kodela siva prasada rao
-
బాబు ముంచేశాడు.. ‘కోడెల’ మరణం వెనుక అసలు సీక్రెట్ ఇదేనా?
మాజీ స్పీకర్, దివంగత డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో ఆ నెపాన్ని మొత్తం ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై నెట్టడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన యత్నం ఇంతా, అంతా కాదు. ఎన్నడూ లేనిది హైదరాబాద్ నుంచి నరసరావుపేట వరకు ఆయన శవయాత్ర కూడా చేశారు. కోడెల కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తున్నట్లు పిక్చర్ ఇచ్చారు. తీరా సీన్ కట్ చేస్తే, గత మూడేళ్లుగా కోడెల కుటుంబాన్ని చంద్రబాబు అసలు పట్టించుకోలేదట. ఇది వేరే ఎవరో చెబితే నమ్మొచ్చో, లేదో అన్న సందేహం ఉండేది. స్వయంగా కోడెల కుమారుడు శివరామ్ చెబుతున్నారు. ఐదు నిమిషాల టైమ్ ఇవ్వలేదట.. రాజమండ్రి మహానాడులో ఐదు లక్షల రూపాయలు చెల్లిస్తే పార్టీతో కలిసి భోజనం చేయవచ్చని ఆఫర్ ఇచ్చిన పార్టీ అధిష్టానం కోడెల కుటుంబానికి ఐదు నిమిషాల టైమ్ ఇవ్వలేదట. కోడెలను స్మరించుకోకపోవడం సరికదా! ఆయన భార్యకు, కొడుకుకు కనీస గౌరవం దక్కలేదట. పుండుమీద కారం చల్లినట్లు కొత్తగా టీడీపీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి టీడీపీ టిక్కెట్ ప్రకటించారన్నది ఆయన ఆవేదన. ఈయనే కాదు విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా పార్టీపై అసంతృప్తితో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నంద్యాల, ఆళ్లగడ్డలలో టీడీపీ వర్గాలు రచ్చ రచ్చ మరో వైపు నంద్యాల, ఆళ్లగడ్డలలో టీడీపీ వర్గాలు రచ్చకెక్కి నడి రోడ్డు మీదే కొట్టుకున్నాయి. ఈ పరిణామాలన్నీ టీడీపీకి ఆందోళన కలిగించేవే. వీటిలో సత్తెనపల్లి రాజకీయం మాత్రం చంద్రబాబు తన సహజమైన యూజ్ అండ్ త్రో విధానాన్ని అవలంభించినట్లుగా ఉంది. కోడెల స్పీకర్గా ఉన్నప్పుడు చేసిన చర్యలపై నిర్దిష్ట ఆరోపణలు వచ్చాయి. వాటిపై ప్రభుత్వం కేసులు పెట్టింది. దాంతో టీడీపీ నాయకత్వం కోడెలను ఎలా వదలించుకోవాలా అన్న ఆలోచనలో పడింది. ఆ తరుణంలో చంద్రబాబు పల్నాడు పర్యటనకు వెళితే కోడెలను కనీసం రమ్మని కూడా పిలవలేదు. దాంతో ఆయన కలత చెందారని అప్పట్లో వార్తలు వచ్చాయి. తదుపరి ఆయన అనారోగ్యానికి గురై గుంటూరు ఆస్పత్రిలో ఉన్నారు. కోడెలను పరామర్శించాల్సిందిగా ఆయన కుటుంబ సభ్యులు చంద్రబాబును కోరినా వెళ్లలేదని అంటారు. ఫలితంగా కోడెల తీవ్ర మనస్తాపానికి గురి అయ్యారు. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో కారణం ఏమైనా కోడెల హైదరాబాద్ లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుడు ఆయన ఏమైనా లేఖ రాశారా ?లేదా? అన్నది తెలియకుండా జాగ్రత్తపడ్డారు. శవయాత్రకు ప్లాన్.. కోడెల చనిపోగానే చంద్రబాబు రంగంలోకి దూకి శవయాత్రకు ప్లాన్ చేశారు. దాని వెంట ఆయన స్వయంగా వెళ్లారు. ఆయా చోట్ల కాని, స్మశానంలో కాని ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు. అందులో ఎంత వాస్తవం ఉందన్నది పక్కనపెడితే కోడెల మరణాన్ని రాజకీయంగా కాష్ చేసుకోవడానికి చంద్రబాబు యత్నించిన విషయం అందరికి అర్దం అయింది. ఆ తర్వాత కోడెల కుమారుడు శివరామ్ సత్తెనపల్లి లో రాజకీయాలు చేయడం ఆరంభించారు. కాని అందుకు మాత్రం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఫలితంగా ఆ నియోజకవర్గంలో రెండు,మూడు గ్రూపులు తయారయ్యి గొడవలు పడసాగాయి. ఆ విషయం శివరామ్తో చెప్పించారట.. ఈ క్రమంలో సడన్గా కన్నా లక్ష్మీనారాయణను చంద్రబాబు అక్కడ అభ్యర్ధిగా ప్రకటించారు. దీంతో హతాశుడైన శివరామ్ తీవ్రంగా స్పందించారు. అప్పుడు కాని కొన్ని అసలు విషయాలు బయటపెట్టలేదు. కోడెల మరణించినప్పుడు హడావుడి చేయడం తప్పించి, తదుపరి ఆయన కుటుంబ సభ్యులను పట్టించుకోలేదని ఇప్పుడు వెల్లడైంది. చివరికి ప్రభుత్వ లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు జరపవద్దని శివరామ్తో చెప్పించారట. కోడెల టీడీపీ నేతగా ఉన్న సమయంలో కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్లో ఉండేవారు. వారిద్దరి మధ్య రాజకీయ విమర్శలు సాగుతుండేవి. నమ్ముకున్న కుటుంబాన్ని నట్టేట ముంచేశారు.. కోడెలపై కన్నా కేసులు పెట్టించారని కూడా శివరామ్ ఆరోపిస్తున్నారు. కోడెలతో గొడవలేమో కాని, చంద్రబాబుపై కన్నా తీవ్ర విమర్శలే.. కాదు.. కాదు.. దూషణలే చేసేశారు. తనను హత్య చేయించడానికి చంద్రబాబు యత్నించారని కూడా కన్నా ఆరోపించారు. బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబును పట్టుకుని వాడెవడు, వీడెవడు అంటూ మాట్లాడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయినా వీరిద్దరి మధ్య ఎక్కడ రాజీకుదిరిందో కాని కన్నా సడన్గా టీడీపీలోకి జంప్ చేయడం, ఆయనకు సత్తెనపల్లి టిక్కెట్ ఇచ్చేయడం, ఇంతకాలం తనను నమ్ముకున్న కోడెల కుటుంబాన్ని నట్టేట ముంచేయడం జరిగాయన్నమాట. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే లక్ష్యంతో.. శివరామ్తో పాటు మరికొందరు సత్తెనపల్లి టీడీపీ నేతలకు కూడా కన్నాను అభ్యర్ధి చేయడంపై జీర్ణించుకోలేకపోయినా,వారు పెద్దగా స్పందించినట్లు కనిపించలేదు. చంద్రబాబు ఎందుకు శివరామ్ను బలి చేయడానికి వెనుకాడలేదన్న చర్చ సహజంగానే వస్తుంది. శివరామ్ సత్తెనపల్లిలో గెలవలేడన్న అభిప్రాయానికి వచ్చి ఉండాలి. లేదా శివరామ్కు సత్తెనపల్లిలో మంచి పేరు లేదన్న భావన అయినా కావాలి. లేదూ కోడెల వల్ల అప్పట్లో పార్టీకి నష్టం కలిగిందని అనుకుని ఉండవచ్చు. కాకపోతే కోడెల చనిపోయినప్పుడు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే లక్ష్యంతో ఆయన మృతిని వాడుకున్నారన్నమాట. చదవండి: Fact Check : పేదల ఇళ్లపై పిచ్చి రాతలు.. బాబు కొంప కొల్లేరవుతుందనే! నిజానికి కన్నాపై చంద్రబాబు కూడా గతంలో చాలా తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. కొన్నిసార్లు అసెంబ్లీలో తిట్టుకున్నంత పనిచేశారు. అయినా రాజకీయం మారింది. ఇద్దరూ తమ తిట్లను తూచ్ అనుకున్నారు. చంద్రబాబు ఎవరినైనా మేనేజ్ చేయగలరన్నదానికి ఇదొక ఉదాహరణ కూడా కావచ్చు. కన్నా నిజానికి జనసేన పార్టీలో చేరవచ్చని అంతా అనుకున్నారు. ఆ మేరకు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో చర్చలు కూడా జరిగాయి. కన్నా కాపు సామాజికవర్గంలో కొంత గుర్తింపు పొందిన సీనియర్ నేత కనుక ఆయన జనసేనలో చేరితే ఆ పార్టీ పరిస్థితి మెరుగు అయితే పొత్తు సమయంలో ఎక్కువ సీట్లు అడుగుతారని చంద్రబాబు ఊహించి ఉండవచ్చు. అందుకే కన్నా జనసేనలోకి వెళ్లకుండా టీడీపీలోకి లాగేసింది.. అందుకే కన్నా జనసేనలోకి వెళ్లకుండా టీడీపీలోకి లాగేసి జనసేనను, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను ఒక దెబ్బేశారన్నమాట. అయినా పవన్ పెద్దగా పీల్ అవరు కాబట్టి ఆయన చంద్రబాబు చొక్కా పట్టుకుని వెళుతున్నారు. ఇదే సమయంలో మరో వీడియో ఒకటి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. గతంలో పొత్తు లేనప్పుడు పవన్ను ఉద్దేశించి తోక కట్ చేస్తానని చంద్రబాబు అన్నట్లుగా ఆ వీడియోలో ఉంది. పవన్ను తనకు అనుకూలంగా మార్చుకోవడమే కాకుండా, ఆయన సీఎం పదవి డిమాండ్ చేయకుండా తోక కట్ చేయగలిగారని అనుకోవాలి. ఇక కన్నాకు సత్తెనపల్లిలో టీడీపీ గ్రూపులు సహకరిస్తాయా?లేదా?అన్నది సంశయమే. టీడీపీకి గుండెలో రాయి పడినట్లే.. ఇప్పటికే శివరామ్ తాను సత్తెనపల్లిలో పోటీచేస్తానని అంటున్నారు. ఆయన ఇండిపెండెంట్గా పోటీలో దిగితే కన్నా కష్టాలు తప్పకపోవచ్చు. విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ ఏ పిట్టల దొరకు టిక్కెట్ ఇస్తే ఏమిటి అని వ్యాఖ్యానించడం ద్వారా చంద్రబాబు నాయుడును ఇబ్బందిలో పెట్టారు. ఉన్న ముగ్గురు లోక్ సభ సభ్యులలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అంటీ,అంటనట్లు ఉంటున్నారు. కేశినేని నాని వైసీపీ ఎమ్మెల్యేలతో అభివృద్ది విషయంలో కలిసి పనిచేస్తానని చెబుతున్నారు. ఇదే సందర్భంలో టీడీపీ పిట్టలదొరకు ఎంపీ టిక్కెట్ ఇవ్వబోతోందని తేల్చేశారు. నానీ సోదరుడు చిన్నీకి టిక్కెట్ ఇవ్వవచ్చని వార్తలు వస్తున్న తరుణంలో నాని తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారన్నమాట. అవసరమైతే స్వతంత్రంగా పోటీచేస్తానని నాని సంకేతం ఇవ్వడం టీడీపీకి గుండెలో రాయి పడినట్లే అవుతుంది. చదవండి: కేసీఆర్కు ఆ భయం పట్టుకుందా?.. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది..! కాగా మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఇటీవల టీడీపీలోని మరో గ్రూపు సుబ్బారెడ్డి అనుచరులపై దాడి చేసి జైలుకు వెళ్లివచ్చారు. భర్తతో కలిసి ఆమె చేస్తున్న చర్యలతో పార్టీ పరువు పోతోందని కార్యకర్తలు చెబుతున్నారు. ఆమెకు పార్టీ నోటీసు ఇచ్చింది. అసలే నంద్యాల, కర్నూలు జిల్లాలలో పార్టీ బాగా బలహీనంగా ఉందనుకుంటుంటే, ఈ గొడవలతో మరింత అప్రతిష్టపాలవుతోంది. మరో వైపు చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఫౌండేషన్ల పేరుతో కొందరు వ్యక్తులు రాజకీయాలు చేస్తుంటే వారికి టీడీపీ టిక్కెట్లు ఇస్తామనడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు వైసీపీలో జరిగి ఉంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటివి ఆ పార్టీ పని అయిపోయిందని విపరీత ప్రచారం చేసేవి. టిడిపిలో ఈ పరిణామాలపై మాత్రం అవి కిమ్మనకుండా మూసుకుని ఉండడం కూడా గమనించదగ్గ అంశమే. మహానాడుతో టీడీపీకి ఊపు వచ్చిందని ప్రచారం చేయాలని అనుకున్న టీడీపీకి, చంద్రబాబుకు ఈ పరిణామాలు జీర్ణం కానివే. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
టీడీపీలో ముసలం.. కోడెల కుమారుడు శివరాం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, పల్నాడు జిల్లా: సత్తెనపల్లి టీడీపీలో ముసలం పుట్టింది. నియోజకవర్గ ఇంచార్ద్ నియామకం టీడీపీలో కాక రేపుతోంది. అనుచరులతో కోడెల కుమారుడు శివరాం సమావేశమయ్యారు. టీడీపీ ఇన్ఛార్జ్గా కన్నా లక్ష్మీనారాయణ నియామకాన్ని వ్యతిరేకిస్తున్న కోడెల శివరాం.. పట్టణంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. ఇన్ఛార్జ్గా కన్నా పేరు ప్రకటనపై తమకు సమాచారం లేదని కోడెల శివరాం మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో కన్నా అరాచకాలను కోడెల అడ్డుకున్నారని, టీడీపీని అవమానించిన నాయకులకు పెద్దపీట వేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ‘‘లాలుచి రాజకీయాలు మాకు తెలియదు. తెలుగుదేశం పార్టీని కోడెల బతికించారు. కొంత మంది నాయకులు మాపై కుట్రలు చేస్తున్నారు. టీడీపీ అధిష్టానం మమ్మల్ని పట్టించుకోవటం లేదు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అధిష్టానం సత్తెనపల్లిని టార్గెట్ చేసింది’’ అంటూ శివరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: టీడీపీకి షాకిచ్చిన కొట్టే వెంకట్రావు దంపతులు -
కోడెల ఆత్మహత్య తర్వాత అసలు అక్కడ ఏం జరుగుతోంది?
పచ్చ పార్టీలో పల్నాటి యుద్ధం జరుగుతోందా? ఆ పార్టీ మాజీ స్పీకర్ నియోజకవర్గం పేరు చెబితే చంద్రబాబుకు చెమటలు పడుతున్నాయెందుకు? ఆ నియోజకవర్గంలో చంద్రబాబునే పట్టించుకోని నాయకులెవరు? రెండు వర్గాలకు తోడు ఇప్పుడు మూడో కృష్ణుడు తోడయ్యాడా? ఇంతకీ సత్తెనపల్లి టీడీపీలో ఏం జరుగుతోంది? పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నుంచి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు మీద వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అంబటి రాంబాబు ఘన విజయం సాధించారు. కోడెల ఆత్మహత్య తర్వాత చంద్రబాబు ఈ నియోజకవర్గానికి పార్టీ ఇన్ ఛార్జిని ప్రకటించలేదు. దీంతో కోడెల కొడుకు శివరాం, మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు మధ్య తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ప్రతి కార్యక్రమంలోనూ నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కొట్టుకుంటున్నారు కోడెల, వైవీ వర్గీయులు. సాక్షాత్తూ చంద్రబాబు చెప్పినా ఎవరూ వినని పరిస్థితి ఏర్పడింది. పార్టీ నాయకత్వంతో సంబంధం లేకుండా ఎవరి వర్గాలతో వారు కమిటీలు కూడా వేసుకున్నారు. నియోజకవర్గంలో పార్టీని గాడిలో పెట్టడానికి చంద్రబాబు ఒక దూతను నియమించారు. కానీ వచ్చిన చంద్రబాబు దూత ఈ ఇద్దరి టార్చర్ తట్టుకోలేక దండం పెట్టి పారిపోయారు. సత్తెనపల్లిలో పార్టీని గాడిలో పెడదామని చాలాసార్లు ప్రయత్నించిన చంద్రబాబు ఏమీ చెయ్యలేక చివరికు ఆయన కూడా చేతులెత్తేశారు. పార్టీ అధినేత చంద్రబాబు మాటకే విలువ ఇవ్వకపోగా.. రెండు వర్గాలు ప్రతి విషయంలోనూ గొడవలు పడుతూ పార్టీని రోడ్డున పడేశారు. పార్టీ నాయకత్వం ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్ లోనే విడి విడిగా రెండు వర్గాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. సత్తెనపల్లి పార్టీని ఎలా దారికి తేవాలో అర్థంకాని పరిస్థితుల్లో.. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. కన్నా కూడా ఇప్పుడు సత్తెనపల్లిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కన్నా తరచూ వెళ్ళి..పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం అటు కోడెల శివరాం, ఇటు వైవీ ఆంజనేయులు వర్గీయులకు మింగుడు పడడం లేదు. నాలుగేళ్ల నుంచి పార్టీకోసం కష్టపడుతున్నాం.. ఇప్పుడు కన్నా వచ్చి ఫోజులు కొడితే ఊరుకునేది లేదంటూ బహిరంగంగానే ప్రకటనలిస్తున్నారు. అదే సమయంలో రెండు వర్గాలు ఎక్కడా తగ్గడంలేదు. టికెట్ నేనే తెచ్చుకుంటా.. ఇక్కడ పోటీ చేసేది కూడా నేనే అని కోడెల శివరాం తేల్చిచెబుతున్నారు. మరోవైపు వైవీ ఆంజనేయులు అయితే పార్టీ నాయకత్వం తనకు హామీ ఇచ్చిందని చెబుతున్నారు. రెండు వర్గాలనే దారికి తెచ్చుకోవాలని చంద్రబాబు కన్నా లక్ష్మీనారాయణను తెచ్చుకుని మరో కొరివి నెత్తిన పెట్టుకున్నారు. మూడో కృష్ణుడు కన్నా రెండు పాత వర్గాలను దెబ్బ తీయడానికి తన వర్గం కేడర్తో వ్యూహాలు పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో తన తండ్రిని కన్నా అవమానించారంటూ కోడెల శివరాం కొత్త రాగం అందుకున్నారు. మరోవైపు వైవీ ఆంజనేయులు కూడా కన్నాను దెబ్బ తీసేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. చదవండి: టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్న ఎన్ఆర్ఐ ఈ మూడు ముక్కలాట వ్యవహారంతో చంద్రబాబు పరిస్థితి పెనం మీదనుంచి పొయ్యిలో పడినట్లయ్యింది. కోడెల శివరాం మాత్రం.. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఏం చెయ్యాలో అది చేసి చూపిస్తానంటూ నాయకత్వానికే వార్నింగ్ లు ఇస్తున్నారు. సత్తెనపల్లిలో పోటీ చేసేది మనమే అంటూ కన్నా లక్ష్మీనారాయణ తన అనుచరులకు సంకేతాలిస్తున్నారు. చంద్రబాబు స్వయంగానే ఈ విషయాన్ని చెబుతారంటూ సత్తెనపల్లిలో ప్రచారం చేయించుకుంటున్నారు. రెండు వర్గాలకు తోడుగా మరో వర్గాన్ని తెచ్చి పెట్టుకున్న చంద్రబాబు.. పల్నాటి యుద్ధాన్ని ఎలా దారికి తెచ్చుకుంటారో చూడాలి. మొత్తం మీద సత్తెనపల్లి నియోజకవర్గం చంద్రబాబుకు బీపీ పెంచుతోందని అక్కడి పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. చదవండి: పవన్ అంటే ఆటలో అరటి పండే..! -
కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు చంద్రబాబే కారణం
-
‘కోడెల మరణానికి చంద్రబాబే ప్రధాన కారణం’
సాక్షి, పల్నాడు: టీడీపీ అధినేత చంద్రబాబుకి మంత్రి అంబటి రాంబాబు పొలిటికల్ పంచ్ ఇచ్చారు. చంద్రబాబు సత్తెనపల్లి సభ అట్టర్ ప్లాప్ అయిందని కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఒక రాజకీయ సైకో అంటూ సీరియస్ అయ్యారు. కాగా, మంత్రి అంబటి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘సత్తెనపల్లి సభకు జనం రాకపోయినా అద్భుతం అనడం చంద్రబాబు ఖర్మ. చంద్రబాబు సభకు జనం నుంచి స్పందన కరువైంది. చంద్రబాబు ఒక ముసలి సైకో. అధికారం లేకుండా ఉండలేని సైకో చంద్రబాబు. ఆయన ఒక్క నిజమైనా చెప్పారా.. అన్నీ అబద్ధాలే. చంద్రబాబును మించిన సైకో ఈ రాష్ట్రంలో ఎవరూ లేరు. రెక్కల కష్టంలో పార్టీని నిలబెట్టిన జగన్ అనర్హులా?. చంద్రబాబు, నారా లోకేష్ మాత్రమే అర్హులా? అన్ని ప్రశ్నించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు.. నువ్వు పేదల్ని ధనవంతుల్ని చేశావా?. కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు చంద్రబాబే కారణం. కోడెల ఉరివేసుకోవడానికి ప్రధాన కారణం చంద్రబాబే.. ఆయన కుటుంబానికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు. బాబు.. ఎక్కడ పుట్టారు.. ఎక్కడ పెరిగారు?. సత్తెనపల్లి వచ్చి నాపై విమర్శలా?. చంద్రాబు తప్పిదం వల్లే పోలవరం ఆలస్యమైంది. కాఫర్ డ్యాం కట్టకుండా డయాఫ్రం వాల్ కట్టారు. చంద్రబాబు తప్పిదం వల్ల రూ.2వేల కోట్లు నష్టం జరిగింది’ అని అన్నారు. ఇది కూడా చదవండి: తండ్రీకొడుకులకు సెల్ఫీల పిచ్చి -
తెలుగుతమ్ముళ్ల కుమ్ములాట
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తెలుగుదేశం కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. గురువారం పార్టీ సంస్థాగత కమిటీ సమావేశం సందర్భంగా మరోసారి నియోజకవర్గంలో నాయకుల వర్గవిభేదాలు బహిర్గతమయ్యాయి. మాటలు పెరిగి కుర్చీలతో దాడులు చేసుకున్నారు. గతంలో ఇక్కడ పోటీచేసి ఓటమిపాలైన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యానంతరం పార్టీ అధిష్టానం ఎవరికీ నియోజకవర్గ ఇన్చార్జి పదవి అప్పగించలేదు. దీంతో నియోజకవర్గంలో ఒకే సామాజికవర్గానికి చెందిన కోడెల శివరాం, మాజీ శాసనసభ్యుడు వై.వి.ఆంజనేయులు, తెలుగుయువత నాయకుడు మన్నెం శివనాగమల్లేశ్వరరావు (అబ్బూరి మల్లి) ఎవరికివారు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గురువారం పార్టీ సంస్థాగత కమిటీ విషయంలో సత్తెనపల్లిలోని ఎన్టీఆర్ భవన్లో పార్టీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కొండెపి ఎమ్మెల్యే డోల బాలవీరాంజనేయస్వామి, పార్టీ నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు, మాజీమంత్రి నక్కా ఆనందబాబు, మాజీ శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ హాజరయ్యారు. అప్పటికే మాజీ ఎమ్మెల్యే వై.వి.ఆంజనేయులు, మన్నెం శివనాగమల్లేశ్వరరావు తదితరులు కార్యకర్తలతో పార్టీ కార్యాలయంలో ఉన్నారు. కోడెల శివరాం తన వర్గంతో ర్యాలీగా ఎన్టీఆర్ భవన్ వద్దకు వచ్చి ఇన్చార్జిని నియమించకుండా సంస్థాగత కమిటీ నియామకాలు ఏమిటని ప్రశ్నించారు. స్థానికులుకాని వారి సలహాలు అవసరం లేదంటూ నినదించారు. ఈ క్రమంలో కార్యకర్తల మధ్య వాగ్వాదం తలెత్తింది. పరస్పరం కుర్చీలతో కొట్టుకున్నారు. సమావేశానికి వచ్చిన పరిశీలకులు ఇన్చార్జి నియామక విషయం అధిష్టానం చూసుకుంటుందని, ప్రస్తుతం సంస్థాగత కమిటీ సమావేశం జరుగుతుందని చెప్పారు. అయినా గొడవ ఆగకపోవడంతో మాజీ ఎమ్మెల్యే వై.వి.ఆంజనేయులు, ముఖ్య నాయకులు బయటకు వచ్చారు. తెలుగుతమ్ముళ్ల గొడవను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై శివరాం వర్గీయులు దురుసుగా ప్రవర్తించడమేగాక సెల్ఫోన్లు లాక్కున్నారు. దీంతో సమావేశాన్ని కవర్ చేయకుండా మీడియా ప్రతినిధులు బాయ్కాట్ చేశారు. -
కోడెలది చంద్రబాబు చేసిన హత్యే
సత్తెనపల్లి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుది ముమ్మాటికీ చంద్రబాబు చేసిన హత్యేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్పై టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను అంబటి తీవ్రంగా ఖండించారు. అభ్యంతరకరంగా, అమానవీయంగా సీఎంను, మంత్రులను దూషించడం సమంజసం కాదన్నారు. అవాకులు, చవాకులు పేలితే ప్రజలు నాలుక తెగ్గోస్తారని హెచ్చరించారు. అయ్యన్న తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదా ఆయనకు పిచ్చెక్కిందని చంద్రబాబు ప్రకటించాలని కోరారు. చదవండి: జోగి రమేష్పై టీడీపీ దాడి కోడెల ఆత్మహత్యకు నెల ముందు బలవన్మరణానికి ప్రయత్నించి.. ఆయన అల్లుడి వైద్యశాలలో చికిత్స పొందితే పరామర్శించడానికి కూడా చంద్రబాబు రాలేదని గుర్తు చేశారు. అంతేకాకుండా పార్టీ నుంచి కోడెలను బయటకు సాగనంపాలని చూడటంతో కోడెల తీవ్ర మనస్తాపం చెందారన్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు వేధించడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారని స్పష్టం చేశారు. ఈ వాస్తవం సత్తెనపల్లి చుట్టుపక్కల వారందరికీ తెలుసన్నారు. అయ్యన్న ఇది గమనించాలని కోరారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను దుర్భాషలాడుతూ మాట్లాడటం అయ్యన్నలాంటి సీనియర్లకు పద్ధతి కాదని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ రాయపాటి పురుషోత్తమరావు తదితరులు పాల్గొన్నారు. -
కోడెల శివరాం కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు: టీడీపీ నేత
సాక్షి, గుంటూరు: కోడెల శివప్రసాద్ కొడుకు కోడెల శివరాం గత ఐదేళ్లలో కష్టపడి పని చేసిన పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేశారని టీడీపీ నేత పమిడి బాలకృష్ణ సంచలన వ్యాఖలు చేశారు. నకరికల్లు మండలం కల్లకుంటలో రేపు(గురువారం) కోడెల విగ్రహావిష్కరణకు వచ్చే చంద్రబాబు నాయుడు, లోకేష్, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా జోక్యం చేసుకోవాలన్నారు. తమ దగ్గర నుంచి కోడెల శివరాం రూ.32 లక్షలు తీసుకున్నారని మండిపడ్డారు. ఆ డబ్బులు తిరిగి మాకు చంద్రబాబునాయుడు, లోకేష్, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు ఇప్పించాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు. 30ఏళ్ల నుంచి పార్టీకి ఎంతో ఖర్చు పెట్టి అంకితభావంతో పని చేశామని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో నీరు-చెట్టు పనులు చేస్తున్న తమని కోడెల శివరాం బాగా ఇబ్బంది పెట్టారని చెప్పారు. కోడెల శివరాం వల్ల తాము బాగా నష్టపోయామని, తమచేత ఖాళీ పేపర్ల పైన సంతకాలు పెట్టించుకున్నారని తెలిపారు. పార్టీకి నష్టం చేసిన కోడెల శివరాం మళ్లీ పార్టీలో యాక్టివ్ అవ్వటానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కోడెల శివరాం ధన దాహం వల్ల నరసరావుపేట సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు నష్టపోయారని బాలకృష్ణ పేర్కొన్నారు. టీడీపీ నేత పమిడి బాలకృష్ణ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘ఇంతకీ కోడెల శివప్రసాద్ సెల్ఫోన్ ఏమైనట్టు..’
సాక్షి, గుంటూరు: కోడెల జయంతిని పురస్కరించుకుని అతని ఆత్మహత్యను వైఎస్సార్సీపీ మీదకు నెట్టాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు చూస్తున్నారని ట్విట్టర్ వేదికగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆరుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించి.. అనేక పదవులు నిర్వహించిన అరుదైన నాయకుడు కోడెల శివప్రసాద్రావు అని అన్నారు. ఓటమి చెందిన తర్వాత కోడెల పట్ల బాబు దుర్మార్గ వైఖరే ఆత్మహత్యకు కారణమన్నారు. వెన్నుపోటు పొడవడం, దండేసి పొగడటం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ‘ఇంతకీ కోడెల శివప్రసాద్ సెల్ఫోన్ ఏమైనట్టు! ఫార్మాట్ చేయకుండా బయటపెట్టగలరా’ అని ప్రశ్నిస్తూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. (‘నాకు రిప్లై ఇచ్చారహో..’) ఇంతకీ కోడెల సెల్ ఫోన్ ఏమైనట్టు!! ఫార్మట్ చేయకుండా బయట పెట్టగలరా? @ncbn @GVDKrishnamohan — Ambati Rambabu #StayHomeStaySafe (@AmbatiRambabu) May 2, 2020 ఆరు సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించి అనేక పదవులు నిర్వహించిన అరుదైన నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాద్(1/2) — Ambati Rambabu #StayHomeStaySafe (@AmbatiRambabu) May 2, 2020 ఈ రోజు కోడెల జయంతిని పురస్కరించుకుని అతని ఆత్మహత్యను వైసీపీ మీదకు నెట్టాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు.ఓటమి చెందిన తరువాత కోడెల పట్ల బాబు దుర్మార్గ వైఖరే ఆత్మహత్యకు కారణం అనేది జగమెరిగిన సత్యం. వెన్నుపోటు పొడవడం దండేసి పొగడటం బాబు గారికి వెన్నతో పెట్టిన విద్య(2/2)@ncbn — Ambati Rambabu #StayHomeStaySafe (@AmbatiRambabu) May 2, 2020 -
‘కోడెల పోస్టుమార్టం నివేదిక అందలేదు’
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతికి సంబంధించిన కేసులో పోస్టుమార్టం నివేదిక ఇంకా అందలేదని బంజారాహిల్స్ ఏసీపీ, ఈ కేసు విచారణ అధికారి కేఎస్ రావు తెలిపారు. గత సెప్టెంబర్ 16వ తేదీన కోడెల హైదరాబాద్ బంజారాహిల్స్లోని తన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోడెల కుటుంబ సభ్యులను పోలీసులు ఇప్పటికే విచారించి ఆయన సెల్ఫోన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆయన మృతి చెందిన రోజు ఘటనా స్థలంలో సేకరించిన కొన్ని వస్తువులను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపామని కేఎస్ రావు తెలిపారు. దీనిపై నివేదిక వచ్చాక ఈ కేసులో పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు. -
కోర్టులో లొంగిపోయిన కోడెల కుమార్తె
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మి గురువారం కోర్టులో లొంగిపోయారు. ఉద్యోగాల పేరుతో రూ. లక్షలు దండుకుని అమాయకపు ప్రజలను మోసం చేసిన కేసుకు సంబంధించి ఆమె కోర్టు ముందు హాజరయ్యారు. అయితే ప్రస్తుతానికి ఆమెకు రెండు కేసుల్లో బెయిల్ మంజూరు అయింది. ప్రతి ఆదివారం వన్టౌన్, టూటౌన్ స్టేషన్లలో సంతకం చేయాలని.. 1వ అదనపు జిల్లా మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు విజయలక్ష్మికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కాగా, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని విజయలక్ష్మి పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఆమెపై పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. -
పోలీసుల అదుపులో కోడెల బినామీ!
సాక్షి, నరసరావుపేట: కేట్యాక్స్ కేసుల్లో కీలక పాత్రధారి గుత్తా నాగప్రసాద్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. గత టీడీపీ పాలనలో కోడెల కుటుంబానికి అన్నీ తానై వ్యవహరించి సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరు నియోజకవర్గాల్లో ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా బలవంతపు వసూళ్లకు పాల్పడటంలో ఇతను కీలక పాత్ర పోషించాడు. పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావటంతో పరారయ్యాడు. మాజీ స్పీకర్ కోడెల, అతని కుమారుడు శివరాంలపై నమోదైన కేసుల్లోనూ నాగప్రసాద్ నిందితుడిగా ఉన్నాడు. ప్రభుత్వం మారాక తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శివరాం, ప్రసాద్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శివరాం కబ్జా చేసిన ఆస్తులను ప్రసాద్ పేరిట రాయించినట్లు తెలిసింది. భూ కబ్జా కేసులో టీడీపీ నేత పోతినేని అరెస్టు మంగళగిరి: భూకబ్జా కేసులో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్చార్జి పోతినేని శ్రీనివాసరావును పోలీసులు గురువారం అరెస్టు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పట్టణంలోని లక్ష్మీనరసింహపురం కాలనీలో బీసీలకు చెందిన రూ.కోట్ల విలువైన భూమిని పోతినేని శ్రీనివాసరావు కబ్జా చేయడంతో పాటు రికార్డులు తారుమారు చేసి ఆక్రమించారనే ఆరోపణలున్నాయి. భూ యజమాని పోలీసులతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అధికార యంత్రాంగం అంతా పోతినేనికి అండగా నిలవడంతో భూయజమానినిబెదిరించి ఆ భూమిని ఆక్రమించుకుని భూమికి ఫెన్సింగ్ వేసి నిర్మాణం చేపట్టాడు. అయితే పోతినేని శ్రీనివాసరావు భూ కబ్జాపై భూయజమానురాలు కుంచాల మంగేశ్వరి మళ్లీ ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. -
సత్తేనపల్లి ఇన్చార్జి నియామకంపై మల్లగుల్లాలు !
సాక్షి, గుంటూరు : టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. కోడెల చివరి రోజుల్లో ఆయన్ను పట్టించుకోని టీడీపీ నాయకులు అనంతరం శవరాజకీయాలకు దిగి నానాయాగీ చేశారు. కోడెల మరణంతో సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పదవి ఖాళీ అయింది. ఈ పదవిని కోడెల తనయుడు శివరామకృష్ణకు ఇచ్చి రాజకీయంగా సానుభూతి సంపాదించుకోవాలని చంద్రబాబు యోచించినట్టు తెలిసింది. గత ఐదేళ్లలో తమను వేధించిన శివరామ్కే ఇన్చార్జి పదవిని ఇస్తామంటే ఒప్పుకునేది లేదని కోడెల వ్యతిరేకవర్గం తేల్చి చెప్పినట్టు సమాచారం. సార్వత్రిక ఎన్నికలకు ముందే కోడెల శివప్రసాదరావుకు సత్తెనపల్లి టిక్కెట్ ఇవ్వొద్దని సొంత పార్టీలోని వ్యతిరేక వర్గం నాయకులు రోడ్లపై నిరసనలు చేపట్టారు. ఎన్నికల అనంతరం కోడెల కుటుంబంపై కే–ట్యాక్స్ కేసులు వరుసగా నమోదవుతూ పార్టీ పరువు బజారున పడుతుండటంతో అప్పట్లో కోడెల వ్యతిరేక వర్గం నాయకులు పార్టీ ఇన్చార్జిగా కోడెలను తొలగించాలని డిమాండ్ చేశారు. 200 వాహనాలతో సత్తెనపల్లి నుంచి ర్యాలీగా గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో కోడెలను పార్టీ నుంచి పోమ్మనలేక పొగబెట్టాలని భావించిన చంద్రబాబు రాయపాటి రంగబాబును రంగంలోకి దించాడు. కోడెల వ్యతిరేక వర్గంతో రంగబాబు పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. రంగబాబే నియోజకవర్గ పార్టీ ఇన్చార్జని కోడెల వ్యతిరేకవర్గం నాయకులు ప్రచారం చేశారు. కోడెల మరణంతో నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి తానేనని శివరామ్ సైతం సన్నిహితులతో చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నట్టు ఆ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. ఎటూ తేల్చుకోలేని పరిస్థితి... రాజకీయంగా సానుభూతి సంపాదించడం కోసం కోడెల శివరామ్ను నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా నియమిస్తే క్యాడర్ పార్టీ మారే అవకాశం ఉంది. క్యాడర్ డిమాండ్ను శిరసా వహిస్తూ వేరే వ్యక్తిని నియమిస్తే కోడెల కుటుంబంపై చంద్రబాబు నకిలీ ప్రేమ బయటపడుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎటూ తేల్చుకోలేక సతమతవుతున్నారని టీడీపీకి చెందిన ఓ సీనియర్ నాయకులు అంటున్నారు. మరో వైపు ఇన్చార్జి పదవి కోసం రాయపాటి రంగబాబు, టీడీపీ అనుబంధ సంస్థ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు అబ్బూరి మల్లి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో సత్తెనపల్లి టిక్కెట్ ఆశించి భంగపడినవారిలో అబ్బూరి మల్లీ కూడా ఒకడు. శివరామ్కు ఇన్చార్జి బాధ్యతలు దక్కకుండా కోడెల వ్యతిరేక వర్గాన్ని ఈ ఇద్దరూ లీడ్ చేస్తున్నట్టు సమాచారం. కోడెల మరణించినప్పుడు ఆయన కుటుంబంపై వల్లమాలిన ప్రేమాభిమానాలు ఒలకబోసిన జిల్లా టీడీపీ నాయకులు సైతం శివరామ్ను ఇన్చార్జిగా నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. -
మంగళగిరి కోర్టుకు హజరైన కోడెల శివరాం
-
మంగళగిరి కోర్టుకు కోడెల శివరాం
సాక్షి, గుంటూరు : టీడీపీ దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం బుధవారం మంగళగిరి కోర్టు ఎదుట లొంగిపోయారు. అసెంబ్లీ ఫర్నీచర్ను దాచిపెట్టిన కేసులో హైకోర్టు ఆదేశాలతో ఆయన నేడు మంగళగిరి కోర్టు ముందు హాజరయ్యారు. దీనిపై శివరాం లాయర్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ.. ‘శివరాంకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. అందుకు సంబంధించిన షూరిటీలను ఆయన మంగళగిరి కోర్టుకు అందజేశారు. ప్రతి శుక్రవారం ఆయన తుళ్లూరు పోలీస్ స్టేషన్కు హాజరై సంతకం పెట్టాల్సి ఉంద’ని తెలిపారు. తన తండ్రి కోడెల శివప్రసాదరావు స్పీకర్గా వ్యవహరించిన కాలంలో కొనుగోలు చేసిన ఫర్నీచర్.. శివరాంకు చెందిన షోరూమ్లో లభించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి శివరాంపై సెక్షన్ 409, 411 ల కింద కేసు నమోదైంది. -
కోడెల ఆత్మహత్యకు కారకుడు చంద్రబాబే
సాక్షి, నరసరావుపేట(గుంటూరు) : దివంగత మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు బలవన్మరణానికి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో పాటు కోడెల కుమారుడు, కుమార్తె కారణమని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గతంలోనే కోడెల ఆత్మహత్యకు పాల్పడి గుంటూరులోని తన అల్లుడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా గుంటూరులోనే ఉన్న చంద్రబాబు కనీసం పరామర్శించక పోగా, దగ్గరుండాల్సిన ఆయన కుమారుడు కెన్యాలో ఉన్నాడని, కుమార్తె, భార్య హైదరాబాద్కే పరిమితమయ్యారన్నారు. దీంతో అన్ని విధాలుగా తాను ఏకాకినయ్యానని భావించిన కోడెల విరక్తితో హైదరాబాద్లోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. ఇది ప్రభుత్వ హత్య అంటూ పదే పదే టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. నరసరావుపేటలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ సోమవారం నిర్వహించిన కోడెల సంతాప సభలో మాజీ సీఎం చంద్రబాబు తమ ప్రభుత్వంపైన, సీఎం జగన్మోహనరెడ్డిపైన, తనపైన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సంతాప సభను టీడీపీ నాయకులు రాజకీయ వేదికగా మార్చుకున్నారే కాని నిజంగా కోడెలకు నివాళులు అర్పించలేదన్నారు. రూ.లక్ష ఇస్తాం, ఫర్నిచర్ ఇస్తావా? కోడెల తీసుకొచ్చిన ఫర్నిచర్ కేవలం రూ.లక్ష విలువే నంటూ చంద్రబాబు పదే పదే చెబుతున్నారని, దీనిలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఈ ఫర్నిచర్కు తాము రూ.లక్ష ఇస్తామని తీసుకొచ్చి ఇవ్వలగలరా అని ప్రశ్నించారు. దీనిలో 14 కుర్చీలతో గల బిజినెస్ టేబుల్ రూ.65 లక్షలని, ఇవి ఇతరదేశాలకు చెందిన ఫర్నిచర్ అని, గతంలో పనిచేసిన స్పీకర్లు తెప్పించారన్నారు. మొత్తం ఫర్నిచర్ విలువ రూ.1.5 కోట్ల విలువ ఉంటుందన్నారు. వాస్తవాలు బయటకు రావాలి కోడెల అసలు ఎందుకు చనిపోయాడో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఒక వ్యక్తి ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడితే ఆ వ్యక్తి దగ్గర 21 రోజుల పాటు కుటుంబ సభ్యులు ఉండాలనే నిబంధన ప్రతి డాక్టర్కు తెలుసు అన్నారు. ఈ విషయం డాక్టర్లు అయిన కోడెల కుమారుడు, కుమార్తెకు కూడా తెలియంది కాదన్నారు. ఆయన వెంట ఎవరూ లేకుండా ఒంటరిగా ఉంచటం ఎంతవరకు సమంజసం అన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఈ కేసుల్లో ఎవరినీ అరెస్టు చేయవద్దని స్వయంగా ఆదేశాలు ఇచ్చారన్నారు. ఆరోజు 9.45 గంటలకు ఆత్మహత్య చేసుకుంటే పోలీసులకు 10.30కు సమాచారం ఇచ్చారన్నారు. చివరిసారిగా తన కుమార్తెకు దండం పెట్టి పైన ఉన్న తన గదికి వెళ్లారన్నారు. గదిలోకి పోయిన కోడెల ఏం చేస్తున్నాడనేది కూడా వారు పరిశీలించలేదన్నారు. తన మిత్రులకు ఫోన్ చేసి తాను చివరిసారిగా మాట్లాడుతున్నానని చెప్పారన్నారు. తమపై పెట్టిన కేసుల్లో బాధితులకు రూ.6,7 కోట్లు డబ్బులు ఇచ్చేద్దామని కుమారుడు, కుమార్తెకు చెప్పినా వారు వినలేదన్నారు. వీటన్నింటిపై విచారణ తప్పకుండా జరగాలన్నారు. చంద్రబాబు తమపై వ్యాఖ్యానించిన ‘‘పనికిమాలిన ఎమ్మెల్యే’’, ‘‘గెలిచారో.. లేదో’’ అన్న మాటలపై అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ కూడా తీసుకొస్తామని చెప్పారు. ఈనెల 3వతేదీన అసెంబ్లీ కార్యదర్శికి నోటీసు ఇస్తామన్నారు. నిజంగా కోడెల కుటుంబంపై ప్రేమ ఉంటే కుమారుడు, కుమార్తెకు నరసరావుపేట, సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కోడెల చావును శవరాజకీయం చేయటం మానుకోవాలని చంద్రబాబును కోరారు. చీకటి రాజకీయాలు చంద్రబాబుకే ఎరుక ముఖ్యమంత్రి నేరస్తుడైతే ఇలాగే ఉంటుందని చంద్రబాబు మాట్లాడుతున్నాడని, జగన్మోహనరెడ్డి నేరస్తుడని ఏ కోర్టు అయినా ముద్ర వేసిందా అని ప్రశ్నించారు. ఆయనపై ఉన్న కేసులు విచారణ జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు లాగా కేసులకు భయపడి చీకట్లో చిదంబరాన్ని కలవటం, తన పార్టీ రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్లను బీజేపీలోకి పంపించి వారి కాళ్లు పట్టుకునే పనులు జగన్ చేయలేదన్నారు. ధైర్యంగా కేసులు ఎదుర్కొం టున్నారన్నారు. -
‘సంతాప సభను.. బాబు రాజకీయ సభగా మార్చారు’
సాక్షి, గుంటూరు: కోడెల శివప్రసాదరావు సంతాప సభను రాజకీయ సభగా మార్చిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబుకే దక్కుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ఆత్మహత్యకు చంద్రబాబు, కోడెల పిల్లలే కారణమంటూ ఆరోపించారు. మంగళవారం మీడియా సమావేశంలో చంద్రబాబుపై ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల ఆసుపత్రిలో ఉన్నప్పుడు చంద్రబాబు వెళ్లి పలకరించలేదని గుర్తుచేశారు. ఒకవేళ పలకరించి ఉంటే చనిపోయేవారు కాదని వ్యాఖ్యానించారు. కోడెల కుటుంబంపై ప్రేమ ఉంటే ఆయన కూతురు, కొడుక్కి నియోజకవర్గ ఇంఛార్జ్ పదవులను ఇవ్వాల్సింది కదా? ఎందుకు ఇవ్వడం లేదు అంటూ ప్రశ్నించారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు చులకన చేసి మాట్లాడుతున్నారని, ఆయనకు వయస్సు పెరిగేకొద్దీ చాదస్తం ఎక్కువైందని దుయ్యబట్టారు. ఇప్పటివరకు చంద్రబాబు చేసిన అభ్యంతకర వ్యాఖ్యలను ప్రివిలైజేషన్ కమిటీకి తీసుకెళ్తామని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. -
లొంగిపోయిన కోడెల శివరాం
సాక్షి, గుంటూరు : టీడీపీ దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం మంగళవారం కోర్టు ఎదుట లొంగిపోయారు. కోడెల పదవిలో ఉండగా కే ట్యాక్స్ పేరిట శివరాం కబ్జాలు, బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనపై వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఐదు కేసుల విషయమై తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోడెల శివరాం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనపై స్పందించిన హైకోర్టు.. శివరాంను కింది కోర్టులో లొంగిపోవాల్సింగా సూచించింది. ఈ క్రమంలో కోడెల శివరాం ఈరోజు నరసరావుపేట ఫస్ట్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయారు. కాగా కే ట్యాక్స్ పేరిట భారీ ఎత్తున ప్రజలు కోడెల కుటుంబంపై ఫిర్యాదు చేయడం, సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత, పార్టీ అధిష్టానం సైతం తనను పట్టించుకోకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. -
కోడెలను బలిపీఠం ఎక్కించిందెవరు?
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ నాయకుడు కోడెల శివప్రసాదరావు పిరికివాడు కాదు. ఇంట్లో బాంబులు పేలిన నాడే భయపడలేదు. సీబీఐ కేసును ఎదుర్కొన్న మనిషి. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? సత్తెనపల్లి నియోజకవర్గంలో కే ట్యాక్స్ అంశం కూడా వెలుగులోకి వచ్చింది. పదుల సంఖ్యలో ప్రజలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి కోడెల కుటుంబానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా కోడెల కుమార్తె, కుమారుడిపై పలు ఆరోపణలు వచ్చాయి. పరిస్థితులు తారుమారై చుట్టుముట్టిన వేళ తన అధినాయకుడు చంద్రబాబు ఆపన్నహస్తం కోసం ఎదురుచూసి, మానసికంగా అలసిపోయి కోడెల ఈ అంతిమ నిర్ణయానికి వచ్చినట్టు జరిగిన పరిణామాలు రూఢీ పరుస్తున్నాయి. ఆయనకు అవమానాలు, కేసులు కొత్తేమీ కాదు. కానీ నమ్ముకున్న చంద్రబాబు ద్రోహంతోనే ఆయన గుండె పగిలింది. ఆత్మహత్యలకు మానసిక నిపుణులు ఎన్నో కారణాలు చెబుతున్నారు. పరిస్థితులతో ఇమడలేకపోవడం, ఆత్మన్యూనత, జీవితంలో ఎదురయ్యే సంఘట నలు, మూర్తిమత్వలోపాలు, జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ బాధపడటం, కొన్ని సంఘటనలు జరుగుతాయని ఊహించుకుని భయపడటం, అవగాహన లోపం, ఆర్థిక ఇబ్బందులు, ఘర్షణలు, సామాజిక అంశాలు కూడా ఒక్కోసారి ఆత్మహత్యకు కారణమవుతాయట. ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ నాయకుడు కోడెల శివప్రసాదరావు వీటికి అతీతుడు కాలేకపోయారు. పరిస్థితులు ఒక్కసారిగా చిక్కుముళ్లుగా పడి ఉరితాళ్లై చుట్టుముట్టినప్పుడు చావును వెతుక్కున్నారు. అట్లాగని కోడెల పిరికివాడు కాదు. ఇంట్లో బాంబులు పేలిన నాడే భయపడలేదు. సీబీఐ కేసును ఎదుర్కొన్న మనిషి. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? ఫ్యాక్షన్ రాజకీయాలతో పల్నాటి పులిగా పేరు తెచ్చుకున్న, వ్యక్తిగత, కుల, రాజకీయ, వృత్తి అస్తిత్వంతో తన ఉనికిని నిలబెట్టుకుంటున్న క్రియాశీలక నేత. అటు వంటి నాయకుని మరణానికి ఎవరు బాధ్యులు? అతను ఎంత మనోవేదన అనుభవించి ఉంటే ఆత్మహత్యకు పాల్పడ్డాడో అర్థం అవు తుంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు కోడెల మరణం దేశ రాజకీయాల్లో నిజంగానే ఒక కేస్ స్టడీగా తీసుకొని పరిశోధన చేయాల్సిన అంశమే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి పరిపాలనా పరమైన దూకుడు పెంచారు. అవినీతి రహిత రాష్ట్రాన్ని నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేసి, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు పోతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నాటి సీఎం చంద్రబాబు కమీషన్ల దాహంతో కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి, అధిక ధరలకు అప్పగించి ఖజానాను దోచేశారని, రివర్స్ టెండర్ల ప్రక్రియకు వెళ్తామని చెప్పి.. చేసి చూపించారు. ఇది నిరూపితమైంది కూడా. అట్లాగే సత్తెనపల్లి నియోజకవర్గంలో కే ట్యాక్స్ అంశం కూడా వెలుగులోకి వచ్చింది. పదుల సంఖ్యలో ప్రజలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి కోడెల కుటుంబానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా కోడెల కుమార్తె, కుమారుడిపై పలు ఆరోపణలు వచ్చాయి. అసెంబ్లీ ఫర్నీచర్ను సొంతానికి వాడుకున్నట్టుగా కోడెలపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. అతను, అతని కుటుంబంపై మొత్తం ఇరవై మూడు కేసులు నమోదు అయినట్టు సమాచారం. ఈ వ్యవహారం ఆయనను మానసికంగా కుంగదీసే ఉంటుంది. పరిస్థితులు తారుమారై చుట్టుముట్టిన వేళ తన అధినాయకుడు చంద్రబాబు ఆపన్నహస్తం కోసం ఎదురుచూసి, మానసికంగా అలసిపోయి కోడెల ఈ అంతిమ నిర్ణయానికి వచ్చినట్టు జరిగిన పరిణామాలు రూఢీ పరుస్తున్నాయి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి నిర్ణయాన్ని తప్పు పట్టలేం. ఇందులో దాగి ఉన్న రాజకీయ కోణాన్ని కూడా విస్మరించలేం. ఎట్లా అయితేనేమి కోడెల చట్టబద్దంగా బోనులో ఇరుక్కున్నారు.ఇటువంటి సమయంలో అండగా నిలవా ల్సింది చంద్రబాబే. మంచో చెడో పార్టీ పెద్దగా చంద్రబాబు కోడెల భుజం తట్టి ‘నేనున్నాను’ అని భరోసా ఇవ్వాల్సింది. కానీ ఇక్కడ చంద్రబాబు ఆ పని చేయలేదు. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న చంద్రబాబు చుట్టూ అవినీతి ఆరోపణలు, నోటుకు కోట్లు తదితర కేసులు ముసురుకుంటున్నాయి. ఈ కేసుల నుంచి ఆయనను రక్షించటంతో పాటు మరణం అంచున ఉన్న టీడీపీకి జీవ గంజి పోయటానికి ఎవరో ఒకరు బలిపీఠం ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని టీడీపీ నేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఆ బలిపీఠం తానే ఎక్కుతానని ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న వాగ్దానం చేశారు. ‘తాను ఆత్మహత్య చేసుకొని చంద్రబాబును రక్షించుకుంటా’ అని శపథం చేశారు. ఈ నేపథ్యంలో కోడెల ఆత్మహత్య చేసుకోవడం యాదృచ్ఛి కమే. ఆత్మహత్యను వైద్య పరిభాషలో ‘క్రైఫర్ హెల్ప్’గా పరిగణిస్తా రట. ఏదైనా సహాయం కోసం అర్థించినపుడు ఎవరూ సహాయం అందజేయకపోతే చివరి పరిష్కారంగా ఆత్మహత్యను ఎంచుకోవడం జరుగుతుంది. కోడెలకు సరిగ్గా ఇదే అనుభవం ఎదురయ్యింది. ఆయ నకు అవమానాలు, కేసులు కొత్తేమీ కాదు. కానీ నమ్ముకున్న చంద్రబాబు ద్రోహంతోనే ఆయన గుండె పగిలింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి గురించి ఇక్కడ చెప్పుకోవాలి. ఎన్టీఆర్ ఒక సారి నాదెండ్ల భాస్కర్రావు, మరోసారి పిల్లనిచ్చిన సొంత అల్లుడు చంద్రబాబు నాయుడు చేతుల్లో వంచనకు గురి అయ్యారు. 1984 ఆగస్టులో ఎన్టీఆర్ టెక్సాస్లో గుండెకు బైపాస్ శస్త్రచికిత్స చేయించుకొని తిరిగి వచ్చేసరికి నాదెండ్ల భాస్కర్రావు గద్దె మీద కూర్చొని నేనే సీఎం అన్నాడు. అప్పుడు ఎంతో గుండె నిబ్బరాన్ని, రాజకీయ పరిణతిని చూపించిన ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్లి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాడు. ఫలితంగా సెప్టెంబర్ 16న భాస్కర్రావు ముఖ్యమంత్రిగా వైదొలిగాడు. తిరిగి రామారావు ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. 1995 ఆగస్టులో చంద్రబాబు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్నారు. నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడిచినప్పుడు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి నిలబడిన ఎన్టీఆర్ తనవాడు అనుకున్న, సొంత అల్లుడు చేసిన ఘాతుకానికి తట్టుకోలేకపోయారు. నలుగురికి చెప్పుకోలేక లోలోపల మదనపడి గుండె పగిలి మరణించారు. తాజాగా కోడెల పరిస్థితి కూడా ఇదే. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నుంచి అతనేమీ అనుకూలతను ఆశించి ఉండరు. కానీ అనుకూల వర్గం నుంచి ఒక బలమైన రక్షణ కవచాన్ని కోరుకుంటారు. అసెంబ్లీ ఫర్నిచర్ ను సొంతానికి వాడుకున్నాడనే అవమాన భారమే కోడెల ఉసురు తీసిందని టీడీపీ నేతల ఆరోపణ. కానీ ఆయన గతంలో ఇంతకన్నా దారుణమైన అవమానాలను అనుభవించారు. ధైర్యంగా ఎదుర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో తుఫాన్ వచ్చినప్పుడు బాధితుల కోసమని బియ్యం సేకరించి వాటిని అమ్ముకున్నా రనే ఆరోపణలు కోడెలపై వచ్చాయి. ఇటువంటి అమానవీయ ఆరో పణలు ధైర్యంగా ఎదుర్కొన్న కోడెలకు అసెంబ్లీ ఫర్నిచర్ ఆరోపణ ఒక లెక్కా. ఇరవై రోజుల క్రితం మాత్రలు మింగి తొలిసారి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. మొదటి ఆత్మహత్య ప్రయత్నం సంద ర్భంలోనే అధినేతగా చంద్రబాబు నేరుగా కోడెల ఇంటికి వెళ్లి ధైర్యాన్ని ఇవ్వాల్సింది పోయి, మూడు నెలలుగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆయనలో అభద్రతా భావాన్ని పెంచారు. సంక్లిష్ట సమయంలో అండగా నిలవాల్సిన చంద్రబాబు చేసిన నమ్మకద్రోహమే కోడెల మనసు విరిచి ‘అసహజ’ నిర్ణయానికి దారితీసింది. కోడెల మరణాన్ని, అంతిమ యాత్రను కూడా చంద్రబాబు నాయుడు రాజకీయ యాత్రగా మలిచారు. కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు భోరున విలపిస్తుండగా, కొందరు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు జిందాబాద్ అని నినాదాలు చేస్తుంటే చంద్రబాబు విక్టరీ సింబల్ చూపిస్తూ, ప్రజలకు అభివాదం చేస్తూ యాత్రలో నడవటం అత్యంత జుగుప్సాకరంగా అనిపించింది. దేశంలో అంతరిస్తున్న రాజకీయ విలువలకు కోడెల ఆసహజ మరణం ఒక కేస్ స్టడీ కావాలి. అధికార పీఠంపై యావ తప్ప ఒక లక్ష్యం, సిద్ధాంతం లేని వ్యక్తి నాయకత్వం ఎంత ప్రమాదకరమో భావితరం తెలుసుకోవాలి. సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ శాసనసభ అంచనాలు, పద్దులు కమిటీ చైర్మన్ ‘ 94403 80141 -
అయ్యన్న పాత్రుడి బూతు పురాణం
సాక్షి, విశాఖ : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వం, మంత్రులు, ఐపీఎస్ అధికారులపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. రాయడానికి వీల్లేని భాష ఉపయోగించారు. జగన్మోహన్రెడ్డి పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందన్నారు. పెన్షన్ పెంపు తప్ప ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదని విమర్శించారు. పోలీసులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై గట్టిగా మాట్లాడితే కేసులు పెడుతున్నారని, పాత కేసులు బయటికి తీస్తున్నారని ఆరోపించారు. కేసులకు ఎవరూ భయపడబోరని అన్నారు. పనికిమాలిన పల్నాడు ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసిన కోడెల శివప్రసాదరావుపై వేధించి కేసు పెట్టించారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వేధింపులకు తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. మంత్రి బొత్స నీతిమంతుడు, పతివ్రతలాగా మాట్లాడుతున్నాడని, వోక్స్ వ్యాగన్ కంపెనీ వెళ్లిపోవడానికి ఆయనే కారణమని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. మూసివేసిన అన్న క్యాంటీన్లను మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. -
కోడెలను కాటేసిందెవరు?
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేయడం, రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను కలిసి వినతిపత్రం అందించడం దొంగే.. దొంగ, దొంగ అని అరిచిన చందంగా ఉంది. నాలుగయిదు నెలల క్రితమే.. అంటే, చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న చివరి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సీబీఐ అడుగుపెట్టడానికి అనుమతించబోమంటూ జీవో తెచ్చారు. అంతకుముందే చంద్రబాబు పలుమార్లు గవ ర్నర్ వ్యవస్థ మీద తనకు ఏమాత్రం నమ్మకం లేదని బహి రంగంగానే వ్యాఖ్యానించారు. డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య అందర్నీ కలచివేసింది. కోడెల ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త రాగానే ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి కోడెల కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. ప్రతి రాజకీయనాయకుడి మీద పలురకాల ఒత్తిళ్లు ఉంటాయి. కోడెల కూడా తన రాజకీయ జీవితంలో అనేక కష్టాలు, ఒత్తిళ్లతోనే ముందుకు సాగారు. కానీ, 2014 నుంచి కోడెలకు సొంత పార్టీ నుంచే కష్టాలు ఎదురయ్యాయి. 2014 ఎన్నికల్లో నరసరావుపేట టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు నిరాకరించారు. చివరి క్షణంలో కోడెలను సత్తెనపల్లి పంపారు. పార్టీ అధికారంలోకి వచ్చాక.. స్వల్ప మెజార్టీతో గెలిచిన కోడెలకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. స్పీకర్ పదవి ఉన్నతమైనదే. కానీ రాజకీయంగా క్రియాశీలకమైనది కాదు కనుక దానిని నిర్వహించడానికి కోడెల ఆసక్తి చూపలేదన్న వార్తలొచ్చాయి. చివరకు అయిష్టంగానే స్పీకర్ పదవి చేపట్టారు. స్పీకర్గా ఉండి ఆయన పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఇవన్నీ తమ నాయకుడు చంద్రబాబు మెప్పుపొందడానికి చేసినట్లుగానే కన్పించాయి. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే డాక్టర్ కోడెల కుటుంబం బాధితులందరూ బయటకొచ్చారు. సొంత పార్టీ వారే ఆయన మీద ఫిర్యాదులు పెట్టారు. వాటి ఆధారంగానే పోలీసులు కేసులు నమోదు చేశారు. నిజానికి, కోడెల పట్ల గౌరవంతో పోలీసు యంత్రాంగం వ్యవహరించింది. కక్షసాధింపు చేయాలనుకొంటే ఆయనను విచారణకు పిలిపించేవారు. కోడెల కుటుంబంపై పెట్టిన కేసులపై యాగీ చేస్తున్న చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ముద్రగడ పద్మనాభం మొదలుకొని ఎంతోమందిని రాజకీయంగా వేధించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడిన విద్యార్థులపై కూడా కేసులు పెట్టి వేధించిన విషయాన్ని చంద్రబాబు మర్చిపోయినట్లు ఉన్నారు. నిజానికి, కోడెల ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం బాబు అనుచితవైఖరే. 2014లో అధికారంలోకి రాగానే కెటాక్స్ పేరుతో నరసరావుపేటలో కోడెల కుమార్తె, సత్తెనపల్లిలో ఆయన కుమారుడు దందాలకు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువె త్తాయి. వారి బాధితుల్లో సొంత పార్టీకి చెందిన వ్యక్తులూ ఉన్నారు. కానీ, కుటుంబ సభ్యుల్ని కట్టడి చేయమని చంద్రబాబు కోడెలకు చెప్పలేకపోయారు. కారణం వైఎస్సార్సీపీ నుంచి టీడీపీకి ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే ఫైల్ స్పీకర్గా ఉన్న కోడెల వద్ద ఉన్నది. ఎన్నికల ఫలితాల తర్వాత గుంటూరు జిల్లా టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. నరసరావుపేటలో కోడెలకు వ్యతిరేకంగా తెలుగుదేశంలోని ఒక వర్గం గుంటూరులోని టీడీపీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది. పొమ్మనకుండా పొగబెట్టి కోడెలను పార్టీ నుంచి సాగనంప డానికి చంద్రబాబే కోడెల వ్యతిరేక వర్గంతో.. పార్టీ కార్యాలయం ముందు ధర్నా చేయించారని పార్టీలో చర్చ సాగింది. గుంటూరులోని పార్టీ కార్యాలయానికి కోడెల వెళ్ళినపుడు ఆయనతో చంద్రబాబు అంటీముట్టనట్లుగా వ్యవహరించారన్న వార్తలు కూడా వచ్చాయి. ఇక పెయిడ్ ఆర్టిస్ట్లతో చంద్రబాబు చేయించిన ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి కోడెలను రావొద్దంటూ కబురు చేశారన్న వార్త మీడియాకు లీక్ చేశారు. కోడెల కుమారుడి ఆఫీస్లో అసెంబ్లీ ఫర్నిచర్ దొరికిన అంశంలో సీనియర్ నేతతో పార్టీ కార్యాలయంలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేయించి ‘కోడెల ఫర్నిచర్ను తరలించడం వల్ల పార్టీకి అప్రదిష్ట కలిగింది’ అని మాట్లాడించారు. చంద్రబాబు చౌకబారు రాజకీయాన్ని కోడెల తట్టుకోలేకపోయారు. చంద్రబాబు కావాలనే తనను నిర్లక్ష్యం చేస్తున్నారని, తనను వదిలించుకోవడానికే జూనియర్ నేతలతో విమర్శలు చేయిస్తున్నారని గ్రహించి అవమానపడ్డారు. దాంతో కోడెల నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. సకాలంలో కుటుంబ సభ్యులు స్పందించి ఆసుపత్రిలో చేర్పించడంతో ఆయనకు అప్పుడు ప్రాణాపాయం తప్పింది. పార్టీ పరువు పోతుందనే ఉద్దేశంతో గుండె నొప్పితో కోడెల ఆసుపత్రిలో చేరారంటూ పార్టీ నేతలతో చెప్పించారు. ఆరు పర్యాయాలు శాసనసభ్యుడిగా, సుదీర్ఘ కాలం మంత్రిగా, ఐదేళ్లు స్పీకర్గా పనిచేసిన కోడెల ఆత్మ హత్యాయత్నం చేశారని తెలిసి కూడా చంద్రబాబు ఆయనను పరామర్శించలేదు. పైగా డాక్టర్ కోడెలకు ఉన్న ఆసుపత్రి గుంటూరు నగరంలోనే ఉంది. గుంటూరులోనే ఉన్న పార్టీ కార్యాలయానికి చంద్రబాబు రోజూ వెళుతుంటారు. కానీ, ఐదు నిమిషాల సమయాన్ని కోడెలను పరామర్శించడానికి కేటాయించలేకపోయారు. అధికారం కోల్పోయాక, మాజీ స్పీకర్గా మిగిలిన కోడెలతో అక్కర తీరిపోయిందని చంద్రబాబు భావించి నందునే ఆయనంతట ఆయనే పార్టీ నుంచి నిష్క్రమించే పరిస్థితుల్ని చంద్రబాబు సృష్టించారన్నది తేటతెల్లం. అయితే, కోడెల ఆత్మహత్య అంశాన్ని అధికార పక్షం మీద ఆయుధంగా ఉపయోగించుకోవడానికి చంద్రబాబు చకచకా పావులు కదిపారు. అంతకు ఒకరోజు ముందు ఆయన కుమార్తె మీడియా ముందుకొచ్చి స్వయంగా ‘జరిగిందేదో జరిగింది. మమ్మల్ని వదిలివేయండి. రాజకీయం చేయకండి’ అని వేడుకొన్నారు. తరువాత ఎవరి ప్రోద్భలంతో వెంటనే మాట మార్చారో ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది. కోడెల బీజేపీలో చేరడానికి సంప్రదింపులు జరిపారని ఆ పార్టీ నేతలు బయట పెట్టడంతో.. చంద్రబాబు ప్లాన్ బెడిసి కొట్టింది. ‘యూజ్ అండ్ త్రో’ పాలసీకి తాజాగా బలైపోయిన కోడెల ఆత్మకు శాంతి లేకుండా ఆయన ఆత్మహత్యను రాజకీయంగా మలుచుకోవాలనుకుంటున్న చంద్రబాబుది శవరాజకీయమే! వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం, ఆయన నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధి సామాజిక సమానత్వం పునాదులపై ప్రభుత్వం ఏర్పాటు కావడం సహించలేని చంద్రబాబు విధ్వంసకర రాజకీయం వికృతరూపం దాల్చింది. సి. రామచంద్రయ్య వ్యాసకర్త మాజీ ఎంపీ, అధికార ప్రతినిధి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ -
కోడెల మృతిపై పిల్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలన్న పిల్ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్లో ప్రజాప్రయోజనం ఏముందని పిటిషనర్ అనిల్కుమార్ను ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. దర్యాప్తు జరుగుతుండగా జోక్యం చేసుకోలేమని, పోలీస్ వ్యవస్థపై నమ్మకం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు కోడెల శివప్రసాదరావు అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కోడెల కుటుంబ సభ్యులు వాంగ్మూలం తీసుకోవాల్సి ఉందని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక రావాల్సి ఉందని, అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామన్నారు. సీబీఐ దర్యాప్తు జరిపించాలని హైకోర్టులో పిల్ వేసిన వ్యక్తికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేశారు. ఈనెల 16న బంజారాహిల్స్లో తాను నివాసం ఉంటున్న ఇంట్లో కోడెల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
కోడెల కాల్డేటానే కీలకం!
సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు ప్రధానంగా ఫోన్కాల్ డేటాపై దృష్టి సారించారు. సూసైడ్ నోట్ కూడా లభించకపోవడంతో పోలీసులు సాంకేతిక పద్ధతులను అనుసరిస్తున్నారు. కీలక ఆధారంగా మారిన ఆయన సెల్ఫోన్ అదృశ్యం కావడంతో కాల్డేటాను హైదరాబాద్లోని బంజారా హిల్స్ పోలీసులు విశ్లేషిస్తున్నట్టు సమాచారం. కోడెల ఆత్మహత్యకు ముందు గంట వ్యవధిలో 10–12 మందితో మాట్లాడినట్టు గుర్తించారు. చని పోవడానికి ముందు గంట వ్యవధిలో చేసిన ఫోన్కాల్స్లో కచ్చితంగా ఎవరో ఒకరికి తన ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితుల గురించి కోడెల చెప్పి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోడెలతో ఫోన్లో మాట్లాడిన వారిని పోలీసులు వ్యక్తిగతంగా పిలిచి ఆరా తీస్తున్నట్టు తెలిసింది. మరోవైపు బంజారాహిల్స్లోని కోడెల నివాసం వద్ద పోలీసులు సెక్యూరిటీని అప్రమత్తం చేసి ఎవరైనా అక్కడికి వస్తే సమాచారం ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. కోడెల కుమారుడు శివరామ్ను కూడా పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే విచారించిన కుటుంబ సభ్యులతోపాటు మరికొందరిని కూడా మరోసారి విచారించే అవకాశం ఉంది. మేనల్లుడి ఫిర్యాదుపైనా విచారణ.. కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న రోజు ఆయన మేనల్లుడు కంచేటి సాయిబాబు గుంటూరు జిల్లా సత్తెనపల్లి పోలీసులకు చేసిన ఫిర్యాదుపై కూడా బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడు శివరామ్, కుటుంబీకుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు సాయిబాబు అరోపించిన సంగతి తెలిసిందే. కోడెల మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని గుంటూరు జిల్లాకు చెందిన బోరుగడ్డ అనిల్కుమార్ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్) దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కోడెల మరణానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు కారణమని అనిల్కుమార్ ఆరోపించారు. -
ఫర్నీచర్పై చంద్రబాబు పచ్చి అబద్ధాలు
‘అందరికీ ఇచి్చనట్లే క్యాంపు కార్యాలయం కోసం అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఫర్నీచర్ ఇచ్చారు. వాటిని ఆయన తన కార్యాలయంలో వాడుకున్నారు. తన పదవి ముగిసిన తర్వాత ఆ ఫర్నీచర్ను తీసుకెళ్లాలని అసెంబ్లీ కార్యదర్శికి రెండు లేఖలు రాశారు. వాటిని పక్కనపడేసి ఫర్నీచర్ దొంగతనం చేశారని కేసు పెట్టడం ఏమిటి? రెండు లక్షలు విలువచేసే ఫర్నీచర్ కోసం అంత సీనియర్ నేతపై కేసు పెడతారా?’.. – రెండ్రోజులుగా చంద్రబాబు మీడియా సమావేశాల్లో వల్లెవేస్తున్న మాటలివి. హైదరాబాద్ నుంచి అమరావతికి ఏపీ అసెంబ్లీని తరలించేటప్పుడు హైదరాబాద్లో ఉన్న ఫర్నీచర్ను భద్రత కోసం మా ఇంటికి తీసుకెళ్లాం. అమరావతిలో నిరి్మంచిన అసెంబ్లీలో కొత్త ఫరి్నచర్ ఏర్పాటుచేశామని సీఆర్డీఏ అధికారులు చెప్పడంతో అక్కడ ఆ ఫర్నిచర్కు భద్రత ఉండదని మా ఇంటికి తీసుకెళ్లాం. నా టర్మ్ పూర్తయ్యాక దాన్ని తీసుకెళ్లాలని లేకపోతే దాని విలువ ఎంతో చెబితే చెల్లిస్తానని అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశాను. – ఆగస్టు 20న నరసరావుపేటలో మీడియాతో కోడెల శివప్రసాదరావు సాక్షి, అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ ఫరి్నచర్ను తన ఇళ్లు, కార్యాలయాలకు తరలించిన విషయాన్ని చంద్రబాబు పూర్తిగా వక్రీకరిస్తూ పచ్చి అబద్ధాలు చెబుతుండడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ అసెంబ్లీ నుంచి కోడెల తన ఇళ్లు, కార్యాలయాలకు తరలించిన ఫరి్నచర్ అసెంబ్లీకి సంబంధించినది కాగా.. చంద్రబాబు దాన్ని కోడెల క్యాంపు కార్యాలయం ఫర్నీచర్గా చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అసెంబ్లీలో వినియోగించే ఫర్నీచర్, స్పీకర్ క్యాంపు కార్యాలయం కోసం వినియోగించే ఫర్నీచర్కు మధ్య తేడాను ప్రజలు గమనించలేరనే భావనతో ఆయన పూర్తిగా పక్కదారి పట్టించేలా మాట్లాడుతుండడంపై టీడీపీ నాయకుల్లోనే అసహనం కనిపిస్తోంది. గత నెలలో ఈ ఫర్నిచర్ గురించి కోడెల స్వయంగా మీడియా సమావేశం పెట్టి వెలగపూడి అసెంబ్లీలో భద్రత ఉండదని తన ఇంటికి తీసుకెళ్లినట్లు స్పష్టంచేసినప్పటికీ చంద్రబాబు వితండవాదం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి నాలుగేళ్ల క్రితం ఈ ఫరి్నచర్ను తరలించిన కోడెల దాన్ని గుంటూరులోని తన కుమారుడి హీరో షోరూంలో వినియోగించారు. స్పీకర్గా కోడెల పదవీకాలం పూర్తయిన తర్వాత కొత్తగా బాధ్యతలు చేపట్టిన అసెంబ్లీ కార్యదర్శి ఫర్నీచర్ గురించి వివరాలు సేకరిస్తున్న సమయంలో హైదరాబాద్ అసెంబ్లీలో ఉండాల్సిన ఫర్నీచర్ మాయమైన విషయం బయటపడింది. దీనిపై అసెంబ్లీలో అంతర్గతంగా విచారణ జరుగుతున్న విషయం తెలిసి కోడెల హడావుడిగా మీడియా సమావేశం పెట్టి అది తన వద్ద ఉందని తెలిపారు. ఆగస్టు 27న అసెంబ్లీకి కార్యదర్శికి ఒక లేఖ పాత తేదీతో పంపించి ముందే తాను ఇచి్చనట్లు చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే ఈ విషయంపై గుంటూరు జిల్లా పోలీసులు, అసెంబ్లీ యంత్రాంగం పూర్తిస్థాయి విచారణ జరిపింది. ఏపీ అసెంబ్లీని అమరావతికి మార్చిన సమయంలో అక్కడి ఫర్నీచర్ను కోడెల సత్తెనపల్లి, నర్సరావుపేటలోని తన ఇళ్లు, వ్యాపార సంస్థలకు తరలించారు. ఇందుకు అప్పటి అసెంబ్లీ చీఫ్ మార్షల్ గణేష్ సహకరించినట్టు తేలడంతో ఇటీవలే ఆయన్ని ఆ పోస్టు నుంచి తప్పించారు. మాయమైన ఫర్నీచర్ ఇదే.. బర్మా టేకుతో చేయించిన నిజాం కాలం నాటి టేబుళ్లు, డిజైనర్ కురీ్చలు, సోఫాలు తరలించారు. నెమలి ఆకారంలోని 14 సందర్శకుల కురీ్చలు, ఒక సెంటర్ టేబుల్, ఐదు కురీ్చలు, 27 ప్లాస్టిక్ కురీ్చలు, సభ్యుల లాంజిలోని 80 తెల్ల కురీ్చలు, స్పీకర్ యాంటి రూమ్లోని మూడు కుర్చీలు, మూడు సింగిల్ సీటర్ సోఫాలు, ఒక త్రీ సీటర్ సోఫా, పది చెక్క కుర్చీలు, రెండు స్లి్పట్ ఏసీలు, ఎగ్జిక్యూటివ్ కురీ్చలు, సందర్శకుల కురీ్చలు, బీఏసీ మీటింగ్ హాలులోని టేబుల్, ఎగ్జిక్యూటివ్, సాధారణ కురీ్చలు, డైనింగ్ హాలులోని టేబుల్, కురీ్చలు, కప్బోర్డు తదితర వస్తువులు తరలించారు. ఇవికాక.. స్పీకర్ ఛాంబర్, ఇతర ప్రదేశాల్లో ఉన్న ఫరి్నచర్, టవర్ ఏసీలు, కంప్యూటరు సైతం మాయమయ్యాయి. ఇవన్నీ కోడెల క్యాంపు కార్యాలయం కోసం వాడినవని చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారు. వీటి విలువ కూడా తక్కువ చేసి చూపిస్తుండడం గమనార్హం. -
చంద్రబాబులో బాధ, భావోద్వేగం కనిపించలేదు..
సాక్షి, అమరావతి: ‘సాధారణంగా సహచరులు చనిపోయినప్పుడు భావోద్వేగాలు సహజం. అయితే చంద్రబాబు నాయుడులో అలాంటి భావోద్వేగాలు కనిపించలేదు. పార్టీ సీనియర్ నేత చనిపోయిన బాధ చంద్రబాబులో కనిపించడం లేదు. కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై ఆయన దుష్ప్రచారం చేస్తున్నారు. కోడెల చనిపోయిన బాధ చంద్రబాబులో కనిపించడం లేదు. రాజకీయ లబ్ధి కోసం కోడెల మృతిని వాడుకుంటూ.... మైలేజ్ కోసం చంద్రబాబు తాపత్రాయపడుతున్నారు. కోడెల అంత్యక్రియల్లో చంద్రబాబు తీరు ఎన్నికల ఊరేగింపులా ఉంది’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. దానికి చంద్రబాబే కారణం.. ‘కోడెలది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య అని చెప్పి చంద్రబాబు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు అబద్ధాలు చెప్పే సమయంలో నిజాలు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. పార్టీ మనిషి చనిపోతే మిగతా నాయకుల్లో బాధ, భావోద్వేగం కనిపిస్తుంది. ఆ బాధ చంద్రబాబులో కనిపించడం లేదు. కోడెల మరణంతో చంద్రబాబు రాజకీయ మైలేజీ కోసం ప్రయత్నం చేశారు. గతంలో కోడెల ఆత్మహత్యాయత్నం చేశారు. అప్పుడే చంద్రబాబు పోరాటం చేసి ఉంటే కోడెల బతికేవారు. కోడెలలో చెడు కోణాన్ని చెప్పుకోవాల్సిన దుస్థితి తీసుకు వచ్చింది చంద్రబాబే. ఇక కోడెల విషయంలో చంద్రబాబు చట్ట ప్రకారం చర్యలు తీసుకోమన్నారు. గవర్నర్ను కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు ఫిర్యాదు చేశారు. చదవండి: బాబు..ఏ ముఖం పెట్టుకొని గవర్నర్ను కలుస్తారు మరి చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తే తప్పేంటి. కోడెల కుటుంబసభ్యుల మీద కేసులు నమోదు చేశారు కానీ విచారణ చేయలేదు. కోడెల తీసుకు వెళ్లింది లక్ష రూపాయల ఫర్నిచర్ కాదు...కొత్త అసెంబ్లీలో ఫర్నిచర్ కాదు. హైదరాబాద్ అసెంబ్లీలో ఉన్న పురాతనమైన ఫర్నిచర్ తీసుకువెళ్లారు. కోట్ల రూపాయల విలువ చేసే 114 వస్తువులను కోడెల తీసుకువెళ్లారు. ఈ విషయంలో చంద్రబాబు తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారు. పారదర్శకంగా సచివాలయ పరీక్షలు.. లక్షా 27వేల గ్రామ సచివాలయం ఉద్యోగాలకు పకడ్బందీగా పరీక్షలు నిర్వహించారు. ప్రశ్నాపత్రం ఎక్కడా లీక్ అవలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టుబట్టి పారదర్శకంగా పరీక్షలు నిర్వహింపచేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నాపత్రం అమ్ముకున్నారంటూ చంద్రబాబు, నారా లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సామాన్య కుటుంబాలకు చెందినవారికి ప్రథమ ర్యాంక్లు వచ్చాయి. పేపర్ లీకయితే అప్పుడే ఎందుకు రాయలేదు. కావాలనే ఒక పిచ్చి పత్రిక తప్పుడు రాతలు రాస్తోంది. ఆ పిచ్చి పత్రిక రాతలు ఎవరు నమ్మొద్దు’ అని అంబటి సూచించారు. -
‘కోడెలను కొడుకే హత్య చేశాడు’
సాక్షి, హైదరాబాద్: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అనుమానాస్పద మరణం వెనుక పెద్ద కుట్ర ఉందని, దీంతో చంద్రబాబుకు సంబంధం ఉందని గుంటూరు జిల్లాకు చెందిన బొర్రుగడ్డ అనిల్కుమార్ అనే వ్యక్తి ఆరోపించారు. కోడెల మృతిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ఆయన శుక్రవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. సీబీఐ, తెలంగాణ ప్రభుత్వం, బంజారాహిల్స్ సీఐని ప్రతివాదులుగా చేర్చారు. కోడెల మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, కుట్ర కోణం దాగుందని పిటిషనర్ ఆరోపించారు. కోడెల శివప్రసాదరావు అభిమానిగా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పిల్ వేసినట్టు అనిల్కుమార్ మీడియాకు తెలిపారు. కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదని అన్నారు. రాజకీయ నాయకులపై కేసులు సహజమని, దానికే భయపడిపోయి ఆయన ఆత్మహత్య చేసుకుంటారని తాము భావించడం లేదన్నారు. కోడెలది కచ్చితంగా రాజకీయ హత్యేనని, దీన్ని క్యాష్ చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. కోడెల మృతి వెనుక ఆయన కుమారుడు శివరామ్ హస్తం ఉందని వంద శాతం నమ్ముతున్నట్టు తెలిపారు. అనేక నేరారోపణలు ఎదుర్కొంటున్న చేసిన శివరామ్ కేసుల నుంచి తప్పించడం కోసం తండ్రిని హత్య చేయించివుంటాడన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. కోడెల మరణం వెనుకున్న మిస్టరీని ఛేదించేందుకు సీబీఐతో దర్యాప్తు చేయించాలని హైకోర్టును అభ్యర్థించినట్టు చెప్పారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపితే నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. (చదవండి: శివరామ్ విచారణకు రంగం సిద్ధం) -
‘కోడెల అంతిమ యాత్రలో చంద్రబాబు నటన’
సాక్షి, కిర్లంపూడి: చంద్రబాబు, కోడెల అంతిమ యాత్రలో బాగానే నటించారు.. కానీ ఓ వ్యక్తి మీద నిజంగానే ప్రేమ ఉంటే.. యాత్రకు వచ్చిన వారికి నమస్కారం చేస్తారు.. లేదా మౌనంగా ఉంటారు.. కానీ రెండు వేళ్లు చూపడం ఏం సంస్కారం అని మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ల ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. ఈ నటన అంతా రాజకీయ లబ్ది కోసం కాదా అని నిలదీశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు చిలకపలుకులు పలుకుతున్నారని ముద్రగడ ఎద్దేవా చేశారు. నాడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కోడెలను పిలిపించుకుని.. మీ కుమారుడి వల్ల చెడ్డపేరు వస్తోంది.. అదుపులో పెట్టుకొండి అని వార్నింగ్ ఇవ్వడం.. అందుకు కోడెల మీ పుత్రరత్నం వజ్రమా అని కోడెల చంద్రబాబును ప్రశ్నించడం నిజం కాదా అని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందంటూ బాధపడుతున్నారు.. కానీ దానికి ఆజ్యం పోసిందే చంద్రబాబే కదా అన్నారు. గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు 30 మందిని బలి తీసుకున్నారని ఆరోపించారు. తనపై కేసులు పెట్టడానికి వీలు లేకుండా ఏకంగా పోలీసుల చేతే సీసీటీవీ ఫుటేజ్ మాయం చేయించిన ఘనత చంద్రబాబుదే అంటూ ధ్వజమెత్తారు. తమ జాతి ఉద్యమానికి.. తమపై అక్రమ కేసులు పెట్టించి.. ఈ రోజు వారంతా కోర్టుల చుట్టూ తిరగడానికి చంద్రబాబే కారణం అని ఆరోపించారు. ప్రజలు అధికారం ఇచ్చింది అణాగారిని వర్గాలకు వెలుతురు ఇవ్వడం కోసమే కానీ అణచివేయమని కాదంటూ ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అరాచక పాలనలో చంద్రబాబు సామన్య ప్రజలకు బతికే అవకాశం ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రజలకు రాక్షస పాలన చూపించిన బాబు నేడు ప్రజల కోసమే బతుకున్నాను అంటూ దొంగ మాటలు చెబుతూ.. ఇంకా ఎంత కాలం బట్టలు తడిచిపోయేలా కన్నీరు కారుస్తూ నటిస్తారని ముద్రగడ ప్రశ్నించారు. -
ఏ ముఖం పెట్టుకుని గవర్నర్ను కలిశావ్ : బొత్స
సాక్షి, అమరావతి : గవర్నర్ వ్యవస్థ పనికిమాలిందని గతంలో విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని గవర్నర్ను కలిశారో చెప్పాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. చంద్రబాబు శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణాన్ని అడ్డుపెట్టుకొని ప్రజల్లో సానుభూతి పొందాలనే వైఖరి హేయమైందని అన్నారు. కోడెల అంతిమ సంస్కారాలు కూడా అధికారిక లాంఛనాలతో జరగకుండా చేసి ఆయనపై ఉన్న అక్కసును చంద్రబాబు బయటపెట్టుకున్నారని మండిపడ్డారు. గురువారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సీబీఐ రాష్ట్రానికి రావద్దని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు కోడెల కేసులో సీబీఐ విచారణ కోరడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. కేంద్రం చెప్పుచేతుల్లో సీబీఐ ఉందని అప్పుడు విమర్శించిన చంద్రబాబుకు.. ఇప్పుడూ కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉందని తెలియదా అని మండిపడ్డారు. అసలు కోడెల వాడిన ఫోన్ ఏమైందో ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. నువ్వు కాదా క్షోభ పెట్టింది? కోడెల మృతి చుట్టూ ఉన్న అనుమానాలను చంద్రబాబే నివృత్తి చేయాలని బొత్స డిమాండ్ చేశారు. గత మూడు నెలల్లో ఎన్నిసార్లు, ఏ అంశంపైనా కోడెలను చంద్రబాబు కలిశారన్ని బయటపెట్టాలన్నారు. కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా కోడెలను క్షోభ పెట్టింది చంద్రబాబే అన్నారు. బీజేపీలో చేరేందుకు కోడెల ఎందుకు ప్రయత్నించారన్నారు. టీడీపీలో గౌరవం లేదని, అందుకే బీజేపీలో చేరాలని కోడెల భావించినట్లు బీజేపీ నేతలే చెప్పారని బొత్స వివరించారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్పై విశాఖ ఎయిర్పోర్టులో హత్యాయత్నం జరిగితే అప్పటి గవర్నర్ నరసింహన్ వైఎస్ జగన్ యోగక్షేమాలను ఫోన్ ద్వారా తెలుసుకున్నపుడు.. చంద్రబాబు మాట్లాడిన భాష, తీరును బొత్స గుర్తుచేశారు. అధికారంలో ఉంటే ఒకలా, అధికారంలో లేకపోతే ఇంకొకలా వ్యవహరించడమేనా 40 ఏళ్ల అనుభవం అంటే.. అని చంద్రబాబును ప్రశ్నించారు. కోడెల మృతిపై గవర్నర్కు సమర్పించిన వినతిలో ఎక్కడా సీబీఐ విచారణకు డిమాండ్ చేయకుండా, ప్రెస్మీట్లలో మాత్రమే సీబీఐ విచారణ కోరడంలో ఉద్దేశమేంటన్నారు. చంద్రబాబు పాలనలో ఏ వ్యవస్థ అయినా రాజ్యాంగబద్ధంగా పనిచేసిందా అని ప్రశ్నించారు. కేసులతో ప్రభుత్వానికి సంబంధమేంటి? సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కోడెల కుటుంబం బాధితులు ముందుకు వచ్చి కేసులు పెడితే ప్రభుత్వానికి సంబంధమేంటని బొత్స ప్రశ్నించారు. ఆ కేసులను చంద్రబాబు, లోకేశ్, ఇతర నాయకులు ఎందుకు ఖండించలేదని నిలదీశారు. సాక్షి పేపరు, సాక్షి టీవీ వల్లే గత ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు చేసిన అరాచకాలకు, దౌర్జన్యాలు ప్రజలకు తెలిశాయని, ఎల్లో మీడియాను మొత్తం చెప్పుచేతుల్లో పెట్టుకొని తమ పార్టీపై దుష్ప్రచారం చేశారని వివరించారు. ఇప్పుడు చట్టాల గురించి చంద్రబాబు చెబుతుంటే విడ్డూరంగా ఉందని, రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి, వ్యవస్థలను చేతుల్లోకి తీసుకొని ఛిన్నాభిన్నం చేసిన వ్యక్తి చంద్రబాబేనని మండిపడ్డారు. సెల్ఫోన్ ఏమైంది? కోడెల సెల్ఫోన్ పోయిందని పుకార్లు వస్తున్నాయని, చంద్రబాబు దాని గురించి ఎందుకు అడగడం లేదని బొత్స ప్రశ్నించారు. ఆత్మకూరులో రెండు కుటుంబాల సమస్యను రాజకీయం చేశారని, పెయిడ్ ఆర్టిస్టులతో క్యాంపులు రన్ చేసి ప్రజలను గందరగోళంలోకి నెట్టేందుకు ప్రయత్నించారని విమర్శించారు. అనవసరంగా చంద్రబాబు చాలెంజ్లు చేసి, పరుష పదజాలంతో మాట్లాడితే ఎవరూ భయపడరని, ఆయన అధికారంలో ఉన్నప్పుడే ధైర్యంగా ఎదుర్కొన్నామని గుర్తుచేశారు. -
కోడెల మృతికి బాబే కారణం: తలసాని
సాక్షి, హైదరాబాద్: ‘ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతికి చంద్రబాబు నాయుడే కారణం. ఆయనను మానసికంగా ఇబ్బంది పెట్టింది చంద్రబాబే. మరణానికి ముందు వారంరోజులు ఆసుపత్రిలో ఉంటే కనీసం పరామర్శించలేదు. పార్టీ మీటింగ్లకు దూరం పెట్టడంతోపాటు, పార్టీ నుంచి వెలివేసినట్లు వ్యవహరించారు. కోడెల సమస్యలను పరిష్కరించేందుకు చంద్రబాబు చొరవ చూపలేదు. చివరకు ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఈ విషయాలన్నింటినీ మరుగున పడేసి.. నెపం జగన్ మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు’అని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో పిచ్చాపాటీగా మాట్లాడారు. ‘ఫరీ్నచర్ విషయంలో కోడెల మీద వచ్చిన ఆరోపణలపై పార్టీ అధినేతగా చంద్రబాబు ఏనాడూ స్పందించలేదు. కోడెల అంతిమ యాత్రలో దండాలు పెడుతూ చంద్రబాబు సానుభూతి కోసం ప్రయత్నాలు చేశారు’అని తలసాని వ్యాఖ్యానించారు. -
‘కోడెల బీజేపీలోకి చేరాలని ఎందుకు అనుకున్నారు?’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కోడెల చనిపోయారన్న కనీస సానుభూతి లేకుండా రాజకీయ లబ్ధి కోసం వెంపర్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. ‘పార్టీలో పనిచేసే వారికి గౌరవం లేదని కోడెల బాధపడింది నిజమా కాదా? ఆయనను చంద్రబాబు ఎందుకు దూరం పెట్టారు? కోడెల బీజేపీలో చేరాలని ఎందుకు ప్రయత్నించారు? సొంత పార్టీ నేతలే ఆయనపై ఎందుకు ఫిర్యాదు చేశారు? కోడెల సెల్ఫోన్ మాయంపై బాబు ఎందుకు మౌనంగా ఉన్నారు?’అంటూ మంత్రి ప్రశ్నించారు. అంతేకాకుండా కోడెల మృతిపై సీబీఐ దర్యాప్తు చేయాలని బాబు అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో సీబీఐ రాకూడదన్న చంద్రబాబు ఇప్పుడు కోడెల మరణంపై సీబీఐ దర్యాప్తునకు ఎలా డిమాండ్ చేస్తున్నారని ప్రశ్నించారు. అదేవిధంగా గవర్నర్ వ్యవస్థపై టీడీపీ అధినేత చేసిన అనుచిత వ్యాఖ్యలు అందరికీ గుర్తున్నాయని అన్నారు. కేంద్రానికి గవర్నర్ ఏజెంట్ అని చంద్రబాబు విమర్శించిన విషయాన్ని గుర్తుచేశారు. అటువంటి విమర్శలు చేసిన బాబు ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని గవర్నర్ దగ్గరికి వెళ్లారని ప్రశ్నించారు. ఇదేనా ఆయన 40 ఏళ్ల అనుభవం అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. కాగా కోడెల శివప్రసాదరావు మృతిపై విచారణ జరిపించాలంటూ చంద్రబాబు ఇవాళ గవర్నర్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. చదవండి: ‘కోడెలను తిట్టించిన చంద్రబాబు’ అందుకే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు కోడెల మృతి: బీజేపీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు -
కోడెల ధైర్యవంతుడు.. అలాంటి నేత..
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్రావు చాలా ధైర్యవంతుడని, అలాంటి నేత ఆత్మహత్యకు పాల్పడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. కోడెల మృతిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోడెల మృతిపై రాజకీయాలు చేయటం సరికాదన్నారు. రాజధాని, హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్దే నిర్ణయమని, కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. గతంలో రాయలసీమలోని ఒక్కోజిల్లాకు కేంద్రం రూ.50కోట్లు ఇచ్చిందన్నారు. ఆ నిధులను చంద్రబాబు ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. కేంద్ర నిధులకు లెక్కచెప్పమంటే చంద్రబాబు స్పందించలేదన్నారు. అమరావతి పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని అన్నారు. అమరావతిలో చంద్రబాబు గ్రాఫిక్స్ సినిమా చూపించారంటూ ఎద్దేవా చేశారు. అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. -
చంద్రబాబు.. వీటికి సమాధానం చెప్పు
సాక్షి, అమరావతి : మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై విచారణ జరిపించాలని కోరడానికి గవర్నర్ను కలవాలన్న టీడీపీ నిర్ణయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. మూడు నెలలుగా తన దగ్గరకు రానివ్వకుండా చంద్రబాబు నాయుడు కోడెలను మానసిక క్షోభకు గురిచేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. కోడెల ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే కనీసం పరామర్శకు వెళ్లని చంద్రబాబు ఇప్పుడు శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. హంతకుడే హత్య జరిగిందని యాగీ చేసినట్లు చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఏ ముఖం పెట్టుకొని చంద్రబాబు గవర్నర్ దగ్గరకు వెళ్తున్నారని ప్రశ్నించారు. గవర్నర్ ఈ ప్రశ్నలు అడిగితే చంద్రబాబు ఏం సమాధానం చెబుతారంటూ ఎమ్మెల్యేలు అంబటి, గోపిరెడ్డి 20 ప్రశ్నలను సంధిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబుకు అంబటి, గోపిరెడ్డి సంధించిన ప్రశ్నలు : 1. గత మూడునెలలుగా మీరు కోడెలను దగ్గరకు రానిచ్చారా? 2. కోడెల ఆత్మహత్యకు ప్రయత్నించారన్న వార్తలు విని ఆయన్ని పరామర్శించడానికి వెళ్లారా? 3. అసెంబ్లీ నుంచి కోడెల కోట్ల రూపాయల ఫర్నిచర్ తరలించడం మీకు తెలిసి జరిగిందా? తెలియకుండా జరిగిందా? 4. కోడెల ఫర్నిచర్ వ్యవహారంలో, ఆయన అరాచకాలకు గురై తట్టుకోలేక ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తే మీరు ఎందుకు నోరెత్తలేదు? 5. గత ఐదేళ్లుగా కోడెల కొడుకు, కూతురు కే ట్యాక్స్ వసూలు చేశారా? లేదా? 6. గత ఐదేళ్లుగా కోడెలకు చెందిన ఫార్మా డీల్స్ మీకు తెలిసే జరిగాయా? తెలియకుండా జరిగాయా? 7. గత ఐదేళ్లుగా కోడెల అవినీతి సామ్రాజ్యానికి మీరు వెన్నుదన్నుగా ఉన్నారా? లేదా? 8. ఇటు సత్తెనపల్లిలోనూ, అటు నర్సరావుపేటలోనూ భూ కబ్జాల మీద మీరు విచారణ ఎందుకు చేయించలేదు? 9. కోడెల తాను చనిపోకముందు మీకు ఫోన్ చేసి.. అయ్యా.. ప్రస్తుత ప్రభుత్వం వేధింపులు ఎక్కువగా ఉన్నాయని, మీకు ఎప్పుడైనా చెప్పారా? చెప్తే మీరెందుకు స్పందించలేదు? ఎందుకు మాట్లాడలేదు? 10. కోడెల తన మరణానికి ఈ ప్రభుత్వ వేధింపులు కారణమని వాంగ్మూలం ఎప్పుడైనా ఇచ్చారా? 11. కోడెల చనిపోతూ తన మరణానికి కారణాలు ఇవి, అని ఎక్కడైనా పేర్కొన్నారా? 12. చంద్రబాబుగారూ.. ఒక మనిషి తీవ్ర అవమానానికి గురైతే ఎన్టీఆర్ మాదిరిగా తల్లడిల్లి పోతాడా? లేదా? ఈ విషయం మీకు పాతికేళ్ల క్రితమే తెలుసు కదా? 13. వేధింపులు అంటే ఎలా ఉంటాయో, వెన్నుపోటు అంటే ఎలా ఉంటుందో మీరే ప్రపంచానికి చెప్పారు కదా? మీరు మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మీ సొంతమామని ముఖ్యమంత్రి పీఠం నుంచి కిందికి లాగినప్పుడు ఆయన వేదన గురించి ఏ రోజైనా ఆలోచించారా? ముఖ్యమంత్రి పదవిని, ఎమ్మెల్యేల్ని, ఎంపీల్ని ఎన్నికలు అయిన ఏడాదికి లాక్కుని ఎన్టీఆర్ మరణానికి మీరు కారకులయ్యారని సాక్షాత్తూ ఆయన భార్యే ఇవ్వాల్టికీ సాక్ష్యం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. సాక్షాత్తూ ఎన్టీఆర్ కూడా మీ గురించి ఇదే విషయాన్ని చెప్పారు. కాని, ఏనాడూ మీరు ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడలేదు లేదు? 14. కోడెల శివప్రసాద్ గారిది హత్యా? లేక ఆత్మహత్యా? కుటుంబ సభ్యుల పాత్ర ఏమిటి? చంద్రబాబు పాత్ర ఏమిటి? అనే అంశాలమీద సీబీఐ విచారణ జరిపించమంటారా? 15. కోడెల శివప్రసాద్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని సత్తెనపల్లి, నర్సరావుపేటల్లో చేసిన అరాచకాలమీద సీబీఐ విచారణ జరపమంటారా? 16. అసలు సీబీఐని ఈ రాష్ట్రంలోకే రానివ్వమంటూ మీరు ప్రతిజ్ఞచేసి, జనరల్ పర్మిషన్ను ఉపసంహరించుకుంటూ జీవోలు కూడా జారీచేశారు కదా? మరి మీకు సీబీఐమీద నమ్మకం ఎప్పుడు కుదిరింది? 17. శాంతి భద్రతల విషయంలో జోక్యం చేసుకోవడానికి గవర్నర్ ఎవరని.. ఆయనకు ఏ హక్కు ఉందని జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగినప్పుడు మాట్లాడిన మీరు.. అసలు గవర్నర్ వ్యవస్థ నే రద్దు చేయమని చెప్పిన మీరు.. ఈరోజు ఏ మొహం పెట్టుకొని గవర్నర్ దగ్గరకు వెళుతున్నారు? 18. బీజేపీ నేతలు రఘురాం సహా మరికొందరు చెప్పిన దాని ప్రకారం మీరు చేసిన అవమానాల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం కోడెలే స్వయంగా చెప్పారు. మరి సీబీఐ విచారణ అంటూ జరిగితే ఏ1 గా హాజరుకావాల్సింది మీరే చంద్రబాబు గారు. అందుకు మీరు సిద్ధమా? 19. చివరకు నిన్న కోడెల శవాన్ని అడ్డుపెట్టుకుని నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆస్పత్రిపై దాడిచేయడానికి మీరే పురిగొల్పారు. మరీ దిగజారిపోయి మూడురోజులపాటు శవం పక్కనే ఉండి మీ పార్టీని బతికించుకునేందుకు సిగ్గుమాలిన రాజకీయం చేయలేదా? 20. బహుశా నిజాలు బయటకు రావన్న నమ్మకంతోనే మీరు ఈ కార్యక్రమాలన్నింటికీ పూనుకున్నారు. కాబట్టి కోడెల శివప్రసాదరావు అరాచకాలమీద, అతని కుటుంబ సభ్యుల అరాచకాలమీద, ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన పరిస్థితుల మీద మొత్తంగా మీ పాత్రమీద సీబీఐ విచారణ కోరండని మేమే చంద్రబాబుకు సలహా ఇస్తున్నాం. -
శివరామ్ విచారణకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసు దర్యాప్తును హైదరాబాద్ పోలీసులు ముమ్మరం చేశారు. ఆయన ఆత్మహత్యకు కుటుంబ వివాదాలు ఏమైనా కారణమా? అనే కోణంలోనూ విషయ సేకరణపై పోలీసులు దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా కోడెల తనయుడు శివరామ్ను త్వరలోనే విచారించేందుకు రంగం సిద్ధం చేశారు. కోడెల కొన్ని రోజుల కిందట కూడా తన స్వస్థలంలో ఆత్మహత్యకు యత్నించగా కుటుంబీకులు ఆ విషయం దాచి గుండెపోటుగా చిత్రీకరించడంపైన తెలంగాణ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుమారుడు, కుటుంబీకుల కారణంగానే కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన మేనల్లుడు కంచేటి సాయిబాబు గుంటూరు జిల్లా సత్తెనపల్లి డీఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఫిర్యాదు ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి తమకు అందిందని హైదరాబాద్ వెస్ట్జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకుని కోడెల ఆత్మహత్య కేసుతో కలిపి దర్యాప్తు చేస్తామని ఆయన చెప్పారు. బసవతారకం ఆస్పత్రి వైద్యురాలికి చివరి కాల్.. హైదరాబాద్లో కోడెల ఉరి వేసుకున్న గదిని పోలీసులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఆయన కొన్నేళ్లుగా వినియోగిస్తున్న మందులను వైద్య నిపుణులతో పరీక్ష చేయించాలని నిర్ణయించారు. అదే సమయంలో కోడెల పర్సనల్ మొబైల్ సెల్ఫోన్ ఎక్కడుంది? దాన్ని దాచాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆత్మహత్యకు ముందు ఆ ఫోన్తో ఆయన ఎవరితో మాట్లాడారు? ఫోన్ దొరికితే గుట్టు రట్టవుతుందని ఎవరైనా భయపడుతున్నారా? అనే ప్రశ్నలకు సమాధానాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఫోన్ నంబర్ ఆధారంగా కాల్డేటా రికార్డర్ యాప్ (సీడీఆర్ఏ)తో కాల్లిస్ట్ను పరిశీలిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు కోడెల బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి చెందిన ఒక వైద్యురాలికి ఫోన్ చేసి 24 నిమిషాలు మాట్లాడినట్లు పోలీసుల దృష్టికి వచ్చినట్టు సమాచారం. ఆ ఫోన్ కాల్లో ఏం మాట్లాడారు అనేది తెలుసుకోవడానికి ఆ డాక్టరును విచారించాలని నిర్ణయించారు. కేబుల్ వైరుతో ఉరి.. పోస్టుమార్టం నివేదిక కోడెల శివప్రసాదరావు మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్యులు ఆ నివేదికను బుధవారం పోలీసులకు అందించారు. మెడకు కేబుల్ వైరు బిగించుకోవడం ద్వారానే మరణం సంభవించిందని వైద్యులు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. కోడెల గొంతు భాగంలో ఎనిమిది అంగుళాల పొడవుతో మచ్చ ఉందని తెలిపారు. ముందుగా తన పంచెను చింపి తాడుగా చేసుకుని ఉరి వేసుకోవాలని కోడెల ప్రయత్నించారని, అది సాధ్యం కాకపోవడంతో గదిలో ఉన్న కేబుల్ వైరుతో ఉరి వేసుకున్నారని తెలిపారు. 12 మందిని విచారించాం: బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్రావు కోడెల ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా కుటుంబీకులు, గన్మెన్, డ్రైవర్ తదితరులతో కలిపి మొత్తం 12 మంది వాంగ్మూలాలు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోడెల అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆయన కుమారుడు, ఇతర కుటుంబీకులు, సన్నిహితులతోపాటు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారిస్తామని చెప్పారు. కోడెల ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై కొడుకు శివరామ్ స్టేట్మెంట్ కీలకం కానుందని పేర్కొన్నారు. కోడెల ఫోన్లోని కాల్డేటా ఆరా తీస్తున్నామన్నారు. ముగిసిన కోడెల అంత్యక్రియలు నరసరావుపేట/నరసరావుపేటటౌన్: అనుమానాస్పద రీతిలో ఆత్మహత్యకు పాల్పడిన శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు టీడీపీ కార్యకర్తలు కన్నీటి వీడ్కోలు పలికారు. నరసరావుపేట కోటలోని కోడెల నివాసం నుంచి స్వర్గపురి వరకు సాగిన కోడెల అంతిమయాత్రలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, లోకేష్తో పాటు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నేతలు పాల్గొన్నారు. కోడెల భౌతికకాయాన్ని బుధవారం మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనార్థం కోటలో ఉంచారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో చంద్రబాబు వచ్చి నివాళులర్పించి అంతియాత్ర ప్రారంభించారు. ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ శామ్యూల్ కోడెల కుటుంబ సభ్యులకు వివరించగా.. వారు నిరాకరించారు. కోడెల చితికి శాస్త్రోక్తంగా ఆయన కుమారుడు శివరామకృష్ణ నిప్పంటించి అంతిమ సంస్కారం నిర్వహించారు. కోడెల అంతిమయాత్రలో ప్రతిపక్షనేత చంద్రబాబు అంతిమయాత్రలో ఉద్రిక్తత.. కోడెల శివప్రసాదరావు అంతిమయాత్రలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందుగా నిర్ణయించిన రూట్ మ్యాప్ ప్రకారం అంతిమయాత్ర సాగనీయకుండా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గృహం మీదుగా తీసుకెళ్లాలంటూ టీడీపీ నేతలు పట్టుబట్టడంతో పోలీసులు అడ్డు చెప్పారు. అంతిమయాత్ర మల్లమ్మసెంటర్కు చేరిన అనంతరం తిరిగి ఉచ్చయ్య,పెంటయ్య వీధి గుండా స్వర్గపురికి వెళ్లాల్సి ఉంది. అయితే మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మల్లమ్మ సెంటర్ నుంచి ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటివైపు మళ్లించే ప్రయత్నం చేశారు. అయితే గుంటూరు రూరల్ ఎస్పీ ఆర్.జయలక్ష్మి , డీఎస్పీ వీరారెడ్డి సిబ్బందితో అక్కడకు చేరుకుని ముందస్తు రూట్ మ్యాప్ ప్రకారం వాహనాన్ని మళ్లించారు. సంబంధిత కథనాలు.. ‘కోడెలను తిట్టించిన చంద్రబాబు’ బీజేపీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు ఒక మరణం.. అనేక అనుమానాలు కోడెల మృతికి చంద్రబాబే కారణం గ్రూపులు కట్టి వేధించారు.. -
చంద్రబాబులాంటి స్వార్థనేత మరెవరూ ఉండరు..
సాక్షి, గుంటూరు : ప్రపంచంలో చంద్రబాబు నాయుడు లాంటి స్వార్థనేత మరెవరు ఉండరని మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. అవసరానికి వాడుకోవడం మాత్రమే చంద్రబాబుకు తెలుసని వ్యాఖ్యానించారు. కోడెల మృతదేహంతో రాజకీయం చేయాలని చూశారని పిన్నెల్లి విమర్శించారు. బతికున్నప్పుడు పట్టించుకోకుండా చనిపోయాక చంద్రబాబు హడావుడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. -
ముగిసిన కోడెల అంత్యక్రియలు
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు ముగిశాయి. గుంటురు జిల్లా నరసరావుపేటలో స్వర్గపురిలో కోడెల చితికి ఆయన కుమారుడు శివరామ్ నిప్పంటించారు. కోడెలకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు టీడీపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు తరలివచ్చారు. అంత్యక్రియలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ నేతలు హాజరయ్యారు. హైద్రాబాద్లోని ఎన్టీఆర్ భవన్ నుంచి కోడెల భౌతికాయాన్ని నిన్న రోడ్డు మార్గంలో గుంటూరుకు తరలించిన విషయం తెలిసిందే. నేతల నివాళి అనంతరం భౌతిక కాయాన్ని సత్తెనపల్లి మీదుగా నరసరావుపేటకు తరలించారు. -
కోడెల కాల్ డేటాపై ఆ వార్తలు అవాస్తవం : ఏసీపీ
సాక్షి, హైదరాబాద్/అమరావతి : టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై దర్యాప్తు కొనసాగుతోందని బంజారాహిల్స్ ఏసీపీ కే.శ్రీనివాసరావు వెల్లడించారు. అనుమానం ఉన్న వారందరినీ విచారిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 12 మందిని విచారించామని చెప్పారు. కోడెల కుంటుంబ సభ్యుల స్టేట్మెంట్లను రికార్డు చేశామని తెలిపారు. కోడెల భౌతిక కాయానికి సంబంధించి పోస్టుమార్టం పూర్తి నివేదిక ఇంకా అందలేదని పేర్కొన్నారు. కోడెల ఫోన్లోని కాల్డేటా ఆరా తీస్తున్నామని పేర్కొన్నారు. సీడీఆర్ఏ కాల్ లిస్టు రిపోర్టును పరిశీలిస్తున్నామన్నారు. ఇక సోషల్ మీడియాలో కోడెల కాల్ డేటాపై వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. కోడెల కుమారుడు శివరామ్ను త్వరలోనే విచారిస్తామని ఏసీపీ స్పష్టం చేశారు. (చదవండి : ఒక మరణం.. అనేక అనుమానాలు) మొబైల్ ఇంకా దొరకలేదు.. కోడెల శివప్రసాదరావు మృతి కేసులో కీలకం కానున్న ఆయన మొబైల్ ఇంకా దొరకలేదని వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. విచారణ కొనసాగుతోందని అన్నారు. ‘సత్తెనపల్లిలో కోడెల మేనల్లుడు కంచేటి సాయి ఇచ్చిన ఫిర్యాదు ఫ్యాక్స్ ద్వారా అందింది. న్యాయనిపుణుల సలహా తీసుకొని ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. ప్రత్యక్ష సాక్షులు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు రికార్డు చేశాం. కోడెల కుమారుడు శివరాంతో పాటు కోడెల సన్నిహితులు మరికొంతమందిని విచారించాల్సి ఉంది. కోడెల కాల్ డేటాపై ఆరా తీస్తున్నాం. ఆయన ఎవరెవరితో మాట్లాడారు అనేది తెలిస్తే కేసులో పురోగతి లభిస్తుంది. కోడెల పోస్టుమార్టం రిపోర్టు, కాల్ డేటా, ఎఫ్ఎస్సెల్ రిపోర్ట్ అందాల్సి ఉంది’అన్నారు. (చదవండి : కోడెల మృతి: బీజేపీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు) -
‘కోడెలను తిట్టించిన చంద్రబాబు’
సాక్షి, విజయవాడ: టీడీపీలో కోడెల శివప్రసాదరావును చంద్రబాబు నాయుడు తీవ్ర అవమానాలకు గురిచేశారని బీజేపీ అధికార ప్రతినిధి కేవీ లక్ష్మీపతి రాజా ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోడెల బీజేపీలోకి రావాలనుకున్న మాట వాస్తవమని స్పష్టం చేశారు. టీడీపీలో చంద్రబాబు అవమానాలకు గురిచేస్తున్నారని బీజేపీ నేతలతో కోడెల చెప్పారని, తనను కలవడానికి కనీసం చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఆవేదన చెందినట్టు వెల్లడించారు. అమిత్ షాను కలిసేందుకు ఏర్పాటు చేయాలని కోడెల బీజేపీ నాయకులను కోరారని, కోడెల బీజేపీలో చేరికపై పార్టీలో చర్చ కూడా జరిగిందన్నారు. కోడెల చనిపోయిన తర్వాత చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారని, గతంలో కోడెల ఆత్మహత్య ప్రయత్నం చేస్తే చంద్రబాబు కనీసం పరమర్శించిన పాపాన పోలేదని విమర్శించారు. అసెంబ్లీ ఫర్నిచర్ వివాదంలో కోడెలను వర్ల రామయ్యతో చంద్రబాబు తిట్టించారని ఆరోపించారు. శవ రాజకీయాలతో కోడెల ప్రతిష్ఠను మరింత దిగజార్చవద్దని చంద్రబాబుకు హితవు పలికారు. కోడెల శివప్రసాదరావు ఉదంతాన్ని చూసైనా మిగిలిన టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని వదలి బయటకు రావాలని లక్ష్మీపతి రాజా అన్నారు. కోడెల మరణంపై అనుమానాలు: రఘురామ్ టీడీపీలో కోడెల శివప్రసాదరావు అభద్రతా భావానికి గురయ్యారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పురిగళ్ల రఘురామ్ పేర్కొన్నారు. కష్టకాలంలో కోడెలకు చంద్రబాబు అండగా నిలబడలేదని, తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆయనను వాడుకుని వదిలేసిందని ఆరోపించారు. జీవితాంతం పార్టీ కోసం కష్టపడితే తనను చంద్రబాబు కాపాడలేదని కోడెల అన్నట్టు వెల్లడించారు. కోడెల మరణంపై అనేక అనుమానాలున్నాయని, సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. సంబంధిత కథనాలు.. బీజేపీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు ఒక మరణం.. అనేక అనుమానాలు కోడెల మృతికి చంద్రబాబే కారణం గ్రూపులు కట్టి వేధించారు.. -
అందుకే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు
సాక్షి, అమరావతి : నమ్మిన వారు ఆపదలో తనకు అండగా నిలువలేదన్న నిస్పృహతోనే కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డారని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అన్నారు. బుధవారం ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ప్రతిపక్షనేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తను కొనుగోలు చేసిన 23 మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను అనర్హులుగా చేయకుండా కోడెలను వాడుకుని వదిలేశారని విమర్శించారు. కోడెల మరణాన్ని చంద్రబాబు రాజకీయం చేసి ఆయనకు ఆత్మశాంతి లేకుండా వేధిస్తున్నారని అన్నారు. చదవండి : కోడెల మృతి: బీజేపీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు -
కోడెల మృతి: బీజేపీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి పీ రఘురాం సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బీజేపీలో చేరాలనుకున్నారని.. దీనికి సంబంధించి ఆయన అమిత్ షాను కూడా కలవాలనుకున్నారని రఘురామ్ వెల్లడించారు. చంద్రబాబు తన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. నిజాయితీ గల వారికి పార్టీలో విలువ లేదని తనతో నెల రోజుల క్రితం ఫోన్లో మాట్లాడినప్పుడు కోడెల చెప్పారని రఘురాం తెలిపారు. ఈ విషయమై ‘సాక్షి’ టీవీతో ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. నెలరోజుల క్రితం నాకు ఫోన్ చేశారు ‘నెల రోజుల క్రితం కోడెల శివప్రసాదరావు నాకు ఫోన్ చేసి సుదీర్ఘంగా మాట్లాడారు. అమిత్ షాని కలువాలని నాతో చెప్పారు. దీంతో హైకమాండ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాను. సమయం చూసుకొని ఢిల్లీకి వచ్చి బీజేపీ పెద్దలతో కలుస్తాననని ఆయన చెప్పారు. అందుకు నేను సరే సర్ అని చెప్పాను. కోడెల సుదీర్ఘంగా రాజకీయ అనుభవం గల వ్యక్తి. పల్నాటి రాజకీయాల్లో పెద్దమనిషి, పల్నాటి పులిగా పేరొందిన వ్యక్తి. డాక్టర్గా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు సేవలందించారు. ఆయనను కోల్పోవడం ప్రజలకు బాధ కలిగించింది. మృతిని రాజకీయం చేయరాదు కోడెల మృతిని రాజకీయం చేయరాదు. పల్నాటి పులిగా పేరొందిన వ్యక్తి ఈ చర్యకు ఎందుకు పాల్పడ్డారన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. వారం రోజుల కిందట బీజేపీలో నా కంటే సీనియర్ నాయకుడితో ఆయన టచ్లో ఉన్నారు. టీడీపీ అధినాయకత్వం తన పట్ల వ్యవహరిస్తున్న తీరును కోడెల జీర్ణించుకోలేకపోయారు. సన్ స్ట్రోక్ కూడా ఇబ్బంది పెట్టింది. రూపాయి ఆశించకుండా వైద్యం చేసిన వ్యక్తి.. తన పిల్లల మీద, తన మీద ఆరోపణలు రావడంతో బాధపడ్డారు. ఈ కష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా ఆయనకు అండగా నిలబడలేదు. కష్టసమయంలో పార్టీ తనను ప్రొటెక్ట్ చేయలేదన్న ఆవేదన ఆయన మాటల్లో కనిపించింది. ఆయన పార్థీవదేహం ఉండగానే ఆయన మృతి పట్ల రాజకీయాలు చేయడం మంచి విషయం కాదు. చంద్రబాబు పట్టించుకోలేదు రాజకీయాల్లో కేసులు కొత్తకాదు. చిదంబరం, లాలూ, జయలలిత లాంటి వ్యక్తులు కేసులు ఎదుర్కొన్నారు. కేసులు పెట్టినంతమాత్రాన కోడెల భయపడతారని నేను అనుకోవడం లేదు. కష్ట సమయంలో పార్టీ నన్ను ఒంటరివాడిని చేసింది.. మద్దతు ఇవ్వలేదన్న ఆవేదన కోడెల మాటల్లో కనిపించింది. అందుకే బీజేపీలో చేరాలని అనుకున్నారేమో.. ఆరోపణలు వచ్చిన కష్టసమయంలో అండగా నిలబడకుండా చంద్రబాబు, అధినాయకత్వం తనను నిర్లక్ష్యం చేసిందని, పట్టించుకోలేదని ఆయన భావించారు. పార్టీ నేతలు కూడా తనపై విమర్శలు చేయడం ఆయనను బాధించింది. కోడెల విషయమై నేను చేసిన ట్వీట్ చూసి ఓ సీనియర్ జర్నలిస్టు కూడా నాతో మాట్లాడారు. మీరు చెప్పిన విషయం వాస్తవమేనని, పార్టీ నిర్లక్ష్యం చేస్తుందని కోడెల తనతో బాధపడినట్టు ఆ జర్నలిస్టు చెప్పారు. పార్టీ అధినాయకత్వం తీరుతో ఆయన అభద్రతాభావానికి లోనయ్యారు. నిజాయితీపరులకు టీడీపీలో స్థానం లేదని కోడెల చెప్పారు. పార్టీ తనను ఏ విధంగానూ ప్రొటెక్ట్ చేయలేదని కోడెల అన్నారు. ఆయన మృతిపై దర్యాప్తు జరపాలి కోడెల పార్థీవదేహం ఉండగానే రాజకీయంగా రచ్చ చేయడం సరికాదు. ఇరురాష్ట్ర ప్రభుత్వాలు కోడెల మృతిపై సమగ్రమైన విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలి. కోడెల పర్సనల్ సెల్ఫోన్ కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పార్టీ తీరుతో ఒంటరి భావనకు లోనైన కోడెల ఒక నెల కిందట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారని, ఆస్పత్రిలో కూడా జాయిన్ అయ్యారని గతంలో కథనాలు వచ్చాయి. కోడెల మృతి విషయంలో అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరముంది. -
బాబువల్లే కోడెలకు క్షోభ
సాక్షి, అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఆయన కుటుంబీకులు, టీడీపీ నేతలు, చంద్రబాబేనని సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నీచమైన ఎత్తుగడలతో శవ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కోడెలను చంద్రబాబు పదే పదే అవమానించారని, టీడీపీ నేత వర్ల రామయ్యతో ఆరోపణలు చేయించారని చెప్పారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా చంద్రబాబును కలుసుకోవడానికి అవకాశమే ఇవ్వలేదన్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతున్నారని ప్రచారం కూడా చేయించారని విమర్శించారు. కోడెల ఆత్మహత్యకు కారణం కేసులు కానే కాదని, చంద్రబాబు తీరుతోనే మానసిక క్షోభకు గురయ్యారని తెలిపారు. శివప్రసాదరావు తమకు రాజకీయ ప్రత్యర్థే తప్ప వ్యక్తిగత ప్రత్యర్థి ఎంత మాత్రం కాదని, ఆయన చనిపోవాలని కోరుకునే మనస్తత్వం తమది కాదని అంబటి స్పష్టం చేశారు. పరామర్శించని చంద్రబాబు ఆగస్టు 23వ తేదీనే కోడెల ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే ఆయన అల్లుడు లక్ష్మీ సూపర్ స్పెషాలిటీస్ ఆస్పత్రిలో చేర్పించారని అంబటి తెలిపారు. అయితే దానిని బయటకు రానీయకుండా ఆయన బంధువులు, కుటుంబీకులు గుండె పోటు అని మసిపూసి మారేడుకాయ చేసేందుకు ప్రయత్నించారన్నారు. అప్పట్లో ఆస్పత్రికి అనేక మంది టీడీపీ వారు వెళ్లి పరామర్శించారని, అక్కడకు కేవలం 50 మీటర్ల దూరంలో ఉన్న టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి నాలుగు సార్లు వచ్చి వెళ్లిన చంద్రబాబు.. కనీసం పరామర్శ చేయలేదని అంబటి దుయ్యబట్టారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, మరో మాజీ మంత్రి చంద్రబాబు దగ్గరకు వెళ్లి ‘మీరొకసారి పరామర్శించండి’ అని చంద్రబాబుకు సలహా ఇస్తే ‘నేను రాను’ అని తెగేసి చెప్పారన్నారు. కోడెలపై ఇటీవల వచ్చిన 19 కేసుల్లో ఎక్కువగా టీడీపీ వారు పెట్టినవేనని అంబటి తెలిపారు. -
గ్రూపులు కట్టి వేధించారు..
సాక్షి, అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతికి మాజీ సీఎం చంద్రబాబు వైఖరే కారణమని, పది రోజులుగా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా వేధించారని పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ఆరోపించారు. చివరికి హైదరాబాద్లో కలుద్దామని చెప్పి ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేయించి మానసిక క్షోభకు గురి చేశాడన్నారు. సోమవారమైనా అపాయింట్మెంట్ ఇస్తాడని ఉదయం 9.30 గంటల వరకు ఆయన వేచి చూశారని, అయితే హైదరాబాద్ నుంచి చంద్రబాబు విజయవాడ బయలుదేరాడని తెలుసుకున్న తర్వాత కోడెల ఉరివేసుకొని చనిపోయాడని చెప్పారు. మంగళవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కోడెల మృతిపై శవ రాజకీయాలు చేయొద్దని చంద్రబాబును హెచ్చరించారు. కోడెల మరణంలో చంద్రబాబు పాత్రపై విచారణ చేసి ఆయన్ను ఏ1 ముద్దాయిగా చేర్చాలని, ఆయన కాల్డేటాను పరిశీలించి చంద్రబాబును కలవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించాడో బయటపెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. కోడెలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కేసులు నమోదు చేయలేదని స్పష్టం చేశారు. చంద్రబాబువి మొసలికన్నీరు.. వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చినా చంద్రబాబు మాట విని కోడెల వారిపై అనర్హత వేటు వేయకుండా సహకరించారని కొడాలి నాని గుర్తు చేశారు. కోడెల కుమారుడిని పెట్టుకొని లోకేష్ కమీషన్లు తీసుకొని వాటాలు పంచుకున్నారన్నారు. వర్ల రామయ్య లాంటి వ్యక్తులతో కోడెలపై విమర్శలు చేయించారని, సత్తెనపల్లిలో ఆయనకు వ్యతిరేకంగా గ్రూపులు తయారు చేశారని చెప్పారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మూడు రోజుల కిందట గుంటూరులో చంద్రబాబు సమావేశం నిర్వహించడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఆయన నమ్ముకున్న కుటుంబ సభ్యులు, పార్టీ, పార్టీ అధ్యక్షుడు వదిలించుకోవాలని చేసిన ప్రయత్నాలకు ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. -
కోడెల మృతికి చంద్రబాబే కారణం
సాక్షి, అమరావతి: బతికున్నప్పుడు హింసించడం, చనిపోయాక శవరాజకీయాలు చేయడం చంద్రబాబు నైజం అని, అలాంటి నీచ రాజకీయాలు చేయడం వైఎస్సార్సీపీకి చేతకాదని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి వ్యాఖ్యానించారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతికి చంద్రబాబే పరోక్ష కారణమని ఆయన దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ కోడెల మృతి బాధాకరమని, వైఎస్సార్సీపీ తరపున ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి అని తెలిపారు. కోడెల మరణవార్త విన్నవెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు అందరూ సంతాపం వ్యక్తం చేశారన్నారు. చంద్రబాబు మాత్రం ప్రజలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కుట్ర చేస్తున్నాడన్నారు. అంత సానుభూతి ఉన్నవ్యక్తే అయితే ఇటీవల కోడెల తీవ్ర అనారోగ్యానికి గురైతే ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. శవం పక్కన నిలబడి రాజకీయమా? కోడెల శివప్రసాద్ మృతి చెందిన తరువాత శవం పక్కన నిలబడి శవరాజకీయాలు చేస్తున్న చంద్రబాబు అసలు మనిషేనా అని శ్రీకాంత్రెడ్డి ప్రశ్నించారు. రాత్రి పగలు తేడా లేకుండా ప్రెస్మీట్లు పెడుతూ అధికార పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కోడెలను మూడు నెలల నుంచి ఒక్కరోజు అయినా పరామర్శించడానికి చంద్రబాబు వెళ్లలేదన్నారు. ఇబ్బందులు ఏమిటని అడగలేదన్నారు. పైగా కోడెలను అవమానించే రీతిలో సత్తెనపల్లి, నరసారావుపేటలో ఆయన వ్యతిరేక గ్రూపును ప్రోత్సహించి పార్టీ కార్యక్రమాలు మీరే చేపట్టండి అని వారికి ఆదేశాలు ఇవ్వడంతోనే కోడెల మానసికంగా కుంగిపోయారని తెలిపారు. కోడెల మృతికి ఒకపక్క ఆయన కొడుకు బాధ్యుడు అయితే.. పరోక్షంగా చంద్రబాబు కారణమన్నారు. కోడెల ఆయన కుమారుడు, కూతురు వల్లే చనిపోయాడని టీడీపీ నేతలే అంటున్నారని శ్రీకాంత్రెడ్డి అన్నారు. కోడెల విషయమే కాదు.. ఏ అంశంలోనూ తప్పు లేకుండా ఎవరిపై కేసులు పెట్టేందుకు వైఎస్సార్సీపీ ఒప్పుకోదన్నారు. -
నేడు కోడెల అంత్యక్రియలు
సాక్షి, గుంటూరు/అమరావతి: శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలను బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో నరసరావుపేటలో నిర్వహించనున్నారు. కోడెల సోమవారం హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్ నుంచి ఆయన భౌతికాయాన్ని మంగళవారం రోడ్డు మార్గంలో గుంటూరు తరలించారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో అభిమానులు, టీడీపీ కార్యకర్తల సందర్శనార్థం కోడెల భౌతికకాయాన్ని ఉంచారు. మాజీ స్పీకర్కు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, పితాని సత్యనారాయణ, చినరాజప్ప, జవహర్తోపాటు పార్టీ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు నివాళులు అర్పించారు. కోడెల తనయుడు కోడెల శివరామ్ను నాయకులు పరామర్శించారు. అనంతరం భౌతిక కాయాన్ని సత్తెనపల్లి మీదుగా నరసరావుపేటలోని కోడెల నివాసానికి తరలించారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. కాగా కోడెల అంత్యక్రియలను అధికార లాంఛనాలతో జరపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఆదేశించారు. ఇదిలా ఉంటే.. బుధవారం కోడెల అంత్యక్రియల నేపథ్యంలో నరసరావుపేటలో అమలులో ఉన్న 144వ సెక్షన్లో మినహాయింపు ఇస్తున్నట్టు గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ ప్రకటించారు. -
ఒక మరణం.. అనేక అనుమానాలు
సాక్షి, అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి ఎందుకొచ్చింది? ఆయన మరణాన్ని సైతం మభ్యపెట్టేందుకు సొంత మనుషులే ఎందుకు తాపత్రయపడుతున్నారు? ఆయన ఉరి వేసుకుని చనిపోతే గుండెపోటు అని.. ప్రమాదకర ఇంజక్షన్లు చేసుకున్నారంటూ మీడియాకు పరస్పర విరుద్ధమైన లీకులు ఎందుకిచ్చారు? కొనఊపిరితో ఉన్న ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లలేదు? పైగా దూరంగా ఉన్న బవసతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లినట్లు?.. నేర స్థలంలో ఆధారాలు ఎందుకు చెరిగిపోయాయి?.. కోడెల వాడుతున్న సెల్ఫోన్ ఏమైపోయింది?.. ఆత్మహత్యకు ముందు 24 నిమిషాలపాటు ఆయన ఎవరితో ఫోన్లో మాట్లాడారు?.. ఇవీ కోడెల ఆత్మహత్యపై ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్నలు. కానీ, ఆయన ఆత్మహత్యను ఏ కోణంలో చూసినా.. కోడెల కుమారుడు, కుమార్తె చర్యలు, వాడుకుని కష్టకాలంలో వదిలేసిన సొంత పార్టీ వ్యవహారశైలి వైపే అందరి వేళ్లూ చూపిస్తున్నాయి. కోడెల మృతిచెందిన రోజున అసలేం జరిగింది అనే కోణంలో తెలంగాణ పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ముందుగా కుటుంబ సభ్యుల తీరుపైనే అనుమానం వ్యక్తమవుతున్నట్లు సమాచారం. గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లిలో గడిచిన ఐదేళ్లలో కొడుకు శివరామకృష్ణ, కుమార్తె విజయలక్ష్మి చేసిన వ్యవహారాలు తన పరువు తీశాయని ఆయన తీవ్ర ఆవేదనకు గురైనట్టు ప్రచారం జరుగుతోంది. పలు అంశాలపై కుమారుడు, కుమార్తెతో ఆయనకు తరచూ వాగ్వాదం జరిగేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. తీవ్ర మానసిక ఒత్తిడితో సతమతమవుతున్న తనను పార్టీకి చెందిన కీలక నేతలు ఎవరూ పట్టించుకోకపోగా, పలకరింపే కరువైనట్లు ఆయన తన ఆంతరంగికుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది? కోడెల ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు ఏం జరిగిందనే దానిపై పోలీసులు ప్రధానంగా దృష్టిసారించారు. ఇప్పటికే అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి అన్ని కోణాల్లోను దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం ఉ.9.30 గంటల వరకూ కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం తీసుకున్న తర్వాత ఏం జరిగింది? కుటుంబ సభ్యులతో ఏదైనా వాగ్వాదం జరిగిందా? అనేది కీలకంగా మారింది. అలాగే, కొద్దిరోజుల క్రితం గుండెపోటు వచ్చిందని కోడెలను నరసరావుపేటలోని తన అల్లుడు ఆసుపత్రికి తరలించారు. నిజానికి ఆయన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్పినట్లు ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు ఉరి వేసుకుని చనిపోతే మళ్లీ అదే గుండెపోటు కథను ఎందుకు నడిపించారు.. దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందో అన్న దానిపై వారు దృష్టిపెట్టారు. క్లూస్ టీం కోణమేంటి? కోడెల ఆత్మహత్య అనంతరం ఆయనను తొలుత బసవతారకం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాతే క్లూస్ టీం ఘటన స్థలాన్ని సందర్శించింది. కానీ, అప్పటికే నేరస్థలంలో కీలక ఆధారాలు లభించలేదని క్లూస్ బృందం చెబుతున్నట్లు తెలిసింది. ఆత్మహత్యకు ఉపయోగించిన తాడు (గుడ్డతో చేసింది) ఘటన స్థలంలో కాకుండా వేరేచోట సేకరించినట్లు సమాచారం. ఉరి వేసుకున్నట్లుగా చెబుతున్న ఫ్యాన్ భాగం వంగి ఉంది. అయితే.. నేలభాగం, ఫ్యాను ఎత్తుని పోల్చిన క్లూస్ బృందం ఈ విషయంలో అనుమానం వ్యక్తంచేస్తోంది. కోడెల మంచం మీద నుంచి ఫ్యానుకు తాడు బిగించుకున్నారా? అదే నిజమైతే ఫ్యాన్ ఇంకా ఎక్కువగా వంగి ఉండాలని అంటున్నారు. అలాకాకుండా ఏదైనా స్టూల్ లేదా కుర్చి వేసుకున్నారా? అని సందేహిస్తున్నారు. కానీ, దీనికి బలం చేకూర్చే ఆనవాళ్లేమీ అక్కడ కన్పించలేదని క్లూస్ అధికారులు అంటున్నారు. ఇక కోడెల గదిలో ఎలాంటి లేఖ కన్పించలేదు. ఏదేమైనా ఫోరెన్సిక్ లేబొరేటరీ పరీక్షల ఆధారంగానే కోడెల మృతిపై నెలకొన్న సందేహాలు నివృత్తి అయ్యే వీలుందని దర్యాప్తు వర్గాలు అంటున్నాయి. కోడెల మృతదేహాన్ని ఆయన కుటుంబీకులు మంగళవారం ఉదయం స్వస్థలానికి తరలించారు. అలాగే, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం ఈ కేసు దర్యాప్తు తీరుతెన్నుల్ని ఆరా తీశారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ పరిశీలించాలని దర్యాప్తు అధికారులను ఆదేశించారు. ఆధారాలేమయ్యాయి? కోడెలది ఆత్మహత్యేనని శవపరీక్షలో ప్రాథమికంగా నిర్థారించినా, భిన్న కోణాల్లో వస్తున్న అనుమానాలపైనే దర్యాప్తు బృందాలు ప్రధానంగా దృష్టి పెట్టాయి. ఫోరెన్సిక్ పరీక్షల అనంతరమే వాస్తవ పరిస్థితిపై పూర్తి అవగాహనకు రావడం సాధ్యమని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. క్లూస్ టీం వెళ్లే సమయానికే నేరస్థలం పూర్తిగా చెరిగిపోవడాన్ని గమనించిన అధికారులు కొన్ని కీలకమైన ఆధారాలు సేకరించలేకపోయారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు, క్లూస్ టీం.. శవ కాఠిన్యత విషయంలోనూ వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. దీన్నిబట్టి ఆయన మృతిపై కచ్చితమైన సమయాన్ని రికార్డు చేయడానికి మరికొన్ని ఆధారాలు అవసరమని అధికారులు అంటున్నారు. ఆ ద్రవాలు ఏమిటి? భౌతిక ఆధారాలను బట్టి పోస్టుమార్టం వైద్యుడు ఆత్మహత్య అనే నిర్థారణకు వస్తారు. కానీ, విస్రా (కాలేయం, పేగులు, గుండె, మూత్ర పిండాలు)ను పూర్తిగా పరిశీలించిన తర్వాతే కచ్చితమైన ఆధారాలు లభిస్తాయి. విస్రాను ఫోరెన్సిక్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) టాక్సికాలజీ (విష పదార్థాల పరీక్ష) విభాగం పరిశీలించాల్సి ఉంటుంది. పోస్టుమార్టం చేసి, విస్రాను సేకరించిన వైద్యులు అల్పహారంతో పాటు, కొన్ని ద్రవాలు ఉన్నట్లు గుర్తించారని సమాచారం. దీన్నిబట్టి కోడెల అంతకుముందు ఏదైనా ద్రవ పదార్థం తీసుకున్నారా? తీసుకుంటే అదేంటి? అదేమైనా విషపూరితమైనదా? ఉదయం నుంచి ఆయన కుటుంబ సభ్యుల మధ్యే ఉన్నందున దాన్నెలా తీసుకున్నారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కోడెల ఫోన్ ఎక్కడ? కోడెల ఆత్మహత్యకు దారితీసిన కీలక ఆధారాలు తెలుసుకోవడంలో పోలీసులకు అవరోధాలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా సెల్ఫోన్ మిస్సింగ్ వ్యవహారం జఠిలంగా మారింది. చనిపోవడానికి ముందు ఎవరితో మాట్లాడారు? ఏం మాట్లాడారు? అన్నది తేలడానికి కోడెల సెల్ఫోన్ ఒక్కటే ఆధారం. కానీ, అదిప్పుడు కనిపించడంలేదు. కుటుంబ సభ్యుల వద్ద ఉండి ఉంటుందని.. అంత్యక్రియల కార్యక్రమం పూర్తయ్యాక స్వాధీనం చేసుకుంటామని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు.. కోడెల కాల్డేటాను దర్యాప్తు అధికారులు వెలికితీస్తున్నారు. చనిపోవడానికి ముందు ఆయన 24 నిమిషాలపాటు ఫోన్లో మాట్లాడినట్లు నిర్ధారణ అయ్యింది. అది ఎవరితో అనేది తెలియాల్సి ఉందన్నారు. వాట్సాప్ అకౌంట్ విశ్లేషణకూ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కోడెల చివరిసారిగా సోమవారం ఉ.6.51 గంటలకు వాట్సాప్ను చూసినట్లు.. అలాగే, ట్రూకాలర్ను ఆదివారం చూసినట్లు అధికారులు గుర్తించారు. ఆవేశంలోనే ఆత్మహత్య? సాధారణంగా ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడితే కారణాలను వివరిస్తూ సూసైడ్ నోట్ రాస్తారని.. కానీ, కోడెల ఆత్మహత్యకు పాల్పడిన గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు చెబుతున్నారు. అంటే అప్పటికప్పుడు మాట్లాడిన ఫోన్కాల్ కారణంగానో, కుటుంబ సభ్యుల వివాదంతోనో ఆవేశంగా ఆయన ఆత్మహత్య నిర్ణయం తీసుకుని ఉండొచ్చని ఆ అధికారి విశ్లేషించారు. -
కోడెల మృతి.. రఘురామ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఢిల్లీలో ఆ పార్టీ కో–ఆర్డినేటర్ పురిఘళ్ల రఘురామ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో తనకు ఎటువంటి విలువ ఇవ్వకపోవడం పట్ల కోడెల తీవ్ర మనోవేదనకు గురయ్యారని, నెలరోజుల క్రితం ఆయన తనకు ఫోన్ చేసి మనసులోని ఆవేదనను తనతో పంచుకున్నారని, ఇంతలోనే ఆయన ఇలా మృతి చెందడం ఎంతో బాధ కలిగిస్తోందని రఘురాం అన్నారు. కోడెల మృతిపై రఘురామ్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని తనతో మాట్లాడిన సందర్భంగా మాజీ స్పీకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని, నిజాయితీతో పనిచేసే నాయకులకు టీడీపీలో విలువలేదని చెప్పారని బీజేపీ నేత తెలిపారు. పార్టీలో తనను పూర్తిగా ఒంటరిని చేయడం మానసిక క్షోభను కలిగిస్తోందని ఆయన చెప్పారన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరుతానని కోడెల అంటూ.. అమిత్ షాను కలవాలని అనుకుంటున్నట్టు చెప్పారని రఘురామ్ వివరించారు. అయితే అమిత్ షాను కలువకుండానే కోడెల మృతి చెందడం దురదృష్టకరమన్నారు. మాజీ స్పీకర్ మృతిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సమగ్ర దర్యాప్తు చేయించాలని పురిఘళ్ల డిమాండ్ చేశారు. -
కోడెల మృతి వెనుక మిస్టరీ ఉంది...
సాక్షి, తాడేపల్లి: పార్టీ సీనియర్ నేత మరణిస్తే టీడీపీ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆయన మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కోడెల శివప్రసాదరావు మృతి వెనక మిస్టరీ ఉంది. ఆయన మృతికి కుటుంబసభ్యులు, టీడీపీనే కారణం. కోడెలపై కేసులు పెట్టింది టీడీపీ నేతలే. మేం కాదు. పల్నాటి పులి అనే వ్యక్తి ఎందుకు ఉరేసుకున్నాడు?. చంద్రబాబు తీరువల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. కోడెల రాజకీయ వారసుల్ని ప్రకటించాలి కోడెల ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఎందుకొచ్చాయి. గతంలో ఆయన ఆస్పత్రిలో ఉంటే చంద్రబాబు ఒక్కసారి కూడా పరామర్శించలేదు. అంతేకాదు.. కోడెలపై సొంత పార్టీ నేత వర్ల రామయ్యతో ఆరోపణలు చేయించారు. సత్తెనపల్లిలో కోడెలను అవమానించింది చంద్రబాబే. ఎన్నిసార్లు ప్రయత్నించినా కోడెలకు చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. త్వరలోనే కోడెలను సస్పెండ్ చేయబోతున్నామని.. చంద్రబాబు ప్రచారం చేయించారు. బాబుకు ప్రేమ ఉంటే కోడెల రాజకీయ వారసులను ప్రకటించాలి. సత్తెనపల్లి నుంచి కూతుర్ని, నర్సరావుపేట నుంచి కొడుకుని రాజకీయ వారసులుగా ప్రకటించండి. కోడెల అంత పిరికివారు కాదు.. కోడెల మరణాన్ని వైఎస్సార్ సీపీ మీద రుద్ది రాజకీయ ప్రయోజనం పొందాలని చంద్రబాబు చూస్తున్నారు. కోడెల మాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. రాజకీయ ప్రత్యర్థి చనిపోవాలని ఎవరు అనుకోరు. పెద్ద పెద్ద కేసులను ఎదుర్కొన్న వ్యక్తి ఆయన. ఎన్నో సంక్షోభాలను కోడెల చూశారు. గతంలో సీబీఐ విచారణ జరిగినా భయపడలేదు. ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. కోడెల ఎందుకు ఉరి వేసుకున్నాడో ప్రజల్లో చర్చ జరగాలి. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ఏదో బలమైన కారణం ఉంది. కోడెల మరణానికి కారణం మొదటిది ఆయన కుటుంబ సభ్యులు, రెండోది తెలుగుదేశం పార్టీనే. కోడెలకు టీడీపీ వాళ్లు ఒక్కరైనా అండగా నిలిచారా?. కోడెలను ఎందుకు పరామర్శించలేదు గతంలో ఆయన ఒకసారి ఆత్మహత్యాయత్నం చేశారు. అప్పుడు గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేశారు. కోడెల ఆత్మహత్యాయత్నం చేస్తే నాలుగుసార్లు గుంటూరు వచ్చిన చంద్రబాబు కనీసం కోడెలను పరామర్శించలేదు. సత్తెనపల్లిలో ఆయనను దారుణంగా అవమానించారు. చంద్రబాబు ఎవరినైనా వాడుకొని వదిలేస్తారు. కోడెల పార్థివ దేహం పక్కన పెట్టుకుని వైఎస్సార్ సీపీపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబుకు శవ రాజకీయాలు చేయడం అలవాటుగా మారింది. ఎన్టీఆర్ మరణానికి కారణం చంద్రబాబు కాదా?. హరికృష్ణ మానసిక క్షోభకు ఆయన కారణం కాదా?. గతంలో ఎమ్మెల్యే రోజా మీద, మా మీద ఎన్నో కేసులు చంద్రబాబు పెట్టారు. విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని రన్వే మీదే అడ్డుకున్నారు. కోడెల మరణంపై విచారణ జరిగినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.’ అని ఎమ్మెల్యే అంబటి స్పష్టం చేశారు. చదవండి: కోడెల ఫోన్ నుంచి ఆ టైమ్లో చివరి కాల్.. కోడెల కాల్డేటాపై విచారణ జరపాలి అధికార లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు ఆది నుంచి వివాదాలే! కోడెల మృతిపై బాబు రాజకీయం! కోడెల మృతితో షాక్కు గురయ్యాను... కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు! కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి కోడెల మృతిపై కేసు నమోదు కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
‘చంద్రబాబు వల్లే కోడెల మృతి’
సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు పెట్టిన అవమానాలతోనే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణించారని ఏపీఐఐసీ చైర్పర్సన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎక్కడా ఉద్దేశ్యపూర్వకంగా కోడెలపై కేసులు పెట్టలేదన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గత కొద్ది రోజులుగా కోడెలకు చంద్రబాబు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. నమ్మిన నాయకుడు, పార్టీ చేసిన అవమానంతోనే ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నామన్నారు. వర్ల రామయ్య లాంటి వ్యక్తులు కోడెలను దూషించడం వెనుక చంద్రబాబు పాత్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సొంత మామ ఎన్టీఆర్, రంగా లాంటి వ్యక్తుల మరణం వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందని అందరికి తెలిసిన విషయమేనని రోజా విమర్శించారు. చదవండి : కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి కోడెల మృతిపై కేసు నమోదు కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
కోడెల ఫోన్ నుంచి ఆ టైమ్లో చివరి కాల్..
సాక్షి, హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అనుమానాస్పద మృతి కేసులో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కోడెల ఆత్మహత్యకు గత కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఇప్పటికే పలు కీలక ఆధారాలను సేకరించారు. కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డ వైరును స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం 8:30కి కోడెల ఫోన్ నుండి చివరి కాల్ వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. గత రెండు రోజులుగా కోడెల ఎవరెవరికి ఫోన్ చేశారు, ఎవరి నుంచి ఆయనకు కాల్స్ వచ్చాయనేదానిపై దృష్టి సారించారు. కోడెల నివాసంలో వేలిముద్రలను క్లూస్ టీమ్ సేకరించింది. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత కేసులో పురోగతి వచ్చేఅవకాశముందని పోలీసులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల స్టేట్ మెంట్ లిఖితపూర్వకంగా నమోదు చేశామని, అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కోడెల పర్సనల్ మొబైల్ మిస్సింగ్ కోడెల శివప్రసాదరావు వ్యక్తిగత మొబైల్ కనిపించకుండా పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోడెల కూతురు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 174 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కోడెల చివరగా 24 నిమిషాలు ఫోన్ మాట్లాడినట్లు కాల్డేటా ఆధారంగా పోలీసులు గుర్తించారు. నిన్న సాయంత్రం 5 గంటలకు కోడెల సెల్ఫోన్ స్విచాఫ్ అయినట్లు కనుగొన్నారు. ఫోన్ను ఎవరైనా దొంగిలించారా, దాచిపెట్టారా అనేది దర్యాప్తులో తేలనుంది. కాగా, కోడెల శివప్రసాదరావు భౌతికకాయానికి గుంటూరు జిల్లా నరసరావుపేటలో రేపు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఆదేశించారు. కోడెల శివప్రసాదరావు పార్థీవ దేహాన్ని హైదరాబాద్ నుంచి ఈ మధ్యాహ్నం గుంటూరుకు తీసుకొచ్చారు. మరోవైపు కోడెల కుమారుడు శివరామ్ విదేశాల నుంచి గుంటూరు చేరుకున్నారు. సంబంధిత వార్తలు... మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య కొడుకే వేధించాడు: కోడెల బంధువు కోడెల మృతిపై బాబు రాజకీయం! ఆది నుంచి వివాదాలే! కోడెల మృతిని రాజకీయం చేయవద్దు అధికార లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు -
కోడెల మృతి బాధాకరం: ధర్మాన కృష్ణదాస్
సాక్షి, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి బాధాకరమని ఏపీ ఆర్అండ్బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. కోడెల మృతిపై ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మంగళవారం ధర్మాన విలేకరులతో మాట్లాడుతూ.. తమ పార్టీకే చెందిన నేత మృతిని ఇలా రాజకీయ లబ్ది కోసం వాడుకోవడం చంద్రబాబుకే చెల్లిందని ఎద్దేవా చేశారు. కోడెల మరణంపై చంద్రబాబు రాజకీయం చేయడం తగదని అభిప్రాయపడ్డారు. కుటుంబంలో నెలకొన్న భేదాభిప్రాయాల కారణంగానే కోడెల బలవన్మరణం పొందారని స్వయానా అతని మేనల్లుడే పోలీసులకు ఫిర్యాదు చేశారని ఈ సందర్భంగా ధర్మాన పేర్కొన్నారు. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం సిట్ దర్యాప్తుకు ఆదేశించిందని, కొద్ది రోజుల్లో వాస్తవాలు వెలువడతాయని ఆయన తెలిపారు. -
అధికార లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు
సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఆదేశాలిచ్చారు. కాగా, కోడెల శివప్రసాదరావు పార్థీవ దేహాన్ని హైదరాబాద్ నుంచి నరసరావుపేటకు తరలిస్తున్నారు. కార్యకర్తల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఈ మధ్యాహ్నం గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఉంచనున్నారు. రేపు (బుధవారం) నరసరావుపేటలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. సోమవారం హైదరాబాద్లో అనుమానాస్పదరీతిలో కోడెల శివప్రసాదరావు మృతి చెందారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సంబంధిత వార్తలు... మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య కొడుకే వేధించాడు: కోడెల బంధువు కోడెల మృతిపై బాబు రాజకీయం! ఆది నుంచి వివాదాలే! కోడెల మృతిని రాజకీయం చేయవద్దు -
కోడెల కాల్డేటాపై విచారణ జరపాలి
సాక్షి, అమరావతి: తమ ప్రభుత్వం ఎవరిపైనా కక్షసారింపు చర్యలకు పాల్పడట్లేదని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖమంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణానికి చంద్రబాబు నాయుడే పరోక్ష కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. పదిరోజుల పాటు చంద్రబాబు కనీసం ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని, నమ్మిన నాయకుడు, పార్టీ చేసిన అవమానంతోనే ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నామన్నారు. నిన్న ఉదయం 9 గంటల వరకు కూడా చంద్రబాబతో భేటీకి కోడెల ప్రయత్నించారని, దానికి నిరాకరించడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారని మంత్రి పేర్కొన్నారు. కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ప్రభుత్వం కేసులు పెడితే పోరాడే తత్వం కలిగిన వ్యక్తిఅని వ్యాఖ్యానించారు. కోడెలను ప్రభుత్వం వేధించిందంటూ చంద్రబాబు ఇష్టానుసారంగా విమర్శలు చేయడం సరికాదన్నారు. ఫర్నిచర్, బిల్డర్లు కేసు కానీ ప్రభుత్వం పెట్టింది కాదని.. అసెంబ్లీ ఫర్నిచర్ తన ఇంట్లో ఉందని శివప్రసాద్ అంగీకరించినట్లు మంత్రి గుర్తుచేశారు. పల్నాడు పులి.. మరి ఎందుకు అడ్డుకున్నారు? మంగళవారం ఆయన సచివాలయంలో మీడియా సమావేశంలో మట్లాడారు. ‘ఏ కేసులోను ప్రభుత్వం కోడెలకు, ఆయన కొడుకు, కుతుర్లకు ఎలాంటి నోటీస్లు ఇవ్వలేదు. ఆయన్ని చంద్రబాబే వదిలించుకునేలా వ్యవహరించారు. కోడెలను పార్టీలో దూరం పెట్టి అవమానించారు. అసెంబ్లీ ఫర్నిచర్ కేసులో వర్ల రామయ్యతో విమర్శలు చేయించారు. అందుకే కోడెల లాంటి వ్యక్తి అలాంటి చర్యకు పాల్పడ్డారు. 1999 లో బాంబుల కేసు విచారణ చేసి అవమానించింది చంద్రబాబు కాదా..? 2014 లో కోడెల పుట్టిన నరసరవు పేట సీటు కాదని సత్తెనపల్లి పంపి అవమానించింది చంద్రబాబు కాదా..? తరువాత మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించలేదా.? పల్నాడు పులి అని ఈరోజు చెప్తున్న చంద్రబాబు. మరి కోడెలను పల్నాడు రాకుండా ఎందుకు అడ్డకున్నారు. కోడెల కాల్డేటాను విచారించాలి కోడెలకు వ్యతిరేకంగా సత్తెనపల్లి లో వర్గాన్ని తయారు చేసింది ఎవరు..? ఇప్పుడు కోడెల మృతదేహం వద్ద కూర్చుని చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఎన్టీఆర్ని కూడా ఇలానే క్షోభకు గురి చేసి చంపించి తరువాత శవం వద్ద మొసలి కన్నీరు కార్చారు. కోడెలను ప్రభుత్వం వేధిస్తోందంటూ.. ఈ 3 నెలల్లో ఎప్పుడయినా చంద్రబాబు మాట్లాడారా..? ఆయనకు మద్దతుగా ఎవ్వరిని మాట్లాడనివ్వ లేదు. చంద్రబాబు కోడెలను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి వేధించారు. తెలంగాణ ప్రభుత్వం కోడెల కాల్డేటాను విచారించాలి. ఇందులో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలి’ అని అన్నారు. చదవండి: శివరామే తండ్రిని హత్య చేశాడని ఫిర్యాదు కోడెల మృతితో షాక్కు గురయ్యాను... కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు! కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి కోడెల మృతిపై కేసు నమోదు కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
కోడెలకు బాబు అపాయింట్మెంట్ ఎందుకివ్వలేదు
-
‘టీడీపీలోనే కోడెలకు అవమానాలు’
సాక్షి, అమరావతి: టీడీపీలో ఎదురైన అనేక అవమానాలతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తీవ్ర మనోవేదనకు గురయ్యారని ప్రభుత్వ చీఫ్విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గత రెండు నెలలుగా కోడెల అనారోగ్యంతో బాధపడుతున్నా.. చంద్రబాబు కనీసం పరామర్శించలేదని గుర్తుచేశారు. ఛలో ఆత్మకూరుకు కోడెల వస్తానంటే టీడీపీ నేతలు ఆయన్ని ఆడ్డుకున్నారని, వర్గ రామయ్య కూడా ఆయనపై అనేక ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. టీడీపీ నేతల అవమానాలు భరించలేకే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ.. శవ రాజకీయాలు చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల మరణం చాలా బాధాకరమన్న ఆయన.. చంద్రబాబు వేధింపుల కారణంగానే కోడెల మృతి చెందారని ఆరోపించారు. పల్నాడు ప్రాంతంలో టీడీపీ గ్రూపు రాజకీయాలు చేస్తోందని.. ఓ వర్గాన్ని మాత్రమే చంద్రబాబు పోత్రహిస్తూ కోడెలను అవమానానికి గురిచేశారని పేర్కొన్నారు. కోడెలపై ప్రభుత్వం కేసులు పెట్టలేదని, కేవలం బాధితులు మాత్రమే పెట్టారని ఆయన స్పష్టం చేశారు. ‘ఎన్నికల అనంతరం కోడెల అస్వస్థతకు గురయ్యారు. రెండు నెలల్లో కనీసం ఒక్కసారి కూడా చంద్రబాబు ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీయలేదు. బతికున్నప్పుడు మనుషులను వేధించడం చంద్రబాబుకు బాగా తెలుసు. చనిపోయిన తరువాత శవ రాజకీయాలను చేయడం ఆయనకు ఎంతో సులువు. ఎన్టీఆర్, హరికృష్ణ మరణం సమయంలో ఇలాంటివి చూశాం. కోడెల మృతికి పరోక్షంగా చంద్రబాబే కారణం. ఆయన పెట్టిన మానసిక వేధింపుల కారణంగానే కోడెల మరణించారు. ఉరేసుకున్నారని, గుండెపోటు వచ్చిందని అయన మరణంపై టీడీపీ నేతలే అనేక వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్షన్ను ప్రోత్సహించిన తొలి వ్యక్తి చంద్రబాబు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఫ్యాక్షన్ విపరీతంగా పెరిగింది. ఎన్నో హత్యలు చేయించారు. చెరుకుపాటి నారాయణరావును హత్య చేసింది టీడీపీ కాదా?. కోడెల మరణం పట్ల వైఎస్సార్సీపీ తరఫున ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. చదవండి: శివరామే తండ్రిని హత్య చేశాడని ఫిర్యాదు కోడెల మృతితో షాక్కు గురయ్యాను... కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు! కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి కోడెల మృతిపై కేసు నమోదు కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
శవరాజకీయాలు చేయటం బాబుకు అలవాటు
-
కోడెల ఆత్మహత్య
-
అన్నీ అనుమానాలే!
-
ఆది నుంచి వివాదాలే!
సాక్షి, గుంటూరు: టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంటలో 1947 మే 2వ తేదీన సంజీవయ్య, లక్మీనర్సమ్మ దంపతులకు జన్మించారు. కోడెల భార్య శశికళ గృహిణి. వీరికి విజయలక్ష్మి, శివరామకృష్ణ, సత్యన్నారాయణ సంతానం. కోడెల తోబుట్టువులు చిన్నతనంలోనే అనారోగ్యంతో చనిపోవడం డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసింది. కోడెల ప్రముఖ వైద్యుడిగా నరసరావుపేట ప్రాంతంలో పేరుపొందారు. 1983లో ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఐదుసార్లు నరసరావుపేట ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన రాజకీయ ప్రస్థానం ఆది నుంచి వివాదాలతోనే సాగింది.1999 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నరసరావుపేటలోని కోడెల నివాసంలో బాంబులు పేలి నలుగురు మృత్యువాత పడటం తీవ్ర సంచలనం సృష్టించింది. కోడెల హోంమంత్రిగా ఉన్న సమయంలోనే విజయవాడలో వంగవీటి మోహనరంగా దారుణ హత్య జరిగింది. ఈ కారణంగా ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. స్థానికంగా ఆదరణ, పట్టు కోల్పోవడం, రెండు సార్లు ఓటమి పాలవడంతో 2014ఎన్నికల్లో కోడెల సత్తెనపల్లి నియోజకవర్గానికి వలస వెళ్లారు. అక్కడి నుంచి గెలుపొంది ఏపీ తొలి శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి మరోసారి పోటీ చేసి ఓడిపోయారు. -
కోడెల మృతిపై బాబు రాజకీయం!
సాక్షి, అమరావతి: ‘కే ట్యాక్స్’పై సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో బాధితుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు రావడం, అసెంబ్లీ నుంచి ఫర్నిచర్ తరలించిన విషయాన్ని స్వయంగా కోడెల అంగీకరించడం, ఇతర అవినీతి వ్యవహారాలన్నీ నిజమేనని తేలడంతో ఇన్నాళ్లూ నోరు మెదపని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పుడు రాజకీయ వేధింపుల వల్లే కోడెల మృతి చెందినట్లు ఆరోపణలకు దిగటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మూడు నెలలుగా కోడెల అవినీతి వ్యవహారాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా చంద్రబాబు, టీడీపీ నేతలు ఏరోజూ స్పందించే ప్రయత్నం చేయలేదు. కానీ కోడెల మృతి చెందగానే వెంటనే రంగంలోకి దిగి రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు చేయడంపై అంతా విస్తుపోతున్నారు. గుండెపోటుకు గురైనా పరామర్శించని వైనం.. వాస్తవానికి కోడెలను కానీ ఆయన కుమారుడుని కానీ ఇంతవరకు అరెస్టు చేయలేదు. ఇన్ని కేసులున్నా కనీసం విచారణకు సైతం పోలీసులు పిలవలేదు. సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులే కోడెల ట్యాక్స్పై కేసులు పెట్టడం, అసెంబ్లీ ఫర్నిచర్ తరలింపుతోపాటు కోడెల కుమారుడు, కుమార్తె స్కాములు భారీగా బయటపడ్డాయి. ఇవన్నీ నిజమేనని తెలియడంతో చంద్రబాబు ఇన్నాళ్లూ నోరు మెదపకుండా మిన్నకుండిపోయారు. నెల రోజుల క్రితం కోడెల గుండెపోటుకు గురైనా చంద్రబాబు కనీసం పరామర్శించలేదు. కోడెలతో ఫోన్లో మాట్లాడేందుకు సైతం ఇష్టపడలేదు. సత్తెనపల్లి నియోజకవర్గానికి టీడీపీ కొత్త ఇన్చార్జిని నియమించేందుకు కూడా కసరత్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కోడెల అనుమానాస్పద రీతిలో మృతి చెందడంతో చంద్రబాబు రూటు మార్చేశారు. వేధింపులంటూ చనిపోయాక రాజకీయాలు కోడెల అవినీతి నిజమేనని స్పష్టమవడంతో ఆయన్ను పక్కన పెట్టిన చంద్రబాబు చనిపోయాక రాజకీయాలు చేయడం చర్చనీయాంశమైంది. కోడెల కుటుంబం అరాచకాలకు సంబంధించి బాధితుల ఫిర్యాదుల ఆధారంగా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయడమే తప్ప ఇంతవరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అసెంబ్లీ ఫర్నిచర్ తరలింపు వ్యవహారంలో హైకోర్టులోనే వాస్తవాలు బహిర్గతమవగా కోడెల స్వయంగా తాను వాటిని ఇంటికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు ఎవరూ కోడెలకు మద్దతుగా మాట్లాడే సాహసం చేయలేదు. కానీ ఆయన మృతి చెందిన తర్వాత ఉన్నట్టుండి రాజకీయ వేధింపులని గగ్గోలు పెడుతుండడం గమనార్హం. నిజంగా కోడెలపై రాజకీయ వేధింపులుంటే ఈపాటికి చంద్రబాబు చేసే రచ్చను ఊహించలేమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకునే చంద్రబాబు ఇటీవల గుంటూరు జిల్లా ఆత్మకూరులో ఒక కుటుంబం మధ్య జరిగిన గొడవపై జాతీయ స్థాయిలో హడావుడి చేసిన విషయం తెలిసిందే. అలాంటి చంద్రబాబు కోడెల ఉదంతంలో ఇన్నాళ్లూ గప్చుప్గా ఉండడానికి ఆయన అవినీతి నిజమేనని తేలడమే కారణం. మృతిపై పలు అనుమానాలు.. కోడెల కుటుంబంలో కలహాలు కూడా చంద్రబాబు దృష్టికి ఎప్పుడో వెళ్లాయి. ఆయన కుమారుడు, కుమార్తె అవినీతి వ్యవహారాలపై చంద్రబాబుకు అధికారంలో ఉన్నప్పుడే చాలామంది ఫిర్యాదులు చేశారు. కోడెల కుమారుడి వ్యవహార శైలి బాగోలేదని స్వయంగా చంద్రబాబు పలుసార్లు అంతర్గత సమావేశాల్లో హెచ్చరించారు. ఇప్పుడు కోడెల మృతికి ఆయన కుమారుడే కారణమని ఆయన మేనల్లుడు సాయి అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మృతి చెందిన తర్వాత కోడెలను బసవతారకం ఆస్పత్రికి తరలించడంపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలన్నింటినీ కప్పిపుచ్చి రాజకీయంగా లబ్ధి పొందేందుకు చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. కోడెల అవినీతి వ్యవహారాలు, ఆయన కుటుంబ సభ్యులు చేసిన అరాచకాలపై మాట్లాడలేక చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాన్ని ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. సంబంధిత వార్తలు... మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య ఆది నుంచి వివాదాలే! కోడెల మృతిని రాజకీయం చేయవద్దు కొడుకే వేధించాడు: కోడెల బంధువు -
కొడుకే వేధించాడు: కోడెల బంధువు
సత్తెనపల్లి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్య చేసుకున్నాడని టీడీపీ నేతలు చెబుతున్న తరుణంలో ఆయన కుమారుడు కోడెల శివరామే తీవ్రంగా వేధించాడని మృతుని సమీప బంధువు కంచేటి సాయిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కోడెల శివరామ్ నన్ను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.. ఆస్తులను తన పేరిట మార్చకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడు. నాకు నా కొడుకు నుంచే నాకు ప్రాణహాని ఉంది’ అని గత నెలలో శివప్రసాదరావు తనతో ఫోన్లో పలుమార్లు ఆందోన వ్యక్తం చేశారని వెల్లడించారు. ఈ విషయం తనతో వ్యక్తిగతంగా కూడా చెప్పారన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన గుంటూరు జిల్లా సత్తెనపల్లి డీఎస్పీ రామిరెడ్డి విజయభాస్కరరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. కోడెల మృతిని టీడీపీ నేతలు రాజకీయం చేస్తూ.. వైఎస్సార్సీపీపై బురద చల్లుతున్న నేపథ్యంలో సాయిబాబు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను గుంటూరు జిల్లా క్రోసూరు మండలం పీసపాడు గ్రామానికి చెందిన వాడినని, వ్యాపార రీత్యా గుంటూరులో నివసిస్తున్నానని తెలిపారు. సోమవారం హైదరాబాద్లో మరణించిన కోడెల శివప్రసాదరావు తనకు మేనమామ కుమారుడన్నారు. ఆగస్టు నెలలో శివప్రసాదరాడు సెల్ నంబర్ 9848005923 నుంచి తన నంబర్ 6305322989కు పలుమార్లు ఫోన్లు చేసి కుమారుడు కోడెల శివరామ్ తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని చెప్పాడన్నారు. కోడెల మృతికి ఆయన కుమారుడే కారణమంటూ.. పోలీసులకు కోడెల బంధువు కంచేటి సాయిబాబు ఇచ్చిన ఫిర్యాదు కుమారుడి బారి నుంచి కాపాడాలని కోరారు ఆస్తులను తన పేరిట మార్చకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడని శివప్రసాదరావు తనతో ఆవేదన పంచుకున్నాడని సాయిబాబు చెప్పారు. తనతో నాలుగు సార్లు వ్యక్తిగతంగా కూడా కోడెల అదే విషయం చెప్పారని వివరించారు. తన కుమారుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని, అతని బారి నుంచి తనను కాపాడాలని కోరారన్నారు. దీంతో తాను శివరామ్కు పలుమార్లు ఫోన్ చేసి శివప్రసాదరావును ఇబ్బంది పెట్టవద్దని హెచ్చరించానన్నారు. శివరామ్ను కలిసి మాట్లాడదామని ప్రయత్నిస్తే.. అతను కుదరదని చెప్పాడన్నారు. ఇప్పుడు కోడెల మృతి విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. ఆయనకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కోడెల మృతిపై తనకు అనుమానం ఉందన్నారు. అతని కుమారుడే చంపి లేదా చంపించి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి యత్నిస్తున్నాడని చెప్పారు. ఈ విషయమై పూర్తి స్థాయి విచారణ జరిపించి, ఆయన మరణానికి కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత వార్తలు... మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య కోడెల మృతిపై బాబు రాజకీయం! ఆది నుంచి వివాదాలే! కోడెల మృతిని రాజకీయం చేయవద్దు -
మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు(72) సోమవారం హైదరాబాద్లో అనుమానాస్పదరీతిలో మృతి చెందారు. బంజారాహిల్స్ రోడ్ నెం.7లో తాను అద్దెకు ఉంటున్న ఇంట్లోనే కోడెల శవమై కనిపించారు. ఆయన ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతుండగా హైదరాబాద్ పోలీసులు మాత్రం దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావ్ నేతృత్వంలోని బృందాలు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ప్రకటించారు. అలసటగా ఉందంటూ గడియ పెట్టుకుని.. జూబ్లీహిల్స్లోని ఓ మాజీ ఐఏఎస్ అధికారి ఇంట్లో అద్దెకు ఉండే కోడెల శివప్రసాదరావు కొన్నాళ్ల క్రితమే రోడ్ నెం.7లోని నివాసానికి మారారు. ఇరాన్ కాన్సులేట్ సమీపంలోని మాజీ మంత్రి దేవేందర్గౌడ్ ఇంటి పక్కన ఆయన బంధువుకు చెందిన డూప్లెక్స్ ఇంట్లో ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం గుండెపోటుకు గురైన శివప్రసాదరావు వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవలే బంజారాహిల్స్లోని అద్దె ఇంటికి మారారు. సోమవారం ఉదయం నిద్ర లేచిన అనంతరం దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. ఉదయం 10 గంటల సమయంలో భార్య శశికళ, కుమార్తె విజయలక్ష్మితో కలసి అల్పాహారం తీసుకున్నారు. అనంతరం అలసటగా ఉందంటూ మొదటి అంతస్తులో ఉన్న పడక గదిలోకి వెళ్లి లోపల నుంచి తలుపు గడియ పెట్టుకున్నారు. 108 సిబ్బంది వివరాలు కోరటంతో ఫోన్ కట్ చేసి... తన తల్లిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు సిద్ధమైన విజయలక్ష్మి ఆ విషయం చెప్పేందుకు మొదటి అంతస్తులోని కోడెల గది వద్దకు ఉదయం 10.20 గంటల సమయంలో వెళ్లారు. ఎంతసేపటికీ స్పందన లేకపోవడంతో పక్కనే ఉన్న కిటికీ నుంచి చూశారు. తన తండ్రి ఫ్యాన్కు ఉరివేసుకున్న స్థితిలో కనిపించడంతో గేటు వద్ద ఉన్న గన్మెన్ ఆదాం, డ్రైవర్ ప్రసాద్లను పిలిచారు. అదే సమయంలో అక్కడ ఉన్న మరో ముగ్గురు కూడా వారితో పాటు మొదటి అంతస్తులోకి వెళ్లారు. వరండా ద్వారా గది వెనుక వైపు ఉన్న కిటికీ సమీపంలోకి చేరుకుని గ్రిల్స్ పక్కకు జరపడం ద్వారా లోపలకు ప్రవేశించి తలుపు తీశారు. డ్రైవర్ ప్రసాద్ ‘108’కు కాల్ చేయగా కొన్ని వివరాలు కోరడంతో ఫోన్ కట్ చేసి బసవతారం కేన్సర్ ఆస్పత్రికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అనంతరం తమ కారులోనే కోడెలను బసవతారకం కేన్సర్ ఆస్పత్రికి తరలించారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో పలు పరీక్షలు... అపస్మారక స్థితిలో ఉన్న కోడెలను 11.35 గంటలకు ఆస్పత్రికి తీసుకురాగా తాము పలు పరీక్షలు జరిపినట్లు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ చెప్పారు. సుమారు గంట పాటు ఆయనకు వైద్యం అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, 12.39 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని మెడికల్ బులెటెన్లో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సీఈవో డాక్టర్ ఆర్వి.ప్రభాకర్రావు తెలిపారు. కోడెల భార్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మధ్యాహ్నం 2.50 గంటలకు ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కోడెల భౌతికకాయాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు తరలించారు. కోడెల భార్య, కుమార్తె, డ్రైవర్, గన్మెన్ నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పలువురు ప్రముఖుల నివాళులు బసవతారకం ఆస్పత్రి ఎంఐసీలో ఉన్న కోడెల పార్థివదేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, బసవతారకం కేన్సర్ ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, నాగం జనార్ధన్రెడ్డి, రావుల చంద్రశేఖర్రెడ్డి, కడియం శ్రీహరి, ఆరెకపూడి గాంధీ, నిర్మాత బండ్ల గణేష్ తదితరులు కోడెల భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు. తాడుతోనా.. కేబుల్ వైరుతోనా? తన తండ్రి ధోవతిని చింపి తాడుగా చేసుకుని ఫ్యాన్కు ఉరి వేసుకున్నట్లు విజయలక్ష్మి పోలీసులకు తెలిపారు. దాదాపు నాలుగైదు ముడులతో ఉన్న తాడు అక్కడ లభించిందని, అయితే కేబుల్ వైరుతో ఉరి వేసుకున్నట్లు గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. ఘటన అనంతరం కోడెల నివాసానికి చేరుకున్న క్లూస్ టీమ్ పలు ఆధారాలు సేకరించింది. ఆయన ఉరి వేసుకున్న ఫ్యాన్ ఒంగిపోవడాన్ని గుర్తించింది. -
సీనియర్ నేత మరణించాడనే బాధ కూడ టీడీపీ నేతలకు లేదు
-
పోస్ట్మార్టం నివేదిక వస్తే నిజాలు తెలుస్తాయి: టీఎస్ రావు
-
ఇది నమ్మలేని నిజం
-
కోడెల మృతిపై బంధువుల అనుమానం
-
‘టీడీపీ నేతలవి బురద రాజకీయాలు’
సాక్షి, విజయవాడ : ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి విషయంలో ప్రభుత్వంపై టీడీపీ నేతలు విమర్శలను ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రంగా ఖండించారు. విజయవాడలో సోమవారం జరిగిన విలేకరు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నేతలు సిగ్గులేకుండా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, బుద్ది లేకుండా ప్రభుత్వ హత్య అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కోడెల మరణానికి ఆయన కుటుంబ సభ్యులే కారణమని ఆయన బంధువులు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. టీడీపీ నేతలవి బురద రాజకీయాలని, ప్రభుత్వం కోడెలపై ఎలాంటి తప్పుడు కేసులు పెట్టలేదని అన్నారు. స్థానిక ప్రజలే ఆయనపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారని, కోడెలను ప్రభుత్వం ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే వైఎస్సార్సీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు కూడా టీడీపీ నేతల విమర్శలను ఖండించారు. టీడీపీ నేతలు వైఎస్సార్సీపీపై బురద జల్లే కార్యక్రమాన్ని మానుకోవాలని అన్నారు. టీడీపీ సీనియర్ నేత మరణించాడనే బాధ కూడ నేతలకు లేదన్నారు. అయిన కోడెల మరణానికి కుటుంబ సభ్యలే కారణమని ఆయన మేనల్లుడు సాయి పోలీసులకు ఫిర్యాదు చేశాక కూడా ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు. టీడీపీ నేతలవి శవ రాజకీయాలని, విచారణలో అన్ని విషయాలు బయట పడతాయన్నారు. కోడెల మరణం బాధకరమని మంత్రి పేర్కొన్నారు. -
కోడెల మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తి
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు మంగళవారం నర్సరావుపేటలో జరగనున్నాయి. మరోవైపు కోడెల మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్మార్టం పూర్తియింది. ఇద్దరు ప్రొఫెసర్లు, ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్మార్టం నిర్వహించగా, ఈ ప్రక్రియను పోలీసులు వీడియో రికార్డు చేశారు. అలాగే కోడెల మృతదేహాన్ని ఫోరెన్సిక్ బృందం పరిశీలించగా, ఆయన చెవుల దగ్గర నుంచి గొంతు మీదగా ఉరి వేసుకున్నట్లు గుర్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ భవన్కు కోడెల భౌతికకాయం పోస్ట్మార్టం అనంతరం భౌతికకాయాన్ని పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు తరలించారు. టీడీపీ నేతలు ట్రస్ట్ భవన్ చేరుకుని, కోడెలకు నివాళులు అర్పిస్తున్నారు. ఇవాళ రాత్రి అక్కడే ఉంచి, రేపు (మంగళవారం) ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్లో కోడెల పార్దీవదేహంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకష్ రోడ్డు మార్గంలో బయల్దేరనున్నారు. సూర్యాపేట, విజయవాడ మీదగా మధ్యాహ్నం గుంటూరులోని టీడీపీ పార్టీ కార్యాలయంలో సందర్శకుల కోసం కొద్దిసేపు ఉంచి, అనంతరం నర్సరావుపేట తీసుకు వెళతారు. మరోవైపు కోడెల అనుమానాస్పద మృతిపై బంజారాహిల్స్ ఏపీసీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు అయింది. సిట్ బృందం కోడెల నివాసంలో తనిఖీలు నిర్వహించి, ప్రత్యక్ష సాక్షులు, సెక్యూరిటీ, డ్రైవర్ను ప్రశ్నించారు. క్లూస్ టీమ్ కూడా పలు ఆధారాలను సేకరించింది. చదవండి: శివరామే తండ్రిని హత్య చేశాడని ఫిర్యాదు కోడెల మృతితో షాక్కు గురయ్యాను... కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు! కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి కోడెల మృతిపై కేసు నమోదు కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
శివరామే తండ్రిని హత్య చేశాడని ఫిర్యాదు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై ఆయన సమీప బంధువు కంచేటి సాయి సంచలన ఆరోపణలు చేశారు. కోడెల కుమారుడు శివరామే ఆస్తికోసం ఈ హత్య చేశాడని ఆరోపించారు. ఈ మేరకు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. శివారామ్ తనను శారీరకంగా, మానసికంగా చాలాకాలం నుంచి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని శివప్రసాద్ తనతో అనేకసార్లు చెప్పినట్లు సాయి తెలిపారు. ఆయనకు ఆత్మహత్య చేసుకునే అవసరం, బాధలేదని శివరామే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు.. ‘గత ఆగస్టులో కోడెల శివప్రసాద్ నాకు పలుమార్లు ఫోన్ చేశారు. తన కమారుడైన శివరాం తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తన ఆస్తులను శివరామ్ పేరుమీదకు మార్చకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడని తన ఆవేదనను నాతో పంచుకున్నారు. శివరామ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనను కాపాడాలని నన్ను వేడుకున్నారు. తరువాత నేనే స్వయంగా శివరామ్కు ఫోన్ చేసి తండ్రిని ఇబ్బంది పెట్టవద్దని అనేక సార్లు హెచ్చరించాను. ఈరోజు ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. శివప్రసాద్ను శివరామే హత్య చేశాడు. దీనిపై విచారణ జరపాలి’ అని పేర్కొన్నారు. కాగా మాజీ స్పీకర్ కోడెల మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయి ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గుండెపోటు మృతి చెందితే.. అపోలో, కేర్ హాస్పిటల్కు తీసుకువెళ్తారు. కానీ బసవతారకం కాన్సర్ హాస్పిటల్కు ఎందుకు తీసుకెళ్లారంటూ పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పలువురు మాత్రం ఆయన ఉరేసుకుని మృతిచెందారంటూ చెబుతున్నారు. శవపరీక్షల నిమిత్తం ఆయన మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించగా.. మరిన్ని విషయాలు రిపోర్టు వచ్చిన తర్వాత తెలుస్తాయని అధికారులు తెలిపారు. చదవండి: శివరామే తండ్రిని హత్య చేశాడని ఫిర్యాదు కోడెల మృతితో షాక్కు గురయ్యాను... కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు! కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి కోడెల మృతిపై కేసు నమోదు కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు!
-
కోడెల మృతితో షాక్కు గురయ్యాను...
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి పట్ల నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రప్రజలకు, పార్టీకి ఎంతో సేవ చేసిన వ్యక్తి ఆకస్మిక మరణం తనను షాక్కు గురి చేసిందన్నారు. కోడెల మరణం పార్టీకి తీరని లోటన్న బాలకృష్ణ... కోడెలను బతికించడానికి వైద్యులు ఎంతో ప్రయత్నించారని.. కానీ ఫలితం దక్కలేదని వాపోయారు. క్యాన్సర్ చికిత్స అభివృద్ధికి కోడెల ఎంతో కృషి చేశారని బాలయ్య గుర్తు చేసుకున్నారు. పోస్ట్మార్టం నివేదిక వస్తే కోడెల మరణం వెనక ఉన్న అసలు నిజాలు తెలుస్తాయన్నారు బాలకృష్ణ. నివేదిక వస్తే నిజాలు తెలుస్తాయి: టీఎస్ రావు సోమవారం ఉదయం 11.37గంటలకు కోడెలను ఆస్పత్రికి తీసుకువచ్చారని బసవతారకం మెడికల్ డైరెక్టర్ టీఎస్ రావు తెలిపారు. అప్పటికే ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారని.. పల్స్ కూడా పడిపోయిందన్నారు. కోడెలను కాపాడేందుకు తమ వంతు ప్రయత్నం చేశామన్నారు. మధ్యాహ్నం 12.39గంటలకు కోడెల మరణించినట్లు ధృవీకరించామన్నారు. అప్పుడే ఆయన ఆత్మహత్య చేసుకున్న ఆనవాలు గుర్తించామని.. దాంతో పోస్ట్మార్టం నిమిత్తం కోడెల మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలిచామని టీఎస్ రావు పేర్కొన్నారు. చదవండి: కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు! కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి కోడెల మృతిపై కేసు నమోదు కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? -
మూడు బృందాలతో దర్యాప్తు: సీపీ అంజనీకుమార్
-
కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కోడెల మరణం బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. కోడెల మరణంపై క్షణక్షణం అనేక వార్తలు మారుతూ వస్తున్నాయని, ఆయన మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయని సందేహం వ్యక్తం చేశారు. ఈ టీవీ న్యూస్ ఛానల్లో గుండెపోటు అని వార్తలు వచ్చాయని, తరువాత అదే టీవీలో ప్రమాదకర ఇంజెక్షన్ అని వార్తలు వచ్చినట్లు పేర్కొన్నారు. మరోవైపు టీడీపీకి సంబందించిన ఛానల్స్లో మాత్రం గుండెపోటుతో చనిపోయాడని వార్తలు వచ్చాయని తెలిపారు. కోడెల మరణంపై సాక్ష్యాలు తారుమారు కాకుండా తెలంగాణ ప్రభుత్వం విచారణ జరపాలని ఆయన కోరారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. కోడెల మరణంపై అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. ‘గుండెపోటు మృతి చెందితే.. అపోలో లేదా కేర్ హాస్పిటల్కు తీసుకువెళ్తారు.. కానీ బసవతారకం కాన్సర్ హాస్పిటల్కు ఎందుకు తీసుకెళ్లారు? కోడెల మరణంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నాయకులు ప్రభుత్వ ఒత్తిడి వల్లే ఉరి వేసుకున్నారు అని అసత్య ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయ చేస్తున్నారు. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి. ఉరి వేసుకున్నారా?.. కటుంబ కలహాల వలన జరిగిందా? అనే విషయాలపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలని కోరుతున్నాము. ప్రభుత్వం కోడెల మీద ఎలాంటి కేసులు పెట్టలేదు. స్థానికంగా ఉన్న ప్రజలు, నేతలు కేసులు పెట్టారు. ఆయన వలన ఇబ్బంది పడిన వారే కేసులు పెట్టారు. మాకు శవ రాజకీయాలు చేయడం తెలియదు. టీడీపీ నేతలు కోడెల మరణాన్ని రాజకీయం చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. చదవండి: కోడెల మృతిపై కేసు నమోదు కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి
-
‘మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ‘కోడెల మెడపై గాట్టు ఉన్నాయి కాబట్టి.. ఉరేసుకున్నారని డాక్టర్ల అభిప్రాయం. అక్కడ ఇంట్లో చూసిన విషయాలను బట్టి ఆ విధంగా తెలుస్తోంది’ అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏది ఏమైనప్పటికి ఆయన ఇక లేరని ఆవేదన వ్యక్తం చేశారు. బసవతారకం ఆసుపత్రి వైద్యులు ఎంత శ్రమించినప్పటికి ఆయనను కాపాడలేకపోయారని, ఆసుపత్రిలో చేర్చిన కొద్దిసేపటికే ఆయన మరణించారని చెప్పారు. శవపరీక్షల నిమిత్తం ఆయన మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారని, మరిన్ని విషయాలు రిపోర్టు వచ్చిన తర్వాత తెలుస్తాయని అన్నారు. చదవండి: కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు! కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి కోడెల మృతిపై కేసు నమోదు కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి
-
కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి
సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్ నాయకుడు, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆకస్మిక మృతిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. కోడెల మృతిపై అనేక సందేహాలు కలుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కోడెల మృతిపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆయన కోరారు. పోలీసుల విచారణలో వాస్తవాలు నిగ్గుతేల్చాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. స్పీకర్ తమ్మినేని సీతారాం దిగ్భ్రాంతి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి పట్ల ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోడెల మృతి పట్ల స్పీకర్ తమ్మినేని సీతారాం సంతాపం వ్యక్తం చేశారు. -
కోడెల మృతి పట్ల గండికోట శ్రీకాంత్ రెడ్డి దిగ్భ్రాంతి
-
కోడెలది అనుమానాస్పద మృతి కేసుగా నమోదు
-
కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు?
-
కోడెల మృతిని రాజకీయం చేయవద్దు: గడికోట
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై ప్రభుత్వ చీఫ్విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి దురదృష్టకరమని, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోడెల మరణాన్ని రాజకీయ కోణంలో చూడోద్దన్నారు. ప్రతి అంశాన్ని టీడీపీ రాజకీయ చేయడం సరికాదని, వాస్తవాలు తెలుసుకోని మాట్లాడాలని సూచించారు. సీనియర్ నేత చనిపోయారు అనే బాధలేకుండా టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల విమర్శలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ అనంతరం వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు. కాగా కోడెల శివప్రసాదరావు ఆకస్మిక మృతి పట్ల బంజారాహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆయన మృతిపై కేసు నమోదు చేసుకుని, మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కోడెల కుటుంబసభ్యుల నుంచి స్టేట్మెంట్ పోలీసులు రికార్డు చేసినట్టు తెలుస్తోంది. చదవండి: కోడెల మృతిపై కేసు నమోదు కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
కోడెల మృతిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. కోడెలది అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశామన్నారు. అయితే కుటుంబసభ్యుల సమాచారం ప్రకారం కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారని, పోస్ట్మార్టం అనంతరం మృతికి గల కారణాలు తెలుస్తాయని ఆయన అన్నారు. కోడెల కుమార్తె ఆయన గదిలోకి వెళ్లి చూడటంతో విషయం తెలిసిందని, ఘటనా స్థలంలో ముగ్గురు ఉన్నట్లుగా తెలిసిందని డీసీపీ పేర్కొన్నారు. కోడెల మృతి బంజారాహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతోందని తెలిపారు. కోడెల మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్మార్టం నిర్వహించనున్నట్లు చెప్పారు. కాగా కోడెల మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ ఆయన నివాసంలో ఆధారాలను సేకరిస్తోంది. అలాగే కోడెల గదిలో ఎలాంటి సూసైడ్ నోటు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. మూడు బృందాలతో దర్యాప్తు: సీపీ అంజనీకుమార్ కోడెల మృతిపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. ‘అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశాం. మూడు బృందాలతో దర్యాప్తు జరుపుతున్నాం. బంజారాహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. పోస్ట్మార్టం రిపోర్టు తర్వాత శివప్రసాదరావు మృతిపై క్లారిటీ వస్తుంది. అలాగే కోడెల నివాసంలో ఆధారాల సేకరణ నిమిత్తం అక్కడకు చేరుకుని క్లూస్ టీమ్, టెక్నికల్ టీమ్లు దర్యాప్తు చేస్తున్నాయి. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల నివేదిక అనంతరం మృతిపై వివరాలు వెల్లడిస్తాం. బంజారాహిల్స్ పోలీసులు’ అని సీపీ పేర్కొన్నారు. చదవండి: కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత