Sanjay Raut
-
స్థానిక ఎన్నికల్లో ఒంటరి పోరు
నాగ్పూర్: మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో లుకలుకలు మరోసారి ప్రస్ఫుటమయ్యాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంపై కూటమి నేతలు పరస్పరం దుమ్మెత్తి పోసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎంవీఏలోని కీలక భాగస్వామ్య పార్టీ శివసేన(ఉద్ధవ్) సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో జరిగే స్థానిక ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఉమ్మడిగా ఉండి పోటీ చేస్తే కూటమి భాగస్వామ్య పక్షాల కార్యకర్తలకు అవకాశాలు రావడం లేదని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో సంస్థాగతంగా బలోపేతం అవ్వాల్సిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించామన్నారు. ముంబై, థానె, నాగ్పూర్ తదితర మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో సైతం సొంతంగానే బరిలోకి దిగాలనే నిర్ణయానికి తమ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే సానుకూలంగా ఉన్నట్లు రౌత్ వివరించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి, మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) రూపంలోని మైత్రి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే పరిమితమని రౌత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ తీరు సరికాదు ఎంవీఏ, ఇండియా కూటమిలోనీ ముఖ్య భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్ పార్టీ సభ్య పార్టిలకు ఏమాత్రం సహకరించడం లేదని రౌత్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంపై కాంగ్రెస్ పార్టీ నేత విజయ్ వడెట్టివార్ భాగస్వామ్య పక్షాలను నిందిస్తున్నారని తెలిపారు. ఏకాభిప్రాయం, సర్దుకుపోవడం వంటి వాటిపై విశ్వాసం లేని వారికి కూటమిలో కొనసాగే అర్హత లేదని రౌత్ విమర్శించారు. ఇక ఇండియా కూటమి విషయానికొస్తే..లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్క దఫా కూడా సమావేశం కాలేకపోయిందన్నారు. ఇండియా కూటమికి కన్వినర్ను కూడా నియమించుకోలేకపోవడం మంచి విషయం కాదన్నారు. ఎవరికీ మంచిది కాదు: ఎన్సీపీ(శరద్) శివసేన (ఉద్ధవ్) పార్టీ నిర్ణయంపై ఎంవీఏ భాగస్వామ్య పక్షమైన ఎన్సీపీ(శరద్) స్పందించింది. ‘ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే అది శివసేన(ఉద్ధవ్) పార్టీ ఇష్టం. మేం అడ్డుకోబోం. బలవంతంగా ఎవరినీ కలుపుకోం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా మేం కలిసి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది సరైన నిర్ణయంగా మేం భావించడం లేదు. కానీ, ఈ నిర్ణయం ప్రభావం ఎంవీఏ కూటమిలోని మూడు భాగస్వామ్య పక్షాల గెలుపు అవకాశాలపైనా పడుతుంది’అని ఆ పార్టీ నేత జితేంద్ర ఔహద్ చెప్పారు. మేం పట్టించుకోం: సీఎం ఫడ్నవీస్ స్థానిక ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేయాలన్న శివసేన(ఉద్ధవ్) నిర్ణయాన్ని బీజేపీకి చెందిన సీఎం ఫడ్నవీస్ తోసిపుచ్చారు. ‘ఎంవీఏ కూటమి పోటీలో ఉన్నా లేకున్నా మేం పట్టించుకునేది లేదు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటాం. వచ్చే అన్ని ఎన్నికల్లోనూ ప్రజలు మాకే మద్దతుగా ఉంటారనే నమ్మకం మాకుంది’అని ఆయన చెప్పారు. ఇటీవలి కాలంలో శివసేన(ఉద్ధవ్) వర్గం బీజేపీ వైపు మొగ్గు చూపుతోందంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ..రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చునంటూ వ్యాఖ్యానించారు. -
‘మహా’ పాలిటిక్స్లో ట్విస్ట్..!ఫడ్నవీస్పై రౌత్ ప్రశంసలు
ముంబయి:అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు చల్లబడినట్లు కనిపిస్తోంది. ఓ వైపు నిట్టనిలువున చీలిపోయిన శరద్ పవార్ కుటుంబం మళ్లీ కలిసే అవకాశముందని ప్రచారం జరుగుతుండగా మరోవైపు ఇండియా కూటమిలో భాగమైన శివసేన(ఉద్ధవ్)పార్టీ కీలక నేత సంజయ్ రౌత్ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్పై తాజాగా ప్రశంసలు కురిపించడం హాట్టాపిక్గా మారింది.గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల లొంగుబాటు కోసం ఫడ్నవిస్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని రౌత్ అన్నారు. ఈ విషయమై రౌత్ శుక్రవారం(జనవరి3) మీడియాతో మాట్లాడారు.’గతంలో మేం ఫడ్నవీస్తో కలిసి పనిచేశాం. మా సంబంధాలు కొనసాగుతాయి. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలి విషయంలో ఫడ్నవీస్ తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి’అని రౌత్ ప్రశంసించారు. ఇటీవల కోట్ల రూపాయల రివార్డులన్న మావోయిస్టు అగ్రనేతలు స్వయంగా సీఎం ఫడ్నవిస్ ముందే లొంగిపోయిన విషయం తెలిసిందే. కాగా, గతేడాది నవంబర్లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన(ఉద్ధవ్)ఇండియా కూటమిలో భాగంగా పోటీ చేయగా బీజేపీ, శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్పవార్)పార్టీలతో కలిసి మహాయుతి కూటమిగా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో మహాయుతి ఘన విజయం సాధించి ఫడ్నవీస్ సీఎం పదవి చేపట్టగా ఏక్నాథ్షిండే, అజిత్పవార్లు డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు. ఇండియా కూటమిలో శివసేన(ఉద్ధవ్) పార్టీ కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్పవార్) పార్టీల కంటే ఎక్కువ సీట్లు సాధించడం గమనార్హం. ఇదీ చదవండి: చొరబాటుదారులకు బీఎస్ఎఫ్ దన్ను -
మహారాష్ట్ర: సంజయ్ రౌత్పై కార్యకర్తల దాడి?
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్పై కార్యకర్తలు దాడి చేసినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే నివాసంలోనే ఆయనపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై సోషల్ మీడియా కథనాలు చర్చనీయాంశంగా మారాయి.ముంబైలోని బాంద్రాలో ఉన్న మాతోశ్రీలో ఉద్దవ్ థాక్రేతో సంజయ్ రౌత్ సమావేశమాయ్యారు. ఈ సమావేశం సందర్భంగా కొంత మంది పార్టీ కార్యకర్తలు సంజయ్తో వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో రౌత్.. వైఖరి, ఆయన వ్యాఖ్యల వల్లే పార్టీ తీవ్రంగా నష్టపోయినట్టు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి చెందినట్టు కార్యకర్తలు చెప్పారు. దీంతో, వాగ్వాదం తలెత్తింది. ఇందులో భాగంగానే సంజయ్ రౌత్పై థాక్రే మద్దతుదారులు దాడి చేసినట్టు సమాచారం. అంతేకాకుండా, సంజయ్ రౌత్ను కొన్ని గంటల పాటు ఓ గదిలో ఉంచి తాళం వేసినట్టు తెలుస్తోంది.ఇక, సంజయ్ రౌత్పై దాడికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, దాడి ఘటన వార్తలపై ఉద్దవ్ థాక్రే కానీ, సంజయ్ రౌత్ గానీ ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో, ఈ ఘటనపై మహారాష్ట్రలో మరింత చర్చ జరుగుతోంది.ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో జరగబోయే బీఎంసీ ఎన్నికలపై ఉద్దవ్ థాక్రే కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు పార్టీ నేత ఆనంద్ దూబే చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు.There are multiple reports that Shiv Sena (UBT) workers have beaten Sanjay Raut by locking him in a room in Matoshree.Do you support this action of Shiv Sena workers ? pic.twitter.com/deVAEWRuCj— Megh Updates 🚨™ (@MeghUpdates) January 1, 2025 -
‘ఈవీఎంలను ఊరేగించి గుడి కట్టండి’
ముంబై: ఈవీఎంల చుట్టూ వివాదాలు నడుస్తున్న వేళ.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయాన్ని సుప్రీం కోర్టులో తేల్చుకోవాలని ఎంవీఏ కూటమి భావిస్తోంది. ఈలోపు.. మహాయుతి ప్రభుత్వం అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలతో విరుచుకుపడుతోంది. సీఎం ఎన్నిక జాప్యంపై ఎద్దేవా చేసిన థాక్రే సేన.. ఇప్పుడు ఈవీఎంలకు గుడి కట్టండంటూ అధికార కూటమికి సలహా ఇస్తోంది.ముంబైలో కాకుండా నాగ్పూర్లో మంత్రి వర్గ విస్తరణకు మహాయుతి ఏర్పాట్లు చేసింది. ఈ పరిణామంపై థాక్రే శివసేన నేత సంజయ్రౌత్ స్పందించారు. ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం ముందు ఈవీఎంలకు గుడి కట్టుకోండంటూ సలహా ఇచ్చారాయన.‘‘సీఎం ఉరేగింపు కంటే ముందు.. వాళ్లు ఈవీఎంలను ఊరేగిస్తే బాగుంటుంది. ఆపై నాగ్పూర్లోని ఆరెస్సెస్ కార్యాలయం ఎదుట ఈవీఎంలకు వాళ్లు గుడి కట్టుకుంటే బాగుంటుంది. ఈ మేరకు కేబినెట్ తొలిభేటీలో నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా’’ అంటూ సెటైర్లు వేశారు. #WATCH | Mumbai: Shiv Sena (UBT) MP Sanjay Raut says, "...First of all, the procession of the Chief Minister will be taken out there (in Nagpur). I think that before taking out the procession of the CM, they should take out a procession of EVMs and in the first cabinet they… pic.twitter.com/0ue8Labe5v— ANI (@ANI) December 14, 2024 ‘‘ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గర నెలకావొస్తోంది. ఇప్పటికీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొలువు దీరలేకపోయింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. అయినా కొత్త ప్రభుత్వానికి పట్టనట్లు ఉంది. కనీసం సీఎం అయినా దీనికి సమాధానం ఇస్తారేమో’’ అని రౌత్ అన్నారు.1991 తర్వాత నాగ్పూర్లో మహా కేబినెట్ విస్తరణ జరుగుతుండడం ఇదే. ఆ టైంలో రాజకీయ సంక్షోభం ఏర్పడ్డ తర్వాత.. డిసెంబర్లో ఛగన్ భుజ్బల్, మరికొందరితో గవర్నర్ సుబ్రహ్మణ్యం మంత్రులుగా ప్రమాణం చేయించారు.ఇదీ చదవండి: బ్యాలెట్ కోసం చైతన్యం.. వారిని వణికిస్తోందిగా! -
షిండే శకం ముగిసింది.. ఆయన మళ్లీ సీఎం కాలేరు: సంజయ్ రౌత్
ముంబై: మహారాష్ట్రలో పది రోజుల ఉత్కంఠకు తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ నేడు(గురువారం) సాయంత్రం 5:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దక్షిణ ముంబయిలోని ఆజాద్ మైదాన్లో ప్రమాణ స్వీకారోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో శివసేన అధినేత ఏక్నాథ్ షిండేను మరోసారి సీఎం చేయకపోవడంపై ఉద్దవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏక్నాథ్ షిండే పాలన శకం ముగిసిందని, ఆయన ఇంకెప్పుడూ మహారాష్ట్రకు సీఎం కాలేడని అన్నారు. ఈ మేరకు గురువారం విలేకరులతో సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ షిండేను పావులా ఉపయోగించుకొని ఇప్పుడు పక్కన పెట్టిందని ఆరోపించారు. ‘షిండే శకం ముగిసిపోయింది. రెండేళ్లు మాత్రమే సీఎంగా ఉన్నారు. ఇప్పుడు అతని వాడుక ముగిసింది. అతడిని పక్కన పడేశారు. షిండే మళ్లీ ఈ రాష్ట్రానికి సీఎం కాలేడు. తమతో జతకట్టే పార్టీలను బలహీనపరిచేందుకు, కూల్చివేయడానికి బీజేపీ తన రాజకీయ వ్యూహాన్ని ఉపయోగిస్తోంది’ అని ఆరోపించారు.షిండే పార్టీని కూడా విచ్ఛిన్నం చేయగలరని సంజయ్ రౌత్ విమర్శించారు. రాజకీయాల్లో బీజేపీ వ్యూహం ఇదేనని, తమతో పనిచేసే వారి పార్టీని విచ్ఛిన్నం చేసి ఆ పార్టీని లేకుండా చేస్తుందని మండిపడ్డారు. మెజారిటీ ఉన్నప్పటికీ మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 15 రోజులు ఎందుకు పట్టిందన్న ప్రశ్నకు బదులిస్తూ.. పాలక కూటమిలో చీలిక మొదలైందని.. ఈ సమస్య రేపటి నుంచి ఇంక పెద్దదవుతుందని అన్నారు.‘ఈరోజు నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రానికి సీఎం అవుతారు. ఆయనకు మెజారిటీ ఉంది కానీ, 15 రోజుల పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు . అంటే వారి పార్టీ లేదా మహాయుతిలో ఏదో లోపం ఉందని అర్థం. ఇప్పుడు కాకపోయిన రేపు అయినా బయటపడుతుంది. వారు మహారాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం పని చేయడం లేదు. తమ స్వార్థంతో కలిసి వచ్చారు.. కానీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చారు. ఫలితాలను ఇప్పటికీ వారు అంగీకరించడం లేదు.’ అని పేర్కొన్నారు.కాగా ముంబయిలో బుధవారం జరిగిన రాష్ట్ర భాజపా కోర్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ పేరును ఖరారు చేశారు.ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టనుండటం ఇది మూడోసారి కానుంది. కొత్త ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని, వారు కూడా గురువారం తనతోపాటు మంత్రులుగా ప్రమాణం చేస్తారని ఫడ్నవీస్ ప్రకటించారు. అయితే ఆ ఇద్దరిలో ప్రస్తుతానికి ఒక్కరిపైనే అధికారికంగా స్పష్టత వచ్చింది.తాను డిప్యూటీ సీఎంగా మరోసారి బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు ఎన్సీపీ అగ్ర నాయకుడు అజిత్ పవార్ ప్రకటించారు. ఆయనతోపాటు ప్రస్తుతం మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎంగా ఉన్న శివసేన అధినేత ఏక్నాథ్ షిండే కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉంటారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడలేదు. -
మరోసారి తెరపైకి EVM ట్యాంపరింగ్..సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
-
ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అక్రమాలు జరిగాయని శివసేన(ఉద్ధవ్) అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఆరోపించారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎం) ట్యాంపరింగ్ చేసి మహాయుతి గెలిచిందని మండిపడ్డారు. తమకు దక్కాల్సిన సీట్లను దొంగిలించిందని అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ కూటమి విజయం వెనుక పెద్ద కుట్ర ఉందని తేల్చిచెప్పారు.#WATCH | As Mahayuti has crossed halfway mark in Maharashtra, Shiv Sena UBT leader Sanjay Raut says, "They have done some 'gadbad', they have stolen some of our seats...This cannot be the public's decision. even the public does not agree with these results. Once the results are… pic.twitter.com/Qxx6a0mKsW— ANI (@ANI) November 23, 2024 బిలియనీర్ గౌతమ్ అదానీ సాయంతో ఆ కూటమి నెగ్గిందని విమర్శించారు. అదానీ బీజేపీకి ‘లాడ్లీ భాయ్’గా మారిపోయాడని ధ్వజమెత్తారు. ఎన్నికల ఫలితాలు ప్రజల వాస్తవ తీర్పును ప్రతిబింబించడం లేదని చెప్పారు. ప్రజలు ఏం కోరుకున్నారో తమకు తెలుసని, మహాయుతి పాలన పట్ల వారు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ఈ ఫలితాలను ప్రజా తీర్పుగా తాము భావించడం లేదన్నారు. ప్రజలు మహాయుతికి ఆఖండమైన మెజార్టీ కట్టబెట్టారంటే తాము విశ్వసించడం లేదని సంజయ్ రౌత్ తేల్చిచెప్పారు. Mumbai | As Mahayuti has crossed the halfway mark in Maharashtra, Shiv Sena UBT leader Sanjay Raut says, "From what we are seeing, it seems that something is wrong. This was not the decision of the public. Everyone will understand what is wrong here. What did they (Mahayuti) do… pic.twitter.com/COjoVJpfi3— ANI (@ANI) November 23, 2024 -
అది ఎవరూ అంగీకరించరు: కాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్యలపై సంజయ్ రౌత్
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోనే మహా వికాస్ అఘాడి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ చీఫ్ నానా పటోలే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. నవంబర్ 25న కాంగ్రెస్ నేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన తెలిపారు. అయితే కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే వ్యాఖ్యలను శివసేన(ఉద్దవ్) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఖండించారు. ఆయన వ్యాఖ్యలను ఎవరూ అంగీకరించరని అన్నారు.ఈ మేరకు ముంబైలో విలేకరుల సమావేశంలో రౌత్ మాట్లాడుతూ.. సీఎం ఎవరన్నదనే విషయం కూటమి భాగస్వామ్యాలతో సమిష్టిగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ‘నేను దీన్ని అంగీకరించను. ఎవరూ కూడా అంగీకరించరు. నానా పటోలేకు కాంగ్రెస్ హైకమాండ్ మద్దతు ఉందో లేదో మేము కలిసి కూర్చుని నిర్ణయిస్తాము. పటోలే ముఖ్యమంత్రి అవ్వాలంటే కాంగ్రెస్ హైకమాండ్ చెప్పాలి. రాహుల్ గానీ ప్రియాంక గాంధీ వాద్రాగానీ, సోనియా గాంధీగానీ ప్రకటించాలి’ అని పేర్కొన్నారు.అయితే మహారాష్ట్రలోని ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చీఫ్ నానా పటోలే తెలిపారు. ప్రజల ఫీడ్బ్యాక్ ఆధారంగా మహారాష్ట్రలో ఎంవీఏ ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుందని చెప్పారు. నవంబర్ 25న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. ఇటీవల హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అంచనా వేశామని, కానీ తాము ఓడిపోయామని చెప్పారు. ఈసారి కాంగ్రెస్ ఓటమిని వారు అంచనా వేస్తున్నారు కాబట్టి తామే తప్పకుండా గెలుస్తామని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్), శివసేన (షిండే వర్గం) నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని అనేక ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక ప్రతిపక్ష కూటమి అయిన ఎంవీఏ(కాంగ్రెస్, శివసేన(ఉద్దవ్), ఎన్సీపీ(శరద్పవార్) ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చినప్పటికీ అధికారాన్ని దక్కించుకోలేదని అంచనా వేశాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరగాల్సి ఉంది. -
మోదీ పర్యటనలు.. మహారాష్ట్రకు సురక్షితం కాదు: సంజయ్ రౌత్
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ‘ఏక్ హై తో సేఫ్ హై’(మనం ఐక్యంగా ఉంటే సురక్షితం) నినాదంపై శివసేన (యూబీటీ)నేత సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర ఇప్పటికే చాలా సురక్షితమైన రాష్ట్రమని అన్నారు. కానీ, ప్రధాని మోదీ రాష్ట్రాన్ని సందర్శించినప్పుడల్లా అస్థిరతకు గురువుతుందని మండిపడ్డారు. విభజనలు సృష్టించి అశాంతిని రెచ్చగొట్టే ప్రయత్నాలతోనే ప్రధాని మోదీ పర్యటనలు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రధాని మోదీ ఎందుకు ఇలాంటి భాష వాడుతున్నారో అర్థం కావడం లేదు. మహారాష్ట్రలో ప్రజలు ఇప్పటికే సురక్షితంగా ఉన్నారు. కానీ మోదీ ఎప్పుడు పర్యటించినా.. విభజన, అశాంతిని రెచ్చగొట్టడం వల్ల రాష్ట్రం అభద్రతకు గురవుతోంది. రాష్ట్రానికి నిజంగా భద్రత కావాలంటే.. మేం బీజేపీని ఓడించాలి’’ అని అన్నారు.కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఒక కులానికి మరొక కులాన్ని వ్యతిరేకంగా ఉంచుతున్నాయని శుక్రవారం ప్రధాని మోదీ ఆరోపణలు చేశారు. ‘ఏక్ హై, తో సేఫ్ హై’(ఐక్యంగా ఉంటేనే సురక్షింతంగా ఉంటాం) అని ప్రజలు ఐక్యంగా ఉండాలని కోరారు. ‘‘ కాంగ్రెస్ పార్టీ ఏకైక ఎజెండా ఒక కులాన్ని మరో కులానికి వ్యతిరేకంగా ఉంచటం. ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు అభివృద్ధి చేందటం.వారికి తగిన గుర్తింపు రావడం కాంగ్రెస్కు ఇష్టం లేదు. మనం ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం గుర్తుపెట్టుకోండి’’ అని ధూలేలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీ మోదీ అన్నారు. ఇక.. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మూడు రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
ఫడ్నవీస్పై ఇజ్రాయెల్ దాడికి ప్లాన్ చేస్తోందా?.. సంజయ్ రౌత్ సెటైర్లు
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే శివసేనకు చెందిన రెండు వర్గాల మధ్య గట్టి పోటీ నెలకొంది. మరోవైపు.. తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నీవీస్కు భద్రత పెంచడంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఫడ్నవీస్ మీద ఇప్పుడేమైనా ఇజ్రాయెల్ లేదా లెబనాన్ దాడికి దిగుతున్నాయా? అని ప్రశ్నించారు.మహారాష్ట్రలో ఎన్నికల వేళ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్కు అదనపు భద్రత పెంచుతున్నారనే సమాచారం వచ్చింది. ఫడ్నవీస్కు ప్రస్తుతం జెడ్ ప్లస్ భద్రత ఉండగా.. ఆయన కోసం అదనపు ఫోర్స్ వన్ కమాండోలను నాగపూర్లో ఉంచినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్ భద్రతపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ స్పందించారు.ఈ సందర్బంగా రౌత్ మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం ఫడ్నవీస్కు ఆకస్మికంగా భద్రతను పెంచడానికి కారణం ఏంటి?. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆయన.. తన కోసం భద్రతను పెంచుకోవడం ఏంటి?. ఇలాంటి వ్యక్తి ప్రజలకు ఏం రక్షణ ఇస్తారు?. ఫడ్నవీస్ నివాసం వెలుపల ఫోర్స్ కమాండోలు నిలబడి ఉన్నారు. నాగపూర్ మరో 200 మంది ఉన్నారు. డిప్యూటీ సీఎం ఎందుకు అంత భయపడుతున్నారు. ఆయనపై దాడి జరగబోతోందా..? అలా ఎవరు చేయాలనుకుంటున్నారు..? ఇజ్రాయెల్ లేదా లెబనాన్ ఏమైనా ఆయనపై దాడికి దిగుతున్నాయా..? అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో భద్రతను పెంచడంపై ఫడ్నవీస్, డీజీపీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ఉద్దవ్థ్రాకే శివసేన వర్గం పట్టుదలతో ప్రచారంలో బిజీ ఉంది. #WATCH | Mumbai: Shiv Sena (UBT) Sanjay Raut says "The Home Minister of this state, who is a former Chief Minister (Devendra Fadnavis), has suddenly increased his security. The Home Minister gives security to others but he increased his own security. Suddenly we saw Force One… pic.twitter.com/yvDaJwNBIp— ANI (@ANI) November 3, 2024 -
పరువు నష్టం కేసులో ఎంపీ సంజయ్రౌత్కు 15 రోజులు జైలు
ముంబై: శివసేన(ఉద్దవ్ వర్గం) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్కు న్యాయస్థానంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పరువు నష్టం కేసులో సంజయ్రౌత్కు ముంబై కోర్టు 15 రోజులు జైలు శిక్ష విధించింది. బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య భార్య మేధ సోమయ్య దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఆయనకు 15 రోజులు జైలు శిక్ష విధిస్తూ ముంబై కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 500 కింద రౌత్ను దోషిగా నిర్ధారిస్తూ.. ఆయనకు రూ.25 వేలు జరిమానా కూడా విధిస్తున్నట్లు వెల్లడించింది.మేధ సోమయ్య ముంబైలోని రుయా కళాశాలలో ఆర్గానిక్ కెమెస్ట్రీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆమె యువ ప్రతిష్టాన్ అనే స్వచ్చంద సంస్థ నడుపుతున్నారు. అయితే తన ఎన్జీవతో కలిసి ఆమె రూ.100 కోట్ల మరుగుదొడ్ల కుంభకోణానికి పాల్పడినట్లు రౌత్ ఆరోపించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పలు మీడియాల్లో కథనాలు ప్రసారం అయ్యాయి. చదవండి: ఎన్నాళ్లు జైల్లో ఉంచుతారు?.. ఈడీకి సుప్రీం కోర్టు మందలింపువీటిని ఖండించిన కిరీట్ సోమయ్య సతీమణి మేధ.. ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై తప్పుడు ఆరోపణలు చేశారని కోర్టును ఆశ్రయించారు. 2022 నుంచి రౌత్ తనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని, అవి పలు పత్రికలు, ఎలక్ట్రానిక్తోపాటు సోషల్ మీడియాలోనూ ప్రచురితమయ్యాయని తన పిటిషన్లో పేర్కొన్నారు. తనతోపాటు తన భర్తపై సంజయ్ రౌత్ పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేశారని చెబుతూ.. పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.మరోవైపు సంజయ్ రౌత్ న్యాయవాది, ఆయన సోదరుడు సునీల్ రౌత్ మాట్లడుతూ.. బెయిల్ పిటిషన్ వేస్తామని తెలిపారు. అలాగే ఈ ఉత్తర్వులపై ముంబై సెషన్స్ కోర్టులో అప్పీలు చేస్తామని చెప్పారు. -
దాడుల కోసం.. అమిత్ షా సుపారీ తీసుకున్నారు: సంజయ్ రౌత్
ముంబై: ఇతర పార్టీ చీఫ్ల కాన్వాయ్లే లక్ష్యంగా బీజేపీ, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) పార్టీల కార్యకర్తలు దాడులు చేయటాన్ని ఇలాగే కొనసాగిస్తే.. తాము కూడా భవిష్యత్తులో ప్రతీకారం తీర్చుకుంటామని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. థానేలో శనివారం శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కాన్వాపై ఎంఎన్ఎస్ కార్యాకర్తలు దాడి చేశారు. ఈ ఘటనపై ఆదివారం సంజయ్ రౌత్ మాట్లాడారు. అహ్మద్ షా అబ్దాలీ (హోంశాఖ మంత్రి అమిత్ షాను పరోక్షంగా ఉద్దేశిస్తూ..)కు మహారాష్ట్రంలో దాడుల ద్వారా అరాచకం వ్యాప్తి చేయాలని ఢిల్లీలో ఉండే కేంద్ర పాలకులు సుపారీ ఇచ్చారని మండిపడ్డారు. ‘ఉద్దవ్ ఠాక్రే కాన్వాయ్పై శనివారం రాత్రి దాడి జరిగింది. ఇలాంటి చేయాలనే వాళ్లు ఉన్నారు. అమిత్ షా ఇలాంటి దాడులు చేయించడానికి ఢిల్లీ నుంచి సుపారీ అందుకున్నారు. ఎన్ఎన్ఎస్ కార్యకర్తలను ఇటువంటి పనులు చేయించుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. కానీ సదరు నేతలు మాత్రం ఢిల్లీ నుంచి సుపారీ తీసుకొని సైలెంట్గా ఉంటున్నారు. ఇలా దాడులకు తెగపడటం మహారాష్ట్రకు మంచిది కాదు. నేను ఏ పార్టీ పేరును ప్రస్తావించటం లేదు. కానీ, కొన్ని పార్టీలు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇప్పటి నుంచే కుట్రలు పన్నుతున్నారు’ అని మండిపడ్డారు. -
చంద్రబాబు ఒక్కక్షణం కూడా అధికారంలో కొనసాగే హక్కులేదు..
-
చంద్రబాబుకు అధికారంలో ఉండే హక్కు లేదు: సంజయ్ రౌత్
ఢిల్లీ: ఏపీ కూటమి అరాచకపాలనకు నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన ధర్నాకు శివసేన(యూబీటీ) పార్టీ సంఘీభావం తెలిపింది. బుధవారం మధ్యాహ్నాం వైఎస్ జగన్ను కలిసిన ఆ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ తమ పార్టీ మద్దతు ప్రకటించారు. ఏపీ పరిస్థితులకు సంబంధించిన ఫోటో గ్యాలరీని ఆయన సందర్శించారు. అనంతరం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక్కరోజు కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదు. వైఎస్ జగన్కు అండగా నిలవడం కోసం నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. మా పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే నాకు ఒకే విషయం చెప్పారు. ప్రభుత్వాలు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ, ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం సరికాదు. ఆంధ్రప్రదేశ్లో గత 45 రోజులుగా నరమేధం కొనసాగుతోంది. ఈ రాజకీయ కక్ష సాధింపు ఏదైతే ఉందో.. అది దేశానికే మంచిది కాదు. .. దేశంలో కేంద్ర హోం మంత్రి, ఆ మంత్రిత్వ శాఖ ఉంటే.. వెంటనే స్పందించాలి. ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపాలి. అక్కడ జరుగుతున్న దాడుల, విధ్వంసంపై సమగ్ర విచారణ జరిపించాలి. దాడులకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు చూసిన తర్వాత.. మేము ఒక విషయం స్పష్టం చేయదల్చాము. రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక్కరోజు కూడా అధికారంలో ఉండే హక్కు లేదు. ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం లేదు. అందుకే మేము వైఎస్ జగన్కు, ఆయన పార్టీకి పూర్తి మద్దతు ఇస్తున్నాము. వైఎస్ జగన్ పోరాటానికి అండగా నిలబడతాం’ అని ఆయన అన్నారు.కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలి..శివసేన(యూబీటీ) ఎంపీ, ఆ పార్టీ లోక్సభ పక్ష నేత అరవింద్ సావంత్ వైఎస్సార్సీపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏపీలో జరిగిన దాడలకు సంబంధించి.. ఫొటో గ్యాలరీ సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ నేను శివసేన లోక్సభ పక్ష నేతను. మా ఆత్మకు క్షోభ కలిగించే ఘటనలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. మేము గతంలో చంద్రబాబుతో కలిసి, కూటమిలో ఉన్నాము. ఎన్డీఏలో కూడా కొనసాగాం. శివసేన పార్టీలో చీలిక వచ్చినప్పుడు, చాలా మంది పార్టీని వీడారు. కానీ ఉద్ధవ్ ఠాక్రే గట్టిగా నిలబడ్డారు. సరిగ్గా వైఎస్ జగన్ కూడా రాజకీయాల్లో అలా నిలబడ్డారు. అందుకే మేము మా పార్టీలో జగన్ గురించి మాట్లాడుకుంటాము. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, అన్నీ తట్టుకుని నిలబడ్డారు. ప్రజల మద్దతుతో సీఎం అయ్యారు. నేను ఈరోజు ఇక్కడ కొన్ని చిత్రాలు, వీడియోలు చూశాను. రాజకీయాల్లో గెలుపు, ఓటములు ఉంటాయి. కానీ ఈ తరహాలో ప్రతీకార దాడులు, కక్ష సాధింపు సరికాదు. ఈరోజు నీవు అధికారంలో ఉండొచ్చు. రేపు దాన్ని కోల్పోవచ్చు. కానీ, ఈ విధంగా గెల్చిన తరవాత, ఓడిన పార్టీపై దాడులు చేయడం, ఆ పార్టీ నాయకులను ఎంచుకుని మరీ చంపడం, వారిపై దాడులు చేయడం, వారి ఆస్తులు ధ్వంసం చేయడం.. ఏ మాత్రం సమర్థనీయం కాదు.ఏపీలో సీఎం కుమారుడు ఏకంగా రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతున్నారు. విపక్షంపై దాడులను ప్రోత్సహిస్తున్నాడు. రాజకీయాల్లో ఈ తరహా చర్యలు ఏ మాత్రం సరికాదు. ఏపీలో జరుగుతోందే.. మహారాష్ట్రలో కూడా కొనసాగుతోంది. ఈడీ దాడులు. సీబీఐ కేసులు. వేధింపులు. నీవు ఈరోజు అధికారంలోకి రావొచ్చు. రాకపోవచ్చు. రాజకీయాల్లో గెలుపు, ఓటమిలు సహజం. దేన్నైనా స్వీకరించాలి. అంతేకానీ, ఈ తరహాలో విపక్షంపై దాడులు, వేధింపులు సరికాదు. అందుకే వైఎస్ జగన్, ఆయన పార్టీకి అండగా నిలవడానికి, మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. .. మా ముంబైలో తెలుగు ప్రజలు చాలా మంది ఉన్నారు. నేను కేంద్ర ప్రభుత్వానికి ఒక విషయం స్పష్టం చేస్తున్నాను. ఏపీలో ఇంత జరుగుతున్నా, మీరు ఇలాగే కళ్లు మూసుకుని కూర్చుంటే, అది మరో మణిపూర్ అవుతుంది. ఇది ఏ మాత్రం సరికాదు. కాబట్టి, వెంటనే జోక్యం చేసుకొండి. ఆంధ్రప్రదేశ్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడండి. ఈ పోరాటంలో మేము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి అండగా నిలుస్తా. పార్లమెంటులో కూడా వారితో కలిసి పని చేస్తాం’ అని అన్నారు. -
చంద్రబాబు పై సంజయ్ రౌత్ సంచలన కామెంట్స్
-
టీడీపీకి బంపర్ ఆఫర్..ఈ పదవి బీజేపీకి దక్కితే టీడీపీకే నష్టం..
-
Sanjay Raut: టీడీపీ స్పీకర్ పదవికి పోటీ చేస్తే.. ఇండియా కూటమి మద్దతిస్తుంది
ముంబై: లోక్సభ స్పీకర్ పదవికి అధికార ఎన్డీఏ పక్షంలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పోటీ చేస్తే ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలన్నీ మద్దతిచ్చే అవకాశముందని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ చెప్పారు. లోక్సభ స్పీకర్ పోస్టు చాలా కీలకమైందని, ఈ పదవి బీజేపీకి దక్కితే, ప్రభుత్వానికి మద్దతిచ్చే టీడీపీ, జేడీయూలతో పాటు చిరాగ్ పాశ్వాన్, జయంత్ చౌదరిలకు చెందిన పార్టీలను ముక్కలు చేస్తుందని ఆరోపించారు. బీజేపీని నమ్మి మోసపోయిన అనుభవం తమకు కూడా ఉందని రౌత్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘లోక్సభ స్పీకర్ పదవిని టీడీపీ కోరుతున్నట్లుగా విన్నాను. అదే జరిగితే, ఇండియా కూటమి ఈ విషయాన్ని చర్చిస్తుంది. మా భాగస్వామ్య పక్షాలన్నీ టీడీపీకి మద్దతిచ్చేందుకు ప్రయత్నిస్తాయి’అని చెప్పారు. నిబంధన ప్రకారం ప్రతిపక్ష పార్టీకి డిప్యూటీ స్పీకర్ పోస్టు కేటాయించాలన్నారు. లోక్సభ ఎన్నికల అనంతరం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అగ్ర నేతలు బీజేపీపై చేసిన వ్యాఖ్యలపై సంజయ్ రౌత్.. గతంలో బీజేపీ చేసిన తప్పిదాలను ఆర్ఎస్ఎస్ సరిచేయాలనుకోవడం మంచి పరిణామమేనని పేర్కొన్నారు. జూన్ 7వ తేదీన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన భేటీలో ప్రధాని మోదీ ఎన్డీఏ పార్లమెంటరీ పక్షం నేతగా, బీజేపీ పార్లమెంటరీ పార్టీ, లోక్సభలో బీజేపీ నేతగా ఎన్నికయ్యారని రౌత్ అన్నారు. ‘బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రత్యేకంగా జరగలేదు. అలా జరిగిన పక్షంలో నేత ఎవరనే ప్రశ్న ఉదయిస్తుంది, అప్పుడిక పరిణామాలు వేరుగా ఉంటాయి’అని అభిప్రాయపడ్డారు. మోదీ ఎన్డీఏ పార్లమెంటరీ పక్షం నేతగా మాత్రమే ఎన్నికవడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని రౌత్ వ్యాఖ్యానించారు. -
మోదీకి ప్రత్యామ్నాయం అన్వేషిస్తున్న ఆర్ఎస్ఎస్: రౌత్
ముంబై: నరేంద్ర మోదీ బలవంతంగా మూడోసారి ప్రధానమంత్రి కావడానికి ప్రయతి్నస్తే ఆయన ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండబోదని శివసేన(ఉద్ధవ్) సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ చెప్పారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిని తెరపైకి తీసుకురావడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యాచరణ ప్రారంభించిందని అన్నారు. 2014, 2019లో బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచి్చన తర్వాత ఆర్ఎస్ఎస్ను బానిసగా మార్చుకోవడానికి నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రయతి్నంచారని ఆరోపించారు. ఇప్పుడు వారిద్దరి బలం తగ్గిపోయిందని పేర్కొన్నారు. మోదీని ఇంటికి సాగనంపే స్థితిలో ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ ఉందన్నారు. -
చంద్రబాబు, నితీశ్కు అందరూ స్నేహితులే: సంజయ్రౌత్
ముంబై: లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీఏలో కీలకంగా మారిన నితీశ్కుమార్, చంద్రబాబులపై శివసేన(ఉద్ధవ్) నేత సంజయ్రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి పార్టీలు ఢిల్లీలో జరిపే భేటీకి సంజయ్రౌత్ బయలుదేరారు. సందర్భంగా రౌత్ మీడియాతో మాట్లాడారు.‘బీజేపీకి మెజారిటీ ఎక్కడుంది. మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు, నితీశ్కుమార్ అందరికీ స్నేహితులే.ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసేవారికి వారు మద్దతిస్తారని నేను అనుకోను. అయితే ఎన్నికలకు ముందే వారు బీజేపీతో కలిసి పోటీ చేసినందున వారు ఎన్డీఏ సంకీర్ణంలో కొనసాగే అవకాశాలే ఉన్నాయిసంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపే శక్తి మోదీకి లేదు. ఆయన ఇంకా తన వైఖరినీ వీడలేదు. మోదీ సర్కార్, మోదీగ్యారెంటీ అని మాట్లాడుతున్నారు’ అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. -
గడ్కరీని ఓడించేందుకే వారు పనిచేశారు : రౌత్ సంచలన ఆరోపణలు
ముంబై: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవెంద్ర ఫడ్నవిస్పై శివసేన(ఉద్ధవ్) కీలక నేత, ఎంపీ సంజయ్రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని నాగ్పూర్లో ఓడించేందుకు షా, ఫడ్నవిస్లు పనిచేశారని రౌత్ ఆరోపించారు.‘మోదీ, షా, ఫడ్నవిస్లు కలిసి గడ్కరీని ఓడించేందుకు గట్టిగా పనిచేశారు. అయితే గడ్కరీని ఓడించడం సాధ్యం కాదని గ్రహించిన తర్వాత ఫడ్నవిస్ ఆలస్యంగా నాగ్పూర్లో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ మాటలు నేను కాదు ఆర్ఎస్ఎస్ క్యాడరే బహిరంగంగా చెబుతోంది’ అని శివసేన(ఉద్ధవ్) అధికారిక పత్రిక సామ్నాలో రౌత్ కథనం రాశారు. మరోపక్క అజిత్ పవార్కు చెందిన ఎన్సీపీ చెందిన క్యాండిడేట్లను ఓడించేందుకు సీఎం షిండే ఒక్కో నియోజకవర్గంలో రూ.25 కోట్ల నుంచి 30 కోట్ల దాకా ఖర్చు చేశారు. ఈసారి మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్లో సీఎం యోగిని మారుస్తారు’అని రౌత్ తన కథనంలో పేర్కొన్నారు. కాగా, రౌత్ రాసిన ఈ కథనంపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాంకులే ఫైర్ అయ్యారు. నిజానికి రౌత్ శివసేన అభ్యర్థుల గెలుపు కోసం కాకుండా ఎన్సీపీ(శరద్పవార్) అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. రౌత్కి దమ్ముంటే 2019లో సీఎం అవడానికి ఆయన చేసిన ప్రయత్నాలపై కథనం రాయాలని సవాల్ విసిరారు. -
‘‘కిచిడీ స్కామ్ ప్రధాన సూత్రధారి సంజయ్ రౌత్’’
ముంబై: కొవిడ్ సమయంలో ముంబైలో జరిగిన కిచిడీ కుంభకోణం అసలు సూత్రధారి శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ అని కాంగ్రెస్ బహిష్కృత నేత సంజయ్ నిరుపమ్ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో ముంబై నార్త్ వెస్ట్ ఎంపీ సీటు నుంచి శివసేన(ఉద్ధవ్) పార్టీ తరపున పోటీ చేస్తున్న అమోల్ కీర్తికార్కు కిచిడీ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజాగా సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నిరుపమ్ ఈ ఆరోపణలు చేశారు. ‘నేను ఈ కుంభకోణం మీద అధ్యయనం చేశాను. సంజయ్ రౌతే ఈ కుంభకోణం వెనుక అసలు సూత్రధారి అని నాకు అప్పుడు తెలిసింది. కొవిడ్ సమయంలో ముంబై మునిసిపల్ కార్పొరేషన్ నుంచి రూ.7లక్షల కాంట్రాక్టులను కూతురు, భాగస్వాముల పేర్ల మీద సంజయ్ రౌత్ తీసుకున్నారు’అని నిరుపమ్ తెలిపారు. కాగా, కొవిడ్ సమయంలో ముంబై మునిసిపాలిటీ పరిధిలో పేదలకు ప్రభుత్వం తరపున ఉచితంగా కిచిడీ అందించింది. ఈ కిచిడీ సప్లై కాంట్రాక్టులను రాజకీయ నాయకులే తీసుకుని తక్కువ కిచిడి సరఫరా చేసి ఎక్కువ బిల్లులు పొందారని ఆరోపణలపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇదీ చదవండి.. కాంగ్రెస్ లైసెన్స్ రద్దు చేశా.. ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు -
కేజ్రీవాల్ ఇప్పుడు మరింత ప్రమాదకరం: ఎంపీ రౌత్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అంటే భయం, అందుకే ఆయనను అరెస్ట్ చేయించారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. అయితే అరెస్ట్ తరువాత కేజ్రీవాల్ మరింత ప్రమాదకరంగా మారారని రౌత్ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా వచ్చే ఆదివారం (మార్చి 31) ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో ఇండియా ఆప్ బ్లాక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ ర్యాలీలో ఇతర నేతలతో కలిసి నేను కూడా పాల్గొంటానని రౌత్ తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు జైలు నుంచి పనిచేయడం మొదలు పెట్టారు. కాబట్టి ప్రజలు కూడా ఆయన మాట వింటారు, మద్దతుగా నిలబడతారని రౌత్ అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో కూడా జైలుకు వెళ్లిన నాయకులు మరింత బలంగా బయటపడ్డారు పేర్కొన్నారు. రాజకీయ నాయకులను భయపెట్టేందుకు, ప్రతిపక్షాలను నిర్మూలించేందుకు ప్రధాని దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటున్నారని పలువురు మండిపడ్డారు. మార్చి 31న అన్ని భారత మిత్రపక్షాల నేతలు ఏకతాటిపై నిలబడి ర్యాలీ చేయనున్నారు. #WATCH | Mumbai: Shiv Sena (UBT) MP Sanjay Raut says, "The INDIA alliance is organising a protest rally at Ramlila Maidan, Delhi. We all will attend that rally... PM Modi is afraid of Arvind Kejriwal. Now, Arvind Kejriwal is more dangerous, as he will now work from jail. So, the… pic.twitter.com/6ZhWrjeu7g — ANI (@ANI) March 25, 2024 -
‘ఎలక్షన్ కమిషన్ ప్రైవేటీకరణ’.. శివసేన ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు
సార్వత్రిక ఎన్నికల ముంగిట కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్పై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ కమిషన్ బీజేపీ శాఖలా మారిందని ఆరోపించారు. ముంబైలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సంఘాన్ని బీజేపీ ప్రైవేటీకరించిందని మండిపడ్డారు. ’ఎలక్షన్ కమిషన్ బీజేపీ శాఖలా మారింది. టీఎన్ శేషన్ (మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్) హయాంలో ఉన్నట్టుగా వ్యవస్థ ఇప్పుడు లేదు. విశ్వసనీయమైన నియంత్రణ సంస్థగా ఉండే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు విశ్వసనీయతను కోల్పోయింది. గత పదేళ్లలో ఎలక్షన్ కమిషన్ ప్రైవేటీకరించారు’ అన్నారు. ఎలక్షన్ కమిషన్ తీరును విమర్శిస్తూ ‘ఈ రోజుల్లో ఎలక్షన్ కమిషన్ ఎలా పని చేస్తోందో శివసేన (యూబీటీ), ఎన్సీపీ అనుభవించాయి. ఎన్సీపీ పార్టీని, ఎన్నికల గుర్తును అనర్హులకు అప్పగించారు.మనకు తెలిసిన ఎన్నికల కమిషన్ ఎప్పుడో చచ్చిపోయింది’ అన్నారు. ఎన్సీపీలో ఇటీవల చీలిక వచ్చింది. అజిత్ పవార్ వర్గానికే పార్టీ ఎన్నికల గుర్తు అయిన గడియారం గుర్తను ఎలక్షన్ కమిషన్ కేటాయించింది. పార్టీ చీలిక తర్వాత అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇది శరత్ పవార్ వర్గానికి శరాఘాతంగా మారింది. ఇక శివసేన విషయంలోనూ తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే వర్గానికే పార్టీ అధికారిక బాణం, విల్లు ఎన్నికల గుర్తును ఎలక్షన్ కమిషన్ కేటాయించింది. దీంతో ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) కాగడా గుర్తును వినియోగిస్తోంది. -
విధేయతే లేదు.. కేవలం రాజకీయమే: సంజయ్ రౌత్
ముంబయి: కాంగ్రెస్ పార్టీని వీడిన మిలింద్ దేవరాపై శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ విరుచుకుపడ్డారు. ప్రస్తుత రోజుల్లో అధికారం కోసం మాత్రమే రాజకీయాలు జరుగుతున్నాయని అన్నారు. పార్టీకి విధేయత అనేది ఉనికిలో లేదని చెప్పారు. మిలింద్ దేవరా తండ్రి మురళీ దేవరా గురించి కూడా ప్రస్తావిస్తూ.. పార్టీ కోసం ఏం చేయాలో తెలిసిన గొప్ప నాయకుడని కొనియాడారు. " విధేయత, భావజాలం వంటి అంశాలు ఇప్పుడు లేవు. రాజకీయాలు ఇప్పుడు కేవలం అధికారం గురించి మాత్రమే నడుస్తున్నాయి. నాకు మిలింద్ దేవరా తెలుసు.. ఆయన పెద్ద నాయకుడు. కాంగ్రెస్తో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు." అని కాంగ్రెస్కు మిలింద్ దేవర రాజీనామా చేయడంపై రౌత్ మాట్లాడారు. లోక్సభ ఎన్నికలకు ఇంకా నెలరోజుల ముందు మహారాష్ట్రలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి ప్రముఖ నాయకుడు మిలింద్ దేవరా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, శివసేన (యుబిటి)ల మధ్య సీట్ల పంపకాల చర్చలపై ఆయన కలత చెందినట్లు సమాచారం. 'రాజకీయ ప్రయాణంలో ముఖ్యమైన ముగింపు. నేను కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. పార్టీతో నా కుటుంబానికి 55 ఏళ్ల బంధాన్ని ముగించాను. ఇన్ని ఏళ్లుగా పార్టీ నుంచి నాకు మద్దతు తెలిపిన నాయకులు, సహచరులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.'అని పేర్కొంటూ ఎక్స్ వేదికగా మిలింద్ దేవరా పంచుకున్నారు. Congress leader Milind Deora resigns from the primary membership of Congress "Today marks the conclusion of a significant chapter in my political journey. I have tendered my resignation from the primary membership of Congress, ending my family’s 55-year relationship with the… pic.twitter.com/iCAmSpSVHH — ANI (@ANI) January 14, 2024 ముంబయి సౌత్ లోక్సభ స్థానం నుంచి మిలింద్ కాంగ్రెస్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. కానీ 2014, 2019 ఎన్నికల్లో శివసేన నేత ప్రమోద్ సావంత్ చేతిలో ఓటమిపాలయ్యి రన్నరప్గా నిలిచారు. ఈ సారి ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా సౌత్ ముంబయి లోక్ సభ స్థానాన్ని శివసేన(యూబీటీ)కి కేటాయించారు. దీంతో అసంతృప్తికి లోనైన మిలింద్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇదీ చదవండి: కాంగ్రెస్కు సీనియర్ నేత గుడ్ బై.. 55 ఏళ్ల పాటు పార్టీకి సేవలు.. చివరకు.. -
ఉద్ధవ్ థాక్రేపై అయోధ్య రామమందిర ప్రధాన పూజారి ఫైర్
లక్నో: అయోధ్యలో జనవరి 22న జరిగే ఆలయ ప్రతిష్ఠాపన వేడుకలకు ఆహ్వానం అందలేదన్న శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రేపై శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ మండిపడ్డారు. ఆలయ మహా సంప్రోక్షణకు శ్రీరాముని భక్తులకు మాత్రమే ఆహ్వానాలు అందజేశామని తెలిపారు. రాముని పేరు చెప్పుకుని ప్రతిపక్షాలే రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. రామున్ని నమ్మినవారే ప్రస్తుతం అధికారంలో ఉన్నారని అన్నారు. "రాముని భక్తులకు మాత్రమే ఆహ్వానాలు అందుతాయి. రాముని పేరు మీద బీజేపీ రాజకీయం చేస్తున్నారని చెప్పడం పూర్తిగా తప్పు. మన ప్రధానిని ప్రతిచోటా గౌరవిస్తారు. ఆయన తన హయాంలో ఎనలేని కృషి చేశారు. రాజకీయాలు కాదు.. ఇది ఆయన భక్తి” అని ఆచార్య సత్యేంద్ర దాస్ అన్నారు. రామ మందిర ప్రారంభ వేడుకలను బీజేపీ రాజకీయం చేస్తుందని శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ ఇటీవల ఆరోపించారు. తమ పార్టీ ఎన్నికల్లో రాముడిని తమ అభ్యర్థిగా ప్రకటిస్తామని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఆచార్య సత్యేంద్ర దాస్.. సంజయ్ రౌత్, ఉద్ధవ్ థాక్రేపై విరుచుకుపడ్డారు. రాముని పేరు ఎవరు వాడుకుంటున్నారో? తెలుసుకోవాలని ప్రశ్నించారు. రామ మందిర ప్రతిష్ఠాపనకు తనకు ఆహ్వానం అందకపోవడంపై థాక్రే బీజేపీని విమర్శించారు. మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చవద్దని అన్నారు. ఒకే పార్టీ చుట్టూ తిరగకూడదని చెప్పారు. రామాలయం ప్రారంభోత్సవం పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు. మందిర నిర్మాణం కోసం తన తండ్రి బాల్ థాక్రే చేసిన పోరాటాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇటీవల రామాలయ వేడుక ఆహ్వానాన్ని సీపీఐ కార్యదర్శి సీతారాం ఏచూరి తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి.. కార్యకర్తలకు కేజ్రీవాల్ పిలుపు -
రాముడే బీజేపీ ఎన్నికల అభ్యర్థి!: రౌత్
ముంబై: అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవాన్ని బీజేపీ పూర్తిగా రాజకీయమయం చేస్తోందని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. ఆలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఆహా్వనంపై రౌత్ స్పందించారు. ‘‘ శ్రీరాముని పేరును బీజేపీ తన రాజకీయాలకు విపరీతంగా వాడేసుకుంది. అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్నీ బీజేపీ ఎంతో రాజకీయ చేసింది. తమ ఎన్నికల అభ్యర్థి శ్రీరామచంద్రుడే అని బీజేపీ ప్రకటించడం ఒక్కటే మిగిలిపోయింది. జనవరి 22న జరిగేది బీజేపీ కార్యక్రమం. ఆ రోజు జరిగేది ఎలా చూసినా జాతీయ కార్యక్రమం కాబోదు. రాజకీయాలతో బీజేపీ రాముడిని కిడ్నాప్ చేసింది’’ అని వ్యాఖ్యానించారు. మరి శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే ఆ కార్యక్రమానికి వెళ్తారుగా అని మీడియా ప్రశ్నించగా ‘‘అవును. కానీ బీజేపీ ఆధ్వర్యంలో జరిగే తతంగం అంతా ముగిశాక అసలు కార్యక్రమంలో ఉద్ధవ్ పాల్గొంటారు’’ అని బదులిచ్చారు. -
ప్రధానిపై కథనం..సంజయ్ రౌత్పై కేసు
ముంబై: శివసేన(ఉద్ధవ్)నేత,రాజ్యసభ ఎంపీ సంజయ్రౌత్పై మహారాష్ట్రలోని యావత్మాల్ పోలిస్స్టేషన్లో రాజద్రోహం కేసు నమోదైంది. ప్రధాని మోదీపై పార్టీ పత్రిక సామ్నాలో అభ్యంతరకర ఆర్టికల్ రాశారన్న కారణంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. యావత్మాల్ బీజేపీ కన్వీనర్ నితిన్ భుటాడా ఫిర్యాదు మేరకు రౌత్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సోమవారం(డిసెంబర్11)న రౌత్ సామ్నాలో ప్రధానిపై అభ్యంతరకర ఆర్టికల్ రాశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ పత్రిక సామ్నాకు రౌత్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. రౌత్పై రాజద్రోహం(ఐపీసీ 124ఏ)తో పాటు రెండు వర్గాల మధ్య విద్వేషాలు రేపేందుకు ప్రయత్నించారని ఐపీసీ153(ఏ) సెక్షన్ కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ఇదీచదవండి..యాదవ్కు సీఎం పదవి..బీజేపీ బిగ్ స్కెచ్ -
కాంగ్రెస్ ఓటమికి కమల్నాథ్ కారణం.. సంజయ్ రౌత్
Madhya Pradesh Elections results: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమికి కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ కారణమని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కొన్ని సీట్లను ‘ఇండియా’ (INDIA) కూటమిలోని భాగస్వామ్యులతో పంచుకుని ఉంటే మరోలా ఉండేదన్నారు. మిత్రపక్షాల పట్ల పాత పార్టీ తన వైఖరిని పునరాలోచించాలని కూడా ఆయన సూచించారు. ఎన్నికల సమయంలో సమాజ్వాదీ పార్టీతో సీట్లు పంచుకోవాలనే ఆలోచనను కమల్నాథ్ వ్యతిరేకించారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ వంటి నేతలు చురుగ్గా ప్రచారం చేసినప్పటికీ మధ్యప్రదేశ్లో ఓటమికి కమల్నాథ్ కారణమని, విపక్ష కూటమితో కలిసి కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. అఖిలేష్ పార్టీకి (సమాజ్వాదీ పార్టీ) కొన్ని ప్రాంతాలలో మంచి మద్దతు ఉందని, ఆ పార్టీకి కంచుకోటలుగా పేరుగాంచిన 10-12 స్థానాలు ఉన్నాయన్నారు. కానీ దీనిని కమల్నాథ్ వ్యతిరేకించారన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు విలువైన గుణపాఠం చెబుతాయని, రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి సమిష్టిగా పాల్గొనాలని రౌత్ ఉద్ఘాటించారు. కాంగ్రెస్ తన వ్యూహాన్ని పునరాలోచించాలని, మిత్రపక్షాల వైపు దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక రాహుల్ గాంధీ “పనౌటీ” వ్యాఖ్య మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల ఫలితాలను దెబ్బతీసిందనే ఆరోపణలను రౌత్ తోసిపుచ్చారు. “అలా అయితే, ఆ వ్యాఖ్య తెలంగాణలో ఎందుకు దెబ్బతీయలేదని ప్రశ్నించారు. కాగా డిసెంబరు 6న ఇండియా బ్లాక్ సమావేశానికి పిలుపునిచ్చామని, ఈ సమావేశంలో పలు విషయాలు చర్చిస్తామని రౌత్ తెలిపారు. -
పంజరంలో చిలుకలా ఈసీ: రౌత్
ముంబై: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎన్నికల సంఘం కూడా పంజరంలో చిలుకలా మారిందని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. అన్ని విషయాల్లోనూ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. ‘‘ఉచితంగా అయోధ్య రామ మందిర దర్శనం కలి్పస్తామని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పదేపదే చెబుతున్నా ఈసీ పట్టించుకోవడం లేదు. అదే హామీ విపక్షాలు ఇస్తే వెంటనే షోకాజ్ నోటీసులిచ్చేది’’ అంటూ పార్టీ పత్రిక సామ్నాకు రాసిన వ్యాసంలో రౌత్ విమర్శించారు. మోదీ హయాంలో భారత క్రికెట్ పూర్తిగా ఆయన స్వరాష్ట్రం గుజరాత్కు తరలిపోయిందని ఆరోపించారు. ‘‘గతంలో దేశ క్రికెట్కు ముంబై ప్రధాన కేంద్రంగా ఉండేది. ఇప్పుడంతా అహ్మదాబాద్మయం! ప్రపంచ కప్ ఫైనల్ కూడా అక్కడే జరుగుతోంది! స్వీయ రాజకీయ లబ్ధి కోసం చివరికి క్రికెట్ను కూడా కూడా మోదీ సర్కారు పొలిటికల్ ఈవెంట్గా మార్చేసింది’’ అని ఎద్దేవా చేశారు. -
వరల్డ్కప్ ఫైనల్పై శివసేన ఎంపీ తీవ్ర విమర్శలు
World Cup final: ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆతిథ్య భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య హోరాహోరీగా సాగుతోంది. దేశవ్యాప్తంగా కోట్ల మంది ఈ ఫైనల్ మ్యాచ్ సంరంభంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో వరల్డ్ ఫైనల్పై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు చేశారు. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్స్ క్రికెట్ ఈవెంట్ కంటే కూడా బీజేపీ ఈవెంట్లా సాగుతోందని సంజయ్ రౌత్ ఆరోపించారు. క్రికెట్ పరిభాషలో బీజేపీపై విమర్శలు గుప్పించారు. "ఈరోజు ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ప్రధాని మోదీ బౌలింగ్, అమిత్ షా బ్యాటింగ్, ఫీల్డింగ్ చేసేలా ఉన్నారు" అని వ్యంగంగా విమర్శించారు. "క్రికెట్లోకి రాజకీయాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. కానీ అహ్మదాబాద్లో అదే జరుగుతోంది" అని రౌత్ అన్నారు. ఇందులో తనకేమీ ఆశ్చర్యం లేదన్నారు. ప్రధాని మోదీ హాజరవుతున్నారు కాబట్టి భారత్ కచ్చితంగా కప్ గెలవాలని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ను వీక్షించనున్నట్లు శనివారం అధికారిక ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. -
చైనా మ్యాప్ విడుదల.. సర్జికల్ స్ట్రైక్ చేసే దమ్ము మోదీకి ఉందా?
భారతలోని భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపుతూ సోమవారం చైనా అధికారికంగా ఓ మ్యాప్ను (standard map) విడుదల చేసిన విషయం తెలిసిందే. 2023 చైనా ఎడిషన్ పేరుతో విడుదలైన ఈ మ్యాప్లో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్ వంటి వివాదాస్పద భూభాగాలను తమ దేశంలో అంతర్భాగంగా పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్ను దక్షిణ టిబెట్గా చూపించడంతోపాటు తైవాన్, దక్షిణా చైనా సముద్రాన్ని కూడా తమ దేశ ప్రాంతాలుగా కలిపేసుకుంది. ఆ దమ్ము ఉందా? అయితే చైనాకు పొరుగు దేశాలతో కలిసి జాతీయ సరిహద్దులను తెలుపుతూ రూపొందించిన ఈ మ్యాప్ రాజకీయ దుమారానికి తెరలేపింది. తాజాగా చైనా మ్యాప్ వివాదంపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చైనాపై సర్జికల్ స్టైక్ చేసే దమ్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉందా అని ప్రశ్నించారు. రాహుల్ చెప్పింది నిజమే! ‘చైనాపై దమ్ము, ధైర్యం ఉంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయండి. ప్రధాని మోదీ ఈ విషయంపై దృష్టి సారించాలి. ఇటీవలె మోదీ బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నారు. అక్కడ చైనా అధికారులను ఆలింగనం కూడా చేసుకున్నారు. ఈ దృశ్యాలు మా మనసులను గాయపరిచాయి. ఇది జరిగిన కొద్ది రోజులకే చైనా ఈ మ్యాప్ను విడుదల చేసింది. భారత్లోకి చైనా ప్రవేశించిందటూ రాహుల్ గాంధీ ముందే చెప్పారు. లద్దాఖ్లోని పాంగాంగ్ సరస్సు వద్ద మన భూభాగాన్ని చైనా కాజేసిందని రాహుల్ చెప్పింది నిజమే’ నని వ్యాఖ్యానించారు. చదవండి: మరోసారి చైనా కవ్వింపు చర్య.. అరుణాచల్, అక్సాయిచిన్ మావే! ఎన్నికలొస్తున్నాయి.. అల్లరు జరుగుతాయి 'ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ సర్జికల్ స్ట్రైక్ డ్రామా ఆడుతుందేమోనని ప్రజలు భయపడుతున్నారు. పుల్వామా దాడి కూడా కుట్రపూరితంగా జరిగిందని జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎలక్షన్స్ ముందు అల్లర్లు జరిగే అవకాశం ఉంది. రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా రామభక్తుల రైలుపై రాళ్లు రువ్వడం, బాంబులు విసరడం, దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగడం వంటివి జరిగే అవకాశం ఉందన్న భయం ప్రజల్లో ఉంది. హర్యానా అల్లర్లే ఉదాహరణ ఇదంతా లోక్సభ ఎన్నికల్లో గెలవడం కోసమే. ప్రధాన రాజకీయ పార్టీల మనస్సులలోనూ ఈ ఆందోళన ఉంది. ప్రతి విషయాన్ని ప్రజల ముందు ఉంచడం మన బాధ్యత. అలా జరగని పక్షంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. హర్యానాలో జరిగిన అల్లర్లే దీనికి ఉదాహరణ’ అని రౌత్ పేర్కొన్నారు. రాహుల్ ఏమన్నారంటే.. ఈ నెల 17 నుంచి లద్దాఖ్లో కాంగ్రెస్ పర్యటించిన కాంగ్రెస్ నేత గాంధీ.. మన భూభాగాన్ని చైనా కాజేసిన విషయం లద్దాఖ్లోని ప్రతి ఒక్కరికీ తెలుసునని అన్నారు. ‘వారం రోజులుగా లద్దాఖ్లో బైక్పై పర్యటిస్తున్నా. లద్దాఖ్ వ్యూహాత్మక ప్రదేశం. భారత్కు చెందిన వందలాది కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా లాక్కున్న విషయం పాంగోంగ్ సరస్సు వద్దకు వెళ్లినప్పుడు అర్థమయ్యింది. ఇక్కడి భూమిని అంగుళం కూడా చైనా ఆర్మీ ఆక్రమించుకోలేదంటూ ప్రధాని మోదీ చెప్పిందంతా పూర్తిగా అసత్యం. ప్రధాని నిజం చెప్పలేదు. చైనా మన భూభాగాన్ని కబ్జా చేసిందనే విషయం లద్దాఖ్లోని ప్రతి ఒక్కరికీ తెలుసు’ అని రాహుల్ అన్నారు. -
వారణాసిలో మోదీపై ప్రియాంక పోటీ.. సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
ముంబై: ఉద్దవ్ ఠాక్రే వార్గానికి చెందిన శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్వి ప్రియాంక గాంధీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారాణాసి నుంచి పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారని అన్నారు.ఈ మేరకు సంజయ్ రౌత్ సోమవారం మాట్లాడుతూ.. వారణాసి ప్రజలలు ప్రియాంక గాంధీని కోరుకుంటున్నారని తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని మోదీపై పోటీగా ప్రియాంక గాంధీ బరిలోకి దిగితే తప్పక గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాయ్బరేలీ, వారణాసి, అమేథీలో బీజేపీకి గట్టి పోటీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భేటీపై కూడా సంజయ్ రౌత్ స్పందించారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలసుకోగా లేనిది శరద్, అజిత్ ఎందుకు భేటీ కాకూడదని ప్రశ్నించారు. ఆదివారం శరద్, అజిత్ పవార్ సమావేశమయ్యారని మీడియా ద్వారా తెలిసింది. దీనిపై శరద్ పవార్ త్వరలోనే మాట్లాడతారన్నారు. ప్రతిపక్ష కూటమి ఇండియా సమావేశానికి హాజరుకావాలని ఆహ్వానించేందుకే అజిత్ పవార్ను.. శరద్ పవార్ కలిసి ఉంటారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే మహారాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వంపై మహారాష్ట్ర ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ సహా రాష్ట్ర ప్రజలు సంతోషంగా లేరని అన్నారు. ప్రస్తుతం సంజయ్ రౌత్ వ్యాఖ్యలు మహా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. చదవండి: తండ్రీకొడుకుల్ని బలిగొన్న నీట్.. స్టాలిన్ ఆవేదన -
ఒకే వేదికపై ప్రధాని మోదీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్?
ముంబై: పూణేలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లోక్ మాన్య తిలక్ జాతీయ అవార్డు ప్రదానం చేయనున్న కార్యక్రమానికి శరద్ పవార్ ముఖ్యఅతిధిగా హాజరు కానున్నారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. అయినా ఒకే వేదికపై నవ్వుకుంటూ ఎలా కూర్చుంటారంటూ ప్రశ్నించారు శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్. దీనికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీదే అంటూ నిలదీశారు . పూణేలోని లోక్ మాన్య తిలక్ స్మారక మందిర్ వారు ప్రధానమంత్రి నరేద్ర మోదీకి లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును బహూకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవర్ హాజరు కానున్నారు. ఇదే విషయాన్ని వేలెత్తి చూపుతూ శివసేన(యూబీటి) నాయకుడు సంజయ్ రౌత్ మీకసలు విజ్ఞత ఉందా? ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఒకే వేదికపై ఎలా కూర్చుంటారో వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు. మీరు నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తారు. వాటికి కట్టుబడి మీ కార్యకర్తలు వాళ్లలో వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు.. మీరేమో ఒకే వేదికపై స్నేహితుల్లా కలిసిపోతారంటూ ప్రధాని మోదీని, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ను ఇద్దరినీ ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ప్రధాని చూస్తే ఎన్సీపీ పార్టీ నిండా అవినీతిపరులే ఉన్నారంటారు. మీరేమో నేను మరాఠాల ముఖచిత్రాన్ని.. మేము బీజేపీకి వ్యతిరేకమంటూ మాటలు చెబుతారు. మరి ఈ రోజు అవన్నీ ఏమైపోయాయి. ప్రజలను వెర్రి వాళ్ళను చేస్తున్నారా? మీరు ప్రధాని అవార్డు కార్యక్రమానికి వెళ్తే మీ కార్యకర్తలను అనుమానించినట్లే. అధికారం కోసమో మరో కారణంతోనో మీకు వెన్నుపోటు పొడిచిన వారంతా అక్కడికి వస్తారు. వారందరినీ నవ్వుతూ పలకరిస్తే మీరు వాళ్ళు చేసినదానికి ఆమోదం తెలిపినట్లు కదా? దేశమంతా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే మీరు వెళ్లి ఆయన పంచన చేరడం న్యాయమేనా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరో ఎంపీ అరవింద్ సావంత్ మాట్లాడుతూ లోక్ మాన్య తిలక్ "స్వరాజ్యం మా జన్మహక్కు" అన్నారు. మీరు దాన్ని కాస్తా "సొంత రాజ్యం మా హక్కు"గా మార్చేశారని ఎద్దేవా చేశారు. ఇది కూడా చదవండి: హెచ్ఆర్ ఘరానా మోసం.. నిరుద్యోగియైన భార్యకు కంపెనీ జీతం.. -
మహారాష్ట్ర సీఎం మారబోతున్నారు.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్రలో ఒక్కరోజులోనే పరిణామాలు వేగంగా మారిపోయాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేతో కలిసి బీజేపీ–శివసేన(షిండే వర్గం) ప్రభుత్వంలో చేరడం రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. ఏకంగా అజిత్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా తన వర్గం ఎమ్మెల్యేల్లో ఎనిమిది మందికి మంత్రి పదవులు లభించాయి తాజాగా అజిత్ పవార్ ఎన్డీయే ప్రభుత్వంలో చేరడంపై శివసేన(ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. త్వరలోనే మహారాష్ట్ర సీఎం మారనున్నారని వ్యాఖ్యానించారు. ఏక్నాథ్ షిండేకు పదవి గండం మొదలైందని, అజిత్ పవార్ త్వరలోనే మహారాష్ట్ర సీఎంగా బాద్యతలు చేపట్టనున్నారని చెప్పారు. దీంతో షిండే తన పదవిని కోల్పేయే ప్రక్రియ మొదలైందని, ఆయన 16 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని అన్నారు. ఈ పరిణామాన్ని ట్రిపుల్ ఇంజిన్ సర్కార్గా చూడరాదని.. రెండు ఇంజిన్లలో ఒకటి ఫెయిలవుతోందంటూ పేర్కొన్నారు. #WATCH | Uddhav Thackeray faction leader and MP Sanjay Raut, says "Today I am saying this in front of the camera, the Chief Minister of Maharashtra is going to change. Eknath Shinde is being removed. Eknath Shinde and the 16 MLAs are going to be disqualified" pic.twitter.com/R0YI0MwQwR — ANI (@ANI) July 3, 2023 సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ‘మహారాష్ట్ర సీఎం మారబోతున్నారు. ఈ విషయాన్ని నేను ఈ రోజు కెమెరా ముందు చెబుతున్నాను. ఏక్నాథ్ షిండేను సీఎంగా తొలిగిస్తారు. 16 మంది రెబల్ ఎమ్మెల్యేలు కూడా అనర్హత వేటుకు గురవుతారు. పవార్కు పట్టాభిషేకం చేస్తారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్లను బీజేపీ విచ్ఛిన్నం చేస్తోంది. అయితే దీని వల్ల వారికి (బీజేపీ) ఎటువంటి ప్రయోజనం లేదు. 2024 ఎన్నికల్లో మేమంతా కలిసే పోరాడుతాం. ఎన్సీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారని మోదీయే చెప్పారు. ఇప్పుడు అదే నేతలు రాజ్భవన్లోప్రమాణం స్వీకారం చేయడం షాకింగ్గా ఉంది’ అని పేర్కొన్నారు. కాగా ఎన్సీపీలో ఆదివారం చీలిక ఏర్పడిన విషయం తెలిసిందే. అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి అనూహ్యంగా షిండే- బీజేపీ ప్రభుత్వంలో చేరడంతో ఆ పార్టీ చీఫ్ శరద్పవార్కు పెద్ద షాక్ తగిలినటైంది. అజిత్ పవార్తో ఉప ముఖ్యమంత్రిగా, ఛగన్ భుజ్బల్, దిలీప్ వాల్సే పాటిల్, హసన్ ముష్రీఫ్, ధనుంజయ్ ముండే, ఆదితీ తట్కారే, ధర్మారావు , అనిల్ పాటిల్, సంజయ్ బాంసోడేతో మంత్రులుగా రాష్ట్ర గవర్నర్ రమేశ్ రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవంలో స్పీకర్ తోపాటు డిప్యూటీ స్పీకర్ నరహరి, ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. #WATCH | Uddhav Thackeray faction leader and MP Sanjay Raut, says "BJP is breaking Shiv Sena, NCP and Congress but this will not benefit them at all. In Maharashtra, we will fight unitedly. It is shocking that PM Modi had said that the leaders of NCP are involved in corruption… pic.twitter.com/6VodgbNNXI — ANI (@ANI) July 3, 2023 -
‘ఇలాంటి డ్రామాలు చేస్తే.. కేసీఆర్కు తెలంగాణలో ఓటమి ఖాయం’
ముంబై: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనతో రాజకీయాలు వేడెక్కాయి. కేసీఆర్ పర్యటన ఇక్కడి రాజకీయాలపై ప్రభావం చూపదని శివసేన ఉద్ధవ్ ఠాక్రే పక్షనేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇలాగే వ్యవహరిస్తే తెలంగాణ కూడా పోతుందని, ఆయన ఓటమి భయంతో ప్రస్తుతం మహారాష్ట్రలో అడుగుపెట్టారని ధ్వజమెత్తారు. మరో వైపు బీఆర్ఎస్ నేతలు 12 నుంచి 13 మంది కాంగ్రెస్లో చేరారని రౌత్ అన్నారు. ఇది కేసీఆర్, కాంగ్రెస్ మధ్య పోరు. మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి బలంగా ఉందన్నారు. ఇదిలా ఉండగా .. బీఆర్ఎస్ను జాతీయ పార్టీగా ప్రకటించిన కేసీఆర్... జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చిలో మహారాష్ట్రలోని నాందేడ్లో ఆయన సభ నిర్వహించి, బీజేపీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, శివసేనపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. కాగా.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, పలువురు బీఆర్ఎస్ నేతలు సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. తెలంగాణలో ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కుస్తీపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కర్ణాటకలో ఎన్నికల్లో విజయం సాధించడంతో జోష్లో ఉన్న ఆ పార్టీకి తాజాగా ముఖ్య నేతలు టీకాంగ్రెస్లోకి చేరడం కలిసొచ్చే అంశమనే చెప్పాలి. చదవండి: టీడీపీ-జనసేన.. భయం భయంగానే సహజీవన రాజకీయం! -
మహారాష్ట్ర రాజకీయంలో కలకలం.. చంపేస్తామంటూ మరో నేతకు బెదిరింపులు..
మహారాష్ట్ర: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్కు బెదిరింపు కాల్స్ రావడం మహారాష్ట్ర రాజకీయంలో కలకలం రేపింది. అయితే.. తాజాగా శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్..తనకూ, తన సోదరుడు ఎమ్మెల్యే సునీల్ రౌత్కు కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పారు. చంపేస్తామంటూ దుండగులు బెదిరించినట్లు పేర్కొన్నారు. బెదిరింపులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతిపక్షాలను భయాందోళనకు గురి చేసేందుకే దుండగులు ఈ చర్యకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం కూడా ఇలాంటి బెదిరింపులను కోరుకుంటోందని విమర్శించారు. ఇలాంటి బెదిరింపులకు భయపడబోనని గతంలోనూ ఇలాంటివే వచ్చాయని ఆయన అన్నారు. దీని వెనుక 40 మందితో కూడిన సూపర్ పవర్గా పిలిచే ఓ అదృశ్య శక్తి దాగి ఉందంటూ భాజపాపై పరోక్ష విమర్శలు చేశారు. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇదీ చదవండి: గాడ్సే, ఆప్టే పుత్రులు ఎవరో?.. ఫడ్నవీస్ వ్యాఖ్యలపై ఓవైసీ ఫైర్.. -
చంపేస్తానని లైవ్ లోనే బెదిరించిన శివసేన నేత
మహారాష్ట్రలోని కొల్హాపూర్ అల్లర్ల నేపథ్యంలో శివసేన నాయకుడు సంజయ్ మషీల్కర్ ఒక టీవీ ఛానల్ నిర్వహించిన డిబేట్లో పాల్గొని లైవ్ లోనే తమ పార్టీ నాయకుడిని చంపేస్తానంటూ బెదిరించడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు శివసేన(UBT) నాయకుడు సంజయ్ రౌత్. ప్రభుత్వమే తమ ప్రత్యర్థులను చంపేయమని ఆర్డర్లు వేస్తోందా? మర్డర్లు చేయడానికి టెండర్లు కూడా స్వీకరిస్తున్నారా? అని ప్రశ్నించారు. కొల్హాపూర్ అల్లర్లు తర్వాత ఆ ప్రాంతంలో గురువారం కర్ఫ్యూ విధించింది ప్రభత్వం. ఈ సందర్బంగా పలు టీవీ డిబేట్లలో పాల్గొన్న శివసేన నాయకుడు సంజయ్ మషీల్కర్ ఒక లైవ్ ప్రోగ్రామ్ లో పాల్గొని కార్యక్రమం ముగిసిన తర్వాత శవసేన(UBT) నాయకుడు ఆనంద్ దూబేను ఉద్దేశించి నువ్వేమైనా ఛత్రపతి శివాజీ వారసుడు అనుకుంటున్నావా? హద్దుల్లో ఉండు... లేదంటే కాల్చి పారేస్తా... అని బెదిరించారు. దీంతో ట్విటర్ వేదికగా శివసేన(UBT) నాయకుడు సంజయ్ రౌత్ షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. "మహారాష్ట్రలో ఏం జరుగుతోంది? ప్రభుత్వం ఇక్కడ ఎలాంటి పరిస్థితులను నెలకొల్పుతోంది? రాజకీయ ప్రత్యర్థులను మట్టుబెట్టడానికి ప్రభుత్వమే సుపారీ ఇచ్చి మర్డర్లు చేయమని చెబుతోందా? ఇదేమి సంస్కృతి. దీనికి హోంమంత్రి ఫడ్నవీస్ సమాధానం చెప్పాలి" అని హిందీలో రాశారు. महाराष्ट्र में क्या हो रहा है? ये कैसी हालत खोके सरकारने बना रखी हैं ? शिवसेना प्रवक्ता आनंद दुबे जी कल एक टीव्ही न्यूज शो पर चर्चा कर रहे थे तो उन्हे ऑन एअर धमकाया गया..गृहमंत्री फडणविस मुकदर्शक बने बैठे हैं. क्या अपने राजनैतिक विरो धियोकी हत्या करने की सुपारी सरकारने दी… — Sanjay Raut (@rautsanjay61) June 8, 2023 ఇది కూడా చదవండి: ఏకమైన ప్రతిపక్షాలు... బీజేపీని ఓడించడమే లక్ష్యం -
శరద్ పవార్ రాజీనామా చేశారంటే.. దేశ రాజకీయాల్లో ఏదో జరగబోతోంది..!
ముంబై: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం తనను షాక్కు గురి చేసిందని తెలిపారు ఉద్ధవ్ థాక్రే వర్గం శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్. ఆయన అంత పెద్ద నిర్ణయం తీసుకన్నారంటే కచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ ఏదో అలజడి జరగబోతోందని అన్నారు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుంతో చూసి తాము ఓ నిర్ణయం తీసుకుంటామని రౌత్ చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై ఓ కన్నేసి ఉంచిననట్లు తెలిపారు. గతంలో బాలాసాహెబ్ థాక్రే కూడా దిగజారుడు రాయకీయాలు చూసి పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే శివసైనికుల విజ్ఞప్తులతో బాలాసాహెబ్ అప్పుడు తన నిర్ణయాన్ని ఉపసంహరిచుకున్నారని, ఇప్పుడు పవార్ కూడా రాజీనామాను వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. పవార్ను బాలాసాహెబ్తో పోల్చారు. చదవండి: శరద్ పవార్ రాజీనామా తదనంతరం మరో ఎన్సీపీ నేత రాజీనామా కాగా.. తాను అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్ల పవార్ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్సీపీ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామా చేయవద్దని ప్రాధేయపడుతున్నారు. ఓ కార్యకర్త అయితే రాజీనామా ఉపసంహంరించుకోవాలని పవార్కు రక్తంతో లేఖ రాశాడు. మరోవైపు పవార్ రాజీనామా అనంతరం ఎన్సీపీ కార్యదర్శి జితేంద్ర అవ్హాద్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. థానే ఎన్సీపీ ఆఫీస్ బేరర్లు అందరూ కూడా రాజీనామ ా చేసినట్లు తెలిపారు. పవార్ తప్పుకోవడం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ఎన్సీపీ చీఫ్ పదవికి శరద్ పవార్ రాజీనామా.. అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు.. -
20 రోజుల్లో షిండే సర్కార్ పతనం: సంజయ్
జల్గావ్: మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి మరణశాసనం సిద్ధమైందని శివసేన్(ఉద్ధవ్ వర్గం)నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మరో 15–20 రోజుల్లో ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని, మరణశాసనంపై సంతకం చేసేదెవరో ఇప్పుడు తేలాల్సి ఉందని రౌత్ జోస్యం చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంపై తిరుగుబాటు చేసి షిండే వర్గంలో చేరిన 16 మంది ఎమ్మెల్యేల అనర్హత సహా పలు పిటిషన్లు కోర్టులో పెండింగ్లో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ..తీర్పు కోసం తమ పార్టీ ఎదురు చూస్తోందని, న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకుందని చెప్పారు. ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని గత ఏడాది జూన్లో షిండే, 39 మంది ఎమ్మెల్యేలు కూల్చి, బీజేపీ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. -
‘ప్రజలను చంపుకొని తినే క్రూరమైన ప్రభుత్వమిది’.. సంజయ్ రౌత్పై కేసు
సాక్షి, ముబై: ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసిన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్పై శుక్రవారం మెరైన్లైన్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. శిందే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యేలు సంజయ్ శిర్సాట్, భరత్ గోగవావలే కిరణ్ పావస్కర్ మెరైన్ లైన్స్ పోలీసు స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ నీలేశ్ బాగుల్కు ఫిర్యాదు చేశారు. రౌత్ చేసిన ఆరోపణలు సమాజంలో విభేదాలు సృష్టించే విధంగా ఉన్నాయంటూ ఫిర్యాదుదారులు ఆరోపించారు. న్యూ ముంబై ఖార్ఘర్లో గత ఆదివారం జరిగిన మహారాష్ట్ర భూషణ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో వడదెబ్బ తగలి చనిపోయిన వారు 14 మంది కాదని దాదాపు 50-75 మంది ఉన్నారని గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రౌత్ ఆరోపించారు. అంతేగాకుండా మృతుల సంఖ్యను తక్కువ చూపించేందుకు మృతుల కుటుంబ సభ్యులు, బందువుల ఇళ్లకు వెళ్లి లక్షల్లో డబ్బులు ఎరచూసాన విమర్శించారు. శిందే నోటికి తాళం పడిందా? అసలు మృతుల సంఖ్య ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. మననుషల ప్రాణాలకు విలువలేదు. డబ్బుతో వెల కడుతున్నారని దుయ్యబట్టారు. నిర్వాహకుల నిర్లక్ష్యంవల్లే ఇంతమంది చనిపోయారని, మృతులకు కారకులైన శిందే, ఫడ్నవీస్ పదవుల్లో కొనసాగే అధికారం లేదని, కింటనే రాజీనామా చేయలని డిమాండ్ చేశారు. ప్రజలను చంపుకు తినే క్రూరమైన ప్రభుత్వమిదని మండిపడ్డారు. మొత్తం 14 మంది మృతుల్లో 12 మంది ఏడు గంటలకుపైగా ఎండతో ఉపవాసంతో ఉండటంవల్ల మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. దీంతో రౌత్ చేసిన ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లైంది. కాగా, శిందే, ఫడ్నవీస్లపై మనుష్యవథ కేసు నమోదు చేయాలని సంఘటన జరిగిన తరువాత అదే రోజు అజిత్పవార్, సంజయ్ రౌత్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. కానీ గురువారం విలేకరుల ఎదుట సంజయ్ చేసిన విమర్శలు సమాజంలో విభేదాలు సృష్టించేలు ఉన్నాయంటూ కేసు నమోదు చేశారు. -
హస్తినకొస్తే అంతం చేస్తాం
ముంబై: ఓ గ్యాంగ్స్టర్ బృందం తనను చంపేస్తానని బెదిరించిందని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. బెదిరింపుల అంశంపై వెంటనే ముంబైలో పోలీసులకు ఆయన ఫిర్యాదుచేశారు. ముంబైలో ఉండే సంజయ్రౌత్ ఢిల్లీకొస్తే ఏకే47 తుపాకీతో కాల్చిపడేస్తామని హెచ్చరిస్తూ ఆయనకు వాట్సాప్లో సందేశం పంపారు. ఈ ఘటనలో ముంబై పోలీసులు పుణేకు చెందిన 23 ఏళ్ల రాహుల్ తలేకర్ను అరెస్ట్చేశారు. కంజుర్మార్గ్ పోలీస్స్టేషన్లో రౌత్ సోదరుడు, ఎమ్మెల్యే సునీల్ ఇచ్చిన ఫిర్యాదు, పోలీసు అధికారి శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. సంజయ్ రౌత్కు రాహుల్ తలేకర్ ముందుగా ఫోన్లో బెదిరించేందుకు ప్రయత్నించాడు. అది కుదరకపోవడంతో వాట్సాప్లో బెదిరిస్తూ మెసేజ్ చేశాడు. ‘రౌత్ హిందువులకు శత్రువు. నువ్వు ఢిల్లీలో కనిపించావంటే ఏకే47తో చంపేస్తా. పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే నీకు పడుతుంది. లారెన్స్ నుంచి వచ్చిన హెచ్చరిక ఇది. నీ, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ల మరణం తథ్యం. ఇది ఫిక్స్’ అని హెచ్చరించాడు. మూసేవాలాను గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బృందం చంపేసిందని ఆరోపణలు ఉన్న విషయం తెల్సిందే. దీంతో మెసేజ్లో పేర్కొన్న లారెన్స్ను లారెన్స్ బిష్ణోయ్గా పోలీసులు భావిస్తున్నారు. తలేకర్ను అరెస్ట్చేసిన పోలీసులు అతనిని విచారిస్తున్నారు. సోషల్మీడియా ద్వారా బిష్ణోయ్ గురించి తెల్సుకుని, మద్యం తాగిన మైకంలో అతను రౌత్కు బెదిరింపు సందేశం పంపినట్లు కేసు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు వార్తలొచ్చాయి. పాత్రా చావల్ కేసులో అరెస్టయి కస్టడీలో ఉన్నప్పుడు తనకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయని, వీటిని భయపడేది లేదని రౌత్ స్పష్టంచేశారు. రౌత్ను హత్య చేస్తామని బెదిరింపులు రావడాన్ని మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీవ్రమైన అంశంగా పరిగణించాలని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే డిమాండ్చేశారు. -
ఏకే-47తో కాల్చి చంపుతాం’.. సంజయ్ రౌత్కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు
ముంబై: ప్రస్తుతం జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా మాదిరిగానే తనను కూడా హిందూ వ్యతిరేకిగా పేర్కొంటూ హత్య చేస్తామని బెదిరించినట్లు సంజయ్ రౌత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ..ఢిల్లీలో కనపడితే, నిన్ను ఏకే-47తో కాల్చి చంపుతా. సిద్దూ ముసావాలాకు పట్టిన గతే నీకు పడుతుందనిని బెదిరించినట్లు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం (ఏక్నాథ్ షిండే) మా క్యాంపు నాయకులకు భద్రత తగ్గించింది. దీని గురించి నేను ఎప్పుడూ లేఖ రాయలేదు, కానీ పదే పదే సీఎం కుమారుడు గూండాలతో మాపై కుట్రకు ప్లాన్ చేసాడు. ఈ నేపథ్యంలో మా భద్రత విషయంగా ఎన్ని సార్లు తెలియజేస్తున్న హోం మంత్రిత్వ శాఖ, వీటన్నింటిని స్టంట్గా పరిగణిస్తోంది’ ప్రతిపక్ష నేతల భద్రతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బెదిరింపుల గురించి నేను పోలీసులకు తెలియజేశాను. నేను ఎవరికీ భయపడను. నేను జైలులో ఉన్నప్పుడు నాకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయని’ సంజయ్ రౌత్ తెలిపారు. కాగా పంజాబీ గాయకుడు సిద్ధూ మూసావాలా భద్రతను తగ్గించిన తర్వాత గతేడాది మేలో పంజాబ్లోని మాన్సా జిల్లాలో ఆయన్ను కాల్చి చంపిన సంగతి తెలిసిందే. లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ ఈ దాడికి బాధ్యత వహించారు. కాగా..రౌత్ ఫిర్యాదుపై ముంబయి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెదిరింపులు వచ్చిన ఫోన్ నంబరును ట్రేస్ చేస్తున్నామన్న పోలీసులు.. ఓ అనుమానితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. -
సీఎం కొడుకు నుంచి ప్రాణహాని.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు
ముంబై : ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ శిండే నుంచి తనకు ప్రాణానికి హాని ఉందని రాజ్యసభ ఎంపీ సంజయ్రౌత్ ముంబై పోలీసులకు లేఖ రాశారు. తనను చంపమని థానేకు చెందిన నేరస్తుడు రాజా ఠాకూర్కు శ్రీకాంత్ శిండే సుపారీ ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన పూర్తి సమాచారం తన దగ్గర ఉందని, బాధ్యతాయుతమైన పౌరునిగా పోలీసులకు తెలియజేస్తున్నానన్నారు. లేఖను ముంబై పోలీస్ కమిషనర్తోపాటు హోంశాఖ మంత్రిగా ఉన్న ఉన్న డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కు సైతం పంపించారు. దీనిపై మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే స్పందించారు. ఈ ఫిర్యాదుపై తీవ్రంగా స్పందించాల్సి ఉంది. కానీ.. దురదృష్టవశాత్తు ద్రోహుల వర్గం పట్టించుకోవడం లేదన్నారు. ముంబైలోని మాహింలో ఒక ఎమ్మెల్యే ఫైరింగ్ చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు. కాగా సంజయ్ రౌత్ పోలీసులకు రాసిన లేఖపై డిప్యూడీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. కేవలం పబ్లిసిటీ కోసమే ఆరోపణలు చేశారని సంజయ్ రౌత్పై విరుచుకుపడ్డారు. ‘ఇలాంటి ఆరోపణలు చేసి సంచలనం సృష్టిస్తున్నారు. దాని వల్ల తనకు కొంత సానుభూతి వస్తుందని అనుకోవచ్చు. కానీ బూటకపు ఆరోపణలు చేసి సానుభూతి పొందొద్దు.’ అని అన్నారు. అంతేగాక రౌత్కు అదనపు రక్షణ కల్పించడంపై ఫడ్నవీస్ మాట్లాడుతూ, ‘సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. కొంతమంది నాయకులకు రక్షణ కల్పించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఒక నిర్దిష్ట నాయకుడికి రక్షణ కల్పించాలా లేదా పెంచాలా వద్దా అని కమిటీ నిర్ణయిస్తుంది. ఈ కమిటీ అధిపతి అయిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే ప్యానెల్ రౌత్ లేఖను పరిగణలోకి తీసుకుంటుంది’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు రౌత్ ఆరోపణలపై ఏక్నాథ్ శిండే వర్గం ఎమ్మెల్యే సంజయ్ శిర్సాట్ మాట్లాడుతూ.. అవి సానుభూతికోసం ఠాక్రే సేన వేస్తున్న చిల్లర వేషాలని అన్నారు. ఒకవేళ బెదిరింపుపై ఏమాత్రం నిజమున్న సమగ్ర విచారణ జరిపిస్తామని, కానీ శ్రీకాంత్ శిండే అలా చేస్తారని తాను నమ్మనని స్పష్టం చేశారు. -
శివసేన పార్టీ పేరు, గుర్తు కోసం రూ.2,000 కోట్ల డీల్: సంజయ్ రౌత్
ముంబై: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ ఎన్నికల గుర్తు విల్లు-బాణాన్ని కొనుగోలు చేసేందుకు రూ.2,000 కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. అసలైన శివసేన ఎక్నాథ్ షిండేదే అని ఎన్నికల సింగం నిర్ణయం తీసుకోవడం ఓ ఒప్పందంలో భాగంగానే జరిగిందని అన్నారు. ఈ వ్యవహారంలో రూ.2,000 కోట్ల లావాదేవి జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని, త్వరలోనే వాటిని బయటపెడతానని చెప్పారు. ఈ లావాదేవి గురించి అధికార పార్టీతో సన్నిహత సంబంధాలు ఉన్న ఓ బిల్డర్ తనకు చెప్పారని రౌత్ పేర్కొన్నారు. ఈమేరకు ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 'ఒక ఎమ్మెల్యేను కొనడానికి రూ.50 కోట్లు, ఒక ఎంపీని కొనడానికి రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మా కౌన్సిలర్ని, శాఖా ప్రముఖ్ని కొనడానికి రూ.కోటి వెచ్చిస్తున్న ఈ ప్రభుత్వం, నాయకుడు, నీతిలేని వ్యక్తుల సమూహం, మా పార్టీ గుర్తును, పేరును కొనుగోలు చేయడానికి ఎంత ఖర్చు చేయగలరో నేను ఊహించగలను. నా అంచనా ప్రకారం అది రూ.2,000 కోట్లు' అని రౌత్ ఆరోపించారు. #WATCH शिवसेना और उसका निशान (तीर-कमान) चिह्न छीना गया है और ऐसा करने के लिए इस मामले में अब तक 2,000 करोड़ रुपए की लेनदेन हुई है: उद्धव ठाकरे गुट के नेता व सांसद संजय राउत, मुंबई pic.twitter.com/6hyQHLjMZr — ANI_HindiNews (@AHindinews) February 19, 2023 చదవండి: ఇంటిపై నుంచి రూ.500 నోట్ల వర్షం.. తీసుకునేందుకు ఎగబడ్డ జనం.. -
'ఆ విషయం తెలిస్తే రౌత్ను ఉద్ధవ్ థాక్రే చెప్పుతో కొడతారు'
ముంబై: కేంద్రమంత్రి నారాయణ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ గురించి తనకు తెలిసిన రహస్యాలు చెబితే ఉద్ధవ్ థాక్రే, ఆయన భార్య రష్మి.. రౌత్ను చెప్పుతో కొడతారని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఉద్ధవ్ను కలిసి రౌత్ తనతో చెప్పిన విషయాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు. అప్పుడు రౌత్ నిజస్వరూపం ఆయనకు తెలుస్తుందన్నారు. 'నేను రాజ్యసభ సభ్యుడినయ్యాక.. సంజయ్ రౌత్ నా దగ్గరకు వచ్చి పక్కనే కూర్చునేవారు. ఉద్ధవ్, ఆయన భార్య రష్మి గురించి నాతో చెప్పేవారు. ఆ రహస్యాలు ఎంటో ఉద్ధవ్, రష్మికి చెబితే వారు రౌత్ను చెప్పుతో కొడతారు' అని నారయణ్ రాణె చెప్పారు. శివసేనను ఖతం చేసేందుకు రౌత్ సుపారీ తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు రాణె. శివసేన స్థాపించిన 1969 నుంచి తాను పార్టీ కోసం పనిచేసినట్లు వివరించారు. సంజయ్ రౌత్ వల్లే శివసేన(ఉద్ధవ్) ఎమ్మెల్యేల సంఖ్య 56 నుంచి 12కు పతనమైందని విమర్శించారు. నారాయణ రాణె కేంద్రమంత్రి హోదాలో కాకుండా సాధారణ వ్యక్తిలా వచ్చి తనను కలవాలని రౌత్ శుక్రవారం సవాల్ చేశారు. ఆ మరునాడే రాణె తీవ్రంగా స్పందించారు. తనకు ఎలాంటి రక్షణ అవసరం లేదని, రౌత్ ఎక్కిడికి రమ్మంటే అక్కడకు వెళ్లి కలిసేందుకు సిద్దమని సవాల్ను స్వీకరించారు. చదవండి: మోదీ హయాంలో రెండు రకాల భారత్లు -
ఆ వ్యాఖ్య ప్రధాని మోదీని అవమానించడమే: సంజయ్ రౌత్ ధ్వజం
ముంబై: ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ ప్రధాని నరేంద్ర మోదీని నవ భారత జాతిపితగా అభివర్ణించడంపట్ల శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అమృత ఫడ్నవీస్ వ్యాఖ్యల్ని బీజేపీ అంగీకరిస్తే అది మోదీని తీవ్రంగా అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న నవభారతంలో ఆకలిచావులు, పేదరికం, నిరుద్యోగ్యం, ఉగ్రవాదం వంటి సమస్యలు భారీగా పెరిగిపోయాయని దుయ్యబట్టారు. ఈ మేరకు శివసేన (యూబీటీ) ప్రచార పత్రిక ‘సామ్నా’లోని సంపాదకీయంలో పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సావర్కర్ను జాతి పితగా బీజేపీలో ఏ నాయకుడు కూడా చెప్పరని, రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) ఎల్లప్పుడూ జైలుకెళ్లి శిక్ష అనుభవించిన వీర్సావర్కర్ను వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఇలాంటివారే భారతదేశాన్ని కొత్త, పాత భారతావనిగా విభజించారని చెప్పుకొచ్చారు. గాయకురాలు, బ్యాంకు అధికారి అయిన అమృత ఫడ్నవీస్ ఒక ఇంటర్వ్యూలో మన దేశానికి ఇద్దరు జాతిపితలు ఉన్నారని, ఒకరు పాత భారతానికి మహాత్మాగాంధీ అయితే కొత్త భారతావనికి ప్రధాని నరేంద్రమోదీ అని చెప్పారు. చదవండి: మోదీ ప్రజాదరణ, అమిత్ షా వ్యూహాలు.. 2022లోనూ తిరుగులేని బీజేపీ! అయితే అమృత వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో పాటు మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. స్వాతంత్య్ర సమరయోధుల ఆత్మ బలిదానాల నుంచి లభించిన దేశ స్వాతంత్య్రాన్ని బీజేపీ గుర్తించడంలేదని విమర్శించారు. ఎనిమిదేళ్ల ప్రధాని నరేంద్రమోదీ పరిపాలనలో ప్రస్తుతం దేశంలో ఆకలిచావులు, పేదరికం, నిరుద్యోగం, ఉగ్రవాదం ప్రధానంగా పెరిగిపోయాయని, ఇలాంటి కొత్త భారతావనికి జాతిపిత మోదీ అని చెప్పడం ఆయనకు తీవ్ర అవమానమని ఎద్దేవా చేశారు. వివిధ రాజకీయ పార్టీలతోపాటుగా శివసేన పార్టీ వ్యవస్థాపకుడు దివంగత నేత బాలాసాహెబ్ ఠాక్రే కూడా గతంలో ఇటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సంజయ్ రౌత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారతావనికి జాతిపిత ఎవరనేది సమస్య కాదని, అసలు దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో బీజేపీ పాత్ర ఏంటనేదే ఇక్కడ సమస్య అని వివరించారు. బీజేపీ గానీ, దాని అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ గానీ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఎటువంటి పాత్రపోషించలేదని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్తో అనుబంధమున్న సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి ఆదర్శనేతలను దొంగిలించి తమవారిగా చెప్పుకుంటూ బీజేపీ చరిత్రను వక్రీకరిస్తుందని సంజయ్ రౌత్ విమర్శించారు. -
కర్ణాటకతో సరిహద్దు వివాదంపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
ముంబై: మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దు వివాదంపై శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా బలగాలు భారత్లోకి ప్రవేశించినట్లే తాము కూడా కర్ణాటకలోకి వెళ్తామన్నారు. ఈ విషయంలో తమకు ఎవరి అనుమతి అవసరం లేదన్నారు. కర్ణాటక సీఎంతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని తాము భావించామని, కానీ ఆయనే అగ్గి రాజేసి రెచ్చగొడుతున్నారని రౌత్ విమర్శించారు. ఇటు మహారాష్ట్రలో ప్రస్తుతం బలహీన ప్రభుత్వం అధికారంలో ఉందని, సరిహద్దు వివాదంపై తటస్థంగా ఉంటూ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఈమేరకు రౌత్ బుధవారం మీడియాతో మాట్లాడారు. #WATCH | Like China has entered, we will enter (Karnataka). We don't need anyone's permission. We want to solve it through discussion but Karnataka CM is igniting fire. There is a weak govt in Maharashtra & is not taking any stand on it: Sanjay Raut, Uddhav Thackeray's faction pic.twitter.com/d0okV6Wq8X — ANI (@ANI) December 21, 2022 మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదం ఆందోళనకర స్థాయికి చేరింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటివలే చర్చలు జరిపారు. అయితే ఈ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేమన్నారు. చదవండి: జోడో యాత్రపై రాహుల్కు కేంద్రం హెచ్చరిక.. -
Kashmir Files: 'కశ్మీర్ ఫైల్స్ తర్వాతే అక్కడ హత్యలు బాగా పెరిగాయ్'
ముంబై: 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై ఐఎఫ్ఎఫ్ఐ జ్యూరీ చీఫ్ నడవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ ఈ విషయంపై స్పందించారు. నడవ్ లాపిడ్కే మద్దతుగా నిలిచారు. ది కశ్మీర్ ఫైల్స్ దురుద్దేశంతో తీసిన సినిమా అనడంలో వాస్తవం ఉందని రౌత్ పేర్కొన్నారు. ఈ సినిమాలో కావాలనే ఒక వర్గం వారిని తప్పుగా చూపించారని చెప్పారు. దీని పబ్లిసిటీలో ఒక పార్టీ, ప్రభుత్వం ఫుల్ బిజీగా ఉన్నాయని విమర్శలు గుప్పించారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా విడుదల అయ్యాకే జమ్ముకశ్మీర్లో హత్యలు విపరీతంగా పెరిగాయని రౌత్ చెప్పుకొచ్చారు. 'కశ్మీర్ ఫైల్స్ సినిమాకు పబ్లిసిటీ చేస్తున్న వారు అప్పుడేమయ్యారు. కశ్మీరీ పండిట్ల పిల్లలు ఆందోళనలు చేసినప్పుడు వీళ్లు ఎక్కడున్నారు. వాళ్ల కోసం ఎవరూ ముందుకు రాలేదు. కశ్మీర్ పైల్స్ 2.0 తీయాలనుకుంటే అది కూడా పూర్తి చేయండి' అని రౌత్ వ్యాఖ్యానించారు. గోవా వేదికగా జరిగిన అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవ వేడుకల్లో 'ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని' ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను చూసిన జ్యూరీ హెడ్, ఇజ్రాయెల్ దర్శకుడు నడవ్ లాపిడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ది కశ్మీర్ ఫైల్స్ అసభ్యంగా ఉందని, ప్రచారం కోసమే ఈ సినిమా తీశారని విమర్శలు గుప్పించాడు. అసలు దీన్ని ఈ వేడుకలో ఎలా ప్రదర్శించారో అర్థం కావడం లేదన్నారు. ఐఎఫ్ఎఫ్ఐలో ప్రదర్శించిన 15 చిత్రాల్లో 14 బాగున్నాయని, ది కశ్మీర్ ఫైల్స్ మాత్రమే చెత్తగా ఉందన్నారు. నడవ్ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది. కశ్మీర్ పండిట్ల బాధ పట్ల ఆయనకు విచారం లేదని కొందరు విమర్శించారు. మరికొందరు మాత్రం నడవ్ వాఖ్యల్లో వాస్తవం కూడా ఉందని మద్దతుగా నిలుస్తున్నారు. చదవండి: ‘కశ్మీర్ ఫైల్స్’పై ఇఫి జ్యూరీ హెడ్ సంచలన వ్యాఖ్యలు, స్పందించిన డైరెక్టర్ -
రాహుల్ సావర్కర్ వ్యాఖ్యల వివాదం... తగ్గేదేలే! అంటున్న శివసేన
న్యూఢిల్లీ: ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన నాయకుడు సంజయ్రౌత్ హిందూత్వ సిద్ధాంతాలను విశ్వసించే తాము సావర్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపక్షేంచమని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ జోడో యాత్రలో భాగంగా సావర్కర్పై చేసిన వ్యాఖ్యల విషయంలో శివసేన నాయకుల ఇంకా ఆగ్రహంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలు విషయంలో శివసేన రాజీపడేదే లేదని కరాకండీగా చెప్పేసింది. సావర్కర్ పదేళ్లకు పైగా అండమాన్ జైలులో ఉన్నారని అందువల్ల జైలు జీవితం అనుభవించిన వారికే ఆ బాధ ఏంటో తెలుస్తుందని రౌత్ అన్నారు. ఇది కేవలం సావర్కర్ అనే కాదు అది నెహ్రు అయినా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయినా...ఎవరైనా సరే చరిత్రను వక్రీకరించడం సరికాదని తేల్చి చెప్పారు. రాహుల్గాంధీతో ఈ విషయం గురించి ఏమి చర్చించం, అలాగని ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించం అని అన్నారు. ఇకపై తమ పార్టీ కాంగ్రెస్తో పొత్తు అనేది రాజీపై నడుస్తుందని, పొత్తు ఎప్పటికీ రాజీయేనని తేల్చి చెప్పారు. ఐతే పొత్తు కోసం కాగ్రెస్తో కొనసాగుతాం, రాహుల్ గాంధీ, సోనియాలో మాట్లాడుతుంటాం. కానీ ప్రతి విషయంలో కాంగ్రెస్తో తాము ఏకాభిప్రాయంతో ఉండమన్నారు. అలాగే హిందూత్వ విషయాల్లో రాజీపడం అని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ తనని ఫోన్లో ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు వేశారని సంజయ్ రౌత్ ప్రశంసించిన ఒక రోజు తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సంజయ్ రౌత్ తనను ఒక తప్పుడూ కేసులో ఇరికించి 110 రోజుల పాటు జైలులో చింత్రహింసలకు గురిచేశారని చెప్పారు. కాగా రాహుల్గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా జైలులో ఉన్న సావర్కర్ బ్రిటీష్ వారి దయ కోసం ఎదురు చూశారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు పెను వివాదానికి తెర తీశాయ. దీంతో లెజెండరీ నాయకులు జవహార్ లాల్ నెహ్రో, మహాత్మగాంధీ, సర్దార్ పటేల్ వంటి నాయకులు కూడా బ్రిటీష్పాలనా కాలంలో జైలు పాలయ్యారని, వారిని కూడా రాహుల్ అవమానించినట్లేనని సంజయ్ రౌత్ ఆరోపణలు చేశారు. ఏదీఏమైనా రాహుల్ చేసిన వ్యాఖ్యాలు ఇరు పార్టీ వర్గాల సభ్యలను కాస్త కలవరపాటు గురి చేశాయి. (చదవండి: రాహుల్ సావర్కర్ వ్యాఖ్యలపై దుమారం.. కాంగ్రెస్తో శివసేన తెగదెంపులు?) -
రాహుల్ను ప్రశంసలతో ముంచెత్తిన సంజయ్ రౌత్.. కటీఫ్ లేనట్టే?
ముంబై: భారత్ జోడో యాత్రలో భాగంగా గతవారం వీర్ సావర్కర్పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. సావర్కర్ను అవమానించేలా మాట్లాడితే అవసరమైతే కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకుంటామని శివసేన హెచ్చరించింది. అయితే ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చినట్లు కన్పిస్తోంది. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్.. రాహుల్పై ప్రశంసల వర్షం కురిపించడం చూస్తుంటే ఇది స్ఫష్టమవుతోంది. సోమవారం ట్వీట్ చేసిన రౌత్.. రాహుల్ గాంధీ తనకు ఆదివారం ఫోన్ చేసినట్లు వెల్లడించారు. జైలు నుంచి తిరిగివచ్చిన తర్వాత ఆరోగ్యం ఎలా ఉందని, యోగ క్షేమాలు అడిగితెలుసుకున్నట్లు వివరించారు. భారత్ జోడో యాత్రలో పాల్గొంటూ తీరిక లేకుండా ఉన్నప్పటికీ రాహుల్ తనతో మాట్లాడారని రౌత్ చెప్పుకొచ్చారు. తాను జైలుకు వెళ్లినప్పుడు బీజేపీలోని తన మిత్రులు సంబరపడ్డారని విమర్శించారు. వాళ్లు మొగలుల కాలం నాటి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నప్పటికీ రాహుల్ తమతో కలిసి ముందుకు సాగాలనుకుంటున్నట్లు రౌత్ పేర్కొన్నారు. ప్రేమ, కరుణపైనే ప్రధానంగా దృష్టి సారించి ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని కొనియాడారు. రౌత్ వ్యాఖ్యలను గమనిస్తే మహావికాస్ అఘాడీకి బీటలు పడే అవకాశాలు లేనట్లే కన్పిస్తోంది. మరి మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి. pic.twitter.com/FpaxllR7jk — Sanjay Raut (@rautsanjay61) November 21, 2022 చదవండి: మెగాస్టార్పై ప్రధాని ప్రశంసల వర్షం.. తెలుగులో ట్వీట్ చేసిన మోదీ -
ఛత్రపతి శివాజీపై వ్యాఖ్యల దుమారం... ఏక్నాథ్ షిండ్పై విమర్శలు
ముంబై: ఛత్రపతి శివాజీపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అలా ఎలా చూస్తూ... కూర్చొన్నారంటూ శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మండిపడ్డారు. గవర్నర్ భగత్ సింగ్ని తక్షణమే తొలగించాలంటూ డిమాండ్ చేశారు. అసలు షిండే మహారాష్ట్ర బిడ్డేనా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండ్ని కూడా రాజీనామ చేయాలంటూ డిమాండ్ చేశారు. గవర్నర్ భగత్ సింగ్ ఈ ఏడాది వ్యవధిలో నాలుగుసార్లు ఛత్రపతి శివాజీని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారన్నారు రౌత్. అయినా మహారాష్ట్ర ప్రభుత్వ మౌనంగానే ఉందంటూ విరుచుకుపడ్డారు. ఆత్మగౌరవ నినాదం ఇచ్చి మరీ శివసేనను విచ్ఛిన్నం చేసి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన షిండేకు ప్రస్తుతం ఆ ఆత్మగౌరవం ఏమైందంటూ ఎద్దేవా చేశారు. ఇంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు కూడా శివాజీ మహారాజ్ ఔరంగజేబుకు ఐదు సార్లు క్షమాపణలు చెప్పారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలకు మహారాష్ట్రకు క్షమాపణ చెప్పడమే కాకుండా తక్షణమే గవర్నర్ని తొలగించాలి అని ఒత్తిడి చేశారు . తాము కాంగ్రెస్ నాయకుడు రాహల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా వీర సావర్కర్పై చేసిన వ్యాఖ్యలను ఖండించి తమ పార్టీ నిరసన తెలిపిందని గుర్తు చేశారు. బీజేపీ బహిరంగంగానే శివాజీ మహారాజ్ని పలుమార్లు విమర్మించిందన్నారు. కాబట్టి షిండే రాజీనామ చేయాలని, బీజేపీతో కలిసి ప్రభుత్వంలో కొనసాగకూడదంటూ సీరియస్ అయ్యారు. ఈ మేరకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఔరంగాబాద్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ.... శివాజీ మహారాజ్ పాత విగ్రహాలు అయిపోయాయని, ఇప్పుడూ మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ నితిన్ గడ్కరీ వంటి వారెందరో అందుబాటు ఉన్నారని వ్యాఖ్యానించారు. ఉద్ధవ ఠాక్రే వర్గానికి చెందిన వ్యక్తులకు గవర్నర్ చేసిన ఈ వ్యాఖ్యలు మింగుడుపడం లేదు. దీంతో గవర్నర్ గొప్ప గొప్ప వ్యక్తులను అగౌరవపరిచే వ్యక్తి అంటూ పెద్ద ఎత్తున్న విమర్శలు గుప్పించారు. రాహుల్ వీర సావర్కర్పై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ బూట్లతో దాడి చేస్తోంది. మరీ ఇప్పుడూ గవర్నర్ చేసిన పనికి రాజ్భన్పైకి చెప్పులతో వెళ్లాలంటూ మండిపడ్డారు. గవర్నర్ వ్యాఖ్యలు ప్రకారం కృష్ణుడు, రాముడు పాత్ర విగ్రహాలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడూ మనం కొత్త దేవతలను ఆరాధించాలా అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. అలాగే శివసేన పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ దూబే ఛత్రపతి శివాజీ మహారాజ్ మా ఆరాధ్యదైవం మాత్రమే కాదు, ఎప్పటికీ అందరికి ఆదర్శప్రాయుడని అన్నారు. (చదవండి: రాహుల్ సావర్కర్ వ్యాఖ్యలపై దుమారం.. కాంగ్రెస్తో శివసేన తెగదెంపులు?) -
రాహుల్ సావర్కర్ వ్యాఖ్యలపై దుమారం.. కాంగ్రెస్తో శివసేన తెగదెంపులు?
ముంబై: భారత్ జోడో యాత్రలో భాగంగా వీర్ సావర్కర్పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రాలో రాజకీయ దుమారానికి తెరలేపాయి. సావర్కర్ను అవమానిస్తే మహావికాస్ అఘాడీతో తెగదెంపులు చేసుకునేందుకైనా వెనుకాడబోమని శివసేన సీనియర్ నేత సంజయ్రౌత్ హెచ్చరించారు. ఈ విషయంపై ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతారని పేర్కొన్నారు. సావర్కర్ విషయం తమకు చాలా ముఖ్యమని, ఆయన హిందుత్వ సిద్ధాంతలను శివసేన నమ్ముతుందని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. సావర్కర్ గురించి కాంగ్రెస్ మాట్లాడవద్దని సూచించారు. ఈ విషయంలో ఉద్ధవ్ థాక్రే, సంజయ్ రౌత్లతే తుది నిర్ణయమని థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే కూడా ఇప్పటికే ప్రకటించారు. శివసేన నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కాంగ్రెస్ వాళ్ల ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నాలు మొదలుపట్టింది. రాహుల్ గాంధీ సావర్కర్ను అవమానించలేదని, చరిత్రలో జరిగిన విషయాన్ని మాత్రమే చెప్పారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తెలిపారు. ఈ విషయంపై సంజయ్ రౌత్తో కూడా మాట్లాడినట్లు పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలతో మహావికాస్ అఘాడీ(ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ కూటమి)పై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ మాట్లాడుతూ.. వీర్ సావర్కర్ బ్రిటిషర్లను క్షమాపణలు కోరిన వ్యక్తి అని అన్నారు. అండమాన్ జైలులో మూడు నాలుగేళ్లకే భయపడి బ్రిటిషర్లకు లేఖలు రాశారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతులను ఆధారంగా చూపారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఇప్పటికే తీవ్రంగా స్పందించింది. సావర్కర్ను అవమానించిన వారికి మహారాష్ట్ర ప్రజలే తగిన రీతితో బుద్ధి చెబుతారని విమర్శించింది. చదవండి: 'ఇండోర్లో అడుగుపెడితే చంపేస్తాం..' రాహుల్ గాంధీకి బెదిరింపులు -
ఫడణవీస్ 'ప్రతీకారం' వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సంజయ్ రౌత్
ముంబై: తనకు వెన్నుపోటు పొడిచిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకున్నానని మంగళవారం ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్. మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే శివసేన(ఉద్ధవ్) సీనియర్ నేత సంజయ్ రౌత్ దీనిపై స్పందించారు. ఫడణవీస్ మాటలు మహారాష్ట్ర సంస్కృతికి పూర్తి విరుద్ధమని కౌంటర్ ఇచ్చారు. కొత్త ఒరవడి, సంప్రదాయాలకు శ్రీకారం చుడుతున్న ప్రస్తుత రాజకీయాల్లో ప్రతీకారానికి తావు లేదని పేర్కొన్నారు. ఫడణవీస్ మాటలు ఆయన స్థాయిని తగ్గించేలా ఉన్నాయని చెప్పారు. రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు సహజమేనని, కానీ మహారాష్ట్రలో ఇప్పటివరకు ప్రతీకారం అనే పదాన్ని ఏ రాజకీయ నాయకుడు ఉపయోగించలేదని రౌత్ అన్నారు. ఫడణవీస్ వ్యాఖ్యలు దురదృష్టకరమని పేర్కొన్నారు. ఓ మరాఠీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు నమ్మకద్రోహం చేసిన వారిపై ప్రతీకారం తీర్చేసుకున్నానని ఫడణవీస్ అన్నారు. రాజకీయాల్లో తమ పక్కనే ఉండి, అధికారం పంచుకొని ఆ తర్వాత పదవుల కోసం వెన్నుపోటు పొడిచేవాళ్లు కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారని వ్యాఖ్యానించారు. తనకు వెన్నుపోటు పొడిచిన వాళ్లపై తాను ఇప్పటికే ప్రతీకారం తీర్చుకున్నానని స్పష్టం చేశారు. ఆయన ఉద్ధవ్ థాక్రేను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారు. థాక్రే.. కాంగ్రెస్, ఎన్సీపీతో చేతులు కలిపి తన కాలిని తానే షూట్ చేసుకున్నాడని ఫడణవీస్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో శివసేనను చీల్చి ఏక్నాథ్ షిండే బీజేపీతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దేవేంద్ర ఫడణవీస్ డిప్యూటీ సీఎం అయ్యారు. సొంత పార్టీ నేతలే తిరుగుబావుటా ఎగురవేసినా.. ఉద్ధవ్ థాక్రే ఏమీ చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఫడణవీస్ ప్రతీకారం తీర్చుకున్నానని వ్యాఖ్యానించారు. శివసేనను చీల్చి, థాక్రేను సీఎం పదవి నుంచి తప్పించి తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నానని చెప్పకనే చెప్పారు. చదవండి: కాంగ్రెస్కు మరో షాక్.. రాజస్థాన్ ఇన్ఛార్జ్ రాజీనామా -
‘షిందేజీ! ఉద్ధవ్ కోసమే సంజయ్ రౌత్ బెయిల్ సంపాదించినట్లు అనిపిస్తోంది’
‘‘సంజయ్ రౌత్ జైలు నుంచి బయటికి వచ్చాడట..’’ అన్నారు దీపక్ కేసర్కర్! ఆ మాటను ఆయన నాకు బాగా సమీపానికి వచ్చి, మెల్లిగా... నా రెండు చెవుల్లో ఒక చెవికి మాత్రమే వినిపించేలా చెప్పారు. అప్పుడా సమయంలో చంపాసింగ్ థాపా, మోరేశ్వర్ రాజే నా పక్కన ఉన్నారు. ఒకప్పుడు బాల్ ఠాక్రేజీ పక్కన ముప్పై ఏళ్ల పాటు ఉన్నవాళ్లు.. ఇప్పుడు నెలన్నరగా నా పక్కన ఉంటున్నారు. ఠాక్రేజీ జీవించి ఉండగా ఆయనకు వచ్చే ఫోన్లను థాపా, రాజేలే లిఫ్ట్ చేసేవాళ్లు. ఠాక్రేజీ చెప్పదలచుకుంది కూడా వాళ్లే ఫోన్లో అవతలి వైపునకు బట్వాడా చేసేవాళ్లు. ‘‘షిందేజీ, అదేంటంటే.. ’’ అంటూ, వాళ్లిద్దరి వైపు చూస్తూ ఆగారు దీపక్. ‘‘పర్లేదు చెప్పండి దీపక్జీ. ఠాక్రేజీ దగ్గర నమ్మకంగా ఉన్న మనుషులు ఆయన కొడుకు ఉద్ధవ్ ఠాక్రే వైపు వెళ్లకుండా మనవైపు ఉండేందుకు వచ్చారంటే.. సంజయ్ గురించే కాదు, ఉద్ధవ్ గురించి కూడా మనం నిస్సంకోచంగా మాట్లాడుకోవచ్చు..’’ అన్నాను. ‘‘షిందేజీ! సంజయ్ రౌత్ని చూస్తుంటే ఉద్ధవ్ ఠాక్రే కోసం ఏం చేయడానికైనా సిద్ధమై అతడు బెయిల్ సంపాదించినట్లుగా నాకు అనిపిస్తోంది..’’ అన్నారు దీపక్. ‘‘అతడేమీ దేశభక్తుడు కాదు కదా దీపక్జీ.. ఏం చేయడానికైనా సిద్ధమవడానికి..’’ అని నవ్వాను. ‘‘కానీ షిందేజీ, అతడి మౌనం చూస్తుంటే దేశభక్తుడే నయం అనిపించేలా ఉన్నాడు..’’ అన్నారు దీపక్! దీపక్ మునుపెన్నడూ అంత హెచ్చరికగా మాట్లాడ్డం నేను వినలేదు! నా మంత్రివర్గంలో సీనియర్ మినిస్టర్ ఆయన. నాలుగు మినిస్ట్రీలను నడిపిస్తున్నారు. నా కన్నా పదేళ్లు పెద్దవారు. ‘‘దేశభక్తుడిని సైతం జైలు జీవితం మామూలు మనిషిగా మార్చేస్తుందని విన్నాను దీపక్జీ! కానీ మీరేం చెబుతున్నారంటే.. జైలుకు వెళ్లిన సంజయ్ రౌత్ అనే ఒక మామూలు మనిషి దేశభక్తుడిగా మారి, జైలు బయటికి వచ్చేశాడని!! అదెలా సాధ్యం?’’ అని అడిగాను. ‘‘జైలు నుంచి బయటికి రాగానే సంజయ్ రౌత్ నేరుగా సెంట్రల్ ముంబైలోని సిద్ధి వినాయక టెంపుల్కి వెళ్లాడు షిందేజీ! ఆ తర్వాత అతడు సౌత్ ముంబైలోని హనుమాన్ టెంపుల్కి వెళ్లాడు. తర్వాత శివాజీ పార్క్లోని బాల్ ఠాక్రే మెమోరియల్కి వెళ్లాడు. ఆ తర్వాతే ఇంటికి వెళ్లాడు! సాయంత్రం 6.50 కి ఆర్థర్ రోడ్ జైలు నుంచి అతడు విడుదలైతే.. నాహుర్లోని తన ఇంటికి వెళ్లేసరికి రాత్రి 10.20 అయింది. ఈ మూడున్నర గంటల వ్యవధిలో అతడు మాట్లాడిన సమయం తక్కువ. మౌనంగా ఉన్న సమయం ఎక్కువ. అదే నాకు ఆందోళన కలిగిస్తోంది షిందేజీ.. ’’ అన్నారు దీపక్. ‘‘ఆందోళన దేనికి దీపక్జీ?!’’ అన్నాను. ‘‘దేనికంటే.. అతడు మాట్లాడిన ఆ తక్కువ సమయంలోనే ఉద్ధవ్తో చాలా ఎక్కువ మాట్లాడాడు. మౌనంగా ఉన్న ఆ ఎక్కువ సమయంలోనే మన గురించి చాలా తక్కువగా మౌనం వహించాడు..’’ అన్నారు దీపక్. ‘‘అర్థం కాలేదు దీపక్జీ..’’ అన్నాను. ‘‘మూడు నెలలు జైల్లో ఉండి వచ్చాక కూడా ఉద్ధవ్దే రియల్ శివసేన అని అతడు అంటున్నాడు షిందేజీ! అంటే మనది రియల్ శివసేన కాదనీ, మీరూ రియల్ ముఖ్యమంత్రి కాదనే కదా అతడి ఉద్దేశం!’’ అన్నారు దీపక్! చంపాసింగ్ థాపా, మోరేశ్వర్ రాజే మాకు కాస్త దూరంగా నిలబడి ఉన్నారు. నవంబర్ 17న ఠాక్రేజీ 10వ వర్ధంతి. ఆ సంస్మరణ సభలో వాళ్లిద్దరి చేత మాట్లాడిస్తే?!వాళ్లే చెబుతారు.. రియల్ శివసేన ఎవరిది కాదో, రియల్ సీఎం ఎవరు కారో?! దీపక్ నా వైపే చూస్తూ ఉన్నారు. ‘‘దీపక్జీ! అసలైన దాన్ని ఎవరూ మార్చలేరు. సంజయ్ రౌత్ అనే ఒక దేశభక్త ఎంపీ మార్చగలడా?’’ అన్నాను నవ్వుతూ. -
ఫడ్నవీస్పై సంజయ్ రౌత్ ప్రశంసల వర్షం.. జైలు నుంచి వచ్చిన మరునాడే..
ముంబై: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాత్రాచల్ కుంభకోణం కేసులో అరెస్టై విడుదలైన మరుసటి రోజే మహారాష్ట్ర ప్రభుత్వం, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్పై ప్రశంసలు కురిపించారు. మహారాష్ట్రలోని కొత్త ప్రభుత్వం కొన్ని మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటోందని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన పనులను వ్యతిరేకించాలి కాబట్టి తాము వ్యతిరేకించమని.. అలా ఎప్పుడూ చేయలేదని తెలిపారు. ‘రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నడుపుతున్నారని నేను భావిస్తున్నాను. ఫడ్నవిస్ కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారు. నేను జైలులో వీలైనప్పుడల్లా న్యూస్పేపర్ చదివాను. పేదలకు గృహనిర్మాణం వంటి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని నేను స్వాగతిస్తాను’ అంటూ కొనియాడారు. కాగా మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టిన శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేతో కలిసి బీజేపీ గత జూన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను కలిసే ముందు గురువారం తన ఇంటి వద్ద సంజయ్ రౌత్ పలు విషయాలపై మీడియాతో మాట్లాడారు. ‘మూడు నెలల్లో ప్రజలు నన్ను మర్చిపోతారని అనుకున్నాను. కానీ విడుదలైనప్పటి నుంచి నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే నాతో క్రమం తప్పకుండా టచ్లో డేవారు. శరద్ పవార్ కూడా నాతో ఫోన్లో మాట్లాడారు. ప్రజలకు సంబంధించిన కొన్ని పనుల కోసం ఫడ్నవీస్ను కలవనున్నాను. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా కలవబోతున్నాను. వారిని కలిసి నాకు జరుగుతున్న పరిణామాల గురించి వివరించాలి. రాష్ట్రంలో రాజకీయ దుమారం తగ్గించాలంటూ ఫడ్నవీస్ చెప్పిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాను’ అని తెలిపారు. అదే విధంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను సైతం కలుస్తానని సంజయ్ రౌత్ చెప్పారు. చదవండి: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ తన అరెస్ట్ చట్టవిరుద్దమంటూ కోర్టు ఇచ్చిన తీర్పుపై సంజయ్ రౌత్ మాట్లాడారు.. ఎవరి పేరు ప్రస్తావించకుండా తన అరెస్ట్ వెనక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. నేను జైలులో ఉండగా నా కుటుంబం ఎన్నో కష్టాలు పడింది. జైలులో నా ఆరోగ్యం దెబ్బతింది. జైలు జీవితం అంత సులువేమీ కాదు. అక్కడ ఎత్తయిన గోడలు ఉంటాయి. వాటితోనే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి హిందూత్వ దిగ్గజం సావర్కర్ పదేళ్ళపాటు జైలు జీవితం గడిపారు. బాలగంగాధర్ తిలక్, అటల్ బిహారీ వాజ్పాయి వంటి నాయకులు జైలులో గడిపారు. వీరంతా ఎలా గడిపారోనని తరచూ అనుకునేవాడిని. కానీ రాజకీయాల్లో ఎవరున్నా ఏదో ఒక సమయంలో జైలుకు వెళ్లాల్సిందేనని నాకు నేనే చెప్పుకున్నాను. నేను వ్యవస్థను తప్పుపట్టడం లేదు. కోర్టు తీర్పు, ఈడీపై ఎలాంటి కామెంట్ చేయను. నా మౌనం వారికి సంతోషాన్ని కలిగిస్తే.. సంతోషపడనివ్వండి. నా మనసులో ఎవరిపై పగ లేదు. ఏ కేంద్ర దర్యాప్తు సంస్థను నిందించడం లేదు.’ అని వ్యాఖ్యానించారు. కాగా పాత్రాచల్ రీడెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఈడీ గత ఆగస్టు నెలలో సంజయ్ రౌత్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తొలుత ఈడీ ఆయనను కస్టడీలోకి తీసుకోగా తర్వాత కోర్టు జ్యూడీషియల్ కస్టడీకి అప్పగించింది. దాదాపు మూడు నెలలు జైల్లో గడిపారు. ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి సంజయ్ రౌత్ బుధవారం విడుదలయ్యారు. అయితే జైలు నుంచి విడుదలైన మరునాడే సంజయ్ బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: లాలూ కుమార్తె గొప్ప మనసు.. తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు.. -
రౌత్ అరెస్ట్ చట్టవ్యతిరేకం
ముంబై: ముంబైలోని గోరేగావ్లో పాత్రా ఛావల్(సిద్దార్థ్ నగర్) పునర్నిర్మాణాభివృద్ధి ప్రాజెక్టులో మనీ లాండరింగ్ అభియోగాలపై అరెస్టయి కారాగారంలో గడుపుతున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. కేసు వాదనల సందర్భంగా ముంబైలోని ప్రత్యేక కోర్టు జడ్జి ఎంజీ దేశ్పాండే.. కేసును దర్యాప్తుచేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ‘ ఈడీ ముందు హాజరయ్యేందుకు రౌత్ సమయం కావాలన్నారు. అంతలోపే అరెస్ట్చేయడం చట్టవ్యతిరేకం. ప్రధాన నిందితులైన హౌజింగ్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్టక్చర్(హెచ్డీఐఎల్)కు చెందిన రాకేశ్ వధవాన్, సారంగ్ వధవాన్లను ఇంతవరకు ఎందుకు అరెస్ట్చేయలేదు? మహారాష్ట్ర హౌజింగ్, ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(ఎంహెచ్ఏడీఏ) అధికారులను ఎందుకు అరెస్ట్చేయలేదో కారణం చెప్పలేదు. కేసులో మరో నిందితుడు ప్రవీణ్ రౌత్ను ఈ కేసుతో సంబంధం లేకుండా సివిల్ వివాదంలో అరెస్ట్చేశారు. సంజయ్ రౌత్ను ఎలాంటి కారణం లేకుండా అరెస్ట్చేశారు’ అని జడ్జి వ్యాఖ్యానించారు. తర్వాత సంజయ్, ప్రవీణ్లకు బెయిల్ మంజూరుచేస్తూ ఉత్తర్వులిచ్చారు. దీంతో బుధవారం రాత్రి సంజయ్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి విడుదలయ్యారు. కోర్టు ఉత్తర్వులను బాంబే హైకోర్టులో సవాల్ చేయాలని ఈడీ భావిస్తోంది. -
శివసేన సంజయ్ రౌత్కు బెయిల్ మంజూరు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు బెయిట్ మంజూరైంది. పీఎంఎల్ఏ కోర్టు సంజయ్ రౌత్కు బెయిల్ ఇచ్చింది. కాగా, సంజయ్ రౌత్.. భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంజయ్ రౌత్ 100 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. జూలై 31వ తేదీన సంజయ్ రౌత్ను ఈడీ అరెస్ట్ చేసింది. -
‘అమ్మా.. తప్పకుండా తిరిగొస్తాను’ తల్లికి సంజయ్ రౌత్ భావోద్వేగ లేఖ
సాక్షి, ముంబై: పత్రాచల్ భూకుంభకోణంలో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న శివసేన ఫైర్బ్రాండ్, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ తన తల్లికి భావోద్వేగ లేఖ రాశారు. తను ఖచ్చితంగా తిరిగి వస్తానని, అప్పటి వరకు ఉద్దవ్ ఠాక్రే, శివ సైనికులు నిన్ను(తల్లి) జాగ్రత్తగా చూసుకుంటారని హామీ ఇచ్చారు. శివసేనకు ద్రోహం చేసేలా ఒత్తిడి తీసుకొచ్చారని, వాళ్ల ఒత్తిళ్లకు లొంగకపోవడం వల్లే నేడు తల్లికి దూరంగా ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు ఈ లేఖను సంజయ రౌత్ తన ట్విటర్లో బుధవారం పోస్టు చేశారు. ‘నీలాగే(తల్లి) శివసేన కూడా నాకు అమ్మతో సమానం. నా తల్లికి(శివసేన) ద్రోహం చేసేలా ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని బెదిరించారు. వారి బెదిరింపులకు లొంగకపోవడం వల్ల జైలుకు వెళ్లాల్సి వస్తోంది. ఈ కారణం వల్లే ఈరోజు నేను నీకు దూరంగా ఉన్నాను. దేశం కోసం సరిహద్దుల్లో నిలబడి పోరాడుతున్న వేలాది మంది సైనికులు నెలల తరబడి ఇంటికి రారు. కొందరు ఇంటికి ఎప్పటికీ వెళ్లరు. నేను కూడా మహారాష్ట్ర, శివసేన శత్రువులకు తలవంచలేను. మహారాష్ట్ర, దేశ విధేయుడిని అంత తేలిగ్గా చంపలేరు. చదవండి: తండ్రి చితికి నిప్పుపెట్టిన మరునాడే అఖిలేశ్ ఎమోషనల్ పోస్ట్ రాజకీయ ప్రత్యర్థుల ముందు తలవంచబోను. ఈ ఆత్మగౌరవాన్ని నేను మీ నుంచే నేర్చుకున్నా. శివసేన, బాలాసాహెబ్ పట్ల నిజాయితీగా ఉండాలని మీరు కునా నేర్పించారు. శివసేన గడ్డు పరిస్థితుల్లో ఉంటే బాలాసాహెబ్ ఏమి చేస్తారో అది చేయాలని నేర్పించారు.’ అని లేఖలో పేర్కొన్నారు. అలాగే ఆగస్టు 8న రాసిన లేఖలో ఈడీ కస్టడీ ఇప్పుడే ముగిసిందని, జ్యుడీషియల్ కస్టడీలోకి వెళ్లే ముందు సెషన్స్ కోర్టు ప్రాంగణంలో కూర్చొని ఈ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. తల్లికి లేఖ రాసి చాలా ఏళ్లు అవుతోందని, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ లేఖ రాసేందుకు అవకాశం దక్కిందని పేర్కొన్నారు. प्रिय आई, जय महाराष्ट्र, .....तुझा संजय (बंधू) pic.twitter.com/EXAtkcyRLi — Sanjay Raut (@rautsanjay61) October 12, 2022 కాగా పత్రాచల్ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో అవకతవకల ఆరోపణలతో (మానీలాండరింగ్ కేసు) ఆగస్టు 1న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఈడీ కస్టడీ ముగియడంతో ఆగస్టు 8న ఆయన్ను జ్యూడీషియల్ కస్టడీగి అప్పగించారు అప్పటి నుంచి ఆయన జ్యూడీషియల్ కస్టడీని పొడిగిస్తూనే ఉన్నారు. కాగా ఈనెల 10న సంజయ్ రౌత్ కస్టడీని అక్టోబర్ 17 వరకు కోర్టు పొడిగిస్తూ తీర్పునిచ్చింది. అలాగే ఈ కేసులో ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఆయన భార్య, సన్నిహతుల ప్రమేయం ఉందని ఈడీ ఆరోపిస్తోంది. సంజయ్ రౌత్ భార్యను కూడా ఈడీ ప్రశ్నించింది. చదవండి: విషాదం.. ఉన్నట్టుండి స్టేజ్పై కుప్పకూలిన శివుడి వేషధారి.. -
సంజయ్ రౌత్ కస్టడీ 5 వరకు పొడిగింపు
ముంబై: శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్(60) జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక కోర్టు వచ్చే నెల 5 వరకు పొడిగించింది. ముంబై చౌల్ అభివృద్ధి పనుల్లో అవకతవకలపై నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈనెల ఒకటిన ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన జ్యుడీషియల్ కస్టడీ సోమవారంతో ముగియడంతో ప్రత్యేక జడ్జి ఎంజీ దేశ్పాండే ఎదుట హాజరుపరిచారు. కేసు దర్యాప్తులో ఉన్నందున కస్టడీని పొడిగించాలని ఈడీ విజ్ఞప్తి చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న జడ్జి సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఆయన కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారు. -
జ్యుడీషియల్ కస్టడీకి సంజయ్ రౌత్.. ఆ వినతికి కోర్టు నో!
ముంబై: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది ముంబైలోని ప్రత్యేక కోర్టు. ముంబైలోని పత్రచల్ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రౌత్. ఈడీ కస్టడీ ముగియడంతో సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది న్యాయస్థానం. దీంతో ఆయన జైలులో గడపనున్నారు. తనకు ఇంటి నుంచే ఆహారం, ఔషధాలు తీసుకురావాలని సంజయ్ రౌత్ కోరగా.. అందుకు అంగీకరించింది కోర్టు. కానీ, ప్రత్యేక పడక ఏర్పాటును తిరస్కరించింది. పత్రచల్ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో అవకతవకల ఆరోపణలతో ఆగస్టు 1వ తేదీన సంజయ్ రౌత్ను అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సోమవారంతో ఈడీ కస్టడీ ముగియటంతో ప్రత్యేక పీఎంఎల్ఏ జడ్జీ ఎంజీ దేశ్పాండే ముందు హాజరుపరిచింది. అయితే.. తమ కస్టడీని పొడిగించాలని ఈడీ కొరలేదు. దీంతో జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని ఆదేశించింది కోర్టు. ఇదీ చదవండి: ఎస్పీ నేత కారును ఢీకొట్టి.. 500 మీటర్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు డ్రైవర్.. వీడియో వైరల్ -
సంజయ్ రౌత్ భార్యకు ఈడీ సమన్లు
ముంబై: మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ను ఇటీవలే అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. తాజాగా ఆయన కస్టడీని పొడింగించింది ముంబై ప్రత్యేక కోర్టు. సోమవారం వరకు ఈడీ అధీనంలోనే విచారణ ఎదుర్కోనున్నారు రౌత్. కస్టడీ పొడిగించిన క్రమంలో.. ఈ కేసు దర్యాప్తులో ఈడీ పురోగతి సాధించినట్లు ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం పేర్కొంది. ముంబైలోని ఛాల్ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని గత ఆదివారం సంజయ్ రౌత్ను సుమారు ఆరు గంటల పాటు విచారించింది ఈడీ. అనంతరం అర్ధరాత్రి అరెస్ట్ చేసింది. అలాగే.. ఆయన భార్య, ఇతరులకు ప్రమేయం ఉన్న ట్రాన్సాక్షన్స్లను సైతం పరిగణనలోకి తీసుకుంది. ఆ తర్వాత సోమవారం కోర్టులో ప్రవేశపెట్టగా ఆగస్టు 4 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. దీంతో గురువారం పీఎంఎల్ఏ కోర్టు జడ్జి ఎంజీ దేశ్పాండే ముందు రౌత్ను హాజరుపరిచింది ఈడీ. లోతైన విచారణ జరిపేందుకు కస్టడీ పొడగించాలని కోరింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి రౌత్ కస్టడీని ఆగస్టు 8 వరకు పొడిగించారు. హౌసింగ్ పునర్నిర్మాణ ప్రాజెక్ట్లో రౌత్, ఆయన కుటుంబం సుమారు రూ.కోటి వరకు అవకతవకలకు పాల్పడినట్లు గతంలో పేర్కొంది ఈడీ. అయితే.. ఈ వాదనలు తోసిపుచ్చారు రౌత్. సంజయ్ రౌత్ భార్యకు ఈడీ సమన్లు.. పార్థ ఛాల్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్కు గురువారం సమన్లు జారీ చేసింది ఈడీ. ఈ కేసులో రౌత్ కస్టడీ పొడిగించిన కొన్ని గంటల్లోనే సమన్లు జారీ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. వర్ష రౌత్ ఖాతాల ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిపినట్లు బయటకి రావటంతో ఈ సమన్లు జారీ చేసినట్లు ఈడీ పేర్కొంది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి వర్ష రౌత్ ఖాతాలోకి సుమారు రూ.1.08 కోట్లు నగదు వచ్చినట్లు పేర్కొంది. ఇదీ చదవండి: సంజయ్ రౌత్ అరెస్ట్.. ఈడీ తరువాత టార్గెట్ ఎవరో? -
సంజయ్ రౌత్ అరెస్ట్.. ఈడీ తరువాత టార్గెట్ ఎవరో?
సాక్షి ముంబై: శివసేన ఫైర్ బ్రాండ్ ఎంపీ సంజయ్ రౌత్ను ఈడీ అరెస్టు తర్వాత తరువాత టార్గెట్ ఎవరనే విషయంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చలకు ఊతం వచ్చింది. ముఖ్యంగా సంజయ్ రౌత్ను ఈడీ అరెస్టు చేయడంతో ఒకరకంగా శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రేకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఓవైపు ఇప్పటికే ఏక్నాథ్ శిండే తిరుగుబాటుతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడటం ఉద్దవ్ ఠాక్రేకు చిక్కులను తెచ్చిపెట్టింది. మరోవైపు రోజురోజుకీ శిండే వర్గానికి పెరుగుతున్న మద్దతు, ఉద్దవ్ ఠాక్రే మద్దతుగా ఉన్న శివసేన నాయకులపై ఈడీ దర్యాప్తులు ఉద్దవ్ ఠాక్రేకు తలనొప్పిగా మారాయి. పార్టీని, పార్టీ ప్రతిష్టను కాపాడుకునేందుకు ఎన్నడూలేని విధంగా ఉద్దవ్ ఠాక్రేతోపాటు ఆదిత్య ఠాక్రే పలు ప్రాంతాల్లో పర్యటించి శివసేన పదాధికారులలో నూతన ఉత్తేజాన్ని నింపుతూ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో సంజయ్ రావుత్ అరెస్టు కొంతమేర శివసేన కార్యకర్తలలో ఒకరకమైన ఆందోళనను రేకేత్తించేలా చేసిందని చెబుతున్నారు. అరెస్టు అయిన సంజయ్ రౌత్ తాను ఎలాంటి బెదిరింపులకు లొంగనని, తాను పార్టీ వీడనని ప్రకటించడం, దీనికి తీడు అన్ని రోజులు ఒకేలాగా ఉండవంటూ ఉద్దవ్ ఠాక్రే మాట్లాడటం శివసేన కార్యకర్తలలో ఒకరకమైన ఉత్తేజాన్ని నింపేలా చేస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలో సంజయ్ రౌత్ తర్వాత ఈడీ టార్గెట్ ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడైన శివసేన నాయకుడు అనిల్ పరబ్ పేరు వినిపిస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే బీజేపీ నాయకులు కిరీట్ సోమయ్య పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. కేసుల భయంతోనే శిండే గూటికి.. మరోవైపు శిండే వర్గంలో చేరిన శివసేన తిరుగుబాటు నాయకులు కూడా కావచ్చని చెబుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో శిండే వర్గంలో చేరిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై కూడా ఈడీ దర్యాప్తులు జరిపి చర్యలు తీసుకుంటుందా అనే విషయంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఏక్నాథ్ శిండే తిరుగుబాటుకు మందు ఆయన వర్గంలో చేరిన కొందరిపై ఈడీ దర్యాప్తులు చేసింది. వీరిలో ప్రతాప్ సర్నాయిక్, అర్జున ఖోత్కర్, యవ్వంత్ జాదవ్, భావనా గావ్లీ తదితరులున్నారు. వీరిని కూడా గతంలో ఈడీ విచారించింది. ముఖ్యంగా ప్రతాప్ సర్నాయక్కు చెందిన రూ. 11.35 కోట్లు విలువైన ఆస్తులను జప్తీ చేయగా యశ్వంత్ జాధవ్కు సంబంధించిన 40 ప్రాపర్టీలు జప్తీ చేశారు. వీటిలో ముంబై బైకలాలోని 26 ఫ్లాట్లున్నాయి. ఇలాంటి నేపథ్యంలో గతంలో ఈడీ రాడార్పై ఉన్న నాయకులుగా ఉన్న వారిపై మళ్లీ చర్యలు ఉంటాయా లేదా క్లీన్ చీట్ ఇచ్చారా అనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఔరంగాబాదులో ఎన్సీపీ యూత్ కార్యదర్శి అక్షయ్ పాటిల్ ఏర్పాటు చేసి బ్యానర్ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బీజేపీ, బీజేపీలో చేరిన వారిపై కూడా ఈడీ, సీబీఐ చర్యలు కొనసాగుతాయా.? కొనసాగుతున్నాయని తెలిస్తే సమాచారం అందించి రూ. ఒక లక్ష బహుమతిని అందుకోవాలని బ్యానర్ ద్వారా ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర అంశంగా మారింది. -
రౌత్ అరెస్ట్: థాక్రే నోట పుష్ప డైలాగ్ ప్రస్తావన
సాక్షి, ముంబై: ప్రతీకార రాజకీయాలతో శివ సేనను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే సంజయ్ రౌత్పై ఈడీ అస్త్రాన్ని ప్రయోగించారని శివ సేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే.. తీవ్ర స్థాయిలో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. ‘మాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్లను తుడిచిపెట్టేస్తాం’ అనే ధోరణితో దర్యాప్తు ఏజెన్సీల ద్వారా ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారు. సంజయ్ రౌత్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. అయినా ఏ దశలోనూ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. పుష్ప అనే సినిమాలో ఓ పాపులర్ డైలాగ్ ఉంది. ఝుకేగా నహీ(తగ్గేదే లే) అని. అది రౌత్కు అన్నివిధాల సరిపోతుంది. నిజమైన శివసైనికుడిగా ఆయన వ్యవహరించారు. కొందరిలా ఆయన ఈడీ బూచికి భయపడలేదు. పిరికిపందలా వెన్నుచూపలేదు. ఎక్కడా తగ్గలేదు. బాలా సాహెబ్ చూపిన మార్గం ఇదే. రౌత్ నిజమైన శివ సైనికుడు అంటూ ఉద్ధవ్ థాక్రే ప్రశంసలు గుప్పించారు. సోమవారం మధ్యాహ్నాం రౌత్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన అనంతరం.. ఉద్దవ్ థాక్రే పైవ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రౌత్కుటుంబ సభ్యులు సైతం బీజేపీపై మండిపడ్డారు. బీజేపీపై సంజయ్ రౌత్ సహేతుక విమర్శలతో విరుచుకుపడుతున్నారని, అందుకే భయపడే ఈడీని ఆయనపై ప్రయోగించిందని బీజేపీపై సంజయ్ రౌత్ కుటుంబం ధ్వజమెత్తింది. ఇదిలా ఉంటే.. పత్రా చాల్ భూకుంభకోణానికి సంబంధించి ఆదివారం సంజయ్ రౌత్ ఇంటిపై ఈడీ సోదాలు నిర్వహించింది. ఆరేడు గంటలపాటు ఆయన్ని పశ్నించి.. చివరికి అర్ధరాత్రి హైడ్రామా నడుమ అరెస్ట్ చేసింది. సోమవారం మనీల్యాండరింగ్ ఆరోపణలపై అరెస్టైన సంజయ్ రౌత్ను.. నాలుగు రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగించింది ముంబై కోర్టు. -
Patra Chawl Scam: ఈడీ కస్టడీకి సంజయ్ రౌత్
సాక్షి, ముంబై: శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ను ఈడీ కస్టడీకి అనుమతించింది ముంబై స్పెషల్ కోర్టు. ఆగష్టు 4వ తేదీవరకు ఆయన్ని కస్టడీకి అనుమతిస్తూ సోమవారం సాయంత్రం ఆదేశాలు ఇచ్చింది. పత్రా చాల్ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలతో ఆయన్ని దర్యాప్తు విభాగం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. సోమవారం వైద్య పరీక్షల అనంతరం ముంబై పీఎంఎల్ఏ కోర్టులో ఆయన్ని ప్రవేశపెట్టింది. నాలుగుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ.. ఏజెన్సీ ముందు ఆయన ఒక్కసారే హాజరయ్యాడని, ఈ గ్యాప్లో ఆయన ఆధారాలను ట్యాంపర్ చేసే ప్రయత్నం చేశాడని, కీలక సాక్షిని ప్రభావితం చేయాలని చూశారని ఈడీ కోర్టులో వాదించింది. ఈ మేరకు 8 రోజులపాటు కస్టడీకి అనుమతించాలని కోరింది. మరోవైపు సంజయ్ రౌత్ తరపు న్యాయవాది అశోక్ ముండార్గి ఈ అరెస్ట్ను.. రాజకీయ కుట్రగా న్యాయస్థానానికి నివేదించారు. రాజకీయ కోణంలో ఈ అరెస్ట్జరిగిందని, ఆయనకు గుండె సమస్య ఉందని, ఈ మేరకు సర్జరీ కూడా జరిగిందని చెబుతూ.. కోర్టుకు పత్రాలు సమర్పించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. చివరికి సంజయ్ రౌత్కు ఆగష్టు 4వ తేదీ వరకు రిమాండ్కు అనుమతించింది. నాలుగు రోజుల కస్టడీతో పాటు ఇంటి భోజనానికి ఆయన్ని అనుమతించాలని ఈడీని ఆదేశించింది కోర్టు. చదవండి: సంజయ్ రౌత్ను ఎప్పుడో అరెస్టు చేయాల్సింది- నవనీత్కౌర్ -
Sanjay Raut: ఈడీ అరెస్ట్ మెమోలో ఏముందంటే..
ముంబై: శివ సేన ఎంపీ, ఆ పార్టీ కీలక నేత సంజయ్ రౌత్ను మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. ఈ వ్యవహారంపై మహా రాజకీయాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగానూ చర్చ నడుస్తోంది. రౌత్కు గుండె సంబంధిత సమస్యలు ఉండడంతో వైద్య పరీక్షల అనంతరం చివరికి సోమవారం మధ్యాహ్నాం రిమాండ్ కోరుతూ స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టింది ఈడీ. అయితే ఆయన అరెస్టుకు సంబంధించిన కీలక విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. పలు జాతీయ మీడియా చానెల్స్ ఆయన అరెస్ట్ మెమో కాపీ వివరాలను సేకరించాయి. వాటిలో ఏముందంటే.. సంజయ్ రౌత్ ‘పాత్రా చావల్’ వెయ్యి కోట్ల రూపాయల భూకుంభ కోణంలో భాగం అయ్యారని, ఆయన మనీలాండరింగ్కు పాల్పడినట్లు తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నట్లు అరెస్ట్ మెమోలో స్పష్టం చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. భార్య వర్ష రౌత్ ఆస్తులకు సంబంధించిన వివరాలతో పాటు వ్యాపారవేత్త ప్రవీణ్ రౌత్, స్వప్న పాట్కర్(ప్రవీణ్ రౌత్ భార్య)లతో సంబంధాలు, వ్యాపార లావాదేవీల గురించి సంజయ్ రౌత్పై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘నా వద్ద ఉన్న మెటీరియల్ ఆధారంగా.. ప్రివెన్షన్ ఆఫ్ మనీల్యాండరింగ్ యాక్ట్ నిబంధనల ప్రకారం శిక్షార్హమైన నేరానికి సంజయ్ రాజారామ్ రౌత్ పాల్పడినట్లు నమ్ముతున్నాం. అందుకే ఆయన్ని అరెస్ట్ చేశాం’’ అని దర్యాప్తు అధికారి పేర్కొన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ సెక్షన్ 19 సబ్ సెక్షన్ (1) ప్రకారం ఆయన్ని అరెస్ట్ చేసినట్లు అరెస్ట్ మెమోలో పేర్కొనబడింది. అంతేకాదు రౌత్ను అరెస్ట్ చేసే ముందు.. కారణాలను సైతం అధికారులు ఆయనకి వివరించారు. సంజయ్ రౌత్ విచారణ సమయంలో సహకరించలేదు. అలాగే.. లావాదేవీ వివరాల ఆధారంగా మనీల్యాండరింగ్తో లాభపడింది సంజయ్ రౌత్ అని, తద్వారా ఆయన ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించుకున్నాయి. అంతేకాదు.. సంజయ్ రౌత్, ఈ వ్యవహారంలో ప్రథమ నేరస్తుడిగా ఉన్న ప్రవీణ్ రౌత్కు సహకరించారు. ఇలా మూడు కారణాలతో ఆయన్ని అరెస్ట్ చేసినట్లు అరెస్ట్ మెమో వివరించింది. ఇక ఆదివారం సంజయ్ రౌత్ ఇంట్లో జరిగిన సోదాల్లో రూ.11.50 లక్షల లెక్కల్లోలేని సొమ్మును సీజ్ చేసింది. ఆపై ఆరుగంటలకు పైగా ఆయన్ని ప్రశ్నించి.. ఆపైనే అరెస్ట్చేసి ఈడీ కార్యాలయానికి తరలించింది. ఈడీ కార్యాలయానికి తన కారులోనే వెళ్లిన సంజయ్ రౌత్.. అంతుకు ముంద తన తల్లిని హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉండడంతో వైద్య పరీక్షలు నిర్వహించి.. అనంతరం పీఎంఎల్ఏ కోర్టులో ప్రవేశపెట్టింది ఈడీ. గతంలో.. ముంబైలోని ‘పాత్రా చావల్’ఏరియాలో పునరాభివృద్ధి ప్రాజెక్టులో అవకతవకలతో జరిగిన భూ కుంభకోణం విలువ రూ. 1,034 కోట్లుగా అంచనాకు వచ్చింది ఈడీ. గతంలో ఆరోపణల మేరకు దర్యాప్తు జరుగుతుండగా.. సంజయ్ రౌత్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.11.15 కోట్లకు పైగా విలువైన ఆస్తుల్ని అటాచ్ చేసింది. ఆపై ఈడీ ఎదుట విచారణకు సైతం హాజరయ్యారు సంజయ్ రౌత్. -
సంజయ్ రౌత్ను ఎప్పుడో అరెస్టు చేయాల్సింది: నవనీత్ రాణా
సాక్షి ముంబై: ఈడీ దాడులకి భయపడి మాతో చేరాలనుకునేవారు మా వద్దకి రావద్దని, మాతో చేరవద్దని ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే పేర్కొన్నారు. బీజేపీలో కూడా చేరవద్దన్నారు. సంజయ్ రౌత్ నివాసంపై ఈడీ దాడుల అనంతరం.. తనను శివసేన నుంచి దూరం చేసేందుకే కేంద్రం ఈడీతో దాడులు చేయిస్తోందని.. ఎవరెంత బెదిరించినా తాను శివసేనను వీడనని సంజయ్ రౌత్ తన ట్విట్టర్లో పేర్కొనడంపై శిండే స్పందించారు. శనివారం అజిత్ ఖోత్కర్ శిండే వర్గంలో చేరే సమయంలో తన కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని శిండే వర్గానికి మద్దతు ఇవ్వాల్సి వస్తుందన్నారు. ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకుని ఏక్నాథ్ శిండే మాట్లాడారు. ముఖ్యంగా ఈడీకి భయపడి ఎవరు మా వద్దకి రావద్దన్నారు. మీరు తప్పుచేయకుంటే ఈడీకి ఎందుకు భయపడుతున్నారని ఆయన నిలదీశారు. తప్పులేనప్పుడు ఈడీకి సహకరించాలని, ఈడీ తనపని తాను చేసుకుంటుందన్నారు. సంబంధిత వార్త: శివసేన ముఖ్యనేత సంజయ్ రౌత్ అరెస్టు లెక్కలు చూపించాల్సిందే: కిరీట్ సోమయ్య సంజయ్ రౌత్ నివాసంపై ఈడీ దాడుల అనంతరం ‘ఇక లెక్కలు చూపించాల్సిందే’ అంటూ బీజేపీ నేత కిరీట్ సోమయ్య తనదైన శైలిలో రావుత్కు చురకలంటించారు. మాఫియా సంజయ్ రౌత్ అంటూ సంభోదిస్తూ, ఆయనకు ఇక లెక్కలు చూపించాల్సి రానుందన్నారు. రూ. 1,200 కోట్ల పత్రాచాల్ కుంభకోణం, వసాయి నాయిగావ్లోని బిల్డర్ల కుంభకోణం లేదా మహారాష్ట్రను దోచుకునే పనిచేసిన మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం ఇలా మాఫియాగిరి, దాదాగిరి చేస్తూ అందరినీ జైల్లో వేస్తానని బెదిరింపులు చేశారు. కానీ ఇప్పుడు వారికి ఈ విషయాలన్నింటిపై లెక్కలు చూపించాల్సిన సమయం వచ్చిందని కిరీట్ సోమయ్య పేర్కొన్నారు. ఎన్నడో అరెస్టు చేయాల్సింది: నవనీత్ రాణా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ నివాసంపై ఈడీ దాడుల అనంతరం ఎంపీ నవనీత్ రాణా తనదైన శైలిలో స్పందించారు. ముఖ్యంగా ఈ చర్య ఎప్పుడో తీసుకోవాల్సింది అని అన్నారు. విలేకరిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సంజయ్ రౌత్ వద్ద ఇంతపెద్ద మొత్తంలో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటూ సవాల్ విసిరారు. అదేవిధంగా సంజయ్ రౌత్, ఉద్దవ్ ఠాక్రేలు తమ పదవుల దుర్వినియోగం చేశారని ఆరోపించారు. సంజయ్ రౌత్ గతంలోనే అరెస్టు చేసి ఉండాల్సిందన్నారు. చదవండి: గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు..స్పందించిన దేవేంద్ర ఫడ్నవీస్ రౌత్కు ఇప్పుడు తెలిసొస్తుంది: నితేష్ రాణే అందరి ఉదయం పాడుచేసే సంజయ్ రౌత్కు ఇప్పుడు ఆయన ఉదయం పాడవడం తనకు సంతృప్తిగా ఉందని నారాయణ రాణే కుమారుడైన బీజేపీ నాయకుడు నితేష్ రాణే పేర్కొన్నారు. ముఖ్యంగా సంజయ్ రౌత్కు నాకు ఎప్పుడు ఏమి జరగదని భావించేవారు. కాని ఈడీ దర్యాప్తు, ఇతరులను ఇబ్బందులు పెట్టడం అంటే ఏమిటో ఇప్పుడు సంజయ్ రౌత్కు తెలిసివస్తుందంటూ నితేష్ రాణే మండిపడ్డారు. దేశంలోని ఎవరిపైనైనా దర్యాప్తు చేయవచ్చు: అజిత్ పవార్ సంజయ్ రౌత్ నివాసంపై ఈడీ దాడుల అనంతరం ఎన్సీపీ నాయకుడైన ప్రతిపక్ష నేత అజిత్ పవార్ సౌమ్యంగా స్పందించారు. బీడ్ పర్యటనపై ఉన్న ఆయన ఈ విషయంపై మాట్లాడుతూ, ఈడీకి దేశంలోని ఎవరినైన దర్యాప్తు చేసే అధికారం ఉందన్నారు. గతంలో కూడా అనేక మందికి ఈడీ నోటీసులు పంపించిందని గుర్తు చేశారు. మనీలాండరింగ్ కేసులో ప్రమేయంపై ఆరా.. కాగా, అంతకుముందు శివసేన నేత సంజయ్ రావుత్ నివాసంలో ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు నిర్వహించారు. ముంబై భాండూప్లోని ఆయన నివాసానికి ఆదివారం ఉదయం ఏడు గంటలకే చేరుకున్న ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. పత్రాచాల్ భూ కుంభకోణానికి సంబంధించి ఈ దాడులు జరిపారు. ఈ మనీలాండరింగ్ కేసులో సంజయ్ రావుత్ ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ఇప్పటికే ఈడీ రెండుసార్లు ఆయనకు సమన్లు జారీ చేసింది. కానీ ఆయన ఢిల్లీలో ఉన్నారని తెలిపి వాయిదా వేశారు. అయితే ఆదివారం ఉదయం ఈడీ అధికారులు ఏకంగా ఆయన నివాసానికే వచ్చి సోదాలు చేపట్టారు. ఈ విషయంపై శివసేన కార్యకర్తలు భగ్గుమన్నారు. విషయం తెలుసుకున్న శివసేన కార్యకర్తలు వందలాది మంది భాండూప్లోని ఆయన నివాసస్థానం వద్దకి చేరుకున్నారు. సంజయ్ రావుత్కు మద్దతుగా అక్కడే ఆయన నివాసముంటున్న భవనం ముందు భైఠాయించి నిరసనలు తెలిపారు. ముఖ్యంగా శివసేన నేతలను భయపెట్టేందుకు ఈడీ ద్వారా దాడులు చేయిస్తున్నారని శివసేన నాయకులు ఆరోపిస్తున్నారు. సంజయ్ రావుత్ ఎలాంటి తప్పుచేయలేదని, అన్ని విధాలుగా ఈడీకి తాను సహకరించనున్నట్టు ప్రకటించినప్పటికీ ఈ విధంగా దాడులు చేపట్టి భయబ్రాంతులకు గురిచేసేలా చేయడం సరికాదని శివసేన కార్యకర్తలు అంటున్నారు. ఇలా శివసేన నాయకులు తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు శిందేవర్గం, బీజేపీ నాయకులు ఈడీ సోదాలకు మద్దతు పలుకుతున్నారు. శివసేనను వీడను: సంజయ్ రౌత్ తప్పుడు ఆ«ధారాలు, తప్పుడు సాక్ష్యాలతో నాపై దాడులు చేస్తున్నారని శివసేన నేత సంజయ్ రావుత్ ఆరోపించారు. సంజయ్ రావుత్ నివాసంలో ఈడీ దాడుల అనంతరం ట్విట్టర్ ద్వారా బీజేపీ పేరు ప్రస్తావించకుండానే ఎవరెన్ని చేసినా, ఎన్ని విధాలుగా బెదిరించినా నేను శివసేనను వీడనన్నారు. నేను మరణించినా లొంగిపోనంటూ ట్విట్టర్లో ఆయన స్పష్టం చేశారు. ఈడీ పేరుతో బీజేపీ బెదిరిస్తోంది: అమోల్ మిట్కర్ సంజయ్ రావుత్ నివాసంపై ఈడీ దాడుల అనంతరం ఎన్సీపీ నాయకుడైన అమోల్ మిట్క ర్ బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా ఈడీ దర్యాప్తు పేరుతో బెదిరించి బీజేపీ తమ ప్రత్యర్థులను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. దివంగత శివసేన అధినేత బాల్ ఠాక్రే నిష్టావంతుడైన శివసైని కుడు సంజయ్ రావుత్ ఈడీ ముందు తలవంచలేదన్నారు. ఇప్పటివరకు ఈడీ దర్యాప్తుల బెదిరింపులకు అనేక మంది బీజేపీలో చేరారని మిట్కర్ ఆరోపించారు. పలువురు శివసేన ఎమ్మెల్యేలు కూడా విడిపోయారు. అనేక ఎమ్మెల్యేలు శివసేనను వీడిపోయినప్పటికీ సంజయ్ రావుత్ మాత్రం తలవంచకుండా పోరాడుతున్నారన్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారని, అమోల్ తనదైన శైలిలో బీజేపీపై విమర్శలు గుప్పించారు. -
Sanjay Raut Arrest: బీజేపీ చర్య సిగ్గుచేటు..
ముంబై: శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేయడంపై తీవ్రంగా స్పందించారు ఆ పార్టీ ఎంపీ ప్రియాంక చతుర్వేది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పులను ఎత్తిచూపుతున్న బలమైన గళాన్ని అణగదొక్కాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. విపక్ష నేతలను వేధించేందుకే కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఈడీని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఇది సిగ్గుచేటని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సంజయ్ రౌత్ అరెస్టును ఖండిస్తున్నట్లు ట్వీట్ చేశారు. దీనిపై తామంతా ఐక్యంగా పోరాడుతామని చెప్పారు. The attempt to silence one of the most vocal opponent of the central/ state BJP and their wrongdoings — Sh @rautsanjay61 ji —is on. It is a shameful attempt to use central agencies to harass the opposition leaders. Condemn this harassment and we will all fight this out unitedly. — Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) July 31, 2022 రూ.1000కోట్ల పత్రాచల్ భూ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ సంజయ్రౌత్ను ఈడీ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. ముంబైలోని ఆయన నివాసంలో గంటలపాటు సోదాలు నిర్వహించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు. రూ.11.5లక్షల అక్రమ నగదును సీజ్ చేశారు. రౌత్ అరెస్టును శివసేన సహా విపక్ష పార్టీల నేతలు ఖండించారు. చదవండి: మనీలాండరింగ్ కేసులో సంజయ్ రౌత్ను అరెస్టు చేసిన ఈడీ -
శివసేన ముఖ్యనేత సంజయ్ రౌత్ అరెస్టు
ముంబై: శివసేన ముఖ్యనేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ముంబైలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన కొద్ది గంటలకే అదుపులోకి తీసుకున్నారు. రూ.11.5లక్షల నగదును జప్తు చేశారు. సంజయ్ రౌత్తో పాటు, ఆయన కుటుంబసభ్యులపై రూ.1000కోట్ల భూ కుంభకోణం ఆరోపణలు ఉన్నాయి. ED officials take Shiv Sena leader Sanjay Raut along with them after detaining him post conducting raids at his residential premises in Mumbai. Party workers present at the spot pic.twitter.com/6Jubs44s4k — ANI (@ANI) July 31, 2022 సంజయ్ రౌత్ అరెస్టు నేపథ్యంలో ఆయన ఇంటివద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు తనను తీసుకెళ్లే సమయంలో ఇంటికి వచ్చిన శివసేన కార్యకర్తల వైపు చూసి రౌత్ అభివాదం చేశారు. పత్రాచల్ భూ కుంభకోణంలో(మనీలాండరింగ్ కేసు) సంజయ్ రౌత్ ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో ఇదివరకు రెండుసార్లు ఆయనకు సమన్లను జారీ చేశారు. కానీ, ఆయన ఈడీ అధికారుల నోటీసులకు స్పందించలేదు. ఈడీ ఆఫీసుకు వెళ్లలేదు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని చెబుతూ ఈడీ ఆఫీసులో హాజరుకాలేదు. దీంతో ఈడీ అధికారులే ఆదివారం తెల్లవారుజామున ముంబైలోని రౌత్ ఇంటికి వెళ్లి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. సంజయ్ రౌత్ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని, ఈడీకి భయపడను అంటూ కామెంట్స్ చేశారు. ఏప్రిల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన విచారణలో భాగంగా మిస్టర్ రౌత్ భార్య వర్షా రౌత్, ఆయన సహచరులకు చెందిన సుమారు రూ. 11.15 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు బిగ్ షాక్ -
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ నివాసంలో ఈడీ సోదాలు
-
శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు బిగ్ షాక్
Sanjay Raut.. మహారాష్ట్రలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ నివాసంలో ఆదివారం ఉదయం ఎన్స్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. పత్రాచల్ భూ స్కాం కేసులో ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. అయితే, సంజయ్ రౌత్కు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. పత్రాచల్ భూ కుంభకోణంలో(మనీలాండరింగ్ కేసు) సంజయ్ రౌత్ ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో ఇదివరకు రెండుసార్లు ఆయనకు సమన్లను జారీ చేశారు. కానీ, ఆయన ఈడీ అధికారుల నోటీసులకు స్పందించలేదు. ఈడీ ఆఫీసుకు వెళ్లలేదు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని చెబుతూ ఈడీ ఆఫీసులో హాజరుకాలేదు. దీంతో ఈడీ అధికారులే ఆదివారం తెల్లవారుజామున ముంబైలోని రౌత్ ఇంటికి వచ్చి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఆయన ఇంటి వద్ద భారీ సంఖ్యలో సీఆర్పీఎఫ్ బలగాలు మోహరించాయి. మరోవైపు.. సంజయ్ రౌత్ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని, ఈడీ భయపడను అంటూ కామెంట్స్ చేశారు. ఏప్రిల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన విచారణలో భాగంగా మిస్టర్ రౌత్ భార్య వర్షా రౌత్, ఆయన సహచరులకు చెందిన సుమారు రూ. 11.15 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ED Arrives at Sanjay Raut’s Mumbai Home for Questioning After Earlier No-Show https://t.co/WmDw6CS7xk — HuntdailyNews (@HUNTDAILYNEWS1) July 31, 2022 ఇది కూడా చదవండి: హోంమంత్రి ఇంటిపై ఏబీవీపీ కార్యకర్తల దాడి! -
పాములంటే భయం! ఏక్నాథ్ షిండే పై విమర్శల దాడి
ముంబై: మహారాష్ట్రలో శివసేన పార్టీ అంతర్గత విభేదాలతో రెండుగా విడిపోయి అనుహ్య రాజకీయ అనిశ్చితికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఏకనాథ షిండే 39 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబావుటా ఎగరేసి బీజేపీ మద్దతుతో అనుహ్యంగా మహారాష్ట్ర సీఎంగా భాద్యతలు చేపట్టారు. ఈ మేరకు ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం పెరుతూనే వస్తుంది. ఈ నేపథ్యంలోనే శివసేనకు చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్, ఏక్నాథ్ షిండే వర్గాన్ని పాములుగా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఏక్నాధ్ షిండ్ వర్గాన్ని ఉద్దేశించి...సరదాలను కూడా చితకబాదే నైపుణ్యం నేర్చుకోండి. పాముల భయంతో అడవిని వదలకండి. జై మహారాష్ట్ర అని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. ఉద్ధవ్ ఠాకక్రే నేతృత్వంలో శివసేన వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది మహారాషష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో టచ్లో ఉండటంతో మరోసారి శివసేన వర్గానికి పెద్ద షాక్ తగలిన నేపథ్యంలోనే ఈ ట్వీట్ చేశారు. షిండే ఈ విషయాన్ని వెల్లడించే అవకాశం ఉందని కూడా అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అదీగాక షిండే సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో 18 మంది శివసేన లోక్సభ ఎంపీలు బుధవారం తనను కలుస్తారనే నమ్మకం ఉందని అన్నారు. మరోవైపు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి సంబంధించి శివసేనకు చెందిన రెండు వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లను బుధవారం సుప్రీం కోర్టు విచారించనుంది. (చదవండి: శాసన సభను కౌరవ సభగా మార్చొద్దు!.. ఎమ్మెల్యే ముఖం చింపాంజీ కటౌట్తో నిరసన) -
శివ సేనలో సయోధ్య.. భేటీకి సిద్ధమైన షిండే-థాక్రే!
ముంబై: శివ సేన పార్టీ అంతర్గత సంక్షోభం ఓ కొలిక్కి రానుందా? మహారాష్ట్ర సీఎం.. రెబల్ గ్రూప్ నేత ఏక్నాథ్ షిండే, శివ సేన అధినేత..మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే భేటీ కానున్నారా? ఇందుకు బీజేపీనే మధ్యవర్తిత్వం వహించబోతుందా?.. మరాఠీ నటి దీపాలి సయ్యద్ చేసిన ట్వీట్ ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. శివ సేన నేతగా చెప్పుకుంటున్న ఆమె ఈ మేరకు వీళ్ల భేటీ గురించి ఓ ట్వీట్ చేశారు. పార్టీలో విభేధాలపై చర్చించేందుకు షిండే, థాక్రేలు భేటీ కాబోతున్నారంటూ ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. కొందరు బీజేపీ నేతల దౌత్యంతో రెండు రోజుల్లో ఈ ఇద్దరు భేటీ కానున్నట్లు ఆమె పేర్కొన్నారు. శివ సైనికుల సెంటిమెంట్ను పరిగణనలోకి తీసుకుని షిండే, పార్టీ అనే కుటుంబానికి పెద్దగా థాక్రే సహృదయంతో సామరస్యంగా చర్చించుకునేందుకు ముందుకు వచ్చారని ఆమె తెలిపారు. @OfficeofUT @mieknathshinde @TawdeVinod @Pankajamunde pic.twitter.com/20JnC3QSma — Deepali Sayed (@deepalisayed) July 16, 2022 దీపాలి సయ్యద్ 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో థానే జిల్లాలోని ముంబ్రా-కల్వా నియోజకవర్గం నుంచి శివసేన టిక్కెట్పై పోటీ చేసి ఓడారు. 2014లో ఆప్ టికెట్పై పోటీ చేసి ఓడారు. అయితే దీపాలి సయ్యద్ ట్వీట్పై శివ సేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. అలాంటి పరిణామం గురించి తనకేం తెలియదని, పార్టీలో తానొక చిన్న కార్యకర్తనంటూ వెటకారంగా మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి పదిహేను రోజులు కావొస్తున్న మంత్రివర్గం ఏర్పాటు చేయకపోవడంపై ఆయన షిండే-ఫడ్నవిస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాజ్యాంగబద్ధమైన చిక్కులతోనే వాళ్లు ఇబ్బందిపడుతున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎంపీ సంజయ్ రౌత్. బుధవారం సుప్రీం విచారణ సేనలోని ఉద్ధవ్, షిండే వర్గాల పిటిషన్లను జులై 20న విచారించనుంది సుప్రీం కోర్టు. మహారాష్ట్రలో శివసేనలో తిరుగుబాటుకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లను విచారణ చేపట్టనుంది. ప్రత్యర్థి పక్షం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఉద్ధవ్ థాక్రే శిబిరం, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గం దాఖలు చేసిన పిటిషన్లను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. ఎమ్మెల్యేల అనర్హతపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించాలని జూలై 11న సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ను కోరింది. అసెంబ్లీలో కొత్త స్పీకర్ ఎన్నికను సవాల్ చేస్తూ థాక్రే వర్గం చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందనగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. చదవండి: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై సంచలన వ్యాఖ్యలు -
వీడిన ఉత్కంఠ.. ద్రౌపది ముర్ముకే సపోర్ట్
ముంబై: రాష్ట్రపతి ఎన్నికల్లో ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన మద్దతుపై ఎట్టకేలకు ఓ స్పష్టత వచ్చింది. బీజేపీ-ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు శివసేన మద్దతు ప్రకటించేసింది. నిన్న(సోమవారం) ఎంపీలతో జరిగిన కీలక సమావేశంలో ఈ మేరకు మెజార్టీ సభ్యులు ముర్మువైపే మొగ్గుచూపినట్లు సమాచారం. దీంతో అధిష్టానం సైతం ఆ దిశగా సానుకూలత చూపిస్తోంది. మహారాష్ట్ర జనాభాలో పది శాతం ఎస్టీ జనాభా ఉంది. ఈ తరుణంలో.. గిరిజన కమ్యూనిటీకి చెందిన ద్రౌపది ముర్ముకే మద్దతు ఇవ్వాలని సేన ఎంపీలు.. శివసేన చీఫ్, మాజీ సీఎం ఉద్దవ్ థాక్రేపై ఒత్తిడి తెచ్చారు. మొత్తం 22 ఎంపీలకుగానూ 16 మంది(ఇద్దరు షిండే గూటిలో ఉన్నారు) ముర్ముకే మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. దీంతో శివసేన రాష్ట్రపతి అభ్యర్థి మద్దతు విషయంలో దాదాపుగా ఒక స్పష్టత వచ్చినట్లయ్యింది. మరోవైపు ఈ మధ్యాహ్నాం సంజయ్ రౌత్.. రాష్ట్రపతి అభ్యర్థి మద్దతు విషయంలోనూ ఒక స్పష్టత ఇచ్చేశారు. సోమవారం ఎంపీల సమావేశంలో ద్రౌపది ముర్ము మద్దతు అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగిందని ఆయన వెల్లడించారు. అయితే.. ముర్ముకు మద్దతు ఇచ్చినంత మాత్రానా బీజేపీకి సపోర్ట్ చేసినట్లు కాదంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం బలంగా ఉండాలన్నది మా ఉద్దేశం. యశ్వంత్ సిన్హా విషయంలోనూ శివ సేన సానుకూలంగానే ఉంది. గతంలో ఎన్డీయే అభ్యర్థికి కాకుండా.. ప్రతిభా పాటిల్కు మద్దతు ఇచ్చాం. ప్రణబ్ ముఖర్జీకి కూడా మద్దతు ఇచ్చాం. ఒత్తిడిలో శివసేన ఎలాంటి నిర్ణయాలు తీసుకోదు. శివసేన ఎప్పుడూ సరైన నిర్ణయమే తీసుకుంటుంది. అంటూ సంజయ్ మాట్లాడారు. సంకుచిత స్వభావం కాదు.. ఉద్దవ్థాక్రే శివసేనది సంకుచిత స్వభావం కాదని, తనపై ఎవరి ఒత్తిడి ఉండదని.. ఉండబోదని శివసేన చీఫ్ ఉద్దవ్ ధాక్రే స్పష్టం చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ముకు తాము మద్దతు ప్రకటిస్తామని స్వయంగా వెల్లడించిన ఆయన.. ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో ఆమెను బలపర్చకూడదు. కానీ, మేమంతా సంకుచిత స్వభావం ఉన్నవాళ్లం కాదు. అందుకే గిరిజన మహిళకు మద్దతు ప్రకటిస్తున్నాం అని ఉద్దవ్ థాక్రే తెలిపారు. ఇక రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన.. రాజకీయాలు పట్టించుకోదని, గతంలో మాదిరే ఇప్పుడు గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చి తీరుతుందని ఎంపీ గజానన్ కిరీట్కర్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. విపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక సమయంలో మల్లగుల్లాలు పడుతుంటే.. పార్టీ సంక్షోభాన్ని ఎదుర్కొంది శివసేన. అందుకే కీలక సమావేశాలకు దూరంగా ఉంటూ వచ్చింది. దీంతో అప్పటి నుంచి ఎవరికి మద్దతు ఇస్తుందా? అనే ఆసక్తికర చర్చ నడుస్తూ వచ్చింది. చదవండి: రాష్ట్రపతి ఎన్నికలు.. చంద్రబాబు ఎక్కడ?? -
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వంద సీట్లు ఉద్దవ్ థాక్రేవే!
ముంబై: శివ సేన రెబల్స్ తిరుగుబాటు సంక్షోభ సస్పెన్స్ తర్వాత.. బీజేపీ మద్దతుతో షిండే వర్గం అధికారంలో కొలువుదీరింది. అయితే.. శివ సేన మాత్రం తమది నైతిక విజయం అని, ప్రజా కోర్టులోనే తేల్చుకుంటామని సవాల్ విసురుతోంది. ఈ తరుణంలో శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఉద్ధవ్ థాక్రే.. కనీసం వంద సీట్లు అయినా గెలుచుకుంటారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్తున్నారు. కేవలం ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంత మాత్రాన తమకు ఓటర్లు దూరమైనట్టు కాదని.. మహారాష్ట్ర ప్రజల్లో తిరుగుబాటు ఎమ్మెల్యేల మీద తీవ్ర ఆగ్రహావేశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను(ఈడీ, సీబీఐలను ఉద్దేశిస్తూ..), డబ్బును అడ్డం పెట్టుకుని శివ సేనను హస్తగతం చేసుకోలేరని స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు మధ్యంతర ఎన్నికలు పెట్టినా ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివ సేన 100 సీట్లకుపైగా గెలుచుకుంటుంది. ఉద్ధవ్ థాక్రేపై ప్రజల్లో సానుభూతి ఉంది. అదే సమయంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఆగ్రహం ఉంది. ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ నుంచి వెళ్లిపోతే.. శివ సేన తమ ఓటర్లను కోల్పోయినట్టు కాదు” అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. శివ సేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే కూడా ఈ విషయంపై ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలోని ఎమ్మెల్యేలకు సవాలు చేసిన విషయం తెలిసిందే. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని.. ప్రజా క్షేత్రంలో తేల్చుకుందామని ఉద్ధవ్ సవాల్ చేశారు. దానికి కొనసాగింపుగానే తాజాగా సంజయ్ రౌత్ మాట్లాడారు. -
నాకూ ఆఫర్ ఇచ్చారు.. అందుకే వద్దన్నా: సంజయ్ రౌత్
ముంబై: తిరుగుబాటు వర్గం నుంచి తనకు కూడా ఆఫర్ వచ్చినట్టు శివసేన సీనియర్ నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు. గువాహటిలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలతో చేతులు కలిపేందుకు వచ్చిన అవకాశాన్ని తాను తిరస్కరించినట్టు ఆయన చెప్పారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘నేను ఏ తప్పు చేయలేదని కాబట్టే నిర్భయంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొంటున్నాను. అందుకే 10 గంటల పాటు నన్ను విచారించినా బయటకు రాగలిగాను. నేను కూడా గువాహటి వెళ్ళవచ్చు కానీ నేను బాలాసాహెబ్ సైనికుడిని. నిజం మనవైపు ఉన్నప్పుడు, ఎందుకు భయపడాల’ని సంజయ్ రౌత్ అన్నారు. ఏక్నాథ్ షిండే శివసేన ముఖ్యమంత్రి కాదని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. ముంబైలో శివసేన బలాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగానే ఏక్నాథ్ షిండేకు ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ కట్టబెట్టిందని ఆరోపించారు. శివసేన పార్టీని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ వ్యూహం ప్రకారం పనిచేస్తోందని ధ్వజమెత్తారు. తమదే నిజమైన శివసేన అని ఏక్నాథ్ షిండే వర్గం ప్రచారం చేసుకోవడం ఇందులో భాగమని తెలిపారు. శివసేన ఎంపీలంతా తమవైపే ఉన్నారని.. నిజమైన శివసైనికులు ఎలాంటి ప్రలోభాలకు లొంగరని పేర్కొన్నారు. అసలైన శివసేన ఉద్ధవ్ ఠాక్రేతో ఉందని సంజయ్ రౌత్ దీమా వ్యక్తం చేశారు. కాగా, మనీ ల్యాండరింగ్ కేసులో సంజయ్ రౌత్ శుక్రవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. దాదాపు 10 గంటల పాటు ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నించారు. (క్లిక్: ఏక్నాథ్ షిండే శివసేన సభ్యత్వం తొలగింపు) -
శివసేనకు వెన్నుపోటు పొడిచింది ఆయనే!
Maharashtra Political Crisis ముంబై: శివసేనలో సంక్షోభానికి మూల కారకుడు సంజయ్ రౌత్ అనేది ఆ పార్టీ రెబల్స్ ఆరోపణ. అంతేకాదు ఎన్సీపీతో కుమ్మక్కై ఆయన తీరని ద్రోహం చేశాడంటూ మండిపడుతోంది. ‘‘మేం ఎవరినీ వెన్నుపోటు పొడవలేదు. ఉద్దవ్ థాక్రే అంటే మాకు విపరీతమైన గౌరవం ఉంది. సంజయ్ రౌత్ ఎన్సీపీకి విధేయుడిగా వ్యవహరించాడు. అందుకే శివసేనకు వెన్నుపోటు పొడిచాడు’’ అని రెబల్స్ తరపున ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ గురువారం ఉదయం మీడియాతో స్పందించారు. సొంత మనుషులే శివసేనను వెన్నుపోటు పొడిచారని, తనపై ఈడీ కేసు కూడా రాజకీయ ప్రతీకారమంటూ తాజాగా సంజయ్ రౌత్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే.. దీపక్ కౌంటర్ ఇచ్చారు. ‘‘ఉద్దవ్ థాక్రే కుటుంబానికి మేం వ్యతిరేకం కాదు. మహా వికాస్ అగాఢితో తెగదెంపులు చేసుకుంటే మేం ఆయనతో చర్చించేవాళ్లం. ఆయనకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లేవాళ్లం కూడా కాదు. ఇప్పటికీ మేం థాక్రేను గౌరవిస్తున్నాం’’ అని దీపక్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఏక్నాథ్ షిండే గోవా నుంచి ముంబైకి బయలుదేరారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే. మేం ఎవరినీ వెన్నుపోటు పొడవలేదు. కేవలం ప్రజల్లో సానుభూతి కోసమే సంజయ్ రౌత్ అలాంటి ప్రకటనలు చేస్తున్నారు. ఉద్దవ్ థాక్రే నిన్న(బుధవారం) రాజీనామా చేశారు. కానీ, మాకు ఆయన్ని తప్పించే ఉద్దేశం లేదు. ఇప్పటికీ మేం శివసేనలోనే ఉన్నాం. ఆయన్ని అగౌరవపరచడం, బాధపెట్టడం మా ఉద్దేశాలు ఎంత మాత్రం కాదు.. అని రెబల్స్ తరపున దీపక్ కేసర్కర్ మీడియాకు తెలిపారు. Maharashtra BJP leader Devendra Fadnavis will decide the oath-taking date. It is the prerogative of the Governor to give him that date. Our negotiations have already started and we will form a govt: Shiv Sena MLA Deepak Kesarkar, spokesperson of the Eknath Shinde camp pic.twitter.com/8skbQ8IgEf — ANI (@ANI) June 30, 2022 చదవండి: థాక్రే రాజీనామాపై సంతోషంగా లేం! -
మహారాష్ట్ర గవర్నర్ రఫెల్ కంటే వేగంగా వ్యవహరించారు: సంజయ్ రౌత్ సెటైర్లు
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్లమీద ట్విస్ట్లు చోటుచేసుకుంటున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో రేపు(గురువారం) బల నిరూపణ పరీక్ష జరగనుంది. ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి సాయంత్రం 5 గంటలలోపు బల పరీక్ష ప్రక్రియ ముగించాలని మహారాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీకి గవర్నర్ లేఖ రాశారు. దీంతో బలపరీక్షపై గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆదేశాలను సవాల్ చేస్తూ శివసేన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నేడు సాయంత్రం 5 గంటలకు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జెట్ స్పీడ్ కంటే వేగంగా.. తాజాగా గవర్నర్ ఆదేశాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. మహారాష్ట్ర గవర్నర్ గురువారం బలపరీక్షకు ఆదేశించడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా రౌత్ అభివర్ణించారు. గవర్నర్ జెట్ స్పీడ్ కంటే వేగంగా వ్యవహరించారని సెటైర్లు వేశారు. రాఫెల్ జెట్ కూడా ఇంత వేగంగా ఉండదని అన్నారు. అంతేగాక గవర్నర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బల పరీక్ష కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించాలన్న గవర్నర్ ఆదేశాలపై ఉద్ధవ్ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయిచారని రౌత్ చెప్పారు. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు ఇంకా నిర్ణయం తీసుకోనప్పుడు బల పరీక్ష వంటి చర్య ఏదైనా చట్టవిరుద్దమని ఆయన అన్నారు. ‘రెబెల్ మ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఫ్లోర్ టెస్ట్ జరగదని మేం చెబుతూనే ఉన్నాం. ఇది చట్టవిరుద్ధమైన చర్య. 16 మంది ఎమ్మెల్యేల అనర్హత అంశం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఇప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ, గవర్నర్ హౌజ్ కలిసి ప్రయత్నిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా మేం సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం కోసం పోరాడుతాం. మాతో పోరాడాలనుకుంటే ముందుకు వచ్చి పోరాడండి’ అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. చదవండి: బలపరీక్ష ఆదేశాలు.. సుప్రీంకోర్టులో శివసేన పిటిషన్ భారీ భద్రత గురువారం బల పరీక్ష నేపథ్యంతో అసెంబ్లీ లోపల, బయట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించారు. గురువారం సాయంత్రం 5 గంటలలోపు ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. ఏ కారణంతోనైనా అసెంబ్లీ సమావేశం వాయిదాకు వీల్లేదని అన్నారు. బల పరీక్ష ప్రక్రియను వీడియోగ్రఫీ చేయాలని తెలిపారు. -
సంజయ్ రౌత్కు ఈడీ సమన్లు.. షిండే కొడుకు వెటకారం
ముంబై: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నడుమ.. మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. శివ సేన కీలక నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) తమ ఎదుట హాజరుకావాలని ఇవాళ నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసు ఆరోపణల నేపథ్యంలో.. సంజయ్ రౌత్ను ప్రశ్నించాల్సి ఉందని ముంబైలోని ఈడీ కార్యాలయం తెలిపింది. ఈ మేరకు మంగళవారం తమ ఎదుట హాజరు కావాలని సమన్లలో పేర్కొంది ఈడీ. పాత్రా చావ్ల్ భూ కుంభకోణం కేసుకు సంబంధించి.. 1,034 కోట్ల గోల్మాల్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి.. ఏప్రిల్ నెలలో సంజయ్ రౌత్కు సంబంధించి ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ‘‘నేను భయపడే రకం కాదు. సీజ్ చేస్తే.. చేస్కోండి, చంపుకోండి.. కాల్చేయండి.. లేదంటే జైలుకు పంపండి’’ అంటూ ఆ సమయంలో ప్రకటన కూడా చేశారు. ఇదిలా ఉంటే.. సంజయ్ రౌత్కు ఈడీ నోటీసులపై ఏక్నాథ్ షిండే తనయుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే వెటకారం ప్రదర్శించారు. ‘‘ఈడీ సమన్ల నేపథ్యంలో సంజయ్ రౌత్కు నా శుభాకాంక్షలు’’ అంటూ ప్రకటన ఇచ్చాడు. అలాగే.. అనర్హత విషయంలో న్యాయస్థానంలో జరుగుతున్న పోరులో రెబల్స్ విజయం సాధిస్తారని ధీమా ప్రకటించాడు. మహారాష్ట్ర ప్రజలు మొత్తం పరిణామాలు చూస్తున్నారని, సరైన టైంలో సరైన బదులు ఇస్తారని పేర్కొన్నాడు. రెబల్ ఎమ్మెల్యేలంతా ఇవాళ చర్చ జరిపి.. ఒక తుదినిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని శ్రీకాంత్ షిండే పేర్కొన్నాడు. సంజయ్ రౌత్కు ఈడీ నోటీసులపై థాక్రే మద్ధతుదారులు స్పందించారు. షిండే తిరుగుబాటు నేపథ్యంలోనే.. దర్యాప్తు సంస్థలపై ఒత్తిడి పెరుగుతోందంటూ పరోక్షంగా కేంద్రంలోని బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. శివ సేన నేత, ఆ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్నాథ్ షిండే తిరుగుబాటుపై మొదటి నుంచి పార్టీ తరపున గట్టిగా గొంతుక వినిపిస్తున్నారు సంజయ్ రౌత్. ఈ క్రమంలో ఆయనకు ఈడీ నోటీసులు పంపడం ఆసక్తికరంగా మారింది. అయితే శివ సేనలో చీలికలకు ఈడీ భయమే కారణమని, ఈడీ ఒత్తిడితో పార్టీని వీడేవాళ్లు నిజమైన బాలాసాహెబ్ భక్తులు కాదని సంజయ్ రౌత్ ఇదివరకే ప్రకటించారు. చదవండి: రెబల్స్కు ఆదిత్య థాక్రే వార్నింగ్ -
ఆత్మల్ని చంపేసుకున్నారు.. ఉత్త దేహాలే తిరిగొస్తాయ్
ముంబై: మహా రాజకీయ సంక్షోభం.. సాగదీతతో ఇంకా కొనసాగుతూనే ఉంది. గువాహతి హోటల్లోనే మకాం వేసిన ఏక్నాథ్ షిండే వర్గం.. మరికొందరు శివసేన అసంతృప్తులను సమీకరించే పనిలో ఉంది. మరోవైపు రాజీనామా ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన సీఎం ఉద్దవ్ థాక్రే.. అసెంబ్లీలోనే బలనిరూపణకు పట్టుబడతుంది. ఈ క్రమంలో.. సుప్రీం కోర్టుకు మహా పంచాయితీ చేరుకుంది. అనర్హత నోటీసుకు వ్యతిరేకంగా ఏక్నాథ్ షిండే దాఖలు చేసిన పిటిషన్పై వెకేషన్ బెంచ్ ఇవాళ(సోమవారం) విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. రెబల్స్ ఇళ్లు, కార్యాలయాలపై శివ సైనికుల దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం భద్రత కల్పించింది. పదిహేను మంది రెబల్ ఎమ్మెల్యేలకు వై ఫ్లస్ సెక్యూరిటీ ఇచ్చింది. అయితే ఆ లిస్ట్లో ఏక్నాథ్ షిండే పేరు లేకపోవడం గమనార్హం. మరోవైపు శివసేన కీలక నేత సంజయ్ రౌత్, సేన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారి ఆత్మలు చనిపోయాయని, వారి ఉత్త దేహాలు మాత్రమే ముంబైకి తిరిగి వస్తాయని ఆదివారం అన్నారు. ఆ నలభై మంది రెబల్ ఎమ్మెల్యేలు.. బతికి లేరు. తమ చేష్టలతో వాళ్లు వాళ్ల వాళ్ల ఆత్మలను చంపేసుకున్నారు. కేవలం వాళ్ల ఉత్తదేహాలు మాత్రమే మహారాష్ట్రకు తిరిగి వస్తాయి. గువాహతి నుంచి బయటకు అడుగుపెట్టగా.. మనస్ఫూర్తిగా వాళ్లను వాల్లు చంపేసుకున్నట్లే లెక్క. ఆత్మలు లేని వాళ్ల దేహాలు.. పోస్ట్మార్టం కోసం వాళ్లను నేరుగా అసెంబ్లీకి పంపడమే మిగిలింది అని రౌత్ వ్యాఖ్యానించారు. ప్రలోభాలు, అధికార దాహంతోనే ఈ వేరుకుంపటి ప్రయత్నాలు జరుగుతున్నాయని, రాజుకున్న నిప్పుతో ఏం జరుగుతుందో వాళ్లకు తిరిగొచ్చాక తెలుస్తుందని. అని సంజయ్ రౌత్ హెచ్చరించారు. ‘వాళ్లు ఇక్కడికి వస్తే.. అసలు తిరుగుబాటు ఎక్కడి మొదలైందో స్పష్టత వస్తుంది. వాళ్లు ఏం కోల్పోతున్నారో వాళ్లకు అర్థం అవుతుంది. నిజమైన సైనికుల తీరు ఇది కాదు. అధికారం కోల్పోయే ప్రసక్తే లేదు.. శివ సేన పోరాటం కొనసాగుతుంది’ అని స్పష్టం చేశారు ఎంపీ సంజయ్ రౌత్. చదవండి: రంగంలోకి గవర్నర్.. మహాలో రాష్ట్రపతి పాలన తప్పదా? -
తెర మీదకు శివసేన కొత్త పార్టీ!.. అగ్గి రాజుకుంటుందని హెచ్చరికలు
ముంబై: మహారాష్ట్ర రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు గ్రూప్ లీడర్ ఏక్నాథ్ షిండే ప్రకటించారు. ఈ మేరకు డిప్యూటీ స్పీకర్కు లేఖ రాసే యోచనలో ఉన్నారు షిండే. అయితే కొత్త పార్టీ పేరు శివసేన(బాలాసాహెచ్)గా ఉండొచ్చని షిండే వర్గీయులు చెప్తున్నారు. బాల్థాక్రే సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ ఉండబోతోందని, దీనిపై సాయంత్రం వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే.. 38 మంది రెబల్ ఎమ్మెల్యే కుటుంబాలకు భద్రతను ఉపసంహరించుకోవడంపై ఏక్నాథ్ షిండే మండిపడ్డారు. ఈ మేరకు సీఎం ఉద్దవ్థాక్రేతో పాటు మహారాష్ట్ర హోం మంత్రి, డీజీపీలకు లేఖ రాశారు. రెబల్ ఎమ్మెల్యేల కుటుంబాలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని, దుర్మార్గంగా వ్యవహరించొద్దంటూ లేఖలో పేర్కొన్నారాయన. వాళ్లకేదైనా జరిగితే సీఎం థాక్రే, పోలీసులదే బాధ్యత అంటూ హెచ్చరించారు షిండే. Rebel Shiv Sena MLA Eknath Shinde writes to CM Uddhav Thackeray, Maharashtra Home Minister, DGP Maharashtra regarding "Malicious withdrawal of security of family members of the 38 MLAs" "The government is responsible for protecting them and their families," he tweets pic.twitter.com/f4riPwx4xM — ANI (@ANI) June 25, 2022 ఇదిలా ఉంటే.. అనర్హత నోటీసులు జారీ చేసిన డిప్యూటీ స్పీకర్ నరహరి సీతారాం జిర్వాల్పై షిండే విమర్శలు ఎక్కువ పెట్టారు. న్యాయ పోరాటానికి దిగుతామని, అవసరమైతే.. డిప్యూటీ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని షిండే ప్రకటించారు. ఓర్పు నశిస్తే.. శివసేన చాలా పెద్దదని, దానిని ఎవరూ హస్తగతం చేసుకోలేరని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఎన్నో త్యాగాలతో పార్టీ నిర్మాణం జరిగిందని.. దానిని ఎవరూ ధన బలంతో ధ్వంసం చేయలేరని పేర్కొన్నారు. శనివారం పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు శివ సైనికులు ఓర్పుగా ఉన్నారని.. వారిలో సహనం నశిస్తోందని ప్రకటించారు. ఒక వేళ శివ సైనికులు గనుక బయటికి వస్తే వీధుల్లో అగ్గి రాజుకుంటుందని తిరుగుబాటు ఎమ్మెల్యేలను హెచ్చరించారు. సభకు రండి.. తెలుస్తుంది శుక్రవారం రాత్రి ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో భేటీ అయ్యానని.. ఆ సమయంలో పది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల నుంచి తమకు ఫోన్ వచ్చిందని సంజయ్ రౌత్ వెల్లడించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు సభలో విశ్వాస పరీక్షకు రావాలని.. అప్పుడు ఎవరు బలవంతులో తేలుతుందని సవాల్ చేశారు. కాగా.. ఏక్ నాథ్ షిండేతో కలిసి అస్సాం క్యాంపులో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యే తానాజీ సావంత్ కార్యాలయంపై శివసేన కార్యకర్తలు శనివారం దాడి చేశారు. #WATCH | Shiv Sena workers vandalise office of the party's MLA Tanaji Sawant in Balaji area of Katraj, Pune. Sawant is one of the rebel MLAs from the state and is currently camping in Guwahati, Assam. #MaharashtraPoliticalCrisis pic.twitter.com/LXRSLPxYJC — ANI (@ANI) June 25, 2022 అస్సాం గువాహతిలో రాడిసన్ బ్లూ హెటల్లో రెబల్ ఎమ్మెల్యేలు బస చేశారు. ఆ హోటల్ ముందు అస్సాం శివసేన కార్యకర్తలు ధర్నాకు దిగారు. వెంటనే ముంబైకి వెళ్లి.. ఉద్దవ్ థాక్రేతో కలిసిపోవాలని, సంక్షోభానికి ఓ ముగింపు పలకాలని అస్సాం శివ సేన యూనిట్ చీఫ్ రామ్ నారాయణ్ సింగ్, ఏక్నాథ్ షిండేను కోరుతున్నాడు. షాజీ.. రాష్ట్రపతి పాలన విధించండి శివసేన రెబల్ ఎమ్మెల్యేల ఇళ్లు, వాళ్ల కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఉద్ధవ్ థాక్రేను విడిచిపెట్టి, బాలాసాహెబ్ సిద్ధాంతాలకు కట్టుబడి తమ సొంత నిర్ణయాలు తీసుకుంటున్న ఎమ్మెల్యేల కుటుంబాలకు భద్రత కల్పించాలని కేంద్రం హోం మంత్రి మిత్ షాను అభ్యర్థిస్తున్నాను. ఉద్ధవ్ ఠాక్రే గూండాయిజానికి స్వస్తి పలకడంతో పాటు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అని ఎంపీ నవనీత్ కౌర్ డిమాండ్ చేశారు. I request Amit Shah to provide security to families of MLAs who are leaving Uddhav Thackeray & making their own decisions, staying connected with Balasaheb's ideology. Uddhav Thackeray's goondaism should be ended...I request for President's Rule in state: Amravati MP Navneet Rana pic.twitter.com/gToy0V0Ugk — ANI (@ANI) June 25, 2022 కాంగ్రెస్, ఎన్సీపీలు.. శివసేన పరిస్థితులు సర్దుమణిగి.. మహా వికాస్ అగాడి కూటమి తిరిగి అధికారం చేపడుతుందనే ధీమాలో ఉన్నాయి. ఈ మేరకు శనివారం శివసేన జాతీయ కార్యవర్గ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: శివసేనలో కుళ్లిన ఆకుల్ని ఏరేయాల్సిందే