట్
అమెరికాకు, యూరోపియన్ యూనియన్కు మధ్య నెలకొన్న టారిఫ్ వార్ దెబ్బ, అమెరికా అతిపెద్ద మోటార్సైకిల్ తయారీదారి హార్లీ డేవిడ్ సన్కు తగిలిన సంగతి తెలిసిందే. టారిఫ్ వార్ నుంచి బయటపడేందుకు హార్లీ డేవిడ్సన్.. తన బైకుల ఉత్పత్తిని అమెరికా వెలుపల చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఒకవేళ హార్లీ డేవిడ్సన్ కనుక అమెరికా వెలుపల ఉత్పత్తిని చేపడితే, వినియోగదారులు ఈ బైకులను బాయ్కాట్ చేయనున్నారు. వినియోగదారులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతిస్తున్నారు. అంతేకాక వినియోగదారులను పొగుడుతూ... గ్రేట్ అని ప్రశంసలు కురిపించారు. దీనిపై ట్రంప్ ఒక ట్వీట్ కూడా చేశారు. ‘ఒకవేళ అమెరికా వెలుపల హార్లీ డేవిడ్సన్ ఉత్పత్తిని ప్రారంభిస్తే చాలా మంది హార్లీ డేవిడ్సన్ యజమానాలు కంపెనీని బాయ్కాట్ చేయాలనుకుంటున్నారు. గ్రేట్! చాలా కంపెనీలు ముఖ్యంగా హార్లీ ప్రత్యర్థులు మా బాటలో నడుస్తున్నాయి. కానీ ఇది చాలా చెత్త తరలింపు’ అని ట్రంప్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ట్రంప్ చేసిన ఈ ట్వీట్పై హార్లీ డేవిడ్సన్ ఇంకా స్పందించలేదు. ట్రంప్ కార్యాలయానికి, హార్లీ డేవిడ్సన్ కంపెనీకి గత కొన్ని రోజులుగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు విదేశాల నుంచి వచ్చే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై ట్రంప్ భారీ మొత్తంలో టారిఫ్లు విధించారు. ట్రంప్ ఆ నిర్ణయానికి కౌంటర్గా యూరోపియన్ యూనియన్ కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువుపై పన్నులు విధించింది. వాటిలో హార్లీ మోటార్సైకిల్స్ కూడా ఉన్నాయి. దీంతో హార్లీ డేవిడ్సన్ ఏడాదికి 100 మిలియన్ డాలర్లను కోల్పోవాల్సి వస్తుంది. భారీగా ఆదాయం కోల్పోతుండటంతో, కంపెనీకి చెందిన కొంత ఉత్పత్తిని అమెరికా వెలుపల చేపట్టనున్నట్టు కంపెనీ ప్రకటించింది. కంపెనీ కొన్ని ఆపరేషన్లను థాయ్లాండ్ తరలించాలని చూస్తున్నట్టు కంపెనీ వర్గాలు చెప్పాయి. ఇప్పటికే కొంత ఉత్పత్తిని తరలించినట్టు హార్లీ డేవిడ్సన్ చెప్పింది. అమెరికాలోకి వచ్చే ఇతర మోటార్ సైకిల్ కంపెనీలతో కలిసి తాము పనిచేస్తామని ట్రంప్ గత నెలలోనే చెప్పారు. -
మరో శిఖరాగ్ర భేటీకి సిద్ధమైన ట్రంప్
హెల్సింకి: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్తో సింగపూర్లో చారిత్రక శిఖరాగ్ర భేటీ అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాంటి మరో సమావేశానికి సిద్ధమయ్యారు. అమెరికాతో అత్యంత బలహీన సంబంధాలు ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ట్రంప్ సోమవారం ఫిన్లాండ్లో భేటీ కానున్నారు. ట్రంప్, పుతిన్ ఏకాంతంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోనుండటం (వన్ టు వన్) ఇదే తొలిసారి. వీరు భేటీ అయ్యే గదిలో అనువాదకులు తప్ప మరెవరూ ఉండరు. ఫిన్లాండ్ అధ్యక్ష భవనంలోని గోథిక్ హాల్లో ట్రంప్, పుతిన్లు సమావేశమవుతారు. ప్రస్తుతం అమెరికా, రష్యా ద్వైపాక్షిక సంబంధాలు ఏ మాత్రం బాగా లేవనీ, బలమైన బంధం కోసం ప్రయత్నం ప్రారంభిస్తున్నామని రష్యా ప్రభుత్వ సలహాదారు యూరీ ఉషకోవ్ వెల్లడించారు. ట్రంప్ను ‘సంప్రదింపులు జరిపే నేత’గా తాము పరిగణిస్తున్నామని ఆయన చెప్పారు. మరోవైపు గతంలో రష్యా కోసమే పనిచేసిన ఓ గూఢచారిపై రష్యానే బ్రిటన్లో విషప్రయోగం చేసిందన్న ఆరోపణలు, సిరియా అంతర్యుద్ధంలో అక్కడి ప్రభుత్వానికి రష్యా మద్దతు, క్రిమియాను ఆక్రమించుకోవడం, రష్యాతో ట్రంప్ కఠినంగా వ్యవహరించట్లేదంటూ నాటో సభ్య దేశాల భయాలు తదితర అంశాల నేపథ్యంలో ట్రంప్, పుతిన్ల శిఖరాగ్ర భేటీపై ఉత్కంఠ నెలకొంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్లతో ఘర్షణాత్మక వాతావరణం నుంచి స్నేహం వైపు మళ్లిన ట్రంప్, ఇప్పుడు పుతిన్తో కూడా అదే రీతిలో వ్యవహరిస్తారో లేదోనని అమెరికా, రష్యాల మిత్రదేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ట్రంప్తో సన్నిహిత బంధానికే పుతిన్ మొగ్గు చూపొచ్చనీ, ట్రంప్ కూడా అందుకు సానుకూలంగానే స్పందిస్తారని నిపుణులు అంటున్నారు. భారీ అంచనాలేమీ లేవు: ట్రంప్ పుతిన్తో భేటీపై ట్రంప్ శుక్రవారం మాట్లాడుతూ ‘నేనేమీ భారీ అంచనాలతో ఈ సమావేశానికి వెళ్లడం లేదు. కానీ ఈ భేటీ ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉండే అవకాశం ఉంది. ఆ ఫలితాలు సానుకూలంగా ఉండొచ్చు తప్ప చెడు జరగదు’ అని అన్నారు. తాను రష్యాతో తొలి నుంచీ కఠినంగానే వ్యవహరిస్తున్నాననీ, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం అంశాన్ని కూడా పుతిన్తో చర్చల్లో కచ్చితంగా ప్రస్తావనకు తెస్తానని ట్రంప్ చెప్పారు. 12 మంది రష్యా మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డెమొక్రాట్ల అకౌంట్లను హ్యాక్ చేశారంటూ వారిపై ఇటీవలే అమెరికా నేరాభియోగాలు మోపింది. ఆ 12 మందిని తమకు అప్పగించాలని కూడా తాను పుతిన్ను కోరే అవకాశం ఉందని ట్రంప్ చెప్పారు. నేరాభియోగాలు నమోదైన నేపథ్యంలో పుతిన్తో భేటీని రద్దు చేసుకోవాలని డెమొక్రాట్లు నాలుగు రోజుల క్రితం ట్రంప్ను కోరినా, శ్వేతసౌధం తిరస్కరించింది. కాగా, రష్యాను తిరిగి జీ–7 కూటమిలో చేర్చి, మళ్లీ జీ–8గా మార్చాలని కూడా ట్రంప్ గతంలో వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఇప్పుడు వారు చర్చిస్తే ఫలితం ఎలా ఉంటుందోనని అమెరికా మిత్రదేశాలు ఆందోళన చెందుతున్నాయి. శత్రువులే కానీ..: రష్యాతోపాటు చైనా, యూరోపియన్ యూని యన్ (ఈయూ) అమెరికాకు శత్రువులని ట్రం ప్ ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ‘మాకు చాలా మంది శత్రువులున్నారని నేననుకుంటాను. ఈయూ ఒక శత్రువు. వాణిజ్యంలో వారు మాకు ఏం చేస్తున్నారు? కొన్ని అంశాల్లో రష్యా కూడా శత్రువే. ఆర్థికాంశం పరంగా చైనా మాకు కచ్చితంగా శత్రువే. అయితే వీళ్లంతా చెడ్డవాళ్లని కాదు. పోటీ తత్వం ఉన్నవారు మాత్రమే’ అని ట్రంప్ చెప్పారు. కాగా, బ్రిట న్లో ట్రంప్కు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు నిరసనలు చేపట్టడం తెలిసిందే. ఫిన్లాండ్లోనూ ట్రంప్ అదే పరిస్థితిని ఎదుర్కోనున్నారు. -
ఈయూపై ట్రంప్ కేసు వేయమన్నారు
లండన్: బ్రెగ్జిట్ విషయంలో యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో చర్చలకు బదులు దానిపై కేసు వేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు సూచించారని బ్రిటన్ ప్రధాని థెరెసా మే ఆదివారం వెల్లడించారు. నాలుగు రోజుల బ్రిటన్ పర్యటనలో భాగంగా ట్రంప్ శుక్రవారం మేతో భేటీ అవ్వడం తెలిసిందే. అంతకు రెండ్రోజుల ముందు కూడా.. మే అనుసరిస్తున్న బ్రెగ్జిట్ వ్యూహాలను ట్రంప్ విమర్శించారు. శుక్రవారం సంయుక్త విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ ‘ఈయూతో ఎలా వ్యవహరించాలనే దానిపై నేను థెరెసాకు ఓ సలహా ఇచ్చాను. ఆమెకు అది బహుశా క్రూరమైనదిగా, చాలా క్లిష్టమైనదిగా అనిపించవచ్చు’ అని అన్నారు. ఆ సలహా ఏంటో చెప్పాలని ఓ విలేకరి ఆదివారం మేను కోరగా ‘నేను ఈయూతో చర్చలు జరపకుండా దానిపై కేసు వేయాలని ఆయన చెప్పా రు’ అని అన్నారు. అయితే తాను ఈయూతో చర్చలతోనే ముందుకెళ్తాననీ ఆమె చెప్పారు. -
బ్రిటన్లో ‘బ్రెగ్జిట్’ చిచ్చు
లండన్: బ్రిటన్ ప్రధాని థెరీసామే చిక్కుల్లో పడ్డారు. సోమవారం ఇద్దరు సీనియర్ మంత్రులు రాజీనామా చేయడంతో.. బ్రిటన్ రాజకీయం వేడెక్కింది. బ్రెగ్జిట్ విషయంలో మే అనుసరిస్తున్న వ్యూహాలతో విభేదిస్తూ బ్రెగ్జిట్ మంత్రి డేవిడ్ డేవిస్ రాజీనామా చేయగా.. కాసేపటికే విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ భేటీలో బ్రెగ్జిట్ అనంతరం యురోపియన్ యూనియన్ దేశాలతో అనుసరించాల్సిన విధానంపై నిర్ణయాలు తీసుకున్న మూడ్రోజుల్లోపే ఇద్దరు సీనియర్ మంత్రులు రాజీనామా చేయడం సంచలనం సృష్టిస్తోంది. దీనికితోడు వీరిద్దరూ బ్రెగ్జిట్ విధానపర నిర్ణయాలనే కారణంగా చూపుతూ రాజీనామా చేయడంపై సర్వత్రా చర్చ మొదలైంది. థెరీసా మే రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. థెరీసా మే కేబినెట్లో బోరిస్కు బ్రెగ్జిట్ అనుకూల మంత్రుల పోస్టర్బాయ్గా పేరుంది. తిరుగుబాటు యోచన లేదు ప్రధాని థెరీసా మేతో విధానపరమైన అంశాల్లో విభేదాల కారణంగానే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు డేవిస్ ప్రకటించారు. ఈయూతో బ్రిటన్ ప్రభుత్వ చర్చల ప్రక్రియలో తనను సంప్రదించడంలేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డేవిస్ వెల్లడించారు. అయితే, మేకు వ్యతిరేకంగా తిరుగుబాటు లేవనెత్తే ఆలోచన లేదని చెప్పారు. -
హార్లీ-డేవిడ్సన్కు ట్రంప్ సీరియస్ వార్నింగ్
వాషింగ్టన్ : అమెరికాకు, యూరోపియన్ యూనియన్కు మధ్య నెలకొన్న టారిఫ్ వార్ దెబ్బకు దిగ్గజ మోటార్సైకిల్ కంపెనీ హార్లీ-డేవిడ్సన్.. అమెరికా బయట ఉత్పత్తి చేపట్టాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విదేశాల్లో మోటార్సైకిల్ ఉత్పత్తిని చేపట్టడానికి హార్లీ డేవిడ్సన్ తరలి వెళ్తే, అది తీవ్ర ప్రభావానికి గురి కానుందని ట్రంప్ హెచ్చరించారు. ఐకానిక్ మోటార్సైకిల్స్పై భారత్ దిగుమతి సుంకాలు తగ్గించినప్పటికీ, ఈ కంపెనీ చాలా కఠినమైన నిర్ణయం తీసుకుందని అన్నారు. ఒకవేళ ఉత్పత్తిని విదేశాలకు తరలిస్తే, అమెరికా కస్టమర్లను కోల్పోయే ప్రమాదముందని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ’హార్లీ భారీగా దెబ్బతింటుందని నాకు అనిపిస్తుంది. ఇది గ్రేట్ అమెరికన్ ఉత్పత్తి అనుకుంటున్నా. అమెరికన్ ప్రజలు చాలా గర్వంగా ఫీలై, దీన్ని వాడుతూ ఉంటారు. హార్లీ గట్టి దెబ్బనే ఎదుర్కోబోతుందని నేను నమ్ముతున్నా. హార్లీ డేవిడ్సన్ బైక్ కొనుక్కునే వారు, దాన్ని మరో దేశంలో ఉత్పత్తి చేయాలని కోరుకోరు’ అని ట్రంప్ అన్నారు. అమెరికా బైక్ ఉత్పత్తులపై యూరోపియన్ యూనియన్ విధిస్తున్న టారిఫ్లను తగ్గించుకునేందుకు, హార్లీ డేవిడ్సన్ తన బైక్ ఉత్పత్తిని అమెరికా వెలుపల విదేశాల్లో చేపట్టాలని నిర్ణయించింది. స్టీల్, అల్యూమినియంపై ట్రంప్ టారిఫ్లు విధించడంతోనే, ఇతర దేశాలు కూడా ట్రంప్కు కౌంటర్గా భారీగా ఈ టారిఫ్లు విధించడం ప్రారంభం చేశాయి. హార్లీ డేవిడ్సన్ అనేది అమెరికన్ మోటార్సైకిల్ కంపెనీ. కానీ ఇటీవల టారిఫ్ల యుద్ధం బారీగా పెరగడంతో, ఇది విదేశాలకు తరలిపోతున్నట్టు అధికారిక ప్రకటన చేసింది. అమెరికా వెలుపల దీని ఉత్పత్తిని ప్రారంభించడానికి కనీసం 9 నుంచి 18 నెలలు పట్టే అవకాశం కనిపిస్తోంది. -
టారిఫ్ వార్ దెబ్బకు హార్లీ డేవిడ్సన్...
అమెరికాకు, యూరోపియన్ యూనియన్కు మధ్య నెలకొన్న టారిఫ్ వార్ దెబ్బ, అమెరికా అతిపెద్ద మోటార్సైకిల్ తయారీదారి హార్లీ డేవిడ్ సన్ తగిలింది. టారిఫ్ వార్ నుంచి బయటపడేందుకు హార్లీ డేవిడ్సన్ కీలక నిర్ణయం తీసుకుంది. తన బైక్ల కొంత ఉత్పత్తిని అమెరికా వెలుపల చేపట్టాలని నిర్ణయించింది. దీంతో అమెరికాకు కౌంటర్గా యూరోపియన్ యూనియన్ విధించే టారిఫ్ల నుంచి అది తప్పించుకోబోతుంది. ఈ విషయాన్ని హార్లీ డేవిడ్సన్ ప్రకటించింది. గత కొన్ని రోజులుగా అమెరికాకు, ఇతర దేశాలకు భారీ ఎత్తున్న టారిఫ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా విధిస్తున్న టారిఫ్లకు కౌంటర్గా ఆయా దేశాలు కూడా టారిఫ్లు విధిస్తున్నాయి. గత వారంలోనే అమెరికా ఉత్పత్తులపై యూరోపియన్ యూనియన్ 3.2 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది. అమెరికా విధించిన స్టీల్, అల్యూమినియం టారిఫ్లకు ప్రతిగా ఈ టారిఫ్లను ప్రకటించింది. యూరోపియన్ యూనియన్ విధించిన టారిఫ్ ఉత్పత్తుల్లో హార్లీ డైవిడ్సన్ బైక్లు కూడా ఉన్నాయి. వీటి టారిఫ్లు కూడా 6 శాతం నుంచి 31 శాతం పెరిగాయి. దీంతో అమెరికా నుంచి ఎగుమతి అయ్యే ఒక్కో మోటార్ సైకిల్పై 2,200 డాలర్ల ప్రభావం పడనుంది. ఈ క్రమంలోనే హార్లీ డేవిడ్సన్ తమ ఉత్పత్తుల తయారీని అమెరికా నుంచి యూరోపియన్ యూనియన్కు తరలించాని నిర్ణయించింది. ‘టారిఫ్లు పెరగడంతో, హార్లీ డేవిడ్సన్ వ్యయాలు కూడా పెరగనున్నాయి. ఒకవేళ ఈ వ్యయాలను డీలర్లకు, రిటైల్ కస్టమర్లకు బదిలీ చేస్తే, తమ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. హార్లీ డేవిడ్సన్ ఉత్పత్తులకు కస్టమర్ యాక్సస్ కూడా తగ్గిపోతుంది’ అని కంపెనీ రెగ్యులేటరీలో పేర్కొంది. అమెరికా వెలుపలకు హార్లీ డేవిడ్సన్ ఉత్పత్తుల తయారీని బదిలీ చేసే ప్రక్రియకు 18 నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే హార్లీ తీసుకున్న నిర్ణయంపై ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘హర్లీ డేవిడ్సన్ నిర్ణయం ఆశ్చర్యం కలిగిచింది. నేను వారికోసమే పోరాడుతున్నాను. చివరికి వారు ఈయూకి ఎగుమతి చేసే ఉత్పత్తులపై ఎలాంటి సుంకాలు చెల్లించరు. వాణిజ్యపరంగా మాకు 151 బిలియన్ డాలర్ల నష్టం కలుగుతోంది. సుంకాలపై హార్లే ఓపికగా ఉండాలి’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. -
‘బ్రెగ్జిట్’కు పార్లమెంటులో చుక్కెదురు
లండన్: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే అంశంలో(బ్రెగ్జిట్) తుది ఒప్పందాన్ని నిలుపుదల లేదా జాప్యం చేసేందుకు పార్లమెంటుకు అధికారాలు కట్టబెడుతూ రూపొందించిన ఈయూ (సవరణ) బిల్లుకు ‘హౌస్ ఆఫ్ లార్డ్స్’ గురువారం ఆమోదం తెలిపింది. బ్రిటన్ ఎగువ సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 355, వ్యతిరేకంగా 244 ఓట్లు పడ్డాయి. దీంతో ఈయూతో మరోసారి చర్చలు జరపమని బ్రిటన్ ప్రభుత్వాన్ని ఆదేశించేందుకు పార్లమెంటుకు అధికారం ఏర్పడుతుంది. అలాగే తుది ఒప్పందం నచ్చకపోతే ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడాన్ని కూడా నిలువరించవచ్చు. బ్రెగ్జిట్పై పార్లమెంటుకు ఎన్ని హామీలు ఇచ్చినా హౌస్ ఆఫ్ లార్డ్స్ సవరణలకు అనుకూలంగా ఓటు వేయడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని బ్రిటన్ మంత్రి మార్టిన్ కల్లనాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. -
బ్రెగ్జిట్ బిల్లుకు ఆమోదముద్ర
లండన్ : యూరపియన్ యూనియన్ నుంచి వైదొలిగే బ్రెగ్జిట్ బిల్లును బ్రిటన్ పార్లమెంట్ దిగువ సభ (హౌస్ ఆఫ్ కామన్స్) ఆమోదించింది. బ్రెగ్జిట్ బిల్లుపై దిగువ సభలో జరిగిన ఓటింగ్లో ప్రధాని థెరిసా మే వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించారు. ఈ ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 324 మంది ఎంపీలు ఓటేయగా, వ్యతిరేకంగా 295 మంది ఓటేశారు. దిగవ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు.. ఇక ఎగువ సభలోనూ పాసవ్వాలి. యూరోపియన్ యూనియన్ చట్టాలన్నీ బ్రిటన్ చట్టాలుగా మారడానికి ఉద్దేశించిన 1972 చట్టం ప్రకారమే హౌస్ ఆఫ్ లార్డ్స్ (ఎగువ సభ)లో బ్రెగ్జిట్పై చర్చ జరగనుంది. ఇదిలావుండగా దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్లో బ్రెగ్జిట్ బిల్లు ఆమోదమే అత్యంతక కీలక ఘట్టమని నిపుణులు చెబుతన్నారు. దిగువ సభలో బ్రెగ్జిట్ బిల్లు ఆమోదం పొందడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని బ్రెగ్జిట్ సెక్రెటరీ డేవిడ్ డేవిస్ అన్నారు. బ్రిటన్ ప్రయోజనాలకే ఐరోపా సమాఖ్య నుంచి బయటకు వస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈయూ నుంచి బ్రిటన్ సాఫీగా బయటకు రావడానికి ఇది ఎంతో దోహదం చేస్తుందని డేవిడ్ డేవిస్ చెప్సారు. దిగువ సభలో బ్రెగ్జిట్ బిల్లు ఆమోదం పొందడం ప్రధాని థెరిసా మే సాధించిన ఘనవిజయంగా విశ్లేషకులు చెబుతున్నారు. -
ఈయూకు చేపల ఎగుమతి తాత్కాలికంగా నిలిపివేత
బ్రెసిలియా: యూరోపియన్ యూనియన్(ఈయూ)కు చేపల ఎగుమతిపై బ్రెజిల్ తాత్కాలికంగా నిలిపివేసింది. కొన్ని బ్రెజిల్ సంస్థలు ఆహార భద్రత నిబంధనలు పాటించడంలో అక్రమాలను కనుగొన్న నేపథ్యంలో ఈ నిలిపివేతను ప్రకటించింది. సెప్టెంబర్లో ఈయూ నిర్వహించిన ఆడిట్ నేపథ్యంలో జనవరి 3నుంచి విరామం కార్యాచరణను అమలులో పెట్టనున్నట్లు బ్రెజిల్ వ్యవసాయ శాఖ తెలిపింది. ఈ కార్యాచరణలో భాగంగా యూరప్కు సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేసే బ్రెజిల్ ఓడలను తనిఖీ చేపట్టారు. పది కంపెనీలకు గాను 6 కంపెనీల్లో తనిఖీ అధికారులు సమస్యలను కనుగొన్నారు. -
2050 నాటికి ముస్లిం జనాభా.. మూడింతలు
లండన్ : మధ్యప్రాచ్యంలో నెలకొన్న అంతర్గత సంక్షోభాలు.. ఐరాపాను వణికిస్తున్నాయి. 2050 నాటికి ఐరోపా దేశాల్లో ముస్లింల జనాభా మూడింతలు పెరగనుందని అమెరికాకు చెందిన ప్రముఖ సర్వే సంస్థ ప్యూ రిసెర్చ్ సెంటర్ ప్రకటించింది. ప్యూ రీసెర్చ్ ప్రకటించిన తాజా సర్వేతో ఐరోపా దేశాలు.. విలవిల్లాడుతున్నాయి. ముఖ్యంగా ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల నుంచి లక్షల్లో ముస్లింలు ఐరోపాకు శరణార్థులుగా వలస వెళ్లారు. వీరు అక్కడే స్థిరపడ్డంతో.. జనాభా గణనీయంగా పెరుగుతుందని ప్యూ సర్వే ప్రకటించింది. జర్మనీలో 2016 నాటికి 6.1 శాతం ఉన్న ముస్లిం జనాభా.. 2050 నాటికి 19.7 శాతానికి చేరుకుంటుందని ప్యూ సర్వే ప్రకటించింది. ఐరోపా సమాఖ్యలోని 28 దేశాల్లోనూ ముస్లింల జనాభా ఇదే నిష్పత్తిలో పెరుగుతుందని ప్యూ రీసెర్చ్ అంచనాలు వేస్తోంది. అలాగే మొత్తం ఐరోపా జనాభాలో 2016 నాటికి కేవలం 4.9 శాతం ముస్లింల జనాభా 2050 నాటికి 25.8 మిలియన్లకు చేరుకుంటుందని ప్యూ సంస్థ అంచనా వేస్తోంది. -
33 వేల మంది జల సమాధి
వాషింగ్టన్ : యూరోపియన్ యూనియన్ను చేరుకునేందుకు మధ్యదరా సముద్రంలో సాహస ప్రయాణం చేస్తూ ఇప్పటివరకూ 33 వేల మంది జల సమాధి అయినట్లు ఐక్యరాజ్యసమితి ఓ ప్రకటనలో విడుదల చేసింది. ప్రపంచంలోని సరిహద్దుల్లో అత్యంత ప్రమాదకర, ప్రాణాంతక సరిహద్దుగా మధ్యదరా తీరాన్ని గుర్తించినట్లు చెప్పింది. 2000 నుంచి 2016 వరకూ మధ్యదరా మరణించిన శరణార్థుల వివరాలను శుక్రవారం వెల్లడించింది. లిబియా నుంచి వచ్చే శరణార్థులను అడ్డుకునేందుకు టర్కీతో యూరోపియన్ యూనియన్ ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల కొంతమేర మరణాలను తగ్గించినట్లయిందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్(ఐఓఎమ్) పేర్కొంది. అయితే, ఐక్యరాజ్యసమితి వెల్లడించిన మృతుల సంఖ్య వాస్తవానికి దూరంగా ఉందని యూరోపియన్ యూనివర్సిటీ అధ్యాపకుడు ఫిలిప్ అభిప్రాయపడ్డారు. మధ్యదరా పొట్టనబెట్టుకున్న వారి సంఖ్య 33 వేలకు పైమాటేనని తెలిపారు. 2017లో దాదాపు లక్షా 61 వేల మంది శరణార్థులు యూరోపియన్ యూనియన్కు వచ్చినట్లు ఐఓఎమ్ వెల్లడించింది. -
బ్రెగ్జిట్కు ముహూర్తం 2019, మార్చి 29
లండన్: ఐరోపా సమాఖ్య(ఈయూ) నుంచి బ్రిటన్ విడిపోయేందుకు ముహూర్తం ఖరారైంది. 2019, మార్చి 29, స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ఈయూ నుంచి అధికారికంగా నిష్క్రమిస్తామని ప్రధాని థెరిసా మే శుక్రవారం ప్రకటించారు. బ్రెగ్జిట్ తేదీ, సమయాన్ని చేరుస్తూ సవరణలు చేసిన తరువాత ఈయూ నిష్క్రమణ చట్టాన్ని వచ్చే వారంలో హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవడం ఖాయమని, ఈ విషయంలో ప్రభుత్వం నిబద్ధత, నిజాయతీపై సందేహం అక్కర్లేదని ‘ది డైలీ టెలిగ్రాఫ్’కు రాసిన వ్యాసంలో ఆమె తెలిపారు. చారిత్రక ఈయూ నిష్క్రమణ చట్టం ముందరి పేజీలోనే బ్రెగ్జిట్ తేదీ, సమయాన్ని స్పష్టంగా ప్రచురిస్తామని వెల్లడించారు. -
ఇరాన్ను ఏకాకి చేయండి: టిల్లర్సన్
దోహా: మధ్య ప్రాచ్యంలో ఇరాన్ను ఒంటరిని చేయాలని గల్ఫ్లోని సౌదీ అరేబియా, ఇరాక్ దేశాలకు అమెరికా విదేశాంగ మంత్రి టిల్లర్సన్ పిలుపునిచ్చారు. ఇరాన్ను దీటుగా ఎదుర్కొనేందుకు సౌదీ అరేబియా, ఇరాక్ దేశాలు ఒక్కటవ్వాలన్నారు. అరబ్ ఇరుగు పొరుగు దేశాలకు ఖతర్కు మధ్య సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలన్నారు. మధ్య ప్రాచ్యంలో ఇరాన్ అనుసరిస్తున్న వైఖరిని టిల్లర్సన్ విమర్శించారు. ఇరాన్కు చెందిన రెవల్యూషనరీ గార్డ్ కోర్తో ఐరోపా దేశాలు సంబంధాలు పెట్టుకోవద్దన్నారు. ఇరాన్ మద్దతుగల షితే మిలిషీయా తిరుగుబాటుదారులను ఇరాక్ నుంచి వెనక్కి రప్పించాలని లేదా వారిని ఇరాక్ సైన్యంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. -
ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు: భారత్, ఈయూ
న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై పోరుకు సహకరించుకోవాలని భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఒప్పందం చేసుకున్నాయి. ఈ మేరకు శుక్రవారం ఇరు పక్షాలు అంగీకరిస్తూ ఒక ప్రకటన (డిక్లరేషన్)ను విడుదల చేశాయి. భారత్–ఈయూ 14వ సదస్సు శుక్రవారం ఢిల్లీలో జరిగింది. ఈ సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ ఫ్రాన్సిజెక్ టస్క్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్ క్లాడ్ జంకర్, ఇతర ఈయూ నాయకులు పాల్గొన్నారు. సదస్సు అనంతరం సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘ఉగ్రవాదంపై పోరు, భద్రత అంశాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించాము’ అని తెలిపారు. టస్క్ మాట్లాడుతూ ‘అతివాదం, తీవ్రవాదం, ఉగ్రవాదంపై పోరాడాలని ఉమ్మడిగా తీర్మానించాము’అని చెప్పారు. -
యూరప్తో కరచాలనం
యూరప్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగడం, అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ చేతికి అధికారం రావడంలాంటి పరిణామాలతో అంతర్జాతీయంగా ఏర్పడ్డ అయోమయ వాతావరణంలో ప్రధాని నరేంద్ర మోదీ యూరప్ ఖండంలోని జర్మనీ, రష్యా, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో పర్యటనకు సోమవారం బయల్దేరి వెళ్లారు. ఆ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను దృఢపరుచుకోవడంతోపాటు పెట్టు బడులు ఆహ్వానించడం కూడా ఈ పర్యటన ప్రధానోద్దేశం. మంగళవారం భారత్– జర్మనీల మధ్య రైల్వేలు, సైబర్ రంగం, పట్టణాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాల్లో పలు ఒప్పందాలు, అవగాహనలు కుదిరాయి. ఇటీవలికాలంలో యూరప్ ఖండం ప్రత్యేకించి జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాలు ఉగ్రవాద ఉదంతాల వల్ల ఎన్నో నష్టాలు చవిచూశాయి. మనది కూడా ఉగ్రవాద బాధిత దేశమే. ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి సమష్టిగా పనిచేయడం ఎంతో అవసరం. మోదీ పర్యటన ఆ కోణంలో కూడా ఎంతో ముఖ్యమైనది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం కృషి చేస్తున్న మనకు జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల మద్దతు కీలకమైనది. ఈ అంశాల్లో మన పట్ల ఒక సానుకూల దృక్పథం ఏర్పర్చడానికి ఈ పర్యటన దోహదపడుతుంది. అలాగే అమెరికా–చైనాల మధ్య, అమెరికా–రష్యాల మధ్య ఉన్న సంబంధాలు కొత్త మలుపు తిరగడం, ఆ సంబంధాలపై ఇంకా అస్పష్టత కొనసాగుతుండటం వల్ల యూరప్లో ప్రధాన దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్లతో, అదే ఖండంలోని ఇతర దేశాలతో మరింత సాన్నిహిత్యం నెరపడం ముఖ్యం. ప్రచ్ఛన్న యుద్ధ దశలో ఆ ఖండం తూర్పు, పశ్చిమ యూరప్లుగా విడిపోయింది. మొదటిది సోవియెట్ యూనియన్ అనుకూల శిబిరంతో, రెండోది అమెరికాతో ప్రయాణించాయి. సోవియెట్ పతనం తర్వాత తూర్పు, పశ్చిమ యూరప్లు ఏకమయ్యాయి. తొలి దశలో సోవియెట్తో సన్నిహితంగా ఉన్న మన దేశం మారిన కాలమాన పరిస్థి తులకు తగినట్టు వ్యవహరించింది. అటు ఈయూతో, ప్రత్యేకించి జర్మనీ, ఫ్రాన్స్ లతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇటు రష్యాతో చెలిమిని కొన సాగించింది. కానీ క్రమేణా ఇదంతా మారుతూ వచ్చింది. అంతర్జాతీయ రంగంలో మనకు విశ్వసనీయ మిత్ర దేశంగా ఉన్న రష్యా మనతో తనకున్న సంబంధాలను యధాతథంగా కొనసాగిస్తూనే చైనాతో దగ్గరయ్యే దిశగా అడుగులేయడం ప్రారం భించింది. అంతేకాదు... పాకిస్తాన్తో మైత్రి నెరపేందుకు సిద్ధపడింది. నిరుడు గోవాలో జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సు సందర్భంగా పాక్కు చెందిన రెండు ఉగ్ర వాద సంస్థల పేర్లను ప్రస్తావించాలని కోరినా రష్యా పెడచెవిన పెట్టింది. అంత క్రితం 2014లో పాకిస్తాన్కు ఆయుధాల ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని తొలగిం చింది. నాలుగు సైనిక హెలికాప్టర్లను అందించాలని నిర్ణయించింది. ఈ ఏడాది తొలిసారి పాకిస్తాన్ డే సైనిక పేరేడ్లో రష్యా దళాలు పాల్గొన్నాయి. ఉక్రెయిన్లోని క్రిమియాను విలీనం చేసుకున్నాక తనకు నాటో దేశాలతో ఏర్పడ్డ వైషమ్యాల నేపథ్యంలోనే రష్యా ఈ కొత్త ఎత్తుగడలకు తెరతీసింది. తన ప్రయోజనాల కోసం రష్యా తీసుకుంటున్న ఈ చర్యలన్నీ మనల్ని ఇబ్బందికర వాతావరణంలోకి నెట్టే శాయి. ఎందుకంటే చైనా, పాకిస్తాన్లతో మనకు సరిహద్దు వివాదాలున్నాయి. అవి రెండూ తరచు మన ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయి. ఇవన్నీ చాలవన్నట్టు ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక అమెరికా–రష్యాల మధ్య ఉన్న సంబంధాల్లో ఒక రకమైన అనిశ్చితి నెలకొంది. ట్రంప్ను రష్యా అధ్యక్షుడు పుతిన్ చేతిలో కీలుబొమ్మగా భావించేవారు ఇప్పుడు అమెరికాలో చాలా మంది ఉన్నారు. కానీ ఆయన దాన్ని నిరూపించుకుంటారా లేదా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఇప్పటికైతే అమెరికా జాతీయ భద్రతా సంస్థ(ఎన్ఎస్ఏ), ఇతర సంస్థలు ట్రంప్–పుతిన్ సంబంధాలపై ఆధారాలు తవ్వితీసే పనిలోబడ్డాయి. ట్రంప్–పుతిన్ సంబంధాల కారణంగా యూరప్ దేశాల్లో అమెరికాపై అప నమ్మకం ఏర్పడింది. దానిపై ఆధారపడటం తగ్గించి సొంత దోవ వెతుక్కోవడం ఉత్తమమని ఆ దేశాలు భావిస్తున్నాయి. ఆసియా వరకూ చూస్తే చైనాతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ట్రంప్ చేస్తున్న యత్నాలు మనతోపాటు జపాన్, ఇతర ఆసియా దేశాలను కూడా అయోమయంలోకి నెడుతోంది. ఇవన్నీ చివరకు ఎటు దారితీస్తాయో తెలియకపోయినా స్పష్టత ఏర్పడే వరకూ వేచి ఉండటం కూడా మంచిది కాదు. అందువల్లే అటు యూరప్ దేశాలు, ఇటు భారత్, జపాన్ తదితర ఆసియా దేశాలు కొత్త పొత్తుల కోసం సహజంగానే ప్రయత్నిస్తున్నాయి. వీటితోపాటు ఈయూ నుంచి బ్రిటన్ తప్పుకోవాలని నిర్ణయించాక ఈయూ పరిస్థితి అధ్వాన్నంగా మారింది. అందువల్ల భారత్లాంటి పెద్ద దేశంతో సహకారం పెంచుకోవాలని జర్మనీ భావిస్తోంది. అందువల్ల సహజంగానే అది నరేంద్ర మోదీ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూసింది. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో జరగబోయే అంతర్జాతీయ ఆర్ధిక సదస్సులో కూడా మోదీ పాల్గొనబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది వ్యాపా రవేత్తలు పాలుపంచుకునే ఆ సదస్సు భారత్లో పెట్టుబడులను కోరడానికి మంచి వేదిక అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతోపాటు పుతిన్తో మోదీ జరపబోయే ద్వైపాక్షిక చర్చల్లో ప్రస్తుత సంబంధాల సమీక్ష కూడా ఉంటుంది. వ్యాపార, వాణిజ్య, రక్షణ, అణు రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఇరు దేశాధినేతలూ చర్చిస్తారు. 2025 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం 3,000 కోట్ల డాలర్లకు చేరుకోవాలని ఇరు దేశాలూ లక్ష్యంగా నిర్ణయించుకున్నా అది ప్రస్తుతం దాదాపు 800 కోట్ల డాలర్ల వద్దే ఆగిపోయింది. శరవేగంతో మారిపోతున్న అంతర్జాతీయ పరిణామాల్లో స్నేహం శాశ్వతం కానట్టే శత్రుత్వం కూడా శాశ్వతం కాదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారడం, క్షీణిస్తున్న సంబం ధాలను పునరుద్ధరించుకోవడం, ఉన్న సంబంధాలను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లడం అవసరం. ఈ నేపథ్యంలో ప్రధాని యూరప్ దేశాల పర్యటనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. -
ఐరోపాకు వారసులే లేరా..!
సంతానం లేనివారే అనేక ఐరోపా దేశాలకు అధినేతలవుతున్నారు. ప్రజలూ పిల్లల్ని కనడం లేదు. అదే మాదిరిగా రాజకీయ నేతలు కూడా మా తరం బాగా బతికితే చాలు.. వారసులెందుకు? అనే ధోరణితో బతుకుతున్నారు. సంతానోత్పత్తి రేటు 2.1 ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ముందుకు సాగుతుందంటారు. 20కి పైగా ఐరోపా దేశాల్లో ఈ రేటు 2.1 దిగువకు పడిపోయింది. అమెరికా స్థానిక ప్రజల జనాభా పెరుగుదల రేటు ఉండాల్సినదాని కన్నా కాస్త తక్కువే. అయితే, ఇతర దేశాల నుంచి వలసలు వచ్చి స్థిరపడిన జనం సంతానోత్పత్తి రేటు బాగుండటంతో జనాభా సంక్షోభం అమెరికాను ఇప్పట్లో తాకదు. 2015లో గ్రీస్ ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణాల్లో ఒకటి జనాభాలో ఎక్కువ శాతం ఉన్న వృద్ధులు. రిటైరైన జనాభాకు దేశ ఆదాయంలో 17 శాతం పింఛన్ల రూపంలో చెల్లించడం కూడా దేశం దివాలా స్థితికి చేరేలా చేసింది. యథా ప్రజా తథా రాజా! పిల్లలు కనడానికి బద్ధకిస్తున్న ప్రజలు సంతానం లేని నాయకులనే ఎన్నుకుంటున్నారు! జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ వంటి పెద్ద, పారిశ్రామిక దేశాల ప్రభుత్వాధినేతలు ఏంజెలా మెర్కెల్, ఇమానియేల్ మాక్రాన్, థెరీసా మే, పావ్లో జెంటిలోని పిల్లల్ని కనలేదు. ఇంకా డచ్ ప్రధాని మార్క్ రుట్, స్వీడన్ ప్రధాని స్టీవెన్ లూఫ్వెన్, లగ్జెంబర్జ్ ప్రధాని జేవియర్ బెత్తెల్, స్కాట్లండ్ ఫస్ట్ మినిస్టర్ నికోలా స్టర్జన్, యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ జా క్లాడ్ జన్కర్ కూడా పిల్లలు లేని నేతలే. ఈ నేతలకు సంతానం లేకపోవడం వల్ల ఆయా వ్యక్తులకు నష్టమే కాక, ఐరోపా నాగరికతకు ఎనలేని హాని జరుగుతుందని నిపుణులు అంటున్నారు. సాధారణంగా తల్లిదండ్రులకు భిన్నంగా పిల్లలు ప్రవర్తిస్తారు. పెద్దవాళ్లు చెప్పినట్టు నడుచుకోరు. పిల్లలు లేని నేతలకు ఇలాంటి అనుభవం లేకపోవడం పెద్ద లోటు అని జేమ్స్ మెక్ఫెర్సన్ అనే విశ్లేషకుడు ఇటీవల వాషింగ్టన్ ఎగ్జామినర్ అనే పత్రికలో రాసిన వ్యాసంలో హెచ్చరించారు. ‘‘ ఓ వయసులో పేచీలు పెడుతూ సతాయించే పిల్లల అనుభవం లేని సంతానహీనులైన ప్రజానాయకులు జనాన్ని బుర్రలు లేని తెల్ల కాగితాలుగా భావిస్తారు. నేడు యూరప్లో పిల్లల్ని కనని కొందరు దేశాధినేతలు ఇతరుల సంతానం భవితవ్యాన్ని ప్రభావితం చేసే విధానాలు రూపొందించి అమలుచేస్తున్నారు’’ అంటూ ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రాచీన రోమ్ మాదిరిగా యూరప్ ‘పతనం’ తప్పదా? పిల్లలు కని వారిని పెంచి పెద్దచేసే బాధ్యత తీసుకోవడానికి ఆధునిక తరం ఇష్టపడడం లేదని, వందలాది ఏళ్ల క్రితం ఇదే పరిస్థితి ఎదుర్కొన్న ప్రాచీన రోమ్ సామ్రాజ్యం పతనమైందని ప్రఖ్యాత బ్రిటిష్ యూదు మతపెద్ద జోనాథన్ హెన్రీ శాక్స్ కిందటేడాది ఓ అవార్డు తీసుకుంటూ లండన్లో హెచ్చరించారు. సంతానం లేని కుటుంబ జీవితాలు చివరికి ఐరోపా సమాజం మరణానికి దారితీస్తాయని కూడా ఆయన హెచ్చరించారు. ‘‘ వర్తమానంలో సుఖపడాలనే ఒక్క అంశం మీదే ప్రజల దృష్టి నిలుస్తోంది. భవిష్యత్తు నిర్మాణానికి అవసరమైన త్యాగాలు చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు.’’ అని శాక్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వలసొచ్చే విదేశీయులను యూరప్ కలుపుకోలేదా? ప్రస్తుతం ఐరోపా దేశాల ప్రజలు తమ అస్తిత్వాన్ని, తమ స్వరూప స్వభావాలను పూర్తిగా మరిచి సంక్షోభంలో మునిగి ఉన్నారని, ఈ స్థితిలో తమ దేశాల్లో కల్లోలాల వల్ల ఐరోపా దేశాల్లోకి వచ్చి పడుతున్న వలసదారులకు ఆశ్రయం ఇచ్చి, వారిని తమ సమాజాల్లో ఇముడ్చుకునే స్థితిలో లేరని డగ్లస్ మరి అనే బ్రిటిష్ సామాజిక శాస్తవేత్త ‘స్ట్రేంజ్ డెత్ ఆఫ్ యూరప్’ అనే పుస్తకంలో చెప్పారు. అయితే, ఈ విశ్లేషకుల ఆందోళనకు అర్థం లేదనేదే మెజారిటీ అభిప్రాయంగా కనిపిస్తోంది. కొన్ని దేశాల ప్రభుత్వాధినేతలకు సంతానం లేకపోవచ్చు గానీ, పిల్లలున్న అత్యధిక ప్రజానీకం ఓటేసి వారిని గెలిపించారు. కేవలం పిల్లలు లేనంత మాత్రాన ఈ బడా నేతలకు ప్రజా సమస్యలపై సమగ్ర అవగాహన లేదనుకోవడం పొరపాటే. అదీగాక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు ఖాతరుచేయని నియంతల పాలనలో ఐరోపా దేశాలు లేవు. -
చందమామపై చక్కని ఊరు
లండన్: చంద్రుడిపైకి ఉపగ్రహాన్ని పంపించడమే కష్టం. అలాంటిది ఏకంగా అక్కడ ఓ గ్రామాన్నే నిర్మిస్తామంటున్నారు చైనా, యూరోపియన్ యూనియన్(ఈయూ) అంతరిక్ష శాస్త్రవేత్తలు. స్పేస్ టూరిజాన్ని ప్రోత్సహించడంతో పాటు సుదూర అంతరిక్షయానానికి చంద్రుడిని కేంద్రంగా మారుస్తామని వారు ప్రకటించారు. అంతేకాదు చంద్రుడిపై అపారంగా ఉన్న హీలియంను తవ్వడానికి సైతం ప్రణాళికలు వేస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ విషయమై ఈయూ ప్రతినిధి పాల్ విస్ట్సేన్థాల్ మాట్లాడుతూ, అంతరిక్ష పరిజ్ఞానం గత 60 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాలకు వాడుకోవడం కోసం ప్రపంచ దేశాలతో కలిసి పనిచేస్తామని పాల్ తెలిపారు. ఈయూతో జరిగిన చర్చల్ని చైనా స్పేస్ ఏజెన్సీ ప్రధాన కార్యదర్శి తియాన్ యూలుంగ్ సైతం ధ్రువీకరించారు. -
యూకే లేకుండానే బ్రెగ్జిట్ చర్చలు!
యూకే లేకుండానే యూరోపియన్ యూనియన్ దేశాలు బ్రెగ్జిట్ చర్చలు జరుపబోతున్నాయి. ఈమేరకు ఈయూ సభ్య దేశాలు బ్రుస్సెల్స్ లో సమావేశం కాబోతున్నాయని శనివారం రిపోర్టులు వచ్చాయి. ఈ చర్చలో 27 ఈయూ దేశాలు పాల్గొంటాయని బీబీసీ రిపోర్టు చేసింది. భవిష్యత్తు వాణిజ్య సంబంధాల గురించి ఎలాంటి చర్చలైనా ప్రారంభించబోయే ముందు యూకే లేకుండా తమ పురోగతి గురించి ఓసారి చర్చించాలని ఈయూ నిర్ణయించినట్టు తెలిసింది. జూన్ 8న యూకేలో సాధారణ ఎన్నికల ముగిసే వరకు ఈయూ సైతం లండన్ తో ఎలాంటి అధికారిక చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేదు. ఈయూలోని 27 దేశాల లీడర్లకు లేఖ రాసిన యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ డొనాల్డ్ టస్క్.. యూకేతో భవిష్యత్తు సంబంధాలు గురించి చర్చించే ముందు ప్రజలు, నగదు, ఐర్లాండ్ విషయంలో ఓ అగ్రిమెంట్ కు రావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తు గురించి చర్చించే ముందు మన గతాన్ని కూడా ఓసారి గుర్తుచేసుకోవాలని టస్క్ ఈయూ సభ్యులకు తెలిపారు. ఈయూ నుంచి యూకే వైదొలిగిన ప్రధాన సమస్యలపై తాము పురోగతి సాధించేంత వరకు యూకేతో భవిష్యత్తు సంబంధాలపై చర్చించేది లేదని తేల్చిచెప్పారు. ఒక్కసారి బ్రెగ్జిట్ చర్చలు ముగిశాక, ఎలాంటి ప్రయోజనాలను ఈయూ సభ్యుల నుంచి యూకే పొందడానికి లేదని జర్మన్ ఆర్థిక మంత్రి వోల్ఫ్గ్యాంగ్ స్చ్యూబ్లే చెప్పారు. -
యూరోపియన్ సంస్థతో...హెరిటేజ్ ఫుడ్స్ జట్టు
నెల రోజుల్లో ఒప్పందం ఖరారు ► విపణిలోకి కొత్త బేవరేజెస్ ఉత్పత్తులు ► ఐదేళ్లలో 6 వేల కోట్ల ఆదాయం లక్ష్యం ► రూ.150 కోట్లతో కొత్తగా 5 పాల ప్రాసెసింగ్ ప్లాంట్లు ► హెరిటేజ్ ఫుడ్స్ ఈడీ నారా బ్రాహ్మణి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్.. యూరప్నకు చెందిన ప్రముఖ డెయిరీ సంస్థతో సంయుక్త భాగస్వామ్య (జేవీ) ఒప్పందం కుదుర్చుకోనుంది. ఒప్పంద చర్చలు ముగింపు దశలో ఉన్నాయని.. నెల లేదా 6 వారాల్లో ఒప్పందం ఖరారవుతుందని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ (హెచ్ఎఫ్ఎల్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) నారా బ్రాహ్మణి తెలిపారు. ఈ కొత్త భాగస్వామ్యం సాంకేతికత, బ్రాండింగ్, మార్కెటింగ్ మూడు విభాగాల్లోనూ ఉంటుందని, అలాగే ప్రస్తుతమున్న హెరిటేజ్ ఫుడ్స్ ఉత్పత్తులతో పాటు విపణిలోకి కొత్తగా బేవరేజెస్ ఉత్పత్తులను పరిచయం చేస్తామని తెలియజేశారు. హెరిటేజ్ ఫుడ్స్ ఈ మధ్యే రిలయన్స్ డెయిరీని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మరిన్ని కొనుగోళ్లకు తాము సిద్ధంగా ఉన్నామని, సంస్థను మరింత విస్తరిస్తామని చెప్పారామె. హెరిటేజ్ ఫుడ్స్ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్రాహ్మణితో కలసి హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్పర్సన్, చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హెరిటేజ్ ఫుడ్స్ కొత్త లోగో, ప్యాకేజింగ్లను విడుదల చేశారు. బ్రాహ్మణి మాట్లాడుతూ.. ‘‘ఈ ఆర్ధిక సంవత్సరం ఫలితాలింకా వెల్లడించాల్సి ఉంది. 2015–16 ఆర్ధిక సంవత్సరంలో రూ.2,380 కోట్ల టర్నోవర్ను చేరుకున్నాం. వచ్చే ఐదేళ్లలో మూడింతల వృద్ధితో రూ.6 వేల కోట్ల టర్నోవర్ను లక్ష్యించాం’’ అని చెప్పారు. ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ నుంచి విపణిలో పాలు, పెరుగు, నెయ్యి, పన్నీరు, ఐస్క్రీమ్, బటర్ మిల్క్, ఫ్లేవర్డ్ మిల్క్ తదితర ఉత్పత్తులున్నాయి. మా మొత్తం ఆదాయంలో 10–12 శాతం వాటా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలది. ఉత్పత్తుల పరంగా చూస్తే పెరుగు వాటానే అత్యధికం. గత ఐదేళ్లుగా ఏటా 18 శాతం వృద్ధి రేటును సా«ధించాం. అంతర్జాతీయ కంపెనీతో భాగస్వామ్యం, ఇతర పెట్టుబడులతో వచ్చే ఐదేళ్లలో 25 శాతం వార్షిక వృద్ధి రేటును సాధిస్తామని బ్రాహ్మణి ధీమా వ్యక్తం చేశారు. రూ.150 కోట్లతో 5 ప్రాసెసింగ్ యూనిట్లు.. ప్రస్తుతం హెచ్ఎఫ్ఎల్ ఉత్పత్తులు దక్షిణ, ఉత్తరాదిలోని 15 రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యంచింది. ఇందులో భాగంగానే మరో 5 రాష్ట్రాల్లో 5 పాల ప్రాసెసింగ్ ప్లాంట్లను నెలకొల్పనుంది. ఒక్కో ప్లాంట్పై రూ.25–30 కోట్లు చొప్పున.. మొత్తం రూ.150 కోట్లతో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. దీంతో ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల మంది రైతుల నుంచి 14 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్న హెచ్ఎఫ్ఎల్ సామర్థ్యం.. కొత్త యూనిట్ల అనంతరం 25–30 లక్షల లీటర్లకు చేరుతుందని బ్రాహ్మణి వివరించారు. కార్యక్రమంలో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ చైర్మన్ సీతారామయ్య, ప్రెసిడెంట్ సాంబశివరావు, డైరెక్టర్ నాగరాజా నాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
భారతీయ ఔషధ ప్రయోగాలపై యూరప్ అసంతృప్తి
భారతదేశానికి చెందిన ఒక పరిశోధనా సంస్థ చేసిన పరీక్షలు అంత నమ్మశక్యంగా లేవని యూరోపియన్ ఔషధ నియంత్రణ సంస్థ తేల్చేసింది. ఈ సంస్థ పరిశీలించిన దాదాపు 300 జెనెరిక్ డ్రగ్ అనుమతులు, డ్రగ్ అప్లికేషన్లను సస్పెండ్ చేయాలని సూచించింది. భారతదేశానికి చెందిన మైక్రో థెరప్యుటిక్ రీసెర్చ్ ల్యాబ్స్ సంస్థకు ఇది అపప్రథగా నిలిచింది. యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) ఈ విషయాన్ని తన వెబ్సైట్లో పేర్కొంది. ఇటీవలి కాలంలో తరచు అంతర్జాతీయ నియంత్రణ సంస్థలతో పలు రకాల సమస్యలు ఎదుర్కొంటున్న భారత ఔషధ పరీక్షల పరిశ్రమకు ఇది మరో పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పక తప్పదు. 2016 ఫిబ్రవరి నెలలో ఇదే సంస్థ (మైక్రో థెరప్యుటిక్ రీసెర్చ్ ల్యాబ్స్) గురించి ఆస్ట్రియా, డచ్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. దాంతో అసలు వీళ్లు అనుసరిస్తున్న ఔషధ ప్రయోగాల పద్ధతులు ఎంతవరకు సరిగ్గా ఉన్నాయనే అంశంపై యూరోపియన్ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. పరిశోధన ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని సరిగా అన్వయించకపోవడం, డాక్యుమెంటేషన్ మరియు సమాచార విషయాల్లో లోపాలను ఇప్పటికే గుర్తించినట్లు ఈఎంఏ తెలిపింది. అయితే ఈ మందుల వల్ల ఏవైనా దుష్ప్రభావాలు వచ్చినట్లు గానీ, అవి పనిచేయకపోవడం గురించి గానీ ఇంతవరకు ఎలాంటి సాక్ష్యాలు లభించలేదు. మైక్రో థెరప్యుటిక్ రీసెర్చ్ ల్యాబ్స్ సంస్థ పరిశీలించిన ఔషధాల మీద సస్పెన్షన్ అంశాన్ని యూరోపియన్ కమిషన్కు పంపుతారు. అక్కడ తుది నిర్ణయం తీసుకుంటారు. భారతదేశానికి చెందిన పలు కాంట్రాక్టు పరిశోధన సంస్థలలో (సీఆర్ఓ) ఔషధ ప్రయోగాలు, పరీక్షలు నిర్వహిస్తారు. జెనెరిక్ ఔషధాల అనుమతులకు సంబంధించి ఈ పరీక్షలు చేయడం తప్పనిసరి. దేశంలోనే అతిపెద్ద సీఆర్ఓ అయిన జీవీకే బయో సైన్సెస్ చేసిన దాదాపు 700 మందులకు సంబంధించిన ఔషధ ప్రయోగాలను 2015లో నిషేధించింది. మిగిలిన చిన్న చిన్న భారతీయ సీఆర్ఓలు కూడా తగిన ప్రమాణాలు పాటించడంలో కొంతవరకు వెనకబడే ఉన్నాయని యూరోపియన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
స్కాట్లాండ్ స్వాతంత్య్రంపై రెఫరెండం!
లండన్: బ్రెగ్జిట్ (ఐరోపా దేశాల కూటమి నుంచి బ్రిటన్ వైదొలగడం) నేపథ్యంలో స్కాట్లాండ్ ప్రయోజనాలను బ్రిటన్ పట్టించుకోవడం లేదనీ, కాబట్టి యూకే నుంచి స్కాట్లాండ్కు స్వాతంత్య్రం కోసం ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం)కు పార్లమెంటు అనుమతి కోరతానని స్కాట్లాండ్ అధ్యక్షురాలు (ఫస్ట్ మినిస్టర్) నికోలా స్టర్జన్ సోమవారం అన్నారు. 2014లోనే స్కాట్లాండ్కు స్వాతంత్య్రంపై రెఫరెండం పెట్టగా అక్కడి ప్రజలు యూకేతో కలిసి ఉండటానికే ఓటు వేయడం తెలిసిందే. ‘యూకేతోపాటు స్కాట్లాండ్ కూడా ఐరోపా కూటమి నుంచి బయటకు రావాలా? స్వత్రంత్ర దేశంగా ఉండి అటు యూకేతోనూ, ఇటు కూటమితోనూ సంబంధాలను నెరపాలా? అనే రెండు ఎంపికలు ప్రజలకు ఉండేలా చర్యలు తీసుకుంటా’అని స్టర్జన్ చెప్పారు. -
బ్రెగ్జిట్కు మరింత చేరువైన బ్రిటన్
లండన్ : యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగే విషయంలో మార్చి 31 నాటికల్లా కీలకమైన చర్చలు ప్రారంభించే అధికారం బ్రిటన్ ప్రధాని థెరెసా మేకు లభించింది. సంబంధిత బిల్లుకు బ్రిటన్ పార్లమెంటు గురువారం మెజారిటీ మద్దతు పలికింది. ఈయూ(ఉపసంహరణ నోటిఫికేషన్ లుకు సంబంధించిన ముసాయిదా చట్టంపై తుది చర్చల తర్వాత హౌస్ ఆఫ్ కామన్స్ 494–122 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది. లిస్బన్ దానికి సంబంధించిన ఆర్టికల్ 50 ద్వారా ఈయూ నుంచి వైదొలిగే ప్రక్రియను చేపట్టేందుకు ప్రధానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. -
ట్రంప్ను అడ్డుకోకుంటే మనం మటాషే!
- అమెరికా, రష్యాల దోస్తీ ప్రమాదకరం - కలిసికట్టుగాఎదుర్కొందాం: ఈయూకు ఫ్రాన్స్ పిలుపు వలెటా: అగ్రరాజ్యానికి ఆప్తమిత్రులుగా కొనసాగుతున్న దేశాలు డొనాల్ట్ ట్రంప్ తీరుతో విసిగిపోయాయా? అమెరికాను, దాని కొత్త మిత్రుడు రష్యాను ధీటుగా ఎదుర్కొనేందుకు పూనుకుంటున్నాయా? అంటే అవుననే చెప్పాలి. ప్రపంచ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేసేలా.. మాల్టా రాజధాని వలెటాలో శుక్రవారం జరిగిన యురోపియన్ యూనియన్(ఈయూ) అనధికార సదస్సులో పలు కీలక తీర్మానాలను ప్రవేశపెట్టారు. రష్యాతో అమెరికా జతకట్టడం ప్రమాదఘంటిక లాంటిదని ఈయూ నేతలు అభిప్రాయపడ్డారు. ఈయూ సదస్సులో కీలక ప్రసంగం చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే మరో అడుగు ముందుకేసి.. ట్రంప్ ప్రయోగిస్తోన్న ‘ఒత్తిడి’ని బలంగా అడ్డుకోకుంటే యూరప్ మనుగడలో లేకుండాపోయే ప్రమాదం వాటిల్లుతుందని హెచ్చరించారు. ట్రంప్ను ఎదుర్కొనే దిశగా ఈయూలోని 28 దేశాలూ ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. యూరప్ దేశాలు.. అమెరికా, రష్యాలపై ఆధారపడటం మానుకొని, సొంతగా రక్షణ, వ్యాపార సంబంధాలను బలోపేతం చేసుకోవాలని కోరారు. ఇవేవీ జరగని పక్షంలో యూరప్ విఛ్చితి ఖాయమని అభిప్రాయపడ్డారు. ‘నాటో నుంచి బయటికొస్తామని, రష్యాతో దోస్తీ చేస్తామని ట్రంప్ పదేపదే చెబుతున్నారు. మధ్యధరా నుంచి వచ్చే శరణార్థుల విషయంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటూ యురప్పై ఒత్తిడి పెంచుతున్నారు. ఇలాంటి పలు అంశాల నేపథ్యంలో.. అమెరికా, రష్యాలు కలిసి యూరప్ దేశాలను విచ్ఛిన్నం చేస్తాయనే ఊహాగానాలు మొదలయ్యాయి. నిజం చెప్పాలంటే ఈ ఊహాగానాల్లో వాస్తవం లేకపోలేదు. మనం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులు మరింత తీవ్రతరమయ్యేరోజులు ఎంతో దూరంలోలేవు. అందుకే మనం కలిసికట్టుగా ఉందాం. ఒత్తడిని తరిమేద్దాం. నాటో లాంటివే సంయుక్త రక్షణ దళాలను ఏర్పాటుచేసుకుందాం. వాణిజ్య, వ్యాపార సంబంధాలను మెరుగుపర్చుకుందాం’ అని హోలాండే అన్నారు. కాగా, ఏడు ముస్లిం దేశాల పౌరులపై నిషేధం విషయంలో అమెరికా కోర్టుల భిన్న తీర్పులు ఇచ్చిన దరిమిలా ఈయూలోని కొన్ని దేశాలు ట్రంప్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు కలిగిఉన్నాయని హొలాండే చెప్పుకొచ్చారు. ట్రిటీస్ ఆఫ్ రోమ్(రోమ్ కూటమి)60వ వార్షికోత్సవాలపైనా ఈ సదస్సులో తీర్మానాలు చేశారు. -
‘పార్లమెంట్లో చట్టం చేసిన తర్వాతే బ్రెగ్జిట్’
లండన్ : యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ బయటకు రావాలంటే (బ్రెగ్జిట్) కచ్చితంగా పార్లమెంటులో చట్టం చేయాల్సిందేనని ఆ దేశ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీంతో లిస్బన్ ఒప్పందం (ఈయూ రాజ్యాంగం) లోని ఆర్టికల్ 50 ప్రకారం మార్చి చివరి లోపు బ్రెగ్జిట్ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్న బ్రిటిష్ ప్రధాని థెరిసా మేకు చుక్కెదురైంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ లార్డ్ న్యూబెర్జర్ మంగళవారం తీర్పు వెలువరించారు. బ్రిటన్ ఎంపీలు, మంత్రులు బ్రెగ్జిట్కు మద్దతు తెలిపేంత వరకు బ్రిటిష్ ప్రధాని ఈయూతో అధికారి కంగా చర్చలు జరప కూడదన్నారు. దీనిపై ప్రభుత్వ ప్రతినిధి మాట్లాడుతూ.. బ్రిటిష్ ప్రజలు ఈయూ నుంచి వైదొలగాలని తీర్పు ఇచ్చారని, ఆర్టికల్ 50 ద్వారా మార్చి చివరిలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయ డంలో ఎలాంటి మార్పు ఉండబోదన్నారు. బ్రెగ్జిట్కు వ్యతిరేకంగా కేసు వేసి ఉద్యమం నడిపిన భారత సంతతి మహిళ గినా మిల్ల ర్ సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.