kotamreddy sridhar reddy
-
కలెక్టర్ గారూ.. మీకిది తగునా!
ఈ ఫొటోలో మంత్రి నారాయణ పక్కన ఉన్నది వాకాటి విజయ్కుమార్రెడ్డి. ఆయన గతంలో ప్రైవేట్ విద్యాసంస్థకు అధిపతిగా ఉండేవారు. తర్వాత విద్యాసంస్థను వదిలేసి నారాయణకు ఆప్తుడయ్యారు. ఆ క్రమంలోనే 2024 ఎన్నికల్లో పలుచోట్ల బహిరంగ సభల్లో నారాయణతో పాల్గొన్నారు. ఫొటోలు దిగారు. ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలతో మాట్లాడి ఒకచోట సభను పెట్టించారు. ఈ క్రమంలో తనకున్న అనుభవంతో ప్రైవేటు విద్యాసంస్థల వారిని నారాయణకు ఓటు వేసేలా కృషి చేశారు. నారాయణ గెలుపు కోసం వాకాటి విజయకుమార్రెడ్డి పాంప్లెట్స్ వేయించారు. వాటిలో తన వ్యక్తిగత ఫోన్ నంబర్ను ప్రింట్ చేయించారు. ఆయన గెలుపు కోసం బహిరంగంగా పని చేశారు. నా విజయానికి నీవు సహకరిస్తే.. నీకు రెడ్క్రాస్ చైర్మన్ పదవి కట్టబెడతా.. ఇలా ముందస్తుగా అనుకున్న పథకం ప్రకారమే పదవి వాకాటి విజయకుమార్రెడ్డిని వరించిందా అంటే అవుననే విశ్లేషకులు అంటున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేయాలని ప్రత్యక్ష రాజకీయాలు చేసిన వాకాటికి కలెక్టర్ ఆనంద్ రెడ్క్రాస్ ఎన్నికల్లో సహకారమందించారనేది నగ్నసత్యం. మంత్రి నారాయణ ఒత్తిడి పెట్టినంత మాత్రాన కలెక్టర్ ఒక పార్టీకి కొమ్ము కాయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రెడ్క్రాస్ అంటే సేవ చేసే సంస్థ అని ఇందులో రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న వారు ఉండకూడదని నిబంధనల పేరిట కలెక్టర్ ఆనంద్ రెడ్క్రాస్ చైర్మన్గా ఉన్న పర్వతరెడ్డి చంద్రశేకర్రెడ్డితో పాటు మరో నలుగురు ఎంసీ మెంబర్లకు నోటీçసులు ఇచ్చారు. వారు అందుకు తగిన వివరణ కూడా ఇచ్చారు. అయినప్పటికీ సంతృప్తి చెందని కలెక్టర్ రెడ్క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డితో పాటు వైఎస్సార్సీపీకి అనుకూలురంటూ ముద్రవేసి మిగతా మేనేజింగ్ కమిటీ సభ్యులు గంధం ప్రసన్నాంజనేయులు, మలిరెడ్డి కోటారెడ్డి, నేతాజి సుబ్బారెడ్డి తదితరులను తొలగించడమే కాకుండా ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా తీసేశారు. అయితే కోర్టుకెళ్లి తిరిగి విజయాన్ని సాధించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోన్రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సోదరులు, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఇప్పటికీ రెడ్క్రాస్ సభ్యులుగా కొనసాగుతున్నప్పటికీ వారి ప్రాథమిక సభ్యత్వాన్ని కలెక్టర్ రద్దు చేయలేదు. చట్టబద్ధంగా గెలిచినా.. రెడ్క్రాస్లో ఉన్న 8వేల ఓట్లలో 6వేల ఓట్లు సాధించి రెడ్క్రాస్ చైర్మన్, ఎంసీ పదవులు దక్కించుకున్నప్పటికీ కలెక్టర్ ఆనంద్ వారిని తొలగించారు. మంత్రి అనుచరుడిగా ఉన్న వాకాటి విజయకుమార్రెడ్డిని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రెడ్క్రాస్ చైర్మన్గా ఎన్నికయ్యేందుకు సహకరించారు. మరి మంత్రి నారాయణతో ఫొటోలు దిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొని, వ్యక్తిగత నంబర్ కూడా పాంప్లెట్స్లో ఇచ్చిన వాకాటి విజయకుమార్రెడ్డి మాత్రం కలెక్టర్కు ఎలా రాజకీయేతరుడుగా కనిపించారో తెలియడం లేదు. పాలకులు వస్తుంటారు.. పోతుంటారు. అధికారులు ఎక్కడికెళ్లినా శాశ్వతం. మరి అలాంటి అధికారులు ఒత్తిడికి తలొగ్గితే ప్రజాస్వామ్యం మనుగడ సాగించడం సందేహమే. -
ఎమ్మెల్యే కోటంరెడ్డికి బిగ్ షాక్!
సాక్షి, నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. నియోజకవర్గంలో టీడీపీకి చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ క్రమంలో వారికి వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆనం విజయకుమార్ రెడ్డి.నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. నియోజకవర్గంలో టీడీపీకి చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరిపోయారు. 31వ డివిజన్కి చెందిన టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు మరో 200 మంది టీడీపీ కీలక కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ నేపథ్యంలో వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రూరల్ నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇంచార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి. ఈ సందర్బంగా విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రూరల్ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. అలాగే, పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఇదిలా ఉండగా.. ఏపీలో కూటమి సర్కార్ పాలనలో అధికార పార్టీలకు చెందిన కార్యకర్తలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయకపోవడంతో కూటమి కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు ఇవ్వడంలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు సర్కార్పై మండిపడుతున్నారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరులో పతాక స్థాయికి చేరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి అరాచకాలుకోటంరెడ్డి దురాగతాల్ని భరించలేక టీడీపీని వీడి వైయస్ఆర్సీపీలో చేరిన 200 మంది కార్యకర్తలు టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు 200 మంది కార్యకర్తలకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ… pic.twitter.com/ST1wReMtti— YSR Congress Party (@YSRCParty) January 27, 2025 -
తమ్ముడి రాజకీయ భవిష్యత్తు కోసమేనా..?
రాజకీయ ఉద్ధండులకు, వ్యూహ ప్రతివ్యూహాలకు పెట్టిన పేరు సింహపురి. అలాంటి జిల్లాలో ప్రస్తుతం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి హాట్టాపిక్గా మారారు. తాజాగా అధికార పక్షంలో ఉంటూ రాజకీయ చర్చకు, రచ్చకు తెరలేపుతున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడి ఆర్నెల్లు కాలేదు. అప్పుడే నయా పాలి‘ట్రిక్స్’తో ముందుకు ఉరుకుతున్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడిన కోటంరెడ్డి భవిష్యత్తు ప్రణాళికలకు సిద్ధమవుతున్నారని కొందరు భావిస్తుంటే.. తన సోదరుడి రాజకీయ భవిష్యత్తుకు లైన్ క్లియర్ చేస్తున్నారని మరికొందరు అంటున్నారు.సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సోదరుడు గిరిధర్రెడ్డి వచ్చే నెల నుంచి నియోజకవర్గంలో గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అధికార పార్టీలో ఉన్న గిరిధర్రెడ్డికి పార్టీ పరంగా ఎలాంటి పదవులు దక్కలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆర్నెల్లు కూడా గడవలేదు. ఎన్నికలకు ఎంతో గడువున్నా, అప్పుడే ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమానికి గిరిధర్రెడ్డి శ్రీకారం చుట్టడం వెను క రాజకీయ వ్యూహంతో పాటు సంకేతాలూ ఉన్నా యనే అంశం తెలుస్తోంది. అధికార పార్టీ అను మతి లేకుండానే గిరిధర్రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించే యత్నంలో గల ఆంతర్య మేమిటనే ఆసక్తికర చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. తమ్ముడి రాజకీయ భవిష్యత్తు కోసమేనా..? ఇప్పటి వరకు ఎమ్మెల్యే కార్యాలయ ఇన్చార్జిగా తెరవెనుక రాజకీయ వ్యవహారాలు నడిపిన గిరిధర్రెడ్డి ఇక తెరపైకి రావడం వెనుక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి రాజకీయ వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది. ‘గడప గడపకు గిరిధర్రెడ్డి’ కార్యక్రమాన్ని డిసెంబర్ 4 నుంచి నిర్వహించేందుకు కోటంరెడ్డే రూపకల్పన చేశారని తెలుస్తోంది. టీడీపీలో కార్యకర్తగా ఉన్న గిరిధర్రెడ్డి ఆ పార్టీ అధిష్టాన అనుమతి లేకుండానే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. రాజకీయంగా ఎలాంటి హోదా లేకుండానే ఆయన ప్రజల్లోకి ఎలా వెళ్తారనే ప్రశ్న ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటి వరకు తన సోదరుడితో కలిసి గిరిధర్రెడ్డి అధికార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎమ్మెల్యే హోదాను అనధికారికంగా అనుభవిస్తున్నారు. ఎమ్మెల్యే తరహాలో అధికార కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం, సమీక్షలు నిర్వహించడం, మంత్రులు నిర్వహించే సమీక్షల్లోనూ పాల్గొంటున్నారు. జమిలి ఎన్నికల ప్రచార నేపథ్యంలో..ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తన సోదరుడ్ని ప్రజల్లోకి తీసుకెళ్లడాన్ని బట్టి జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనే సంకేతాలున్నాయని ఆయన అభిమానులు భావిస్తున్నారు. 2026లో నియోజకవర్గాల పునరి్వభజన ఉంటుందని, మరుసటి ఏడాదిలోనే జమిలి ఎన్నికలు జరుగుతాయనే ప్రచార నేపథ్యంలో ఇప్పటి నుంచే తానే ఎమ్మెల్యే అభ్యర్థనని చెప్పుకొనేందుకు గిరిధర్రెడ్డి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారని తెలుస్తోంది.మంత్రి పదవి దక్కలేదనేనా..? రాజకీయ నాయకులు ఎన్నికలకు ఏడాది ముందు నుంచి హడావుడి చేయడం సహజం. అయితే ఎన్నికలు పూర్తయి ఆర్నెల్లు గడవకముందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సరికొత్త రాజకీయ వ్యూహా నికి తెరతీశారు. వైఎస్సార్సీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అది దక్కకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. టీడీపీలో చేరితే అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి ఇస్తామనే హామీతో ఎన్నికలకు ఏడాదిన్నర క్రితం ఆ పారీ్టలో చేరి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే కోటంరెడ్డికి తన చిరకాల వాంఛగా ఉన్న మంత్రి పదవి కోసం లోకేశ్ కోటరీ ద్వారా ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. తనను నమ్మించి వంచించారనే మనస్తాపంతో ఉన్న ఎమ్మెల్యే వైరాగ్యంలో కూరుకుపోయారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులతో సాన్నిహిత్యంగా ఉన్నా, ప్రస్తుతం వారితో పొసగడం లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఆయువుపట్టుగా ఉన్న నగర కార్పొరేషన్లో మంత్రి నారాయణ పెత్తనంతో కోటంరెడ్డికి ప్రాధాన్యం తగ్గింది. ఈ పరిణామాలూ ఆయనకు రుచించడం లేదు. వైఎస్సార్సీపీలో ఉన్న స్వేచ్ఛా వాతావరణం టీడీపీలో లేకపోవడంతో ఆయన మానసిక సంఘర్షణకు గురవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. భవిష్యత్తులో చేపట్టే మంత్రివర్గ విస్తరణలోనైనా అవకాశం లభిస్తుందనే యత్నంలో భాగంగానే తన సోదరుడితో నయా పాలి‘ట్రిక్స్’ సాగిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అది సాధ్యం కానప్పుడు తన సోదరుడి రాజకీయ భవిష్యత్తుకు మార్గాన్ని సుగమం చేసేందుకు.. ప్రజల్లో పరపతిని పెంచే యత్నం కావొచ్చని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. అధిష్టానం అనుమతి లేకున్నా.. కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కుదురుకోలేదు. ఎన్నికల హామీలను నెరవేర్చలేక ప్రజాగ్రహానికి గురవుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి తన సోదరుడ్ని ప్రజల్లోకి పంపే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతినిధిగా వ్యవహరిస్తున్న గిరిధర్రెడ్డి ఈ సమయంలో ప్రజల్లోకి వెళ్తే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వారి నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ పరిణామాలు రాష్ట్రం మొత్తంలో చర్చకు దారి తీసే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే కూటమి ప్రభుత్వానికి గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఈ పరిస్థితుల్లో గిరిధర్రెడ్డి కార్యక్రమానికి అనుమతి ఇచ్చే సాహసాన్ని పార్టీ అధిష్టానం చేయకపోవచ్చు. పార్టీ అనుమతి చ్చినా.. ఇవ్వకపోయినా.. గిరిధర్రెడ్డి ఈ కార్యక్రమానికి సిద్ధమైతే పరిస్థితులు, పరిణామాలు ఒక్కసారిగా మారే అవకాశం ఉంది. -
సీఐ బెదిరిస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
-
టీడీపీలో అంతర్గత ఆధిపత్యం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు టీడీపీలో అంతర్గత ఆధిపత్యం ఆరంభమైంది. పార్టీలో ఏ హోదా లేకపోయినా.. పార్టీ అంటే తాను, తానంటే పార్టీ అంటూ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తనకు తాను గొప్పగా పొగుడుకుంటే.. పార్టీలో కోటంరెడ్డి నంబర్ వన్ అయితే.. రెండో వ్యక్తి నారాయణ, పార్టీని బతికించిన మూడో వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అంటూ తన అనుచరులతో భజన కీర్తన ఉదంతం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం నెల్లూరు నగరంలోని 14వ డివిజన్ ఏసీనగర్ సెంటర్లో టీడీపీ జెండాను కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆవిష్కరించారు. సాధారణంగా పార్టీ జెండా ఆవిష్కరణను ఫ్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అయిన నారాయణతో చేయించడం గౌరవనీయం. అయితే పార్టీలో ఏ పదవి లేని కోటంరెడ్డి ఆధిపత్యం చాటుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టడంపై సర్వత్రా చర్చకు దారి తీసింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన మూడో రోజు నుంచే ఆ పార్టీ తో యుద్ధం ప్రారంభించానని, మిగతా వారంతా మూడేళ్ల తర్వాత ప్రజాక్షేత్రంలోకి వచ్చారంటూ పరోక్షంగా నారాయణపై విమర్శలు గుప్పించారు. ఈ రోజు నెల్లూరు సిటీలో పార్టీ బతికిందంటే తన వల్లేనంటూ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి చెప్పుకొచ్చారు. తన రాజకీయ భవిష్యత్ కొందరి వల్ల లేకుండా పోయిందని, తన జీవితమంతా ఒకరికి పల్లకిలు మోసే బతుకై ందంటూ వాపోయారు. ఓ వైపు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మంత్రి పొంగూరు నారాయణపై అక్కసు వెళ్లగక్కుతూనే మరో వైపు ఆయన్ను సిటీని అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడంటూ కీర్తించడం కొసమెరుపు. ఇదే సమయంలో అదే డివిజన్ ఇన్చార్జి నేత మాట్లాడుతూ నెల్లూరు నగరంలో టీడీపీ నేతలంటే నంబర్ వన్ కోటంరెడ్డి అయితే.. నారాయణ రెండో వ్యక్తిగా, వేమిరెడ్డి మూడో వ్యక్తిగా అభివర్ణించాడు. ఈ కార్యక్రమం ద్వారా తనను తాను పొగుడుకోవడం, తన అనుచరులతో కీర్తించుకోవడం కోసమే కాకుండా.. నెల్లూరు నగరంలో తన ఆధిపత్యం చాటుకునే ప్రయత్నమే అనే సందేశాన్ని పంపారని ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కోటంరెడ్డితో పాటు టీడీపీకి చెందిన డివిజన్ ఇన్చార్జిలను నారాయణ పక్కన పెట్టేశారు. వారికి ఏ విధంగా సంబంధం లేకుండానే తన సొంత యంత్రాంగంతో ఎన్నికలను నిర్వహించుకున్నారనే అక్కసును ఈ విధంగా వెలిబుచ్చుతున్నారని ఆ పార్టీ కేడర్ చెవులు కొరుక్కోవడం విశేషం. -
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి దాష్టీకాలు మొదలు
నెల్లూరు (బారకాసు): ఎన్నికలు ముగియగానే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి దాష్టీకాలు ప్రారంభమయ్యాయి. నెల్లూరు మేయర్ దంపతులను బెదిరించి రాజకీయ అరాచకానికి తెరతీశారు. గిరిజన మహిళ రిజర్వేషన్తో వైఎస్సార్సీపీ నుంచి మేయర్గా ఎన్నికైన పోట్లూరి స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్లను పార్టీ మారాలని, లేదంటే కేసుల్లో ఇరికిస్తామని బెదిరించారు. నిస్సహాయ స్థితిలో ఆ గిరిజన దంపతులు వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు, నేతలను టీడీపీలో చేరాలంటూ ఎన్నికలకు ముందు నుంచే శ్రీధర్రెడ్డి బెదిరింపులకు దిగారు.కొందరిపై రాజకీయంగానూ కేసులు పెట్టించారు. ఇప్పుడు అధికార పార్టీలో ఉండటంతో మరింతగా బెదిరింపులకు దిగుతున్నారు. రెండున్నరేళ్ల క్రితం జరిగిన నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 12వ డివిజన్ నుంచి పోట్లూరి స్రవంతి వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసి కార్పొరేటర్గా గెలుపొందారు. ఈ డివిజన్ నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉండటంతో స్రవంతి దంపతులు అప్పట్లో వైఎస్సార్సీపీలోనే ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అనుచరులుగా కొనసాగేవారు.అప్పటి మంత్రి పోలుబోయిన అనిల్కుమార్యాదవ్ సహకారంతో స్రవంతి మేయర్గా ఎన్నికయ్యారు. 9 నెలల క్రితం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ సమయంలో మేయర్ స్రవంతి దంపతులు, కొందరు కార్పొరేటర్లు ఆయన వెంట వెళ్లారు. కొద్దిరోజుల్లోనే స్రవంతి దంపతులు తిరిగి వైఎస్సార్సీపీ గూటికి చేరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి టీడీపీ టిక్కెట్పై గెలుపొందారు.జరిగిందిదీ..నెల్లూరు నగరంలో దాదాపు 70 భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండానే తనఖా చేసిన ఆస్తులను మాన్యువల్గా కమిషనర్ ఫోర్జరీ సంతకాలతో రిలీజ్ ఆర్డర్లు ఇచ్చారని, దీనివల్ల ప్రభుత్వానికి రూ.కోట్లు నష్టం వచ్చిందంటూ ఓ న్యాయవాది నగర పాలక సంస్థ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో మేయర్ భర్త జయవర్ధన్ పాత్ర ప్రధానంగా ఉన్నట్లు ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారంపై కమిషనర్ విచారణకు ఆదేశించారు.గతంలో తన వెంట ఉండి, వైఎస్సార్సీపీలోనే కొనసాగుతున్న మేయర్ దంపతులను తన దారికి తెచ్చుకునేందుకు, వారిపై పెత్తనం సాగించేందుకు ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి ఈ ‘ఫోర్జరీ’ ఫిర్యాదును ఆయుధంగా ఉపయోగించుకున్నారు. టీడీపీలో చేరితే కేసులు ఉండవని, లేదంటే జైలుకు పంపిస్తామని బెదిరించారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో భయపడిన ఆ గిరిజన దంపతులు నిస్సహాయ స్థితిలో వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. -
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై ప్రొ.వసుంధర సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: జమీన్ రైతు పత్రిక ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్పై కోటంరెడ్డి దాడి చేసిన ఘటనకు తాను ప్రత్యక్ష సాక్షినని ప్రొఫెసర్ వసుంధర అన్నారు. డోలేంద్రపై దాడి చేసిన అనంతరం తనను, మరో మహిళను కోటంరెడ్డి కారులో ఎత్తుకెళ్లాడని తెలిపారు.సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, మోసానికి, కపటానికి ప్యాంటు, షర్టు వేసి చేతిలో బీరు బాటిల్ పెడితే అతడే కోటంరెడ్డి అని.. కోటంరెడ్డి పైకి మాత్రం వేదాలు వల్లిస్తాడంటూ మండిపడ్డారు.‘‘కోటంరెడ్డి సోదరులు నియోజకవర్గంలో అనేక దందాలకు, అరాచకాలకు పాల్పడ్డారు. ఎంపీడీఓ సరళపై దాడికి పాల్పడి, ఆ దాడి నేనే చేయించానని కోటంరెడ్డి ఫోన్ చేసి మరీ ఆమెకు చెప్పారు. తిరుమల నాయుడు సహా అనేక మందిపై దాడులు జరిపారు. కోటంరెడ్డి లాంటి నీచుడికి ఓటు వేయొద్దు’’ అని వసుంధర పేర్కొన్నారు.‘‘రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి దుకాణాల వరకూ మామూళ్లు వసూలు చేశారు. మహిళల జీవితాలను నాశనం చేశారు. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. నెల్లూరు రూరల్ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి అభివృద్ధి చేసిన ట్రాక్ రికార్డు ఉంది. నెల్లూరు రూరల్ ప్రజలంతా ఆదాలకు ఓటు వేయాలి’ అని వసుంధర విజ్ఞప్తి చేశారు. -
కోటంరెడ్డి, నారాయణ పై విజయ్ సాయి రెడ్డి ఫైర్
-
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నెల్లూరు ప్రజలు భారీ షాక్
-
అధికారంలోకి వస్తే మేమేంటో చూపిస్తాం
నెల్లూరు సిటీ: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమను ఇబ్బంది పెట్టిన పోలీసు అధికారులకు తామేంటో చూపిస్తామంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పోలీసులను బెదిరించారు. నగరంలోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం నారాయణ గ్రూప్ జనరల్ మేనేజర్ విజయభాస్కర్రెడ్డి, టీడీపీ నాయకులతో కలిసి ఆయన విలేక రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ నారాయణను, టీడీపీ సానుభూతిపరులను పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ముఖ్యంగా ఇంటిలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా రని ఆరోపించారు. తమను ఇబ్బంది పెట్టిన ఎవరినీ వదిలేది లేదన్నారు. వారి జాతకాలు బయటపెడతానని హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. -
నలుగురికీ చివరి అవకాశం ఈసారి విచారణకు రాకపోతే
-
టీడీపీలో అయోమయంగా ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి
-
కోటంరెడ్డి బండారం బయటపెట్టిన ఆనం విజయకుమార్ రెడ్డి
-
బ్రాహ్మణి, కోటంరెడ్డిపై అనిల్ కుమార్ పంచులు
-
స్పీకర్ పై దౌర్జన్యం కోటంరెడ్డి సస్పెండ్
-
ప్చ్.. నెల్లూరు టీడీపీ సీనియర్ల దుస్థితి ఇది
జిల్లాలో నారా లోకేశ్ నిర్వహించిన యువగళం పాదయాత్ర టీడీపీలో చిచ్చురేపింది. ఇప్పటికే పార్టీ పరిస్థితి దిగజారుతున్న క్రమంలో పాదయాత్ర జోష్ నింపుతుందని ఆశించిన ఆ పార్టీ శ్రేణులకు నిరుత్సాహమే మిగిలింది. పాదయాత్రలో వలస నేతలకు రెడ్కార్పెట్ వేసిన చినబాబు కష్టకాలంలో పార్టీ వెన్నంటి ఉండి జెండా మోసిన సీనియర్ నేతలు అవమానపడేలా చేయడంతో వారు అంటీముట్టనట్లు వ్యవహరించారు. పాదయాత్రకు ప్రజల్లో కూడా సృందన కరువై ఫ్లాప్షోగా మారింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర గత నెల 13వ తేదీన జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు నెల రోజులకు పైగా చినబాబు పాదయాత్ర చేపట్టారు. నిత్యం పసలేని ఆరోపణలు, తడబడిన ఉచ్ఛారణ వెరసి ప్రజల్లో మరింత చులకన అయ్యాడు. ప్రజల్లో కూడా స్పందన లేకపోవడంతో కొన్ని నియోజకవర్గాల్లో ఫ్లాప్షోగా మారింది. ఓ వైపు టీడీపీ నేతలు సభలను విజయవంతం చేసేందుకు జన సమీకరణ కోసం కోట్లాది రూపాయలు వెదజల్లినా ఆశించిన ఫలితాలు కన్పించలేదు. ఒకే ఫార్ములా.. ఇటీవల కాలంలో టీడీపీ నేతలు నిర్వహించే సభల్లో ఒకే ఫార్ములా పాటిస్తున్నారు. టీడీపీ సభలకు జనస్పందన లేకపోవడంతో జనం ఎక్కువగా కన్పించేందుకు వారు ఇరుకు రోడ్లపై సభలు నిర్వహిస్తున్నారు. సహజంగా సభ జరిగే ప్రాంతం వై జంక్షన్లో రెండువైపులా కన్పించేలా వాహనం ఉంచి ప్రసంగాలు చేస్తారు. కానీ టీడీపీ సభలు జరిగే ప్రదేశం జంక్షన్ ఉన్న ప్రాంతాన్ని కాదని ఇరుకురోడ్లపై ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 40 అడుగుల రోడ్డులో రహదారికి ఇరువైపులా పది అడుగులు కుదించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. రెండువైపులా ఇరవై అడుగులు కుదించడంతో ఇరవై అడుగులు మాత్రమే ఉండేలా చేస్తున్నారు. అక్కడ వెయ్యి మంది జనం పోగైతే చాలు వేలాది మంది ఉన్నట్లుగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రోన్ కెమెరాతో షూట్ చేసి వేలాది మంది ఉన్నట్లు భ్రమలు కల్పించే ఫార్ములాను అమలు చేస్తున్నారు. గతంలో కందుకూరులో చంద్రబాబు సభ ఇదే రీతిలో చేపట్టడంతో అక్కడ జరిగిన తొక్కిసలాటలో 10 మందికి పైగా మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఇదే ఫార్ములా యువగళంలో కూడా అమలు చేసి సభలు నిర్వహించారు. సీనియర్ నేతలకు అవమానాలు లోకేశ్ పాదయాత్రలో టీడీపీ సీనియర్ నేతలకు ఘోర అవమానాలు ఎదురయ్యాయి. ఆత్మకూరులో నాలుగేళ్లపాటు పార్టీ ఇన్చార్జిని కూడా నియమించని దుస్థితి ఉంది. ఈ క్రమంలో ఆత్మకూరుకు వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి(వెంకటగిరి) కోసం పాకులాడాల్సి వచ్చింది. పార్టీ సీనియర్ నేతలంతా ఆత్మకూరులో యువగళం వ్యవహారాలు చూడాలని ఆనంను కోరడంతో ఆయన కొన్ని డిమాండ్లు విధించారు. పాదయాత్ర జరిగే సమయంలో టీడీపీ సీనియర్నేత గూటూరు కన్నబాబు కన్పించకూడదని తెగేసి చెప్పడంతో ఆనం కోసం కన్నబాబును దూరంగా పెట్టాల్సి వచ్చింది. ఆత్మకూరులో కష్టకాలంలో కూడా పార్టీని నమ్ముకుని వెన్నంటి ఉన్న కన్నబాబును ఆనం మూలాన బలిచేయాల్సి వచ్చింది. పాదయాత్ర జరిగే సమయంలో ఆయన్ను విదేశీ పర్యటన పేరుతో పంపాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు లోకేశ్ను కలిసే అవకాశం లేకుండా చేశారు. కాగా నెల్లూరురూరల్ నియోజకవర్గంలో అదే సీన్ జరిగింది. వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కోసం ఆ పార్టీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ను పక్కనపెట్టారు. గత నాలుగేళ్లలో టీడీపీ నేతలను ముప్పతిప్పలు పెట్టిన కోటంరెడ్డి కోసం అబ్దుల్ అజీజ్ను బలి చేశారు. ద్వితీయశ్రేణి నేతలు సైతం కోటంరెడ్డి రాకతో లోలోన కుమిలిపోతున్నారు. పసలేని ఆరోపణలు జిల్లాలో లోకేశ్ పాదయాత్రలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై చేసిన పసలేని అడ్డుగోలు ఆరోపణలు ఆయన్ని నవ్వులపాలు చేశాయి. అవినీతి, అక్రమాలకు పాల్పడి వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ అయిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను పక్కన పెట్టుకుని అవినీతి జరిగిందని చెప్పడంపై అందరినీ ఆశ్చర్యపరిచింది. లోకేశ్ పసలేని ఆరోపణలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సవాల్ విసిరినా టీడీపీ నేతలు మారుమాట్లాడక పోవడం గమనార్హం. ఒక్కొక్కరికీ ఒక్కో చేదు అనుభవం ► నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కూడా మాజీ మంత్రి నారాయణ కోసం కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి ఉద్వాసన పలికారు. గత నాలుగేళ్లుగా టీడీపీ నగర నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న కోటంరెడ్డిని కాదని మాజీ మంత్రికి బాధ్యతలు అప్పగించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కూడా ఈ దఫా నేను ఎమ్మెల్యే అభ్యర్థినని కోటంరెడ్డి బహిరంగంగా ప్రకటించుకోగా ఆ కలను చినబాబు కలగానే మిగిల్చాడు. ► కోవూరు నియోజకవర్గంలో సీనియర్ నేతలను సైతం టీడీపీ పెద్దలు కరివేపాకులా వాడుకుంటున్నారు. దశాబ్దాల కాలంగా ఆ పార్టీని నమ్ముకున్న పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డికి ప్రతి దఫా సీటు ఇస్తామంటూ ఆశపెడుతూ అన్యాయం చేస్తున్నారు. యువగళంలో కూడా పెళ్లకూరుకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆయన గర్రుగా ఉన్నారు. ► కావలి నియోజకవర్గంలో సీనియర్ నేతలకు చుక్కలు చూపించారు. బీద రవిచంద్ర మాలేపాటి సుబ్బానాయుడుని తెరపైకి తెచ్చి చేతిచమురు వదిలింపజేయగా, ప్రస్తుతం దగుమాటి వెంకటకృష్ణారెడ్డిని తెరపైకి తెచ్చారు. అనంతరం అందరికీ మస్కాకొట్టి బీద రవిచంద్ర యువగళంలో తన సతీమణిని రంగంలోకి దింపడంతో టికెట్ ఆశించే నేతలకు దిమ్మదిరిగి మైండ్బ్లాక్ అయిందని అందరూ చర్చించుకున్నారు. ► ఉదయగిరిలో టికెట్ నీదేనంటూ పార్టీకి ఫండ్ తీసుకుని ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ను చినబాబు ఎంకరేజ్ చేశారు. దీంతో టికెట్ ఆశించిన కాకర్ల సేవా కార్యక్రమాల పేరుతో ఉదయగిరిలో మకాం వేశారు. తీరా యువగళంలో కాకర్లను దూరం పెట్టారు. పాదయాత్రలో ఆయన నీడ కూడా పడకుండా పంపించేశారు. అలాగే పార్టీలో సీనియర్నేతగా ఉన్న కంభం విజయరామిరెడ్డికి అవమానం జరిగింది. కొండాపురంలో జరిగిన సభలో కంభంకు మైకు ఇవ్వకుండా దింపేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, దగుమాటి వెంకటకృష్ణారెడ్డిలకు మైకు ఇచ్చి మాట్లాడించిన చినబాబు కంభం విజయరామిరెడ్డికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవడం గమనార్హం. -
కోటంరెడ్డి సభను అడ్డుకునేందుకే వచ్చారు : అంబటి
-
అసెంబ్లీకి అందుకే వచ్చావా?.. కోటంరెడ్డిపై మంత్రి అంబటి ఫైర్
సాక్షి, అమరావతి: కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తీరుపై అసెంబ్లీలో మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. కోటంరెడ్డి సభను అడ్డుకునేందుకే వచ్చారంటూ దుయ్యబట్టారు. శ్రీధర్రెడ్డిపై టీడీపీకి ఇప్పుడు ప్రేమ వచ్చిందా?. కోటంరెడ్డి నమ్మకద్రోహి.. చంద్రబాబు, టీడీపీ కోసం ఆయన పని చేస్తున్నారని అంబటి నిప్పులు చెరిగారు. ‘‘శ్రీధర్రెడ్డి.. టీడీపీతో చేతులు కలిపారు. దురుద్దేశ్యంతోనే కోటంరెడ్డి ఆందోళన చేస్తున్నాడు. నైతిక విలువలేని వ్యక్తి శ్రీధర్రెడ్డి. చంద్రబాబు మెప్పుకోసం కోటంరెడ్డి మాట్లాడుతున్నాడు. నమ్మకద్రోహం చేసినవారికి పుట్టగతులు లేకుండా పోతాయి’’ అంటూ మంత్రి అంబటి నిప్పులు చెరిగారు. ఎలా ప్రస్తావించాలో తెలుసుకోవాలి: మంత్రి బుగ్గన వ్యక్తిగత అంశాలకు సభలో చోటులేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ‘‘ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే సంబంధింత మంత్రులు, అధికారులకు వినతిపత్రం ఇస్తే పరిష్కరిస్తాం. ఎక్కడ ఏ వేదిక మీద ఎలా ప్రస్తావించాలో తెలుసుకోవాలి’’ అంటూ మంత్రి బుగ్గన హితవు పలికారు. -
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నాటి నేరాలే.. నేటి కేసులు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు కొత్త డ్రామాకు తెర లేపాడు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం తన అనుచరగణంతో అరాచకాలకు పాల్పడ్డాడు. లెక్కకు మించి నేరాలు చేశాడు. అతనిపై కేసులు పెట్టేందుకు బాధితులు సాహసం చేయలేకపోయారు. పోలీసులకు సాక్షం చెప్పేందుకు ధైర్యం చేయలేకపోయారు. నేరుగా ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఆ కమిషన్ ఆదేశాలతో పోలీసులు కేసులు నమోదు చేస్తే ప్రభుత్వం కక్ష సాధిస్తుందని ఆగమాగం చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నేరాలు చేసింది ఆయన. నెపం ప్రభుత్వంపై నెట్టేందుకు రాజకీయ రంగు పులుముతూ ఆగమాగం చేస్తున్నాడు. ఎమ్మెల్యేననే అధికారంతో తన మందీమార్బలాన్ని అడ్డం పెట్టుకుని మదమెత్తిన మత్తగజంలా అరాచకాలు సృష్టించానని ఇటీవల పచ్చమీడియాలో ఒప్పుకున్నాడు. కోటంరెడ్డి అప్పటి నేరాలపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదేశాల మేరకు కేసులు నమోదు కావడంతో ప్రభుత్వ పెద్దలు తనపై కక్ష సాధిస్తున్నారంటూ తాను నంగనాచినంటూ రాజకీయంగా లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నాడు. నేరం చేసిన వాడు ఎవరైనా చట్టానికి అతీతులు కారు. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా నిందితుడే అని పోలీసుల విచారణలో నిగ్గు తేల్చారు. దీంతో తనను అరెస్ట్ చేయడం ఖాయమని తెలిసి ముందుగానే.. అస్కార్ అవార్డు గ్రహీతల నటనకు మించి నంగి రాజకీయాలు చేస్తున్నాడు. టీడీపీకి చెందిన దళితనేతపై హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ను కూడా రాజకీయంగా వాడుకోవడంపై దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. అసలేం ఏం జరిగింది.. గతేడాది అక్టోబర్ 17న టీడీపీకి చెందిన ముస్లిం నేత అల్లాభక్షు నెల్లూరురూరల్ ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారంటూ అయన అనుచరులు ద్వారా దాడి చేయించారు. ఆ సమయంలో అతనికి అండగా ఉన్నాడన్న కారణంతో అదే పార్టీకి చెందిన దళిత నేత మాతంగి కృష్ణను టార్గెట్ చేసి అక్టోబర్ 18వ తేదీన కోటంరెడ్డి సోదరుల ప్రోత్సాహంతో దాదాపు 11 మంది ఆయన అనుచరులు దళిత నేతను కారులో ఎక్కించుకుని విచక్షణా రహితంగా దాడి చేశారు ముందురోజే అతని బైక్ను తగులబెట్టారు. ఆయా ఘటనలపై అప్పట్లో హత్యాయత్నం, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే పాత్ర ఉందని తెలియడంతో పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. ఈ లోపు నిందితులపై చర్యలు చేపట్టలేదని దళితనేత మాతంగి కృష్ణ ఎస్సీ,ఎస్టీ కమిషన్ను కలిసి ఫిర్యాదు చేయడంతో వారి ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. అందులో భాగంగానే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించేలా చేశారు. మిగిలిన నిందితులను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ముస్లింల గొంతునొక్కుతూ.. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల గొంతుకనై ప్రశ్నిస్తానంటూ చెప్పుకునే ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి రెండు రోజుల క్రితం ముస్లింలకు అన్యాయం జరిగిందంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ముస్లింలపై తన అనుచరులతో దాడులు చేయించినప్పుడు వారు గుర్తుకు రాలేదా అని మండిపడుతున్నారు. టీడీపీకి చెందిన అల్లాభక్షుపై దాడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఇద్దరు జర్నలిస్టులు, పలువురు నేతలపై దాడులు చేయించిన ఘటనలు ఉన్నాయి. ఇదేనా దళితుల ప్రేమ దళితులంటే తనకు ఎంతో ప్రేమ ఉందని సమావేశాల్లో ఊదరగొడుతున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి దళిత నేతపై పాశవికంగా దాడులు చేయించడమేనా దళిత ప్రేమంటే? అంటూ నగరంలోని దళితులు ప్రశ్నిస్తున్నారు. అధికార మదమెక్కి చేసిన అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నిస్తే వారిని టార్గెట్ చేసి దాడులు చేయించాడు. రౌడీ మూకలను ప్రోత్సహించి దాడులు చేయించేవాడు. ఏకంగా టీడీపీకి చెందిన విద్యార్థి నేతపై కూడా హత్యాయత్నం చేయించాడు. ఈ రౌడీ రాజకీయాన్ని సింహపురికి పరిచయం చేసిన ఎమ్మెల్యే దళితనేతపై దాడి కేసులో నిందితులను అరెస్ట్ చేస్తే అదేదో రాజకీయ కుట్ర అంటూ మీడియా ముందుకు రావడంపై ప్రజలు మండి పడుతున్నారు. ప్రధానంగా దళితలపై కపట ప్రేమ నటించే దానికి ఈ ఘటనే ఉదాహరణ అంటూ విమర్శిస్తున్నారు. -
కోటంరెడ్డికి ఊహించని షాక్..!
సాక్షి, నెల్లూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి మరో షాక్ తగిలింది. కోటంరెడ్డిపై టీడీపీ దళిత నేత మాతంగి కృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. శ్రీధర్రెడ్డిని పార్టీలోకి రానిచ్చే ప్రసక్తే లేదంటూ సంచలన కామెంట్స్ చేశారు. కాగా, మాతంగి కృష్ణ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. నన్ను హత్య చేయించడానికే కోటంరెడ్డి ప్రయత్నించాడు. 25 మంది అనుచరులను నాపైకి దాడికి పంపాడు. ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశాను. అసలు సూత్రధారి కోటంరెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి. కోటంరెడ్డిని పార్టీలోకి రానిచ్చే ప్రసక్తే లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే.. నెల్లూరులో నాలుగు నెలల క్రితం మాతంగి కృష్ణపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనపై వేదాయపాళెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అప్పట్లో సాక్ష్యాలు లభ్యం కాలేదు. తాజాగా పలువురు ప్రత్యక్ష సాక్షులు ముందుకొచ్చి సాక్ష్యం చెప్పడంతో గత రాత్రి తాటి వెంకటేశ్వర రావు, మన్నేపల్లి రఘు, జావెద్ అనే ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇంకా ఏడుగురు నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని, వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి తెలియజేశారు. -
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి టీడీపీలో నో చాన్స్..! అజీజ్ ప్లాన్తో ఎమ్మెల్యేకు షాక్?
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి టీడీపీలో ఎంట్రీకి దారులు మూసుకుపోతున్నాయి. ఆ పార్టీ నేతలు కోటంరెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కోటంరెడ్డి ఎపిసోడ్ ప్రారంభమైనప్పటి నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో తాను టీడీపీ తరఫున పోటీ చేస్తానని ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి తనకు తానుగా బహిరంగంగా ప్రకటించుకున్నారు. అయితే ఇప్పటికే టీడీపీ నెల్లూరు రూరల్ ఇన్చార్జిగా ఉన్న అబ్దుల్ అజీజ్ శ్రీధర్రెడ్డికి వ్యతిరేకంగా శ్రేణులను కూడగడుతున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటానని ఊహల్లో తేలియాడిపోతున్న అజీజ్కు కోటంరెడ్డి ఎపిసోడ్తో గొంతులో వెలక్కాయ పడినట్లు అయింది. వైఎస్సార్సీపీలో రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికై చక్రం తిప్పిన కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తన రాజకీయాలతో గ్రాఫ్ కోల్పోయాడు. ఈ దఫా టికెట్ వచ్చే అవకాశాలు లేవని ముందుగానే పసిగట్టిన ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో రహస్యంగా టచ్లోకి వెళ్లి టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నాడని సమాచారం. అధికార పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడానికి అంతా సిద్ధం చేసుకున్నాక.. ఫోన్ ట్యాంపింగ్ హైడ్రామాతో రాజకీయ అలజడి సృష్టించారు. రానున్న ఎన్నికల్లో తాను టీడీపీ అభ్యరి్థగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో టీడీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. టీడీపీ రూరల్ టికెట్ నాదే అనుకుంటూ ఇదే ఎమ్మెల్యే కోటంరెడ్డిపై, ప్రభుత్వం నోరుపారేసుకున్న అబ్దుల్ అజీజ్ షాక్కు గురయ్యాడు. అప్పటికప్పుడే పార్టీ పెద్దలతో కలిసి చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టాడు. చంద్రబాబు సైతం కోటంరెడ్డి రాకపై స్పష్టత ఇవ్వకపోవడంతో అజీజ్ మల్లగుల్లాలు పడుతున్నాడు. పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో పార్టీ కార్యాలయంలోనే సమావేశాలు నిర్వహించి అధిష్టానానికి అలి్టమేటం పంపిస్తున్నాడు. కోటంరెడ్డి మౌనం.. అజీజ్ అల్లరి నెల్లూరు రూరల్ టీడీపీ టికెట్ నాదేనంటూ బహిరంగంగానే ప్రకటించుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి అంతర్గత సమావేశాల్లోనూ ధీమాగా చెప్పుకుంటున్నాడు. అయితే మరో వైపు నెల్లూరు రూరల్ టీడీపీ ఇన్చార్జి, టికెట్ ఆశావహుడు అజీజ్ మాత్రం రచ్చరచ్చ చేస్తున్నాడు. కోటంరెడ్డి మాత్రం మౌనంగా తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ పోతున్నాడు. సోదరుడు గిరిధర్రెడ్డితో వ్యాపార సంబంధాలు ఉన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ద్వారా కోటంరెడ్డి టికెట్ ప్రయత్నాలు చేస్తున్నాడు. మరోవైపు అజీజ్ కూడా చంద్రబాబు, లోకేశ్లతో జిల్లా పెద్దల ద్వారా మాట్లాడించారు. రాజకీయ వ్యూహాల్లో భాగంగా టీడీపీ అధిష్టాన పెద్దలు మాత్రం పైకి కోటంరెడ్డిని పారీ్టలోకి తీసుకునే అవకాశం లేదని చెబుతున్నారు. టీడీపీ అధిష్టాన పెద్దలపై నమ్మకం లేని అజీజ్ మాత్రం కోటంరెడ్డికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులను సమీకరించి సమావేశాలు పెడుతున్నాడు. నిప్పులు చెరిగిన తమ్ముళ్లు ఆదివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో అబ్దుల్ అజీజ్ నేతృత్వంలో జరిగిన నెల్లూరు రూరల్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డిపై ఆ పార్టీ శ్రేణులు నిప్పులు చెరిగాయి. మూడేన్నర ఏళ్ల కాలంగా పార్టీ నేతలను అష్టకష్టాలు పెట్టి, దాడులతో భయభ్రాంతులకు గురి చేసిన ఎమ్మెల్యేను పార్టీ లోకి తీసుకోవద్దని ముక్తకంఠంతో తీర్మానం చేశారు. ఒకరిద్దరిని కాదు ఎంతో మంది నేతలను రౌడీమూకలతో చితక్కొట్టించిన ఎమ్మెల్యేను ఎలా తీసుకుంటారని? నేతలు, కార్యకర్తలు మండి పడ్డారు. ఓ ముస్లిం మహిళ అయితే ఏకంగా మా శవాలపై వెళ్లి పారీ్టలోకి ఆహా్వనించడంటూ నేతలపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. టీడీపీకి చెందిన ఓ మైనార్టీ నేతను కొట్టించి వేధింపులకు గురి చేసిన విషయం అందరికీ తెలుసు. అలాంటి అరాచక వాదిని పార్టీ లోకి ఎలా తీసుకువస్తారని, ఆయనతో కలిసి ఎలా నడవాలని ఆ మహిళ తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేసింది. కార్యకర్తల అభీష్టానానికి వ్యతిరేకంగా కోటంరెడ్డికి పారీ్టలో రాచబాట వేస్తామంటే చూస్తూ ఊరుకోమని, అవసరమైతే చంద్రబాబు వద్దే పంచాయితీ తేల్చుకుంటామంటూ నేతలందరూ తీర్మానించారు. ఈ పరిస్థితులు చూస్తుంటే.. కోటంరెడ్డికి టీడీపీలోకి దారేది?.. అన్నట్లుగా ఉంది. -
అది ట్యాపింగ్ కాదు.. రికార్డింగ్ వాయిస్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తన ఫోన్ను ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన స్నేహితుడు లంకా రామశివారెడ్డి కొట్టిపారేశారు. అది ఫోన్ ట్యాపింగ్ కాదని.. ఫోన్లో తాను రికార్డ్ చేసిన వాయిస్ మాత్రమేనని స్పష్టం చేశారు. రామశివారెడ్డి బుధవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. ఇంత రాద్ధాంతం చేస్తాడనుకోలేదు.. ‘నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నా స్నేహితుడే. ఒకే కాలేజీలో చదువుకున్నాం. ఆ తర్వాత ఆయన రాజకీయాలు వైపు వెళ్లగా.. నేను కాంట్రాక్టర్గా మారాను. డిసెంబర్లో నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కోటంరెడ్డి ప్రభుత్వ అధికారుల మీద, ఆయనకు కలిగిన ఇబ్బందుల మీద సుదీర్ఘంగా మాట్లాడారు. అదే రోజు సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నాకు ఫోన్ చేశాడు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశం విషయాలపై చర్చించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల విషయంలో తొందరపాటుగా మాట్లాడకుండా ఉంటే బాగుండేదని సలహా ఇచ్చాను. నియోజకవర్గ నిధులు, కాంట్రాక్టు పనులు, ఇతర పరిణామాలన్నీ సుదీర్ఘంగా చర్చించుకున్నాం. అవన్నీ కూడా నా ఫోన్లో ఆటోమేటిక్గా రికార్డయ్యాయి. నేను చెన్నై వెళ్లినప్పుడు.. కోటంరెడ్డితో ఫోన్లో మాట్లాడిన వాయిస్ రికార్డును నా స్నేహితుడికి పంపాను. అది యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప.. కావాలని చేసింది కాదు. ఆ తర్వాత అది కాస్తా వైరల్ అయ్యింది. ఇంత పెద్ద వివాదం అవుతుందని ఊహించలేదు. కోటంరెడ్డి అనవసరంగా చిన్న విషయంపై ఇంత రాద్ధాంతం చేస్తాడని అనుకోలేదు. రెండు, మూడు రోజుల్లో సమసిపోతుందనుకున్నా. అందుకే ఇంతకాలం బయటకు రాలేదు. కానీ కోటంరెడ్డి కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో నాకు కొంత ఆందోళన కలిగింది. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఇప్పుడు బయటకు వచ్చా. కోటంరెడ్డి కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసినా ఫర్వాలేదు. నాది ఆండ్రాయిడ్ ఫోన్. ప్రతి ఫోన్ కాల్ రికార్డ్ అవుతుంది. గత 5 నెలలుగా నేను వాడుతున్న ఫోన్ను చెక్ చేసుకోండి. అన్ని కాల్స్ రికార్డ్ అయిన విషయం తెలుస్తుంది. ఎవరు వచ్చినా.. నా ఫోన్ ఇస్తా.. ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి నిజాలు తెలుసుకోవచ్చు. నేను వాయిస్ రికార్డు పంపిన నా స్నేహితుడి పేరును విచారణ అధికారులకు చెబుతా. ఆయన పేరు ఇప్పుడు బహిరంగంగా చెప్పి.. ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు’ అని లంకా రామశివారెడ్డి వివరణ ఇచ్చారు. -
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి భారీ ఝలక్
సాక్షి, నెల్లూరు: రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి భారీ ఝలక్ తగిలింది. నియోజకవర్గ కార్పొరేటర్లు వైఎస్సార్సీపీ ఎంపీ, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన ఆదాల ప్రభాకర్రెడ్డికి మద్ధతు ప్రకటించారు. కార్పొరేటర్లతో పాటు ఎక్స్అఫిషియో మెంబర్లు మంగళవారం పార్టీ ఇన్ఛార్జి కార్యాలయానికి చేరుకుని.. తమ మద్ధతు అదాలకే అని పేర్కొన్నారు. అంతేకాదు మరో ఆరుగురు కార్పొరేటర్లు సైతం ఆదాల వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో.. కోటంరెడ్డి బలం ఇద్దరు కార్పొరేటర్లకు చేరుకున్నట్లయ్యింది. ఈ సందర్భంగా.. నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి నియమించటం శుభపరిణామని కార్పొరేటర్లు పేర్కొన్నారు. నెల్లూర్ రూరల్లో పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని, ఆదాల ప్రభాకర్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపిస్తామని కార్పొరేటర్లు ఈ సందర్భంగా ప్రతినబూనారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కీలక నేత ఆనం విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ రూరల్ ఇన్ఛార్జిగా నియమితులైన ఆదాలకి ఘన స్వాగతం పలికాం. తాజా పరిణామంతో.. పార్టీకి రూరల్ లో తిరుగులేని ప్రజాబలం ఉందని మరోసారి సంకేతం వచ్చింది. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి కార్యకర్తలు కష్టపడి పనిచేస్తేనే శ్రీధర్ రెడ్డి గెలిచారు. గెలిచాక కష్టపడిన వారిని పక్కన పెట్టి పక్కపార్టీ వాళ్ళకి పదవులు ఇచ్చాడు. తన దగ్గర 12 సిమ్ లు ఉన్నాయని శ్రీధర్ రెడ్డి చెబుతున్నాడు. లిక్కర్, గంజాయి మాఫియా, హత్యలు చేసేవారు, అనైతిక కార్యక్రమాలు చేసే వారికే అన్ని సిమ్ లు ఉంటాయి . ఆదాలని ఇంచార్జ్ గా ప్రకటించగానే మంచి నిర్ణయం తీసుకున్నారని రూరల్ ప్రజలు సంతోషించారు. సర్పంచ్, ఎంపీపీ, ఎంపీటీసీలు అందరూ ఆదాల కి సంఘీభావం తెలుపుతున్నారు. కోటంరెడ్డి దగ్గర ఉన్న కొంతమంది కార్పొరేటర్లు కూడా ఆదాల వైపు వచ్చేస్తారు అని విజయ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కార్పొరేటర్లకు పూర్తి స్వేచ్ఛ: ఆదాల ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ కార్పొరేటర్లకు ఇకపై పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, ఎప్పుడైనా తనను కలవొచ్చని వైఎస్సార్సీపీ రూరల్ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. కార్పొరేటర్లు మద్ధతు ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ లైన్ దాటితే ఎవరినీ ఉపేక్షించం. మేము ఎవరినీ బతిమాలాడము. రౌడీయిజం.. బెదిరింపులు కనిపించవు. మీ పరిధిలో ఉన్న, మీ సమస్యలు అన్ని పరిష్కరించుకుందాం. మీకు ఎలాంటి భయం లేదు. అభివృద్ధి కోసం సీఎం తో చర్చించి నిధులు తీసుకొస్తా అని ఆదాల, కార్పొరేటర్లకు భరోసా ఇచ్చారు. -
ఛీ..ధర్రెడ్డి దరిద్రం వదిలింది
నెల్లూరు (సెంట్రల్): నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి, రూరల్ ప్రజలకు పట్టిన ఛీ.. ధర్రెడ్డి అనే దరిద్రం వదిలిపోయిందని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. నెల్లూరులోని ఆదాల ప్రభాకర్రెడ్డి నివాసంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎమ్మెల్యేలు పి.అనిల్కుమార్, మేకపాటి విక్రమ్రెడ్డితో కలిసి ఆదాల ప్రభాకర్రెడ్డి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పెట్టిన రాజకీయ భిక్షతో గెలిచి అదే పార్టీపై నిందలు వేయడం సిగ్గు చేటుగా లేదా అన్నా రు. తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయి ఆ పార్టీ అధినేత డైరెక్షన్లో శ్రీధర్రెడ్డి మాట్లాడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఒక ఎమ్మెల్యే పోయినంత మాత్రనా రూరల్లో మేమంతా వైఎస్సార్సీపీలో, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట ఉంటామని ఈ రోజు ర్యాలీలో పాల్గొన్న ప్రజాభిమానమే నిదర్శమన్నారు. పార్టీ నుంచి దరిద్రం పోయిందనుకుంటామన్నారు. రాబోయే ఎన్నికల్లోనూ, ఆ తర్వాత వైఎస్సార్సీపీకి జిల్లా మొత్తం కంచుకోటగా ఉంటుందన్నారు. ఓటు బ్యాంకు చెదరదు పార్టీ నుంచి ఎవరు పోయినా వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకు మాత్రం చెక్కు చెదరకుండా ఉందనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని రీజనల్ కో–ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిష్మాతో గెలిచామనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. ఆదాల ప్రభాకర్రెడ్డి రూరల్లోనే కాకుండా జిల్లాలో అందరికీ సుపరిచితుడన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కూడా తన రాజకీయ భవిష్యత్ను తేల్చుకోవాలన్నారు. రౌడీయిజం చేస్తే ఉక్కుపాదంతో అణిచేస్తా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎవరైనా రౌడీయిజం చేస్తూ వ్యాపారుల వద్ద, రియల్ ఎస్టేట్ వ్యాపారు ల వద్ద డబ్బులు వసూలు చేసే పద్ధతులు మానుకోవాలని ఎంపీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆదాల ప్రభాకర్రెడ్డి హెచ్చరించారు. ఈ రోజు నుంచి ఎక్కడైనా అటువంటి ఘటనలు జరిగినట్లు తమ దృష్టికి వస్తే ఉక్కుపాదంతో అణిచేస్తానని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఆయా వ్యాపారాలు స్వేచ్ఛగా చేసుకోవచ్చని, ఎవరైనా ఇబ్బందులు పెడితే తమ దృష్టికి తీసుకుని రావాలన్నారు. వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలబడిన ప్రతి ఒక్క కార్పొరేటర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రూరల్ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, ఎక్కడైనా సమస్య ఉందంటే తమ దృష్టికి తెస్తే తక్షణమే స్పందిస్తామన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్సార్సీపీకి కంచుకోటలాగా ఉందన్నారు. ఈ ర్యాలీనే ఉదాహరణ నెల్లూరురూరల్లో వైఎస్సార్సీపీ ఎంత బలంగా ఉందో స్వాగత ర్యాలీనే ఉదాహరణ అని నగర ఎమ్మెల్యే పి అనిల్కుమార్ అన్నారు. మాజీ డీసీసీబీ చైర్మన్ ఆనం విజయకుమార్రెడ్డి మాట్లాడుతూ రూరల్లో అందరం కష్టపడ్డాం కాబట్టే ఆయన గెలిచారని, ఈ రోజు పారీ్టపై విమర్శలు చేయడం ద్రోహం అన్నారు. కార్పొరేటర్ మొయిళ్ల గౌరీ మాట్లాడుతూ వైఎస్సార్సీపీలో సైనికుల మాదిరి పని చేస్తామని, తిరిగి ఆదాలను గెలిపించుకుంటామన్నారు. బొబ్బల శ్రీనివాస్ మాట్లాడుతూ తాము ఈ రోజు నుంచి బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొందామన్నారు. రూరల్ ఎమ్మెల్యే వద్ద బానిస బతుకు బతికామన్నారు. ఆదాల ప్రభాకర్రెడ్డి వద్ద ఎంతో స్వేచ్ఛగా, హుందాగా ఉంటామన్నారు. -
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై కిడ్నాప్ యత్నం కేసు
నెల్లూరు (క్రైమ్): తనతో పాటు పార్టీ మారలేదన్న అక్కసుతో ఓ కార్పొరేటర్ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తన అనుచరులతో కలిసి కిడ్నాప్నకు యత్నించిన ఘటనపై కేసు నమోదైంది. పోలీసుల సమాచారం ప్రకారం.. శ్రీధర్రెడ్డి పడారుపల్లికి చెందిన నెల్లూరు నగరం 22వ డివిజన్ కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డికి శుక్రవారం ఫోన్ చేసి వైఎస్సార్సీపీని వీడి తనతో రావాలని కోరారు. అందుకు విజయభాస్కర్ రెడ్డి నిరాకరించడంతో.. ఎమ్మెల్యే కోటంరెడ్డి తన అనుచరుడు మిద్దె మురళీకృష్ణ యాదవ్, కారు డ్రైవర్ అంకయ్యతో కలిసి కార్పొరేటర్ ఇంటికి వెళ్లి అంతు చూస్తానంటూ బెదిరించారు. కార్పొరేటర్ను బలవంతంగా కారులో ఎక్కించేందుకు యత్నించగా ఆయన ప్రతిఘటించారు. వారినుంచి తప్పించుకుని వేదాయపాలెం పోలీసుస్టేషన్కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే, ఆయన అనుచరుడు, కారు డ్రైవర్పై కిడ్నాప్యత్నం కేసు నమోదు చేసినట్లు వేదాయపాలెం ఇన్స్పెక్టర్ కె.నరసింహారావు తెలిపారు. -
టీడీపీ పతనమైందని లోకేష్ ఒప్పుకున్నట్టేనా?
తెలుగుదేశం శాసనమండలి సభ్యుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఒక వ్యాఖ్య చేస్తూ నెల్లూరు నుంచే వైస్సార్సీపీ పతనం ప్రారంభమైందని అన్నారు. ఇది వినడానికి టీడీపీ వారికి బాగానే ఉన్నట్లు అనిపిస్తున్నా.. అదే సూత్రం ఆ పార్టీకి వర్తింపచేస్తే టీడీపీ ఇప్పటికే పతనమైపోయిందని వారే ఒప్పుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అయితే పతనం అయిపోతే టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు మూడేళ్ల క్రితమే బయటకు వచ్చేశారు కదా!. మరి ఇప్పటికే పార్టీ పతనం అయిందని అంగీకరిస్తారా?. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పటికీ వైఎస్సార్సీపీ, పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెక్కుచెదరలేదు. అదరలేదు.. బెదరలేదు. అలాంటిది ఇలాంటి ఉడత ఊపులకు ఉలిక్కిపడతారా!. నెల్లూరు రూరల్, వెంకటగిరి నియోజకవర్గాల శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలు అసమ్మతిగళం విప్పడం పార్టీకి కొద్దిగా చికాకే కావచ్చు. కానీ, పార్టీ అదినాయకత్వం వెంటనే సర్దుబాటు చర్యలు తీసుకుంది. శ్రీధర్ రెడ్డి బదులు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర రెడ్డిని, రామనారాయణరెడ్డి స్థానంలో నేదురుమల్లి రాం కుమార్ రెడ్డిని నియోజకవర్గాల బాధ్యుయులుగా ప్రకటించింది. ఆదాల ప్రభాకర రెడ్డి ఒకప్పుడు తెలుగుదేశంలోనే ఉండేవారు. మంత్రి కూడా అయ్యారు. కానీ, అప్పట్లో టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో సరిపడక కాంగ్రెస్లోకి వచ్చారు. తదుపరి సోమిరెడ్డిని శాసనసభ ఎన్నికలలో ఓడించారు. విభజన సమయంలో కొంతకాలం టీడీపీలో ఉన్నా 2019లో వైఎస్సార్సీపీలో చేరి నెల్లూరు ఎంపీగా గెలుపొందారు. ఆయన మందీ మార్బలం ఉన్న నేతగా గుర్తింపు పొందారు. నెల్లూరు రూరల్లో ఆయన రంగంలోకి దిగడం వల్ల వైఎస్సార్సీపీ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అత్యంత విధేయుడనని తనకు తానే ప్రకటించుకునేవారు. తాను చనిపోతే సీఎం జగన్ వచ్చి పార్టీ జెండా కప్పాలన్నదే తన కోరిక అన్నంతవరకు కూడా వెళ్లేవారు. ఇలాంటి మాటలను బహిరంగసభలలో పెద్ద స్వరంతో చెప్పేవారు. తాను మధ్య తరగతి కుటుంబీకుడిని అయినా సీఎం జగన్ చేరదీసి తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారని, ఆ విశ్వాసాన్ని ఎన్నటికీ మరువబోనని చెప్పేవారు. అలాంటి కోటంరెడ్డి రెండోసారి శాసనసభకు ఎన్నికయ్యాక మంత్రి పదవిపై ఆశ పుట్టింది. అందులో తప్పు లేదు. కానీ, వివిధ కారణాల రీత్యా ఆయనకు పదవి లభించలేదు. అంతమాత్రాన ఆయన ఇలా అవిధేయుడుగా మారతారని ఎవరూ ఊహించలేదు. నిజానికి శ్రీధర్ రెడ్డి అప్పడప్పుడు సంకేతాలు ఇవ్వకపోలేదు. అమరావతి రైతుల పేరుతో కొందరు చేసిన పాదయాత్రకు సంఘీభావం ప్రకటించడం, పార్టీ కార్యక్రమాలుగా కాకుండా సొంతంగా తన పేరుతోనే నియోజకవర్గంలో ప్రోగ్రాంలు పెట్టుకోవడం వంటివి చేశారు. అప్పుడప్పుడు అధికారులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు కూడా చేశారు. టీడీపీ నేతలు గతంలో కోటంరెడ్డిపై దౌర్జ్యన్యకారుడని, బెట్టింగ్ రాయుడని పలు ఆరోపణలు చేయడం, వాటిన ఆయన ఖండించడం జరిగేవి. ఒక మహిళా అధికారి పట్ల దురుసుగా వ్యవహరించిన అభియోగంపై కేసు నమోదు అయింది. ఇవన్ని ఎలా ఉన్నా ఇటీవలి కాలంలో టీడీపీ నేతలు ఆయనపై విమర్శలు చేయకుండా ఉండటం కూడా గమనించాల్సిన అంశమే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా ఆనం రామనారాయణరెడ్డిని మెచ్చుకోవడం కూడా గుర్తు చేసుకోవాలి. ఈ నేపథ్యంలో వీరిద్దరిని తమ ట్రాప్లోకి తెచ్చుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. ప్రముఖ విద్యా సంస్థల అధినేత, అమరావతి భూ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కుంటున్న నారాయణతో ఆపరేషన్ నిర్వహించారన్న సమాచారం బయటకు వస్తోంది. ఆయన వీరిద్దరిని తమ ట్రాప్లోకి తెచ్చుకోగలిగారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్తో పాటు ఆర్థికవనరులు సమకూర్చే బాధ్యత ఆయన తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా వైఎస్సార్సీపీ నాయకులు కోటంరెడ్డి విషయంలో పెద్దగా అనుమానించలేదని అనుకోవాలి. అలా భావించి ఉంటే ఇటీవలే ముఖ్యమంత్రి జగన్.. ఆయనను పిలిచి మందలించేవారు కారు. అప్పుడే కొత్త ఇన్ఛార్జీని నియమించేవారు. కోటంరెడ్డి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటూ ఆరోపణలు చేయడం సహజంగానే ప్రతిపక్షానికి ఒక అస్త్రం దొరికినట్లయింది. విశేషం ఏమిటంటే ఫోన్ ట్యాపింగ్లో ఆరితేరిన చంద్రబాబు నాయుడు దీని గురించి మాట్లాడటం. ఆయన వద్ద ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన అధికారి అప్పట్లో ఇజ్రాయిల్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేసి విపక్షంపై నిఘా పెట్టాలని ప్రయత్నించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ కేసులోనే ఆయన సస్పెండ్ కూడా అయి కేసును ఎదుర్కొంటున్నారు. కోటంరెడ్డి విషయంలో ప్రభుత్వ నిఘా విభాగం అధినేత అనవసరంగా తనకు వచ్చిన ఒక సమాచార రికార్డును శ్రీధర్ రెడ్డికి పంపినట్లు అనిపిస్తుంది. ముందస్తు జాగ్రత్తగా ఆ అధికారి చెప్పబోతే, పరిస్థితిని అర్ధం చేసుకున్న కోటంరెడ్డి అప్రమత్తమై అన్ని విషయాలు బహిర్గతం అయిపోతున్నాయని భావించి ఈ ఆరోపణ చేసినట్లుగా ఉంది. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఈయన నారా లోకేష్తో ఎప్పటి నుంచో టచ్లో ఉన్నట్లు టీడీపీ నేతలే వెల్లడించారని చెప్పారు. అలాగే, చంద్రబాబుతో కూడా అన్నీ మాట్లాడుకునే ఈ ఆరోపణలు చేశారని అంటున్నారు. లేకుంటే టీడీపీ టిక్కెట్ వచ్చేస్తుందని ఎలా చెప్పగలుగుతారు?. ఇంతవరకు వైఎస్సార్సీపీని వీడలేదు.. టీడీపీలో చేరలేదు. అయినా, నియోజకవర్గంలో టీడీపీ పెత్తనం తనదే అయినట్లుగా అంటున్నారంటే ఆ పార్టీ ఎంత బలహీనంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం. పోనీ, ఆయన అనుకున్నట్లు వస్తే సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డినో, లేక ఏ ఇతర సీనియర్ నేతనో కాదని కోటంరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకున్నారా?. దీనిని ఆయన నమ్మగలరా?. అసలు సమస్య ఏమిటంటే ఈయన ప్రవర్తన తీరుతెన్నులు, ఇతర అంశాలపై పార్టీ నాయకత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు వస్తుంటాయి. వాటి ఆధారంగా 2024 ఎన్నికలలో టిక్కెట్ రాదన్న భావన ఈయనకు వచ్చి ఉండవచ్చు. గెలిచినా, ఓడినా రాజకీయాల్లో కొనసాగాలంటే ఏదో పార్టీ నుంచి పోటీచేయాలని నేతలు అనుకుంటారు. అందువల్లే కోటంరెడ్డి తన విధేయతను అవిధేయతగా మార్చుకుని ఉండవచ్చనిపిస్తుంది. అతిగా పొగిడే వారిని అంతగా నమ్మరాదనే లోకోక్తి కూడా ఉంది. అతి వినయం ధూర్త లక్షణం అంటారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గతంలో సీఎం జగన్ను అంతగా పొగిడింది తన పదవిపైన ఆశతోనే అన్న విషయం ఇప్పుడు స్పష్టమైంది. ఇలాంటి ఫిరాయింపుదారులు చరిత్రలో ఎంతో మంది కనిపిస్తారు. వారిలో అత్యధికులు రాజకీయంగా కనుమరుగైపోయిన ఘట్టాలే ఎక్కువ. - హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. -
కోటంరెడ్డికి మాజీ మంత్రి అనిల్కుమార్ సవాల్
సాక్షి, నెల్లూరు జిల్లా: కోటంరెడ్డికి దమ్ముంటే 51 సెకన్ల ఆడియో బయట పెట్టాలని మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీలోకి వెళ్తేందుకే కోటంరెడ్డి విమర్శలు అంటూ దుయ్యబట్టారు. ‘‘కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరగలేదు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నేను నిరూపిస్తే.. నువ్వు రాజీనామా చేస్తావా?. 24 గంటల సమయం ఇస్తున్నా.. ఎప్పుడైనా రండి.. నేను రెడీ. ఆనం రామనారాయణ చచ్చిన పాము.. ఆయనకేంటి ప్రాణహాని’’ అని అంటూ అనిల్ నిప్పులు చెరిగారు. చదవండి: ఆ సందర్భాల్లో చంద్రబాబు ఇంగ్లీష్ స్పీచ్ విసుగు తెప్పించేదా? -
టీడీపీలో చేరే ఎమ్మెల్యేలు బావిలో దూకినట్టే: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, విజయవాడ: కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపణలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ అంటూ అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు కుట్రలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని, టీడీపీకి వెళ్లాలనుకుంటే వెళ్లవచ్చు.. కాని ఇలాంటి ఆరోపణలు సమంజసం కాదంటూ మంత్రి హితవు పలికారు. సీఎం జగన్ పార్టీ పెట్టకపోతే ఎమ్మెల్యేలు అయ్యేవారా?. ఇలాంటి వారికి సీఎం జగన్ భయపడేవారు కాదు. టీడీపీలో చేరే ఎమ్మెల్యేలు బావిలో దూకినట్టే. ఇలాంటి వాళ్లు వెళ్లినా వచ్చే నష్టమేమీ లేదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. చదవండి: కోటంరెడ్డి ఆరోపణలు.. పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ -
కోటంరెడ్డి ఆరోపణలు.. పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, తాడేపల్లి: కోటంరెడ్డి ఫోన్ను ఆయన మిత్రుడే రికార్డ్ చేశాడని, దానిని ట్యాపింగ్ చేశారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆరోపణలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కోటంరెడ్డిది ఫోన్ ట్యాపింగ్ కాదు.. రికార్డింగ్ అని, వీడియోతో పాటు టెక్ట్స్ మెసేజ్ కూడా ఉందన్నారు. కోటంరెడ్డి వాట్సాప్ కాల్ డేటా అంతా మీడియా ముందు పెట్టాలని పేర్ని నాని అన్నారు. ‘‘ఎమ్మెల్యేలపై నిఘా ఎందుకు ఉంటుంది?. డిసెంబర్ 25న చంద్రబాబును కోటంరెడ్డి కలిశారు. అంతకు ముందే లోకేష్తో టచ్లో ఉన్నారు. ఒక చోట పనిచేస్తూ.. పక్క చూపులు చూడటం సరికాదు. సీఎం జగన్కు కోటంరెడ్డి నమ్మక ద్రోహం చేశారు’’ అని పేర్ని నాని దుయ్యబట్టారు. చదవండి: ఆనం రామనారాయణపై నేదురుమల్లి సీరియస్ కామెంట్స్ -
కోటంరెడ్డి వ్యవహారంపై స్పందించిన సజ్జల
సాక్షి, తాడేపల్లి: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. బుధవారం వైసీపి కేంద్ర కార్యాలయంలో రాష్ట్రస్థాయి సర్పంచ్ల సమావేశంలో పాల్గొన్న ఆయన.. మీడియాతో మాట్లాడారు. కోటంరెడ్డి టీడీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని సజ్జల పేర్కొన్నారు. ‘‘కోటంరెడ్డి పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది?. ఆయనే తన ఉద్దేశాలు చెప్పిన తర్వాత చర్యలు ఏం తీసుకుంటాం?. అయినా.. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలను నమ్ముకుని పాలన చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్లను కాదు’’ అని సజ్జల స్పందించారు. ఎవరైనా ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చని.. పదవి రాలేదని అసంతృప్తి ఉండటం వేరు, బహిరంగంగా ఇటువంటి ఆరోపణలు చేయటం వేరని సజ్జల వ్యాఖ్యానించారు. అలాగే.. అక్కడి నియోజకవర్గ ఇంచార్జ్గా ఇంకా ఎవరినీ నియమించ లేదన్న సజ్జల.. కొంతమందిని ఎలా లాక్కోవాలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు తెలుసని సజ్జల వ్యాఖ్యానించారు. ప్రకాశం: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి టీడీపీ డైరెక్షన్ లో మాట్లాడుతున్నాడని మాజీమంత్రి, వైఎస్సార్పీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని వ్యాఖ్యానించారు. ‘‘ఫోన్ ట్యాపింగ్ లేదు.. పాడు లేదు.. మంత్రి పదవి ఇవ్వలేదనే అక్కసుతోనే శ్రీధర్ రెడ్డి, ఆనం డ్రామాలు ఆడుతున్నారు. దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ అయినట్టు నిరూపించాలని సవాల్ విసిరారు బాలినేని. ఫోన్ ట్యాప్ అయితే ఎమ్మెల్యే ఆనం ఇన్ని రోజులు ఎందుకు బయటపెట్టలేదని నిలదీశారు. రేపో ఎల్లుండో నెల్లూరు రూరల్ కి కొత్త ఇంచార్జి నియామకం ఉంటుందని, వాళ్లిద్దరూ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని బాలినేని మండిపడ్డారు. వైస్సార్సీపీ లో నాయకులకు కొదవలేదు.. ఒకరు పోతే పది మంది తయారవుతారని బాలినేని కామెంట్ చేశారు. -
కాలనీలపై ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి
సాక్షి, నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నానాటికీ విస్తరిస్తున్న కాలనీలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. 20వ డివిజన్లోని ఇస్కాన్ సిటీలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన సమయంలో రోడ్డు సమస్యను ఆయనకు స్థానికులు తెలియజేశారు. ఈ క్రమంలో రోడ్డు నిర్మాణానికి మేయర్ స్రవంతితో కలిసి శంకుస్థాపనను చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. శివారు ప్రాంతాల అభివృద్ధికి సహకారం అందిస్తామని చెప్పారు. ఆయా కాలనీల అభివృద్ధికి కమిటీలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి నిరంతరం పాటుపడుతున్నామని పేర్కొన్నారు. కార్పొరేటర్ మహేష్, నేతలు శ్రీనివాసరావు, మల్లికార్జున్యాదవ్, ఖాదర్బాషా, రమణయ్య, రవి, వెంకటరమణయ్య, విఠల్, డేవిడ్రాజు, కవిత, తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఎంపీడీఓల కల నెరవేరిన వేళ.. కొత్త పోస్టుల్లో చేరిక -
Rottela Panduga 2022: దారులన్నీ దర్గావైపు..!
సింహపురి దారులన్నీ బారాషహీద్ దర్గా వైపే మళ్లాయి. వరాల రొట్టెలను ఒడిసి పట్టుకునేందుకు స్వర్ణాల చెరువుకు భక్తులు పోటెత్తారు. కరోనా వైరస్ కారణంగా రెండేళ్ల విరామం తర్వాత రొట్టెల పండగ జరగడంతో దర్గా భక్తులతో కిటకిటలాడింది. మతసామరస్యానికి ప్రతీకగా జరిగే రొట్టెల పండగలో కోర్కెలు తీరిన భక్తులు రొట్టెలు వదిలేందుకు.. కొత్త కోర్కెల రొట్టెలు పట్టుకునేందుకు వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో స్వర్ణాల చెరువు, బారాషహీద్ దర్గా వద్ద సందడి నెలకొంది. సాక్షి, నెల్లూరు: కుల, మతాలకు అతీతంగా, మతసామరస్యానికి ప్రతీకగా ఏటా ప్రతిష్టాత్కకంగా జరిగే రొట్టెల పండగ భక్తుల తాకిడి తొలి రోజే ద్విగుణీకృతమైంది. మంగళవారం నుంచి ప్రారంభమైన పండగ ఐదురో జుల పాటు 13వ తేదీ వరకు జరగనుంది. రెండేళ్ల విరామం తర్వాత జరుగుతున్న పండగ కావడంతో దేశ, విదేశాల నుంచి ఈ ఏడాది భారీగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల భక్తుల తొలిరోజు భారీగా హాజరయ్యారు. వరాల రొట్టెల బోర్డులు స్వర్ణాల చెరువు ఘాట్లో భక్తుల సౌకర్యార్థ్యం వివిధ కోర్కెల రొట్టెల బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రధానంగా విద్య, ఆరోగ్యం, సౌభాగ్యం, ఉద్యోగం, వివాహం, సంతానం, ధనం రొట్టెల ఘాట్ల్లో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో భక్తులు ఏ కోర్కెతో రొట్టెను తీసుకున్నారో.. ఆ కోర్కె తీరితే తిరిగి రొట్టెను వదలాల్సి ఉంది. ఈ ఏడాది ఎక్కువ మంది భక్తులు ఆరోగ్య రొట్టెను తీసుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా ఆరోగ్య రొట్టెకు డిమాండ్ పెరిగినట్లు భక్తులు చర్చించుకుంటున్నారు. మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పరిశీలన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మంగళవారం బారాషహీద్ దర్గా ప్రాంగణాన్ని సందర్శించారు. రొట్టెల పండగకు హారయ్యే భక్తుల సౌకర్యాలు, ఏర్పాట్లు పర్యవేక్షించారు. పోలీసుశాఖ ఏర్పాటు చేసినా సీసీ కెమెరాల మానిటరింగ్ కేంద్రం నుంచి అన్నీ ప్రాంతాలను పరిశీలించారు. భక్తులు రద్దీ పెరిగితే అందుకు తగ్గట్లు సౌకర్యాలు నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. పటిష్ట ఏర్పాట్లపై కలెక్టర్ చక్రధర్బాబు, ఎస్పీ విజయారావు, నగర పాలక సంస్థ కమిషనర్ హరితను అభినందించారు. రాబోయే ఏడాదిలో శాశ్వత అభివృద్ధి పనులు పూర్తి చేసి రొట్టెల పండగ నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. భక్తుల విశ్వాసానికి తగ్గట్లుగా అభివృద్ధి చేయాలని భావిస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని అభినందించారు. ఎమ్మెల్యే చొరవతో వివిధ అభివృద్ధి పనులు నిర్వహణకు రూ.15 కోట్లకు ప్రభుత్వం అనుమతి లభించిందని మంత్రి తెలిపారు. పోటాపోటీగా వైద్యశిబిరాలు బారాషహీద్ దర్గాలో భక్తులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా ప్రాథమిక చికిత్స అందించేందుకు వైద్య శిబిరాలు వెలిశాయి. వైద్య ఆరోగ్యశాఖ నేతృత్వంలోనే కాకుండా కార్పొరేట్ ఆస్పత్రులు మెడికేర్, అపోలో, కిమ్స్, యశోద యాజమాన్యాలు రెడ్క్రాస్, ఆయూష్ విభాగాలు ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు. భక్తులకు అవసరమైన చికిత్స అందించేందుకు వైద్య సిబ్బంది, మందులను అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకు అంబులెన్సులు కూడా అందుబాటులో ఉంచారు. సేవా కార్యక్రమాలు నిర్వహణ కోసం ఎవరి స్థాయిలో వారు విస్తృత ఏర్పాట్లు చేశారు. భారతి సిమెంట్స్ యాజమాన్యం ఉచితంగా వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేస్తోంది. భారతి సిమెంట్స్ ప్రతినిధి మల్లికార్జునరెడ్డి దగ్గరుండీ భక్తులకు ఉచితంగా వాటర్ ప్యాకెట్లు అందించారు. పారిశుద్ధ్య పనులు భేష్ భక్తులు రద్దీ ఏ స్థాయిలో ఉన్నా బారాషహీద్ దర్గా ప్రాంగణంలో చక్కటి పారిశుద్ధ్య నిర్వహణకు కార్పొరేషన్ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. మూడు షిఫ్ట్లు విభజించి ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య లోపం లేకుండా చర్యలు చేపట్టింది. నగర కమిషనర్ హరిత స్వీయ పర్యవేక్షణలో కార్పొరేషన్ విభాగం చురుగ్గా వ్యవహరిస్తోంది. పోలీసుశాఖ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానటరింగ్ కేంద్రం నుంచి పర్యవేక్షిస్తోంది. ఎస్పీ విజయారావు పర్యవేక్షణలో అదనపు ఎస్పీలు హిమవతి, చాముండేశ్వరీ, గాదె శ్రీనివాసులు, డీఎస్పీలు గాంధీ, హరినాథరెడ్డి, అబ్దుల్ సుభాహాన్, శ్రీనివాసులు తదితరులు షిప్ట్ల వారిగా దగ్గరుండీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్, బందోబస్తు నిర్వహణలో ఎలాంటి లోపం లేకుండా సమీక్షిస్తున్నారు. సమాచారశాఖ వైఖరితో మీడియా అసంతృప్తి బారాషహీద్ దర్గా కవరేజ్ నిమిత్తం మీడియాకు రెవెన్యూ యంత్రాంగం పాసులు జారీ చేసింది. సోమవారం సాయంత్రమే ఆర్డీఓ మలోల పాసులను సమాచారశాఖ ఉన్నతాధికారికి అప్పగించారు. మంగళవారం రొట్టెల పండగ ప్రారంభమైనా మీడియా ప్రతినిధుల కు పాసులు అందలేదు. పోలీసు యంత్రాంగం ఎక్కడిక్కడ మీడియాను కట్టడి చేసింది. ప్రభుత్వం జారీ చేసినా అక్రిడిటేషన్ కార్డులు చూపించినా అడ్డగించారు. ఒక దశలో నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దర్గా ప్రాంగణం పరిశీలనకు వచ్చిన మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి దృష్టికి మీడియా ప్రతినిధులకు ఈ విషయాన్ని తీసుకెళ్లారు. పాసులు ఇవ్వకపోవడంపై అక్కడే ఉన్న సదరు ఉన్నతాధికారిని మంత్రి కాకాణి ప్రశ్నిస్తే తాను సోమవారం సెలవులో ఉన్నానని చెప్పారు. సెలవులో ఉంటే పాసులు జారీ చేయడానికి ఇబ్బంది ఏమిటని నిలదీశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి అధికారిక కార్యక్రమం అయినా మీడియా ప్రతినిధులకు సమాచారశాఖ నుంచి ఇబ్బందులు తప్పడంలేదని ఆరోపించారు. భక్తిశ్రద్ధలతో షహదత్, సొందల్మాలి నెల్లూరు (బృందావనం): రొట్టెల పండగ తొలి రోజు సంప్రదాయంగా మంగళవారం రాత్రి అమరులైన 12 మంది యోథులను స్మరిస్తూ దర్గా ప్రాంగణంలో బారాషహీద్ల సమాధుల చెంత షహదత్ (ప్రత్యేక ప్రార్థనలు) నిర్వహించారు. షహదత్లో భాగంగా 12 మంది వీరుల సమాధులను మత పెద్దలు రాత్రి 11.30 నుంచి 2 గంటల వరకు గులాములు, పన్నీరుతో శుభ్రం చేసి అనంతరం గంధం లేపనం చేసి ‘సొందల్ మాలి’ నిర్వహించారు. నేడు గంధమహోత్సవం రొట్టెల పండగలో భాగంగా రెండో రోజు బుధవారం రాత్రి బారాషహీద్ల గంధమహోత్సవం జరగనుంది. కోటమిట్టలోని అమీనియా మసీదు నుంచి సంప్రదాయంగా గంధాన్ని తీసుకువచ్చి బారాషహీద్లకు లేపనం చేస్తారు. అనంతరం భక్తులకు ఆ గంధాన్ని, ప్రసాదాన్ని పంచి పెడతారు. రొట్టెల పండగలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుని అంగరంగ వైభవంగా జరిగే గంధ మహోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు లక్షలాదిగా తరలిరానున్నారు. రొట్టెల పండగపై పోలీస్ నిఘా నెల్లూరు (క్రైమ్): బారాషహీద్ దర్గాలో మంగళవారం రొట్టెల పండగ ప్రారంభమైంది. జిల్లా పోలీసు యంత్రాగం 2,173 మంది సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. మహిళల రక్షణ నిమిత్తం స్వర్ణాలచెరువు ఘాట్, దర్గా ఆవరణలో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. దర్గాలో 76 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్లను ఏర్పాటు చేసి పోలీసు అవుట్పోస్టులోని తాత్కాలిక కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేశారు. పోలీసు అ«ధికారులు, సిబ్బంది అక్కడి నుంచి నిరంతర పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు, సలహాలిస్తున్నారు. దర్గాలో మంగళవారం తప్పిపోయిన 21 మంది చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. క్రైమ్ పోలీసులు మఫ్టీలో తిరుగుతూ జేబు, గొలుసు దొంగలపై దృష్టి సారించారు. ఓ జేబు దొంగను అదుపులోకి తీసుకున్నారు. భద్రతా ఏర్పాట్ల పరిశీలన ఎస్పీ సీహెచ్ విజయారావు దర్గా ఆవరణలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. తాత్కాలిక కమాండ్ కంట్రోల్ పని తీరును ఆయన స్వయంగా వీక్షించారు. భక్తుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో క్రైం పార్టీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. మఫ్టీలో తిరుగుతూ నేరాలు జరగకుండా చూడాలన్నారు. నేర నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టం ద్వారా భక్తులకు తెలియజేయాలన్నారు. అనంతరం ఆయన దర్గా క్యూలైన్లు, రొట్టెల మార్పిడి, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఏఎస్పీలు, డీఎస్పీలు తదితరులున్నారు. -
ఫలించిన ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి కృషి.. సీఎం జగన్కు కృతజ్ఞతలు
సాక్షి, నెల్లూరు: బారాషహీద్ దర్గా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. సమగ్రాభివృద్ధి కోసం రూ.15 కోట్లు మంజూరు చేస్తూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ చక్రధర్బాబు నివేదిక ఆధారంగా నిధులు మంజూరు చేసింది. దర్గా ప్రాంగణంలో కాంప్లెక్స్, ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు, స్వర్ణాల చెరువు తదితర అభివృద్ధి పనులను అనుమతి దక్కింది. రొట్టెల పండగ నాడు భక్తులకు తీపి కబురు లభించింది. బారాషహీద్ దర్గా అభివృద్ధికి ప్రజా ప్రతినిధుల అభ్యర్థన మేరకు కలెక్టర్ నివేదిక ఆధారంగా నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘బారాషహీద్ దర్గా ప్రాంగణంలో ఉన్నంత వరకు తాను భక్తుడినే. ప్రాంగణం బయట మాత్రమే ఎమ్మెల్యేను, చిత్తశుద్ధితో దర్గా అభివృద్ధి కోసం కృషి చేస్తానను’ అని కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డితో సమీక్షించి, కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి కోటంరెడ్డి సోదరులు ప్రత్యేకంగా తీసుకెళ్లారు. జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బారాషహీద్ దర్గా ప్రాంగణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వివరించారు. దీంతో దర్గా అభివృద్ధి పనుల కోసం రూ.15 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. చదవండి: (Rottela Panduga: భక్తులతో పోటెత్తిన స్వర్ణాల చెరువు) సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రొట్టెల పండగ జరిగే బారాషహీద్ దర్గా అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతజ్ఞతలు. రొట్టెల పండగ నాడు తీపి కబురు లభించడంపై దర్గా భక్తుడిగా చాలా ఆనందంగా ఉంది. దర్గా అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేశాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తోడ్పాటుతో సాధ్యమైంది. – కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే చదవండి: (త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక మొహర్రం : సీఎం వైఎస్ జగన్) -
చిన్నారికి ఎమ్మెల్యే కోటంరెడ్డి చేయూత
నెల్లూరు రూరల్(నెల్లూరు జిల్లా): హార్ట్లో హోల్తో బాధపడుతున్న చిన్నారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చేయూతనందించారు. బాలికకు ఆపరేషన్ విజయవంతమైంది. మంగళవారం చిన్నారితో పాటు తల్లిదండ్రులు నెల్లూరులోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకుని కోటంరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. శ్రీధర్రెడ్డి రూరల్ పరిధిలోని ఉప్పుటూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. చదవండి: బాగున్నావా అవ్వా..! ఈ సమయంలో గిరిజన కుటుంబానికి చెందిన పొట్లూరి స్నేహ అనే చిన్నారికి గుండె సమస్య ఉన్నట్లుగా ఆయన దృష్టికి వెళ్లింది. చిన్నారి తల్లిదండ్రులు తమ బాధను ఆయనకు చెప్పారు. స్పందించిన ఎమ్మెల్యే కారు ఏర్పాటు చేసి వారితోపాటు తన ప్రతినిధిని తిరుపతిలోని పెద్ద ఆస్పత్రికి పంపారు. చిన్నారి ఆపరేషన్ విషయమై అక్కడి వైద్యులతో కోటంరెడ్డి స్వయంగా మాట్లాడారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద స్నేహకు ఆపరేషన్ చేయగా విజయవంతమైంది. దీంతో చిన్నారి తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. తన వద్దకు వచ్చిన స్నేహతో ఎమ్మెల్యే ఎంతో ఆప్యాయంగా మాట్లాడి దుస్తులు అందజేశారు. ఆ కుటుంబానికి తనవంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని భరోసా ఇచ్చారు. -
మురుగునీటి కాలువలో దిగి ఎమ్మెల్యే కోటంరెడ్డి నిరసన
సాక్షి, నెల్లూరు: అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా తాను ఎల్లప్పుడూ ప్రజల పక్షానే సమస్యలపై పోరాటం సాగిస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్లోని 21వ డివిజన్ ఉమ్మారెడ్డిగుంటలో గత ఎంతో కాలంగా ఉన్న మురుగు నీటి కాలువ సమస్యపై ఆయన మంగళవారం తీవ్రస్థాయిలో స్పందించారు. నగరపాలక సంస్థ, రైల్యే అధికారుల నిర్లక్ష్యానికి స్థానిక ప్రజలు పడుతున్న మురికి నీటి కష్టాలకు ఆయన చలించిపోయారు. మురుగు కాలువలోకి దిగి సమస్య పరిష్కారమయ్యే వరకు తాను అక్కడే ఉంటానని బైఠాయించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూరల్ రోడ్ల పునరుద్ధరణకు రూ.62 కోట్లు మంజూరు చేశారని, కానీ ఈ ప్రాంతంలో మురికి కాలువ సమస్యపై మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయా శాఖల అధికారుల్లో స్పందన కరువైందన్నారు. నగరపాలక సంస్థ, రైల్వే అధికారులు అక్కడికి చేరుకుని సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేకి హామీ ఇవ్వడంతో ఆయన కాలువలో నుంచి బయటకు వచ్చారు. ఈ నెల 15వ తేదీ కాలువ నిర్మాణ పనులు చేపట్టి నెలలోపు పనులు పూర్తి చేస్తామని కార్పొరేషన్ అధికారులు చెప్పారు. 25వ తేదీ లోపు తాము కూడా పనులు పూర్తి చేస్తామని రైల్వే శాఖ అదికారులు హమీ ఇచ్చారు. సమస్యకు ఓ పరిష్కారం దొరకడంతో స్థానికులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చదవండి: (CM YS JAGAN: కడప జిల్లా పర్యటనకు సీఎం జగన్) -
మాజీ మంత్రి బాలినేని మచ్చలేని నాయకుడు: శ్రీధర్రెడ్డి
సాక్షి, నెల్లూరు: ప్రకాశం జిల్లాలో మాజీమంత్రి, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి మచ్చలేని నాయకుడిగా చలామణి అవుతున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లాలో వైఎస్సార్సీపీకి పర్యాయ పదం బాలినేని అని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్టపాలు చేస్తే మంత్రి పదవిని సైతం త్యజించి, వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట నడిచారని వివరించారు. నైతిక విలువలతో కూడిన రాజకీయం చేశారని, ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కొందరు వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ, జనసేన పార్టీల నాయకులు అనైతిక ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా రీజనల్ కో–ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా సొంత పార్టీ నేతులు ఎవరూ ప్రయత్నించకూడదని హితవు పలికారు. మాజీమంత్రి బాలినేని ఎదుర్కొంటున్న సమస్యలను తాను కూడా చవిచూస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: (YSRCP Plenary 2022: కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు) వైఎస్సార్సీపీ పెట్టక మునుపు నుంచి పార్టీ కోసం కష్టం చేసిన వ్యక్తుల్లో తాను ఒక్కడేనని వివరించారు. మళ్లీ ఎమ్మెల్యేలుగా గెలిచి సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూడాలనే తపన ఉండాలని, కానీ కొంత మంది ముఖ్య నేతలు రూరల్ నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని నేతలు తనను బలహీన పర్చాలని చూస్తున్నారని వెల్లడించారు. రూరల్ ప్రజానీకం, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులు ఉన్నంత వరకు తనను ఎవరూ బలహీన పర్చలేరని స్పష్టం చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ను తాను ఒకప్పటి రాజకీయ సహచరుడిగానే చూస్తున్నానని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజకీయ ప్రత్యర్థిగా, రాజకీయ పోటీదారుడిగా చూడలేదని వివరించారు. చదవండి: (మా నాయకుడన్న ఆ మాటకు మేమంతా కట్టుబడి ఉన్నాం: కొడాలి నాని) -
అయ్యా నా కొడుకు పరిస్థితి విషమంగా ఉంది.. వెంటనే ఆస్పత్రికి కోటంరెడ్డి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ ఓ వ్యక్తి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కి ఫోన్లో తెలియజేశారు. ఈ క్రమంలో ఆస్పత్రికి ఎమ్మెల్యే వెళ్లి మెరుగైన వైద్యాన్ని అందించేలా చర్యలు చేపట్టారు. వివరాలు.. తన కుమారుడు సుల్తాన్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, పరిస్థితి విషమంగా ఉందని రామకోటయ్యనగర్కు చెందిన ఖాదర్బాషా ఎమ్మెల్యేకు శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఫోన్లో తెలియజేశారు. చికిత్స పొందుతున్న బాధితుడు ఈ క్రమంలో తన వాహనంలో ఆస్పత్రికి చేరుకున్న ఎమ్మెల్యే.. ఖాదర్బాషాను కలిసి తానున్నానంటూ భరోసా ఇచ్చారు. సుల్తాన్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో మెరుగైన వైద్యం నిమిత్తం నారాయణ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి ఏజీఎంతో మాట్లాడి మెరుగైన వైద్యాన్ని అందించాలని సూచించారు. దీంతో సత్వరమే వైద్యసేవలను అందించారు. చదవండి: (తాళి కట్టి రోజు గడవక ముందే.. నవ్వును దూరం చేసి దుఃఖాన్ని మిగిల్చి) -
నెల్లూరు: రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి అస్వస్థత
-
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి అస్వస్థత
సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమంచర్లలో ‘జగనన్న మాట-గడపగడపకూ కోటంరెడ్డి బాటలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అరుంధతీ వాడలో సహపంక్తి భోజనం చేసిన అయన అలసటకు గురయ్యారు. అక్కడి నుంచి ఇంటికి చేరుకొన్న కోటంరెడ్డి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. చదవండి: ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ పోటీ: ఎంపీ జీవీఎల్ నడవలేని పరిస్థితిలో ఉన్న ఆయన్ని కుటుంబసభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందించిన వైద్యులు చెన్నైకి రెఫర్ చేసారు. సమాచారం అందుకొన్న మంత్రి కాకాణి ఆసుపత్రికి చేరుకుని కోటంరెడ్డిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితితిపై వైద్యులను అడిగి తెలుసుకొన్నారు. మెరుగైన వైద్యం కోసం చెన్నైకి కోటంరెడ్డిని తరలించారు. కోటంరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆరా తీశారు. ఎమ్మెల్యే సోదరుడు గిరిధర్రెడ్డితో మాట్లాడి ధైర్యం చెప్పారు. -
Kotamreddy Sridhar Reddy: మాటిచ్చాడు.. కంటిచూపు తెప్పించాడు..
సాక్షి, నెల్లూరు రూరల్: ఆ యువతికి పేదరికం శాపంగా మారడంతో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఇరవై ఏళ్లుగా కంటి చూపులేక నరకం చూసింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చొరవ తీసుకోవడంతో ఆ యువతి నేడు రంగుల ప్రపంచాన్ని ఆనందంగా చూస్తోంది. వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు రూరల్ మండలం పాత వెల్లంటి గ్రామం అరుంధతీయవాడకు చెందిన బైరపోగు శీనయ్య, రత్నమ్మ కుమార్తె బి.కామక్షమ్మ (20) పుట్టుకతో అంధురాలు. జగనన్న మాట – గడపగడపకు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి బాట కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఎమ్మెల్యే పాత వెల్లంటికి వెళ్లారు. అరుంధతీయవాడలో పాదయాత్ర చేస్తుండగా కామాక్షమ్మ కంటిచూపు లేదన్న విషయాన్ని తెలుసుకున్నారు. వెంటనే స్పందించి తన సొంత ఖర్చుతో ఖరీదైన వైద్యం చేయించి కంటిచూపు తెప్పిస్తాని హామీ ఇచ్చారు. ఈక్రమంలో నగరంలోని మోడరన్ ఐ హాస్పిటల్లో వైద్యులు కొద్దిరోజుల క్రితం కామాక్షమ్మ ఒక కంటికి ఆపరేషన్ చేసి కంటి చూపును తెప్పించారు. చదవండి: (రహదారులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష.. కీలక నిర్ణయాలు ఇవే..) తిరిగి రెండో కంటికి బుధవారం ఆపరేషన్ నిర్వహించగా విజయవంతమైంది. తనకు కంటి చూపు వచ్చిన వెంటనే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని చూడాలని కామాక్షమ్మ కోరారు. దీంతో రూరల్ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి ఆస్పత్రికి వెళ్లి కామాక్షమ్మను పరామర్శించారు. తనకు కంటి చూపు వస్తుందనే నమ్మకం పూర్తిగా పోయిందని ఈ నేపథ్యంలో శ్రీధర్రెడ్డి ఆదుకున్నారని యువతి తెలిపారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ధన్యవాదాలు తెలిపారు. ఒక్కమాటతో కొత్త జీవితాన్నిచ్చిన ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. -
SPSR Nellore: అజీజ్ భాయ్ ఏ క్యా హై!
సాక్షి, నెల్లూరు: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. అలాంటిది పవిత్ర రంజాన్ రోజున టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ వైఖరి ముస్లిం వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ విస్మయాన్ని కలిగించాయి. సహనం, ఓర్పు, క్షమాగుణానికి ప్రతీక రంజాన్ పండగను ముస్లిలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆత్మీయతతో నిర్వహిస్తారు. ఈ పవిత్ర పర్వదినం రోజున శత్రువులను సైతం క్షమించాలని ఇస్లామిక్ మత బోధనలు వివరిస్తున్నాయి. మంగళవారం బారా షహీద్ దర్గాలో ముస్లిలు ప్రార్థనల అనంతరం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థి అయిన టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ను ఆలింగనం చేసుకోబోతుంటే తిరస్కరించారు. అజీజ్ చర్యను ముస్లిం మత పెద్దలు సైతం తప్పు పట్టారు. దైవం కారుణ్యం చూపిస్తారని, సాటి మనిషిని ఆదుకునే అవకాశం కలుగుతుందని, జన్మకు సాఫల్యం లభిస్తోందని ఏడాది పాటు ముస్లిలు ఎదురుచూసే పండగ రంజా¯న్. ఈ మాసం ప్రారంభం కాగానే, అత్యంత పవిత్రంగా ఉపవాస దీక్షలతో ప్రత్యేక ప్రార్థనలతో ముస్లిలు నైతిక విలువలతో మెలగడం ఆనవాయితీ. ఈ నెలంతా పూర్తిగా ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. పవిత్ర రంజాన్ పండగ రోజున ప్రత్యేక ప్రార్థనలు అనంతరం ఒకరిని మరొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు, సంఘీభావం చెప్పుకోవడం ఆనవాయితీ. ఇలాంటి సందర్భంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ బారాషహీద్ దర్గాలో ప్రార్థనల్లో పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులుగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కూడా హాజరయ్యారు. చదవండి: (ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు: మంత్రి కాకాణి) ముస్లిం సంప్రదాయాలకు అనుగుణంగా ఇరువురు ప్రజా ప్రతినిధులు సహచర ముస్లింలతో ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు, సంఘీభావం తెలియజేశారు. ఈక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ను ఆలింగనం చేసుకోబోగా అబ్దుల్అజీజ్ ఎమ్మెల్యే గుండెలపై చేతులు వేసి తోశారు. దీన్ని ప్రత్యక్షంగా గమనించిన ముస్లి మత పెద్దలు, సహచరులు వారించినా అబ్దుల్ అజీజ్ లెక్క పెట్టలేదు. అజీజ్ వైఖరిని ముస్లిం మత పెద్దలతో పాటు ముస్లింలు సైతం తప్పుపట్టారు. పవిత్ర రంజాన్ మాసంలోనే కాకుండా రంజాన్ పర్వదినం రోజున కుల,మతాలకు అతీతంగా ముస్లింలు అందరిని ఆహ్వానించి తమ పవిత్ర భావాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుకోవడం ఆనవాయితీ. ఇన్ని దశాబ్దాల్లో రాజకీయ నాయకుల మధ్య ఇలాంటి వైఖరి విధానాలు ఎప్పుడూ చూడలేదని మత పెద్దలు నివ్వెరబోయారు. పార్టీలు వేరైనా ఇలాంటి సందర్భాల్లో ప్రతి ఒక్కరిని గౌరవించుకోవడం గౌరవనీయంగా సాగింది. అబ్దుల అజీజ్ చర్యను ప్రతి ఒక్కరూ ఖండించారు. ముస్లింల తరఫున కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలిచారు. అజీజ్ ఇస్లామ్ ధర్మాన్ని ధిక్కరించాడు పవిత్ర రంజాన్ పండగ అంటేనే శాంతి, సహనం, త్యాగానికి ప్రతీక. అలాంటి పవిత్ర పర్వదినంన ముస్లింలకు ఈద్ ముబారక్ చెప్పేందుకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని టీడీపీ నేత అజీజ్ నెట్టి వేయడం దుర్మార్గ చర్య. ఇది ఇస్లాం ధర్మాన్ని ధిక్కరించడమే. ఇస్లాం ధర్మం కూడా తెలియకుండా అజీజ్ ప్రవర్తించడం ఆయన అనైతికతకు నిదర్శనం. ముస్లింల మనోభావాలను గౌరవించే కోటంరెడ్డికి టీడీపీ నేత అబ్దుల్ అజీజ్ బహిరంగ క్షమాపణ చెప్పితేనే ఆయన్ను అల్లా క్షమిస్తాడు. – సయ్యద్సమీ, మైనార్టీ నేత, నెల్లూరు -
ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డికి స్వల్ప అస్వస్థత
సాక్షి, నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి బుధవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కందమూరు గ్రామంలో బుధవారం ఉదయం ఆయన ‘జగనన్న మాట–గడప గడపకు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి బాట’ కార్యక్రమం నిర్వహిస్తుండగా కుడికాలు నొప్పిగా ఉండడంతో వెంట ఉన్నవారు నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాల వైద్యులకు సమాచారం అందించారు. డాక్టర్లు మధ్యాహ్నం గ్రామానికి చేరుకుని చికిత్స అందించారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి చికిత్స చేస్తున్న ప్రభుత్వ వైద్య సిబ్బంది బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించగా సాధారణంగా ఉన్నట్లు తేలింది. వైద్యుల సూచనను ఎమ్మెల్యే సున్నితంగా తిరస్కరించారు. తన కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించారు. మంగళవారం గత రాత్రి పాతవెల్లంటి గ్రామంలో కుండా మురళీరెడ్డి ఇంట్లో బసచేసిన ఆయన బుధవారం ఉదయం కందమూరులో చేవూరు పెంచలయ్య ఇంటి వద్ద నుంచి కార్యక్రమాన్ని ఆరంభించారు. ఉదయం ఏడు గంటల నుంచి ఇంటింటికీ వెళుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. అర్హులైన ప్రతిఒక్కరికీ పథకాలు అందేలా కృషి చేస్తామని చెప్పారు. చదవండి: (ఇనమడుగు వాసి ఎద్దుల సాయికుమార్రెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు) -
వైఎస్సార్సీపీలో వర్గాల్లేవు.. ఉన్నవారంతా జగన్ సైనికులే: అనిల్ కుమార్
సాక్షి, నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చేపట్టిన జగనన్న మాట – గడపగడపకు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి బాట కార్యక్రమానికి మాజీ మంత్రి, సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్ సంఘీభావం తెలిపారు. గురువారం రూరల్ పరిధిలోని సజ్జాపురంలో శ్రీధర్రెడ్డి పాదయాత్ర చేశారు. మధ్యాహ్నం విరామ సమయంలో ఆయన్ను అనిల్ కలిశారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీలో వర్గాలు లేవు. వైఎస్సార్సీపీలో ఉన్నవారంతా వైఎస్ జగన్ సైనికులే. జగనన్న మాట – గడపగడపకు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి బాట కార్యక్రమం ద్వారా కోటంరెడ్డి ప్రజలకు ఆయన మరింత చేరువవుతున్నారన్నారు. ఆయన మూడోసారి కూడా రూరల్ నుంచి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఖాయమని చెప్పారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పాల్గొన్నారు. చదవండి: (గాజువాక తహసీల్దార్కు 6 నెలల జైలు శిక్ష: హైకోర్టు ఉత్తర్వులు) -
సామాన్యుడు.. కోటంరెడ్డి.. నిత్యం జనంతో మమేకం
ఆయనో ప్రజాప్రతినిధి. సామాన్యుడిగా నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటారు. నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులతో కష్టసుఖాలు తెలుసుకుంటూ భరోసాగా నిలుస్తారు. కార్యకర్తల ఇంట్లోనే భోజనం, నిద్ర చేస్తూ మమేకమవుతారు. ఆయనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి. ఈ పేరు ప్రజల గుండె చప్పుడు. కష్టం వచ్చి శ్రీధరన్న.. పిలిస్తే ఆగమేఘాల మీద వెళ్లి ఆ కష్టాన్ని తీర్చి.. కన్నీళ్లు తుడిచి వస్తాడు. ఎమ్మెల్యే కాక ముందు నుంచి పాదయాత్ర చేసి ప్రతి ఇంటిని పలకరించారు. ప్రతి పక్ష ఎమ్మెల్యేగా పల్లె పల్లె తిరిగారు. తాజాగా సోమవారం నుంచి జగనన్న మాట గడప గడపకు కోటంరెడ్డి బాట పేరుతో ఇల్లిల్లూ తిరుగుతున్నారు. సాక్షి, నెల్లూరు: నెల్లూరు రూరల్ మండలం గొల్లకందూరులో చేవూరు శ్రీనివాసులురెడ్డి అనే కార్యకర్త ఇంటి నుంచి సోమవారం ఉదయం ‘జగనన్న మాట.. గడప గడపకూ కోటంరెడ్డి బాట’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 9 నెలలు పాటు చేపట్టే ఈ కార్యక్రమం మూడు విడతలుగా చేపట్టనున్నారు. ఒక్కొక్క విడతలో నిరంతరాయంగా 33 రోజులు కొనసాగించనున్నారు. ఉదయం 7 నుంచి 12 గంటలకు ముగించనున్నారు. కార్యకర్త ఇంట్లోనే భోజనం చేయడం, అక్కడే 2 గంటలు రెస్ట్ తీసుకోవడం, మళ్లీ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటలకు వరకూ గడప గడప కార్యక్రమం ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా చేపట్టనున్నారు. చదవండి: (తండ్రి, తనయుడి కేబినెట్లలో ఆ నలుగురు..) జనంతో మమేకం.. ఆయన జీవితం ఆయన రాజకీయ జీవితమంతా.. జనంతో మమేకమై సాగుతోంది. ప్రతి రోజు కార్యకర్తలకు అందుబాటులో ఉండడం, సమస్య ఉంటే ఎమ్మెల్యే ఆఫీసు వెళ్తే పరిష్కారం లభిస్తుందనే ధీమా వైఎస్సార్సీపీ కార్యకర్తలకు కల్పించడంలో సఫలీకృతుడయ్యారు. తాను అందుబాటు లేకపోయినా సోదరుడు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి అయినా అందుబాటులో ఉండేలా ప్రత్యేక ప్రణాళిక రచించుకున్నారు. క్రమం తప్పకుండా అందుకు తగ్గట్లుగా పార్టీ నాయకులకు అందుబాటులో ఉంటారు. పదవుల కోసం పాకులాడకుండా.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు గడప గడపకు కోటంరెడ్డి బాట కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. చిత్తశుద్ధితో నిర్వహణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చిత్తశుద్ధితో కార్యక్రమాలు నిర్వహిస్తారనే పేరుంది. అందులో భాగంగా ఇల్లిల్లూ తిరుగుతూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా? అర్హత ఉండి దక్కలేదా? ఇంకా ఏమి కావాలని కోరుకుంటున్నారనే విషయాలు తెలుసుకుంటూనే వారితో మమేకం అవుతున్నారు. గొల్లకందుకూరులో గంజి బుజ్జమ్మ అనే వృద్ధ మహిళతో కలిసి నేలపై కూర్చుండి ఆమె సమస్యలు తెలుసుకుని భరోసా కల్పించారు. ప్రజల సమస్యలు తెలుసుకునే క్రమంలో స్వయంగా పుస్తకంలో నోట్ చేసుకుంటున్నారు. కార్యకర్తలు ఎంత మంది ఉన్నా సమస్యలను ఎమ్మెల్యేకు మాత్రమే చెప్పుకునేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. -
సీఎం జగన్ నిర్ణయమే పార్టీలోని ఎమ్మెల్యేలందరికీ శిరోధార్యం: శ్రీధర్ రెడ్డి
-
మాస్క్ మస్ట్గా ధరించాలి: ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు
-
‘ప్రతిపక్షంలో కూడా అదే పనిచేస్తున్నారు’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒక విఫల నాయకుడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఐదేళ్ల పాలనపై చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చంద్రబాబు చేసిన విమర్శలను ఆయన తప్పుబట్టారు. చంద్రబాబును భస్మాసురుడి పెద్దన్నగా అభివర్ణించారు. చంద్రబాబు సీఎం గా ఉన్న గత ఐదేళ్లు.. రాష్ట్రం మొత్తం తగలబడిపోయిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విమర్శలు చేసే అర్హత ఆయనకు లేదని ధ్వజమెత్తారు. (‘ఆయనకు అందుకే మతి భ్రమించింది’) చైతన్యయాత్రలు వెలవెల.. చంద్రబాబు చేస్తున్న చైతన్య యాత్రలు జనాలు లేక వెలవెల బోతున్నాయని కోటంరెడ్డి ఎద్దేవా చేశారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి నాలుగు మంచి సలహాలు చెప్పారా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి.. ఎన్నికల వాయిదా వేయించేందుకు ఆయన సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. టీడీపీకి అభ్యర్థులు లేక స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. లిటికేషన్లు పెట్టి కోర్టుల్లో వాయిదాలు వేయిస్తున్నారని కోటంరెడ్డి మండిపడ్డారు. ఏపీ ఇమేజ్ డామేజ్ చేస్తున్నారు.. ‘ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఏపీ ఇమేజ్ను డామేజ్ చేస్తున్నారు. ఏ తప్పు చేయకపోతే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు. సిట్ ఏర్పాటుతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరుగెడుతున్నాయి. ఆయన అధికారంలో ఉంటే రాష్ట్రం కరువు కటాకలతో ఉండేది. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని’ కోటంరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీలను అణగదొక్కారని, ప్రతిపక్షంలో కూడా చంద్రబాబు అదే పని చేస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ధ్వజమెత్తారు. -
లోకేశ్ దీక్షలా.. జనం నవ్వుకుంటున్నారు!
సాక్షి, తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్ రాష్ట్రాన్ని సర్వం దోచుకొని లోటు బడ్జెట్ పరిస్థితి తెచ్చారని వైస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. ఆయన గురువారం తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్తవ్యదీక్షతో సడలని విశ్వాసంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని, ప్రజలంతా కలకాలం వైఎస్ జగన్ వెంటే ఉంటారని అన్నారు. సీఎం వైఎస్ జగన్ సుపరిపాలనను చూసి ఓర్వలేకే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. విలువలూ విశ్వసనీయత గురించి చంద్రబాబు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని అన్నారు. చంద్రబాబు విలువల గురించి మాట్లాడటం చూస్తుంటే ఉగ్రవాదులు శాంతి వచనాలు వల్లించినట్లే ఉందని అన్నారు. చంద్రబాబును గతంలో నాదెండ్ల భాస్కర్రావు జేబు దొంగ అని విమర్శించారని, ఎన్టీఆర్ అయితే ఆయనను జామాత దశమగ్రహం అంటూ మండిపడ్డారని గుర్తుచేశారు. చంద్రబాబు జీవితమంతా వంచనేనని, ఆయన అప్పట్లో నరకారుసుడు, ఇప్పట్లో నారాసుడిగా మారిపోయారని విమర్శించారు. చంద్రబాబుకు చదువుకుంటున్నప్పటి నుంచీ కుల పిచ్చి ఉందని అన్నారు. లోకేశ్ దీక్షలా.. జనం నవ్వుకుంటున్నారు! లోకేశ్ దీక్షలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్కు తెలియదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైస్సార్సీపీ 90 శాతం స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తండ్రీకొడుకులిద్దరూ మానసిక వ్యాధితో బాధపడుతున్నారని చంద్రబాబు-లోకేశ్లను విమర్శించారు. మీడియాపై తమకు ఎప్పుడూ గౌరవం ఉందని, జీవో 2430 ఎప్పటినుంచో ఉంది.. కొత్తగా పెట్టింది ఏమీకాదని శ్రీధర్రెడ్డి వివరించారు. కొన్ని పత్రికలు, ఛానెల్స్ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని, తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని అన్నారు. సాక్షి మీడియాను గత ప్రభుత్వంలో చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నాయకులు ఏమైపోయారని ప్రశ్నించారు. ఇసుకాసురుల్లా గతంలో టీడీపీ నేతలు గ్రామల్లో ఇసుకను దోచుకున్నారని, కానీ ప్రస్తుతం సీఎం ఇసుక విషయంలో అధికారుకులకు స్వేచ్ఛ నిచ్చారని తెలిపారు. టీడీపీ నేతలు ఇష్టానుసారంగా ఇసుకను దోచుకుంటున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించారని, అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ఇసుకకు మాఫియాకు కేరాఫ్ అడ్రస్గా మారిందని అన్నారు. -
ఎమ్మెల్యే కోటంరెడ్డికి బెయిల్ మంజూరు
-
సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: కోటంరెడ్డి
సాక్షి, నెల్లూరు: రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి, అతని అనుచరులు తన ఇంటిపైకి వచ్చి రభస సృష్టించారని వెంకటాచలం ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోటంరెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. స్పెషల్ జ్యుడీషియల్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం కోటంరెడ్డి మాట్లాడుతూ.. ఆధారాలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారని, ఆయన నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నారు. విచారణ జరిపి తనపై తప్పు ఉంటే చర్యలు తీసుకోవాలని కోటంరెడ్డి పేర్కొన్నారు. కోటంరెడ్డి మాట్లాడుతూ... ‘ఎంపీడీవో సరళ నాపై అసత్య ఆరోపణలతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ముఖ్యమంత్రి చెప్పారు. ఆయన మాటలకు నేను గౌరవం ఇస్తున్నా, హర్షిస్తున్నా. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మార్వో, ఐపీఎస్ అధికారులపై దాడి చేస్తే రాజీ చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రమాణాన్ని తూచా తప్పకుండా పాటించారు. మాది నిజమైన ప్రభుత్వం. జిల్లా ఎస్పీకి నాకు వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. అది నా దురదృష్టం. నాలుగు రోజుల క్రితం కలెక్టర్కి ఎస్పీపై ఫిర్యాదు చేశా. ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి చెబితే ఎస్పీ వ్యక్తిగత కక్ష తీర్చుకునే ప్రయత్నం చేశారు. అర్థరాత్రి నా ఇంటిపై, నా అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి ఇళ్లపై దాడులు చేసి ఇబ్బంది పెట్టారు. విచారణలో నా తప్పు ఉందని తెలిస్తే ఎంపీడీవో సరళకు బహిరంగంగా క్షమాపణ చెబుతా. అంతేకాదు నాపై ఆరోపణలు రుజువు అయితే షోకాజ్ నోటీసులు కాదు..ఏకంగా పార్టీ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేయండి.’ అని అన్నారు. చదవండి: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్ -
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్
-
టీడీపీకి మరో ఎదురుదెబ్బ
సాక్షి, నెల్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అనుచరుడు కోడూరు కమలాకర్రెడ్డి శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. నెల్లూరు రూరల్ వైఎస్సార్సీపీ ఇన్చార్జి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, కొండ్రెడ్డి రంగారెడ్డి, వైవీ రామిరెడ్డి, రూపకుమార్ యాదవ్, తాటి వెంకటేశ్వరరావు, బిరదవోలు శ్రీకాంత్రెడ్డి, మిద్దె మురళీకృష్ణ యాదవ్ తదితర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతోనే కమలాకర్రెడ్డి పార్టీ మారినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినప్పటికీ వైఖరి మార్చుకోకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ నాయకులు టీడీపీని వీడుతున్నారు. నెల్లూరు జిల్లాలో కీలక నేతగా ఉన్న కమలాకర్రెడ్డి తాజాగా వైఎస్సార్సీపీలో చేరడంతో నెల్లూరు రూరల్లో దాదాపు టీడీపీ ఖాళీ అయింది. కాగా, తూర్పు గోదావరి జిల్లా టీడీపీ సీనియర్ నాయకుడు, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఈనెల 15న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. (చదవండి: వైఎస్సార్సీపీలోకి తోట త్రిమూర్తులు) -
ఆ వార్తలను ఖండించిన కోటంరెడ్డి
సాక్షి, నెల్లూరు : ఓ పత్రిక సంపాదకుడిపై తాను దాడికి పాల్పడినట్టు వస్తున్న వార్తలను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఖండించారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆయన వివరణ ఇచ్చారు. జమీన్ రైతు పత్రిక సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ అసలు పత్రిక సంపాదకుడే కాదని తెలిపారు. అతను కేవలం అక్రమ సంపాదకుడు మాత్రమేనని అని ఆరోపించారు. డోలేంద్రపై తాను హత్యాయత్నానికి పాల్పడిందనే మాటల్లో వాస్తవం లేదన్నారు. అతను బ్లాక్ మెయిలింగ్ చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అతని గత చరిత్ర గురించి అందరికి తెలుసన్నారు. డోలేంద్ర మద్యం మత్తులో తనపై కేసు పెట్టారని.. అందులో వాస్తవాలు ఉంటే ఎలాంటి శిక్షకైనా తాను సిద్దమని స్పష్టం చేశారు. -
ఎన్నికల తర్వాత ఇక్కడ టీడీపీ కనుమరుగు
సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన క్రమంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, క్యాడర్ అధికార పార్టీ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వలసల హడావుడి భారీ స్థాయిలో మొదలైంది. సాధారణంగా ఎన్నికల సమయంలో రాజకీయ వలసలు కొనసాగుతుంటాయి. కానీ దీనికి భిన్నంగా నెల్లూరు రూరల్ టీడీపీ నాయకత్వంపై నమ్మకం లేక తమ ఉనికిని చాటుకునేందుకు ఆ పార్టీ క్యాడర్ వైఎస్సార్సీపీ వైపు చూస్తోంది. తాజాగా సోమవారం నలుగురు మాజీ కార్పొరేటర్ల చేరిక ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. సాక్షి, నెల్లూరు: గడిచిన ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్సీపీ విజయదుందుబి మోగించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో పదికి పది స్థానాలు గెలిచి జిల్లాలో ప్రతిపక్ష పార్టీ ఉనికిని గల్లంతు చేసింది. ఈ క్రమంలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అధికారంలోకి రాగానే కొద్ది రోజులు నేతల చేరికతో హడావుడి కొనసాగింది. తాజాగా ఇప్పుడు నెల్లూరు రూరల్లో వలసల పర్వానికి నేతలు శ్రీకారం చుట్టారు. పార్టీలో దీర్ఘకాలంగా ఉన్న క్యాడర్ మనోభావాలకు అనుగుణంగా వారి సూచనల మేరకు వలసలకు ప్రజాప్రతినిధులు అంగీకారం తెలుపుతున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో సోమవారం టీడీపీకి చెందిన నలుగురు మాజీ కార్పొరేటర్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నేతృత్వంలో పార్టీలో చేరారు. 20వ డివిజన్ మాజీ కార్పొరేటర్ దాసరి రాజేష్, 30వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పి.మాధవి భర్త పి.ప్రసాద్, 27వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మల్లెబోయిన వెంకటేశ్వర్లు యాదవ్, 18వ డివిజన్ మాజీ కార్పొరేటర్ డి. సరోజనమ్మ కుమారుడు వంశీ తదితరులు ఉనికి దాట్లు పార్టీలో చేరారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లతో పాటు నెల్లూరు రూరల్ మండలం ఉంది. ఈ క్రమంలో టీడీపీలో ఉన్న మాజీ కార్పొరేటర్లు అందరూ అధికార పార్టీలో చేరేందుకు నేతలతో మంతనాలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి రెండు నెలల క్రితమే పెద్ద సంఖ్యలో టీడీపీ మాజీ కార్పొరేటర్లు, నేతలు, మండల నేతలు, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డిని కలిసి పార్టీలో చేరుతామని కోరారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్యాదవ్, నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు ఆదాల ప్రభాకర్రెడ్డిని సైతం కోరారు. అయితే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి పార్టీ క్యాడర్తో చర్చించి వారు అంగీకరిస్తే పార్టీలోకి ఆహ్వానిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో పార్టీ క్యాడర్ నిర్ణయానికి అనుగుణంగా చేరికలకు శ్రీకారం చుట్టారు. నెల్లూరు రూరల్లో టీడీపీ ఖాళీ సార్వత్రిక ఎన్నికల అనంతరం నెల్లూరు రూరల్ టీడీపీ నేతలు ముఖం చాటేశారు. ఎన్నికలు పూర్తయి రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ క్యాడర్కు పూర్తిగా అందుబాటులో లేకపోవడం, కనీసం క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు కూడా గడిచిన మూడు నెలల్లో నిర్వహించని పరిస్థితి. దీంతో పాటు పార్టీలో ముఖ్య నేతలుగా ఉన్న వారు కూడా పూర్తిగా పార్టీకి దూరంగా ఉండటంతో రూరల్ టీడీపీ చుక్కాని లేని నావలా తయారైంది. దీంతో నేతలందరూ వైఎస్సార్సీపీ వైపు మళ్లుతున్నారు. మరో వైపు అభివృద్ధి కార్యక్రమాలు, క్ష్రేతస్థాయి పర్యటనలతో వైఎస్సార్సీపీ నేతలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో టీడీపీ ముఖ్య నేతలు అంతా వైఎస్సార్సీపీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకునే పనిలో పడ్డారు. దీనిలో భాగంగా స్థానిక నేతలు మొదలుకొని ఎమ్మెల్యే వరకు అందరిని కలిసి మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు. -
లోకేశ్ సీఎం కాకూడదని..
సాక్షి, అమరావతి: చంద్రబాబు, టీడీపీ తమను పెట్టిన ఇబ్బందులను మరిచిపోలేమని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీల్లో గురువారం ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు పదవుల మీద వ్యామోహం లేదని, తమ నాయకుడు వైఎస్ జగన్ కోసమే పని చేస్తున్నామన్నారు. గతంలో పోరాట వీరులం, ఇప్పుడు పరిపాలన దక్షులమంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు కానీ, లోకేశ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో సీఎం కాకూడదని ఓ 60 మంది ఎమ్మెల్యేలం దళంగా ఏర్పడ్డామని వెల్లడించారు. ‘మా తల తీసి పక్కన పెడితే చంద్రబాబు సీఎం కాడని చెబితే పక్కన పెట్టేస్తామ’ని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. చంద్రబాబుకు కోటంరెడ్డి సవాల్ గత సభలో తమకు చంద్రబాబు నేర్పిన విద్యనే ఇప్పుడు ప్రదర్శిస్తున్నామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీల్లో పిచ్చాపాటిగా మాట్లాడుతూ... ‘గతంలో వైఎస్ జగన్ను అప్పటి మంత్రులు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అప్పటి మంత్రుల కామెంట్లకు నాటి సభలో చంద్రబాబు చప్పట్లు కొట్టారు. నాటి వ్యాఖ్యలకు చంద్రబాబు విచారం వ్యక్తం చేస్తే.. నేనూ నా కామెంట్లపై క్షమాపణ చెబుతా. నావి కానీ ఆడియో టేపులను నావే అని టీడీపీ పదే పదే విమర్శిస్తోంది. చంద్రబాబు ఆడియో టేపులు, నావి అని చెబుతున్న ఆడియో టేపులను ఫొరెన్సిక్ ల్యాబ్ పంపించడానికి టీడీపీ సిద్దమా? ఎవరిది తప్పని తేలితే వారు శిక్ష అనుభవించాలి. నేను శిక్ష అనుభవించడానికి సిద్ధం, చంద్రబాబు సిద్ధమా?’ అని సవాల్ విసిరారు. -
దాడులు చేయించడం మంచి సంస్కృతి కాదు
నెల్లూరు(సెంట్రల్): ప్రశాంతమైన నెల్లూరులో దాడులు, హత్యలు చేయించడం మంచి సంస్కృతి కాదని, తిరుమలనాయుడిపై జరిగిన దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. తిరుమలనాయుడిపై జరిగిన దాడి విషయంలో తాను మొదటి నుంచి ఖండిస్తున్నానని, దాడి ఎవరు చేసినా కఠినంగా శిక్షించాలని చెప్పారు. రెండు రోజుల క్రితం దాడి చేసిన ఏడుగుర్ని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారని, అయితే వాళ్లు దాడులు చేశారా.. లేదాననేది ఇప్పటికీ అనుమానంగానే ఉందని చెప్పారు. పోలీస్ వ్యవస్థపై నమ్మకంతో ఉన్నానని తెలిపారు. దాడిలో తనపై నిందలు మోపే ముందు తిరుమలనాయుడి అరాచకాలపై కూడా సోమిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనేక విద్యాసంస్థలపై దాడులు చేశారు.. ఇటీవల మినీబైపాస్రోడ్డులో ఆటోకు ‘నిన్ను నమ్మం బాబు’ అనే స్టిక్కర్ వేసుకున్నందుకు ఆటోడ్రైవర్పై తిరుమలనాయుడు దాష్టీకానికి పాల్పడ్డారని ఆరోపించారు. దీన్ని సోమిరెడ్డి చేయించారానని ప్రశ్నించారు. అనేక విద్యాసంస్థలపై తిరుమలనాయుడు దాడులు చేసి, బెదిరింపులకు దిగిన సందర్భాలు ఉన్నాయని, ఈ ఘటనల వెనుక చంద్రమోహన్రెడ్డి హస్తం ఉందానని ప్రశ్నించారు. తిరుమలనాయుడికి అనేక మందితో వ్యక్తిగత గొడవలు ఉన్నాయని, వీటికీ.. సోమిరెడ్డికి సంబందాలు ఉన్నాయా..? తన కార్యాలయంపై మేయర్ అజీజ్ సోదరుడు జలీల్ సమక్షంలో కొందరు మారణాయుధాలతో వచ్చి దాడులు చేశారని ఆరోపించారు. ఈ దాడిని సోమిరెడ్డి చేయించారానని ప్రశ్నించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని నిడిగుంటపాళెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై సోమిరెడ్డి మనుషులు అకారణంగా, అమానుషంగా దాడులు చేశారని.. ఈ దాడులను ఎవరి ప్రోద్బలంలో చేశారో చెప్పాలన్నారు. కావలిలో అనేక చోట్ల దాడులు జరిగాయని, దీని వెనుక బీదా రవిచంద్ర హస్తం ఉందానని ప్రశ్నించారు. ఏదైనా దాడి జరిగితే దాన్ని తనకు అంటగట్టడం సిగ్గుచేటని విమర్శించారు. జనసేన తరఫున సోమిరెడ్డి బంధువుల ప్రచారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అజీజ్కు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వెన్నుపోటు పొడవలేదానని ప్రశ్నించారు. సర్వేపల్లిలో సోమిరెడ్డి తరఫున ప్రచారం చేసిన ఆయన రక్తసంబంధీకులు, నెల్లూరు రూరల్లో జనసేన తరఫున ప్రచారం చేసిన మాట వాస్తవం కాదానని ప్రశ్నించారు. జనసేన అభ్యర్థి మనుక్రాంత్రెడ్డి సోమిరెడ్డికి అల్లుడు అనేది నిజం కాదానన్నారు. టీడీపీలో ఉండే వారికే వెన్నుపోటు పొడిచే మంత్రి సోమిరెడ్డి తనపై నిందలు వేయడం సిగ్గుచేటని, ఇలాంటి రాజకీయాలను మానుకోవాల్సిందిగా హితవు పలికారు. -
మీరే చేయించారా సోమిరెడ్డి : శ్రీధర్రెడ్డి
సాక్షి, నెల్లూరు : టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ‘తిరుమల నాయుడు అనేక పాఠశాలల మీద దాడులు చేశారు. అయితే రౌడీయిజాన్ని నేను సమ్మతించను. ప్రోత్సహించను. మరి వెంకటాచలం మండలంలో పోలింగ్ తర్వాత వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి. అందులో మీ హస్తం ఉందా. అవి మీరే చేయించారా’ అని టీడీపీ నేత సోమిరెడ్డిని ప్రశ్నించారు. ‘కావలిలో అనేక దాడులు జరిగాయి. అవన్నీ బీద రవిచంద్ర చేయించాడా..? జనసేన అభ్యర్థి మనుక్రాంత్ రెడ్డికి మద్దతుగా సోమిరెడ్డి పనిచేశారు. రూరల్ టీడీపీ అభ్యర్థి అజీజ్పై సోమిరెడ్డి దొంగ ప్రేమ చూపిస్తున్నారు’ అని కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వ్యాఖ్యానించారు. చదవండి : ‘ఓటమి భయంతోనే టీడీపీ నేతల విష ప్రచారం’ -
శ్రీధర్ రెడ్డి కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు ఆందోళన
-
శ్రీధర్ రెడ్డి కార్యాలయం వద్ద ఉద్రిక్తత
సాక్షి, నెల్లూరు : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడుపై దాడికి సంబంధించి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో చర్చించాలంటూ.. తిరుమలనాయుడి భార్య, తల్లి టీడీపీ కార్యకర్తలతో కలిసి కార్యాలయం ముందు బైఠాయించారు. దాడిపై తాము కేసు నమోదు చేశామని నిందితులను గుర్తించామని పోలీసులు చెబుతున్నా టీడీపీ నేతలు వినలేదు. మరోవైపు అదే సమయంలో అక్కడకు భారీ ఎత్తున వైఎస్సార్సీపీ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వివిధ కేసులతో సంబంధం ఉన్న టీడీపీ విద్యార్థి సంఘం నేత అమృల్లాను అరెస్ట్ చేయకుండా వదిలివేయడం వల్లే.. ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు చెబుతున్నారు. తిరుమల రెడ్డిపై జరిగిన దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు..నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ నేతలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చదవండి: ‘ఓటమి భయంతోనే టీడీపీ నేతల విష ప్రచారం’ -
ఎన్నికల్లో బెదిరిస్తే ఓట్లు వేస్తారా?
-
‘ఓటమి భయంతోనే టీడీపీ నేతల విష ప్రచారం’
సాక్షి, నెల్లూరు: తనపై టీడీపీ నేతలు చేస్తున్న విష ప్రచారంపై నెల్లూరు రూరల్ శాసనసభ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి స్పందించారు. తాను టీడీపీ నేతలను ఎప్పుడూ బెదిరించలేదని స్పష్టం చేశారు. సోమవారం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతలను తాను బెదిరించినట్లయితే.. అప్పుడే వారు ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీశారు.. టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు తిరుమల నాయుడుతో తనకు ఎటువంటి శత్రుత్వం లేదని పేర్కొన్నారు. తిరుమల నాయుడుపై దాడి జరిగిన వెంటనే టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర తనపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా తనపై దాడికి యత్నించడం మంచి పద్దతి కాదని సూచించారు. నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థి అబ్దుల్ అజీజ్ కూడా తనపై ఆరోపణలు అన్నారు. తను రౌడీయిజాన్ని ఎప్పుడు ప్రోత్సహించలేదని గుర్తుచేశారు. కాగా, తిరుమల నాయుడుపై వ్యక్తిగత కారణాలతో దాడి జరిగితే దానిని వైఎస్సార్సీపీ చేసినట్లు సృష్టించిన టీడీపీ నేతలు ఆదివారం వైఎస్సార్సీపీ కార్యాలయంతోపాటు, కోటంరెడ్డికి చెందిన ఫ్లెక్సీలను చించివేసి నానా హంగామా చేశారు. టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ కార్యాలయంలోకి చొరబడి బీభత్సం చేస్తున్నా.. అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. -
బ్రిడ్జి కోసం మురుగు కాలువలో దిగిన ఎమ్మెల్యే
నెల్లూరు (వేదాయపాళెం): ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూడలేక ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఏకంగా తీవ్ర దుర్గంధం వెదజల్లే మురుగు కాల్వలోకి దిగి నిరసన తెలిపారు. వీలైనంత త్వరగా వరద కాలువపై బ్రిడ్జి నిర్మించి ప్రజల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గంట పాటు మురుగు కాల్వలోనే నిల్చున్నారు. చివరకు అధికారులు దిగివచ్చి హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్ చాణక్యపురి వద్ద ఉన్న వరద కాలవపై బ్రిడ్జి నిర్మించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో స్థానికులు ఈ మార్గంలో రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఎన్నిసార్లు చెప్పినా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోలేదు. దీంతో బుధవారం ఆయన నేరుగా ఆ మురుగు కాలువ వద్దకు చేరుకున్నారు. తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్నా లెక్కచేయకుండా.. నడుములోతు ఉన్న మురుగు నీటిలోకి దిగి నిల్చున్నారు. ఇరిగేషన్ అధికారులు వచ్చి సమాధానమిచ్చే వరకు బయటకు రానన్నారు. దాదాపు గంట పాటు ఆ మురుగు నీటిలోనే ఉండిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఇరిగేషన్ ఉన్నతాధికారులు.. జేఈ బాలసుబ్రహ్మణ్యాన్ని ఘటనా స్థలికి పంపించారు. పనులను గంట లోపు ప్రారంభిస్తామని.. 45 రోజుల్లోపు బ్రిడ్జి నిర్మిస్తామని ఆయన చెప్పడంతో ఎమ్మెల్యే కాలువలో నుంచి బయటకు వచ్చారు. తమ కోసం మురుగు నీటిలోకి సైతం దిగి నిరసన తెలిపిన ఎమ్మెల్యేను స్థానికులు అభినందించారు. -
టీడీపీకి మరో ఎదురుదెబ్బ
సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ జిల్లా కార్యదర్శి యేసు నాయుడుతో పాటు డివిజన్ నేతలు నేల్ సాయిరామ్, అశోక్, శ్రీనివాసరావు, నరసింహులు రాజీనామా చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 22న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు వారు ప్రకటించారు. రాష్ట్ర మాజీ మంత్రి, జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు ఆనం రామనారాయణరెడ్డి గత నెలలో టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఎన్డీసీసీబీ మాజీ అధ్యక్షుడు వేమారెడ్డి శ్యాంసుందర్రెడ్డి, నెల్లూరు కార్పొరేటర్ రంగమయూరరెడ్డి, దివంగత మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కుమారుడు సంజీవరెడ్డి, చేజర్ల మండల టీడీపీ నాయకుడు నవకృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఆదిశేషయ్య, సంగం మండలానికి చెందిన హిందూపురరెడ్డి, పారిశ్రామిక వేత్త కె.ధనుంజయ్రెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర నాయకుడు విజయభాస్కర్రెడ్డి, పి.పెంచలయ్య, చర్ల రవికుమార్, ఆనం ప్రసాదరెడ్డి, రూపక్యాదవ్, ఏ.ఓబుల్రెడ్డి, కోటిరెడ్డి, చిన్నారెడ్డి తదితరులు కూడా వైఎస్సార్సీపీలోకి వచ్చారు. -
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతారా!
నెల్లూరు(అర్బన్): నగర శివారు ప్రాంతాల్లో సర్వీసు రోడ్లు నిర్మంచకుండా నేషనల్ హైవే అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి మండి పడ్డారు. శుక్రవారం కలెక్టర్ బంగ్లాలో భారత్మాల ప్రాజెక్ట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరం కనుపర్తిపాడు, గొలగమూడి క్రాస్రోడ్డు, సింహపురి ఆస్పత్రి క్రాస్రోడ్డు, ఎన్టీఆర్ నగర్, రాజుపాళెం క్రాస్రోడ్డు తదితర ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్పాస్లు లేక జనం ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నా హైవే అధికారులకు చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. టోల్ గేట్లు పెట్టి ప్రజల ముక్కు పిండి డబ్బులు వసూలు చేసుకునే శ్రద్ధ ప్రజల ప్రాణాల పట్ల లేకపోవడం సిగ్గు చేట న్నారు. సర్వీసు రోడ్లు నిర్మించాలని ఒక ఎమ్మెల్యేగా ఢిల్లీ నుంచి గల్లీదాక చెప్పులు అరిగేలా తిరుగుతున్నానని తెలిపారు. ఇదిగో.. అదిగో సర్వీసు రోడ్లు అంటూ కాలయాపన చేస్తారా అని నిలదీశారు. బుజబుజనెల్లూరులో ప్రజల ప్రాణాలకు పెనుసవాలుగా మారిన 300 మీటర్ల సర్వీస్ రోడ్డు అనేక పోరాటాల ద్వారా ఏర్పాటు చేశారన్నారు. అయితే ఇంకా బీటీ రోడ్డుగా మార్చలేదన్నారు. తక్షణమే అక్కడ బీటీ రోడ్డు వేయకపోతే ఎమ్మెల్యేగా తాను కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. కలెక్టర్ ముత్యాలరాజు జోక్యం చేసుకుని ఎమ్మెల్యే కోటంరెడ్డి చెప్పిన సమస్య చాల తీవ్రమైందన్నారు. వెంటనే పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని ఎన్హెచ్ అధికారులను కోరారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ ఈ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్గడ్కరీ దృష్టికి 2016 నవంబర్ 21న, 2018 ఏప్రిల్ 14వ తేదీన తీసుకెళ్లామన్నారు. అయినా కేంద్ర మంత్రి చూద్దాం.. చేద్దాం.. పరిశీలిస్తాం, చర్యలు తీసుకుంటామంటూ కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో జేసీ వెట్రిసెల్వి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మీరు చేస్తారా.. నన్నే చేయమంటారా?
నెల్లూరు సిటీ: బారాషహీద్ దర్గాలో మరుగుదొడ్లు, ఘాట్ నిర్మాణాలకు రూ.కోట్లు ఖర్చు చేశారు.. నిర్వహణ బాధ్యతలు గాలికొదిలేశారని, మరుగుదొడ్లు పరిశుభ్ర పరిచి ఉపయోగంలోకి తెస్తారా లేక తానే శుభ్రం చేయమంటారా అని నెల్లూరు రూరల్ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రశ్నించారు. నగరంలోని బారాషహీద్ దర్గా ఆవరణలోని మరుగుదొడ్లు, ఘాట్ పనుల్లో లోపాలను శనివారం పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారాషహీద్ దర్గా నెల్లూరుకు గర్వకారణమన్నారు. దేశవిదేశాల నుంచి భక్తులు బారాషహీద్ దర్గాను సందర్శిస్తుంటారని తెలిపారు. రూ.కోట్లు ఖర్చు చేసి మరుగుదొడ్లు, ఘాట్ నిర్మాణాలు చేపట్టి నిర్వహణ బాధ్యతలు గాలికొదిలేశారని మండిపడ్డారు. మరుగుదొడ్లులో నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదన్నారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందన్నారు. తాను వస్తున్నానని తెలుసుకుని అప్పటికప్పుడు తూతూమంత్రంగా పైపై పనులు చేశారని పేర్కొన్నారు. ఘాట్ నిర్మాణంలో అక్రమాలకు పాల్పడ్డారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 6వ తేదీ ఉదయం 10 గంటలలోపు మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని, లేనిపక్షంలో ప్రజా సంఘాలతో కలసి రాజకీయాలకు అతీతంగా గాంధీగిరి పద్ధతిలో నిరసన తెలుపుతానన్నారు. అధికారులు స్పందించకపోతే తానే స్వయంగా శుభ్రం చేస్తానని చెప్పారు. మహిళా మరుగుదొడ్లు పక్కన మందు సీసాలు ఉండటం గమనించిన ఎమ్మెల్యే అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ నెల్లూరులో భాగంగా పచ్చదనం పెంపొందిస్తామని గోడలపై రాతలకు మాత్రమే పరిమితమయ్యారన్నారు. బారాషహీద్ దర్గాలో చెట్లు ఎండిపోవడంపై ఇదే మంత్రి నారాయణ, మేయర్ అజీజ్లు చేస్తున్న స్వచ్ఛ నెల్లూరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు తాటి వెంకటేశ్వరరావు, బొబ్బల శ్రీనివాసయాదవ్, అంజా హుస్సేన్, మాళెం సుధీకర్కుమార్రెడ్డి, ఎండీ అబ్దుల్ సలీమ్, డాక్టర్ స త్తార్, రియాజ్, మిద్దె మురళీకృష్ణయాదవ్, సందానీ బాషా, చిన్న మస్తాన్, అలీ నావాజ్, యాకసిరి శరత్చంద్ర, ఎం.శ్రీకాంత్రెడ్డి, టీవీఎస్ కమల్, రా మరాజు, మా దా బాబు, జగదీష్, సింహాచలం, మేఘనాధ్సింగ్, యనమల శ్రీహరియాదవ్, హ జరత్నాయుడు, తుమ్మల శీనయ్య, తాళ్లూరు సురేష్, కట్టా వెంకటరమణయ్య, ప చ్చారవి, మొయిళ్ల సురేష్, ఆండ్ర శ్రీనివాసులు, పేనేటి సుధాకర్, వే ల్పూలు అజ య్, గజరా నరేష్, కమల్రాజ్, హయద్ బాషా, పెద్ద మస్తాన్, తారీఖ్, మందాపెద్దబాబు, దిలీప్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై కక్ష సాధింపు తగదు
నెల్లూరు(సెంట్రల్): ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై అకారణంగా కేసులు పెట్టి, కక్ష సాధింపునకు దిగడం తగదని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు శాశ్వతంగా అధికారంలో ఉంటాయని అనుకోవడం మానుకోవాలని హెచ్చరించారు. నెల్లూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వకర్తలతో కలసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ నాయకులపై ఎటువంటి కేసులు పెట్టినా చట్టం ద్వారా ఎదుర్కొంటామన్నారు. కొందరు తమ ఎమ్మెల్యేలు పెద్ద పొరపాటు చేసినట్లు భూతద్దంలో పెట్టి చూపించి కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం సరికాదన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు ఎన్ని తప్పులు చేసినా చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా చర్యలు తీసుకోని టీడీపీ ప్రభుత్వం, ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోందన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో రెండుసార్లు నోటీసులు అతనికి ఇచ్చారన్నారు. చట్టంపై గౌరవంగా విచారణకు హాజరయ్యారని గుర్తు చేశారు. ఇటీవల ఏడాది పాటు పాదయాత్ర కార్యక్రమాన్ని చేస్తుంటే కేసులు, చార్జిషీట్లు అంటూ వేధించడం సబబు కాదన్నారు. వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం మంచి పద్ధది కాదన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై అక్రమంగా కేసులు పెట్టి వేధించే సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కొత్తగా పెట్టినట్లు ఉందన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలపై పెట్టిన అక్రమ కేసులను చట్టం ద్వారా ఎదుర్కొంటామన్నారు. నెల్లూరు రూరల్ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులో ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి లేవనెత్తిన విషయాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ బెట్టింగ్ కేసులో ఏ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఎలాంటి సంబంధం లేదని ఎస్పీ రామకృష్ణ చెప్పారన్నారు. తరువాత తమకు నోటీసులు జారీ చేశారన్నారు. చట్టంపై గౌరవంతో రెండు సార్లు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యానని గుర్తు చేశారు. ఏడాది తరువాత గతేడాది కేసులో సంబంధం ఉందంటూ నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. తాను క్రికెట్ బుకీ కృష్ణసింగ్తో విజయవాడ హోటల్లో, కడప ఆర్అండ్బీ అతిథి గృహంలో ఉన్నట్లు సీసీ పుటేజీ ఆధారాలు ఉన్నాయని తనపై పోలీసులు చార్జిషీట్ వేయడం జరిగిందన్నారు. కడప, విజయవాడకే కాకుండా దేశంలో ఎక్కడైనా హోటల్లో కృష్ణసింగ్ను తాను కలిసినట్లు ఆధారాలు చూపితే గంటలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఇటీవల నెల్లూరులో హత్యలు చేసిన ఓ సీరియల్ కిల్లర్ చంద్రబాబుతో ఫొటో కూడా దిగి ఉన్నారన్నారు. ఆ మాత్రన చంద్రబాబుకు, ఆ హత్యలకు సంబంధం ఉందా అంటూ ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా తన పరువుకు భంగం కలిగేలా పోలీసులు పత్రికలకు లీకులు ఇవ్వడం సరికాదన్నారు. దమ్ముంటే సీసీ పుటేజ్ను బయటపెట్టాలన్నారు. సమావేశంలో నగర, కావలి, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు పి.అనిల్కుమార్, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, కిలివేటి సంజీవయ్య, జెడ్పీ చైర్మన్, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, గూడూరు నియోజకవర్గ సమన్వకర్త మేరిగ మురళీధర్, పార్టీ సీనియర్ నాయకులు ఎల్లసిరి గోపాల్రెడ్డి తదితరలు, పాల్గొన్నారు. -
ఆధారాలు చూపితే గంటలో రాజీనామా చేస్తా
నెల్లూరు(సెంట్రల్): తాను క్రికెట్ బుకీలను విజయవాడ, కడపలో కలిసి మాట్లాడినటు ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ఆధారాలు చూపితే గంటలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఎస్పీకి బహిరంగ సవాల్ విసిరారు. నగరంలోని రూరల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బెట్టింగ్ నిర్మూలనకు ఎస్పీ ఎటువంటి చర్యలు తీసుకున్నా తాను మద్దతు ఇస్తామన్నారు. కానీ రాజకీయ ప్రోద్భలంతో, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ కేసుల్లో ఇరికించే వాటికి వ్యతిరేకమన్నారు. పదిహేను నెలలుగా తాను పరారీలో ఉన్నట్లు కోర్టులో ఎస్పీ చార్జీషీట్ వేయడం చూస్తేనే ఈ కేసు ఎంత రాజకీయ రంగు పులుముకుని ఉందో తెలుస్తుందన్నారు. తాను ఏ పోలీసు అధికారికి ఫోన్ చేసి బుకీలను వదలమన్నానో ఆ పోలీసు అధికారుల పేర్లు స్పష్ట చేయాలన్నారు. బుకీలుగా ఉన్న వారు మంత్రులకు సన్మానాలు, విందులు ఇస్తే వారి పేర్లను చార్జీషీట్లో నమోదు చేయడానికి, వారికి నోటీసులు ఇవ్వడానికి ఎస్పీ రామకృష్ణ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించం ఎస్పీ రామకృష్ణ జిల్లా పోలీసు బాస్ అనే అహంకారంతో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేస్తే సహించేది లేదన్నారు. నిజాయితీగా ఉన్నానంటున్న ఎస్పీ కొందరు పోలీసులు బుకీలతో మాట్లాడిని కాల్ డేటాను ఎందుకు బహిర్గతం చేయలేదో చెప్పాలన్నారు. రాజకీయ దురద్దేశంతో కావాలని కక్షసాధింపుగా తనపై కేసులు నమోదు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించాలంటే మాత్రం న్యాయపోరాటం ద్వారా ఎదుర్కొంటానన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎస్పీని కలవాలని కోరితే తాను వివిధ పనుల్లో ఉన్నానంటూ తనకు సమాధానంగా ఎస్పీ ఎస్ఎమ్మెఎస్ పంపారన్నారు. కానీ అన్ని విషయాలను లిఖిత పూర్వకంగా ఎస్పీకి రిజిష్టర్ పోస్టులో పంపుతున్నాన్నారు. పత్రికలకు నోటీసులు జారీ చేస్తా తాను ఏ తప్పు చేయలేదని, ఏదైనా తప్పు చేసి ఉంటే ఆధారాలు చూపమని మొదటి నుంచి చెబుతున్నానని, కాని కొందరు పోలీసులు శాఖలోని లీకు వీరుల సాయంతో, వారి మాటల ఆధారంగా తనపై అసత్య కథనాలు రాస్తున్న కొన్ని పత్రికలకు, టీవీ చానల్స్కు కోర్టు ద్వారా నోటీసులు ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి చెప్పారు. కనీసం తాను బెయిల్ కూడా తెచ్చుకోనని, తాను ఏ తప్పు చేయలేదని చెబుతున్నా కావాలని పనిగట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్న వారిని న్యాయం స్థానం ముందు నిలబెడతానన్నారు. న్యాయపరంగానే పోరాటం చేద్దాం నెల్లూరు (సెంట్రల్): ప్రభుత్వ ఒత్తిడితో నమోదయ్యే తప్పుడు కేసులపై న్యాయపరంగానే పోరాటం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, శాసనసభా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. శుక్రవారం నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డితో ఫోన్లో వైఎస్ జగన్ మాట్లాడారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ఫోన్ చేసి కేసు విషయాలు మాట్లాడి అధైర్య పడొద్దని సూచించారు. రాజకీయ కక్షతో పెట్టే కేసులను న్యాయ పరంగానే ఎదుర్కొని పోరాడదామని సూచించారు. పార్టీ నేతలు, శ్రేణులు అందరు అండగా ఉంటారని ధైర్యం చెప్పారు. -
ఏపీకి మోదీ-బాబు జోడి ద్రోహం చేసింది
-
రాజధాని రోడ్ల నిర్మాణంలో భారీ అవినీతి..
సాక్షి, నెల్లూరు: రాజధాని రోడ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. మంత్రులు నారాయణ, లోకేష్ కనుసన్నల్లో రూ. 400కోట్ల కుంభకోణం చోటుచేసుకుందని ఆయన ఆరోపించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ కుంభకోణంలో రూ. 100కోట్లు అడ్వాన్స్గా తీసుకున్నారని పేర్కొన్నారు. అంతేకాక ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి రుణం తీసుకుని.. 5వేల కిలోమీటర్ల మేర రోడ్డు వేయనున్నారు. దీంట్లో 5 నుంచి 10 శాతం కమీషన్ మంత్రులు తీసుకుంటున్నారని కోటం రెడ్డి తెలిపారు. -
టార్గెట్ ఎమ్మెల్యే కోటంరెడ్డి
సాక్షిప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని టార్గెట్ చేసి మరోమారు పోలీసులు కక్షసాధింపు చర్యలకు తెరతీశారు. కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్న ప్రతి సందర్భంలోనూ బెట్టింగ్ కేసుల్లో విచారణ అంటూ హడావుడిచేసి రాజకీయంగా ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమానికి పూనుకుంటున్నారు. తాజాగా బుధవారం ఎమ్మెల్యే కోటంరెడ్డికి పోలీసులు నోటీసు ఇవ్వడానికి వెళ్లడం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. అది కూడా గతేడాది మార్చిలో నమోదైన ఓ కేసులో విచారణకు ఇప్పుడు పిలవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బుధవారం ఉదయం 7.45 గంటకు నగర డీఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ నేతృత్వంలో పోలీసుల బృందం ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇంటికి వెళ్లారు. ఉదయం 7.30గంటలకు విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బుధవారం కీలకపరిణామాలు చోటుచేసుకున్నాయి. అసలు ఏం జరిగిందంటే.. ఉదయం 7.45 గంటలకు నగర డీఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ నేతృత్వంలో నెల్లూరు రూరల్ డీఎస్పీ రాఘవరెడ్డి, ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ ఎన్.సుధాకర్, ఇన్స్పెక్టర్ల బృందం చిల్డ్రన్స్పార్కు రాంజీవీధి సాయి సౌజన్య హోమ్స్ అపార్ట్మెంట్లోని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఇంటికి వెళ్లారు. రెండోనగర పోలీసుస్టేషన్లో నమోదైన 54/2017కేసులో 7.30 గంటలకు బాలాజీనగర్ పోలీసుస్టేషన్లో విచారణకు హాజరుకావాలని 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీచేశారు. దీనిపై కోటంరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 7.30గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొని 7.45 గంటలకు నోటీసు జారీచేయడం ఏమిటని ప్రశ్నించారు. అక్కడి నుంచి జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణకు ఫోన్ చేసి పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఓ పథకం ప్రకారమే ఇబ్బందులకు గురిచేస్తున్నారని, దీనిని తాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఇంతలో నగర డీఎస్పీ ఆదేశాల మేరకు నగరంలోని పోలీసు అధికారులు, సిబ్బంది ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకున్నారు. గంటసేపు మల్లగుల్లాలు పడిన పోలీసు అధికారులు గురువారం ఉదయం 9 గంటలకు విచారణ కోసం బాలాజీనగర్ పోలీసుస్టేషన్కు రావాలని రెండో నోటీసును జారీ చేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. కేసు ఇదేనట గతేడాది మార్చి 22వ తేదీన నెల్లూరు తూర్పు రైల్వేక్వార్టర్స్లో బెట్టింగ్ జరుగుతోందన్న సమాచారం మేరకు అప్పటి రెండోనగర ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణారెడ్డి తన సిబ్బందితో కలిసి దాడిచేశారు. దాడిలో బెట్టింగ్ నిర్వాహకులైన జెండావీధికి చెందిన షేక్ రషీద్, రాజీవ్గృహకల్పకు చెందిన ఎ.శ్రీనివాసులతో పాటు పంటర్లు రవి, శివ, శ్రీకాంత్, ప్రభు, మనోజ్, వెంకి, రామారావు, జనార్దన్, సతీష్, గణేష్, అక్రమ్, అంకిత్, జ్ఞానయ్యపై 3అండ్4 ఏపీ గేమింగ్ యాక్ట్ కింద(ఎఫ్ఆర్నెం.54/17)కేసు నమోదు చేశారు. దాడి సమయంలో శ్రీనివాసులు దొరకడంతో అతడ్ని పోలీసులు అరెస్ట్చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం ఈ కేసుకు సంబంధించి పలువుర్ని అరెస్ట్ చేశారు. దాదాపు ఏడాది అనంతరం సదరు కేసులో మీ ప్రమేయం ఉందంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి నోటీసులు జారీచేయడం జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కేసు నిర్వహించిన సీఐ బదిలీపై వెళ్లిపోయారు. అప్పుడు ఎస్పీగా విశాల్గున్నీ ఉన్నారు. ఏడాది తర్వాత కేసులో ప్రమేయం ఉందని పేర్కొనడం వెనుక పోలీసులు అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఓ పథకం ప్రకారం ఎమ్మెల్యేను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవసరమైతే ఆమరణదీక్షకు కోటంరెడ్డి క్రికెట్ బెట్టింగ్ కేసులో గురువారం ఎమ్మెల్యేను విచారించడానికి వీలుగా పోలీసులు నోటీసులు జారీచేశారు. కక్షసాధింపు చర్యలను తిప్పికొట్టేందుకు ఎమ్మెల్యే తన అనుచరులతో బుధవారం సమావేశమయ్యారు. నంద్యాల ఉప ఎన్నిక, ప్రస్తుతం రాజ్యసభ నామినేషన్ల సమయంలో కేసుల్లో విచారణ పేరిట ఇబ్బందులకు గురిచేయడం కక్షసాధింపు చర్యల్లో భాగమేనని పేర్కొన్న ఎమ్మెల్యే గురువారం విచారణకు హాజరయ్యేది లేదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అం దులో భాగంగా తన కార్యాలయంలో కార్యకర్తలతో ఉండనున్నట్లు తెలిసింది. పోలీసులు అరెస్ట్ చేయాలని చూస్తే కార్యాలయం నుంచే ఆమరణదీక్షకు పూనుకోనున్నట్లు తెలిసింది. -
‘జగన్ పోరాటం వల్లే హోదాపై ఆశలు సజీవం’
సాక్షి, నెల్లూరు : ప్రత్యేక హోదాపై ఆశలు సజీవంగా ఉన్నాయంటే ప్రతిపక్షనేత, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గత నాలుగేళ్లుగా చేస్తున్న పోరాటమే కారణమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. జననేత చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 100వ రోజు సందర్భంగా నగరంలోని 100 ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. ఓటుకునోటు కేసుకు భయపడి, పోలవరం ప్రాజెక్టులో కమిషన్లకు కక్కుర్తిపడి సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను గాలికి వదిలేసారని ధ్వజమెత్తారు. ఎన్నికలు దగ్గర పడటంతో చంద్రబాబు డ్రామాలు మొదలు పెట్టారని మండిపడ్డారు. -
2019లో రైతు రాజ్యం వస్తుంది
2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలుపొందుతారని, రైతు రాజ్యం రావడం కచ్చితమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ తదితర సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయుడు మాట్లాడుకునే విధంగా వైఎస్సార్ పరిపాలన చేశారన్నారు. ఆ మహనీయుడు ఈ రోజు లేకపోయినా ఆయన ప్రాణం అయిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మనముందు ఉన్నారన్నారు. మాటతప్పని వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని, ఈ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ ఆయన గెలుపుకోసం కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి -
ప్రజల మధ్యనే రూరల్ఎమ్మెల్యే
నెల్లూరు(సెంట్రల్): నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చేపట్టిన ప్రజాబాట కార్యక్రమం నేటితో 100 పూర్తి చేసుకోనుంది. కార్యక్రమంలో భాగంగా ఆయన 40 గ్రామాల్లోని 94 కాలనీల్లో పర్యటించారు. దాదాపు 40,074 ఇళ్లు తిరిగి సుమారు 1,30,000 మంది ప్రజలతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ప్రతి గడపకుపోవాలనే ఉద్దేశంతో ‘మన ఎమ్మెల్యే–మన ఇంటికి’ పేరుతో 105 రోజుల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో 100 రోజుల పాటు ఇంటికి దూరంగానే ఉన్న ఆయన ప్రజలు, కూలీలతో సహపంక్తి భోజనాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. ఏ ప్రాంతానికి వెళ్లినా స్థానికులు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. కాగా కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఆయన దృష్టికి తెచ్చిన క్లిష్టమైన సమస్యలపై అధికారులతో చర్చించి పరిష్కార మార్గాలు చూపడం గమనార్హం. సమస్యల గుర్తింపు పాదయాత్రలో ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి అత్యంత పేదరికంలో ఉన్న ప్రజలకు స్థలాలు, పక్కా ఇళ్లు లేక పోవడం, కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు, తాగునీటి ఇబ్బందులు, సీసీ రోడ్లు లేకపోవడం వంటి వాటిని గుర్తించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ప్రజలకు భరోసా ఇస్తున్నారు. -
నాకు అవసరం లేదు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్ సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి మరోమారు ప్రభుత్వం కేటాయించిన గన్మెన్లను నిరాకరించారు. మూడున్నర ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజే పోలీసు భద్రతా విభాగం ఇద్దరు గన్మెన్లను ఆయనకు కేటాయించింది. తనకు అవసరం లేదంటూ అప్పట్లోనే జిల్లా ఎస్పీకి లేఖద్వారా తెలిపారు. తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలను అనుసరించి మరో రెండుసార్లు గన్మెన్లను ప్రభుత్వం కేటాయించగా తిప్పి పంపారు. తాజాగా సోమవారం మళ్లీ ఇద్దరు గన్మెన్లను కేటాయించగా.. ఈసారీ వెనక్కి పంపారు. పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్న క్రమంలో భద్రత తప్పనిసరి అని, అందుకే పంపామని పోలీస్ అధికారులు ఎమ్మెల్యే కోటంరెడ్డికి స్పష్టం చేశారు. అయితే, తనకు ఎలాంటి భద్రత అవసరం లేదంటూ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి డీజీపీ, ఇంటిలిజెన్స్ డీజీ, జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. తనకు భద్రత వద్దని, పార్టీ కార్యకర్తలు, ప్రజలే తనకు కొండంత అండ అని తెలిపారు. -
'మన ఎమ్మెల్యే.. మన ఇంటికి'
-
చంద్రబాబు బెదిరింపులకు భయపడేది లేదు
► పోలీసుల చేత పొలిటికల్ డ్యూటీ చేయిస్తున్నారు ► బుకీలతో మాట్లాడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసు అధికారులకు నోటీసులిచ్చి విచారించండి ► వైఎస్సార్ సీపీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నెల్లూరు సిటీ : సీఎం చంద్రబాబునాయుడి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, జిల్లా పోలీసు యంత్రాంగం చేత ఆయన పోలీసు డ్యూటీ కాకుండా పొలిటికల్ డ్యూటీ చేయిస్తున్నారని వైఎస్సార్ సీపీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఒకటన్నర గంటపాటు శ్రీధర్రెడ్డిని రెండోసారి క్రికెట్ బెట్టింగ్ కేసులో విచారణ జరిపారు. అనంతరం శ్రీధర్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. మొదటి విచారణలో ఏవైతే ప్రశ్నలు వేశారో అవే ప్రశ్నలు మళ్లీ వేశారన్నారు. కొత్తగా బెంగళూరులో అకౌంట్ ఉందా? మీకు అకౌంట్ ఉన్నట్లు మా వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని పోలీసులు చెప్పారని ఎమ్మెల్యే తెలిపారు. తనకు అకౌంట్లు లేవని స్పష్టం చేశానన్నారు. తన అకౌంట్లు, కుటుంబసభ్యుల బ్యాంకు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రశ్నలు, మాటలు తప్ప తనపై వచ్చిన ఆరోపణలకు ఒక్క ఆధారం కూడా చూపించలేదని తెలిపారు. తనకు నోటీసులు ఇవ్వడం వెనుక రాజకీయ కుట్ర ఉందని స్పష్టం అవుతుందన్నారు. బాధ్యతగల ఎమ్మెల్యేగా విచారణకు సహకరిస్తున్నట్లు తెలిపారు. రూరల్ నియోజకవర్గ ప్రజలు తమ ఇంటి బిడ్డగా అధికార పార్టీ తీరును నిరసించాలని కోరారు. నా జీతాన్ని పేదలకు ఖర్చుచేశాను.. ఎమ్మెల్యేగా తనకు వచ్చే జీతాన్ని పేద ప్రజల కోసం ఖర్చుచేస్తున్నట్లు తెలిపారు. శ్మశానవాటికలు, వాటర్ప్లాంట్ల నిర్మాణాలు చేపట్టినట్లు వెల్లడించారు. తనపై ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా భయడపడనని చెప్పారు. ప్రభుత్వాలు ఎప్పుడూ ఒకటే ఉండవనే విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు. అధికార పార్టీ అహంకారానికి వ్యతిరేకంగా మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఎదురొడ్డి పోరాటం చేస్తానని తెలిపారు. అధికారం చేతుల్లో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించి బుడ్డ బెదిరింపులకు దిగితే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు భయపడరని చెప్పారు. పూర్తి విచారణ చేస్ వెలుగులోకి నిజాలు పోలీసు ఉన్నతాధికారికి మూడు సూచనలు ఇస్తున్నట్లు తెలిపారు. తొమ్మిది మంది క్రికెట్ బుకీల ఫోన్ కాల్లిస్ట్ను పరిశీలించాలన్నారు. ఏడాదిగా వీరు తరచూ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో గంటల తరబడి మాట్లాడారన్నారు. గన్మన్లు, డ్రైవర్లచే పోలీసు అధికారులు బుకీలతో మాట్లాడిన విషయాలు బయటపెట్టాలని కోరారు. గోవా పర్యటనలో మేయర్ అజీజ్కు కృష్ణసింగ్ ఆర్థికంగా సహాయపడ్డారా? అని ప్రశ్నించారన్నారు. దీనిపై అజీజ్ను విచారణ చేయాలన్నారు. బెట్టింగ్లో 400 మంది చిన్నచిన్న వారిని అరెస్ట్ చేశారన్నారు. బెట్టింగ్ను కూకటివేళ్లతో లేకుండా చేయాలనే పోలీసుల చర్యలు అభినందనీయమన్నారు. అయితే బెట్టింగ్కు పాల్పడుతున్న వారిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరూ లేరా అని ప్రశ్నించారు. ఆ దిశగా విచారణ సాగించాలన్నారు. ఈ మూడింటిపై విచారణ జరపాలన్నారు. లేనిపక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా భారీగా జిల్లా ఎస్పీ కార్యాలయం వద్దకు ఎమ్మెల్యే మద్దతుదారులు చేరుకున్నారు. అధికార పార్టీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్పీ కార్యాలయం నుంచి శ్రీధర్రెడ్డి ర్యాలీగా కేవీఆర్ పెట్రోల్ బంకు వద్ద ఉండే ఆయన కార్యాలయానికి కాలినడకన వెళ్లారు. -
రాజకీయ కుట్ర
► నెల్లూరు రూరల్, సిటీ ఎమ్మెల్యేలపై వేధింపుల పర్వం ► సీఎం పేషీ నుంచి పోలీసులకు ఆదేశాలు ► నంద్యాల ఉప ఎన్నికలో చురుగ్గా ప్రచారం నిర్వహించారనే అక్కసు ► బెట్టింగ్ కేసులో ఎమ్మెల్యేల పాత్ర లేదని మూడుసార్లు ప్రకటించిన ఎస్పీ ► చివరకు నోటీసులు జారీ ► నేడు ఎస్పీ ఎదుట హాజరు కానున్న కోటంరెడ్డి, అనిల్కుమార్ సాక్షి ప్రతినిధి, నెల్లూరు : బెట్టింగ్ రాకెట్ వ్యవహారం పోలీసుల చేయి దాటిపోయింది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు పాత్రధారులుగా మిగలగా.. తెరవెనుక ప్రభుత్వ పెద్దలు సూత్రధారులై రాజకీయ కుట్రకు తెరలేపారు. ముగిసిపోయిన కేసును మళ్లీ తెరిచి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను వేధించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో చురుగ్గా పాల్గొనడం, నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో బలమైన కేడర్ పెంచుకుని నిత్యం ప్రజలతో మమేకమయ్యే ఇద్దరు ఎమ్మెల్యేలను ప్రభుత్వం టార్గెట్ చేసింది. క్రికెట్ బెట్టింగ్ కేసుల్లో సాక్ష్యాల కోసం విచారణకు రావాలంటూ వారిద్దరికీ నోటీసులు జారీ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సీఎం పేషీ ఆదేశాల మేరకు మొన్నటి వరకు జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ చేతిలో ఉన్న బెట్టింగ్ రాకెట్ కేసు వ్యవహారం ఇప్పుడు ఉన్నత స్థాయికి చేరింది. పోలీస్ ఉన్నతాధికారులు సీఎం పేషీ నుంచి అందుతున్న ప్రత్యేక ఆదేశాల మేరకు నడుచుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. బెట్టింగ్ వ్యవహారంలో ఎమ్మెల్యేల పాత్ర లేదని జిల్లా ఎస్పీ రామకృష్ణ మూడుసార్లు ప్రకటించారు. కృష్ణసింగ్ అరెస్ట్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇదే విషయాన్ని చెబుతూ వచ్చారు. మారిన రాజకీయ సమీకరణలు, నంద్యాల ఉప ఎన్నిక వేడి వంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కక్ష సాధింపు చర్యలకు దిగి ఈ కేసును పావుగా వాడుకుంటున్నారు. ఇందులో భాగంగానే నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలకు జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 16వ తేదీన సిద్ధం చేసిన నోటీసులను 20వ తేదీన వారికి నంద్యాలలో అందజేశారు. ఈనెల 22న విచారణకు హాజరుకావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. వాస్తవానికి జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం తీవ్ర దుమారమే రేపింది. ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ బాధ్యతలు స్వీకరించాక బెట్టింగ్ రాకెట్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలో రెండు పర్యాయాల్లో 230 మంది వరకు బుకీలు, పంటర్లను అరెస్ట్ చేశారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ద్వితీయశ్రేణి నేతలతోపాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారందరినీ అరెస్ట్ చేశారు. ఇంతవరకు పోలీసులు అత్యంత సమర్ధవంతంగా కేసును కొనసాగించారు. జిల్లా ఎస్పీ తీరుపై సర్వత్రా ప్రశంసలు కూడా వెల్లువెత్తాయి. కేసులో ముగ్గురు కీలక వ్యక్తులు మాత్రమే అరెస్ట్ కావాల్సి ఉందని, వారి అరెస్ట్ పూర్తయ్యాక కేసు ముగుస్తుందని గతంలోనే పోలీసులు ప్రకటించారు. కీలక బుకీగా ఉన్న కృష్ణసింగ్ ఆస్తుల వ్యవహారానికి సంబంధించి న్యాయపరంగా ముందుకు సాగడానికి వీలుగా నిపుణులతో సంప్రదించి ఆ మేరకు కసరత్తు మొదలుపెట్టారు. బెట్టింగ్ వ్యవహారంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన బ్రహ్మనాయుడు, దువ్వూరు శరత్చంద్ర, అతని కుమారుడు దొరకాల్సి ఉండగా.. వీరిలో బ్రహ్మనాయుడు పోలీసులకు లొంగిపోవడంతో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇక శరత్చంద్ర, అతని కుమారుడు మాత్రమే దొరకాల్సి ఉంది. దీంతో కేసు కూడా దాదాపుగా ముగిసినట్టే. ఏం లేదంటూనే నోటీసులు బెట్టింగ్ వ్యవహారం మొదలైనప్పటి నుంచీ ఎమ్మెల్యేలెవరికీ సంబంధం లేదని చెబుతూనే పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 3వ తేదీన కృష్ణసింగ్ను అరెస్ట్ చేసిన సందర్భంలో ఎస్పీ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ మం త్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ముఖ్యు ల పాత్ర లేదని, తమకు ఆ దిశగా తమకు ఇప్పటివరకు ఆధారాలు లభించలేదని చెప్పారు. తర్వాత 14వ తేదీన ఎల్లో మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఎస్పీని కలసి ఎవరి పాత్ర ఉన్నా అరెస్ట్ చేసి విచారించమని కోరారు. ఎవరి పాత్రకు సంబంధించి ఇప్పటివరకు ఆధారాలు లేవని ఆయనకు ఎస్పీ స్పష్టం చేశారు. 18వ తేదీన వెంకటగిరి పోలీసు స్టేషన్ తనిఖీకి వెళ్లిన ఎస్పీ అక్కడి విలేకర్లతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇలా ఏమీ లేదని మూడుసార్లు చెప్పి.. చివరకు నోటీసులు జారీ చేయడం వెనుక ఆంతర్యంపై జిల్లా అంతటా చర్చ సాగుతోంది. ఉన్నత స్థాయినుంచి పోలీసులకు ఒత్తిళ్లు రావడం వల్లే ఇలా చేసినట్టు తెలుస్తోంది. సీఎం పేషీ నుంచి కూడా పోలీసు బాస్లపై ఒత్తిళ్లు పెరగడంతో నోటీసులు జారీ అయినట్టు సమాచారం. కొన్ని సాక్ష్యాలు సేకరించాలని, అలాగే కొన్ని అంశాలపై స్పష్టత కోసం గంట సమయం మాత్రమే విచారణ జరుపుతామని ఎమ్మెల్యేలకు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. అయితే రాజకీయంగా దెబ్బతీయడానికే పోలీసుల ద్వారా అధికార పార్టీ ఈ చర్యకు పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. -
కావాలనే నోటీసులు జారీ చేశారు
-
'చంద్రబాబు పొలిటికల్ అఘోరా'
సాక్షి, నంద్యాల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి గుణపాఠం చెప్పాలంటే రాష్ట్ర ప్రజలకు 2019 దాకా అవకాశం లేదని, ఈ విషయంలో నంద్యాల ప్రజలు అదృష్టవంతులని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. బాబుకు బుద్ధి చెప్పే అవకాశం నంద్యాల ప్రజల కాళ్ల ముందే ఉందని చెప్పారు. చంద్రబాబు ఓ పొలిటికల్ అఘోర అని అన్నారు. ఉప ఎన్నికలో వైఎస్ఆర్సీపీని గెలిపించి టీడీపీకి బుద్ధి చెప్పాలని నంద్యాల ప్రజలను కోరారు. శుక్రవారం కర్నూలు జిల్లా నంద్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ నేతలు రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, నారాయణ స్వామిలతో కలసి ఆయన మాట్లాడారు. రాచమల్లు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీకి ఓటెయ్యడానికి ఒక్క కారణమైనా చూపాలని ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు. ఓట్లెయమని అడిగేముందు ఒక్క హామీనైనా నెరవేర్చమా? అనే తలంపు టీడీపీ నాయకులకు వస్తుందని అన్నారు. 'ఫ్యాన్ గుర్తుపై గెలిచిన భూమా నాగిరెడ్డి మంత్రి పదవి కోసం పార్టీ ఫిరాయించారు. అలాంటి వారికి మళ్లీ ఓట్లెసి గెలిపించాలా?. నంద్యాల ప్రజలు ఒకటి గుర్తుంచుకోవాలి. ఎన్నికల్లో పార్టీ ఫిరాయించిన వారికి ఓట్లెసి గెలిపిస్తే.. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకు మీరు ఇచ్చే సలహా పార్టీ మారమనేలా ఉంటుంది. నంద్యాల ప్రజలు న్యాయం వైపు నిలుస్తారని భావిస్తున్నా.' -
'చంద్రబాబు పొలిటికల్ అఘోరా'
-
రచ్చ..రచ్చ
►ఇఫ్కో భూముల అక్రమాలపై వాగ్వాదం ►పసుపు అవినీతిపై అరుపులే అరుపులు ►జెడ్పీ జనరల్ బాడీలో వాడీవేడి చర్చ ఇవిగో అధికారపార్టీ అక్రమాలు.. సాక్ష్యాలు ఇవిగో.. అవినీతి అక్రమాలను రుజువుచేస్తాం అంటూ ప్రతిపక్ష నాయకులు.. రండి తేల్చుకుందాం అంటూ అధికారపార్టీ నాయకులు.. ప్రతి అంశంపై వాగ్వాదం.. ఇలా జెడ్పీ సమావేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకులు నడుమ ఆద్యంతం వాడీవేడి చర్చ సాగింది. నెల్లూరు(క్రైమ్): జెడ్పీ సమావేశమందిరంలో జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అధ్యక్షతన ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇఫ్కో కిసాన్సెజ్ భూముల అక్రమాలపై, అనుమతులు లేకుండా విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయడంపై కొడవలూరు జెడ్పీటీసీ సభ్యుడు శ్రీధర్రెడ్డి ప్రశ్నించారు. రైతులకు పరిహారం ఇవ్వకుండా అక్కడ ఏర్పాటు చేస్తున్న కాలుష్యకారకాలైన పరిశ్రమలను అడ్డుకోవాలన్నారు. కిసాన్సెజ్కు సంబంధించి మొత్తం 3,370ఎకరాలు సేకరించిన ఇఫ్కో యాజమాన్యం కేవలం 242 ఎకరాలకే పరిహారం చెల్లించిందన్నారు. ఇండస్ట్రియల్ పార్క్కు సంబంధించి రూ.కోట్లు దుర్వినియోగం అయ్యాయన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని పట్టుబట్టారు. ఈ విషయమై ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అధికారులను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేయడంతో పాటు జెడ్పీటీసీ సభ్యుడి ఆరోపణలు నిరాధారమని కొట్టిపారేశారు. ఈ క్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి జోక్యం చేసుకుని కిసాన్ సెజ్పై ఆరోపణలు చేస్తుంటే అడ్డుకోవడం సబబుకాదన్నారు. తాము పారిశ్రామికీకరణకు వ్యతిరేకం కాదని, అయితే రైతులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని చెప్పారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ పరిశ్రమలు పెట్టిన వారు నిబంధనలు పాటించడం లేదన్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదనీ, సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనుల చేయడం లేదని పేర్కొన్నారు. పరిశ్రమలకు సంబం«ధించిన సమస్యలపై చర్చించేందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చిం చాలని ఎమ్మెల్యేలు కోరారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నీరు–చెట్టు, ఫైబర్ చాక్డ్యామ్ల అవినీతిపై ఆగ్రహావేశాలు నీరు–చెట్టు వ్యవహారంపై స్వపక్ష, విపక్షలా మధ్య రభస జరిగిం ది. నీరుచెట్టు పేరుతో బూటకపు పనులు చేస్తున్నారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆరోపించారు. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని పత్రికల్లో ప్రచురితమైన కథనాలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. తన నియోజకవర్గంలో నీరు–చెట్టు పథకం కింద అవసరమైన చోట చెక్డ్యామ్లు కట్టమంటే కట్టడం లేదన్నారు. ఫలితంగా నెర్రికాలువ పూడికతీత పనులు రైతులు చందాలువేసుకుని చేసుకుంటున్నారన్నారు. ఎందుకిలా జరుగుతుందని ఆయన అధికారులను నిలదీశారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర స్పందిస్తూ జిల్లాలో వేల పనులు ఒక్కసారిగా జరుగుతున్నాయని అక్కడక్క డా పొరపాట్లు జరిగి ఉంటాయే తప్ప పథకమే తప్పని చెప్పడం సరికాదన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో జరుగుతున్న ఫైబర్ చెక్డ్యామ్లపై ఉదయగిరి ఎంపీపీ సుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇందుకు ఎమ్మెల్సీ బీద అభ్యంతరం తెలియజేస్తూ ఫైబర్ చెక్డ్యామ్లు ముఖ్యమంత్రి మోడల్గా తీసుకొంటే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుండటం సరికాదన్నారు. ఈ దశలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి ఫైబర్డ్యామ్ నిర్మాణాలపై పత్రికలు వరుస కథనాలను ప్రచురిస్తున్నాయనే విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. పసుపుపై అరుపులే..అరుపులు అవినీతి కుంభకోణాలతో ఇటీవల జిల్లాలో సంచలనం సృష్టించిన పసుపు కుంభకోణం జెడ్పీ సమావేశాన్ని అట్టుడికించిం ది. అధికారపార్టీ నాయకులే పథకం ప్రకా రం పొలాలు లేకున్నా ఉన్నట్లు చూపి అవి నీతికి పాల్పడ్డారని వైఎస్సార్సీపీ నాయకులు ధ్వజమెత్తారు. జిల్లాలో సుమారు రూ.14 కోట్లమేర పసుపు కుంభకోణం జరిగిందని దీనిపై నిగ్గుతేల్చాలని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సమగ్ర విచారణ జరిపి దోషులను చట్టపరంగా శిక్షించాలన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ పసుపు కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి అందుకు బాధ్యులైన వారు ఏ పార్టీకి చెందిన వారైనా చర్య తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. రెండు, మూడురోజుల్లో నివేదిక పసుపు కుంభకోణంను నిగ్గుతేల్చేందుకు ఇదివరకే జేసీ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశామని కలెక్టర్ ముత్యాలరాజు చెప్పారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసి వాస్తవాలను వెలికితీస్తామని చెప్పారు. రెండు, మూడురోజుల్లో నివేదిక అందుతుందని అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదుచేస్తామని, ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకొంటామని వెల్లడించారు. ఫొటోలేదని.. జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఆరోతరగతి నుంచి పదోతరగతి వరకు ఇస్తున్న మార్గదర్శి ప్రత్యేక స్టడీ మెటీరియల్ను సైతం రచ్చలోకి లాగేందుకు అధికారపార్టీనేతలు ప్రయత్నించారు. జెడ్పీ, కలెక్టర్ ఇచ్చిన ఇన్నోవేటివ్ నిధులతో ప్రత్యేక మెటీరియల్ రూపొందించారు. అయితే దానిపై ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రి ఫొటో లేదని టీడీపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. ప్రతి ఏడాదీ పదోతరగతి స్టడీ మెటిరీయల్లో ఎలా ఉందో అలానే ముద్రించామని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి ఎదురు దాడికి దిగారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జెడ్పీ చైర్మన్ ఉచితంగా మార్గదర్శిని పేరిట పుస్తకాలు పంపిణీ చేస్తుంటే ఇంత రాద్ధాంతం ఎందుకని వైఎస్సార్సీపీ ఎమ్మల్యేలు కాకాణి, రామిరెడ్డి ప్రశ్నించారు. సమావేశంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ పొట్టేళ్ల శిరీష, కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు. కాగా సభలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాగ్వాదం చేసుకుంటుండగా ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు తమకు అవకాశం ఇవ్వాలని పలుమార్లు తమ స్థానాల్లో నిలుచున్నారు. అవకాశం దొరికినప్పుడు తమ సమస్యలను వివరించేందుకు ప్రయత్నించారు. -
మద్యంపై యుద్ధం
నెల్లూరు (సెంట్రల్) : ఇళ్లమధ్య మద్యం దుకాణాల ఏర్పాటును నిరసిస్తూ మహిళలు చేపట్టిన ఉద్యమం మరింత ఉధృతరూపం దాల్చింది. మంగళవారం కూడా జిల్లాలో పలుచోట్ల ధర్నాలు, నిరసన కార్యక్రమాలు జరిగాయి. నెల్లూరు నగరంలోని తల్పగిరి కాలనీలో మద్యం షాపు వద్దంటూ స్థానికులు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ ధర్నాలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పాల్గొని మద్దతు తెలిపారు. స్థానిక బొల్లినేని హాస్పిటల్ సమీపంలో మద్యం షాపు వద్దంటూ సీపీఎం నాయకులు ఎస్కే షాహినాబేగం, ఎ.రమమ్మ, ఎస్కే షంషాద్ ఆధ్వర్యంలో మహిళలు ఇన్చార్జ్ కలెక్టర్ ఇంతియాజ్కు వినతిపత్రం అందజేశారు. సర్వేపల్లి నియోజక వర్గంలోని ముత్తుకూరులో జనావాసాల మధ్య మద్యం షాపులు వద్దంటూ మహిళలు ధర్నా చేశారు. అక్కడ ఉన్న రెండు దుకాణాలను మూయించారు. వెంకటాచలం మండలం గుడివాడతోపులో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదంటూ ఆందోళన చేపట్టారు. కావలి పట్టణంలోని టీచర్స్ కాలనీలో మద్యం దుకాణం ఏర్పాటుకు వ్యతిరేకంగా స్థానికులు ధర్నా చేశారు. -
టీడీపీ అరాచకానికి తీవ్ర మనస్థాపానికి గురైన కోటమరెడ్డి
-
అభివృద్ధి కోసం ఆమరణదీక్షకైనా సిద్ధమే
నెల్లూరు సిటీ: కార్పొరేషన్ పరిధిలోని విలీన గ్రామాలు, శివారు కాలనీల్లో వారం రోజుల్లో అభివృద్ధి పనులు చేపట్టకపోతే ఆమరణ దీక్ష చేపడుతానని వైఎస్సార్సీపీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి పనుల కోసం 42గంటల పాటు ఇచ్చిన గడువు ముగియడంతో నగర పాలక సం స్థ కార్యాలయంలో సోమవారం కోటంరెడ్డి నిరవధిక నిరసన చేపట్టారు. ఉద యం 11 గంటలకు కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే కమిషనర్ చాంబర్ వద్దకు వెళ్లారు. కమిషనర్ ఢిల్లీరావు లేకపోవడంతో చాంబర్ బయట బైటాయిం చారు. సాయంత్రం 5 గంటలకు కార్యాలయానికి చేరుకున్న కమిషనర్ బయట నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేను లోనికి పిలిపించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విలీన గ్రామాలు, శివారు కాలనీల్లో కనీస వసతులు కల్పించాలని రెండేళ్లుగా కార్పొరేషన్ చుట్టూ తిరిగి పనులకు టెండర్లు పిలిపిస్తే, చిన్నపాటి సమస్యలను అడ్డుగా చూపి కొర్రీ పెట్ట డం సమంజసం కాదన్నారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో చేపట్టే పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. స్పందించిన కమి షనర్ కొత్తగా వచ్చానని, తనకు వారం రోజులు సమయం ఇస్తే టెండర్లు పిలిచి అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సోమవారం నాటికి దళిత వాడల్లో సబ్ప్లాన్ పనులు ప్రారంభించకపోతే ఆమరణ దీక్ష చేపడుతామన్నారు. శావారు ప్రాంతాలపై భారం విలీనగ్రామాలు, శివారుకాలనీలకు భూ గర్భడ్రైనేజీ, తాగునీటి పథకాలు మం జూరు కాలేదని, ఎటువంటి లబ్ధిపొం దని కాలనీవాసులపై వెయ్యికోట్లు భా రం మోపడం ఎంత వరకు సబబని ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి ఎద్దడి నివారణకు రూ.4.50కోట్లు కేటాయించి 10రోజులకు పైగా గడుస్తున్నా ఎందుకు ఖర్చు పెట్టలేదని మండిపడ్డారు. జీఓ 94 ప్రకా రం టెండర్లు పూర్తిచేసిన 90 రోజుల్లో పనులు ప్రారంభించాల్సి ఉన్నా, 2016 అక్టోబర్ 13న టెండర్లు పూర్తిచేసిన పను లను ఇంత వరకు ప్రారంభించకపోడం దారుణమన్నారు. పనులు చేయించడం చేతకాకపోతే తాను చేయిస్తానన్నారు. నిధులు కేటాయిస్తే 60రోజుల్లో నా ణ్యమైన పనులు చేసి చూపిస్తానన్నారు. అలా చేయలేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు.సీపీఎం కార్పొరేటర్ పద్మజ దంపతులు ఎమ్మెల్యేకు మద్దతు తెలిపారు. వైఎస్సార్సీపీ కార్పొరేషన్ విప్ బొబ్బల శ్రీనివాసులుయాదవ్, కార్పొరేటర్లు లేబూరు పరమేశ్వరరెడ్డి, లక్ష్మీసునంద, నాయకులు కమల్రాజ్, డాక్టర్ సత్తార్, తాటి వెంకటేశ్వరరావు, బిడుదువోలు శ్రీకాంత్రెడ్డి, పుల్లారెడ్డి పాల్గొన్నారు. -
పునరావాసం కల్పించకుంటే పోరాటమే
నెల్లూరు(మినీబైపాస్): పేదలకు పునరావాసం కల్పిం చకుండా అక్రమణల పేరుతో నివాసాలను తొలగిస్తే వారితో కలిసి పోరాటం సాగిస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. నగరంలోని భక్తవత్సలనగర్, ఉమ్మారెడ్డిగుంట ప్రాంతా ల్లో ఆదివారం ఆయన ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు తాము ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటుండగా ఖాళీ చేయాలని అధికారులు బెదిరిస్తున్నారని కోటంరెడ్డికి మొరపెట్టుకున్నారు. ప్రభుత్వ ఇచ్చిన పట్టాలు సైతం ఉన్నాయని, కూలి పనులు చేసుకుని తిండి తినకుండా గూడు నిర్మించుకున్నామని, ఉన్న ఫలంగా ఖాళీ చేయాలంటే తాము ఎక్కడకు వెళ్లాని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన రూరల్ ఎమ్మెల్యే మా ట్లాడుతూ ఉమ్మారెడ్డిగుంట ప్రాంతంలో ఇష్టానుసారంగా మార్కింగ్ చేపట్టి ఉన్నారన్నారు. రైల్వే ట్రాక్ అవసరంలేని చోట మార్కింగ్ ఇచ్చి ఉన్నారని, పునరావా సం కల్పించకుండా ఖాళీ చేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పరిహారం, ప్రత్యామ్నాయంగా స్థలాలు ఇవ్వకపోతే ప్రత్యక్ష పోరాటం తప్పదని హెచ్చరించారు. అన్ని పార్టీలను కలుపుకొని ప్రజ ల పక్షాన పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ ఇన్చార్జి మొయిళ్ల సురేష్రెడ్డి, 21 వడివిజన్ ఇన్చార్జి చేజర్ల మహేష్, ఎస్టీసెల్ నగర అధ్యక్షుడు కట్టా వెంకటరమణయ్య, నాయకుల వెంగళ్రెడ్డి, రాజారెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, భాస్కర్, అమీర్జాన్, కృష్ణ, రాజేశ్వరమ్మ, మాదా బాబు, శ్రీనివాసులురెడ్డి,తదితరులు పాల్గొన్నారు. -
‘టీడీపీ గొంతు శాశ్వతంగా నొక్కే రోజులు దగ్గర్లోనే’
అమరావతి: అధికారపార్టీ ప్రతిపక్షాన్ని శత్రుదేశంగా చూస్తోందని, ఊరు మారినా.. తీరు మారలేదని, గత మూడేళ్ల దుష్ట సంప్రదాయాన్ని కొత్త అసెంబ్లీలో కూడా కొనసాగించిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. సంఖ్యాబలం ఉందని, అధికార మంద బలంతో శాసనసభలో అధికారపార్టీ నియంతలా వ్యవహరించి ప్రజావాణిని వినిపించే ప్రతిపక్ష గొంతు నొక్కేశారన్నారు. ఏ ప్రజా సమస్యపైన కూడా ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిని పట్టుమని రెండు నిమిషాలు కూడా మాట్లాడనీయకుండా మైక్ కట్ చేయడం ద్వారా అధికారపార్టీ నియంతృత్వ ధోరణిని అసెంబ్లీ సాక్షిగా బట్టబయలయిందన్నారు. ఇదే సమయంలో ఆయా అంశాలతో సంబంధంలేని అధికార పార్టీ వ్యక్తులకు మైక్ ఇచ్చి గంటల తరబడి వ్యక్తిగత దూషణలతో విలువైన సభసమయాన్ని అధికారపార్టీ దుర్వినియోగం చేసిందంటూ దుయ్యబట్టారు. సభలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ సభ్యులమైన తాము అధ్యక్షా మైక్... అధ్యక్షా మైక్... అంటూ పోడియం చుట్టిముట్టి పోరాడితేకానీ మైక్ ఇచ్చేవారు కారని, ఇచ్చిన 30 సెకన్లలోనే తిరిగి మైక్ కట్ చేసి సభను తప్పుదోవ పట్టించడం దారుణమన్నారు. కీలక ప్రజా సమస్యలైన అగ్రిగోల్డ్, పదవి తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్, ఆక్వాఫుడ్స్ కార్మికుల మరణాలు, రైతులు గిట్టుబాటు ధరలు, మైనార్టీల సంక్షేమం, అంగన్వాడీ సమస్యలు, విద్యార్థుల సమస్యలు వంటి ఏ సమస్యపై మాట్లాడదామన్నా మైక్ ఇవ్వకుండా వాయిదాలు వేస్తూ విలువైన సభా సమయాన్ని వృధా చేశారన్నారు. ఈ నియంతృత్వ విధానానికి ప్రజలు చెప్పాల్సిన చోట, నొక్కాల్సిన చోట నొక్కడం ద్వారా ప్రజాక్షేత్రంలో టీడీపీ గొంతును శాశ్వతంగా నొక్కే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. అధికార పక్షం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసి అసెంబ్లీలో తమ గొంతు నొక్కినా దానికి రెట్టించిన ఉత్సాహంతో ప్రతిపక్ష పార్టీ నేతగా వైఎస్ జగన్ ప్రజా గొంతును వినిపిస్తూనే ఉంటారన్నారు. -
‘టీడీపీ గొంతు శాశ్వతంగా నొక్కే రోజులు దగ్గర్లోనే’
-
'విచారణకు ఆదేశించి గౌరవాన్ని కాపాడుకోండి'
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో విద్యావ్యవస్థ అంతా సీఎం చంద్రబాబు బినామీల చేతుల్లోనే ఉందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. శాసనసభ ముగిసిన తర్వాత మీడియా పాయింట్ వద్ద విలేకరులతో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మాట్లాడుతూ.. తన బినామీలను కాపాడుకునేందుకు చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. టెన్త్ పశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణలను పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించి ముఖ్యమంత్రి తన గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. టెన్త్ పశ్నాపత్రాలు లీకయినట్టు 'సాక్షి'లోనే కాదు అన్ని పత్రికల్లోనూ వార్తలు వచ్చాయని తెలిపారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ప్రతిపక్షానికి శాసనసభలో మైక్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మాట్లాడుతుంటే 2 నిమిషాల్లోనే మైక్ కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరం లేకపోయినా అధికార పార్టీ సభ్యులకు పదేపదే మైక్ ఇస్తున్నారని వాపోయారు. -
'విచారణకు ఆదేశించి గౌరవాన్ని కాపాడుకోండి'
-
ఉద్యోగులకు కరువు భత్యం భిక్షం కాదు...హక్కు
-
'చంద్రబాబూ ఆ ఒక్కమాట చెప్పు'
-
'చంద్రబాబూ ఆ ఒక్కమాట చెప్పు'
అమరావతి: 'మనవాళ్లు బ్రీఫ్డ్ మీ' అని ఆడియో టేపుల్లో వినిపించిన మాట 'నాది కాదు' అని అసెంబ్లీలో ఒక్కమాట చెప్పండి అని ముఖ్యమంత్రి చంద్రబాబును వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కోరారు. ఓటుకు కోట్లు కేసుపై అసెంబ్లీలో చర్చ జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం అసెంబ్లీలో పట్టుబట్టింది. అయితే సభలో అందుకు అనుమతి ఇవ్వకపోవడంతో వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. అధికారపక్షం మాత్రం సభను తప్పుదోవపట్టించేలా వ్యక్తిగత దూషణలకు దిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి.. ఓటుకు నోట్లు కేసులో ముఖ్యమంత్రిపై వస్తున్న ఆరోపణలను సభలో చర్చించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబును తాము ముఖ్యమంత్రిగానే చూస్తున్నామని అన్నారు. ఆడియో టేపుల్లోని వాయిస్ నాది కాదు అని చెబితే.. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవం కాపాడటానికి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసినవారిపై పోరాటం చేస్తామని అన్నారు. ఆడియో టేపులోని వ్యాఖ్యలను అసెంబ్లీలో ప్లే చేయాలని శ్రీధర్రెడ్డి అన్నారు. -
‘హోదా సాధించకుంటే బాబు చరిత్రహీనుడే’
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా సాధించకపోతే చంద్రబాబు చరిత్రహీనుడు అవుతారని ఆయన గురువారమిక్కడ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే సీట్ల పెంపు కోసం రాజ్యాంగ సవరణ చేస్తామన్న చంద్రబాబు... ప్రత్యేక హోదా కోసం ఎందుకు ముందుకు రావడం లేదని సూటిగా ప్రశ్నించారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. గుంటూరులో డ్రైనేజీ సమస్యపై మాట్లాడేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అవకాశం రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
చెప్పేదొకటి.. చేసేదొకటా..?
మార్కింగ్ ప్రకారం ఆక్రమణలు తొలగిస్తున్నామని చెప్పి మాట మారుస్తారా కమిషనర్పై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆగ్రహం జేసీబీకి అడ్డుపడి నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే నెల్లూరు సిటీ / మినీబైపాస్: పంటకాలువలపై ఆక్రమణల తొలగింపులో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్వచ్ఛందంగా ఆక్రమణల తొలగింపునకు పీటర్స్ కాలువను ఆనుకొని ఉన్న నీలగిరి సంఘ వాసులు ముందుకొచ్చారు. ఈ క్రమంలో 13 ఇళ్ల ఆక్రమణలను తొలగించేందుకు బుధవారం ఉదయం టౌన్ప్లానింగ్ అధికారులు, పోలీసులు రంగప్రవేశం చేశారు. జేసీబీ సాయంతో ఆక్రమణల తొలగింపు కార్యక్రమం జరిగింది. ఈ క్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అక్కడికి చేరుకుని స్థానికులకు అండగా ఉంటానని, హౌస్ ఫర్ ఆల్లో ఇళ్లు అందేలా చూస్తానని, అప్పటి వరకు బాడుగలు అందేలా అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. అయితే ఆక్రమణల తొలగింపునకు సంబంధించి అధికారులు ఎమ్మెల్యేకు ఉదయం ఓ ప్లాన్ చూపారు. సాయంత్రానికి అధికారులు మరో ప్లాన్ను తీసుకొని ఆక్రమణల తొలగింపును చేపట్టారు. 13 ఇళ్ల తొలగింపులో ఓ ఇంటికి సంబంధించిన బాత్రూమ్ను తొలగిస్తామని ఉదయం చెప్పిన అధికారులు సాయంత్రానికి సదరు ఇంటి బాత్రూమ్తో పాటు ఇంటిని కూడా తొలగించేందుకు యత్నించారు. ఈ క్రమంలో స్థానికులు ఎమ్మెల్యేకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. దీంతో కోటంరెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకొని కమిషనర్ వెంకటేశ్వర్లును ప్రశ్నించారు. ఉదయం తనకు చూపించిన ప్లాన్ ఏమిటని.. ఇప్పుడు చేస్తోందని ఏమిటంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీబీకి ఎమ్మెల్యే అడ్డుపడి నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ ముత్యాలరాజుకు ఫోన్ చేసి అధికారులు వ్యవహరించిన తీరును తెలిపారు. స్థానికులకు అండగా నిలవడంతో ఆక్రమణల తొలగింపును నిలిపేశారు. మహిళకు గాయాలు నీలగిరి సంఘంలో యాకసిరి శ్రీనివాసులు, కీర్తి కొన్నేళ్లుగా పీటర్స్ కాలువ పక్కన ఇల్లు నిర్మించుకొని జీవిస్తున్నారు. ఆక్రమణల తొలగింపులో తన ఇళ్లు ఎక్కడ కూలిపోతుందోననే ఆందోళనతో కీర్తి మొదటి అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ కిందపడటంతో ఎడమ చేయి విరిగింది. దీంతో స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్లాన్ను పునఃపరిశీలిస్తాం నీలగిరి సంఘంలో పీటర్స్ కాలువపై ఆక్రమణల ప్లాన్ను పునఃపరిశీలిస్తామని మేయర్ అబ్దుల్ అజీజ్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి నిరసనతో మేయర్ అక్కడికి చేరుకొని మాట్లాడారు. ప్లాన్ను మార్చాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్లాన్ ప్రకారం ఆక్రమణలను తొలగించి, బాధితులకు ఇళ్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బాధితులకు ఇళ్ల ఏర్పాటు, అప్పటి వరకు బాడుగ రూపంలో రూ.రెండు వేలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని మేయర్ అజీజ్, కమిషనర్లకు ఎమ్మెల్యే సూచించారు. దీనికి మేయర్ హామీ ఇచ్చారు. ఆక్రమణల తొలగింపును తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. -
ప్రజాధనం దుర్వినియోగం చేస్తే ఊరుకోను
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి స్వర్ణాల చెరువు వద్ద ఘాట్ల పరిశీలన నెల్లూరు (బృందావనం): ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఉపేక్షించనని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు తన వంతు పోరాటం సాగిస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. దర్గామిట్టలోని బారాషహీద్ దర్గాను బుధవారం ఆయన సందర్శించారు. కార్పొరేషన్, టూరిజం శాఖల అధికారులతో కలిసి ఘాట్లు, రహదారులు, మరుగుదొడ్లు, తదితర పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. బారాషహీద్దర్గా పరిసరాల్లో ఘాట్లు, మరుగుదొడ్లు, బాత్రూమ్లు, రహదారులు, తదితర పనుల్లో నాణ్యత లోపించి, అవినీతి, అక్రమాలు జరిగాయని పత్రికల్లో కథనాలు వచ్చిన నేపథ్యంలో పరిశీలన నిమిత్తం తాను వచ్చానని చెప్పారు. రొట్టెల పండగ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో బారాషహీద్ దర్గాను దర్శించుకునే భక్తుల కోసం సుమారు రూ.ఏడు కోట్లను ఖర్చుచేశారని, అయితే వీటి నాణ్యతప్రమాణాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయని టూరిజం, నగరపాలక సంస్థ అధికారులను ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్ల కోసం అధికారులు తప్పిదాలుచేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. అధికారులను ఇబ్బందిపెట్టడం తన ఉద్దేశం కాదని చెప్పారు. ఘాట్లు, మరుగుదొడ్లలో టైల్స్ లేచిపోవడం, పరిస్థితి అధ్వానంగా ఉండటం దారుణమన్నారు. పనుల వివరాలను తనకు తెలియజేయాలని, ఘాట్ల అక్రమ నిర్మాణంపై తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టూరిజం శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్యామ్సుందరరాజు, ఈఈ లక్ష్మీరంగయ్య, వర్క్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసులు, కార్పొరేషన్ డీఈ ఖాదర్షరీఫ్ పనుల వివరాలను ఎమ్మెల్యేకు తెలియజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, నాయకులు హంజాహుస్సేన్, సలీం, అబూబకర్, డాక్టర్ సత్తార్, హజరత్నాయుడు, చిన్నమస్తాన్, రియాజ్, నరసింహయ్య ముదిరాజ్, పురుషోత్తమ్యాదవ్, చెక్కా సాయిసునీల్, పంట్రంగి అజయ్, పర్వతాల శ్రీనివాస్గౌడ్, తాళ్లూరు సురేష్బాబు, వేల్పుల అజయ్, తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేషన్ తీరుపై ఉద్యమిస్తాం: శ్రీధర్ రెడ్డి
నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్లో ఎస్సీ సబ్ప్లాన్ నిధుల వినియోగంపై అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని మంత్రి నారాయణ పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. నిధులున్నా నగరంలోని ఎస్సీ కాలనీల్లో అభివృద్ధి పనులు చేపట్టడం లేదని శ్రీధర్ రెడ్డి విమర్శించారు. కార్పొరేషన్ తీరుపై ఉద్యమిస్తామని చెప్పారు. -
ఆక్రమణల తొలగింపును న్యాయబద్ధంగా చేపట్టాలి
రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నెల్లూరు రూరల్ : నగరంలోని కాలువలపై ఆక్రమణల తొలగింపును న్యాయబద్ధంగా చేపట్టాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మున్సిపల్ అధికారులకు సూచించారు. స్థానిక మద్రాసు బస్టాండ్ సమీపంలో శనివారం చేపట్టిన ఆక్రమణ తొలగింపు చర్యలను ఎమ్మెల్యే పరిశీలించారు. బాధితులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువలపై ఆక్రమణలను తొలగించే ముందుగా నిర్వాసిత పేదలకు ప్రత్యామ్నాయం చూపించాలన్నారు. కాలువల గట్లపై 50 ఏళ్లుగా ఉంటున్న పేదలకు కరెంటు మీటర్, కుళాయి కనెక్షన్లు ఇచ్చినట్లు గుర్తు చేశారు. పన్నులు వసూలు చేయడంతోపాటు ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించారన్నారు. నీటి పారుదలకు ఇబ్బంది లేకుండా కాలువగట్లపై ఉన్న వారిని తొలగించవద్దని సూచించారు. కాలువల్లో పూడికతీత చేపడితే వరద, ముంపు సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ఆదిశగా అధికారులు ఆలోచన చేయాలని కోరారు. బాధిత పేద కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పోరాడుతామని భరోసా కల్పించారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, ప్రముఖ న్యాయవాది చంద్ర, పట్రంగి అజయ్, చెక్కసాయి సునీల్, తదితరులు ఉన్నారు. -
సర్వీస్ రోడ్డు వచ్చే వరకూ పోరాటం
రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి నెల్లూరు(మినిబైపాస్): రహదారులకు ఓవర్ బ్రిడ్జిలు, పూర్తి స్థాయి సర్వీస్ రోడ్లు నిర్మించాలని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. రూరల్ పరి«ధిలోని బుజబుజ నెల్లూరు నేషనల్ హైవేలో గురువారం రాస్తారోకో నిర్వహించారు. దీంతో కిలో మీటర్ల పోడుగునా వాహనాలు ఆగిపోయాయి. వైఎస్సార్ సీపీ, సీపీఎం, లోకసత్తా, టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు. రాస్తారోకో అనంతరం నేషనల్ హైవే అ«ధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటం రడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నగర శివారు ప్రాంతాలైన బుజబుజనెల్లూరు, చిల్డ్రన్ పార్కు ప్రాంతాలు ప్రమాదాలకు నియంగా మారాయన్నారు. ఇప్పటికి అధికారికంగా 52 మంది మృతి చెందారన్నారు. సర్వీసు రోడ్డును విస్మరించడంతో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సర్వీస్ రోడ్డు, ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తేనే ప్రమాదాలు నివారించవచ్చన్నారు. 2003లో ఏర్పాటు చేసిన రహదారికి ఇప్పటి వరకు ఇరుపక్కల ప్రాంతాలను కలిపేందుకు అవసరమైన బాక్సు టైపు బ్రిడ్జి, ప్లయ్ ఓవర్, సర్వీసు రోడ్లను ఏర్పాటు చేయలేదన్నారు. ఇప్పటికైనా ప్రమాదాలు జరుగకుండా దృష్టి ని సారించాలని, ఇవి నిర్మించే వరకు తాత్కాలికంగా అవసరమైన ప్రమాద హెచ్చరిక బోర్డులు, ఇండికేటర్లు, నగరం నుంచి జాతీయ రహదారిని కలిపే బుజబుజనెల్లూరు, గొలగమూడి క్రాస్ రోడ్డు, చింతా రెడ్డి పాళెం, ఎన్టీఆర్ నగర్ క్రాస్ రోడ్లలో ప్రామాదాల నివారణకు తక్షణం చర్యలు చేపట్టాలని కోరారు. పార్టీ రాష్త్ర కార్యదర్శి ఆనం విజయకుమార్ రెడ్డి, సీపీఎం నేత మాదాల వెంకటేశ్వర్లు, కార్పోరేటర్ పిగిలం ప్రవీణ, లోక్ సత్తా నాయకురాలు లత, న్యాయవాది బద్దెపూడి రవీంద్ర, డాక్టర్ వేణుగోపాల్, వైఎస్సారసీపీ నేతలు ఖాదర్ బాషా, శ్రీహరి యాదవ్, జమునమ్మ, టీడీపీ నేతలు పిగిలం నరేష్ , దూడల చిన్ని, సీపీఎం నేత బషీర్, లోక్ సత్తా నాయకురాలు లత పాల్గొన్నారు. -
భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దు
రొట్టెల పండగలో రాజకీయ ఫ్లెక్సీలు, వీఐపీ దర్శనాలకు స్వస్తి పలకండి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నెల్లూరు (వేదాయపాళెం) : రాష్ట్రానికే ప్రతిష్టాత్మకమైన బారాషహీద్ దర్గా వద్ద నిర్వహించనన్ను రొట్టెల పండగకు వచ్చే భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం ఏ మాత్రం సరికాదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. బారాషహీద్ దర్గా వద్ద బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ దర్గా పరిసర ప్రాంతాల్లో ఏ రాజకీయ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని హితవు పలికారు. ఫ్లెక్సీల కారణంగా భక్తి భావానికి, ప్రశాంతతకు భంగం కలుగుతుందన్నారు. వీఐపీ దర్శనాలతో సాధారణ క్యూలో ఉన్న భక్తులను గంటల తరబడి వేచి ఉండేలా చేయడం వల్ల తొక్కిసలాట జరుగుతుందన్నారు. అజ్మీర్ దర్గా తరహాలో బారాషహీద్ దర్గాకు ప్రాధాన్యత, విశిష్టత ఉందన్నారు. దేశ విదేశాల నుంచి భక్తులు లక్షలాది మంది వస్తారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. రొట్టెల పండగను జాతీయ పండగగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలన్నారు. రొట్టెల పండగకు కేటాయించిన నిధులు సద్వినియోగం అయ్యేలా మంత్రి నారాయణ, మేయర్ అజీజ్, జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏర్పాట్లు పరిశీలన బారాషహీద్ దర్గా వద్ద భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పరిశీలించారు. మరుగుదొడ్లు, చెరువు వద్ద ఘాట్ల నిర్మాణ పనులు చూశారు. ముస్లిం మత పెద్దలు, వక్భ్బోర్డ్ అధికారులు ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డిని గౌరవ పూర్వకంగా ఆహ్వానించి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్రెడ్డి, ముస్లిం మైనార్టీ నేతలు సలీమ్, హంజాహస్సేన్, మునీర్ సిద్దిక్, అబూబకర్, చిన్నమస్తాన్, రియాజ్, బాబు, కార్పొరేటర్ లేబురు పరమేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
అండర్ బ్రిడ్జిలు, సర్వీస్ రోడ్ల కోసం ఉద్యమం
- ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నెల్లూరు(వేదాయపాళెం): జాతీయ రహదారిపై ప్రధాన కూడళ్ల వద్ద అండర్ బ్రిడ్జిలు, సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేసేంతవరకు పార్టీలకతీతంగా ఉద్యమాలు సాగిస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. జాతీయరహదారిపై బుజబుజనెల్లూరు, కనుపర్తిపాడు, చింతారెడ్డిపాళెం, సౌత్రాజుపాళెం క్రాస్ రోడ్ల వద్ద ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, ఈ ఏడాది 52 మంది మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాలను కలుపుకొని మూడంచెల పోరాటాన్ని సాగిస్తామని ప్రకటించారు. ప్రజా ఉద్యమం, రాజకీయ ఒత్తిడి, న్యాయపోరాటం చేసి సర్వీస్రోడ్లు, అండర్ బ్రిడ్జీలను సాధిస్తామని పేర్కొన్నారు. జాతీయ రహదారి నిర్మాణ సమయంలోనే ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా సర్వీస్రోడ్లు, అండర్ బ్రిడ్జిలను నిర్మించాల్సి ఉన్నా, నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కనుపర్తిపాడు సమీపంలో జాతీయరహదారిపై టోల్గేట్ నిర్మాణాన్ని ఉద్యమాలతో నిలిపేశామని, ఇదే పంథాతో ప్రస్తుతం వీటి సాధనకు ఉద్యమిస్తామన్నారు. ఈ నెల ఆరో తేదీన బుజబుజనెల్లూరు క్రాస్రోడ్డు వద్ద జాతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించి నేషనల్ హైవే అథారిటీ అధికారులకు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ఇప్పటికే ఈ అంశంపై బుజబుజనెల్లూరులో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి ఉద్యమానికి కార్యాచరణను రూపొందించామని వెల్లడించారు. ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. పార్టీ నగరాధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, నాయకులు నరసింహయ్యముదిరాజ్, పురుషోత్తమ్యాదవ్, మందా పెద్దబాబు, పంట్రంగి అజయ్, పర్వతాల శ్రీనివాసగౌడ్, రియాజ్, బహుదుల్లా, ఖాదర్బాషా, సప్తగిరి శీనయ్య, సాయి సునీల్, జయవర్ధన్, మదన్కుమార్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
భక్తులే వీఐపీలు
శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సమన్వయ సమావేశంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి నెల్లూరు(బృందావనం): శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులే వీఐపీలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా శ్రీరాజరాజేశ్వరి దేవస్థానం ప్రాంగణంలో శనివారం రాత్రి సమన్వయకమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉత్సవాల్లో భక్తులే వీఐపీలని, వారికి ఏ ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులు, నాయకులను కోరారు. ఆలయ పరిసరాల్లో నాయకులు, వారి అనుయాయులు భారీఎత్తున ఫ్లెక్సీలు పెట్టడం విరమించుకోవాలని సూచించారు. ఆలయం రూరల్ పరిధిలో ఉన్నందున ప్రొటోకాల్ ప్రకారం తనకు అగ్రతాంబూలం దక్కుతుందని, అయితే మహిళలు, చంటిబిడ్డల తల్లులు.. ఇతర సందర్శకులకు ఇక్కట్లు కలగకుండా ఉండేందుకు తాను ప్రొటోకాల్ను వదులుకుంటున్నట్లు ప్రకటించారు. సామన్యుడిలా క్యూలైన్లోనే అమ్మవారి దర్శనం చేసుకుంటానని తెలిపారు. గంటల తరబడి వేచిచూసే యాతన నుంచి భక్తులను తప్పించేందుకు తన బాటలోనే ప్రముఖులు పయనించాలని కోటంరెడ్డి కోరారు. ఇందుకు స్పందించిన మంత్రి నారాయణ ఫ్లెక్సీల విషయంలో ఎమ్మెల్యే అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు ప్రకటించారు. ప్రధానంగా ఆలయ పరిసరాల్లో ఏసీ స్టేడియం నుంచి కరెంటాఫీస్ సెంటర్ వరకు రాజకీయనాయకులకు చెందిన ఫ్లెక్సీల ఏర్పాటు జరగదన్నారు. కాగా, అక్టోబరు 1 నుంచి 11 వరకు జరగనున్న ఈ ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని కోటంరెడ్డి సూచించారు. ఇటీవలికాలంలో ఆలయగోపురంపై అగంతకుడు ఎక్కడం, అగ్నిప్రమాదం సంభవించడం లాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోవడం అరిష్టమన్నారు. ప్రధానంగా ఆలయ నిర్వాహకుల తీరుతెన్నులు, ప్రజాప్రతినిధుల వ్యవహారశైలిలో మార్పులు రావాల్సి ఉందన్నారు. క్యూలైన్ల ఏర్పాటు, దర్శనం తదితర విషయాల్లో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విస్తృత ఏర్పాట్లు: మంత్రి నారాయణ 42వ శరన్నతరాత్రి ఉత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తామని మున్సిపల్శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కృష్ణ పుష్కరాలు, వెంకటగిరి పోలేరమ్మ జాతర, బారాషహీద్దర్గా రొట్టెల పండగను విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో అధికారులను సమన్వయం చేసి అమ్మవారి ఉత్సవాలను విజయవంతం చేస్తామని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, మున్సిపల్, విద్యుత్ తదితర శాఖలకు చెందిన అ«ధికారులకు పలు సూచనలు చేశారు. కాగా, భక్తులకు శానిటేషన్ పరంగా ఎటువంటి సమస్యలు లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తామని మేయర్ అబ్దుల్ అజీజ్ వివరించారు. ఇదిలా ఉండగా, ఆలయ కార్యనిర్వహణాధికారిగా కోదండరామిరెడ్డి పనికిరాడని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామినాయుడు సమావేశంలో ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో ఈఓ తీరువల్ల భక్తులు ఎన్నో అవస్థలుపడ్డారని విరుచుకుపడ్డారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి, సన్నపురెడ్డి పెంచలరెడ్డి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, టీడీపీ నాయకులు, కార్పొరేటర్లు ఆనం జయకుమార్రెడ్డి, రాజానాయుడు, నూనె మల్లికార్జునయాదవ్ తదితరులు పాల్గొన్నారు. తొలుత దసరా శరన్నవరాత్రి మహోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. -
ప్రజలపై పన్నుల భారం సహించం
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నెల్లూరు రూరల్: హడ్కో రుణ భారాన్ని నగర ప్రజలపై వేస్తే సహించబోమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి హెచ్చరించారు. నగరంలోని 22వ డివిజన్ ఉమ్మారెడ్డిగుంటలో గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. స్థానిక సమస్యలపై ప్రజలతో చర్చించి, ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సౌకర్యాల కోసం రూ.1200 కోట్లతో పనులు చేపట్టడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంట్ రూపంలో ఇస్తే ప్రజలపై ఎలాంటి భారం ఉండదన్నారు. అలా కాకుండా అప్పు రూపంలో ఇచ్చారని, ఈ భారాన్ని నగర కార్పొరేషన్ భరించే పరిస్థితిలో లేదని చెప్పారు. విజయవాడ కార్పొరేషన్ తీసుకున్న రూ.300 కోట్ల అప్పు వల్ల ఆర్థికంగా చితికిపోయిందన్నారు. విజయవాడ నగరమే రూ.300 కోట్ల అప్పును తట్టుకోలేకపోతే, నెల్లూరు రూ.1200 కోట్ల భారాన్ని ఎలా భరించగలదని ప్రశ్నించారు. ఇంటి పన్నులు, కుళాయి మీటర్ల రూపంలో నగర ప్రజలపై భారం మోపి ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, 22వ డివిజన్ ఇన్చార్జి మొయిళ్ల సురేష్రెడ్డి, చేజర్ల మహేష్, రాజారెడ్డి, వెంగళరెడ్డి, రమణయ్య, భాస్కర్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, కంచర్ల రమేష్, రమణారెడ్డి, కరిముల్లా, కొండారెడ్డి, దైవాదీనం, మునుస్వామి, సప్తగిరి శ్రీనివాసులురెడ్డి, శ్రీనివాసులురెడ్డి, తదతరులు పాల్గొన్నారు. -
'చంద్రబాబు ఇప్పుడు నీ రక్తం మరగడం లేదా'
హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ గుండెలపై పొడిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం ఎప్పటిలాగే మరోసారి వెన్నుపోటు పొడిచారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా అంశంపై చర్చ జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పట్టుబట్టడంతో ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం సభ శుక్రవారానికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ పై నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదాపై రెండేళ్లు ఎదురు చూసేలా చేసి దారుణంగా వంచించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరిగినా ముఖ్యమంత్రి నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదని, ప్రత్యేక హోదాపై చర్చ జరగాలా వద్ద అనే విషయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పడం లేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా కోరుకుంటున్నారని, కేంద్రం తెగేసి చెప్పినా సీఎం పట్టించుకోకపోవడం లేదంటే ప్రభుత్వ వైఖరి తెలుసుకోవచ్చని అన్నారు. కేంద్రం ప్రకటనలు చూస్తుంటే రక్తం మరుగుతోందని రెండు నెలలముందు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు కేంద్రం తెగేసి చెప్పినా కూడా ఆ రక్తం మరగడం లేదా అని నిలదీశారు. ఇప్పటి వరకు ప్రత్యేక హోదాపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో పోరాటం చేశామని, ఇక ముందు కూడా ప్రత్యేక హోదా కోసం అలుపు లేకుండా పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. -
'చంద్రబాబు పిరికి సైనికుడు.. ముందే తెల్లజెండా'
అసెంబ్లీలో మొత్తం 36 అంశాలపై చర్చించాలని తాము నిర్ణయించినట్లు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, కోన రఘుపతి తెలిపారు. ప్రత్యేక హోదా, ఓటుకు కోట్లు, రాజధాని భూ కుంభకోణాలు, కరువు నివారణ చర్యల్లో వైఫల్యంతో పాటు మిగిలిన అంశాలను సభలో చర్చించాలన్నారు. ఇందుకోసం అసెంబ్లీని కనీసం 15-20 రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని ఎమ్మెల్యేలు అన్నారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు తీరును ఎండగడతామని స్పష్టం చేశారు. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే తెల్లజెండా చూపించి వెనుదిరిగిన పిరికి సైనికుడు చంద్రబాబని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన సమయంలో ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారని కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, కోన రఘుపతి నిలదీశారు. ఆడియో టేపుల్లో ఉన్నది తన గొంతు కాదని చంద్రబాబు ప్రకటించగలరా అని సవాలు చేశారు. ప్రత్యేక హోదాపై ఇప్పుడు వెనకడుగు వేస్తే.. రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుందని, హోదా రాకపోతే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని అన్నారు. చంద్రబాబు నేరస్తుడిలా తలదించుకోవడం ఏపీ ప్రజలకు అవమానమే అవుతుందన్నారు. ఆడియో టేపులలో ఉన్నది తన గొంతు కాదని కేసీఆర్కు చంద్రబాబు సవాలు విసరాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, కోన రఘుపతి అన్నారు. -
హామీలు గాలికొదిలేసి ప్రజలను మోసం చేశారు
-
ప్రజాసమస్యలపై అసెంబ్లీలో గళమెత్తుతా
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నెల్లూరు(వేదాయపాళెం): త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాసమస్యలపై గళమెత్తి సీఎం, మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. మూడు వారాల పాటు నిర్వహించాల్సిన అసెంబ్లీ సమావేశాలను మూడు రోజులకు కుదించడం విచారకరమన్నారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని తెలిపారు. క్రైస్తవ శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని, కొత్తూరు జర్నలిస్టుల కాలనీ అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించాలని కోరనున్నట్లు చెప్పారు. జాతీయ రహదారిపై బుజబుజనెల్లూరు, కనుపర్తిపాడు క్రాస్రోడ్డు, చిల్డ్రన్స్పార్క్ రోడ్డు, ఎన్టీఆర్నగర్ జంక్షన్ల వద్ద అండర్ బ్రిడ్జిలను నిర్మించాలన్నారు. ప్రత్యేక షాదీమంజిల్, వైఎస్సార్నగర్లో వసతుల కల్పన, అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, నగరపాలక సంస్థకు హడ్కో అప్పుల భారం సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. రైస్మిల్లులు, పవర్ప్రాజెక్ట్ల కాలుష్యం నుంచి ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేషన్లో ఎస్సీ సబ్ప్లాన్, 14వ ఆర్థిక సంఘ నిధులతో చేపట్టబోయే పనులు ఆలస్యం కాకుండా వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు. శాసనసభ సమావేశాలను కుదించిన నేపథ్యంలో సమయాన్ని బట్టి పలు సమస్యలను వివరిస్తానని తెలిపారు. పార్టీ నగరాధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, కార్పొరేషన్ విప్ బొబ్బల శ్రీనివాసయాదవ్, కార్పొరేటర్ లేబూరు పరమేశ్వర్రెడ్డి, నాయకులు బిరదవోలు శ్రీకాంత్రెడ్డి, సలీమ్, డాక్టర్ సత్తార్, తాళ్లూరు సురేష్బాబు, కట్టా రమణయ్య, విద్యార్థి విభాగ నాయకులు శేషు, జయవర్ధన్, సాయి, తదితరులు పాల్గొన్నారు. -
వరికి మద్దతు ధర కల్పించాలి
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరు(పొగతోట) : రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసి కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. రైతులు కష్టపడి పండించిన వరిపంటకు మద్దతు ధర కల్పించాలని కోరారు. ఈ మేరకు గురువారం ఆయన నెల్లూరులోని కలెక్టరేట్లో ఉన్న జేసీ చాంబర్లో జేసీ ఏ మహమ్మద్ ఇంతియాజ్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రాజధాని భూములు కార్పొరేట్ సంస్థలకు ఏవిధంగా అప్పగించాలో అలోచన చేస్తున్నారనే తప్ప రైతుల సమస్యలు పట్టించుకోవడంలేదన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి ఏవిధంగా బయటపడాలో అందరూ కలిసి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం రూ.50 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని తెలిపారని, ఇంతవరకు అమలు కాలేదన్నారు. కుమ్మక్కై.. దళారులు, వ్యాపారులు కుమ్మకై ధాన్యం ధరలు తగ్గించి రైతులకు నష్టం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లాలో వరికోతలు ప్రారంభమయ్యాయని పుట్టి ధాన్యం రూ.13,000కు గానూ రూ.10, 11 వేలకు కొనుగోలు చేస్తుంటే రైతులు ఏమైపోవాలని ప్రశ్నించారు. గత సీజన్లో రైతులను నిలువనా దోచుకున్నారన్నారు. ప్రస్తుత సీజన్లో రైతులకు మద్దతు ధర కల్పించకుండా కొనుగోలు చేస్తున్న వ్యాపారులు, రైస్మిల్లర్లపై కేసులు నమోదు చేయాలని డిమాండ్చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ధాన్యం కొనగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. గతంలో చేసిన విధంగా తేమ, తరగు అని కోతలు విధిస్తే సహించేదిలేదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఎస్.శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీనివాసులురెడ్డి, వెంకటాచలం జెడ్పీటీసీ సభ్యుడు వెంకటశేషయ్య, పార్టీ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్గౌడ్ నాయకులు పాల్గొన్నారు. -
సబ్ప్లాన్ నిధులతో పనులు ప్రారంభించరా..?
ఎమ్మెల్యేలు అనిల్, కోటంరెడ్డి నెల్లూరు సిటీ: రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లలో సబ్ప్లాన్ నిధులతో చేపట్టిన పనులు చివరి దశలో ఉండగా, మంత్రి నారాయణ సొంత జిల్లాలోని కార్పొరేషన్లో మాత్రం ఇప్పటికీ ప్రారంభంకాలేదని నెల్లూరు నగర , రూరల్ ఎమ్మెల్యేలు అనిల్కుమార్యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆరోపించారు. సబ్ప్లాన్ నిధుల పనులు ప్రారంభం కాకపోవడంపై మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వర్లును వారు కలిశారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడారు. నెల్లూరు కార్పొరేషన్కు మంజూరైన సబ్ప్లాన్ నిధులు రూ.38 కోట్లతో పనులు ప్రారంభం కాకుండా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేషన్లో కాంట్రాక్టర్లు సిండికేటై 8 ప్యాకేజీలుగా చేశారన్నారు. సెప్టెంబర్ ఏడో తేదీలోపు టెండర్లను పిలుస్తామని కమిషనర్ చెప్పారని, 15లోపు ప్రక్రియ పూర్తికాకపోతే కార్పొరేషన్ కార్యాలయానికి తాళాలను వేస్తామని హెచ్చరించారు. అనంతరం కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల అభివృద్ధికి నిధులు వచ్చాయని చెప్పారు. కార్పొరేషన్ అభివృద్ధికి మంత్రి నారాయణ నిధులను తీసుకురావాల్సి ఉందని, అయితే ఉన్న నిధులతో కూడా పనులను ప్రారంభించలేదని దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో సైతం కార్పొరేషన్ తీరును ఎండగడతామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఫ్లోర్లీడర్ పోలుబోయిన రూప్కుమార్యాదవ్, కార్పొరేటర్లు ఓబిలి రవిచంద్ర, ఊటుకూరు మాధవయ్య, గోగుల నాగరాజు, దేవరకొండ అశోక్, నాయకులు కుంచాల శ్రీనివాసులు, వందవాసి రంగ, మునీర్ సిద్ధిఖ్, ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు. -
ఆటోడ్రైవర్ వంశీకి ఆర్థిక సాయం
నెల్లూరు(మినీబైపాస్): ప్రమాదంలో గాయపడిన ఆటోడ్రైవర్ వంశీ వైద్యఖర్చుల నిమిత్తం రూ.35 వేలను మాస్టర్మైండ్స్ విద్యార్థులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం అందజేశారు. సింహపురి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వంశీని ఆదివారం ఉదయం ఎమ్మెల్యే పరామర్శించారు. మాస్టర్మైండ్స్ తిరుపతి, నెల్లూరు విద్యార్థులు వైద్యఖర్చుల నిమిత్తం రూ.35 వేలను వంశీ భార్య గీతకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రెండేళ్లలో మూడు కేసులు తన దృష్టికి వచ్చాయని, టీటీడీ ప్రాణదాన ట్రస్ట్, తిరుపతి సిమ్స్ హాస్పిటల్ సహకారం, దాతలు, సీఎం సహాయనిధి, సింహపురి ఆస్పత్రి ద్వారా వంశీకి పూర్తిస్థాయిలో నయం చేయించగలిగామన్నారు. మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు కృతజ్ఞతలను తెలియజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, కర్ణాల వంశీ, కృష్ణ, మాస్టర్మైండ్స్ ప్రిన్సిపల్ రవికిరణ్, వైఎస్సార్ విద్యార్థి విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయవర్ధన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మదనకుమార్రెడ్డి, నగరాధ్యక్షుడు శేషు, నగర కార్యదర్శులు ముజామిల్, రాకేష్, రాజా, సిద్ధార్థ, తదితరులు పాల్గొన్నారు. -
భూములపై సమగ్ర విచారణ జరపాలి
మరణించిన వ్యక్తులు భూములు ఆక్రమించారనడం నిచరాజకీయాలకు నిదర్శనం రాజకీయ ఎదుగుదలను చూడలేక ఆరోపణలు మేయర్ అజీజ్పై నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మేల్యేలు ఫైర్ నెల్లూరు(పొగతోట): ముస్లిం మైనార్టీలకు కేటాయించిన భూములను మా తాత పోలుబోయిన సుందరయ్య, మా తండ్రి తిరుపాలయ్యలు ఆక్రమించారని నగర మేయర్ అబ్దుల్అజీజ్ చేసిన ఆరోపణలపై జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో విచారణ జరిపించి వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి. అనిల్కుమార్యాదవ్ అన్నారు. అంబపురానికి సంబం«ధించిన మైనార్టీ భూముల విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డితో కలిసి బుధవారం జేసీ ఏ.మహమ్మద్ ఇంతియాజ్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే మాట్లాడుతు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 2008లో మైనార్టీలకు భూములు కేటాయించారన్నారు. మైనార్టీలకు 2008లో భూములు కేటాయిస్తే 2001లో మృతి చెందిన కుటుంబ సభ్యులు ఎలా ఆక్రమిస్తారని, ఏ విధంగా కోర్టును ఆశ్రాయిస్తారన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ చెప్పినట్లుగా మేయర్ పిచ్చి పనులు చేస్తుంటారన్నారు. వారం రోజుల తరువాత జేసీ ఇచ్చే నివేదికలను చూసి మేయర్ రాజధాని ఎక్స్ప్రెస్ చూసుకుంటారో, క్లాక్టవర్ చూసుకుంటారో, పెన్నా బ్రిడ్జి చూసుకుంటారో లేక ఆయన ఇంట్లో ఉన్న బావిని చూసుకుంటారో నిర్ణయించుకోవాలన్నారు. వైఎస్సార్ను అభిమానించే ముస్లింల భూములను అడ్డుపెట్టుకుని తమపై నిందలు వేస్తే మైనార్టీ సోదరులు క్షమించరన్నారు. దీనిపై నివేదికలు వచ్చిన తరువాత మరణించిన వ్యక్తిపై నిందలు వేసినందుకు క్షమాపణ చెబుతారా? లేదా మరేదైనా చూసుకుంటారా? అనేది మీ విచక్షణకే వదిలేస్తున్నామన్నారు. రాజకీయ ఎదుగుదలకు కారకులైన మైనార్టీలకు సంబంధించిన భూములు ఒక్క అంకనమైన ఆక్రమించలేదని, వారికి హాని కలిగించే ఏ పని కుడా చేయలేదన్నారు. అలా చేయాల్సి వస్తే రాజకీయాలను వదులుకుంటానన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ మేయర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ముస్లింలకు కేటాయించిన భూములు అనిల్కుమార్ కుటుంబ సభ్యులు ఆక్రమించలేదు కాబట్టే నేడు ధైర్యంగా వచ్చి విచారణ జరిపించమని జే సీకి వినతి పత్రం సమర్పించారన్నారు. పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి మునీర్సిద్దీక్ మాట్లాడుతు నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు నీతీనిజాయితీకి నిలబడేవారన్నారు. మైనార్టీల భూములు ఆక్రమించాల్సిన అవసరం వారికి లేదన్నారు. అసత్యాలు ప్రచారం చేసినంత వారిపై మైనార్టీల అభిమానం తగ్గదన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకనా«ద్, పార్టీ ఫ్లోర్ లీడర్ పి.రూప్కుమార్యాదవ్, కార్పొరేటర్లు ఎండి.ఖలీల్ఆహ్మద్, ఓబిలి రవిచంద్ర, దామవరపు రాజశేఖర్, ఊటుకూరు మాదవయ్య, గోగుల నాగరాజు, దేవరకొండ అశోక్, నాయకులు వేలూరి మహేష్, వందవాసి రంగా, మునీర్ సిద్దీక్, ఎస్ఆర్.ఇంతియాజ్, అతహర్బాషా, పఠాన్ ఫయాజ్ఖాన్, ఎండీ. తారిక్ ఆహ్మద్, మున్వర్, రవూఫ్, అహ్మద్, తీగల మురళీకృష్ణ, దార్ల వెంకటేశ్వర్లు, ఎం.మురళీకృష్ణ, తాటి వెంకటేశ్వర్లు, గంధం సుధీర్బాబు, హాజీ పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదా గాలికి పొయింది
-
హామీలను విస్మరించిన టీడీపీ
–నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నెల్లూరు(మినిబైపాస్): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను టీడీపీ విస్మరించిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. రూరల్ మండలంలోని మాదరాజు గూడూరు, కాకుపల్లి, ఆకుతోట ప్రాంతాల్లో ఆదివారం గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 900కు పైగా హామీలను ఇచ్చి అ«ధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేడు ఆ హామీలను నెరవేర్చలేదన్నారు. ఆ హామీలపై ప్రజాబ్యాలెట్ నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి పక్ష ఎమ్మెల్యేగా తాను అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నానన్నారు. తనకు ఇచ్చే గ్రాంటు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. అయినా నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కషి చేస్తున్నానని తెలిపారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనం విజయకుమార్రెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చుతుందా లేదా అనే విషయాన్ని ప్రజలే నిర్ణయించాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం కోటంరెడ్డికి అండాగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
ఎన్నికల హామీలను నెరవేర్చాలి : కోటంరెడ్డి
నెల్లూరు: ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. కొత్తవెల్లంటి, పాతవెల్లంటి, కం దమూరు, ఉప్పుటూరు, తదితర గ్రామాల్లో గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటుతున్నా, హామీలను నెరవేర్చడంలో విఫలమైందని మండిపడ్డారు. హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నామని వివరించారు. హామీలను ప్రభుత్వం నెరవేర్చిందా, లేదా అనే అంశంపై ప్రజలే తీర్పునివ్వాలని చెప్పారు. అనంతరం విజయకుమార్రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు, ప్రభుత్వ పాలనపై ప్రజాబ్యాలెట్ను పార్టీ నిర్వహిస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి అన్ని విధాలుగా అండగా ఉండి, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం ప్రజాబ్యాలెట్ పత్రాలను అందజేశారు. పార్టీ నాయకుడు చేవూరి ప్రభాకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
సోషల్ మీడియాను బ్రహ్మాస్త్రంగా చేసుకోండి
► చంద్రబాబు రాజకీయ అఘోరా ► కోట్లాది రూపాయలు ఇచ్చి ఎమ్మెల్యేలను ఎందుకు కొంటున్నారు ► 2019లో జగన్ సునామీ ముందు టీడీపీ కొట్టుకుపోవడం ఖాయం ► వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజయవాడ చంద్రబాబు సాక్షి టీవీ చానల్ గొంతు నొక్కుతున్నారని, ఇలా ఎన్ని గొంతులు నొక్కుతారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. అందుకే పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ సోషల్ మీడియాను బ్రహ్మాస్త్రంగా మార్చుకోవాలని ఆయన సూచించారు. సోషల్ మీడియా గొంతును చంద్రబాబు కాదు కదా.. ఆయన తండ్రి కూడా నొక్కలేరని తెలిపారు. పార్టీలు మారేవాళ్లను రాజకీయ వ్యభిచారులు, రాజకీయ దొంగలు అని చంద్రబాబే అనేవారని, అలాంటివాళ్లనే కండువాలు కప్పి మరీ పార్టీలోకి తీసుకుంటున్న చంద్రబాబు.. రాజకీయ అఘోరా అని ఆయన మండిపడ్డారు. తాను హజారే కొడుకునని, కేజ్రీవాల్ బావమరిదినని చెప్పుకొనే చంద్రబాబు.. దేనికైనా సై అంటారు గానీ రెండింటికి మాత్రం నై అంటారన్నారు. రాజధాని భూదందాపై విచారణకు, ఏపీలో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోళ్లపై సీబీఐ విచారణకు మాత్రం ఆయన ఒప్పుకోరన్నారు. 10 మంది ఎమ్మెల్యేలను తెచ్చుకున్నంత మాత్రాన 2019లో ఫలితం మారదని స్పష్టం చేశారు. 2014 ఎన్నికలకు ముందు, ఫలితాలు రావడానికి ముందు చంద్రబాబు గెలుస్తారని ఆయనతో పాటు ఆయన వెంట ఉన్న నాయకులు కూడా ఎవరూ అనుకోలేదని.. అందుకే ఆ పార్టీలో ఉన్న చాలామంది వైఎస్ఆర్సీపీలో చేరుతామంటూ వచ్చేవారని, కానీ అప్పటికే నియోకజకవర్గాలలో టికెట్లను ఖరారు చేసినందున.. విలువలకు కట్టుబడిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారి రాకను నిరాకరించారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. అప్పట్లో టికెట్ ఇస్తామని చెబితే చాలు.. పార్టీలోకి వచ్చేస్తామంటూ రాయబారాలు, బేరాలు నడిపిన చాలామంది నాయకులు ఇప్పుడు చంద్రబాబు కేబినెట్లో మంత్రులుగా ఉన్నారని ఆయన తెలిపారు. అప్పట్లో టీడీపీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరక్క రా బాబూ.. రా బాబూ అంటూ కనపడినవాళ్లకు అందరికీ కండువాలు కప్పారని ఎద్దేవా చేశారు. మోదీ పుణ్యం, పవన్ కల్యాణ్ పుణ్యం, తమ నాయకుడికి అబద్ధాలు చెప్పడం చేతకాకపోవడం వల్ల నువ్వు గెలిచావని గుర్తుచేశారు. తలకిందులుగా తపస్సు చేసినా 2019లో నిన్ను, నీ కుమారుడిని ఎవరూ కాపాడలేరని స్పష్టం చేశారు. 2019లో తుపాను కాదు.. జగన్ మోహన్ రెడ్డి అనే సునామీ రాబోతోందని చెప్పారు. రాష్ట్రంలో ఉండే కోట్లాది మంది గొంతుక.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు. ఇద్దరు మోసగాళ్లు, ఇద్దరు నియంతలు ఈ తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్నారని, వాళ్లిద్దరినీ అడ్డుకోకపోతే ప్రజలను కాపాడే అవకాశం లేదని చెప్పారు. రేపటి రోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత సత్యమో.. 2019లో జగన్ సీఎం కావడం అంతే సత్యమని అన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు మరింత దుర్మార్గంగా వ్యవహరించే అవకాశం ఉందని, కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త సోషల్ మీడియాను బ్రహ్మాస్త్రంగా చేసుకుని, దాన్ని జీవితంలో, రాజకీయ పోరాటంలో ఒక భాగం చేసుకోవాలని తెలిపారు. -
విజయసాయి విజయం వైఎస్సార్సీపీకి నైతిక బలం
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో వేణుంబాక విజయసాయిరెడ్డి విజయం సాధించనుండటం వైఎస్సార్కాంగ్రెస్కు నైతిక బలమని, అదే సమయంలో ఈ గెలుపు సీఎం చంద్రబాబుకు నైతికంగా పరాజయమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిశాక ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా, వందలకోట్లు కుమ్మరించినా సాయిరెడ్డిని రాజ్యసభలో అడుగుపెట్టకుండా ఆపలేకపోయారన్నారు. చంద్రబాబు అపజయానికి ఇది తొలి మెట్టు అని, ఇకపై ఆయనకు రాజకీయంగా అన్నీ పరాజయాలే ఎదురవుతాయని శ్రీధర్రెడ్డి అన్నారు. ఆరు నెలలుగా చంద్రబాబు రాష్ట్రంలో పరిపాలనను గాలికొదిలేసి.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులకోసం కూడా కృషి చేయకుండా వైఎస్సార్సీపీని రాజ్యసభలో అడుగు పెట్టనీయరాదనే ఏకైక ఎజెండాతో, లక్ష్యంతో కృషి చేశారని, అయినా నాలుగో అభ్యర్థితో నామినేషన్ సైతం వేయించుకోలేని స్థితిలో ఉండిపోయారని అన్నారు. అధర్మం, అక్రమార్కులు తాత్కాలికంగా విజయం సాధించినా ఎప్పటికైనా ధర్మానిదే విజయమని చరిత్రలో ఎన్నోసార్లు రుజువైందని, అదే నేడూ జరిగిందని అన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలంతా కలసికట్టుగా జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో గట్టిగా నిలచి.. టీడీపీ అధికార జులుంను, ప్రలోభాలను తిప్పికొట్టి ఈరోజు విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపారని, వారంతా ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగిస్తారని కోటంరెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేలు చాలామంది ఇపుడు పశ్చాత్తాపడుతున్నారని శ్రీధర్రెడ్డి చెప్పారు. -
సాగునీరివ్వకపోతే ఆమరణదీక్ష
► ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రిధర్రెడ్డి ► ఇరిగేషన్ కార్యాలయంలో బైఠాయింపు ► కాంట్రాక్టర్కు అధికారుల మద్దతుపై మండిపాటు నెల్లూరు(మినీబైపాస్): నెల్లూరు రూరల్ మండలంలోని మాదరాజుగూడూరు, కాకుపల్లి, లింగాయపాళెం రైతులకు రెండో పంట సాగుకు నీళ్లివ్వకపోతే ఆమరణదీక్ష చేపడతానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి హెచ్చరించారు. ఆయా గ్రామాల రైతులతో కలిసి బుధవారం ఆయన నెల్లూరులోని ఇరిగేషన్ కార్యాలయంలో ఎస్ఈ గది ఎదుట బైఠాయించారు. ఎడగారు సాగుకు నీళ్లివ్వాలని రైతులు అనేక మార్లు కోరినా ఫలితం కరువైందన్నారు. సోమశిల డ్యాంలో సరిపడా నీళ్లున్నాయని, మరో వైపు వర్షాలు కురుస్తున్నా అధికారులు నీటి విడుదలకు నిరాకరించడం సరికాదన్నారు. నీళ్లు వదిలితే పనులు చేపట్టిన కాంట్రాక్టర్కు ఇబ్బంది అని చెప్పడం దారుణమన్నారు. కాంట్రాక్టర్ ప్రయోజనం కోసం వేలాది ఎకరాల్లో పంట పండించే రైతుల కడుపు కొడతారా..అని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలోని పొలాలకు 15 క్యూసెక్కుల నీరు ఇస్తామని వారం కిందట అంగీకరించిన అధికారులు ఇప్పుడు కాంట్రాక్టర్ కోసం మాటమారుస్తున్నారని మండిపడ్డారు. ఒక్క ఎకరా పొలం కూడా ఎండనీయబోమని ఓ వైపు జిల్లా మంత్రి చెబుతున్నారని, ఆయన మాటకు ఇరిగేషన్ అధికారులు విలువనివ్వరా అని నిలదీశారు. ఎస్ఈ వెంటనే కార్యాలయానికి చేరుకుని సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి భీక్ష్మించారు. మరోవైపు రైతులు నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఉన్నతాధికారులకు పరిస్థితి నివేదించారు. ఇన్చార్జి కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఆదేశాలతో ఎస్ఈ పీవీ సుబ్బారావు కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యే కోటంరెడ్డి, సీపీఎం నేత మాదాల వెంకటేశ్వర్లు, రైతులతో చర్చలు జరిపారు. 22వ తేదీన సమావేశం నిర్వహించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఆరోజు సానుకూల నిర్ణయం రాకపోతే ఆమరణదీక్షకు దిగుతానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రకటించారు. కార్యక్రమంలోవైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, సీపీఎం నాయకుడు తిరుపాల్, పెద్దసంఖ్యలో రైతులు పాల్గొన్నారు. -
రెండో పంటకు నీళ్లివ్వాలి: వైఎస్సార్సీపీ
నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని రైతులకు రెండో పంటకు నీళ్లివ్వాలని డిమాండ్ చేస్తూ నగరంలోని నీటిపారుదల శాఖ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ధర్నా చేశారు. జోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా రైతులు, వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్నారు. -
కేంద్ర పథకాల్లో అర్హులకు అన్యాయం
ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి నెల్లూరు(పొగతోట): కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక గోల్డన్జూబ్లీహాల్లో నిర్వహించిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎంపీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న పథకాలు అర్హులకు అందడం లేదన్నారు. అధికారులు నిస్పక్షపాతంగా వ్యవ హరించి పింఛన్లు, తదితర పథకాలు అందేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై జన్మభూమి కమిటీల పెత్తనం లేకుండా ఉత్తర్వులు వచ్చేలా పార్లమెంట్లో చర్చిస్తానన్నారు. జిల్లాలో ప్రొటోకాల్ విషయంలో ప్రజాప్రతినిధులకు అవమానం జరుగుతోందని, అధికారులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. స్వయంగా తనను ప్రారంభోత్సవానికి ఆహ్వానించి శిలాఫలకంపై పేరు లేకుండా చేశారన్నారు. ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రారంభోత్సవాల్లో మాజీలను ఆహ్వానించి వారిపేర్లు శిలాఫలకంపై నమోదు చేయడం దారుణమన్నారు. ఫ్లోరైడ్ సమస్య పరిష్కరించాలన్నారు. తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. నీటి సమస్య గ్రామాలను గుర్తిస్తే ఎంపీ ల్యాడ్స్ నిధులతో పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో ఉపాధి పనుల కోసం రూ.1129 కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేదన్నారు. రోడ్లు లేని గ్రామాల జాబితా ఇస్తే నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, అసంపూర్తిగా ఉన్న పాఠశాలల భవనాలు తర్వితగతిన పూర్తి చేయాలన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ పథకం లబ్ధిదారుల ఎంపిక సజావుగా జరగాలని, పీహెచ్సీల్లో మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ ఉపాధి ఎఫ్ఏలను తొలగించడంతో పనులు పర్యవేక్షణ సక్రమంగా జరగడంలేదన్నారు. ఇన్చార్జి కలెక్టర్ ఏ.మహమ్మద్ ఇంతియాజ్ మాట్లాడుతు సభ్యులు సూచించిన సూచనలను అమలు చేస్తామని, ప్రోటోకాల్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ రామిరెడ్డి, డ్వామా పీడీ హరిత, హౌసింగ్ పీడీ రామచంద్రారెడ్డి, డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వరసుందరం, ఆర్డబ్ల్యూఎస్, ఆర్వీఎం అధికారులు పాల్గొన్నారు. జన్మభూమి కమిటీల పెత్తనంపై జీఓ చేయాలి: పింఛన్లు, పక్కాగృహాల విషయంలో జన్మభూమి కమిటీల పెత్తనం ఎక్కువైంది. అనర్హులను ఎంపిక చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో వాటి పెత్తనం చెల్లదని పార్లమెంట్లో జీవో జారీ చేయించాలి. రూరల్ నియోజకవర్గంలో రూ.5 వేలు ఇస్తే అనర్హులకు పింఛన్ మంజూరు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తున్నారు. అర్హులకు పథకాలు అందకపోతే అట్రాసిటీ కేసులు నమోదు చేస్తాం. రూరల్ నియోజకవర్గం మోగల్లపాళెంలో స్టేడియం నిర్మాణానికి రూ.6 కోట్లు మంజూరై నాలుగు నెలలు కావస్తున్న ఎందుకు ఖర్చు చేయాలేదు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే రూ.1,600 కోట్లు వెనుక్కుపోయే ప్రమాదం ఉంది. - కొటంరెడ్డి శ్రీధర్రెడ్డి,నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అర్హులకు అన్యాయం చేస్తున్నారు: పింఛన్ల మంజూరులో జన్మభూమి కమిటీలు అర్హులకు అన్యాయం చేస్తున్నారు. వికలాంగులకు కుడా ఇవ్వడం లేదు. ఇతనికి కూడా పింఛన్ అందలేదని సెల్ఫోన్లో వికలాంగుని పరిస్థితి చూపించారు. కావలి ప్రాంతంలో రెండు మంచినీటి పథకాల పనుల్లో జాప్యం జరుగుతోంది. నీటి లభ్యతున్న ప్రాంతంలో బోర్లు వేసి నీటిఎద్దడి ఉండే గ్రామాలకు సరఫరా చేయాలి. నిధుల మంజూరు, ఖర్చు వివరాలు అధికారపార్టీ నాయకులకు మాత్రమే ఇస్తున్నారు. ప్రోటోకాల్ విషయంలో అధికారులు అధికారపార్టీ నాయకులు చెప్పినట్లు అడుతున్నారు. ప్రారంభోత్సవాలకు పిలిచి అవమానపరుస్తున్నారు. పాఠశాలల్లో టాయిలెట్స్ పూర్తి స్థాయిలో నిర్మించాలి. -రామిరెడ్డి ప్రతాప్ కుమార్రెడ్డి, కావలి ఎమ్మెల్యే కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఫలితంలేదు: అర్హులకు పింఛన్లు అందలేదని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఫలితం లేదు. జన్మభూమి కమిటీలు ఇష్టం వచ్చినట్లు ఎంపిక చేస్తున్నారు. ఎన్టీఆర్ హౌసింగ్కు కమిటీలు ఎంపిక చేసిన జాబితా సర్పంచ్ అధ్వర్యంలో సభ నిర్వహించి అందరికి తెలియజేయాలి. సర్పంచ్ సంతకం లేకుండా గ్రామ సభ నిర్వహిస్తున్నారు. తాగునీటి ఎద్దడి నివారించాలి. ప్రోటోకాల్ విషయంలో డీఆర్ఓ తప్పుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేకు చెప్పకుండా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనాలకు బిల్లులు ఏ విధంగా చెల్లిస్తారు. - కిలివేటి సంజీవయ్య,సూళ్ళూరుపేట ఎమ్మెల్యే -
అంతా... పథకం ప్రకారమే
► వారంతా కుమ్ముక్కయ్యారు ► చేతులు మారిన రూ.3 కోట్లు ► ఆ రెండు రాత్రుల్లో టేకు చెట్ల నరికివేత ► నివేదిక కోరిన కేంద్ర అటవీ, పర్యావరణశాఖ ► కేసును నీరుగార్చే పనిలో టీడీపీ నేతలు తిలాపాపం.. తలాపిడికెడు అన్నచందంగా టేకుచెట్ల నరికివేతలోఅధికారులు పాత్ర బయటపడింది. శ్రీవేదగిరి నరసింహస్వామిదేవస్థాన భూముల్లో ఉన్న విలువైన టేకు, మామిడి, కొబ్బరి, వేప చెట్లను టీడీపీ నాయకుడు నరికివేసిన విషయం తెలిసిందే. అందులో కొందరు రెవెన్యూ, అటవీ, దేవాదాయశాఖ అధికారుల ప్రమేయం ఉన్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. టీడీపీ నేతతో కుమ్ముక్కైన అధికారులు గుట్టుచప్పుడు కాకుండా నకిలీ పత్రాలు సృష్టించి దేవుడికే శఠగోపం పెట్టారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చొరవతో ఈ బాగోతం వెలుగుచూసింది. అయితే టీడీపీ ముఖ్యనాయకుల ఒత్తిళ్లతో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకడుగువేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రికి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీవేదగిరి నరసింహస్వామి ఆలయ భూముల్లోని విలువైన టేకుచెట్ల నరికివేతలో భాగం పంచుకున్న అధికారులు, లీజుదారులపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మంత్రి పొంగూరు నారాయణకు ఫిర్యాదుచేశారు. భూములు లీజు పొందినప్పటి నుంచి, నకిలీ పత్రాలతో టేకు చెట్ల నరికివేత వంటి అక్రమాలతో కూడిన నివేదికను గురువారం మంత్రి నారాయణకు అందజేశారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు : నెల్లూరు రూరల్ పరిధిలో వెలిసిన శ్రీవేదగిరి నరసింహస్వామి మాన్యం భూముల్లోని రూ.కోట్లు విలువచేసే టేకు, వేప, మామిడి, కొబ్బరిచెట్లపై కన్నేసిన టీడీపీ నేత వేమిరెడ్డి హరిశివారెడ్డి అధికారుల సహకారంతో నకిలీ ధ్రువీకరణపత్రాలు సృష్టించాడు. సర్వేనంబర్ 262/1, 263/1, 264, 265లో ఉన్న 30.12 ఎకరాలను లీజుద్వారా దక్కించుకున్నాడు. అందులో భాగంగా 249, 255, 262 సర్వే నంబర్లతో పాటు మరో 24 నంబర్లను చూపి అందులో 375 టేకుచెట్లు ఉన్నాయని పట్టాదారు పాసుపుస్తకాలు పెట్టి అనుమతి కోరారు.అయితే 132, 133, 134, 135 సర్వే నంబర్లతో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలను జతచేశారు. అయితే ఇవి నకిలీ పాసుపుస్తకాలని రెవెన్యూ అధికారి ఒకరు వెల్లడించారు. అనుమతులు ఇచ్చిన పత్రాల్లో ఉన్న సర్వేనంబర్లలో ఎందులో ఎన్ని టేకుచెట్లు ఉన్నాయనే విషయం, హద్దులు చూపించలేదు. అయితే 262/1లో 5.9 ఎకరాల్లో 359 టేకుచెట్లను కొట్టుకుని తరలించేందుకు అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ సర్వేనంబర్లో టేకుచెట్లు ఉన్నట్లు అధికారులు ఎక్కడా ధ్రువీకరించలేదు. ఎక్కడ టేకుచెట్లు ఉన్నాయో రెవెన్యూ, అటవీ, దేవాదాయశాఖ అధికారులు తెలిసే శ్రీనరసింహస్వామి ఆలయభూముల్లో ఉన్న టేకుచెట్లను తరలించి సొమ్ముచేసుకునేందుకు పథకం వేసినట్లు సమాచారం. ఆ రెండు రాత్రుల్లో చెట్ల నరికివేత : చెట్లను ఈనెల 7, 8 తేదీల్లో నరికివేసినట్లు స్థానికులు చె బుతున్నారు. ఆ రెండు రోజుల రాత్రుల్లో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసుకుని రంపాలతో చెట్లను కోసివేసి తరలించినట్లుగా తెలిసింది. వాటిలో కొన్ని దుంగలను రాత్రికి రాత్రే రాష్ట్ర సరిహద్దు దాటించినట్లు తెలిపారు. ఇంత జరిగినా దేవస్థాన అధికారులు వారంతట వారు పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలేదు. స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి దేవస్థాన ఈఓ నాగేశ్వరావును కొన్ని ప్రశ్నలు వేస్తూ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే ఈఓ వెంటనే ఫిర్యాదు ఇవ్వలేదు. ఎమ్మెల్యే మరోసారి ఈఓను సంప్రదించిన తర్వాతే ఈఓ పోలీసులకు ఫిర్యాదుచేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సుమారు రూ.3 కోట్లు చేతులు మారినట్లు విశ్వసనీయ సమాచారం. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు మూడుశాఖల అధికారులు ఒకరిపై ఒకరు చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. దొంగలను కాపాడే యత్నం : ఈ వ్యవహారంలో ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేసును నీరుగార్చేందుకు టీడీపీ ముఖ్యనేతలు ఇద్దరు రంగంలోకి దిగినట్లు సమాచారం. అందులో భాగంగా ఉన్నతాధికారులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. పర్యావరణ నిబంధనల ఉల్లంఘన కింద కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖకు పలువురు ఫిర్యాదులు చేశారు. స్పందించిన ఉన్నతాధికారులు చెట్ల నరికివేతపై నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు తెలిసింది. కేంద్ర ఇంటిలిజెన్స్ అధికారులు కూడా ఈవ్యవహారంలో సంబంధం ఉన్న రాజకీయ నాయకులు, లీజుదారులులతో పాటు తమిళ స్మగ్లర్ల పాత్రపై నివేదికను రూపొందిస్తున్నారు. అయితే టీడీపీ నాయకులు మాత్రం ఆ నివేదికలు అనుకూలంగా ఇవ్వాలని ఒత్తిళ్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
మరువలేని సంఘసంస్కర్త జ్యోతిరావుపూలే
నెల్లూరు(సెంట్రల్): మహాత్మా జ్యోతిరావు పూలే మరువలేని గొప్ప సంఘసంస్కర్తని నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్ పేర్కొన్నారు. జ్యోతి రావుపూలే 190వ జయంతిని పురస్కరించుకుని నగరంలోని మినీబైపాస్రోడ్డులో విజయమహల్గేటు సమీపంలో ఉన్న జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు సోమవారం వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేకపాటి రాజమోహన్రెడ్డి పూలే సేవలను కొనియాడారు. వెలగపల్లి వరప్రసాద్ మాట్లాడుతూ మహిళా విద్యను ఎంతగానో ప్రోత్సహించారని గుర్తుచేశారు. అమరావతిలో స్మృతి వనం ఏర్పాటు చేయాలి: సంఘసంస్కర్తగా జ్యోతిరావు పూలే దేశానికి అందించిన సేవలు మరువలేనివని నగర ఎమ్మెల్యే అనిల్కుమార్యాదవ్ పేర్కొన్నారు. బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే స్మృతి వనాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని కోరారు. - పీ అనిల్కుమార్యాదవ్, నగర ఎమ్మెల్యే మహాత్ముని ఆలోచనలను సాకారం చేద్దాం: మహాత్మా జ్యోతిరావుపూలే ఆశయాలను , ఆలోచనలను సాకారం చేద్దామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. పూలే కలలను సాకారం చేసేందుకు బీసీలకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. - కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి,రూరల్ ఎమ్మెల్యే మహిళా విద్యకు ప్రోత్సాహం: మహాత్మా జ్యోతిరావుపూలే మహిళా విద్యను ఎంతగానో ప్రోత్సహించారని డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ ఇంతియాజ్ అహ్మద్, బీసీ సంక్షేమ అధికారి సంజీవయ్య, కార్పొరేషన్ ప్లోర్లీడర్ రూప్కుమార్యాదవ్, నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు, కార్పోరేటర్లు గోగుల నాగరాజు, ఎండీ ఖలీల్అహ్మద్, ఊటుకూరు మాధవయ్య, ఓబిలి రవిచంద్ర, నాయకులు కొణిదల సుధీర్, శ్రీనివాసులురెడ్డి, సత్యానందం, నారాయణ యాదవ్, విశ్వరూపాచారి, హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. - ముక్కాల ద్వారకానాథ్, డిప్యూటీ మేయర్ -
ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటాం
► రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ► 35 డివిజన్ యువకులు వైఎస్సార్ సీపీలో చేరిక నెల్లూరు(అగ్రికల్చర్) : వైఎస్సార్ సీపీలో చేరిన ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. నగరంలోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో స్థానిక 35వ డివిజన్ పొదలకూరు రోడ్డు సెంటర్కు చెందిన పలువురు యువకులు సోమవారం ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్లో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన కార్యకర్తలకు కోటంరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పొదలకూరు రోడ్డుకు చెందిన పలువురు యువకులు వైఎస్సార్సీపీ 35వ డివిజన్ జాయింట్ సెక్రటరి చిన్నమస్తాన్ ఆధ్వర్యంలో పార్టీలో చేరడం శుభపరిణామమన్నారు. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ వైఎస్సార్ సీపీ అంగడా ఉంటుందని, వారికి తగిన గుర్తింపునిస్తుందన్నారు. కార్యకర్తలు పార్టీ జెండాలకే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలన్నారు. ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ప్రజా సమస్యల పోరాటంలో ప్రజలను భాగస్వామ్యం చేసుకోవాలని, పార్టీ ప్రతిష్ట పెంచే విధంగా అలుపెరగని పోరాటాలు చేయాలని సూచించారు. తాను ఎమ్మెల్యేగా కార్యకర్తల అభ్యున్నతికి పాటుపడతానని తెలిపారు. కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్, వెల్లంటి ఎంపీటీసీ పాదర్తి సుధాకర్, జాఫర్, వెంకటేశ్వర్లు, హసీనా, షమీఉల్లా, షాహుల్, ఇర్ఫాన్, ఖలీల్, పట్రంగి అజయ్, యూత్ జిల్లా జనరల్ సెక్రటరీ కుమార్ హరికుమార్ పాల్గొన్నారు. -
ఐదుగురు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ శనివారం అసెంబ్లీ హాల్లో సమావేశమైంది. ఈ సందర్భంగా నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రు, కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం కమిటీ ఎదుట విచారణకు హాజరయ్యారు. అయిదుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జ్యోతుల నెహ్రులకు సభా హక్కులు కమిటీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కావడం లేదని ఎమ్మెల్యే రోజా లేఖ పంపారు. అంతకు ముందు ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ తానెప్పుడు అప్రజాస్వామికంగా మాట్లాడలేదన్నారు. తనకు సభపై పూర్తి గౌరవం ఉందని, వివపక్షం టార్గెట్గా నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. అధికారపక్ష సభ్యులు ఏం మాట్లాడినా పట్టించుకోరా అని శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. స్వయంగా సీఎం, మంత్రులే బూతులు మాట్లాడారని, వాళ్లను పట్టించుకోకుండా తమకు మాత్రమే నోటీసులు ఇవ్వడం సమంజసమా అని అన్నారు. -
సీఎం చిత్తశుద్ధిపై అనుమానాలున్నాయి: కోటంరెడ్డి
ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధిపై అనుమానాలున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే.. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తీర్మానానికి మద్దతు ఇచ్చామని తెలిపారు. కాలపరిమితితో కేంద్రానికి హెచ్చరిక చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా.. ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని తప్పుపట్టారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోమని అన్నారు. -
అన్నింటికీ సై...దానికి మాత్రం నై...
హైదరాబాద్ : అన్నింటీకి సవాల్ విసురుతున్న ప్రభుత్వం రాజధాని భూ దందాపై ఎందుకు విచారణకు అంగీకరించడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతలు భూములు కొన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాజధాని భూములపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. 'రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నేత, అపార అనుభవజ్ఞులు అయిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై కొత్తగా ఎన్నికైన సభ్యుడు సవాల్ విసరడం సరికాదు. ఆయనను సవినయంగా చేతులు చేతులు జోడించి కోరేది ఒకటే... ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు దేనికైనా సై అంటారు. భూ దందాపై విచారణకు మాత్రం నై... దీని వెనుక చిదంబర రహస్యం ఏమిటి. మేం ఇచ్చిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ రష్యాలోనో, మరెక్కడో నుంచో వచ్చివని కావు. ఏపీ రిజిస్ట్రర్ వెబ్ సైట్ లో ఉన్నవే. టీడీపీ నేతలు భూములు కొన్నవి నిజం కాదా?అని' కోటంరెడ్డి ప్రశ్నించారు. -
స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఫలించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి కృషి నెల్లూరు(అగ్రికల్చర్): నెల్లూరులోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఖాళీగా ఉన్న 362 స్టాఫ్ నర్స్ల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. ఆసుపత్రిలోని ఖాళీలు భర్తీ చేయాలని జిల్లాలో నిర్వహించిన ఆందోళనకు ప్రభుత్వం స్పందించిందన్నారు. ఈ మేరకు 362 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి జీఓ ఎంఎస్ విడుదల చేసినట్లు తెలిపారు. పోస్టుల భర్తీలో ఎమ్మెల్యే చేసిన కృషిని జిల్లా ప్రజలు కొనియాడారు. సూపర్ స్పెషాలిటీ వసతులు కల్పించాలి నెల్లూరు నగరం నుంచే కాకుండా జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి నిత్యం వందలాది మంది పేదలు వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నందున, హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ వసతులు కల్పించి, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేశారు. -
'రూ.50 కోట్లివ్వండి.. పేదల కష్టాలు తీరతాయి'
హైదరాబాద్: నెల్లూరులో పేదల ఇళ్ల నిర్మాణంలో సౌకర్యాలు లేవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదని చెప్పారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని భావించినా రూ.50కోట్ల నిధులు ఇస్తే పేదలకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు. తాము కోరినట్లు నిధులిచ్చి పేదలకు మేలుచేయాలని కోరారు. ఇప్పటికే జరుగుతున్న పేదల ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లేదని మంత్రి కూడా ఒప్పుకున్నారని, ఈ సమస్యను కూడా దృష్టిలోకి తీసుకోవాలన్నారు. మంచి నీటి కొరత కూడా అధికంగా ఉందని దాన్ని కూడా తీర్చాలని కోరారు. -
చంద్రబాబు...నీకు శిక్ష తప్పదు: కోటంరెడ్డి
హైదరాబాద్ : రాజధాని భూ దందాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు వెనకాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. భూ దందాపై విచారణ జరిపి నిర్దోషులని తేలితే పత్రికలపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో ఇసుక దోపిడీపై అనేక కథనాలు వచ్చాయని, వాటిపై కూడా చర్యలు తీసుకుంటారా? అని ఆయన ప్రశ్నలు సంధించారు. కేంద్రమంత్రి సుజనాచౌదరిపై కూడా కథనాలు వచ్చాయని, ఆ కథనాలు ప్రసారం చేసిన మీడియాపై కూడా చర్యలు తీసుకుంటారా అని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు, రేవంత్ రెడ్డిలపై కథనాలు ప్రసారం చేసిన మీడియాపై కూడా చర్యలు తీసుకుంటారని అని ఆయన అడిగారు. భూ దందాపై అన్ని ఆధారాలతో 'సాక్షి' బయటపెట్టిన మీరు ఇంకా ఆధారాలు కావాలంటున్నారు. ఏ ఆధారాలు కావాలని కోటంరెడ్డి అన్నారు. ఇవాళ చంద్రబాబు విచారణ నుంచి తప్పించుకోవచ్చని... అయితే ఏదో ఒకరోజు చంద్రబాబుకు శిక్ష తప్పదని కోటంరెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది స్కీంల పాలన కాదని, స్కామ్ల పాలన అని కోటంరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు ఏనాటికైనా విచారణ ఎదుర్కోవాల్సిందేనని, జోన్ త్రీలో ఉన్నది మీరు, మీ మంత్రులేనని కోటంరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టి కాంగ్రెస్ సర్వనాశనం చేసిందని, ఇప్పుడు టీడీపీ సర్కార్ రాజధాని పేరుతో రైతుల కడుపు కొట్టారని ఆయన వ్యాఖ్యానించారు. -
'కళ్లు మూసినా, తెరిచినా జగన్ నామస్మరణే'
హైదరాబాద్: చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండేళ్లలో ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటైనా చేశారా అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. కళ్లు మూసినా, తెరిచినా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నామస్మరణ చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు చుక్క నీరైనా ఇచ్చావా అని చంద్రబాబును నిలదీశారు. రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 'కేబినెట్ మీటింగ్కు, టీడీపీ మీటింగ్కు తేడా లేకుండాపోయింది. చంద్రబాబు ప్రభుత్వం పంచభూతాల్ని అవినీతిమయం చేసింది. ఏపీని స్కామాంధ్రప్రదేశ్గా మార్చారు. రాష్ట్ర ప్రజలు తలదించుకునేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబూ.. మీ అవినీతి చూస్తూ ప్రజలు ఊరుకోరు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం. ఏపీ రాజధానిలో టీడీపీ నాయకులు పాల్పడ్డ భూదందా దేశంలోనే అతిపెద్ద కుంభకోణం. మరో ముఖ్యమంత్రి అయితే ఈపాటికి రాజీనామా చేసేవారు. చంద్రబాబూ..తక్షణం విచారణకు సిద్ధం కావాలి' అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. -
'సిండికేట్గా ఏర్పడి ప్రభుత్వ ఆదాయానికి గండి'
నెల్లూరు: ఇసుక రీచ్ టెండర్లలో అధికార పార్టీ టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు. సిండికేట్గా ఏర్పడి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న అగ్రిగోల్డ్ బాధితులకు మద్దతు తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన నిలబడి వారి కోసం పోరాటం చేస్తామని కోటంరెడ్డి చెప్పారు. -
కన్నీరే మిగిలింది!
♦ వర్షాల ధాటికి భారీగా దెబ్బతిన్న పంటలు ♦ రైతన్నలకు రూ.వందల కోట్ల నష్టం సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు రూ.వందల కోట్ల నష్టం వాటిల్లింది. రహదారులు దెబ్బతినడంతో రోడ్లు, భవనాల శాఖ రూ.కోట్లలో నష్టపోయింది. వైఎస్సార్ జిల్లాలో పంటలు, రోడ్డు దెబ్బతినడంలో రూ.20 కోట్లకుపైగా నష్టం సంభవించినట్లు అంచనా. కుండపోత వర్షాలతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అతలాకుతలమైంది. జిల్లాలో విద్యుదాఘాతానికి గురై ముగ్గురు, వరదలో కొట్టుకుపోయి ఇద్దరు మృతి చెందారు. 500 గొర్రెలు, మేకలు నీటిలో గల్లంతయ్యాయి. వరదలో చిక్కుకున్న నలుగురు వ్యక్తులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చొరవతో క్షేమంగా బయటపడ్డారు. చిట్వేలు-రాపూరు మధ్యలో బుధవారం రాజుబండి చెరువుకు గండిపడటంతో ట్రాన్స్కో సీఈ నంద కుమార్ ప్రయాణిస్తున్న వాహనం కొట్టుకుపోయింది. ఆయనతోపాటు డ్రైవర్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వర్షాల ధాటికి వైఎస్సార్ జిల్లాలో ఆరుతడి, ఉద్యాన పంటలకు రూ.10 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు రూ.10 కోట్ల నష్టం వాటిల్లింది. అనంతపురం జిల్లాలో వేరుశనగ దెబ్బతింది. చిత్తూరు జిల్లాలో ఏడుగురు బలి: చిత్తూరు జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాల ధాటికి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా ఏడుగురు మరణించారు. పంట నష్టం వివరాలు సేకరించండి :సీఎం సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల కలిగిన పంట నష్టంపై త్వరగా నివేదికలు పంపాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆయన ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం నెల్లూరు, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల వల్ల కలిగిన పంట నష్టం, ఉపశమన చర్యలపై ఆరా తీశారు. -
గోదావరిలో ముంచుతారా? సూదితో చంపిస్తారా?
హైదరాబాద్ : ఓటుకు కోట్లుపై చర్చకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనకాడుతుందో చెప్పాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ పది నిమిషాలు వాయిదా వేసిన అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ' ఓటుకు కోట్లు మీద ప్రపంచం అంతా ప్రచారం జరిగింది. అన్ని పత్రికల్లో ఆ వార్తలు వచ్చాయి. దొంగతనం బయటపడింది. అయినా తెలుగుదేశం పార్టీ మంత్రులకు ఉలుకెందుకో అర్థం కావటం లేదు. ఏదైనా అడగండి కానీ ఓటుకు కోట్లు అంశంపై మాత్రం చర్చ వద్దు అంటున్నారు. నిజంగా ఆ కేసులో దొంగలు కాకుంటే చర్చకు ఎందుకు వెనుకంజ వేస్తున్నారు. ఏదైనా అడిగితే...ప్రతిపక్షాన్ని మీ కథ తేలుస్తాం...జాగ్రత్తగా ఉండండి అని బెదిరిస్తున్నారు. పెద్ద పెద్ద చూపులు చూస్తున్నారు. ఏం చేస్తారండి. గోదావరికి తీసుకు వెళ్లి నీళ్లలో ముంచేస్తారా? గుంటూరు ఆస్పత్రిలో చేర్చి ఎలుకలతో కరిపిస్తారా? లేదంటే నారాయణ కాలేజీలో చేర్పించి ర్యాగింగ్ చేయిస్తారా? ఎమ్మార్వో వనజాక్షిని కొట్టినట్లు రౌడీలతో మమ్మల్ని కొట్టిస్తారా? పోనీ ఏలూరు తీసుకువెళ్లి ఇంజక్షన్ చేయించి చంపిస్తారా? ఎలా మా అంతు తేలుస్తారో చెప్పండి. ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కాదు... ఇది అసెంబ్లీ. మేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలం. వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం సాగిస్తాం. సీఎం పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మీ స్థాయిని దిగజార్చుకోవటం సరికాదు' అని హితవు పలికారు. -
'ఆ నీళ్లు ఎందుకూ పనిచేయడం లేదు'
-
'ఆ నీళ్లు ఎందుకూ పనికి రావటం లేదు'
హైదరాబాద్: నెల్లూరు నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం నిర్మించిన సమ్మర్ స్టోరేజీ నీళ్లు ఎందుకూ పనికిరావడం లేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శాసనసభ దృష్టికి తెచ్చారు. జీరో అవర్ లో ఆయనీ అంశాన్ని లేవనెత్తారు. రూ.140 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు నుంచి వస్తున్న నీళ్లతో నెల్లూరు రూరల్ ఏరియాలోని దక్షిణంవైపు ఉన్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. ఈ నీళ్లు నెల్లూరు ప్రజలు తాగడానికి కాదు కదా ఎందుకూ పనికి రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు చర్మవ్యాధుల బారిన పడుతున్నారని చెప్పారు. లక్ష మందిని ఇబ్బంది పెడుతున్న ఈ సమస్యను పరిష్కరించాలని తమ జిల్లా మంత్రిని కోరామని వెల్లడించారు. 11 నెలలు గడిచినా ఇప్పటికి సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కారం చేయాలని చేతులెత్తి నమస్కరించి ప్రభుత్వాన్ని కోరారు. శ్రీధర్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నను నోట్ చేసుకున్నామని, సంబంధిత మంత్రితో చెప్పి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. -
మాకు 5 సెకన్లకే కట్.. మీకు 27 నిమిషాలా!
-
మాకు 5 సెకన్లకే కట్.. మీకు 27 నిమిషాలా!
ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే 5 సెకన్లకోసారి మైకు కట్ అవుతుంది గానీ మంత్రులు, ఇతర అధికార పక్ష నేతలకు మాత్రం 27 నిమిషాల అవకాశం ఎలా వచ్చిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం నాడు అసెంబ్లీ 15 నిమిషాల పాటు వాయిదా పడిన తర్వాత ఆయన మీడియా పాయింట్లో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. సీఎం దర్శకత్వంలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి సభను టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అడ్డుకుంటున్నారు అనేక సమస్యలున్నాయి.. నిత్యావసరాల ధరలు, కరువు, రైతు ఆత్మహత్యలు, అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మహత్యలు చంద్రబాబు సినిమా పిచ్చికి బలైన పుష్కర ప్రాణాలున్నాయి రాష్ట్ర పరువు, ప్రతిష్ఠలను దిగజార్చిన ఓటుకు కోట్లు ఘటన ఉంది రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన అవసరం ఉంది అసెంబ్లీలో తీర్మానం పెట్టాలంటే ఇన్నాళ్లూ ఉలుకూ పలుకు లేని చంద్రబాబు అనేక మంది ఆత్మహత్యలకు కారణమయ్యారు ఎట్టకేలకు వైఎస్ జగన్ ఒత్తిడితో టీడీపీ ముందుకొచ్చినా, అది తూతూ మంత్రంగానే ఉంది నిన్న సీఎం 10 పేజీల స్టేట్మెంట్ చదివారు. అయితే, స్టేట్మెంట్లో అంటే ఆ నోట్లో ఉన్న విషయాలు మాత్రమే చదవాలి, దానిపై చర్చలో ఏమైనా చెప్పచ్చు. కానీ దుర్మార్గంగా స్టేట్మెంట్ ఒక పేజీ చదువుతూనే అందులో లేని అంశాలను చెబుతూ జగన్ను రెచ్చగొట్టేలా మాట్లాడారు జగన్ మాట్లాడుతుంటే 5 సెకన్లకోసారి మైకు కట్ అవుతుంది. అధికార పక్షానికి మాత్రం 27 నిమిషాలు అవకాశం ఇస్తారు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదాపై వెంటనే ప్రకటన చేయాలి. సమస్యలున్నాయి గానీ, అవన్నీ ప్రత్యేక హోదా తర్వాతే అసలు ఆ అంశమంటే ప్రభుత్వానికి భయమెందుకో నాకు అర్థం కావట్లేదు ప్రత్యేకహోదా తీర్మానానికి ఒక విలువ ఉండాలంటే కేంద్రంలో ఉన్న మీ మంత్రులు రాజీనామా చేయాలి అలా కాకుండా మాయమాటలతో ప్రభుత్వాన్ని మోసం చేయద్దు ఢిల్లీలో ఒకమాట, హైదరాబాద్లో ఒకమాట చెబుతున్నారు బీజేపీ మంత్రులు కూడా అప్పుడో మాట, ఇప్పుడోమాట అంటున్నారు ప్రత్యేక హోదా సాధన కోసం చిత్తశుద్ధితో ముందుకు రావాలి అసెంబ్లీలో సమగ్ర చర్చ జరిపి కాలపరిమితితో కూడిన తేదీని నిర్ణయించాలని కోరుతున్నాం రెచ్చగొట్టే మాటలతో సభను నిలిపివేయడం కాకుండా సభను సజావుగా నడవనివ్వాలని కోరుతున్నాను -
టీడీపీ నీచ రాజకీయాల వల్లే ...
నెల్లూరు: అధికార టీడీపీ నీచ రాజకీయాల వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్ ఆరోపించారు. మంగళవారం నెల్లూరులో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్ టీడీపీ నేతలపై మండిపడ్డారు. ప్రకాశం జిల్లాలో ఓటుకు నోటు వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని వారు ఎన్నికల కమిషన్ను డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో టీడీపీకి మెజార్టీ లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మెజార్టీ ఉన్న వైఎస్ఆర్ సీపీ సభ్యులను కొనుగోలు చేసేందుకు టీడీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్ విమర్శించారు. -
ప్రత్యేక హోదాతో భావితరాలకు ప్రయోజనం
నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్కుమార్, కోటంరెడ్డి నెల్లూరు(సెంట్రల్) : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాల్సిందేనని సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు పి. అనిల్కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి డిమాండ్ చేశారు. నగరంలోని వీఆర్సీ సెంటర్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ జర్నలిస్టులు శుక్రవారం చేపట్టిన 8 గంటల నిరాహార దీక్షకు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదాతో భావితరాలకు ఎంతో ప్రయోజనమని చెప్పారు. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. సిటీ ఎమ్మెల్యే పి.అనిల్కుమార్యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన అప్పటి కాంగ్రెస్ నాయకులు, అందుకు మద్దతు పలికిన బీజేపీ నాయకులు ఇచ్చిన మాటను విస్మరించారని ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఇంత వరకు ప్రత్యేక హోదాపై స్పష్టమైన హామీ లేకపోవడం దురదృష్టకరమన్నారు. టీడీపీ మంత్రులు కేంద్రంలో కొనసాగుతూ ఇక్కడేమో చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం జర్నలిస్టులు దీక్ష చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టుల నాయకులు చలపతి, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, నాయకులు ఓబిలి రవిచంద్ర, ఊటుకూరు మాధవయ్య, గోగుల నాగరాజు, ఎమ్డి ఖలీల్అహ్మద్, డి.అశోక్, నాయకులు కుంచాల శ్రీనివాసులు, వందవాసి రంగ, గంధం సుధీర్బాబు, వంగాల శ్రీనివాసులురెడ్డి, శ్రావణ్, హాజీ, అఖిల్, కాకు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
జగ్జీవన్రామ్ సేవలు చిరస్మరణీయం
ఘనంగా నివాళులర్పించిన ఎంపీ, ఎమ్మెల్యేలు నెల్లూరు (సెంట్రల్) : భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి అన్నారు. జగ్జీవన్రామ్ 108వ జయంతి సందర్భంగా వేదాయపాళెం సెంటర్లోని జగ్జీవన్రామ్ విగ్రహానికి ఎంపీ మేకపాటి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, పి.అనిల్కుమార్యాదవ్, కిలివేటి సంజీవయ్య ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మేకపాటి మాట్లాడుతూ జగ్జీవన్రామ్ ఎన్ని పదవులు చేపట్టినా అన్నింటికీ న్యాయం చేసి ప్రజల మన్ననలు పొందారన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను కొనసాగించాలన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ జగ్జీవన్రామ్ పట్టుదల, కృషితో దేశంలోనే అత్యున్నత స్థాయికి వచ్చారన్నారు. ఆయన చేసిన సేవలు మరువలేనవన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని నిరూపించారన్నారు. అటువంటి మహనీయులు కలలు సాకారం చేద్దామన్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్కుమార్ మాట్లాడుతూ జగ్జీవన్రామ్ భారతదేశ ఉప ప్రధానిగా దేశం గర్వించదగ్గ వ్యక్తిగా ఎదిగారన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకుని పోవాల్సిన అవసరం ఉందన్నారు. కులమతాలకు అతీతంగా అందరం కలసికట్టుగా ఉందామన్నారు. జాయింట్ కలెక్టరు ఇంతియాజ్, సోషల్ వెల్ఫేర్ డీడీ ప్రసాద్రావు, ఐటిడీఏ పీఓ వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, ఓబిలి రవిచంద్ర, దామవరపు రాజశేఖర్, గోగుల నాగరాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్రెడ్డి, యువజన విభాగం నగర అధ్యక్షుడు సుధీర్బాబు, నాయకులు పురుషోత్తం యాదవ్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నరసింహయ్య ముదిరాజ్, మురహరి, సునీల్, కెహరికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
టోల్ గేట్ వద్దంటూ నెల్లూరులో రాస్తారోకో
కనపర్తి : టోల్గేట్ ఏర్పాటు నిరసిస్తూ నెల్లూరు జిల్లాలోని కనపర్తి పాడు వద్ద వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. గురువారం చేసిన రాస్తారోకో వల్ల చెన్నై - విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టోల్గేట్ ఏర్పాటు చేయకుండా, రద్దుచేస్తున్నట్లు వెంటనే ఆదేశాలు జారీచేయాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పిలుపునివ్వడంతో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ రాస్తారోకోలో పాల్గొన్నారు. -
'మళ్లీ ఆ టోల్గేట్కు అనుమతా ?'
నెల్లూరు: నెల్లూరు సమీపంలోని కనపర్తిపాడు సమీపంలో టోల్గేట్కు ప్రభుత్వం మళ్లీ అనుమతి ఇవ్వడంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో టోల్గేట్ పెడితే చాలా సమస్యలు వస్తాయన్నారు. ప్రభుత్వ వైఖరిపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఈ టోల్గేట్ అంశంలో జోక్యం చేసుకోవాలని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణను కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి డిమాండ్ చేశారు. టోల్గేట్కు మళ్లీ అనుమతి ఇవ్వడం బాధాకరంగా ఉందని ఆయన అన్నారు. -
ఆయన్ని వదిలేశారు ... మా వాళ్లను సస్పెండ్ చేశారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు, స్పీకర్ వ్యవహార శైలిపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గురువారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తమ పార్టీ సభ్యులపై ఉద్దేశించి.. చంపి సమాధి కడతానంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడారని.... ఆయనపై చర్యలు తీసుకునేందుకు స్పీకర్ కోడెల శివప్రసాదరావుగారికి చేతులు రాలేదు... కానీ విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడానికి మాత్రం చేతులు మాత్రం వచ్చాయన్నారు. రైతుల రుణమాఫీపై తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మాట్లాడుతుంటే... స్పీకర్ మైక్ కట్ చేస్తున్నారని ఆరోపించారు. తమను అన్యాయంగా సస్పెండ్ చేశారని తమ పార్టీ సభ్యులు ఆవేదన తెలిపేందుకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు వస్తుంటే వారిని మార్షల్స్ అడ్డుకున్నారని కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. ఇలాంటి అటవీక రాజ్యం, పోలీసు రాజ్యం, రౌడీ రాజ్యంకు తాము భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. -
కోటంరెడ్డి వారి పెళ్లిసందడి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కుమార్తె లక్ష్మీహైందవి, బాలానందరెడ్డి వివాహామహోత్సవం నగరంలోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం కోలాహలంగా జరిగింది. ఈ వివాహా మహోత్సవానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు. -
రేణిగుంటలో వైఎస్ జగన్కు ఘన స్వాగతం
చిత్తూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్కు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి బయల్దేరిన వైఎస్ జగన్ ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన నెల్లూరు చేరుకుంటారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె వివాహానికి ఆయన హాజరు అవుతారు. వధూవరుల్ని ఆశీర్వదించి వైఎస్ జగన్ తిరిగి రోడ్డు మార్గాన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని మధ్యాహ్నం 2.30కు హైదరాబాద్ బయల్దేరి వెళతారు. -
కన్నేశారు.. మాయం చేశారు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో కోట్లాది రూపాయల భూమిని కాజేసేందుకు కొందరు పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చొరవతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. విలువైన ఈ స్థలాన్ని కబ్జాచేసేందుకు దశాబ్దం క్రితమే పథకం వేశారు. అందులో భాగంగానే కార్పొరేషన్కు చెందాల్సిన ఈ భూమి రికార్డులు కనిపించకుండా చేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక రూ.కోట్లల్లో చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి లేఖతో అటు అధికారులు.. అక్రమార్కులు ఉలిక్కిపడ్డారు. కోట్లు విలువచేసే రెండెకరాలకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమైనట్లు కార్పొరేషన్ వర్గాలు వెల్లడించాయి. వివరాల్లో కెళితే... నగరంలోని ఇస్కాన్ సిటీ పరిధిలో సర్వేనంబర్ 680, 681, 684లో రెండెకరాల ప్రభుత్వ భూమి ఉంది. ప్రస్తుతం ఆ భూమి విలువ సుమారు రూ.10కోట్లుపైనే ఉంటుందని అంచనా. విలువైన ప్రభుత్వ భూమిని గత పాలకులు కొందరు కాజేసేందుకు పథకం రచించినట్లు తెలిసింది. అందులో భాగంగా ఓ మాజీ మహిళా ప్రజాప్రతినిధి సహకారంతో రికార్డులను సైతం తారుమారు చేసినట్లు తెలిసింది. ఆ రికార్డులతో కొద్దిరోజుల క్రితం 30 సెంట్ల స్థలాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ స్థలం వెనుక కథ... నగరంలో ఇస్కాన్ సిటీ పరిధిలో కొందరు రియల్టర్లు లేఅవుట్లు వేశారు. విస్తీర్ణాన్ని బట్టి రియల్టర్లు కొంత స్థలాన్ని కార్పొరేషన్కు వదిలిపెట్టాలి. అలా కేటాయించిన స్థలంలో ప్రజావసరాలకు వినియోగించాలి. పార్కులు, కమ్యునిటీ భవనాల వంటివి నిర్మించి ప్రజావసరాలకు ఉపయోగించుకోవచ్చు. అలా ఆ రెండెకరాల భూమిని వదిలిపెట్టారు. అయితే ప్రస్తుతం ఆ రెండెకరాలకు సంబంధించిన రికార్డులు లేవు. వాటిని మాయం చేయటానికి కొందరు కీలక పాత్ర పోషించారు. ఈ స్థలం ఉన్న విషయాన్ని నగరంలోని ఓ ప్రముఖ ఆలయ చైర్మన్కు తెలిసింది. విలువైన ఆ రెండెకరాల స్థలాన్ని ఎలాగైనా నొక్కేయాలని పథకం వేశారు. గత పాలకులతో కుమ్మక్కై రికార్డులు లేకుండా చేశారు. అందులో భాగంగా రెండేళ్ల క్రితం ఆ రెండెకరాల్లో కొంత స్థలాన్ని పెన్సింగ్ వేయాలని భావించి కార్పొరేషన్ సిబ్బందితో అక్కడి వెళ్లినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న కొందరు పెద్దలు అధికారులను హెచ్చరించినట్లు తెలిసింది. అదేస్థలంలోని 30 సెంట్లను ఇటీవల వేరొకరికి రిజిస్ట్రేషన్ కూడా చేశారు. మిగిలిన స్థలాన్ని విక్రయించే ప్రయత్నాలు ప్రారంభించారు. విక్రయించేందుకు అవసరమైన రికార్డుల కోసం ఆరాతీసే సమయంలో ఈ స్థలం కార్పొరేషన్కు సంబంధించినదని బయటపడింది. ఈ విషయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి దృష్టికి వచ్చింది. స్పందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆరా తీయటంతో విషయం బయటపడింది. వెంటనే ఎమ్మెల్యే కార్పొరేషన్ కమిషనర్కు లేఖరాశారు. ‘ఇస్కాన్సిటీ పరిధిలో విలువైన రెండెకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలం అన్యాక్రాంతమవుతోంది. ప్రజావసరాల కోసం కేటాయించిన ఆ స్థలాన్ని వెంటనే గుర్తించి హద్దులు ఏర్పాటు చేసి కంచె ఏర్పాటు చేయండి. ఒకవేళ అటువంటి స్థలమే లేదనుకుంటే నాకు రాతపూర్వకంగా రాసివ్వండి’ అని కోరటం గమనార్హం. అయితే ఈ విషయంపై కార్పొరేషన్ అధికారులు స్పందిస్తారా? లేదా? అనేది వేచిచూడాలి. -
విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
నెల్లూరు (కల్చరల్) : కేఎన్ఆర్ స్కూల్ విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో రాణించి పాఠశాల ఖ్యాతిని నలుదిశలా చాటాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. స్థానిక భక్తవత్సలనగర్లోని కురుగంటి నాగిరెడ్డి (కేఎన్ఆర్) నగర పాలక ఉన్నత పాఠశాల్లో ఎమ్మెల్యే కోటంరెడ్డి తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ శనివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల స్కూల్ను దత్తత తీసుకున్నప్పటి నుంచి స్నేహితుల సహకారంతో అభివృద్ధి చర్యలు చేపట్టామన్నారు. అందులో భాగంగా విద్యార్థులకు సురక్షితమైన తాగునీటి సౌకర్యాన్ని అందించేందుకు సుమారు రూ.4 లక్షలు సొంత నిధులతో ఆర్ఓ వాటర్ ప్లాంట్, 40 కుళాయిలను ఏర్పాటు చేశామన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు కష్టపడి సంపాదించినదంతా ప్రైవేట్ స్కూళ్లలో తమ బిడ్డల చదువుకే ఖర్చుపెట్టాల్సివస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించినపుడు అలాంటి పరిస్థితి తలెత్తదన్నారు. పదో తరగతిలో ఉత్తమ గ్రేడింగ్ సాధించే విద్యార్థుల ఉన్నత చదువుల కోసం తాను పూర్తి బాధ్యత తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ప్రతిభ కనబరిచిన 30 మంది విద్యార్థులకు రూ.10వేల వంతున ప్రోత్సాహకాన్ని అందజేస్తానని ప్రకటించారు. ఎన్నికల వాగ్దానాల్లో మాత్రమే అభివృద్ధిని పేర్కొనే నాయకుడిని కాదని, ఎల్లవేళలా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసేవాడినని ఎమ్మెల్యే కోటంరెడ్డి స్పష్టం చేశారు. పాఠశాల అభివృద్ధి కోసం రూ.2 లక్షలు విరాళంగా ప్రకటించిన వైఎస్సార్సీపీ నాయకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి సేవా దృక్పథాన్ని కొనియాడారు. కేఎన్ఆర్ పాఠశాల విద్యార్థులకు అవసరమైన క్రీడా పరికరాలను అందించేందుకు ముందుకొచ్చిన డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్ను ఎమ్మెల్యే అభినందించారు. పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ నగరపాలక పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. నగర మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ అందరూ జీతాన్ని ఇంటికి తీసుకెళ్తారని, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మాత్రం తన జీతాన్ని పేద విద్యార్థుకోసం ఖర్చుపెడుతుండడం అభినందనీయమన్నారు. పాఠశాలకు అవసరమైన మరుగుదొడ్ల నిర్మాణం కోసం టెండర్ల ప్రక్రియ జరుగుతోందన్నారు. ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని వసతులను ప్రభుత్వ పాఠశాలలకు అందజేసి కార్పొరేట్కు దీటుగా అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం పాఠశాల అభివృద్ధికి విరాళం ప్రకటించిన వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిని ఎమ్మెల్యే, పాఠశాల సిబ్బంది సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం విజయప్రకాష్, టీచర్లు, విద్యావలంటీర్లను సత్కరించారు. వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు తాటి వెం కటేశ్వర్లు, కార్పొరేటర్లు అపర్ణ, శ్రీపద్మ, శ్రీలక్ష్మి, షంషుద్దీన్, బాలకోటేశ్వరరావు, సిద్ధార్థ స్కూల్ అధినేత్రి గౌరి, పి.ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆనం మాస్టర్ప్లాన్
సాక్షి: ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరానికి సంబంధించి తాజా మాస్టర్ప్లాన్పై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అభ్యంతరాలతో అందులోని లొసుగులు వెలుగుచూస్తున్నాయి. మొన్నటి వరకు నగరాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని దశాబ్దానికి పైగా రాజకీయం చేసిన ఆనం కుటుంబం ఈ వ్యవహరం వెనుక కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి. మాస్టర్ప్లాన్లోని లొసుగులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు బయటపెట్టడంతో ఆనం వర్గీయులు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది. మాస్టర్ప్లాన్ రూపకల్పనలో ఎవరి ప్రమేయం ఉండదంటూ తాజా మాస్టర్ప్లాన్కు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి గళం విప్పడం ఇందుకు నిదర్శనంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా తమ హయాంలో నగరంలో ఎక్కడా రోడ్ల విస్తరణ జరగలేదని బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి 2008లో ప్రారంభమైన తాజా మాస్టర్ప్లాన్ రూపకల్పన కసరత్తు 2011కు పూర్తయింది. ఆ ఏడాదిలోనే అప్పటి మేయర్ భానుశ్రీ అధ్యక్షతన కౌన్సిల్ ఆమోదం పొందింది. 2013లో ఈ మాస్టర్ప్లాన్కు ప్రభుత్వం పూర్తిస్థాయి ఆమోద ముద్ర వేసింది. ఇదంతా ఆనం వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగానూ, ఆయన సోదరుడు రాష్ట్ర మంత్రి వర్గంలో కీలక శాఖ మంత్రిగానూ వ్యవహరించినప్పుడు జరిగింది. అప్పట్లో ప్రైవేటు ఏజెన్సీ మాస్టర్ప్లాన్ పూర్తి చేసి కౌన్సిల్కు ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం పొందడం వంటి కీలక పరిణామాలు కింగ్మేకర్లగా వ్యవహరించిన ఆనం సోదరులకు తెలియవనుకుంటే పొరబాటే. ప్రస్తుత మాస్టర్ప్లాన్ను అమలు చేయాల్సి వస్తే వ్యాపారులకు, పలు ప్రార్థనా మందిరాలకు నష్టం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే గొంతు చించుకుంటున్నారు. అప్పట్లో ఆయన దీనిపై ఎందుకు స్పందించలేదనేది ఆయనకే తెలియాలి. వారి హయాంలోనే స్టౌన్హౌస్పేట, వాకర్స్రోడ్డు, జీఎన్టీ రోడ్డు, రైల్వేఫీడర్స్రోడ్డు వంటి ప్రధాన రోడ్ల విస్తరణ జరిగింది. ఈ పరిస్థితుల్లో తాజా మాస్టర్ప్లాన్ అమలునుద్దేశించి కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు అర్థరహితమైనవనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొండాయపాళెం రోడ్డు వెడల్పు తగ్గడంలో మతలబు 1978 తరువాత 2011 సంవత్సరంలో రూపొందించిన మాస్టర్ప్లాన్లో కొన్ని చోట్ల రోడ్ల విస్తీర్ణం తగ్గడంలో ఆనం ప్రమేయం ఉన్నట్లు బహిరంగంగానే విమర్శలున్నాయి. కొండాయపాళెం మార్గంలో 60 అడుగుల రోడ్డును తాజా మాస్టర్ప్లాన్లో 40 అడుగులకు తగ్గించడం వెనుక సొంత మనుషులకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం జరిగిందనే ఆరోపణలున్నాయి. ఆ ప్రాంతంలో తమ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక ప్రముఖ కాంగ్రెస్ నేత భూములున్నాయి. ఈ కారణంగానే ఆ ప్రాంతంలో రోడ్ల విస్తీర్ణాన్ని పెంచడానికి బదులు తగ్గించాడని చెబుతున్నారు. మాగుంట లేఅవుట్ సమీపంలో రైల్వే లైన్కు పడమర వైపు మాజీ మేయర్కు సంబంధించిన బినామీల ఫ్లాట్లు ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా జాతీయ రహదారి నుంచి అయ్యప్పగుడి వరకు 200 అడుగులు, అక్కడి నుంచి శబరిక్షేత్రం వరకు 150 అడుగులు, అక్కడి నుంచి ఆత్మకూరు బస్టాండు వరకు 100 అడుగులు విస్తరించాలన్న నిర్ణయం కూడా అప్పట్లోనే జరిగింది. తమ కనుసన్నల్లో జరిగిన మాస్టర్ప్లాన్ను ఆనం ఇప్పుడు వ్యతిరేకించడం హాస్యాస్పదమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
మెడికల్ కళాశాల పనుల్లో మీనమేషాలా
అధికారులపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఫైర్ నెల్లూరు (విద్యుత్) : మెడికల్ కళాశాల అభివృద్ధి పనుల నిర్వహణలో మీనమే షాలు లెక్కిస్తే సహించబోనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి హెచ్చరించారు. స్థానిక ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కళాశాల ప్రాంగణంలోని వివిధ విభాగాల నిర్మాణ పనులను బుధవారం ఆయన తనిఖీ చేశారు. పనుల పురోగతిపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేంద్రనాథ్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఇంట ర్నల్ రోడ్ల నిర్మాణం ఇంకా ఎందుకు చేపట్టలేదని కోటంరెడ్డి ఈఈని ప్రశ్నించారు. టెండర్లు పిలిచి నాలుగు నెలలు కావస్తున్నా ఇంతవరకు పనులెందుకు మొదలుపెట్టలేదని నిలదీశారు. టెండర్లు పిలి చిన 90 రోజుల్లో ఆయా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాల్సి ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఆ టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లను పిలవాలన్నారు. ఈ ప్రక్రియలో ఇంజనీరింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహ రించడంపై మండిపడ్డారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతుంటే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. వర్షాకాలం.. రోడ్లు గుంతలమయంగా ఉంటే నిర్మాణం పనులెలా సాగుతాయని ప్రశ్నించారు. మెడికల్ కళాశాలకు సంబంధించి మొత్తం రూ.197 కోట్ల మేర పనులు జరుగుతుంటే అందులో కేవలం రూ.7 కోట్లతో నిర్మించాల్సిన ఇంటర్నల్ రోడ్ల పనుల్లో జాప్యం ఎందుకు జరుగుతోందని ఈఈని మందలించారు. గంటల వ్యవధిలో ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ, చీఫ్ ఇంజనీర్లు స్పందించకపోతే నిర్మాణం పనులను అడ్డుకుంటానని ఆయన అధికారులను హెచ్చరించారు. దీనికి ఉన్నతాధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి చెప్పారు. కళాశాలలో పూర్తిస్థాయిలో వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ఇంజనీరింగ్ అధికారులు స్పందించా లన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు నెల్లూరు మదన్మోహన్రెడ్డి, బత్తిన శోభన్రెడ్డి, మనుబోలు సికిందర్రెడ్డి, జి.నగేష్, భీమినేని మురహరి పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి పితృ వియోగం
నెల్లూరు : నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పితృ వియోగం కలిగింది. కోటంరెడ్డి తండ్రి బేబిరెడ్డి (75) శనివారం మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బేబిరెడ్డి మృతి పట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సంతాపం తెలిపారు. -
'మీకు బీపీ పెరిగితే.. పదవిని గోరంట్లకు ఇవ్వండి'
హైదరాబాద్ : శాసనసభలో నిన్న నీటి పారుదల శాఖామంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. పలు నీటి ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లగా అప్పటి వరకూ రక్తపోటు సాధారణంగా ఉండేదని, ఆ తర్వాత 140/80కి పెరిగిందని మంత్రి దేవినేని అన్నారు. దీనిపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రికి ఆరోగ్యం బాగోలేకపోతే పదవికి రాజీనామా చేసి పక్కనే ఉన్న సీనియర్ సభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరికి ఇస్తే బావుంటుందేమో ఆలోచించాలని సూచించారు. దీంతో సభ్యుల మధ్య ఒక్కసారిగా నవ్వుల పూలు పూశాయి.