Sailaja Reddy Alludu
-
ఫుల్గా ఎంజాయ్ చేస్తున్న చై-సామ్!
అక్కినేని ఫ్యామిలీ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నట్టు కనిపిస్తోంది. నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ‘శైలజా రెడ్డి అల్లుడు’, సమంత నటించిన ‘యూ టర్న్’ ఒకే రోజున విడుదలైనా.. రెండు సినిమాలు కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుని విజయవంతమయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన రెండు సినిమాలు ఒకే రోజున విడుదలవ్వడమే అరుదు.. అందులో భార్య, భర్త లీడ్ రోల్స్లో నటించిన రెండు వేర్వేరు సినిమాలు రిలీజ్ అవ్వడం ఆశ్చర్యమే. అయినా రెండు సినిమాలు విభిన్న కథాంశాలతో తెరకెక్కడంతో.. రెండు చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ప్రస్తుతం ఈ జంట ఖుషీగా పార్టీ చేసుకుంటున్నట్టుంది. పబ్లో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సమంత. ఈ పార్టీలో అఖిల్ కూడా చిందులేసినట్టున్నాడు. -
బాలనటి నుంచి శైలజారెడ్డి కూతురి వరకు
బాలనటిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన అను ఇమ్మాన్యుయేల్ మలయాళ చిత్రం ‘యాక్షన్ హీరో బిజూ’తో హీరోయిన్ అయింది. మజ్ను, కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్, అజ్ఞాతవాసి, శైలాజారెడ్డి అల్లుడు... చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అను అంతరంగ తరంగాలు... ►మనం ఎప్పుడూ ఒకేలా ఉండమనే విషయాన్ని బలంగా నమ్ముతాను. రకరకాల అనుభవాలు మనల్ని ఆకర్షణీయంగా తీర్చుదిద్దుతాయి. రెండు సంవత్సరాల క్రితం వరకు తెలుగులో నా డైలాగులను నేను చెప్పుకోవడం కష్టంగా ఉండేది. ఇప్పుడు అలాంటి కష్టం లేదు. త్వరలో తెలుగును ధారాళంగా మాట్లాడగలననే నమ్మకం ఉంది. ►నటన నా జీవితాన్నే మార్చేసింది. ఒకప్పుడు ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడేదాన్ని. ఇప్పుడు నా పనులు నేనే సొంతంగా చేసుకోగలుగుతున్నాను. ‘శైలజారెడ్డి అల్లుడు’లో పొగరున్న యువతిగా నటించాను. నిజజీవితంలో కూడా నాకు పొగరు ఉంది. అయితే దాన్ని నేను ‘హెల్తీ ఇగో’ అంటాను. నాకే కాదు ప్రతి ఒక్కరికీ ఇది ఉండాలి. ►వేరే కథానాయికతో కలిసి పనిచేయడం వల్ల నేనేమీ ‘అభద్రత’కు గురికాను. మన గురించి మనకు స్పష్టత లేనప్పుడే అభద్రతాభావన ముందుకొస్తుంది. నేను నటించే సినిమా ఏమిటో దానిలో నా పాత్ర ఏమిటో నాకు స్పష్టంగా తెలుసుకాబట్టి అభద్రత అనే సమస్యే ఎదురుకాదు. ►పాత్రలో ఎంత దమ్ము ఉంది, ఎంత గొప్పగా ఉంది అనేది విషయం కాదు. సినిమా ఆడకపోతే మన కష్టం, ప్రతిభ కనిపించకపోవచ్చు. అంతమాత్రాన యాంత్రికంగా నటించలేము కదా! ఫలితం ఎలా ఉన్నా ప్రయత్నలోపం ఉండకూడదని నమ్ముతాను. నా పాత్ర అద్భుతంగా ఉండటం వల్ల సినిమా ఆడదు... సినిమా అనేది రకరకాల పాత్రల ప్యాకేజీ. ►నటి అన్నాక కమర్షియల్ సినిమాలతో పాటు నటనకు ఆస్కారం ఉన్న నాన్ కమర్షియల్ సినిమాలు కూడా చేయాలి. అయితే కెరీర్ నిర్మాణదశలో ప్రయోగాత్మక చిత్రాలు, పాత్రలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. కొన్ని అవకాశాలు అనుకోకుండా తలుపుతట్టి ఎక్కడికో తీసుకువెళతాయి. ‘మహానటి’లాంటి సినిమా చేయాలని ఉంది. ►జయాపజయాలు మన అధీనంలో ఉండవు. కాబట్టి ఫెయిల్యూర్స్ గురించి అతిగా ఆలోచించను. కెరీర్ ప్రారంభంలో సహజంగానే కొన్ని తప్పులు చేస్తాం. నేను అలాగే చేశాను. అంతమాత్రాన ‘ఇక అంతా అయిపోయింది’ అని డీలాపడే మనిషిని కాదు. ఇండస్ట్రీలో పోటీ గురించి చెప్పాలంటే, మెడికల్ ఎంట్రన్స్లాంటి పోటీ కాకపోయినా పోటీ అనేది ఉండాలి. అలా ఉంటే మరింత మెరుగవుతాం. -
గురువారం గుమ్మడికాయ
ఈ నెలలో ‘శైలజారెడ్డి అల్లుడి’గా ప్రేక్షకులను మెప్పించిన నాగచైతన్య తన నెక్ట్స్ చిత్రం ‘సవ్యసాచి’ సినిమా షూటింగ్ను కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మిస్తున్న సినిమా ‘సవ్యసాచి’. ఇందులో నిధీ అగర్వాల్ కథానాయిక. భూమిక, మాధవన్ కీలక పాత్రలు చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. నిజానికి ఈ మూవీ మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం చిన్న ప్యాచ్వర్క్ కోసం షూటింగ్ జరుపుతున్నారు. ఇది కూడా రేపటితో పూర్తి అవుతుంది. దీంతో ఈ గురువారం గుమ్మడికాయ కొడతారు ‘సవ్యసాచి’టీమ్. అన్నట్లు ఇంకో మాట... ఈ సినిమా కోసం ‘అల్లరి అల్లుడు’లో నాగార్జున, రమ్యకృష్ణ చేసిన ‘నిన్ను రోడ్డుమీద చూసినది లగాయితు’ అనే సాంగ్ను రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటను నాగచైతన్య, నిధీ అగర్వాల్పై చిత్రీకరించారు. ఈ చిత్రం నవంబర్ 2న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా నటించనున్న చిత్రం అక్టోబర్ 6న ఆరంభం కానుందట. -
మూడు రోజుల్లో 23 కోట్లు.. నేను నమ్మలేకపోయా!
‘‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాకి మంచి ఓపెనింగ్స్ ఇచ్చి, ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు. మా సినిమా కలెక్షన్స్ గురించి చెప్పినప్పుడు ముందు నమ్మలేకపోయా. ముఖ్యంగా మౌత్ టాక్ని చాలా పాజిటివ్గా స్ప్రెడ్ చేసిన వారికి, చేస్తున్నవారికి థ్యాంక్స్’’ అని నాగచైతన్య అన్నారు. ఆయన హీరోగా, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. రమ్యకృష్ణ, నరేశ్, పృథ్వీ ఇతర పాత్రల్లో నటించారు. ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో నాగవంశీ. ఎస్, పీడీవీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలైంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు 12 కోట్ల రూపాయలు వసూలు చేయగా, మూడు రోజులకి దాదాపు 23 కోట్లు వసూలు చేసిందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా లుక్ చాలా ఫ్రెష్గా, డిఫరెంట్గా, బాడీ లాంగ్వేజ్ చాలా ఎనర్జిటిక్గా ఉందని అంటున్నారు. ఒక యాక్టర్కి ఇవే బెస్ట్ కాంప్లిమెంట్స్. థ్యాంక్యూ మారుతిగారు. అప్పుడు ‘ప్రేమమ్’, ఇప్పుడు ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రాలతో హిట్స్ ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘శైలజారెడ్డి అల్లుడ్ని తెలుగు ప్రేక్షకులు సొంత అల్లుyì లా ఆదరిస్తున్నారు. ఈ చిత్రం వసూళ్లు మాకు చాలా ఆనందాన్ని, ఎనర్జీని ఇచ్చాయి. నా గత చిత్రాల కంటే ఈ చిత్రం బాగుందని ఫోన్లు చేస్తున్నారు’’ అన్నారు మారుతి. ‘‘ఈ సక్సెస్ మీట్కి కారణం ప్రేక్షకులే. వారికి థ్యాంక్స్’’ అన్నారు అనూ ఇమ్మాన్యుయేల్. నటులు నరేశ్, పృథ్వీ, సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫి తదితరులు పాల్గొన్నారు. -
‘కలెక్షన్లు చెప్పినప్పుడు నమ్మలేకపోయాను’
సాక్షి, హైదరాబాద్: అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, అను ఇమ్మాన్యూల్ జంటగా డైరక్టర్ మారుతి తెరకెక్కించిన శైలజా రెడ్డి అల్లుడు బాక్సాఫీస్ వద్ద కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. వినాయక చవితికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మూడు రోజుల్లో దాదాపు 23 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇందుకు సంబంధించి చిత్ర బృందం పీపుల్స్ బ్లాక్బస్టర్ పేరిట పోస్టర్ను రిలీజ్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్తో దూసుకెళుతోంది. చిత్ర విజయాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ శనివారం థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో నాగ చైతన్య మాట్లాడుతూ.. శైలజా రెడ్డి చిత్రాన్ని ఘనవిజయం చేసినందుకు ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మొదట సినిమా కలెక్షన్లు చెప్పినప్పుడు నమ్మలేకపోయానని అన్నారు. ఈ సినిమాకు నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయని.. అందుకు మారుతికి థ్యాంక్యూ చెప్పాలని అన్నారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ నటనకు చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. శైలజా రెడ్డి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు వాళ్ల సొంతింటి అల్లుడిలా ఆదరిస్తున్నారని తెలిపారు. ఈ సినిమా కలెక్షన్లు మాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయని.. అక్కినేని ఫ్యాన్స్ తనకు సూపర్ ఎనర్జీ ఇచ్చారని వెల్లడించారు. నాగ చైతన్య, అను, రమ్యకృష్ణ లకు స్పెషల్ థ్యాంక్స్ తెలిపారు. ఈ సినిమా బాగుందని ఫ్యామిలీల నుంచి ఫోన్లు వస్తున్నాయని అన్నారు. చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అను మాట్లాడుతూ.. ముందు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాలని అన్నారు. మారుతికి, నాగచైతన్యకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సినిమా చూడని వాళ్లు థియేటర్ వెళ్లి తప్పక సినిమా చూడండి అని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో నరేష్, పృథ్వీ, సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫీ, నాగవంశీ పాల్గొన్నారు. -
అలరిస్తున్న అల్లుడు
-
‘శైలజారెడ్డి అల్లుడు’ మూవీ సక్సెస్ మీట్
-
నాగ్ సినిమాలో చైతూ హీరోయిన్..!
కింగ్ నాగార్జున డిఫరెంట్ రోల్స్కు, మల్టీస్టారర్ సినిమాలకు సై అంటున్నారు. తాజాగా నానితో కలిసి దేవదాస్ సినిమాలోనటిస్తున్న నాగ్, త్వరలో ఓ తమిళ మల్టీస్టారర్లో నటించేందుకు ఓకె చెప్పారు. పవర్పాండి సినిమాతో కోలీవుడ్లో దర్శకుడిగా సక్సెస్ సాధించిన ధనుష్ త్వరలో ఓ మల్టీస్టారర్ సినిమాలో నటిస్తూ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో మరో హీరోగా టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ తేనాండళ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అదితిరావ్ హైదరీని ఫైనల్ చేయగా మరో హీరోయిన్ పాత్రకు అను ఇమ్మాన్యూల్ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా నాగచైతన్య సరసన శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో నటించిన అను, వెంటనే నాగ్ సినిమాలో ఛాన్స్ కొట్టేశారు. శరత్ కుమార్, ఎస్జే సూర్యలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు పవర్ పాండి ఫేం సీన్ రోనాల్డ్ సంగీతమందిస్తున్నారు. -
అవే నన్ను నిలబెట్టాయి
‘‘నేను చేసిన వెరైటీ రోల్స్ మాత్రమే నన్ను ఇలా నిలబెట్టాయి. అలాంటివి చేస్తూనే ఉంటాను. ‘శైలజా రెడ్డి అల్లుడు’ రెగ్యులర్గా కనిపించే అత్తా, అల్లుళ్లు కామెడీ మూవీలా ఉండదు. చూస్తే కచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. ఇందులో కొత్త అత్త, కొత్త అల్లుణ్ని చూస్తారు’’ అని రమ్యకృష్ణ అన్నారు. నాగ చైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. పీడీవీ ప్రసాద్, నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా గురువారం రిలీజైంది. మంచి ఓపెనింగ్స్ సాధించిందని చిత్రబృందం పేర్కొంది. ఈరోజు తన పుట్టిన రోజు సందర్భంగా రమ్యకృష్ణ సినిమా విశేషాలు పంచుకుంటూ – ‘‘నా బర్త్డే టైమ్లో రిలీజైన మా చిత్రం సూపర్ హిట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అందరం జెన్యూన్గా కష్టపడ్డాం. ఇందులో మారుతిగారు నా కోసం రెండు షేడ్స్ ఉన్న పాత్ర రాశారు. చాలా స్పీడ్గా వర్క్ చేస్తారాయన. నా కెరీర్లో ఫాస్ట్గా కంప్లీట్ చేసిన మూవీ ఇదే. కామెడీ సీన్స్ మధ్యలో ఆపేసి మరీ నవ్వేవాళ్లం. నా చుట్టూ కామెడీ జరుగుతుంటే సీరియస్గా ఉండటం కష్టంగా అనిపించేది. చైతన్య వెరీ డౌన్ టు ఎర్త్. యాక్టర్గా చాలా బాగా ఎదుగుతున్నాడు. నన్ను కన్విన్స్ చేసే సీన్లో బాగా యాక్ట్ చేశాడు. -
‘అల్లుడు’ వసూళ్లు అదరగొడుతున్నాడు
నాగ చైతన్య మంచి జోష్లో ఉన్నాడని తెలుస్తోంది. ‘శైలజా రెడ్డి అల్లుడు’తో ఈ వినాయక చవితికి ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకెళ్లడంతో సంతోషంగా ఉన్నట్టున్నాడు. మారుతి స్టైల్లో తెరకెక్కిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ బాగానే వర్కౌట్ అయినట్టు కనిపిస్తోంది. ఈ సినిమా తొలిరోజే పన్నెండు కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసింది. తన సినిమా కెరీర్లో హయ్యస్ట్ ఓపెనర్గా ఈ చిత్రం నిలిచింది. నాగ చైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచేలా ఉంది ఈ చిత్రం. ఈ మూవీలో రమ్యకృష్ణ, అను ఇమాన్యుయేల్, మురళీ శర్మ, నరేష్ కీలకపాత్రల్లో నటించారు. ఇక ఈ యువ హీరో తన తదుపరి ప్రాజెక్ట్ ‘సవ్యసాచి’తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. #ShailajaReddyAlludu scores 12 Crores gross worldwide on its day 1, Highest ever in @chay_akkineni 's career, Thanks to all for the phenomenal response 🙏 Book Your Tickets Now: https://t.co/l2Jw77hHje https://t.co/ddkMF6fRty @directormaruthi @itsanuemmanuel @vamsi84 pic.twitter.com/LSddrkrpHU — Sithara Entertainments (@SitharaEnts) September 14, 2018 -
‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీ రివ్యూ
టైటిల్ : శైలజా రెడ్డి అల్లుడు జానర్ : రొమాంటిక్ యాక్షన్ కామెడీ తారాగణం : నాగచైతన్య, రమ్యకృష్ణ, అను ఇమ్మాన్యూల్, మురళీ శర్మ, నరేష్, వెన్నెల కిశోర్ సంగీతం : గోపి సుందర్ దర్శకత్వం : మారుతి దాసరి నిర్మాత : ఎస్ రాధకృష్ణ, నాగవంశీ ఎస్, పీడీవీ ప్రసాద్ వరుస విజయాలతో సూపర్ ఫాంలో ఉన్న యువ దర్శకుడు మారుతి, అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా శైలజా రెడ్డి అల్లుడు. తెలుగు తెర ఒకప్పుడు సూపర్ హిట్ అయిన అత్త సెంటిమెంట్ను మరోసారి రిపీట్ చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాలో అత్త పాత్రలో రమ్యకృష్ణ నటించారు. మరి హిట్ ఫార్ములా నాగచైతన్య కెరీర్లో మరో హిట్గా నిలిచిందా..? రమ్యకృష్ణ అత్త పాత్రలో ఏమేరకు ఆకట్టుకున్నారు..? మారుతి తన సక్సెస్ ట్రాక్ను కంటిన్యూ చేశారా..? కథ : చైతన్య (నాగ చైతన్య ) భయంకరమైన ఈగో ఉన్న సక్సెస్ఫుల్ బిజినెస్మెన్ రావు(మురళీ శర్మ) కొడుకు. తన ఈగో కోసం కూతురు పెళ్లిని కూడా క్యాన్సిల్ చేసుకునేంత ఈగో రావుది. తన కాలనీ లోకి కొత్తగా వచ్చిన అను(అను ఇమ్మాన్యూల్) అనే అమ్మాయి తొలిచూపులోనే ఇష్టపడతాడు చైతూ.. అనుకి కూడా తన తండ్రిలాగే భరించలేనంత ఈగో ఉందని తెలిసి పని మనిషిని ప్రేమిస్తున్నట్లుగా నాటకమాడి అనుని ప్రేమలోకి దించుతాడు. అనుకి కూడా తనలాగే ఈగో ఎక్కువ అని తెలుసుకున్న రావు.. చైతన్య, అనుల పెళ్లికి ఒప్పుకుంటాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఫ్యామిలీ ఫంక్షన్లో అను పర్మిషన్ లేకుండా ఎంగేజ్మెంట్ కూడా చేసేస్తాడు. (సాక్షి రివ్యూస్) కానీ అదే సమయంలో అను.. వరంగల్ జిల్లాను శాసించే శైలజా రెడ్డి(రమ్యకృష్ణ) కూతురు అని తెలుస్తోంది. తనకి తెలియకుండా ఏది జరగడానికి ఇష్టపడని శైలజా రెడ్డి... చైతన్య, అనుల పెళ్లికి ఒప్పుకుందా..? ఈగోని పక్కన పెట్టి శైలజా రెడ్డి, రావు.. చైతన్య, అనుల పెళ్లికి ఒప్పుకున్నారా? అన్నదే మిగతా కథ. నటీనటులు సినిమాలో తెర నిండా నటులు ఉన్నా సినిమా అంతా ముఖ్యంగా నాగచైతన్య, రమ్యకృష్ణ, అను ఇమ్మాన్యూల్ల చుట్టూనే తిరుగుతుంది. కాబోయే అత్త, ప్రియురాలి మధ్య నలిగిపోయే పాత్రలో నాగ చైతన్య మంచి నటన కనబరిచాడు. గత చిత్రాలతో పోలిస్తే నటుడిగా మంచి పరిణతి కనబరిచాడు. కామెడీ టైమింగ్తోనూ ఆకట్టుకున్నాడు. కమర్షియల్ ఫార్మాట్ సినిమా కావటంతో డ్యాన్సులు, ఫైట్స్కు కూడా మంచి అవకాశం దక్కింది. ఇక కీలకమైన అత్త పాత్రలో రమ్యకృష్ణ మరోసారి విశ్వరూపం చూపించారు. భరించలేనంత ఈగోతో అందరినీ ఇబ్బంది పెట్టే పాత్రలో రమ్యకృష్ణ నటన అందరిని అలరిస్తుంది. (సాక్షి రివ్యూస్) సెకండాఫ్లో ఎంట్రీ ఇచ్చినా అందరినీ డామినేట్ చేసేశారు. ఎమోషనల్ సీన్స్లోనూ తన ఎక్స్పీరియన్స్ను చూపించారు. ఈగో విషయంలో అమ్మతో తలపడే పాత్రలో అను ఇమ్మాన్యూల్ ఆకట్టుకున్నారు. రమ్యకృష్ణతో పోటి పడి నటించే సీన్స్లో కాస్త తేలిపోయినట్టుగా అనిపించినా.. గ్లామర్ తో ఆకట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్లో మురళీ శర్మ కూడా రమ్యకృష్ణ రేంజ్లో ఈగో చూపించారు. హీరోయిన్ తండ్రిగా నరేష్ మరోసారి తనదైన నటనతో మెప్పించారు. వెన్నెల కిశోర్, 30 ఇయర్స్ పృథ్వీ కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. విశ్లేషణ గత చిత్రాల్లో హీరోలకు డిఫెక్ట్ చూపించిన దర్శకుడు మారుతి ఈ సినిమాలో లేడి క్యారెక్టర్స్ కు కూడా డిఫెక్ట్ ను యాడ్ చేశాడు. విపరీతమైన ఈగోతో అందరిని ఇబ్బందులు పెట్టే అత్త పాత్రను అద్భుతంగా డిజైన్ చేశాడు. గత చిత్రాల విషయంలో కామెడీ మీదే ఎక్కువగా దృష్టి పెట్టిన మారుతి ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా మలిచాడు. తొలి భాగం హీరో హీరోయిన్ల లవ్ స్టోరి, రొమాటింక్ సీన్స్తో సాగదీసిన దర్శకుడు.. కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. (సాక్షి రివ్యూస్) ద్వితీయార్థంలోనూ కామెడీ కంటిన్యూ చేస్తూ యాక్షన్, ఎమోషనల్ సీన్స్తో ఫ్యామిలీ ఆడియన్స్ను మెప్పించే ప్రయత్నం చేశాడు. అయితే సినిమా అంతా 90లలో వచ్చిన కమర్షియల్ ఫార్ములా సినిమాలను గుర్తు చేస్తుంది. సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ కామెడీ. మారుతి తన మార్క్ కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు. క్లైమాక్స్లో శైలజ రెడ్డి, రావు మనసు మార్చుకొని పెళ్లికి ఒప్పుకునే సన్నివేశం అంత కన్విన్సింగ్గా అనిపించదు. గోపిసుందర్ తన ట్యూన్స్తో మరోసారి మ్యాజిక్ చేశాడు. టైటిల్ సాంగ్ తో పాటు అనుబేబి, ఎగిరే పాటలు విజువల్గా కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : నాగచైతన్య, రమ్యకృష్ణ నటన కామెడీ మైనస్ పాయింట్స్ : పాత కథ రొటీన్ టేకింగ్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
‘యువసామ్రాట్’ వద్దన్నా
‘‘సక్సెస్ విషయంలో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అవుతున్నాయి. పెద్ద సినిమాలు చిన్నవి అవుతున్నాయి. కథ ముఖ్యం. సినిమా సక్సెస్ అనేది కేవలం హీరో, డైరెక్టర్దే కాదు. ఆ సినిమాకి చేసిన ఇతర యాక్టర్స్, టెక్నీషియన్స్కూ చెందుతుంది’’ అన్నారు నాగచైతన్య. మారుతి దర్శకత్వంలో నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా ఎస్. రాధాకృష్ణ సమర్పణలో నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించిన సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా నాగచైతన్య చెప్పిన విశేషాలు. ► ఈ సినిమాలో ఈగో లేని హీరో క్యారెక్టర్ చేశాను. కానీ, నా చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ ఫుల్గా ఈగో ఫీల్ అవుతాయి. అప్పుడు హీరో ఏం చేశాడు? అనేది ఆసక్తికరం. అనవసర ఈగో వల్ల వచ్చే సమస్యలు, రిలేషన్ బ్రేక్ అయ్యే పరిస్థితులను సినిమాలో చూపించాం. క్లైమాక్స్లో మంచి ఎమోషనల్ డ్రామా ఉంది. నాకు, ‘వెన్నెల’ కిశోర్ మధ్య ఉన్న సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. నా దృష్టిలో ఒక బ్యాలెన్సింగ్ కోణంలో ఈగో కరెక్టే అనిపిస్తుంది. కానీ, అది పక్కవారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. ఈ సినిమాతో ఆడియన్స్కు మరింత చేరువ అవుతాను. ► మారుతీగారు ‘బాబు బంగారం’ సినిమా చేస్తున్నప్పుడు నేను ‘ప్రేమమ్’ చేస్తున్నాను. అప్పుడు ఆయనతో పరిచయం అయ్యింది. అలా ఈ సినిమా ప్రారంభానికి బీజం పడింది. నిర్మాత రాధాకృష్ణగారి జడ్జిమెంట్ బాగుంటుంది. అలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి కావాలి. నాన్నగారితో రమ్యకృష్ణగారు చాలా సినిమాలు చేశారు. ఈ సినిమా బిగినింగ్లో రమ్యకృష్ణగారితో కలిసి వర్క్ చేయడం కాస్త నెర్వస్గా అనిపించింది. ► ఒక సినిమా రిలీజ్ డేట్ మార్చడం కరెక్ట్ కాదన్నదే నా అభిప్రాయం. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ‘శైలజారెడ్డి అల్లుడు’ రిలీజ్ డేట్ మార్చాల్సి వచ్చింది. సమంత ‘యు టర్న్’, నా సినిమా ఒకేసారి వస్తాయనుకోలేదు. నిజానికి వాళ్లే ముందు డేట్ ఫిక్స్ చేసుకున్నారు. మా సినిమా, మీ ‘యు టర్న్’తో పాటు వస్తుందని సమంతతో చెప్పినప్పుడు ఇంట్లో ఓ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. మా ఇద్దరి సినిమాల్లో ఏది సక్సెస్ కావాలంటే.. రెండూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ► యువసామ్రాట్ ట్యాగ్ వద్దని మారుతిగారికి చెప్పాను. కానీ వినలేదు. ఈ ట్యాగ్ను పెద్ద బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చదువుతాను. నెగటివ్ కామెంట్స్ను పాజిటివ్గానే తీసుకుంటాను. నా మీద ప్రేమతోనే వాళ్లు అలా స్పందిస్తున్నారనుకుంటున్నా. ► ‘సవ్యసాచి’ సినిమాలో ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది. నవంబర్లో రిలీజ్ చేస్తున్నాం. శివనిర్వాణ డైరెక్షన్లో చేయబోతున్న సినిమా అక్టోబర్ ఫస్ట్ వీక్లో, ‘వెంకీమామ’ సినిమా అక్టోబర్ ఎండింగ్లో స్టార్ట్ అవుతాయి. ► నాన్నగారి కోసం (నాగార్జున) రాహుల్ రవీంద్రన్ ఓ కథ రెడీ చేస్తున్నాడు. అలాగే ‘బంగార్రాజు’ సినిమాలో నాన్నగారితో కలిసి యాక్ట్ చేసేది నేనా? అఖిలా? అనేది త్వరలో తెలుస్తుంది. డిజిటల్ మీడియా వైపు మా బ్యానర్ ఫోకస్ పెట్టింది. కొన్ని వెబ్ సిరీస్లు ప్లాన్ చేస్తున్నాం. ► కొత్త డైరెక్టర్స్ను ప్రోత్సహించడం ఇష్టమే. ఆల్రెడీ కొన్ని సినిమాలు చేశాను కూడా. కొన్ని వర్కౌట్ కాలేదు. అయితే ఒకరిని వేలెత్తి చూపే మనస్తత్వం కాదు నాది. నా జడ్జిమెంట్ కూడా తప్పు అయ్యుండవచ్చు. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో కెల్లా ‘ప్రేమమ్’కు బాగా కనెక్ట్ అయ్యాను. ► పెళ్లి తర్వాత లైఫ్ బాగుంది. పెళ్లి తర్వాత సమంతకు కెరీర్ ఎలా ఉంటుందో అని భయపడ్డాను. కానీ, ఆమె కెరీర్ సూపర్గా సాగడం హ్యాపీగా ఉంది. ► కెరీర్ పరంగా యాక్టర్స్ అందరికీ థ్రెట్ ఉంటుంది. అందరూ మంచి సినిమాలే చేయాలనుకుంటారు. ఇలాంటి పోటీ వాతావరణం మంచిదే. మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘ఆర్ ఎక్స్ 100’... సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. నేనీ టైప్ సినిమాలు చేయాలంటే కాస్త టైమ్ పడుతుంది. -
‘నా కెరీర్లో అవే చెత్త సినిమాలు’
వినాయక చవితి సందర్భంగా శైలజా రెడ్డి అల్లుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు యంగ్ హీరో నాగ చైతన్య. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సినిమా ప్రమోషన్లో పాలు పంచుకుంటున్నాడు చైతూ. తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ఈ సందర్భంగా తన కెరీర్లో తనకు బాగా నచ్చిన నచ్చని సినిమాలు వెల్లడించాడు చైతూ. ప్రేమమ్ తన కెరీర్లోనే బెస్ట్ సినిమా అన్న నాగచైతన్య.. దడ, బెజవాడ సినిమాలు చెత్త సినిమాలన్నాడు. ఆ సినిమాలు చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నానని తెలిపారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన శైలజా రెడ్డి అల్లుడు రేపు (13-09-2018) రిలీజ్ అవుతోంది. రమ్యకృష్ణ అత్తగా నటించిన ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటించారు. -
కేటీఆర్పై నాగ చైతన్య కామెంట్!
‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాతో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు నాగచైతన్య. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మారుతి స్టైల్ టేకింగ్లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా అభిమానులతో ముచ్చటించేందుకు సోషల్మీడియాలో ఆన్లైన్లోకి వచ్చాడు ఈ యువ హీరో. అభిమానుల ప్రశ్నల తాకిడికి కూల్గా సమాధానమిచ్చాడు. ఈ సినిమాలో తనకు నచ్చిన పాటలు, రాబోయో తన ప్రాజెక్ట్ల గురించి, అజిత్, రామ్చరణ్, ప్రభాస్ ఇలా హీరోలందరి గురించి తన అభిప్రాయాన్ని తెలపమని నాగచైతన్యను అడిగారు. ఇక దీంట్లో భాగంగా కేటీఆర్ గురించి అడగ్గా.. ఆయనొక నిజమైన లీడర్.. ప్రభావితం చేయగల నాయకుడంటూ బదులిచ్చారు. ప్రభాస్ గురించి అడగ్గా.. లార్జర్ దెన్ లైఫ్ అని, రామ్ చరణ్పై స్పందిస్తూ.. సినిమా సినిమాకు బెటర్ అవుతూ ఉంటున్నాడు..అతని స్టైల్ ఇష్టమని సమాధానమిచ్చాడు. వెంకటేష్, రకుల్ ప్రీత్ సింగ్, మహేష్ బాబు, నాగార్జునలకు సంబంధించిన ప్రశ్నలు అభిమానులు అడిగారు. నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయేల్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న శైలజా రెడ్డి అల్లుడు సెప్టెంబర్ 13న విడుదల కానుంది. -
నా నడక భారతీయ స్త్రీల మాదిరి ఉండదు..
సినిమా: నా నడకే ఒక కిక్కు అంటోంది నటి అను ఇమ్మానుయేల్. ఏంటీ అంత సీన్ లేదు అని అనుకుంటున్నారా? మీరేమైనా అనుకోండి నా స్టైలే వేరు అంటోంది ఈ అమ్మడు. అన్నట్టు ఈమె చికాగో బ్యూటీ అన్న విషయం ఎందరికి తెలుసు? అయితే మాలీవుడ్కు బాల నటిగా కాలు పెట్టి, అక్కడే కథానాయకిగా కూడా నటించేసింది. ఇంకేముంది మాలీవుడ్లో నటిస్తే టాలీవుడ్, కోలీవుడ్లకు ఈ బ్యూటీ ఎంట్రీ ఈజీనే అవుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే జరిగింది. మాలీవుడ్ నుంచి సరాసరి టాలీవుడ్కు ఆపై కోలీవుడ్కు దిగుమతి అయిపోయింది. తెలుగులో మజ్ను చిత్రం మంచి విజయాన్ని అందించడంతో అక్కడ చకచకా పవన్కల్యాణ్, అల్లుఅర్జున్ లాంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసేసింది. అయితే అవేవి అమ్మడి కెరీక్కు ఉపయోగపడలేదు. తాజాగా నాగచైతన్యతో నటించిన శైలజారెడ్డి అల్లుడు ఇటీవల తెరపైకి రానుంది. ప్రస్తుతం మరో అవకాశం చేతిలో లేదు. ఇక కోలీవుడ్లోనూ మంచి ఎంట్రీనే లభించింది. విశాల్కు జంటగా తుప్పరివాలన్ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే ఆ చిత్రం హిట్ అయినా అమ్మడిని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో అమ్మడు వార్తల్లో ఉంటూ ఉచిత ప్రచారం పొందాలనుకుంటోంది. అందులో భాగంగానే నా నడకలోనూ కిక్కు ఉంది అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంతకీ ఈ జాణ ఏమంటుందో చూస్తే ఓ పనైపోద్దిగా! నేను చీర కట్టినా నాలో అమెరికా యువతి చాయలు కనిపిస్తున్నాయని అంటున్నారు. నేను చీర కట్టినా, సెర్చ్కు వెళ్లినా నా శారీరక భాష భారతీయ అమ్మాయిలకు భిన్నంగానే ఉంటుంది. నేను కూర్చున్నా, నడిచినా భారతీయ స్త్రీల మాదిరి ఉండదు. ఇంకా చెప్పాలంటే నా నడకలోనే ఓ కిక్కు ఉంటుంది. అందుకు లెక్క నేను అమెరికా అమ్మాయి కావడమే. ఇక్కడ చిత్రాల్లో నటిస్తుండడంతో ఇండియన్ స్త్రీల వస్త్రాధరణను గమనిస్తూ అలవాటు చేసుకుంటున్నాను. నిజం చెప్పాలంటే నేను చాలా శాంత స్వభావిని. గట్టిగా మాట్లాడను కూడా. ఇతరులు ఎంతగా మాట్లాడుతున్నా గమనిస్తూ ఉంటాను. అలాంటి ఇప్పుడు ఒక చిత్రంలో నా స్వభావానికి విరుద్ధమైన పాత్రలో నటిస్తున్నాను. ఈర్శా్యభావం కలిగిన అమ్మయిగా బిగ్గరగా అరచి నటించిన సన్నివేశాలు చూస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది అని అంటున్న అనుఇమ్మానుయేల్ తను అంతగా హంగామా చేసి నటిస్తున్న చిత్రం ఏదో చెప్పలేదు. బహుశా తెలుగు చిత్రం శైలజారెడ్డి అల్లుడు అనుకుంటా. -
‘శైలజారెడ్డి అల్లుడు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
‘అల్లరి అల్లుడు’ అంత హిట్ అవ్వాలి
‘‘చైతన్యని అందరూ శైలజారెడ్డిగారి అల్లుడు అంటున్నారు.. కాదు.. అక్కినేని నాగేశ్వరరావుగారి మనవడు.. నాగార్జున పెద్దకొడుకు. ప్రేమకథా చిత్రాలైనా, ఎంటర్టైన్మెంట్ చిత్రాలైనా, ఒక స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ ఉన్న సినిమాల్లో అయినా నాన్నగారికి నాన్నగారే సాటి. ఇప్పుడు ఆయన వారసత్వాన్ని చైతన్య తీసుకున్నాడు’’ అని హీరో నాగార్జున అన్నారు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఎస్.రాధాకృష్ణ(చినబాబు) సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎస్.నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 13న విడుదలవుతోంది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘చైతన్య చాలా సాఫ్ట్.. చక్కగా నవ్వుతూ ఉంటాడు.. బంగారం.. అని మీరందరూ అంటూ ఉంటారు. కాదు.. తనలో చిలిపితనం కూడా ఉంది. నేను కొంచెం సినిమా చూశా. మారుతీగారు ఆ చిలిపితనాన్ని చక్కగా వాడుకున్నారు. నేను, రమ్యకృష్ణ కలసి ఎన్నో సినిమాలు చేశాం, చాలా పెద్ద హిట్స్ అయ్యాయి.‘బాహుబలి’ తర్వాత రమ్య అంటే భారతదేశంలో తెలియనివారు ఎవరూ లేరు. నాతోపాటు ‘అల్లరి అల్లుడు’ చిత్రంలో చిన్న గెస్ట్రోల్ చేసింది. ఇప్పుడు చైతన్యతో ‘శైలజారెడ్డి అల్లుడు’ చేసింది. ఈ సినిమా ‘అల్లరి అల్లుడు’ అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మారుతీగారికి మాస్ పల్స్ బాగా తెలుసు. మా ఫ్యాన్స్కి ఏం కావాలో ఈ సినిమాలో మీరు ఇస్తున్నందుకు థ్యాంక్స్. గత నెలలో నాకు బాగా దగ్గరైన ఇద్దరు మనల్ని వదిలి వెళ్లిపోయారు. హరి అన్నయ్య(హరికృష్ణ). ఎవర్నైనా ఇక్కడ నేను ‘అన్న’ అని పిలుస్తానంటే అది ఆయనొక్కర్నే. ఆయన వెళ్లిపోయిన రోజు నా పుట్టినరోజు. పొద్దున్నే వార్త వినగానే ఎలా కనెక్ట్ చేసుకోవాలో కూడా తెలియలేదు. నా స్నేహితుడు, ఆత్మీయుడు రవీందర్ రెడ్డి మరణం కూడా నన్ను బాధించింది. చైతన్య కెరీర్లో ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా బిగ్గెస్ట్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. హీరో నాని మాట్లాడుతూ– ‘‘ఇంతకుముందు జనరేషన్లో మంచి సాంగ్స్ అన్నీ నాగార్జునగారికి పడితే.. మా జనరేషన్లో మంచి సాంగ్స్ నాగచైతన్యకు పడ్డాయి. ఆ ఫ్యామిలీకి మంచి పాటలన్నీ అలా రాసిపెట్టినట్లు ఉన్నాయి. ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం కొంచెం ‘అల్లరి అల్లుడు’ లాంటి సినిమా అని నాగార్జునగారు నాతో అన్నారు. ఆ మాట చాలు ఈ సినిమాలో ఏ స్థాయి ఎంటర్టైన్మెంట్ ఉంటుందో’’ అన్నారు. ‘‘ఇంత స్పీడ్గా షూటింగ్ పూర్తి చేసి, ఇంతే త్వరగా సినిమా రిలీజ్ చేస్తుండటం ఇన్నేళ్లలో ఫస్ట్టైమ్ చూస్తున్నా. వేడివేడిగా మీ ముందుకు రాబోతోంది’’ అన్నారు రమ్యకృష్ణ. మారుతి మాట్లాడుతూ– ‘‘నాగచైతన్యగారిని మీరు(అభిమానులు) ఎలా చూడాలనుకుంటున్నారో వందశాతం అలాగే ఉంటారని గ్యారంటీ ఇస్తున్నా. ఈ సినిమా నుంచి ఆయన యువసామ్రాట్.. ఫిక్స్ అవ్వండి. ఈ సినిమాలో ట్యాగ్ వేస్తున్నా. ‘శైలజారెడ్డి అల్లుడు’ ఓ మంచి లవ్స్టోరీ. రమ్యమేడమ్తో ఫొటో దిగడం, పనిచేయడం అందరికీ ఓ కలలా ఉంటుంది. అలాంటిది ఆమెను డైరెక్ట్ చేయడం నా కల నెరవేరినట్టే. ఓ యాక్టర్గా, హీరోగా పరిచయమైన నా హీరో(నాగచైతన్య).. ఇప్పుడు నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు’’ అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘మా అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. బయటికి అభిమానులు అంటున్నాం కానీ మీరందరూ నా ఫ్యామిలీయే. ప్రతి సినిమా ఈవెంట్కి వచ్చి ఇలాగే ఎంకరేజ్ చేసి ఇదే ఎనర్జీ ఇచ్చి ప్రోత్సహిస్తారు. మీరే నా బలం, బలహీనత.. మీరిచ్చే ప్రేమకి మీరు కోరుకునేది ఓ హిట్ సినిమా. ఇకనుంచి ప్రతి సినిమా మిమ్మల్ని మైండ్లో పెట్టుకుని మీరు గర్వపడే సినిమాలు చేస్తానని మాట ఇస్తున్నా. మారుతిగారు మనకి ఓ సూపర్ సినిమా ఇచ్చారు. చినబాబుగారు, వంశీ, పీడీవీ ప్రసాద్గారు రెండేళ్లకిందట ఎప్పటికీ మరచిపోలేని ‘ప్రేమమ్’ అనే సినిమా ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమా ఇచ్చారు. రమ్య మేడమ్ ఈ సినిమాకి పెద్ద సపోర్ట్. పండుగకి ఇది పండుగలాంటి సినిమా. మీరు ఎంజాయ్ చేసి, మీ మొహంలో ఓ నవ్వుంటే నేనూ ఆరోజు పండుగ చేసుకుంటా’’ అన్నారు. ‘‘ఇటీవల స్టేజ్ ఎక్కిన ప్రతిసారి నాకు మాటలు సరిగ్గా వచ్చేవి కాదు. అన్నయ్య(నాగచైతన్య) గురించి మాట్లాడాలన్నప్పుడు మాత్రం తన్నుకుంటూ వస్తున్నాయి. మారుతీగారు మీరు కరెక్ట్ టైమ్లో కరెక్ట్ హీరోని పట్టారు. సినిమాలో అల్లుణ్ని చేశారు. పెళ్లి చేసుకున్న తర్వాత అన్నయ్య ఫేస్లో సడెన్గా మంచి గ్లో వచ్చింది’’ అని హీరో అఖిల్ అన్నారు. చిత్ర సమర్పకులు రాధాకృష్ణ, నిర్మాతలు పీడీవీ ప్రసాద్, నాగవంశీ, అనూ ఇమ్మాన్యుయేల్, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రవిశంకర్, నటులు కాశీ విశ్వనాథ్, నరేశ్, సంగీత దర్శకుడు గోపీసుందర్, కెమెరామెన్ నిజ ర్ పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కొన్ని రోజులు డిజార్డర్స్కి బ్రేక్
‘‘ఈ మధ్య అన్నీ డిజార్డర్స్ (హీరో క్యారెక్టర్కి లోపం) తోనే సినిమాలు చేస్తున్నాం అని అంటున్నారు. ఈ సినిమాలో ఏ డిజార్డర్ ఉండదు. కొన్ని రోజులు డిజార్డర్స్కి బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాను. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీశాను’’ అని దర్శకుడు మారుతి అన్నారు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై పీడివీ ప్రసాద్, నాగ వంశీ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 13న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మారుతి చెప్పిన విశేషాలు. ► ముందుగా ఈ సినిమాను ఆగస్ట్ 31న రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కానీ కేరళ వరదల కారణంగా కుదర్లేదు. సంగీత దర్శకుడు గోపీ సుందర్ చుట్టాలు కూడా ఆ వరదల్లో చిక్కుకుపోయారు. దాంతో ఈ సినిమాను వాయిదా వేసేశాం. ► ‘శైలజా రెడ్డి అల్లుడు’ అనే టైటిల్ చూడగానే ఈ సినిమా అత్తా అల్లుడి మధ్య సవాల్ అని ఊహించేసుకుంటారు. కానీ ఇది అత్తా అల్లుడే కాదు వాళ్ల అమ్మాయితో కూడా ఈగో సమస్యల్లో ఇరుకుంటాడు హీరో. సాధారణ మనిషి శైలజా రెడ్డి అల్లుడు ఎలా అయ్యాడని కథ. ఈగోయిస్ట్ మనుషులతో హీరో ఎలా నలిగిపోతాడన్నది మరో కోణం. హీరోకి చాలా సహనం కావాలి. రియల్గా కూడా చైతూకి ఓపిక ఎక్కువ. పాజిటివ్ పర్సన్. ► ఫస్ట్ యూత్ఫుల్ స్టోరీ (‘ఈ రోజుల్లో’), హారర్ కామెడీ (ప్రేమకథా చిత్రమ్), ఆ తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైనర్ (‘భలే భలే మగాడివోయ్’) తీశాం. ఇప్పుడు ఫుల్లెంగ్త్ ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ చేశాను. ఎప్పటికప్పుడు కొత్త జానర్స్ టచ్ చేస్తే మనం ఇంప్రూవ్ అవుతాం. ► ఎప్పుడూ అత్తలంటే చెడ్డవాళ్లే అనుకుంటాం. కానీ ఇందులో అలా కాదు. చైతూ చాలా కొత్తగా ఉంటాడు. రమ్యకృష్ణగారి పాత్రకు కూడా కథలో ఇంపార్టెన్స్ ఉంది. అందుకే ఈ టైటిల్ పెట్టాం. ► ‘అల్లరి అల్లుడు’లాంటి పాత టైటిల్స్ పెడదాం అనుకున్నాం కానీ విరమించుకున్నాం. ఇందులో టైటిలే కొంచెం పాతగా ఉంటుంది. సినిమా మాత్రం కొత్తగా ఉంటుంది. చైతూ కూడా క£ý లో భాగం అవుతాడు. మొత్తం నా మీదే నడవాలని అనుకోడు. ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు కూడా నాగార్జునగారి ఫ్యామిలీ చేస్తున్న సినిమాల దృష్టిలో పెట్టుకొని కథను అనుకున్నాను. ► అనూ ఇమ్మాన్యుయేల్ బయట ఎలా ఉంటుందో సినిమాలో కూడా అలానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా లవ్స్టోరీ, సెకండ్ హాఫ్ అంతా ఫుల్ ఫ్యామిలీ సీన్స్ ఉంటాయి. ప్రొడ్యూసర్స్ నాగ వంశీ, ప్రసాద్గార్లు రిచ్గా సినిమాని తీశారు. ఈ సినిమా నా కెరీర్లో చాలా రిచ్గా ఉంటుంది. ► కొన్నిసార్లు మనం అనుకున్న ఐడియాకు వేరే దర్శకుడు కనెక్ట్ కాకపోవచ్చు. వీళ్లు చేయగలరు అని నాకు నమ్మకం కుదిరితే వేరే డైరెక్టర్స్తో సినిమాలు నిర్మించాలనుకుంటున్నాను. అయితే ప్రస్తుతానికి చిన్న సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏ సినిమాకైనా అదే హార్డ్ వర్క్ ఉంటుంది. పెద్ద సినిమాకు ఓ నెల శ్రమ ఉంటుంది. చిన్న సినిమాను హిట్ చేయడం గ్రేట్. కొత్తవాళ్ల పోస్టర్స్తో ఆడియన్స్ను థియేటర్కి తీసుకురావడం గ్రేట్. -
అన్నీ సొంత నిర్ణయాలే!
‘‘కెరీర్ స్టార్టింగ్లో ఉన్నాను. తప్పులు చేస్తే దిద్దుకునే అవకాశం ఉంటుంది. పోటీ ఫీలవ్వను. హిట్, ఫ్లాప్స్ నా కంట్రోల్లో ఉండవు. సినిమాలు ఆడకపోతే చాన్సులు తగ్గుతాయనే నెర్వస్నెస్ ఉంటుంది. సినిమా సినిమాకు నన్ను నేను బెటర్ చేసుకోవాలనుకుంటాను. సొంత నిర్ణయాలు తీసుకోవడానికే ఇష్టపడతాను’’ అన్నారు అనూ ఇమ్మాన్యుయేల్. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యు యేల్ జంటగా మారుతి దర్శకత్వంలో నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా అనూ ఇమ్మాన్యుయేల్ చెప్పిన సంగతులు... ► ఈ మూవీలో ఈగోయిస్ట్ అండ్ యాంగ్రీ గాళ్ అను పాత్ర చేశాను. ఎప్పుడూ తనే నంబర్ 1 అవ్వాలనుకుంటుంది. గర్వంగా ఫీల్ అవుతుంది. కానీ ఒకసారి ప్రేమిస్తే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఇంతకు ముందు నేను చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది. రియల్ లైఫ్లో నేను కొంచెం ఈగోయిస్ట్. అయితే ఎంతవరకూ ఉండాలో అంతవరకే. ► నాగచైతన్య కంఫర్టబుల్ అండ్ చాలెంజింగ్ కో స్టార్. రమ్యకృష్ణగారి ఎనర్జీ సూపర్. పెద్ద పెద్ద డైలాగ్స్ను కూడా ఆమె జ్ఞాపకం పెట్టుకుని సులభంగా చెప్పేవారు. సినిమాలో రమ్యకృష్ణగారి కూతురు పాత్రలో కనిపిస్తాను. మారుతిగారు అమేజింగ్ డైరెక్టర్. సెట్లో నేను ఎక్కువగా సైలెంట్గానే ఉంటాను. కానీ ఒకసారి నాకు కనెక్ట్ అయితే నాన్స్టాప్గా మాట్లాడతాను. ► ‘అజ్ఞాతవాసి’ స్క్రిప్ట్ని వినే సైన్ చేశాను. ఆ సినిమా మంచి వర్కింగ్ ఎక్స్పీరియన్స్. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లో నటించడం హ్యాపీ. ‘గీత గోవిందం’ సినిమాలో నాకు ఆఫర్ వచ్చింది. కానీ డేట్స్ లేకపోవడంతో కుదరలేదు. అందుకే గెస్ట్ రోల్ చేశాను. ‘అజ్ఞాతవాసి, గీతగోవిందం’ సినిమాలకు నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పాను. హైదరాబాద్లో ఇల్లు ఇంకా కొనలేదు. కానీ హోమ్లీ ఫీలింగ్ ఉంది. ► నేను నటించిన కొన్ని సినిమాలు ఆశించినంతగా ఆడలేదు. అయితే ఏం? కెరీర్ స్టారింగ్లో శ్రుతీహాసన్కి కూడా ఇలానే జరిగింది. ఫ్లాప్స్ అనేవి జర్నీలో ఓ భాగం. ప్రస్తుతం నా మాతృభాష మలయాళంతో పాటు ఇతర భాషల నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ముందు తెలుగులో ప్రూవ్ చేసుకోవాలను కుంటున్నాను. మంచి స్క్రిప్ట్, స్ట్రాంగ్ రోల్స్ కోసం చూస్తున్నాను. ప్రయోగాత్మక చిత్రాలు చేయాలని ఉన్నా యంగ్ యాక్ట్రస్ని కాబట్టి ఇప్పుడే కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. కరెక్ట్ టైమ్ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. -
‘శైలజా రెడ్డి అల్లుడు’ కోసం ‘దేవదాస్’
అక్కినేని యువ కథా నాయకుడు నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం శైలజా రెడ్డి అల్లుడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శైలజా రెడ్డి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుండగా అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా కనిపించనున్నారు. ముందుగా ఈ సినిమాను ఆగస్టు 31న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినా అనివార్య కారణాల వల్ల సెప్టెంబర్ 13కు వాయిదా వేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ భారీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్9న నిర్వహించనున్న ఈ వేడుకకు దేవదాస్ చిత్ర కథానాయకులు నాగార్జున, నానిలు ముఖ్య అతిథిలుగా హాజరు కానున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతమందిస్తున్నారు. -
గూఢచారి దర్శకుడి నెక్ట్స్ ప్రాజెక్ట్
అడివి శేష్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా గూఢచారి. స్పై థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాతో శశికిరణ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనూ ఘన విజయాన్ని అందుకున్న ఈ యువ దర్శకుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ను ఓ బిగ్ బ్యానర్లో చేయనున్నాడట. యంగ్ హీరోలతో క్రేజీ ప్రాజెక్ట్స్ను లైన్లో పెట్టిన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో శశికిరణ్ తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు. ఈ బ్యానర్లో తెరకెక్కిన శైలజా రెడ్డి అల్లుడు వినాయక చవితి కానుకగా రిలీజ్కు రెడీ అవుతుండగా నితిన్ హీరోగా వెంకీ కుడుముల (ఛలో ఫేం) దర్శకత్వంలో నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి(మళ్ళీరావా ఫేం) దర్శకత్వంలో సినిమాలు సెట్స్మీదకు రానున్నాయి. వీటితో పాటు శశికిరణ్ చిత్రానికి కూడా ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే శశికిరణ్ దర్శకత్వంలో నటించబోయే హీరో ఎవరనేది వెల్లడించనున్నారు. -
సెప్టెంబర్ 21న ‘నన్ను దోచుకుందువటే’
సమ్మోహనం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో సుధీర్ బాబు మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆర్ఎస్ నాయుడు దర్శకత్వంలో ‘నన్ను దోచుకుందువటే’తో సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ముందుగా వినాచక చవితి కానుకగా సెప్టెంబర్ 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే అదే రోజు నాగచైతన్య ‘శైలజా రెడ్డి అల్లుడు’, సమంత ‘యు టర్న్’ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో సుధీర్ బాబు తమ చిత్రాన్ని సెప్టెంబర్ 21న రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాను సుధీర్ బాబు స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు.సుధీర్ సరసన నభా నటేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అజనీష్ బి లోకనాథ్ సంగీతమందిస్తున్నారు. -
‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీ స్టిల్స్
-
‘శైలజా రెడ్డి అల్లుడు’ ట్రైలర్ రిలీజ్
నాగచైతన్య. మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న శైలజా రెడ్డి అల్లుడు సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మారుతి మార్క్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ ట్రైలర్లో ‘నాపేరు చైతన్య ముద్దుగా చైతూ అంటారు’అంటూ పరిచయం చేసుకున్నాడు నాగచైతన్య. నాగచైతన్యకు జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటించిన ఈ సినిమాను నాగవంశీ, పీడీవీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర్ నటి రమ్యకృష్ణ చాలా కాలం తరువాత అత్త పాత్రలో కనిపించనున్నారు. డైరెక్టర్ మారుతి గత చిత్రాల మాదిరిగానే ప్రేక్షకులకు ఫుల్ కామెడీ అందించడానికి సిద్దమయ్యాడు. కామెడీకే పరిమితం కాకుండా విభిన్నమైన కథ, పంచ్ డైలాగ్స్, ట్విస్ట్లతో ఆకట్టుకునే మారుతి ఈ చిత్ర ట్రైలర్లోనూ తన మార్క్ కనిపంచేలా చేశాడు. వెన్నెల కిషోర్, పృథ్వీ కామెడీ పంచ్లు నవ్వులు పండిస్తున్నాయి. ‘పొగరుతో సాధించలేనిది ప్రేమతో సాధించవచ్చు, ఆవకాయ అన్నంలో కలుపుకొని తినాలి కాని ఎర్రగా ఉంది కదా అని మొఖానికి పులుముకోవద్దు, మీలో పుచ్చకాయంత ప్రేమ ఉందా’ లాంటి కామెడీ డైలాగులు చూస్తుంటే సినిమా చూసిన ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతమందిస్తున్నారు. వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రాబోతుంది. -
‘శైలజా రెడ్డి అల్లుడు'
-
‘చై విత్ సామ్.. వర్సెస్ కాదు’
టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత, నాగచైతన్యలు త్వరలో వెండితెర మీద తలపడనున్నారు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన యు టర్న్, నాగచైతన్య హీరోగా తెరకెక్కిన శైలజా రెడ్డి అల్లుడు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమా వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ఈ ఆసక్తికరమైన పోటిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సమంత, చైతూల పెళ్లి సమయంలో చైసామ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో సందడి చేసింది. ఇప్పుడు అదే తరహాలో చై వర్సెస్ సామ్ (#chayVsSam) హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అయితే ఈ విషయంపై స్పందించిన సమంత, చై వర్సెస్ సామ్ కాదు చై విత్ సామ్(#ChayWithSam) అంటూ కామెంట్ చేశారు. It’s Chay with Sam !! Not vs ❤️ https://t.co/nkGJJQygbR — Samantha Akkineni (@Samanthaprabhu2) 28 August 2018 -
పండగకి అల్లుడొస్తున్నాడు
‘శైలజారెడ్డి అల్లుడు’ వచ్చే టైమ్ ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 13న అల్లుడు థియేటర్లలోకి రానున్నాడు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో ఎస్. నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 31న విడుదల కావాల్సింది. అయితే ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కేరళలో జరుగుతుండటం.. అక్కడ వరదల వల్ల ఆటంకం ఏర్పడటంతో విడుదలను వాయిదా వేశారు. తాజాగా వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13న ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాని విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో చైతూ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. -
అను ఖాతాలో మరో క్రేజీ ఆఫర్
కెరీర్లో పెద్దగా హిట్స్ లేకపోయినా గ్లామర్ లుక్స్ తో మంచి అవకాశాలు దక్కించుకుంటున్న హీరోయిన్ అను ఇమ్మాన్యూల్. మలయాళ ఇండస్ట్రీలో వెండితెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ మజ్ను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతో పర్వాలేదనిపించినా తరువాత అను నటించిన ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేదు. తమిళ్లో చేసిన ఒక్క సినిమా తుప్పారివాలన్ మాత్రం ఘనవిజయం సాధించింది. తాజాగా ఈ భామ కోలీవుడ్ క్రేజీ హీరో సరసన నటిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తమిళనాట వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ సేతుపతి సరసన నటించేందుకు అను ఇమ్మాన్యూల్ ఓకె చెప్పారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. -
అల్లుడు ఆలస్యంగా వస్తాడు!
అనుకున్న సమయానికి అల్లుడు రావడం లేదు. ఎప్పుడు వస్తాడనే విషయాన్ని త్వరలో చెబుతా అంటున్నాడు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించిన సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. రమ్యకృష్ణ కీలక పాత్ర చేశారు. ఈ సినిమాను ఈ నెల 31న విడుదల చేయాలనుకున్నారు. కానీ, కేరళలో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండటంతో విడుదల వాయిదా వేశారు. ‘‘కేరళలోని దురదృష్టకర పరిస్థితుల వల్ల సినిమా రీ–రికార్డింగ్ వర్క్ని సరైన సమయంలో పూర్తి చేయలేకపోయాం. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. కొత్త విడుదల తేదీని నిర్మాతలు త్వరలో ప్రకటిస్తారు. అలాగే కేరళ ప్రజలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి వీలైనంత సాయం చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నాగచైతన్య. -
చైతూ సినిమా వాయిదా!
కేరళలో కురుస్తున్న వర్షాలు టాలీవుడ్ ఇండస్ట్రీ మీద కూడా ప్రభావం చూపిస్తున్నాయి. తెలుగులో మలయాళ ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. అయితే కేరళలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా వారు షూటింగ్లలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో పాల్గొన లేకపోవటంతో సినిమాలు ఆలస్యమవుతున్నాయి. యంగ్ నాగచైతన్య నటిస్తున్న శైలజా రెడ్డి అల్లుడు సినిమాకు కూడా కేరళ వరదల షాక్ తగిలింది. ఆగస్టు 31న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా వేస్తున్న చిత్రయూనిట్ ప్రకటించారు. ఈ సినిమాకు మలయాళ సంగీత దర్శకుడు గోపి సుందర్ సంగీతమందిస్తున్నారు. అక్కడి పరిస్థితుల కారణంగా అనుకున్న సమయానికి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కాలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. హీరో నాగచైతన్య ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెళ్లడించారు. Due to the unfortunate situation in Kerala .. team #ShailajaReddyAlludu is not able to finish the re-recording of the film which is happening there and remaining post production on time .. the makers will fix on the next best possible date and announce shortly ..(1/2) — chaitanya akkineni (@chay_akkineni) 20 August 2018 I sincerely apologise for this delay and also urge everyone to do whatever best they can to help the people of Kerala My heart goes out to everyone there and pray for a quick recovery (2/2) — chaitanya akkineni (@chay_akkineni) 20 August 2018 -
ఫైనల్ స్టేజ్లో ‘సవ్యసాచి’
అక్కినేని యువ కథనాయకుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ సవ్యసాచి. కార్తీకేయ, ప్రేమమ్ లాంటి హిట్ చిత్రాలను అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇపాటికే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే గ్రాఫిక్స్ విషయంలో ఆలస్య కావటంతో రిలీజ్ను వాయిదా వేశారు. ఈ లోగా శైలజా రెడ్డి అల్లుడు సినిమాను పూర్తి చేసిన చైతూ ఆ సినిమాతో ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శైలజా రెడ్డి అల్లుడు సినిమా పనులు పూర్తి కావటంతో తిరిగి సవ్యసాచితో బిజీ అయ్యాడు చైతూ. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ చేస్తున్న చిత్రయూనిట్ త్వరలో ఆకరిపాట చిత్రీకరణ కోసం ఫారిన్ వెళ్లనున్నారు. ఈ పాటతో షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. చైతన్య సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. -
ప్రియ రాగాలు
గోవా తీరంలో ప్రేయసితో కలిసి ప్రియరాగాలు పాడారు నాగచైతన్య. మరి.. ఎలాంటి బ్యూటీఫుల్ లొకేషన్స్లో ఈ సాంగ్ను చిత్రీకరించారనేది ఇప్పుడు సస్పెన్స్. మారుతి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందిన సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించారు. నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించారు. రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు తనయుడు దాసరి అరుణ్ కుమార్ ఈ సినిమాలో విలన్ పాత్ర చేశారని టాక్. ఈ సినిమాలో బ్యాలెన్స్ ఉన్న ఒకే ఒక్క సాంగ్ను గోవాలో పూర్తి చేశారు చిత్రబృందం. దీంతో ఈ సినిమా షూటింగ్ పూర్తయిందట. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, అనూ బేబి సాంగ్ టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే. రెండో సాంగ్ను రేపు విడుదల చేయనున్నారు. గిరిబాబు, నరేశ్, మురళీ శర్మ, ‘వెన్నెల’ కిశోర్, రఘుబాబు తదితరులు నటించిన ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. -
‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీ స్టిల్స్
-
అమ్మాయి కోపం... అబ్బాయి శాంతి జపం!
అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి బోలెడు మ్యాజిక్కులు, జిమ్మిక్కులు చేస్తుంటారు అబ్బాయిలు. మామూలు అమ్మాయిల ప్రేమను గెలుచుకోవడానికే ఇంత కష్టపడితే... కొంచెం ఈగో ఉన్న అమ్మాయి మనసులో ప్లేస్ సంపాదించాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిందే. అదే చేశారు నాగచైతన్య. కాస్త శాంతించమని అనూ ఇమ్మాన్యుయేల్ కోసం పాట అందుకున్నారు. ఆ పాట వీడియో శాంపిల్ను శుక్రవారం విడుదల చేశారు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలోని ‘అనుబేబీ’ సాంగ్ వీడియో టీజర్ను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో నాగచైతన్య స్టెప్స్ కొత్తగా ఉన్నాయి. ‘‘అను బేబీ’ సాంగ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా యూ ట్యూబ్లో విడుదల చేశాం. కృష్ణకాంత్ రాశారు. అనుదీప్ దేవ్ పాడారు. శేఖర్ వీజే కొరియోగ్రఫీ చేశారు. ఆడియో విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం’’అని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఈ నెల 31న విడుదల చేయాలనుకుంటున్నారు. -
గోవాలో అల్లుడి ఆటాపాటా!
టీజర్, సాంగ్స్తో ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యేలా చేశారు చిత్ర యూనిట్. రమ్యకృష్ణ పాత్ర ఈ సినిమాకు హైలెట్ కానుందని సమాచారం. ‘రారండోయ్ వేడుకచూద్దాం’ సినిమా తరువాత నాగ చైతన్య వరుస పెట్టి ప్రాజెక్టులను పట్టాలెక్కించారు. ఈ అక్కినేని యువ హీరో సవ్యసాచి, శివ నిర్వాణ డైరెక్షన్లో ఓ సినిమాను చేస్తూ బిజీగా ఉన్నారు. మారుతి దర్శకత్వంలో రానున్న శైలజా రెడ్డి అల్లుడు మూవీ షూటింగ్కు కూడా చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం గోవాలో ఓ సాంగ్ చిత్రీకరణ జరుపుకుంటోందని డైరెక్టర్ మారుతి ట్వీట్ చేశాడు. అను ఇమ్మాన్యుయేల్ ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 31న విడుదల కానుంది. #ShailajaReddyAlludu song shoot pic.twitter.com/5ghDmovy1n — Maruthi dasari (@DirectorMaruthi) August 10, 2018 -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
బిగ్ బాస్ ఆఫీస్ – స్పూఫ్ వీడియో నిడివి : 16 ని. 45 సె. హిట్స్ : 7,53,429 తెలుగులో ‘బిగ్ బాస్’ షో ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ షో మీద సోషల్ మీడియాలో వస్తున్న ట్రాల్స్, పోస్ట్స్ చూస్తే అర్థం అవుతుంది. నలుగురు స్నేహితుల మధ్య టాపిక్ ఆఫ్ డిస్కస్ బిగ్ బాస్. అందులో నుంచి నెక్ట్స్ ఎవరు ఎలిమినేట్ అవుతారో అని. ఇప్పుడు ఇదే ట్రెండింగ్ టాపిక్ తీసుకుని ‘బిగ్ బాస్ ఆఫీస్’ అంటూ ఓ స్పూఫ్ వీడియో చేశారు వైరలీ తెలుగు ఛానల్ వాళ్లు. ఇందులో ‘మహాతల్లి, పక్కింటి కుర్రాడు, జల్సా రాయుడు, బమ్చిక్ బబ్లూ’ వంటి యూట్యూబర్స్ను కంటెస్టెంట్స్గా చూడొచ్చు. బిగ్ బాస్లో లాగానే దీన్ని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో సెట్ చేశారు. ఇప్పటి వరకు బిగ్బాస్లో జరిగిన హైలైట్స్ను, ఒక్కో క్యారెక్టర్ స్టైల్ను ఇమిటేట్ చేస్తూ సాగుతుంది ఈ వీడియో. బిగ్బాస్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్లు మాత్రమే ఈ సిచ్యువేషన్స్, కామెడీని అర్థం చేసుకోగలరు. ఎలిమినేషన్ రౌండ్ని లీవ్ ఇవ్వడంతో కనెక్ట్ చేసి ఫన్ జనరేట్ చేసే ప్రయత్నం చేశారు. బిగ్బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్లు ఈ వీడియోను బాగా ఎంజాయ్ చేయొచ్చు. సీమరాజా – టీజర్ నిడివి :00:59 సె. హిట్స్ : 28,46,880 టీజర్లు రెండు రకాలుగా కట్ చేస్తుంటారు దర్శక–నిర్మాతలు. ఒకటి సినిమాలో ఉన్న కంటెంట్ ఏంటో చూచాయిగా చెప్పే ప్రయత్నం. రెండోది.. హీరోను హైలైట్ చేస్తూ అతనికి ఎలివేషన్ ఇచ్చే డైలాగ్స్ను రెండు పొందుపరచడం. ‘సీమరాజా’ ట్రైలర్ రెండో క్యాటగిరీ.. అంటే కమర్షియల్ ఫార్మాట్లోకి వస్తుంది. నటుడు శివకార్తికేయ చేస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్లా ‘సీమరాజా’ టీజర్ కనిపిస్తుంది. విలేజ్ బ్యాక్డ్రాప్లో సెట్ చేసిన ఈ మాస్ స్టోరీని పొన్రామ్ డైరెక్ట్ చేస్తున్నారు. సమంత హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. విశేషం ఏంటంటే ఇది హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ అయినప్పటికీ సినిమాలో విలన్గా హీరోయిన్ సిమ్రాన్ కనిపించనున్నారు. ‘నాటు కోడి తిని నీ శరీరాన్ని సిద్ధం చేసుకో.. మేం ఇచ్చే దెబ్బలకు నిలబడాలి కదా?’ అంటూ శివకార్తికేయన్కు వార్నింగ్ ఇస్తూ టీజర్లో కనిపిస్తారు సిమ్రాన్. ఈ టీజర్ తమిళ మాస్ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంటుందనే చెప్పాలి. రిలీజ్ చేసిన మూడు రోజులకే రెండు మిలియన్ వ్యూస్ రాబట్టుకుంది. శైలజారెడ్డి అల్లుడు – టీజర్ నిడివి : 47 సెకన్లు హిట్స్ :27,60,890 అందమైన అమ్మాయిని ఓ కుర్రాడు ప్రేమలో పడేశాడు. కానీ ఆ అమ్మాయికి ఈగో అనే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కూడా ఉంది. అది ఏ రేంజ్లో ఉందంటే... ఆ అమ్మాయి చెప్పిన విషయానికి పక్కవాళ్లు ఎలాంటి సమా«ధానం ఇవ్వాలో కూడా ముందే చెబుతుంది. మరి ఈ కుర్రాడు ఆ అమ్మాయి మనసైతే గెలుచుకున్నాడు కానీ ఆమె ఈగోను ఎలా శాటిస్ఫై చేశాడన్నది వెండితెరపై చూడాల్సిందే. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించారు. నాగచైతన్యకు అత్త పాత్రలో రమ్యకృష్ణ కనిపిస్తారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్కు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రాన్ని ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. -
‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీ స్టిల్స్
-
‘పిల్ల పిట్టలా ఇంతే ఉన్నా.. పొట్టంతా ఈగోనే’
రారండోయ్ వేడుక చూద్దాం సినిమా తరువాత మంచి ఫామ్లోకి వచ్చాడు నాగ చైతన్య. ఆ స్పీడులోనే చకచకా ప్రాజెక్ట్లను పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో ‘శైలజా రెడ్డి అల్లుడు’, చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ తరవాత శివ నిర్వాణ డైరెక్షన్లో మరో సినిమాను ఓకే చేసి వరుసగా సినిమాలు చేస్తూ బిజిబిజీగా ఉన్నాడు. తాజాగా శైలజా రెడ్డి అల్లుడు టీజర్ను విడుదల చేశారు. ఈ కాన్సెప్ట్తో ఇది వరకే తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఇలాంటి కథకు మారుతి తనదైన టేకింగ్ను జోడించి తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ‘పిల్ల పిట్టలా ఇంతే ఉన్నా.. పొట్టంతా ఈగోనే’ అనే డైలాగ్తో సినిమా థీమ్ ఏంటో ఇట్టే తెలిసిపోతోంది. గోపి సుందర్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. లుక్స్ పరంగా నాగ చైతన్య , అను ఇమ్మాన్యుయేల్ ఆకట్టుకున్నారు. కీలకపాత్రలో నటిస్తున్న రమ్యకృష్ణ పాత్రను ఎక్కువగా రివీల్ చేయకుండా టీజర్ను కట్ చేశారు. ఈ మూవీని ఆగస్టు 31న విడుదల చేయనున్నారు. -
ఆగస్టు 31న ‘శైలజా రెడ్డి అల్లుడు’
యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం శైలజా రెడ్డి అల్లుడు. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అత్త పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్లుక్ పోస్టర్కు మంచి రెస్పాన్స్రావటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకంటించారు. ఆగస్టు 31న శైలజా రెడ్డి అల్లుడు సినిమా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ విషయాన్ని హీరో నాగచైతన్య తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. చైతూ సరసన అనూ ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తుండగా గోపీసుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. And yes #SailajaReddyAlludu will be releasing on august 31st .. An emotional journey of love packaged with @DirectorMaruthi entertainment in its peak ! pic.twitter.com/65k9tFrBxB — chaitanya akkineni (@chay_akkineni) 30 July 2018 -
‘సవ్యసాచి’ చివరి షెడ్యుల్
‘రారండోయ్ వేడుకచూద్దాం’ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు నాగచైతన్య. ప్రస్తుతం ఈ హీరో సవ్యసాచి, శైలజా రెడ్డి అల్లుడు షూటింగ్స్తో బిజీగా ఉన్నారు. ఇవే కాకుండా శివ నిర్వాణ డైరెక్షన్లో ఓ ప్రేమకథను కూడా అంగీకరించాడు. ఈ మూవీలో సమంత హీరోయిన్గా నటించనున్నారు. శైలజా రెడ్డి అల్లుడు ఆగస్ట్ 31న విడుదల కానుంది. మారుతి డైరెక్షన్లో రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో నటించగా.. చైతన్యకు జోడిగా అను ఇమ్మాన్యుయెల్ నటిస్తున్నారు. మరోపక్క చందూ మొండేటీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సవ్యసాచి.. ప్రస్తుతం చివరి షెడ్యుల్ జరుపుకుంటోందని సమాచారం. త్వరలోనే విడుదల తేదిని ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. -
అల్లుడి సందడి
ఒక్క సాంగ్ మినహాయించి పని మొత్తాన్ని పూర్తి చేశారు శైలజారెడ్డి అల్లుడు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. శైలజారెడ్డి పాత్రలో రమ్యకృష్ణ నటించారు. రీసెంట్గా గుడికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సన్నివేశాల్లో రమ్యకృష్ణ, నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్, ‘వెన్నెల’ కిశోర్ పాల్గొన్నారు. ‘‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా ఒక్క పాట తప్ప మిగతా షూటింగ్ మొత్తం పూర్తయింది. అనుకున్న టైమ్కి షూటింగ్ కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేసిన టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందించారు. ఇంతకీ అల్లుడు థియేటర్లో సందడి చేసేది ఎప్పుడు అంటే.. వచ్చే ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్పై ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. -
అల్లుడి జాగారం
అల్లుడు అండ్ టీమ్ నైట్ అంతా నిద్రపోలేదట. ఎవరీ అల్లుడు అంటే.. కేరాఫ్ శైలజారెడ్డి అన్నమాట. మరి... నిద్రపోకుండా ఏం చేశారు? అది మాత్రం సిల్వర్ స్క్రీన్పై చూడాల్సిందే. నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్నారు. రమ్యకృష్ణ కీలక పాత్ర చేస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా ఫస్ట్లుక్ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ నైట్ టైమ్ జరుగుతోంది. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. -
తాతగారి బయోపిక్ చూడాలని ఉంది
‘‘అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై యంగ్ టాలెంట్ని, కొత్త కథలని ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. ఇక నుంచి ప్రతి మంచి సినిమా మీద మా లోగో చూడాలని అనుకుంటున్నాం. నేను కూడా ప్రొడక్షన్లో భాగం అవుదాం అనుకుంటున్నాను’’ అన్నారు నాగచైతన్య. సుశాంత్ హీరోగా నటుడు రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో రూపొందిన చిత్రం ‘చి ల సౌ’. రుహానీ శర్మ కథానాయిక. సిరుని సినీ కార్పొరేషన్ నిర్మించిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ రిలీజ్ చేయనుంది. ఈ నెల 27న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నాగ చైతన్య చెప్పిన విశేషాలు. ∙ సమంతకు రాహుల్ రవీంద్రన్ క్లోజ్ ఫ్రెండ్. వాళ్లిద్దరు ఓ సినిమా కూడా చేశారు. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ముందే మా ఇద్దరికీ రాహుల్ కథ వినిపించాడు. నచ్చింది. సినిమా కంప్లీట్ అయ్యాక చూపించాడు. డైరెక్టర్గా తనకిది ఫస్ట్ సినిమా అనిపించలేదు. చాలా బాగా తీశాడు. నాకు బాగా నచ్చింది. వెంటనే నాన్నని (నాగార్జున) కూడా చూడమని చెప్పాను. సినిమాను మా బ్యానర్ నుంచి రిలీజ్ చేయాలనుకున్నాను. ∙సుశాంత్ నటించిన ‘ఆటాడుకుందాం రా’లో నేను గెస్ట్గా కనిపించా. ఇప్పుడు ఈ ‘చి ల సౌ’ రిలీజ్ చేస్తున్నాం. ఇది అనుకోకుండా జరిగింది. ప్లాన్ చేసి చేసింది కాదు. ఈ సినిమాని 32 డేస్లో షూట్ చేశారు. ‘చి ల సౌ’ సినిమా హిట్ అయితే ఇక యాక్టింగ్ మానేస్తాను అన్నాడు రాహుల్ రవీంద్రన్ (నవ్వుతూ). ప్రస్తుతం చేస్తున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాలో నా క్యారెక్టరైజేషన్ ‘అల్లరి అల్లుడు’లో నాన్నగారి క్యారెక్టర్లాగా ఉంటుంది. చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ‘సవ్యసాచి’ సినిమాలో ఎక్కువ వీఎఫ్ఎక్స్ ఉంటాయి. మంచి స్క్రిప్ట్స్ పడటంతో ఈ రెండు ప్రాజెక్ట్స్ వెంట వెంటనే చేశాను. ఫైనల్ కట్ చూసి, రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేస్తాం. తర్వాత వెంకటేశ్గారితో బాబీ డైరెక్షన్లో ‘వెంకీ మామా’ అనే సినిమా చేస్తున్నాను. ‘నిన్ను కోరి’ దర్శకుడు శివ నిర్వాణతో ఓ లవ్ స్టోరీ చేస్తున్నాను. అందులో సమంత, నేను మ్యారీడ్ కపుల్గానే కనిపిస్తాం. పెళ్లి తర్వాత జరిగే కథ అది. ఇప్పుడు కూడా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే బావుండదేమో (నవ్వుతూ). నా ప్రతి సినిమాను నాన్నగారు చూసి హానెస్ట్గా చెబుతారు. ఆయన ఒపీనియన్ తీసుకొని టీమ్ అంతా డిస్కస్ చేసుకొని, రీషూట్స్ కూడా చేస్తాం. సమంత ఇంకా పర్టిక్యులర్గా ఉంటుంది. స్టిల్, పోస్టర్ ప్రతిదాని గురించి మాట్లాడుతుంది. ఎంత బాగా విమర్శిస్తుందో అంతే గొప్పగా పొగుడుతుంది. సీనియర్ డైరెక్టర్స్ కంటే యంగ్ ఫిల్మ్ మేకర్స్తో ఈజీగా మూవ్ అవ్వొచ్చు. యంగ్ డైరెక్టర్స్ అయితే సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి ఐడియాస్ షేర్ చేసుకోవడం బావుంటుందని అనుకుంటాను. ∙అన్నపూర్ణ బ్యానర్లో ప్రొడ్యూస్ అయ్యే అన్ని సినిమాల స్క్రిప్ట్స్ వింటాను. యాక్చువల్లీ ‘ఒక లైలా కోసం’ సినిమా దగ్గరి నుంచే నేను ప్రొడక్షన్ చూసుకోవడం స్టార్ట్ చేశాను. ఫిల్మ్ స్కూల్వైపు ఎక్కువగా వెళ్లను కానీ అప్పుడప్పుడు ఇంటరాక్ట్ అవుతా. ∙‘మహానటి’లో 30 సెకన్లు అన్నారు కాబట్టి, ఆ సినిమా చేశాను. కానీ తాతగారి బయోపిక్లో నటించడం చాలా కష్టం. అయితే తాతగారి బయోపిక్ చూడాలని అనుకుంటున్నాను. సమంత సినిమాలు మానదు పెళ్లయ్యాక మీరు, సమంత న్యూయార్క్ వెళ్లారు. సమంత సినిమాలు మానేస్తారనే టాక్ ఉంది? అనే ప్రశ్నలకు – ‘‘ఏ మాయ చేసావె’ షూటింగ్ న్యూయార్క్ సెంట్రల్ పార్క్లో జరిగింది. మళ్లీ అక్కడికి వెళ్లాలని మా పెళ్లి జరగక ముందే డిసైడ్ అయ్యాం. అలాగే వెళ్లాం. సమంత సినిమాలు మానదు. ఒకవేళ కావాలంటే బ్రేక్ తీసుకుంటుంది. మళ్లీ సినిమాలు చేస్తుంటుంది. ప్రస్తుతం కథలు వింటోంది’’ అన్నారు నాగచైతన్య. -
అత్త.. అల్లుడొచ్చారు
కుర్చీలో ఠీవీగా కూర్చుని ఓర కంటితో కాసింత కోపంగా అల్లుడు, కూతుర్ని (నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్) చూస్తున్నారు శైలజారెడ్డి (రమ్యకృష్ణ). అల్లుడేమో అత్తని ఆటపట్టిస్తున్నట్లు చిరునవ్వులు చిందిస్తుంటే.. కూతురేమో భర్తవైపు ఆప్యాయంగా చూస్తున్నారు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ ఎస్. నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ని సోమవారం రిలీజ్ చేశారు. ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ ఫస్ట్ లుక్పై నాగచైతన్య స్పందిస్తూ – ‘‘డైరెక్టర్ మారుతిగారు ఆఫ్ స్క్రీన్ నన్ను ఎంటర్టైన్ చేస్తున్నట్లే ఆన్ స్క్రీన్ మిమ్మల్ని (ప్రేక్షకులు) ఎంటర్టైన్ చేయబోతున్నారు. సితార బ్యానర్లో పనిచేయడం నాకు ఎప్పుడూ సౌకర్యంగానే ఉంటుంది. రమ్యకృష్ణగారి పాత్ర చాలా స్పెషల్గా ఉంటుంది’’ అన్నారు. -
ఫస్ట్ లుక్: అల్లుడు-కూతురితో శైలజారెడ్డి
అక్కినేని నట వారసుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం శైలజారెడ్డి అల్లుడు. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అత్త పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. పోస్టర్లో నాగచైతన్య డిఫరెంట్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. చైతూ సరసన అనూ ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తుండగా గోపీసుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న శైలజారెడ్డి అల్లుడుని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు డైరెక్టర్ మారుతి యత్నిస్తున్నాడు. మరోవైపు చైతూ నటిస్తున్న సవ్యసాచి చిత్ర షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. The first look of #ShailajaReddyAlludu as promised by @DirectorMaruthi who entertains me off screen as much as he is going to entertain you all onscreen .. always a pleasure working with @SitharaEnts , Anu Emmanuel .. Ramya Garu’s role is going to be something to watch out for! pic.twitter.com/r36FttKx9Z — chaitanya akkineni (@chay_akkineni) 9 July 2018 -
అల్లుడు వస్తున్నాడు
అల్లుడు రాక కోసం సర్వం సిద్ధం చేశారు. మరి.. అల్లుడికి అత్తయ శైలజారెడ్డి ఎలాంటి సౌకర్యాలు, ఏ స్థాయి స్వాగత మర్వాదలు చేశారనేది సిల్వర్ స్క్రీన్పై చూడాల్సిందే. మారుతి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్నారు. అత్తయ్య శైలజారెడ్డి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. గోపీసుందర్ స్వరాలు అందిస్తున్నారు. రీసెంట్గా నాగచైతన్య, అను, రమ్యకృష్ణలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ నెల 9న ఈ సినిమా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘శైలజా రెడ్డి అల్లుడు వస్తున్నాడు’’ అని పేర్కొన్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ చేయనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. -
‘ఆ ఫస్ట్ లుక్ ఫేక్’
అక్కినేని యువ కథానాయకుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం శైలజా రెడ్డి అల్లుడు. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అత్త పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇదే నంటూ ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ పోస్టర్ పై దర్శకుడు మారుతి స్పందించారు. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న ఫోటో ఓరిజినల్ కాదంటూ క్లారిటీ ఇచ్చారు. మరో వారం రోజుల్లో అఫీషియల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామంటూ తెలిపారు. నాగచైతన్య సరసన అనూ ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. To all the fans of @chay_akkineni we would like to clarify that the image that is being circulated as #SailajaReddyAlludu first look is fake. We will be releasing the original one in a week. Please do not share the fake one, original will be worth your wait!👍 — Maruthi dasari (@DirectorMaruthi) 1 July 2018 -
అల్లుడికి ఆతిథ్యం
కొత్త అల్లుడు ఇంటికొస్తే అత్తారింటివాళ్లు నానా హైరానా పడిపోతారు. పిండి వంటలతో అల్లుడు తబ్బిబ్బయ్యేలా చేస్తారు. శైలజా రెడ్డిగారు కూడా తన అల్లుణ్ని అలానే చూసుకుంటున్నారట. మరి ఈ కొత్త అల్లుడు అత్తగారింట్లో ఎన్ని రోజులుంటాడట? అంటే.. ఇంకో ఇరవై రోజులు పైనే. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి రూపొందిస్తున్న చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. నాగ చైతన్య అత్తగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ వచ్చే నెల 22వరకు జరగనుందని సమాచారం. ఈ షెడ్యూల్లో నాగచైతన్య, రమ్యకృష్ణల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత చందు మొండేటి దర్శకత్వంలో చేస్తోన్న ‘సవ్యసాచి’ సినిమాలో ‘నిన్ను రోడ్డు మీద చూసినది...’ సాంగ్ షూటింగ్లో తమన్నాతో కలసి పాల్గొంటారు నాగచైతన్య. -
మస్త్ బిజీ
నాగచైతన్య మల్టీటాస్కింగ్ చేస్తున్నారు. ఓ వైపు ‘సవ్యసాచి’ మరోవైపు ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాలను కంప్లీట్ చేస్తూ, మస్త్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘సవ్యసాచి’ సినిమా డబ్బింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సవ్యసాచి’. నవీన్ ఎర్నేని, రవి శంకర్, మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ కథానాయిక. 10 రోజుల పాటు కొన్ని సీన్స్, అలాగే ఐటమ్ సాంగ్ మినహా సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ను కూడా స్పీడ్గా కంప్లీట్ చేస్తోందట చిత్రబృందం. ఈ సినిమా కోసం ‘అల్లరి అల్లుడు’ సినిమాలోని ‘నిన్ను రోడ్డు మీద చూసినది.....’ సాంగ్ని రీమిక్స్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తమన్నా, నాగచైతన్యలపై ఈ సాంగ్ను జూన్ లాస్ట్ వీక్లో షూట్ చేయనున్నారట. సో.. సినిమాకు సంబంధించిన ఆఖరి ఘట్టంలోకి అడుగుపెట్టేసారన్నమాట ఈ సవ్యసాచి. మాధవన్, భూమిక ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి యం.యం.కీరవాణి స్వరకర్త. ఈ సినిమాను జూలై లాస్ట్ వీక్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘ప్రేమమ్’ లాంటి హిట్ తర్వాత దర్శకుడు చందుతో నాగచైతన్య చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. -
కునుకు కరువాయె...
నిద్రలేకుండా వర్క్ చేస్తున్నారు కొందరు హీరోహీరోయిన్లు. సిల్వర్స్క్రీన్పై ఎగ్జామ్స్ కోసం నిద్రపోవడం లేదు. కనులకు కునుకుని దూరం చేసి సెట్లో వర్క్ని ఎంజాయ్ చేస్తున్నారు. ముందుగా టీ టౌన్లోకి వస్తే.. అల్లుడు నిద్రపోకుండా స్టెప్పులేస్తున్నాడు. అబ్బాయి చిందేస్తుంటే అమ్మాయి ఊరుకుంటుందా? ఆమె కూడా పాదం కలిపి పాట అందుకుంది. ఇంతకీ... ఈ అల్లుడు అడ్రెస్ ఎక్కడో తెలుసా? కేరాఫ్ శైలజారెడ్డి. ఇప్పుడు అర్థం అయ్యింటుంది ఇదంతా ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా గురించి అని. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అత్తయ్య శైలజారెడ్డి పాత్రలో నటి రమ్యకృష్ణ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నైట్ షూట్ జరుగుతోంది. నాగచైతన్య, అనూలపై సాంగ్ను చిత్రీకరిస్తున్నారని సమాచారం. మరో తెలుగు హీరో కల్యాణ్ రామ్కి కూడా నిద్ర నహీ. గుహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నివేథా థామస్ కథానాయికగా నటిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా కోసం నైట్ షూట్ చేశారు. ప్రస్తుతం సింగపూర్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తోన్న కథానాయిక రాశీ ఖన్నా కూడా రెండు మూడు రోజుల క్రితం కంటిన్యూస్గా నైట్షూట్స్లో పాల్గొన్నారు. కానీ తెలుగు సినిమా కోసం కాదు. కోలీవుడ్ సినిమా కోసం. కార్తీక్ తంగవేల్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అడంగామారు’ సినిమా చిత్రీకరణను రాత్రివేళ జరిపారు. మరో బ్యూటీ రకుల్ ప్రీత్సింగ్ అయితే ‘అలారం లేకుండా గురువారం హాయిగా నిద్రపోయాను’ అన్నారు. ఆమె ఎందుకలా అన్నారంటే.. కోలీవుడ్లో కార్తీ, బాలీవుడ్లో అజయ్దేవగన్ సినిమాల షెడ్యూల్స్లో పాల్గొని అలసిపోయారు. కార్తీతో చేస్తోన్న సినిమా కోసం చెన్నైలో నైట్ షూట్స్లో పాల్గొన్నారామె. ఈ సినిమా చెన్నై షెడ్యూల్ చివరి రోజు తల్లి సెట్స్కు రావడంతో ఆమె ఆనందం డబులైంది. తమిళ సినిమా షూట్ కంప్లీటైన వెంటనే అజయ్ దేవగన్æ సినిమా కోసం ముంబై వెళ్లారు రకుల్. ఈ సినిమాకు అకివ్ అలీ దర్శకుడు. ఎలాగూ బీటౌన్ తలుపు తట్టాం కదా. అక్కడ కూడా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నవాళ్ల గురించి చెప్పుకుందాం. నిద్రకు నో చెప్పి, షూటింగ్కు యస్ చెప్పారు హృతిక్ రోషన్. ‘సూపర్ 30’లో ఆయన బీహార్ గణిత శాస్త్రవేత్త ఆనంద్కుమార్ పాత్ర చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానున్న ఈ సినిమా నైట్ షూట్లో పాల్గొంటూ హృతిక్ డే టైమ్లో నిద్రపోతున్నారు. ఇక బాలీవుడ్ భామల విషయానికొస్తే.. ‘నమస్తే ఇంగ్లాండ్’ సినిమా కోసం లండన్లో టైమ్కి నిద్రపోవడం లేదు కథనాయిక పరిణీతీ చోప్రా. విఫుల్ షా దర్శకత్వంలో అర్జున్ కపూర్, పరిణీతీ చోప్రా జంటగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ నైట్ టైమ్లో జరుగుతోంది. ఫోర్ డేస్ బ్యాక్ సాంగ్ను కూడా షూట్ చేశారు. నిద్ర లేకుండా వర్క్ చేయడం బాధగా ఉందా? అంటే... ‘అలా ఏం లేదు.. వర్క్ ఈజ్ వర్షిప్’ అంటున్నారు తారలందరూ. ఏం డెడికేషన్ గురూ.సినిమా అంటే నైన్ టు సిక్స్ జాబ్ కాదు. గంటలతో సంబంధం లేదు. రాత్రీ పగలూ తేడా లేదు. ఎప్పుడంటే అప్పుడు షూటింగ్లో పాల్గొనాల్సిందే. మరి.. సినిమానా? మజాకానా? ఆనంద్, రాశీ ఖన్నా, ‘జయం’ రవి తల్లితో రకుల్, అనూ ఇమ్మాన్యుయేల్, హృతిక్ -
అల్లుడు లెట్స్ డు కుమ్ముడు
మర్యాదల్లో ఏదైనా తేడా వచ్చిందో లేక ఫ్యామిలీని ఎవరైనా ఏమైనా కామెంట్ చేశారో.. కరెక్ట్ రీజన్ తెలీదు కానీ, విలన్స్ను కుమ్మేస్తున్నాడు అల్లుడు. ఈ అల్లుడు ఎవరి తాలుకానో తెలుసు కదా! పవర్ఫుల్ శైలజారెడ్డి తాలుకా అండీ బాబు. నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘శైలజారెడ్డిగారి అల్లుడు’ అనే టైటిల్ను అనుకుంటున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. శైలజారెడ్డి పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారని సమాచారం. ప్రస్తుతం హీరో నాగచైతన్యపై ఫైట్ సీన్స్ను తెరకెక్కిస్తున్నారు. అంటే అల్లుడు లెట్స్ డు కుమ్ముడు అన్నమాట. ఆఫ్టర్ ఫైట్ అనూతో సరసాలడతారట నాగచైతన్య. అదేనండి.. ఈ సినిమాలో హీరో హీరోయిన్లపై రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని చెబుతున్నాం. -
ఆ వదంతులు నమ్మవద్దు: చైతూ
హైదరాబాద్: సోషల్ మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదన్నారు అక్కినేని వారసుడు, యంగ్ హీరో నాగచైతన్య. తాను రెండు కొత్త మూవీలకు ఒకే చెప్పినట్లుగా కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయని, అవన్నీ వదంతులేనని వాటిని పట్టించుకోవద్దని తన అభిమానులకు చైతూ తెలిపారు. కొత్త ప్రాజెక్టులు ఒప్పుకుంటే త్వరలోనే వెల్లడిస్తానన్నారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా తన ప్రస్తుత మూవీ ప్రాజెక్టుల గురించి వివరించారు. 'నా లేటెస్ట్ ప్రాజెక్ట్లకు సంబంధించి వచ్చిన కథనాల్లో నిజం లేదు. సవ్యసాచితో పాటు దర్శకుడు మారుతితో చేస్తున్న మూవీల షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాను. ఈ ఏడాది నావద్దకు మంచి స్క్రిప్ట్లు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ రెండు మూవీలు కాకుండా ప్రస్తుతం ప్రచారంలో ఉన్న నా లేటెస్ట్ సినిమాల అప్డేట్స్ నిజం కాదు. నా తర్వాతి ప్రాజెక్టుల గురించి త్వరలోనే వెల్లడిస్తానంటూ' హీరో నాగచైతన్య ట్వీట్ చేశారు. చైతూ పోస్ట్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. సర్ధార్ గబ్బర్ సింగ్తో నిరాశ పరిచినా ఎన్టీఆర్తో జైలవకువ లాంటి హిట్ కొట్టిన దర్శకుడు బాబీ కొత్త మూవీలో చైతూ నటించనున్నాడని ప్రచారం జరిగింది. బాబీతో మూవీకి ఒకే చెప్పడంతో పాటు 'నిన్ను కోరి' ఫేం శివ ఇర్వాణ డైరెక్షన్లో మరో ప్రాజెక్ట్కు చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, కానీ షూటింగ్ ప్రారంభానికి కొన్ని రోజులు సమయం తీసుకుంటారని అప్డేట్స్ వచ్చాయి. అయితే వీటిలో నిజంలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి'తో పాటు మారుతి డైరెక్షన్లో 'శైలాజా రెడ్డి అల్లుడు' షూటింగ్లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. Some news today reporting my next projects which isn’t true..shooting fr savyasachi & Maruthi Garu’s film,excited with the way both films are shaping up.been blessed this year listening to some really nice content.will announce my next soon,whatever you hear otherwise is NOT TRUE — chaitanya akkineni (@chay_akkineni) 22 February 2018 -
చైతూతో ఎన్టీఆర్ డైరెక్టర్..?
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన జై లవ కుశ సినిమాతో ఆకట్టుకున్న యువ దర్శకుడు బాబీ.. తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాగచైతన్య హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే నాగచైతన్యకు కథ వినిపించిన బాబీ, ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో ‘శైలాజా రెడ్డి అల్లుడు’ సినిమాల్లో నటిస్తున్నాడు నాగచైతన్య ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత ‘నిన్ను కోరి’ ఫేం శివా నిర్వాణ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తయితేగాని బాబీ సినిమా సెట్స్ మీదకు వచ్చే అవకాశం లేదు. మరి బాబీ అప్పటి వరకు వెయిట్ చేస్తాడో లేక ఈ లోపు మరో సినిమాను తెరకెక్కిస్తాడో చూడాలి. -
కోఠిలో ‘శైలజారెడ్డి అల్లుడు’ సందడి..
సాక్షి, హైదరాబాద్: రారండోయ్ వేడుకచేద్దాం సినిమా విజయంతో దూసుకెళ్తున్న యంగ్ హీరో నాగచైతన్య, మహానుభావుడు సినిమా లాంటి సక్సెస్ తరువాత డైరెక్టర్ మారుతి కలయికలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకున్న ‘శైలజారెడ్డి అల్లుడు’ మూవీ షూటింగ్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. గతంలో ‘కింగ్’ నాగార్జున హీరోగా వచ్చిన అల్లరి అల్లుడు సినిమాలా ఈ లేటెస్ట్ మూవీ ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. ఆ సినిమాలో నాగ్కు అత్తగా వాణీశ్రీ నటించగా, ‘శైలజారెడ్డి అల్లుడు’లో చైతూకి అత్తగా రమ్యకృష్ణ కనిపించనున్నారని సమాచారం. చైతుకు జోడిగా అను ఇమాన్యుయేల్ నటిస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కొన్ని కోఠి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. డైరెక్టర్ మారుతి నుంచి ఆశించే కామెడీ ఈ సినిమాలో ఉంటుందని చిత్రయూనిట్ తెలిపింది. తమిళ హీరో మాధవన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాతో బాలీవుడ్ నటి నిధి అగర్వాల్ (హిందీ మూవీ మున్నా మైఖేల్ ఫేం) టాలీవుడ్కు పరిచయం కాబోతోంది. ‘ప్రేమమ్’ ప్రొడ్యుసర్ నాగవంశీ నిర్మిస్తుండగా.. నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సవ్యసాచి సినిమాలో నటిస్తున్నాడు చైతూ. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. -
సెట్స్ మీదకు ‘శైలజా రెడ్డి అల్లుడు’
యంగ్ హీరో నాగచైతన్య, కామెడీ ఎంటర్టైనర్ల స్పెషలిస్ట్ మారుతి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది. చాలా రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం దర్శకుడు మారుతి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫుల్ స్క్రిప్ట్తో రెడీ అయ్యాడు. ఈ నెల 19 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నామని తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సవ్యసాచి సినిమాలో నటిస్తున్నాడు చైతూ. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో మారుతి సినిమాను లైన్ లో పెట్టాడు. ఈ సినిమాకు శైలజా రెడ్డి అల్లుడు అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. శైలజా రెడ్డిగా సీనియర్ నటి రమ్యకృష్ణ కనిపించనున్నారు. pic.twitter.com/Xddgx4rH1M — Maruthi Dasari (@DirectorMaruthi) 17 January 2018 pic.twitter.com/Vs1viqZQsJ — Maruthi Dasari (@DirectorMaruthi) 17 January 2018 -
సెట్స్ మీదకు 'శైలజా రెడ్డి అల్లుడు'
పెళ్లి పనులతో కొద్ది రోజులు సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య తిరిగి షూటింగ్ లతో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే చందూమొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈసినిమా సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మరో సినిమాను ప్రారంభించాడు. మహానుభావుడు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మారుతి దర్శకత్వంలో నాగచైతన్య తదుపరి చిత్రం తెరకెక్కనుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ రోజు(శనివారం) లాంచనంగా ప్రారంభమైంది. నాగచైతన్య సరసన అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శైలజా రెడ్డి అల్లుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. కీలకమైన అత్త పాత్రలో రమ్యకృష్ణ నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నెలాఖరున ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హిట్ డైరెక్టర్ కొడుకు ఇరగదీశాడు..!
భలే భలే మొగాడివోయ్ సినిమాతో స్టార్ లీగ్ లోకి ఎంటర్ అయిన దర్శకుడు మారుతి. ఇటీవల మహానుభావుడు సినిమాతో మరో విజయాన్నిఅందుకున్న మారుతి త్వరలో నాగచైతన్య హీరోగా శైలజా రెడ్డి అల్లుడు అనే సినిమాను తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న మారుతి తన సోషల్ మీడియా పేజ్లో ఓ ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేశాడు. నిర్మాతగా, దర్శకుడిగా సినీ అభిమానులకు సుపరిచితుడైన మారుతి ఫ్యామిలి గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. తాజాగా ఆయన తన వారసుణ్ని అభిమానులకు పరిచయం చేశాడు. డ్రమ్స్ వాయిస్తున్న తన కొడుకు ఆశ్రిష్ వీడియోను ట్విట్టర్ పేజ్లో పోస్ట్ చేసిన మారుతి ‘మా అబ్బాయి కొత్త వీడియో’ అంటూ కామెంట్ చేశారు. వీడియోలో మారుతి కొడుకు డ్రమ్స్ వాయించడం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతోంది. తండ్రి కామెడీ ఎంటర్ టైనర్లతో ఆకట్టుకుంటుంటే ఆశ్రిష్ సంగీత వాయిద్యాలతో మైమరపిస్తున్నాడు. ఈ కుర్రాడి జోరు చూస్తుంటే టాలీవుడ్కి త్వరలో సంగీత దర్శకుడు పరిచయం అవ్వడం గ్యారెంటీ అనిపిస్తోంది. My son's new video ... pic.twitter.com/X4IJRIuwMO — Maruthi Dasari (@DirectorMaruthi) 29 October 2017 -
హిట్ డైరెక్టర్ కొడుకు ఇరగదీశాడు...!
-
చైతూ, మారుతి.. ఇంట్రస్టింగ్ టైటిల్
వరుస విజయాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో నాగచైతన్య, మరో ఆసక్తికర చిత్రంతో రెడీ అవుతున్నాడు. ఇప్పటికే చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమాను ఎనౌన్స్ చేసిన చైతూ, మారుతి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. శర్వానంద్ హీరోగా తెరకెక్కిన మహానుభావుడు సినిమాతో మరోసారి ఆకట్టుకున్న మారుతి, చైతన్యతో ఎలాంటి సినిమా తెరకెక్కిస్తాడో అన్న ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ కాంబినేషన్కు సంబందించిన ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ‘శైలజా రెడ్డి అల్లుడు’ అనే టైటిల్ను రిజిస్టర్ చేయించారు. దీంతో ఈ టైటిల్ చైతూ, మారుతిల కాంబినేసన్లో తెరకెక్కబోయే సినిమా కోసమే అన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. టైటిల్ మాత్రం హాట్ టాపిక్గా మారింది.