-
సెలవుల్లో ఇంటికి వెళ్తూ అనంతలోకాలకు
● రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతినేరడిగొండ: తమ కుమారుడు విద్యను అభ్యసించి ఉన్నతస్థితికి చేరాలనే ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులు తమకు దూరంగా వసతిగృహంలో ఉంచి చదివిస్తున్నారు. ఇన్ని రోజుల పాటు పుస్తకాలతో కుస్తీ పడ్డ ఆ విద్యార్థి సెలవులు రావడంతో సంతోషపడ్డాడు. తన తండ్రితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా జ రిగిన రోడ్డు ప్రమాదంలో అనంతలోకాలకు చేరుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పంచగుడి గ్రామానికి చెందిన సంజయ్ (12) ఇచ్చోడలోని సాంఘిక సంక్షేమ ఎస్సీ వసతిగృహంలో ఆరోతరగతి చదువుతున్నాడు. సోమవారం నుంచి సెలవులు ప్రకటించడంతో తండ్రి బాబుతో కలిసి బైక్పై ఇంటికి బయల్దేరాడు. నేరడిగొండ మండలంలోని లఖంపూర్ జాతీయ రహదారి వద్ద గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. చికిత్స నిమిత్తం 108లో నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనలో విద్యార్థి తండ్రికి సైతం స్వల్పగాయాలయ్యాయి. -
‘మోదీని మళ్లీ ప్రధాని చేయడమే కర్తవ్యం’
ఆదిలాబాద్టౌన్: మోదీని మరోసారి ప్రధాని చేయడమే ముందున్న కర్తవ్యమని బీజేపీ నాయకులు అన్నారు. పట్టణంలోని ఓ హోటల్లో మహిళ శక్తి సమ్మేళనం సో మవారం నిర్వహించారు. కార్యక్రమానికి పార్లమెంట్ పొలిటికల్ ఇన్చార్జి పాయల్ శంకర్, ఎంపీ అభ్యర్థి గొడం నగేశ్, జెడ్పీ మాజీ చైర్ పర్సన్ చిట్యాల సుహాసిని రెడ్డి, పార్లమెంట్ ప్రభారి అల్జాపుర్ శ్రీనివాస్, పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్నగారి భూ మయ్య తదితరులు హా జరై మాట్లాడారు. మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. ప్రధాని మోదీ మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఎ న్నికల్లో ఎంపీగా నగేశ్ను గెలిపించాలని కోరా రు. ఇందులో ఇంద్రవెల్లి జెడ్పీటీసీ పుష్పలత, నాయకురాలు దోని జ్యోతి, అనిత, నివేదిత వఝే తదితరులు పాల్గొన్నారు. -
లెనిన్ స్ఫూర్తితో పోరాడుదాం
ఎదులాపురం: కామ్రేడ్ లెనిన్ స్ఫూర్తితో సమసమాజ స్థాపన కోసం పోరాడుదా మని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కా ర్యాలయంలో సోమవారం కామ్రేడ్ లెనిన్ జయంతి, పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘ నంగా నిర్వహించారు. ముందుగా లెనిన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. మోదీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. కార్మిక, కర్షకులు కళ్లు తెరిచి ఐక్యంగా శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పో రాడి, సమసమాజ స్థాపన దిశగా ముందు కు సాగాలన్నారు. కార్యక్రమంలో పీవో డబ్ల్యూ జిల్లా కన్వీనర్ దుర్గం కళావతి, సు భాష్, వామన్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు హరీశ్ తదితరులు పాల్గొన్నారు. -
పేదింటి బిడ్డ సుగుణ : ఎమ్మెల్యే బొజ్జు
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు తెలియనటువంటి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణపై దేవుళ్ల పేరిట విష ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. ఏ ఒక్క రోజు తలపాగా చుట్టని, దోతి కట్టని, జంగుబాయిని దర్శించుకోని వ్యక్తి నగేశ్ అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన పేదింటి ఆడబిడ్డ ఆత్రం సుగుణను గెలిపించాలని ప్రజలను కోరారు. సభకు హాజరైన జనంసభలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్రెడ్డి, పక్కన ఎమ్మెల్యే బొజ్జు, ఎంపీ అభ్యర్థి సుగుణ -
● ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు ● ఆదిలాబాద్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ● జనజాతర సభ సక్సెస్.. ‘హస్తం’ శ్రేణుల్లో జోష్
కైలాస్నగర్: సీఎం రేవంత్రెడ్డి హామీల జల్లు కురి పించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించిన తెలంగాణ జన జాతర బహిరంగసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభ ప్రాంగణాని కి చేరుకున్న ఆయన ప్రజలకు అభివాదం చేసిన అనంతరం ప్రసంగించారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి సంబంధించి అనేక హామీలు ప్రకటించారు. బోథ్ నియోజకవర్గ పరిధిలోని దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కుప్టి ప్రాజెక్ట్ను నిర్మించి రైతులకు సా గునీటిని అందిస్తామన్నారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిన తూర్పు ప్రాంతంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ను నిర్మించడంతో పాటు దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట నామకరణం చేస్తామన్నారు. ముంపు నిర్వాసితుల అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు. అలాగే కేసీఆర్ నిర్లక్ష్యం చేసిన కడెం ప్రాజెక్ట్కు మరమ్మతులు చేసి దానిపై ఆధారపడ్డ ప్రజలకు సాగు, తాగునీటిని అందిస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మూతపడ్డ సీసీఐ ఫ్యాక్టరీని ప్రైవేట్ వ్యాపారులతో మాట్లా డి తెరిపిస్తామని తద్వారా ఈ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అలాగే జిల్లా ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని భరోసానివ్వడం ఈ ప్రాంత వాసుల్లో ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతుంది. సభ సక్సెస్తో పార్టీ నేతల్లో హుషారు కనిపించింది. రెండు గంటలు ఆలస్యంగా ... ప్రత్యేక హెలిక్యాప్టర్లో జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియానికి చేరుకున్న సీఎం అక్కడి నుంచి రోడ్డు మార్గాన సభ వేదిక వద్దకు చేరుకున్నా రు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11గంటలకు హాజ రుకావాల్సి ఉండగా మధ్యాహ్నం 12.57 గంటలకు వచ్చారు. రెండు గంటలు ఆలస్యంగా హాజరైనప్పటికీ పార్టీశ్రేణులు, ప్రజలు సీఎం రాక కోసం ఓపిగ్గా నిరీక్షించారు. సభ వేదిక వద్దకు చేరుకుని ప్రజలకు అభివాదం చేశారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులు కేరింతలు కొడుతూ ఉత్సాహాన్ని చాటారు. సాంస్కృతిక కళాకారుల బృందం ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్, మాజీ ఎమ్మెల్యేలు రేఖానాయక్, రాథోడ్ బాపూరావు, రామారావు పటేల్, కోనేరు కోనప్ప, జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, టీపీసీసీ కార్యదర్శి సత్తు మల్లేశ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, శ్యాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక పోలీస్ బందోబస్తు సీఎం రాక నేపథ్యంలో పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా హెలిప్యాడ్ నుంచి సభ ప్రాంగణం వరకు దారి పొడవునా పోలీసులను మోహరించారు. సభా ప్రాంగణం వద్ద సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు జిల్లా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సీఎం రాకకు ముందు నుంచే బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్న ఎస్పీ గౌస్ ఆలం సీఎం వెనుదిరిగే వరకు అక్కడే ఉండి భద్రతను స్వయంగా పర్యవేక్షించారు. పలువురి చేరిక బీజేపీ, బీఆర్ఎస్ల నుంచి పలువురు సీఎం స మక్షంలో కాంగ్రెస్లో చేరారు. బీఆర్ఎస్కు చెందిన మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, మున్సిపల్ వైస్చైర్మన్ జహీర్ రంజా నీ, కౌన్సిలర్లు ఆవుల వెంకన్న, కలాల శ్రీని వాస్, మడావి మంగళ, మాజీ ఎంపీపీ ఆడే శీల, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి తదితరులు కాంగ్రెస్లో చేరారు. వారికి సీఎం కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు కేసీఆర్ లాంటి దొరలే.. సక్కు, నగేశ్పై సీఎం సైటెర్లు బీఆర్ఎస్, బీజేపీ ఎంపీ అభ్యర్థులపై సీఎం రేవంత్రెడ్డి తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించారు. ‘ఆత్రం సక్కును చూశారు.. గోడం నగేశ్ను చూశారు.. వారు మీకు కొత్తేమి కాదు.. వాళ్ల పనితీనమేంటో కూడా మీకు తెలుసు.. మంచోడు మంచోడని మంచమెక్కిస్తే మంచమంతా పాడు చేశాడట వెనుకటికి ఆత్రం సక్కులాంటోడని’ అన్నారు. అలాగే గోడం నగేశ్ గురించి మా ట్లాడుతూ ‘బుద్ధిమంతుడని సద్దికట్టిస్తే బొడ్రా యి వద్ద భోంచేసి తిరిగి ఇంటికొచ్చి బోర్లాపడుకున్నడట.. అంటూ సామెతలను వివరిస్తూ వారిద్దరిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నగేశ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా అన్ని పదవులు చేసిన విషయం మీకందరికీ తెలుసన్నారు. వారిద్దరు తక్కువేమి కాదని కేసీఆర్ దొర ఎంతనో ఈ గిరిజన నాయకులు అంతటి దొరలేనన్నారు. ఉదయం 11గంటలైతే తప్ప కిందకి దిగడని, సామాన్యులు చేయి కలిపితే వెంటనే జేబులో పెట్టి తుడ్చుకునే నగేశ్ లాంటి దొరలు మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఫాంహౌస్లో ఉండే దొరలైనా ఆదిలాబాద్లో ఉండే ఈ దొరలతో మనకేం పని అని అన్నారు. సామాన్యురాలిగా, ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆత్రం సుగుణను పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిందని ఆమెను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్కు పంపించాలని కోరారు. -
విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీయాలి
గుడిహత్నూర్: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలికి తీయాలని డీఈవో ప్రణీత అన్నారు. మండలంలోని మన్నూర్ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు వివిధ భాషల్లో రాసిన కవితల పుస్తకాలను సోమవారం ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. విద్యార్థులకు రచనపై ఆసక్తి పెంచుతూ వారి ద్వారా కవితలు రాయించి సేకరించి దానికి పుస్తక రూపం అందించిన పాఠశాల ఉపాధ్యాయురాలు అరుణను ప్రత్యేకంగా అభినందించారు. అంతకు ముందు పుస్తక సంపాదకురాలు అరుణ మాట్లాడారు. విద్యార్థులు వారి అభిరుచులకు అనుగుణంగా కవితలు, పాటలు రాశారన్నారు. తెలుగు, మరాఠి, హిందీ, ఇంగ్లీష్, గోండి భాషల్లో రాసిన కవితలను సేకరించి పుస్తకరూపంలో ముద్రించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవోలు నారాయణ, ఉదయ్రావ్, హెచ్ఎం సంతోష్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. డీఈవో ప్రణీత విద్యార్థులు రాసిన కవితల పుస్తకాలు ఆవిష్కరణ -
ప్రజల సంక్షేమాన్ని కాంక్షించేది కాంగ్రెస్ : మంత్రి సీతక్క
జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేయడంతోనే బీఆర్ఎస్ను ప్రజలు పక్కనపెట్టారన్నారు. మోదీ చేసిందేమి లేకపోవడంతోనే కాంగ్రెస్పై తప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి తప్పుడు విమర్శలు చేయడం తగునా అని ప్రశ్నించారు. హిందువుల పార్టీ తమదని చెప్పుకునే మోదీ అగర్బత్తీలను సైతం జీఎస్టీ నుంచి వదల్లేదని ఎద్దేవా చేశారు. ప్రజల సంక్షేమాన్ని కాంక్షించేది కాంగ్రెస్ పార్టీ అని.. వారి కోసం ఆహారభద్రత, ఉపాధిహామీ, విద్యాహక్కు వంటి చట్టాలను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. జీఎస్టీ పేరిట రూ.54లక్షల కోట్లు దండుకున్న ఘనత కేంద్రంలోని మోదీ సర్కారుదని మండిపడ్డారు. ప్రజలకు బీఆర్ఎస్, బీజేపీ చేసిందేమీ లేదని మండిపడ్డారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం 3 నెలల్లోనే 38వేల మందికి ఉద్యోగాలు కల్పించిందని గ్యారంటీలకే రేవంత్రెడ్డి గ్యారంటీ అని స్పష్టం చేశారు. -
ఐదో రోజు మూడు నామినేషన్లు
కై లాస్నగర్: పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఐదో రోజైన సోమవారం ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి సంబంధించి మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ అ భ్యర్థి ఆత్రం సుగుణ తన రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఖా నాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్, మాజీ ఎ మ్మెల్యే కోనేరు కోనప్ప, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీహరిరావుతో కలిసి నామినేషన్పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజర్షి షాకు అందజేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పట్టణంలోని రణదీవేనగర్కు చెందిన మేస్రం గంగాదేవి నామినేషన్ దాఖలు చేయగా, మరో స్వతంత్య్ర అభ్యర్థి రాథోడ్ సుభాష్ తరఫున మరో సెట్ దాఖలు చేశారు. కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో ఆర్వోకు వారు నామినేషన్ పత్రాలు అందజేశారు. దీంతో ఇప్పటి వరకు అందిన నామినేషన్ల సంఖ్య ఆరుకు చేరింది. నేడు బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ ఆదిలాబాద్టౌన్: బీఆర్ఎస్ ఆదిలా బాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు మంగళవారం నామినేషన్ వేయనున్నారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు భారీగా తరలిరానున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ● కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్కు హాజరైన మంత్రి సీతక్క -
బీజేపీది అసత్య ప్రచారం : మంత్రి శ్రీధర్బాబు
రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ.. మతతత్వ పార్టీ బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో లేని అంశాల ను ప్రస్తావిస్తూ అసత్య ప్రచారం చేస్తుందన్నారు. గడిచిన పదేళ్ల పాలనలో బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోలోని ఏ ఒక్క అంశాన్నైనా అమలు చేసిందా అని ప్రశ్నించారు. దేశ ప్రజలంతా దేవుళ్లను కొలుస్తారని, తాము అనేక గుడులను నిర్మించామన్నారు. కానీ దేవుడు మా వాడేనని మార్కెటింగ్ చేసుకునేలా బీజేపీ వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. అలాగే పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదని ఆరోపించారు. -
ఇమ్యూనైజేషన్ తీరుపై కేంద్ర బృందం పరిశీలన
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో ఇమ్యూనైజేషన్ తీరుపై కేంద్ర, రాష్ట్ర బృందం సభ్యులు పరిశీలన జరిపారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వోతో సోమవారం సమావేశం అయ్యారు. అనంతరం డీఐఈవో, జైనథ్ పీహెచ్సీని పరిశీలించారు. జిల్లాలో టీకాల అమలు తీరుపై ఆరా తీశారు. టీకాలను సక్రమంగా వేస్తున్నారా.. లేదా, కొత్త వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది, ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎంత మందికి వ్యాక్సిన్ ఇచ్చారనే అంశాలు అడిగి తెలుసుకున్నారు. పీసీవీ, రోటోవైరస్, ఐపీవీ, తదితర వ్యాక్సిన్ల అమలు తీరుపై వివరాలు సేకరించారు. బృందంలో రీజినల్ టెక్నికల్ మేనేజర్ డాక్టర్ జయంత మజుందర్, రాష్ట్ర టెక్నికల్ మేనేజర్ శ్యామ్కుమార్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
హైర్ బస్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఎదులాపురం: హైర్ బస్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని యూనియన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన హైర్ బస్ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కార్మికులను అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. సమస్యలపై పోరాడిన పలువురిని విధుల్లోకి తీసుకోకుండా నియంతృత్వంగా వ్యవహరించడం సబబు కాదన్నారు. వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఇందులో యూనియన్ నాయకులు సిర్ర దేవేందర్, సాయికుమార్, మంజూర్, ప్రీతంరెడ్డి, సతీష్, అబీబ్, అబ్బు, నర్సింగ్, నారాయణ, సతీశ్, గంగాధర్, అనిల్, ఇమ్రాన్ ఖాన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ ప్రచార రథాలు ప్రారంభం
ఆదిలాబాద్రూరల్: బీజేపీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని సోమవారం ప్రారంభించారు. మావల మండల పరిధి దుర్గానగర్లో గల దుర్గాదే వి ఆలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, పార్టీ ఎంపీ అభ్యర్థి నగేశ్ ప్రచార రథాలకు పూజలు నిర్వహించి వాహనాలను ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, మాజీ మంత్రి అమర్సింగ్ తిలావత్, పార్లమెంట్ కోఇన్చార్జి అశోక్ ముస్తాపురే, పార్లమెంట్ కోకన్వీనర్ మయూ ర్ చంద్ర, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రచార రథాలకు పూజలు చేస్తున్న ఎమ్మెల్యే శంకర్, ఎంపీ అభ్యర్థి నగేశ్ -
‘ప్రధాని మోదీకి కానుకగా ఇవ్వాలి’
బజార్హత్నూర్: లోకసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి ఆదిలాబాద్ పార్లమెంటు సీటును ప్రధాని నరేంద్ర మోదీకి కానుకగా ఇవ్వాలని ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీని మూడోసారి ప్రధానమంత్రిని చేయాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మనంద్, ప్యాక్స్ చైర్మన్ మేకల వెంకన్న, వైస్ ఎంపీపీ పోరెడ్డి శ్రీనివాస్, ఎంపీటీసీ ఈశ్వర్, నాయకులు అల్కే గణేశ్, నానం రమణ, ఎట్టం రాములు, భోజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
‘ఓపెన్’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
ఆదిలాబాద్టౌన్: ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఈవో టి.ప్రణీత అన్నారు. ఈ నెల 25 నుంచి మే2 వరకు కొనసాగనున్న పరీక్షల నిర్వహణపై తన చాంబర్లో సీఎస్, డీవోలతో సోమవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరీక్షలు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగుతాయని అ న్నారు. జిల్లాలో పది పరీక్షలకు 792 మంది, ఇంటర్ పరీక్షలకు 463 మంది అభ్యాసకులు హాజరుకానున్నట్లుగా పేర్కొన్నారు. అభ్యాసకులకు ఇబ్బందులు తలెత్తకుండా పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని సూచించారు. పది పరీక్షల కోసం 3, ఇంటర్ పరీక్షల కోసం రెండు కేంద్రాలను ఆదిలాబాద్లో ఏర్పా టు చేసినట్లుగా తెలిపారు. అభ్యాసకులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవా లన్నారు. సీఎస్, డీవో, ఇన్విజిలేటర్స్ కూడా పరీక్ష కేంద్రానికి సెల్ ఫోన్లు తీసుకురావద్దని తెలిపారు. హాల్ టికెట్లను అధ్యయన కేంద్రాల ద్వారా పొందవచ్చన్నారు. సమావేశంలో ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ ఎన్.అశోక్, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ వేణుగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పరీక్షల్లో ఫెయిలైతే మనోధైర్యం కోల్పోవద్దు●
ఆదిలాబాద్టౌన్: విద్యార్థులు పరీక్షల్లో ఫెయిలైతే మనోఽధైర్యం కోల్పోయి ఎలాంటి అఘయిత్యాలకు పాల్పడకుండా ధైర్య ంగా ఉండాలని జిల్లా ఎన్సీడీ ప్రాజెక్ట్ అధి కారి ఎం.శ్రీధర్ అన్నారు. ఇంటర్మీడియెట్ ఫలితాలు మరో రెండు, మూడు రోజుల్లో వెలువడనున్న నేపథ్యంలో సోమవారం ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. కొన్ని సందర్భాల్లో విద్యార్థులు ఆశించిన మార్కులు రాకపోవచ్చని, దాన్ని చాలెంజ్గా తీసుకొని మళ్లీ పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాలే తప్ప నిరాశ చెంది ఆత్మహత్యకు యత్నించవద్దని పేర్కొన్నారు. ఒకసారి పరీక్ష తప్పినంత మాత్రన బాధపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎంతోమంది ఇంటర్లో ఫెయిల్ అయిన వారు మళ్లీ సప్లిమెంటరీలో పాస్ అయి వైద్యులుగా, ఇంజినీర్లుగా,ఉన్నతాధికారులుగా అయ్యారని గుర్తు చేశారు. -
హత్యాయత్నం కేసులో ఒకరికి జైలు
నిర్మల్ టౌన్: హత్యాయత్నం కేసులో ఒకరికి ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ.. నిర్మల్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. కోర్టు సమన్వయ అధికారి సక్రియనాయక్ తెలిపిన విరాల ప్రకారం.. వాగ్మారే బాపురావు అతని భార్య సోనాబాయి(45) జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మీవాడలో నివాసం ఉండేవారు. అదే కాలనీకి చెందిన సికారి సంతోష్ ట్రాక్టర్ డ్రైవర్గా పని చేసేవాడు. సోనాబాయ్ సంతోష్ ట్రాక్టర్పై పనికి వెళ్లేది. ఈమె కూలి డబ్బులని సంతోష్ అప్పుడప్పుడూ వాడుకునేవాడు. ఆ డబ్బుల గురించి 2021, నవంబర్ 24 సంతోష్ను డబ్బులు ఇవ్వాలని అడిగింది. దీంతో సంతోష్ ఆమెతో గొడవపడి, దుర్భాషలాడాడు. దీంతో మనస్తాపం చెందిన సోనాబాయ్ ఇంటికి వచ్చి తండ్రి బాపురావుకు జరిగింది చెప్పింది. పిలిపించి అడుగుదామని నచ్చజెప్పారు. మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి సోనాబాయ్ సంతోష్ ఇంటి ఎదుట ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో బాపురావు నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై అరాఫత్ కేసు నమోదు చేసి విచారణ అనంతరం చార్జిషీట్ దాఖలు చేశారు. మేరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమణారావు 16 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి నేరం రుజువు చేశారు. దీంతో అదనపు సేషన్స్ జడ్జి అజేశ్కుమార్ నిందితుడికి ఐదేళ్ల కఠిన కారగార శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు చెప్పారు. -
సమస్యలు మేనిఫెస్టోలో పెట్టిన పార్టీలకే మద్దతు
ఇచ్చోడ: ఆదివాసీల సమస్యలను తమ మేనిఫెస్టోలో పొందుపర్చిన పార్టీలకే తమ మద్దతు ఉంటుందని తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగేష్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో తుడుందెబ్బ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టబద్ధతలేని లంబాడీల ఎస్టీ హోదా రద్దు చేయాలని, భూ బదాలాయింపు చట్టం 1/70, పెసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, పోడు భూములకు హక్కుపత్రాలు ఇవ్వాలని, ఐటీడీఏ ద్వారా మెగా ఏజెన్సీ డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 29న ఇచ్చోడ, 30న జైనూర్, మే 1న ఇంద్రవెల్లి, 2న ఆసిఫాబాద్, 3న ఖానాపూర్, 5న ఆదిలాబాద్, 6న నిర్మల్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో తుడుందెబ్బ రాష్ట్ర సహాయ కార్యదర్శి పుర్క బాపూరావు, జిల్లా అధ్యక్షుడు నైతం రమేశ్, జిల్లా కార్యనిర్వహణ అధ్యక్షుడు సోయం రాందాస్, జిల్లా కార్యదర్శి గేడం భరత్, జిల్లా ఉపాధ్యక్షుడు కోట్నాక్ బారిక్రావు, తదితరులు పాల్గొన్నారు. ● తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగేష్ -
క్రికెట్కు వెన్నుదన్నుగా..
మంచిర్యాలరూరల్(హాజీపూర్): పట్టణ, గ్రామీణ ఔత్సాహిక క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఆధ్వర్యంలో ఈ వేసవిలో ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో మూడు ప్రాంతాల్లో వేసవి శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. 2016 తర్వాత అంటే దాదాపు 8 ఏళ్ల తర్వాత ఉమ్మడి జిల్లాలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. పూర్తిస్థాయి సౌకర్యాల మధ్య.. క్రీడాకారుల కోసం మ్యాట్లు, నెట్తోపాటు జంబో కిట్లు అందుబాటులో ఉంచుతున్నారు. కేంద్రాల్లో నిష్ణాతులైన, సుశిక్షితులైన కోచ్లతో శిక్షణ అందించనున్నారు. కోచ్తోపాటు సహాయ శిక్షకులను నియమించి మెరుగైన శిక్షణ ఇచ్చేలా ఏర్పాటు చేశారు. క్రీడాకారులకు ప్రతీరోజు అల్పాహారం కింద అరటిపండు అందించడంతోపాటు మంచినీటి వసతి కలిపించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని శిక్షణ కేంద్రాలు.. ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర పాఠశాల మైదానం, ఆదిలాబాద్లో ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, కాగజ్నగర్లో సర్సిల్క్ మైదానంలో క్రికెట్ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా శిబిరాల్లో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే క్రికెట్ శిక్షణకు తాకిడి ప్రారంభం కాగా 25 నుంచి అధికారికంగా శిబిరాలు ప్రారంభించనున్నారు. నెల రోజులపాటు అంటే మే 25వ తేదీ వరకు శిబిరాలు కొనసాగుతాయి. ఆసక్తిగల క్రీడాకారులు మంచిర్యాల జిల్లా క్రికెట్ కోచ్ ప్రదీప్(9440010696), ఆదిలాబాద్ ఇన్చార్జి అతాఉల్లాహ్(9440207473), కాగజ్నగర్ ఇన్చార్జి శ్రీకాంత్(9492333333)ని సంప్రదించి శిక్షణకు పేర్లు నమోదు చేసుకోచాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ తెలిపారు. సద్వినియోగం చేసుకోవాలి.. క్రికెట్పై అసక్తిగల క్రీడాకారులకు ఈ వేసవిలో ఏర్పాటు చేసిన వేసవి ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. శిక్షణ కోసం ఇప్పటికే 100 మందికిపైగా పేర్లు నమోదు కాగా వివిధ ప్రాంతాల నుంచి క్రికెట్ శిక్షణకు ఆసక్తి కనబరుస్తున్నారు. శిక్షణస్థాయి పెంచి మరికొంత మందికి శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో మూడు చోట్ల వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా క్రికెట్ అసోసియేషన్ ద్వారా శిక్షణ పొందిన క్రికెట్ క్రీడాకారులు యూనివర్సిటీ, జిల్లా, అంతర్ జిల్లా స్థాయిలో ఆడారు. అండర్–23 ప్రాబబుల్ జట్టులో చోటు సంపాధించిన వారు ఉండగా ఇంకా రంజీల్లో ఆడిన వారు కూడా ఉన్నారు. ప్రత్యేక శిక్షణ అందిస్తున్న ఈ వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాలను ఔత్సాహికులు సద్వినియోగం చేసుకోవాలి. – ప్రదీప్, జిల్లా కోచ్, క్రికెట్ అసోసియేషన్ టీడీఎల్ టీ–20 లీగ్లో అవకాశం.. వేసవి క్రికెట్ శిక్షణ శిబిరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు హెచ్సీఏ ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ డిస్ట్రిక్ట్ లీగ్(టీడీఎల్) టీ–20 పోటీల్లో పాల్గొనే అవకాశం లభించనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్రికెట్ శిక్షణ జరగనున్న నేపథ్యంలో అందరితో కలిపి క్రికెట్ మ్యాచ్లు నిర్వహించి ఉమ్మడి జిల్లా సీనియర్ జట్టుకు ఎంపిక చేస్తారు. శిబిరాల్లో రాణించే క్రీడాకారులకు ఎండీసీఏ ఆధ్వర్యంలో ఈ ఏడాదిలో హెచ్సీఏ నిర్వహించనున్న అండర్–14, 16, 18, 20 విభాగాలతోపాటు ఇతర టోర్నీలకు ఎంపిక చేయనున్నారు. నైపుణ్యం కనబరిచే క్రీడాకారులకు హెచ్సీఏ టాలెంట్ హబ్ అకాడమీల్లో ప్రవేశాలు లభించే అకవాశం ఉంది. హెచ్సీఏ ఆధ్వర్యంలో డీసీఏ ఉచిత శిక్షణ శిబిరానికి వెల్లువెత్తుతున్న ఔత్సాహికులు ఎనిమిదేళ్ల తర్వాత ప్రత్యేక శిబిరాలు ఉమ్మడి జిల్లాలో మూడు చోట్ల ఏర్పాటు -
‘కుస్తీ’మే సవాల్..
సంప్రదాయ పద్ధతులతో... హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కుంటాలలో కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. మహాదేవుని ఆలయం వద్ద సంప్రదాయ పద్ధతులతో జెండాలను ప్రదర్శించి ఊరేగిస్తాం. అంబలి నైవేద్యంగా సమర్పించి విజేతను సన్మానిస్తాం. గ్రామస్తుల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేస్తాం. – జంగం మధు, మహాదేవుని ఆలయ అర్చకుడు ఆనవాయితీ కొనసాగిస్తున్నాం నా చిన్ననాటి నుంచి గ్రామంలో కుస్తీపోటీలు నిర్వహిస్తున్నారు. అదే ఆనవాయితీని ఇప్పటికీ కొనసాగిస్తున్నాం. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి మల్లయోధులు పోటీల్లో పాల్గొంటారు. అందరి సహకారంతో పోటీలు నిర్వహిస్తున్నాం. – సక్రపు చిన్నన్న, గ్రామపెద్ద, కుంటాల కుంటాల: గ్రామంలోని యువకులు ఆటల్లో పోటీతత్వాన్ని అలవర్చుకోవాలన్న ఉద్దేశంతో కుంటాలలో 80 ఏళ్లుగా గ్రామస్తుల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నారు. హనుమాన్ జయంతి, మహాదేవుని పౌర్ణమిని పురస్కరించుకుని సుమారు 80 ఏళ్లుగా అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నారు. పౌర్ణమికి ఒకరోజు ముందు మహాదేవుని ఆలయం వద్ద జెండాలను ప్రతిష్టిస్తారు. మరుసటి రోజు గ్రామస్తులు, మల్లయోధులు, ఆలయ అర్చకుల సమక్షంలో భాజా భజంత్రీలతో జెండాలను ఊరేగిస్తారు. అనంతరం కుస్తీ పోటీలను ప్రారంభిస్తారు. రేపటి నుంచి పోటీలు కుంటాలలో బుధవారం నుంచి అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు నిర్వహించనున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి మల్లయోధులు పెద్దసంఖ్యలో పోటీల్లో పాల్గొని తలపడతారు. విజేతకు గ్రామస్తులు వెండి కడియం, నగదు బహుమతిగా అందజేస్తారు. విజేతలను ఘనంగా సన్మానించి భాజా భజంత్రీలతో ఊరేగింపుగా మహాదేవుని ఆలయం వరకు తీసుకెళ్తారు. మహాదేవునికి అంబలి, నైవేద్యం సమర్పించిన అనంతరం భోజనం ఏర్పాటు చేస్తారు. నేడు బండరాయి ఎత్తే పోటీలు హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం రాత్రి వెయిట్ లిఫ్టింగ్ పోటీల మాదిరిగానే కుంటాలలో బండరాయి ఎత్తే పోటీలు నిర్వహిస్తారు. సుమారు 135 కిలోలు, 65 కిలోల బండరాయి పోటీల్లో యువకులు ఉత్సాహంగా పాల్గొంటారు. బండరాయిని ఎత్తి తమ బల ప్రదర్శన నిరూపించుకుంటారు. కుస్తీ పోటీలో తలపడుతున్న మల్లయోధులు (ఫైల్) 80 ఏళ్లుగా కుస్తీ పోటీలు రసవత్తరంగా బండరాయి పోటీలు ఆనవాయితీని కొనసాగిస్తున్న కుంటాల వాసులు -
సీఎం ప్రసంగంతో కాంగ్రెస్ ఓటమి ఖాయం
● బీజేపీ పార్లమెంటరీ ఇన్చార్జి పాయల్ శంకర్ ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగం చూస్తే రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘోరంగా ఒడిపోతున్నట్లు స్పష్టమైందని బీజేపీ పార్లమెంటరీ ఇన్చార్జి, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రాంనగర్లో పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సభలో ప్రజలకు ఉపయోగం లేని ప్రసంగం చేశారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించడం సరికాదన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే అవసరం బీజేపీకి లేదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. ఆగస్టు 15న అమలు చేస్తామని పేర్కొనడం హస్యస్పదంగా ఉందన్నారు. ఆదిలాబాద్తో పాటు రాష్ట్రంలోని 14 మంది బీజేపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందుతున్నారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ మాట్లాడుతూ తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి మచ్చలేని తనపై సీఎం రేవంత్ తప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తన అవినీతిని నిరుపిస్తే దేనికై నా సిద్ధమని సవాల్ విసిరారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇంద్రవెల్లిలో ఆదివాసీలను కాల్చిచంపారని వారే ఇప్పుడు అమరవీరులకు నివాళులర్పించడం విచా రకరమన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఆదినాథ్, నాయకులు నగేష్, లాలా మున్నా, రవి, దయాకర్, తదితరులు పాల్గొన్నారు. -
వర్ష బీభత్సం..!
● లేచిపడిన రేకులు, విరిగిపడిన చెట్ల కొమ్మలు ● విద్యుత్ సరఫరాలో అంతరాయం భైంసాటౌన్/లోకేశ్వరం/కడెం/ముధోల్/ఇంద్రవెల్లి: నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం సాయంత్రం భారీ గాలులతో కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. పలుచోట్ల చెట్ల కొమ్మలు రోడ్లపై విరిగిపడగా, దుకాణాల బోర్డులు, రేకులు గాలికి ఎగిరిపడ్డాయి. లోకేశ్వరం, ఇంద్రవెల్లి మండలాల్లో వరి, మొక్కజొన్న, నువ్వుపంటలు నేలకొరిగాయి. కల్లాల్లో ఆరబెట్టిన వరిధాన్యం, మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. కడెం మండలంలోని ఉడుంపూర్లో మూడు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ముధోల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కూలిపోయింది. ముధోల్ మండల కేంద్రం వద్ద బాసర వైపు నుంచి వస్తున్న వ్యాను, ముధోల్ నుంచి వెళ్తున్న కారు ఢీకొని రోడ్డు కిందకి దిగిపోయాయి. వ్యాన్ డ్రైవర్కు స్వల్పగాయాలైనట్లు ఎస్సై సాయికిరణ్ తెలిపారు. -
రైస్ మిల్లుల తనిఖీ
భైంసాటౌన్: రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని సకాలంలో సీఎంఆర్ చేసి అప్పగించాలని ఆర్డీవో కోమల్రెడ్డి సూచించారు. పట్టణంలోని పలు రైస్ మిల్లులను సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యం, అప్పగించిన బియ్యం తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. గడువులోగా సీఎంఆర్ అప్పగించాలని మిల్లర్లకు సూచించారు. లోకేశ్వరం మండలంలో..లోకేశ్వరం: రైస్ మిల్ యాజమానులు సీఏంఆర్ను త్వరగా అప్పగించాలని భైంసా ఆర్డీవో కోమల్రెడ్డి సూచించారు. మండలంలోని సాథ్గాం, రాయపూర్కాండ్లీ శివారు ప్రాంతాల్లోని రైస్ మిల్లులను సోమవారం తనిఖీ చేశారు. సీఎంఆర్ త్వరగా పూర్తిచేసి యాసంగి ధాన్యం కొనుగోలు చేయలన్నారు. నాణ్యమైన బియ్యం అందించాలని సూచించారు. ఆర్డీవో వెంట తహసీల్దార్ మోతీరాం, రైస్మిల్ యజమానులు ఉన్నారు. -
ముగిసిన సుమన అంత్యక్రియలు
బజార్హత్నూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు, ప్రత్యేక పోలీసు బలగాల మధ్య ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందులో ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం డేడ్ర గ్రామానికి చెందిన మావోయిస్టు దాసర్వడ్ సుమన అలియాస్ రంజిత మృతదేహనికి శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నెల 16న ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ రీజియన్ కంకేర్ జిల్లాలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఇందులో భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన మావోయిస్టు సిరిపెల్లి శంకర్రావ్ మృతదేహంతో పాటు అతడి భార్య సుమన అలియాస్ రంజిత మృతదేహం ఉండటంతో శంకరావు కుటుంబసభ్యులు రెండు మృతదేహాలను ఒకే చోట ఖననం చేస్తామని విన్నవించారు. ఈ మేరకు వారికి శంకర్రావు, రంజితల మృతదేహాలను అప్పగించారు. విషయం తెలుసుకున్న రంజిత తల్లి అంజనాబాయి గురువారం రాత్రి తన సమీప బంధువుతో కలిసి అక్కడికి చేరుకుంది. బిడ్డ మృతదేహం ఉన్న శవపేటికమీద పడి బోరున విలపించింది. అనంతరం రెండు మృతదేహాలను ఖననం చేశారు. రంజిత మూడు దశాబ్దాల మావోయిస్టు ప్రస్తానం ముగిసినట్లయింది. -
నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు
● జిల్లా ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ ● తోషంతండా, డోంగర్గావ్ గ్రామాల సందర్శనగుడిహత్నూర్: గ్రామాల్లో నీటి ఎద్దడి తలేత్తకుండా చర్యలు చేపట్టాలని జిల్లా ప్రత్యేకాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మండలంలోని తోషంతండా, డోంగర్గావ్ గ్రామాలను శుక్రవారం ఆయన సందర్శించారు. తాగునీటి వసతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి తాగునీటిని అందిస్తుందన్నారు. అయితే కొందరు అపోహల కారణంగా ఆ నీటిని తాగునీటికి వినియోగించడం లేదన్నారు. నీరు కలుషితంగా కనిపిస్తే వెంటనే పంచాయతీ అధికారులు, ఎంపీడీవోకు సమాచారం అందించాలన్నారు. నీటి ఎద్దడి ఉన్న గ్రామాలను గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బావులు ఎండిన చోట సమీప వ్యవసాయ క్షేత్రాల నుంచి నీరు సరఫరా చేయాలన్నారు. ఒకవేళ ఈ సౌకర్యం కూడా లేనట్లయితే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ట్రెయినీ కలెక్టర్ వికాస్ మహతో, మిషన్ భగీరథ ఎస్ఈ సురేశ్, ఈఈ చంద్రమోహన్, నీటిపారుదల శాఖ ఎస్ఈ విఠల్, డీఎల్పీవోలు ఫణిందర్, ప్రభాకర్, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏఈలు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. -
ఎన్నికల వ్యయం పకడ్బందీగా నమోదు చేయాలి
● జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు వివేకానంద కై లాస్నగర్: ఎన్నికల ప్రచారానికి పార్టీ ద్వారా, అ భ్యర్థి తరఫున ఖర్చుచేసే ప్రతీ పైసా ఎన్నికల వ్య యం కింద నమోదు చేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు జాదావార్ వివేకానంద అన్నారు. జిల్లా కేంద్రంలోని పెన్గంగ గెస్ట్హౌస్ నుంచి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అధికారులతో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో చేసే ఖర్చుల వివరాలు పక్కాగా నమోదు చేయాలన్నారు. ఎస్ఎస్టీ, వీఎస్టీ, ఎస్ఎస్టీ అకౌంటింగ్ టీం సభ్యులు సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు. అనుమానాస్పద బ్యాంకు ఖాతాలను తనిఖీ చేయాలన్నారు. ఎంసీఎంసీ ద్వారా ఎన్నికల్లో చేసిన ప్రకటనలకు ఈసీ విడుదల చేసిన రేట్ల ప్రకారం ఎన్నికల వ్యయంగా నమోదు చేయాలన్నారు. అలాగే రోజువారిగా దినపత్రికల్లో వచ్చే పెయిడ్ న్యూస్పై దృష్టి సారించాలని, సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. కార్యక్రమంలో నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు అశిష్ సంగ్వాన్, వెంకటేష్ దోట్రే, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Pagination
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
బజరంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ వేటు
Lok Sabha Election 2024: ఎలక్షన్ టూరిజం జోరు!
జ్యోతి యర్రాజీకి స్వర్ణం
కృష్ణమ్మ నదిలో మలుపుల్లా...
నేడు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ఇలా..
కన్నప్ప సెట్స్లో...
Lok Sabha Election 2024: పెరిగేదే లే!
ప్రభుత్వానిది నియంతృత్వ ధోరణి అనడం దుర్మార్గం
అవకాశవాది, అబద్దాలకోరు, కుట్రదారు చంద్రబాబే
క్యాంపస్ సెలక్షన్స్లో టాప్
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: జేడీయూ వర్సెస్ జేడీయూ!
- Lok Sabha Election 2024: నువ్వా నేనా?!
- Lok Sabha Election 2024: ఎలక్షన్ టూరిజం జోరు!
- ప్రభుత్వానిది నియంతృత్వ ధోరణి అనడం దుర్మార్గం
- అవకాశవాది, అబద్దాలకోరు, కుట్రదారు చంద్రబాబే
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
Advertisement