-
అన్నమయ్య జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో భారీ బందోబస్తు
-
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)
-
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)
-
ఆంధ్రప్రదేశ్లో డబుల్ సెంచురీకి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటన... వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు నెగ్గాలని పిలుపు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ప్రజలతో మమేకమవుతున్న జగన్, నేనున్నానంటూ సీఎం భరోసా
-
YSRCP అన్నమయ్య జిల్లా అభ్యర్థులు వీళ్లే
అన్నమయ్య జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
అన్నమయ్య జిల్లా: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
సాక్షి, అన్నమయ్య జిల్లా: మదనపల్లి-బెంగుళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కార్పియో వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఐదుగురి మృతి చెందారు. మదనపల్లి మండలం బార్లపల్లి వద్ద ఘటన జరిగింది. -
బిల్డప్ బాబాయ్ అసలు గుట్టు బట్టబయలు
మదనపల్లె: మదనపల్లె టీడీపీ రేసులో ఉన్న బిల్డప్ బాబాయ్ కోడికొళ్ల అమరనాథ్ అసలు గుట్టు బయటపడింది. అతని ప్రధాన అనుచరుడు రాయల్ గణి మీడియా సమావేశం పెట్టి అతని చిట్టా బయటపెట్టాడు. అరచేతిలో స్వర్గం చూపించే రకం అమర్నాథ్.. గోబెల్స్ ప్రచారంలో చంద్రబాబునే మించిపోయి నియోజకవర్గ ప్రజలను మోసగించేందుకు పలు గిమ్మిక్కులకు పాల్పడ్డాడు. వీటన్నింటిని అతని అనుచరుడు రాయల్ గణి మంగళవారం మీడియాకు వెల్లడించాడు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పీటీఎం మండలం రంగసముద్రానికి చెందిన వ్యక్తి కోడికళ్ల అమరనాథ్ గతంలో రైతుల నుంచి చీనీ, మామిడి, వేరుశెనగ కొనుగోలు వ్యాపారం చేసేవాడు. రైతులకు డబ్బులివ్వకుండా మోసం చేయడంతో మదనపల్లెతో పాటు కర్నాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో పలు స్టేషన్లలో అతనిపై 420, చెక్బౌన్స్ కేసులు నమోదయ్యాయి. ఎనిమిదేళ్ల క్రితం మదనపల్లె వన్టౌన్లో కేసు నమోదయ్యాక బెంగళూరు పారిపోయి కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్నాడు. ఎన్నికలు దగ్గర పడడంతో ఇప్పుడు బెంగళూరు నుంచి అద్దె గన్మెన్లు, బౌన్సర్లను వెంటేసుకుని హఠాత్తుగా మదనపల్లెలో ప్రత్యక్షమయ్యాడు. పట్టణానికి చెందిన రాయల్ గణిని వెంటేసుకుని టీడీపీ నాయకుడిగా ప్రచారం చేసుకుంటూ ఎల్లో మీడియాలో పబ్లిసిటీ చేసుకున్నాడు. ఆదికేశవులునాయుడు కుటుంబానికి సన్నిహితుడినని, బలిజ సామాజికవర్గం నుంచి తనకు అవకాశం కల్పించాలని టీడీపీ ముఖ్యనాయకుల్ని కలిసి అభ్యర్థించాడు. చంద్రబాబు దృష్టిలో పడేందుకు గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టాడు. బాబు సీఎం కావాలని 10 వేల మంది ముస్లింలకు అజ్మీర్ యాత్ర చేయిస్తున్నానని, దానికి రూ.కోటి చెక్కు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకున్నాడు. 20 వేల మంది హిందువులను కాశీయాత్రకు సొంత ఖర్చులతో పంపుతానని, పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చాడు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా మదనపల్లె నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీకి సీతారామ లక్ష్మణ పంచలోహ విగ్రహాలు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకున్నాడు. లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గంలో హడావుడి చేశాడు. ఇటీవల పీలేరులో జరిగిన ‘రా కదలిరా’ సభలో చంద్రబాబు దగ్గరకు వెళ్లి చెవిలో ఏదో చెబుతున్నట్లు నటించి, ఫొటోలు తీయించుకుని, బాబుకు అత్యంత సన్నిహితుడినని ప్రచారం చేసుకున్నాడు. అయితే రాయల్గణితో అతనికి తేడా రావడంతో మీడియా ముందు అతని శిష్యుడే అక్రమాల్ని వెల్లడించాడు. అమర్నాథ్ పెద్ద మోసగాడని, ఆదికేశవులునాయుడు కుటుంబానికి, అతనికి ఏమీ సంబంధం లేదని గణి తెలిపాడు. అంబానీ, అదానీ, అమిత్షాతో తనకు వ్యాపార లావాదేవీలున్నాయని చెప్పడం పచ్చి అబద్ధమని, అతడిపై పలు రాష్ట్రాల్లో కేసులున్నాయని వెల్లడించాడు. అజ్మీర్ యాత్ర పేరుతో రూ.కోటి చెక్కు డ్రామా అని తెలిపాడు. అతని విషయం తెలిసిన టీడీపీ శ్రేణులు ముక్కున వేలేసుకుంటున్నాయి. ఇదీ చదవండి: టీడీపీ ‘ఐ’ గేమ్..! -
అన్నమయ్య జిల్లా కలికిరిలో టీడీపీ నేతల గూండాగిరి
సాక్షి, అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేతలు అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. కలికిరిలో టీడీపీ జాతీయ కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడు అవినాష్ రెడ్డి నేతృతంలో దళితుల గృహ నిర్మాణాలపై దాడులకు పాల్పడారు. ఈ ఘటనలో ఇరువురు గాయపడ్డారు. దళితుల వాహనాలను కూడా ధ్వంసం చేసి.. బీరు బాటిల్స్తో బీభత్సం సృష్టించారు. సర్వేనెంబర్1098/2 గృహ నిర్మాణాలను పచ్చమూకలు ధ్వంసం చేశాయి. కన్నీరు మున్నీరుగా బాధితులు విలపిస్తున్నారు. టీడీపీ నేత అవినాష్రెడ్డి తోపాటు దాడిలో పాల్గొన్న వారిపై పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే టీడీపీ గుండాలను అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
రణన్నినాదం
సాక్షి, రాయచోటి: ఇన్నాళ్లూ సామాజిక సాధికారత అంటే ఒక నినాదంగానే వింటూ వచ్చామని, కానీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే దాన్ని ఒక విధానంలా అమలు చేశారని బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీ నేతలు కొనియాడారు. సామాజిక విప్లవమే జగనన్న విధానం అని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో గురువారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. సభకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. రింగ్రోడ్డు సర్కిల్ నుంచి శివాలయం వరకు మెయిన్రోడ్డు మీదుగా వేలాది మందితో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మైనార్టీలకు ఎంతో మేలు మైనార్టీలకు సీఎం జగన్ చేసిన మేలు అంతా ఇంతా కాదని డిప్యూటీ సీఎం అంజాద్బాషా, శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియాఖాన్ చెప్పారు. ఆయన చేసిన మేలును ముస్లిం మైనార్టీ వర్గాలు ఎప్పటికీ మరిచిపోవన్నారు. దేశ చరిత్రలో ముస్లింలకు న్యాయం చేస్తున్న ఏకైక సీఎం జగనేనని వారు కొనియాడారు. పేదల బతుకుల్లో వెలుగులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదల బతుకుల్లో జగనన్న వెలుగులు నింపారని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కోసం ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి దొరకడం మన అదృష్టమన్నారు. జగనన్నలా ఏ ఒక్కరూ చేయలేదు..: రాజ్యాంగ పదవుల్లో బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్దేనని మాజీ మంత్రి అనిల్కుమార్యాదవ్, ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు తెలిపారు. ఎవరూ ఊహించని రీతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్లో పెద్దపీట వేశారని కొనియాడారు. ఎంతోమందిని ఎమ్మెల్యేలుగా, మేయర్లుగా, మునిసిపల్ చైర్మన్లుగా చేశారన్నారు. డీబీటీ రూపంలో దాదాపు రూ.2.4 లక్షల కోట్లు వారి ఖాతాల్లో వేశారని చెప్పారు. సంక్షేమ సారథి.. జగనన్న రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అందిస్తూ సీఎం జగన్ పేదల గుండెల్లో సంక్షేమ సారథిగా నిలిచిపోయారని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి చెప్పారు. అభివృద్ధి పనులతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. అన్నమయ్య జిల్లా అంటే రాయచోటి అని గుర్తు వచ్చేలా చేసిన ముఖ్యమంత్రి జగన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాయచోటి నియోజకవర్గానికే ఈ నాలుగున్నరేళ్లలో రూ.1,289 కోట్ల ప్రయోజనం కల్పించారని వెల్లడించారు. -
రాయచోటి: సామాజిక జైత్రయాత్ర.. ఇదీ సీఎం జగన్ పాలన ఘనత
సాక్షి, అన్నమయ్య జిల్లా: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తోన్న మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర విజయవంతంగా సాగుతోంది. రాయచోటిలో గురువారం మధ్యాహ్నం సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ బస్సు యాత్రలో పలువురు మంత్రులతో పాటు ఇతర రాష్ట్ర స్థాయి నాయకులు హాజరయ్యారు. మధ్యాహ్నం రింగ్రోడ్డు నుంచి బంగ్లా వరకు ర్యాలీ కొనసాగింది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రజాప్రతినిధులు, నేతలు మాట్లాడారు. బీసీల పేరు చెప్పుకుని చంద్రబాబు మోసం: అంజాద్ బాషా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ, గతంలో చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లతో గెలిచి అన్యాయం చేశారని మండిపడ్డారు. 14 ఏళ్లు పని చేసిన చంద్రబాబు టీడీపీ బీసీల పార్టీ అంటాడు.. బీసీల పేరు చెప్పుకుని మోసం చేశాడు. మన ఓట్లతో గెలిచి మనల్ని మోసం చేశారు. మోసం చేసిన చంద్రబాబు లాంటి వ్యక్తి కావాలా? సామాజిక న్యాయం చేసిన సీఎం జగన్ కావాలా? అని ప్రశ్నించారు. మైనార్టీని మంత్రి చేయని వ్యక్తి చంద్రబాబు. అదే సీఎం జగన్ నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేను చేసి డిప్యూటీ సీఎంను చేశాడు. రాయచోటికి చెందిన జకియా ఖానమ్ను శాసన మండలి డిప్యూటి ఛైర్మన్ను చేశారు. చరిత్ర రాయాలంటే వైఎస్ కుటుంబానికే సాధ్యమౌవుతుంది. అందరిని నా వాళ్లు అని పిలిచే ఏకైక వ్యక్తి వైఎస్ జగన్. రాయచోటి ఈ ఐదేళ్లలో ఎంతో అభివృద్ది చెందింది. రాయచోటి అభివృద్దిలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కృషి ఎంతో ఉంది’’ అని అంజాద్ బాష ప్రశంసించారు. రానున్న ఎన్నికల్లో నక్కలు, కుక్కలు, పందులు ఏకమవుతున్నాయి. అయినా భయపడేది లేదు .. సింహం వైఎస్ జగన్ సింగిల్గా వస్తారు. 175 స్దానాల్లో వైఎస్సార్సీపీ గెలుస్తుంది. 175 స్దానాల్లో టీడీపీకి అభ్యర్దులు లేరు. మేము ఏరిపారేస్తే వారికి టికెట్లు ఇవ్వాలని చూస్తున్నారు’’ అని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. ఇదీ సీఎం జగన్ పాలన ఘనత: ఎంపీ సురేష్ వైఎస్సార్ ఫ్యామీలిని నమ్మి మోసపోయిన వారు ఎవరు లేరని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. చంద్రబాబును నమ్మి మోసపోయిన వారు ఎంతో మంది ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ తేడా చూసి వైఎస్సార్సీపీని గెలిపించండి. సీఎం వైఎస్ జగన్ కోసం పోరాడే సైనికుడు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. ఇప్పుడు మన పిల్లలు ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతున్నారంటే ఇది సీఎం జగన్ పాలన ఘనత. కార్యాలయాల చుట్టూ తిరగకుండా పథకాలు అందిస్తున్న వ్యక్తి జగన్’’ అని ఎంపీ సురేష్ పేర్కొన్నారు. -
నేడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో సామాజిక సాధికార యాత్ర
-
నేడు చోడవరం, రాజంపేట నియోజకవర్గాల్లో సాధికార యాత్ర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతంగా సాగుతోంది. మంగళవారం అనకాపల్లి జిల్లాలో చోడవరం, అన్నమయ్య జిల్లాలో రాజంపేట నియోజకవర్గాల్లో సామాజిక సాధికార యాత్ర జరుగుతుంది. బడుగు, బలహీన, వెనుకబడిన, మైనార్టీ వర్గాలకు సీఎం జగన్ చేసిన మేలును యాత్రలో ఆ వర్గాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు వివరించనున్నారు. -
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె తెలుగుదేశంలో గందరగోళం
-
తంబళ్లపల్లెలో సంక్షేమ యాత్ర
బి.కొత్తకోట: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన చర్యల ఫలితం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో ప్రతిబింబించింది. శుక్రవారం నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార యాత్రకు బడుగు, బలహీన వర్గాల ప్రజలు వెల్లువెత్తారు. సీఎం జగన్ తమకు చేసిన మేలును వివరిస్తూ యాత్రలో సాగారు. పీటీఎం నుంచి మద్దయ్యగారిపల్లె వరకు పాదయాత్ర సాగింది. అనంతరం ములకలచెరువులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో పెద్ద ఎత్తున పాల్గొని, జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును మంత్రులు, నాయకులు వివరించారు. సామాజిక సాధికారతను నిజం చేసిన సీఎం జగన్: మంత్రి మేరుగు ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకూ మేలు చేసి ప్రతి గుండెలో సీఎం వైఎస్ జగన్ ఉన్నారని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. జ్యోతిరావు పూలే, అంబేడ్కర్ కలలుగన్న సామాజిక సాధికారతను సీఎం జగన్ ఆచరణలో నిజం చేస్తున్నారని అన్నారు. దేశ ప్రధానులకే సాధ్యంకాని సామాజిక విప్లవానికి సీఎం వైఎస్ జగన్ నాంది పలికారని అన్నారు. చంద్రబాబు 2014లో 645 హామీలతో గెలిచి ప్రజలను మోసం చేశారన్నారు. 2024లో మరోసారి మోసం చేసేందుకు బాబు వస్తున్నారని, ప్రజలు మోసపోవద్దని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆర్థికంగా, రాజకీయంగా మరింతగా ఎదగడానికి సీఎం జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. జగన్తోనే స్వాతంత్య్రం: మంత్రి గుమ్మనూరు జయరాం 75 ఏళ్ల స్వాతంత్య్ర చరిత్రలో సీఎం వైఎస్ జగన్ పాలనలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్వాతంత్య్రం వచ్చిందని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. బీసీల్లోని అన్ని వర్గాలకు సీఎం జగన్ అండగా నిలుస్తున్నారని చెప్పారు. జగన్ అనే శక్తి లేకపోతే, పార్టీ పెట్టకపోతే ఈ మార్పు ఉండేది కాదని అన్నారు. స్కీం సీఎం జగన్ : మంత్రి ఉషశ్రీ చరణ్ ఏపీలో స్కీం సీఎం జగన్ అయితే స్కాం సీఎం చంద్రబాబు అని మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. మహిళలను కార్పొరేషన్ చైర్మన్లు చేసిన ఘనత జగన్దేనని చెప్పారు. కనకదాస్, వాల్మికి జయంతిని అధికారికంగా నిర్వహించి గౌరవం పెంచారన్నారు. టీడీపీ నేతల మాటలు ఎవరూ వినడంలేదు: మాజీ మంత్రి అనిల్ కుమార్ చంద్రబాబును స్థానిక ఎన్నికల్లో సొంత జిల్లా చిత్తూరు ప్రజలే తిప్పికొట్టారని, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ,బీసీలు మైనార్టీలంతా వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ పేర్కొన్నారు. నెల్లూరు గడ్డపై ఓ బీసీకి టికెట్ ఇచ్చి రెండుసార్లు గెలిపించి మంత్రిగా చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. కష్టంతో పాలు పోసిన వారి ఆదాయంతో చంద్రబాబు హెరిటేజ్ ఆస్తులు పెరిగాయని అన్నారు. ఎన్నికల్లో కిలో బంగారం, బెంజి కారు ఇస్తామని చెబుతారని, అలాంటి వారి మాటలకు మోసపోవద్దని కోరారు. సామాజిక సాధికార యాత్రలో నల్ల రిబ్బన్లతో నిరసనలు తెలపాలని టీడీపీ నేతలంటున్నారని, వారి మాటలు ఎవరూ వినడంలేదని చెప్పారు. -
‘ఏపీలో సామాజిక విప్లవం.. ఆ ఘనత సీఎం జగన్దే’
సాక్షి, అన్నమయ్య జిల్లా: తంబళ్లపల్లెలో ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర కొనసాగింది. మధ్యాహ్నం కేజీఎన్ ఫంక్షన్ హాలులో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం బైక్ ర్యాలీ ప్రారంభమైంది. మాదవయ్యగారి పల్లె, పులికల్లు మీదుగా బైక్ ర్యాలీ కొనసాగింది. సాయంత్రం ములకలచెరువులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని అభివృద్ది సీఎం జగన్ పాలనలోనే జరిగిందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ‘‘జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగింది. వెనుకబడిన వర్గాలకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. విద్య, వైద్య రంగాల్లో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తెచ్చారు. నాలుగున్నరేళ్లుగా జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారు. వెనుకబడిన వర్గాల సాధికారతే సీఎం జగన్ లక్ష్యం. ఏపీలో సామాజిక విప్లవానికి నాంది పలికిన నేత వైఎస్ జగన్. ఆయన పాలనలో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు న్యాయం చేసిన ఘనత జగన్దే’’ అని మంత్రి కొనియాడారు. ‘‘దళితులను అడుగడుగునా అవమానించిన వ్యక్తి చంద్రబాబు. అర్హత ఉంటే చాలు అన్ని సంక్షేమ పథకాలు అందించిన నాయకుడు జగన్. లక్షా 76 వేల కోట్లు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఖాతాల్లో జమ చేశాం. రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశాడు. ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు, పవన్ మళ్లీ కలిసొస్తున్నారు. చంద్రబాబు, పవన్లకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’’ అని మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. చదవండి: పురందేశ్వరి చంద్రముఖిలా మారిపోయారు: మంత్రి సీదిరి -
నేడు అన్నమయ్య జిల్లాలో సామాజిక జైత్రయాత్ర
-
వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సుయాత్ర.. 13వ రోజు షెడ్యూల్
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్రకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. నేడు(శుక్రవారం) 13వ రోజు సామాజిక సాధికారిత బస్సుయాత్ర పార్వతీపురం, పెదకూరపాడు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో కొనసాగనుంది. ఉదయం గం. 10.30ని.లకు సీతానగరం మండలం లచ్చయ్యపేటలో వైఎస్సార్సీపీ నేతల విలేకర్ల సమావేశం ఉంటుంది. ఉదయం 11గంటలకు కాశయ్యపేట సచివాలయాన్ని వైఎస్సార్సీపీ నేతలు సందర్శించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్వతీపురం పాత బస్టాండ్ వద్ద బహిరంగ సభ జరుగనుంది. ఈ సభలో పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ సహా పలువురు పార్టీ నేతలు పాల్గొననున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడులో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ధరణికోటలో వ్యాపార, ఉద్యోగ ప్రతినిధులతో పార్టీ నేతలు సమావేశం కానున్నారు.మధ్యాహ్నం 3 గంటలకు విలేకర్ల సమావేశం, గం. 3.45ని.లకు ధరణికోట బేబీ గార్డెన్స్ నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. సాయంత్రం గం. 4L45ని.లకు గ్రామ సచివాలయాన్ని వైఎస్సార్సీపీ నేతలు సందర్శించనున్నారు. సాయంత్రం గం. 5:30 ని.లకు అమరావతిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లోలో ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం గం. 12:15ని.లకు పెద్దతిప్పసముద్రం నుండి బైక్ ర్యాలీ, ఒంటి గంటకు కేజీఎన్ ఫంక్షన్ హాలులో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ఉంటుంది. మధ్యాహ్నం గం. 2:30 ని.లకు బైక్ ర్యాలీ ప్రారంభం అవుతుంది. మాదవయ్యగారి పల్లె, పులికల్లు మీదుగా బైక్ ర్యాలీ తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు ములకలచెరువులో బహిరంగ సభ నిర్వహించనున్నారు. -
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం కుమారుడి వివాహ వేడుకలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్
-
వైఎస్సార్ జిల్లా పర్యటన..షెడ్యూల్ ఇదే
-
ఈరోజు, రేపు అన్నమయ్య, YSR జిల్లాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
రేపు సొంత జిల్లాకు సీఎం జగన్.. రెండు రోజుల పర్యటన
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజులపాటు సొంత జిల్లాల్లో పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు 09, 10వ తేదీల్లో ఆయన అక్కడికి వెళ్లనున్నారు. గురువారం అన్నమయ్య జిల్లా రాయచోటిలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం కుమారుడి వివాహ వేడుకలో సీఎం జగన్ పాల్గొంటారు. ఆపై మాజీ ఎంపీపీ కుటుంబ సభ్యుల వివాహ వేడుకలోనూ పాల్గొంటారు. అటు నుంచి సొంత నియోజకవర్గం పులివెందుల(వైఎస్ఆర్ జిల్లా)లో శ్రీకృష్ణుడి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. పులివెందులలోనే శిల్పారామంను ప్రారంభిస్తారు. ఆపై శ్రీస్వామి నారాయణ్ గురుకుల్ స్కూల్కు సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. ఏపీ కార్ల్ ప్రాంగణంలో అగ్రిక్లచర్, హార్టికల్చర్ కాలేజీలు స్టేట్ ఆఫ్ ఆర్ట్సెంట్రల్ టెస్టింగ్ లేబరేటరీ, అగ్రికల్చర్ హార్టికల్చర్ ల్యాబ్లను ప్రారంభిస్తారు. ఆపై ఆదిత్య బిర్లా యూనిట్ను సీఎం జగన్ సందర్శిస్తారు. అనంతరం సీవీ సుబ్బారెడ్డి నివాసానికి వెళ్తారు. ఆ రాత్రికి ఇడుపులపాయ వైఎస్ఆర్ ఎస్టేట్ గెస్ట్హౌజ్లో బస చేస్తారు. ఇక 10వ తేదీ ఇడుపులపాయలో ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్ను సీఎం జగన్ ప్రారంభిస్తారు. అనంతరం ఎకో పార్క్ వేముల మండలం ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతారు. -
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, అన్నమయ్య: ఘోర ప్రమాదంతో జిల్లాలో రోడ్డు నెత్తురోడింది. తిరుమల నుంచి ఇంటికి వెళ్తున్న భక్తుల వాహనం.. లారీతో ఢీ కొట్టింది. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. కొందరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. శనివారం తెల్లవారు ఝామున పీలేరు సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. మృతులు.. బాధితులను కర్ణాటక వాసులుగా పోలీసులు నిర్ధారించారు. కర్ణాటక బెల్గాం జిల్లా అత్తిని మండలం బడచిగ్రామానికి చెందిన 14 మంది.. తిరుమల దర్శనం కోసం ఓ తుఫాన్ వాహనంలో వచ్చారు. దర్శనం అనంతరం తిరిగి వెళ్తుండగా.. తెల్లవారు మూడు గంటల సమయంలో మఠంపల్లి క్రాస్(కె.వి పల్లి మండలం) వద్ద వాళ్ల వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని తొలుత పీలేరు ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం.. తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. -
Live : బాబు కేసు & పాలిట్రిక్స్ అప్డేట్స్.. Click & Refresh
Updates.. 06:10 PM రాజమండ్రి : లాయర్ సిద్ధార్థ్ లూథ్రాపై ఫిర్యాదు ►బాబు లాయర్ సిద్ధార్థ లూద్రాపై రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ►రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన న్యాయవాదే రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తున్నారని ఫిర్యాదు ►మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌతు సూర్యప్రకాశరావు ఫిర్యాదు 06:10 PM రాజమండ్రి : బాలయ్య బిజీ బిజీ ►కుటుంబ సభ్యులు, పార్టీ ముఖ్యనేతలతో బాలకృష్ణ సమావేశం ►చంద్రబాబు, పవన్ మధ్య జరిగిన చర్చల ప్రస్తావన ►రెండు రోజుల్లో విజయవాడలో టీడీపీ, జనసేన నేతల మీటింగ్ ► క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలపై చర్చ ► కొందరికి టికెట్లు ఇవ్వకపోతే వచ్చే అసంతృప్తిపై చర్చ ► రెండు పార్టీల క్యాడర్ సహకరించుకుంటారా? విభేదించుకుంటారా? ►ఈ నెల 19న చంద్రబాబు కేసు విచారణ తర్వాత అప్పటి పరిస్థితులను అనుగుణంగా ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలు 06:10 PM రాజమండ్రి ►రేపట్నుంచి సెలవులో రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ ►తన భార్య అనారోగ్యం దృష్ట్యా సెలవు తీసుకున్న సూపరింటెండెంట్ ►కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ కు జైలు ఇన్ ఛార్జ్ బాధ్యతలు 05:30 PM విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ►పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది గింజుపల్లి సుబ్బారావు ►బెయిల్ పిటిషన్ పరిశీలించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ►కస్టడీ పిటిషన్ పై హైకోర్టు ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చిందన్న న్యాయమూర్తి ►కస్టడీ పిటిషన్ కు, బెయిల్ కు సంబంధం లేదన్న న్యాయవాది సుబ్బారావు ►పిటిషన్కు లిస్టింగ్ ఇచ్చి కౌంటర్ దాఖలు చేయాలని CIDకి సూచించిన కోర్టు 04:46 PM పేర్ని నాని, వైఎస్సార్సిపి ప్రెస్మీట్ ►చంద్రబాబును ఓదార్చడానికి పవన్ వెళ్లాడనుకున్నాం ►పవన్ చంద్రబాబును ఓదార్చడానికి వెళ్లాడా? ►చంద్రబాబుతో బేరం మాట్లాడ్డానికి వెళ్లాడా? ►చంద్రబాబుతో ములాఖత్ కాదు మిలాఖత్ అని తేలింది ►బీజేపీతో పవన్ ది తాత్కాలిక పొత్తు మాత్రమే ►తెలుగుదేశంతోనే పవన్ కు శాశ్వత పొత్తు ►పవన్ కు క్లారిటీ ఉంది... బీజేపీకే లేదు ►బీజేపీ ఎప్పటికప్పుడు పిల్లిమొగ్గలు వేస్తోంది ►పవన్ పొత్తు పాత వార్తే... ఇందులో కొత్తదనం లేదు ►తెలుగుదేశం పార్టీలో పవన్ కళ్యాణ్ అంతర్భాగం ►కలవడం, విడిపోవడం కేవలం ముసుగు మాత్రమే ►చంద్రబాబుతో పవన్ వ్యాపారం మాట్లాడుకుని వచ్చాడా? ►తన కార్యకర్తలకైనా పవన్ ఈ విషయం చెప్పాలి ►పవన్ పరామర్శకు జైలుకు వెళ్లి డీల్ చేసుకుని వచ్చారు ►ప్రజాధనం దోచుకున్న దొంగను పవన్ పరామర్శిస్తాడా? ►ఇదేనా పవన్ చెప్పిన జనసేన సిద్ధాంతం? ►అవినీతిపై పవన్ రాజీ లేని పోరాటం చేస్తానన్నాడు ►మరి అవినీతిపరుడైన చంద్రబాబుకు ఎలా మద్దతు ప్రకటిస్తాడు ►తాను దోచుకున్న డబ్బులో లోకేష్ వాటా ఇస్తానని చెప్పాడా? ►లోకేష్ తో సీట్లేనా లేక లెక్కలు కూడా పంచుకున్నారా? ►తనను నమ్ముకున్న వారిని మోసం చేసి పవన్ లాభపడుతున్నాడు ►సినిమాల్లోనే పవన్ హీరో... బయట మాత్రం జోకర్ ►25 స్థానాలకు పవన్ అభ్యర్ధులను సప్లై చేస్తాడు 04:00 PM ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ► స్కిల్ స్కామ్ లో రూ.371 కోట్ల అవినీతి జరిగింది ► ఈ స్కామ్ లో మొత్తం 10 కీలక అంశాలు ఉన్నాయి ► నిబంధనలకు విరుద్ధంగా నిధులను రిలీజ్ చేశారు ► అధికారుల అభ్యంతరాలను నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు ► తప్పుడు డాక్యుమెంట్స్ తో ఒప్పందాలు చేసుకున్నారు ► ప్రభుత్వ జీవోకు, అగ్రిమెంట్ కు చాలా తేడాలు ఉన్నాయి ► అగ్రిమెంట్ లో జీవో నెంబర్ ను చూపించలేదు ► జీవోలో ఉన్న అంశాలు అగ్రిమెంట్ లో లేవు ► సీమెన్స్ కంపెనీ ట్రైనింగ్ మాడ్యూల్ డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు ► ఎక్కడా కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ పెడతామని చెప్పలేదు ► కేబినెట్ అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు ► కార్పొరేషన్ ఏర్పాటులో విధివిధానాలు పాటించలేదు ► స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో ఖజానాను దోచేశారు ► రూ.3,300 కోట్లు ఫ్రీగా సీమెన్స్ ఇస్తుందని చెప్పారు ► ప్రభుత్వం కేవలం 10 శాతం ఇస్తే సరిపోతుందన్నారు ► ఏపీ ఖజానా నుండి రూ.371 కోట్లు డిజైన్ టెక్ కు చెల్లించారు ► పైలట్ ప్రాజక్టు అమలు చేయాలన్న అధికారుల వాదనను పట్టించుకోలేదు 03:13 PM లోకేష్, బాలకృష్ణ ప్రెస్మీట్ లోకేష్ ► జనసేనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాం ► ఉమ్మడి కార్యాచరణ రేపటి నుంచే అమల్లోకి వస్తుంది ► సీట్ల పంపిణీతో పాటు అన్ని అంశాలు చర్చించుకుంటాం ► కొందరు అధికారులపై సివిల్ వార్ ప్రకటిస్తున్నాను ► చంద్రబాబు కట్టిన జైలులో ఆయన్నే పెడతారా? ► పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని రోడ్డుపైనే కూర్చోబెడితే ఎలా? ► జనసేనతో కలిసి సివిల్ వార్ ప్రకటిస్తున్నాం బాలకృష్ణ ►అన్న ఎన్టీఆర్ తెలుగువారికి ఆత్మగౌరవం తెచ్చారు ►చంద్రబాబు చాలా ఇన్నోవేటివ్, ఎక్కడా సంతకం పెట్టలేదు ►ఏ చట్ట ప్రకారం అరెస్ట్ చేశారో చెప్పాలి ►యువగళంలో లోకేష్కు వస్తున్న ఆదరణ చూసి బాబును అరెస్ట్ చేశారు 03:13 PM బాబు బెయిల్ పిటిషన్పై నోటీసులు జారీ ►చంద్రబాబు బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి ఏసీబీ కోర్టు నోటీసులు ►స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు తరపు న్యాయవాదులు . ►అయితే.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉండగా బెయిల్ పిటిషన్ ఎలా వేశారని ప్రశ్నించిన ఏసీబీ కోర్టు ►సీఐడీ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత విచారణ జరిగే అవకాశం 03:05 PM పొత్తు విషయం అధిష్టానం చూసుకుంటుంది: బీజేపీ ►పవన్ పొత్తు వ్యాఖ్యల పై స్పందించిన ఏపీ బీజేపీ ►పొత్తుల అంశం బీజేపీ జాతీయ నాయకత్వం చూసుకుంటుంది ►ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనేది కేంద్ర నాయకత్వం చూసుకుంటుంది ►ప్రస్తుతానికి జనసేనతో మాత్రమే బీజేపీ పొత్తు ఉంది : ఏపీ బీజేపీ ►తెలుగుదేశంతో ఎలాంటి పొత్తు లేదు : ఏపీ బీజేపీ 03:00 PM లోకేష్, బాలకృష్ణ పోటాపోటీ భేటీలు ► అందుబాటులో ఉన్న టీడీపీ నేతలతో పవన్, లోకేశ్, బాలకృష్ణ సమాలోచనలు ► రేపటి నుంచి ఉమ్మడి కార్యాచరణ ఏ విధంగా తీసుకెళ్లాలనే అంశంపై బాలకృష్ణ చర్చ 02:36 PM చంద్రబాబు కుటుంబంతో పవన్ భేటీ ► పరామర్శ పేరిట.. చంద్రబాబు కుటుంబ సభ్యులతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ►చంద్రబాబు భార్య భువనేశ్వరి, బాబు తనయుడు నారా లోకేష్, లోకేష్ సతీమణి బ్రహ్మణి, చంద్రబాబు బామ్మర్ది నందమూరి బాలకృష్ణ ఉన్నారు. ► అంతకు ముందు రాజమండ్రి సెంట్రల్ జైలులో.. ములాఖత్ పేరిట పవన్ రాజకీయం నడిపారు. 01:30 PM ప్యాకేజ్ బంధం బయటపడింది ►పవన్కు YSRCP స్ట్రాంగ్ కౌంటర్ ►నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైల్కి వెళ్ళింది దీని కోసమేనా? ►పొత్తును ఖాయం చేసుకునేందుకేనని ప్రజలకు పూర్తిగా అర్థం అయింది ►ఇన్నాళ్ళూ నీమీద నమ్మకం పెట్టుకున్న అభిమానులకు, కాస్తో కూస్తో నిన్ను నమ్మిన వాళ్ళకు ఈరోజుతో భ్రమలు తొలగించేశావు ►ఇక ఇది పొత్తులకి, ప్రజలకి మధ్య జరుగుతున్న యుద్ధం ►ఇక మిమ్మల్ని మూకుమ్మడిగా ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి ప్రజలంతా సిద్ధం ►జైల్లోనూ పాలిట్రిక్స్ వదిలి పెట్టరా అంటూ పవన్, చంద్రబాబులకు చురకలు “ప్యాకేజ్ బంధం బయటపడింది” నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైల్కి వెళ్ళింది @JaiTDPతో పొత్తును ఖాయం చేసుకునేందుకని ప్రజలకు పూర్తిగా అర్థం అయింది @PawanKalyan. ఇన్నాళ్ళూ నీమీద నమ్మకం పెట్టుకున్న అభిమానులకు, కాస్తో కూస్తో నిన్ను నమ్మిన వాళ్ళకు ఈరోజుతో భ్రమలు తొలగించేశావు.… pic.twitter.com/MCjVLq26zb — YSR Congress Party (@YSRCParty) September 14, 2023 12:50 PM సెంట్రల్ జైల్ పాలిట్రిక్స్ : ములాఖత్ తర్వాత పవన్ కళ్యాణ్ ►వచ్చే ఎన్నికల్లో మేము కలిసి పోటీ చేస్తున్నాం ►ఈ విషయం జనసేన కార్యవర్గం అర్థం చేసుకోవాలి ►తెలుగుదేశం, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తాయని నేను ఇవ్వాళ నిర్ణయం తీసుకున్నాను ► విడివిడిగా పోటీ చేస్తే వైఎస్సార్సిపిని ఆపలేం ► BJP మాతో కలుస్తుందో లేదో వాళ్లే తేల్చుకోవాలి ► ఇక నుంచి టిడిపి, జనసేన ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ► తెలుగుదేశం నేతలతో కలుస్తున్నానంటే అది పాలకపక్షం వల్లే ► ఒక వైపు బాలకృష్ణ, మరోవైపు లోకేష్ల మధ్య ఉన్నానంటే అది పాలకపక్షం వల్లే ► ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును చట్టవ్యతిరేకంగా జైల్లో పెట్టారు ► చంద్రబాబుకు నా మద్ధతు ప్రకటిస్తున్నా ► గతంలో విధానాల పరంగా భిన్నమైన ఆలోచనలున్నాయి ► అందుకే 2019లో వేర్వేరుగా పోటీ చేశాం ► 2014లో విభజన జరిగినపుడు రాష్ట్రానికి నష్టం కలిగింది ► 2014లో నేను నరేంద్ర మోదీకి మద్ధతు తెలిపాను ► భారత్ మీద తరచుగా ఉగ్రదాడులు జరిగినపుడు బలమైన నాయకత్వం కావాలనుకున్నాను ► నాడు నరేంద్ర మోదీ నన్ను పిలిస్తే నేను వెళ్లాను తప్ప.. నా అంతట నేను కాదు ► చంద్రబాబుతో నాడు ప్రత్యేక హోదా కోసం విభేదించాను తప్ప.. ఆయనంటే నాకు నమ్మకం ► చంద్రబాబు అంటే వ్యక్తిగతంగా నాకు విశ్వాసం ఉంది ► బ్యాంకులో తప్పు జరిగితే .. బ్యాంకు ఓనర్ను అరెస్ట్ చేసినట్టుగా ఉంది ► చంద్రబాబును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారించాలి కానీ.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విచారిస్తుంది? 12:40 PM మూడు అంశాలపై ముగ్గురితో మంతనాలు ► పూర్తిగా రాజకీయ ఎజెండాతో చంద్రబాబు ములాఖత్ ► మొదటి అంశం : లోకేష్ పాదయాత్ర కంటిన్యూ చేయాలా? ఆపేయాలా? ► రెండో అంశం : పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఏం చేయాలి? ► మూడో అంశం : పొత్తుల విషయం ఏం చేయాలి? జనసేనకు ఎన్ని సీట్లు? ► పార్టీలో బాలకృష్ణ పాత్ర ఏంటీ? ఇక ముందు టిడిపికి ఎవరు నేతృత్వం వహించాలి? 12:30 PM ఎట్టకేలకు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ ► విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు లాయర్లు ► స్కిల్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబుకి బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ ► హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు కదా అని ప్రశ్నించిన ఏసీబీ కోర్టు జడ్జి ► బెయిల్ పిటిషన్ పరిశీలించి లిస్టింగ్ ఇస్తామన్న ఏసీబీ కోర్టు జడ్జి 12:16 PM చంద్రబాబుతో ముగ్గురు నేతల ములాఖత్ ► రాజమండ్రి జైలు కేంద్రంగా చంద్రబాబుతో రాజకీయ మంతనాలు ► బాలకృష్ణ, పవన్, లోకేశ్లతో చంద్రబాబు చర్చలు ► దాదాపు 40 నిమిషాల పాటు ములాఖత్ ఉండే అవకాశం 12:10 PM ఎన్నికలొస్తున్నాయ్.. కిం కర్తవ్యం.? ► జైల్లో బాలకృష్ణ, పవన్కళ్యాణ్, లోకేష్లతో చంద్రబాబు మంత్రాంగం ► ఎవరెవరు ఏ ఏ విభాగాలు చూసుకోవాలన్న దానిపై స్పష్టత ఇచ్చే అవకాశం ► విజయవాడ కేంద్రంగా బాలకృష్ణ, రాజమండ్రి కేంద్రంగా లోకేష్, గ్రౌండ్లో పవన్.? ► ఎన్నికలు దగ్గర పడుతుండడంతో జైలు నుంచే చంద్రబాబు వ్యూహరచన ► పొత్తులపైనా చర్చలు, ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేయాలో సమాలోచనలు 11:59 AM బెయిల్పై వెనక్కి..ముందుకు.. ► విజయవాడ ACB కోర్టులో బెయిల్ పిటీషన్ వేసే ఆలోచనలో చంద్రబాబు లాయర్లు ► ఇప్పటివరకు స్క్వాష్పై నమ్మకం పెట్టుకున్న బాబు లాయర్లు ► ఆలస్యం అవుతుండడంతో ముందు బెయిల్ కోసం లాయర్ల యోచన ► స్కిల్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబుకి బెయిల్ ఇవ్వాలని పిటిషన్ తయారీ ► ఎప్పుడు వేయాలన్నదానిపై లాయర్ల మల్లగుల్లాలు 11:45 AM రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ బిజీ బిజీ ► రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు వచ్చిన పవన్ కళ్యాణ్ ► ఆరు వాహనాల కాన్వాయ్తో వచ్చిన పవన్ కళ్యాణ్ ► ఆరు వద్దు, ఒక కారు సరిపోతుందని సూచించిన అధికారులు ► పవన్ వెంట జైల్లోకి వెళ్లేందుకు జనసేన నాయకుడు కందుల దుర్గేష్ ప్రయత్నం ► ఇష్టానుసారంగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంపై అధికారుల అసహనం ► జనసేన నేత కందుల దుర్గేష్ను వెనక్కి పంపిన అధికారులు 11:30 AM జైలు ముందు కూడా డ్రామాలా? ► రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్న బాలకృష్ణ లోకేష్ ► వారితోపాటు జైలు వద్దకు వచ్చిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే చౌదరి ►ముందస్తు అనుమతి లేకుండా జైల్లోకి వెళ్లేందుకు బుచ్చయ్య చౌదరి యత్నం ► బుచ్చయ్యని వారించి, వెనక్కు పంపిన జైలు అధికారులు ►అధికారులపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బుచ్చయ్య ►ములాఖత్కు దరఖాస్తు చేసుకోకుండా రావడం సరికాదన్న అధికారులు ►అనుమతి తీసుకున్న వారిని మాత్రమే లోపలికి పంపిన జైలు అధికారులు 11:20 AM జైలు నుంచే రాజకీయం ► ఇవ్వాళ చంద్రబాబును కలవనున్న బాలకృష్ణ, పవన్కళ్యాణ్, లోకేష్ ► పార్టీకి సంబంధించి బాధ్యతల పంపిణీపై బాబు మాట్లాడతాడని ప్రచారం ► విజయవాడ కేంద్రంగా బాలకృష్ణ, రాజమండ్రి కేంద్రంగా లోకేష్, గ్రౌండ్లో పవన్.? ► ఎన్నికలు దగ్గర పడుతుండడంతో జైలు నుంచే చంద్రబాబు వ్యూహరచన 11:15 AM లూథ్రా ట్వీట్ల పరమార్థమేంటీ? ► పూర్తిగా నిర్వేదంలోకి వెళ్ళినట్టు కనిపిస్తోన్న సిద్ధార్థ లూథ్రా ► నిన్న గురు గోవింద్ సింగ్ .. ఈ రోజు స్వామి వివేకానంద !!! ► ఇంతటి క్లిష్టమైన కేసును చూడలేదన్నట్టుగా ట్వీట్లు ► చంద్రబాబుకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలుండడంతో చేష్టలుడిగిపోయిన లూథ్రా ► కేసులో అన్ని దారులు మూసుకుని పోవడంతో ఫ్రస్ట్రేషన్ నుంచి ఫిలాసఫీలోకి వచ్చాడంటున్న టిడిపి నేతలు 11:00 AM పోటాపోటీ క్యాంపులు ► రాజమండ్రి రూరల్ కాతేరు వద్ద లోకేష్ క్యాంప్ ఏర్పాటు ► టిడిపి శ్రేణులతో చర్చలు జరుపుతున్న లోకేష్, భువనేశ్వరి ►పార్టీ కార్యాలయం కేంద్రంగా బాలకృష్ణ, అంతే స్థాయిలో కాతరు క్యాంపులో లోకేష్ ►పార్టీపై పట్టుకు ఇద్దరు నేతల ప్రయత్నాలు ►తల్లి భువనేశ్వరీని తనతో పాటు చర్చల్లో కూర్చోపెడుతున్న లోకేష్ 10:50 AM బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా ► అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా. ► ఈ కేసులో విచారణను ఈనెల 20వ తేదీ వరకు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు. 10:00 AM చీమ చిటుక్కుమన్నా.. పట్టేస్తారు ►రాజమండ్రి సెంట్రల్ జైలులో భారీగా భద్రత పెంపు. ►జైలు బయట అదనంగా సీసీ కెమెరాల ఏర్పాటు. ►చంద్రబాబు భద్రతను స్వయంగా పరిశీలిస్తున్న జైలు శాఖ డీఐజీ రవికిరణ్. 9:00 AM ఇంటిని మరిపించేలా రోజువారీ కార్యకలపాలు ►రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా చంద్రబాబుకు నాలుగు రోజు ►ఉదయం అల్పాహారం తీసుకున్న చంద్రబాబు ►అంతకు ముందు కాసేపు వ్యాయామం, పేపర్లు చదివిన చంద్రబాబు ►చంద్రబాబును కలిసేందుకు ములాఖత్కు రానున్న పవన్ కళ్యాణ్ , బాలకృష్ణ, లోకేష్ 7:45 AM ► నేడు రాజమండ్రికి పవన్ కల్యాణ్, నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణ. ► జైలులో ఉన్న చంద్రబాబుతో వీరు ములాఖత్. ► మధ్యాహ్నం 12 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్న లోకేష్, పవన్ కల్యాణ్, బాలకృష్ణ ► రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర కట్టుదిట్టమైన భద్రత ► ఉదయం 10 గంటలకు రాజమండ్రికి చేరుకోనున్న పవన్, బాలకృష్ణ 7:30 AM ► నాలుగోరోజు రాజమండ్రి జైలులో చంద్రబాబు ► తెల్లవారుజామున నిద్రలేచిన చంద్రబాబు. ► జైలులో చంద్రబాబు యోగా, పేపర్ రీడింగ్ ► నేడు అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ జరుగనుంది. ► ఈ కేసుపై విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు. ► అంగళ్లులో టీడీపీ నేతల దాడి కేసులో A1గా ఉన్న చంద్రబాబు. ► అన్నమయ్య జిల్లా, అంగళ్లు వద్ద జరిగిన విధ్వంసానికి సంబంధించి ముదివేడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ► స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయలేకపోతున్నానని తెలిపారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని, ఎలాంటి షరతులు విధించినా అభ్యంతరం లేదని, తనకు మాత్రం బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు న్యాయస్థానాన్ని కోరారు. ► ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించి బెయిల్స్ తెచ్చుకున్నప్పటికీ ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబు మాత్రం హైకోర్టుకు రాలేదు. తనకేం కాదులే అనే ధీమాతో ఉన్న ఆయన.. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి, జైల్లో ఉండటంతో ఒక్కసారిగా మేల్కొన్నారు. ఎందుకైనా మంచిదని బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ►ఆగస్టు 4న యాత్ర ముసుగులో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ నేతల హత్యకు కుట్ర పన్ని, మారణాయుధాలు, బాటిళ్లు, రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడిన ఘటనలపై చంద్రబాబు సహా 20 మందిపై కురబలకోట మండలం ముదివేడు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఇతర నిందితుల్లో టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ, మదనపల్లె, తంబళ్లపల్లె, రాయచోటి, తిరుపతి ప్రాంతాలకు చెందిన నేతలు నిందితులుగా ఉన్నారు. దాదంవారిపల్లెకు చెందిన అంగళ్లు మార్కెట్ కమిటీ చైర్మన్ డీఆర్.ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై ఐపీసీ 120బి, 147, 148, 153, 307, 115, 109, 323, 324, 506, రెడ్విత్ 149 సెక్షన్ల కింద ఎస్ఐ షేక్ ముబిన్తాజ్ కేసు నమోదు చేశారు. ►యాత్ర సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు, రైతులను చూసి చంద్రబాబు ఊగిపోయారు. ‘తమాషాగా ఉందా.. ఆ నా కొడుకులను తరమండిరా.. వేసేయండిరా వాళ్లని’ అని వేలేత్తి చూపించి టీడీపీ శ్రేణులను ఉసిగొల్పారు. వాహనంపై ఆయన పక్కనే ఉన్న మాజీ మంత్రులు దేవినేని ఉమా, ఎన్.అమరనాథ్రెడ్డి, మదనపల్లె మాజీ ఎమ్మెల్యేలు షాజహాన్బాషా, దొమ్మలపాటి రమేష్, ఎమ్మెల్సీ రాంభూపాల్రెడ్డి తదితర నేతలు కూడా వైఎస్సార్సీపీ నేతలవైపు చేతులు చూపుతూ, కేకలు వేస్తూ హెచ్చరికలు చేస్తూనే.. సైగలతో దాడులకు ప్రేరేపించారు. ► మరికొందరు స్థానిక నేతలు ఈలలు వేస్తూ, తొడ గొడుతూ.. బూతులు తిడితూ కొట్టండి అంటూ దాడికి ప్రోత్సహించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఓ పథకం ప్రకారం ఉద్దేశపూర్వకంగా టీడీపీ నేతలు ఈ దాడులు చేయించారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా అప్పటికే సిద్ధం చేసుకున్న మారణాయుధాలు, రాళ్లు, కొడవళ్లు, ఇటుకలు, కట్టెలు, చెప్పులు, రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ► ఈ దాడిలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు, దాడిని అడ్డుకోబోయిన పోలీసులు కూడా గాయపడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన బైసాని చంద్రశేఖర్రెడ్డి, వసంతరెడ్డి, అర్జున్రెడ్డి, మహేష్, ఓ విలేకరి శ్రీనివాసులు, ముదివేడు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కేశవులు తీవ్రంగా గాయపడ్డారు. దాడితో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. రోడ్డుపై పగిలిన బాటిళ్లు, ఇటుకలు, కర్రలు పడి ఉన్నాయి. కొందరు స్థానికులు వైఎస్సార్సీపీ నేతలను రక్షించారు. లేనిపక్షంలో కొందరు హత్యకు గురయ్యేవారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. -
అన్నమయ్య జిల్లా: చంద్రబాబుపై కేసు నమోదు
సాక్షి, అన్నమయ్య జిల్లా: ముదివేడు పీఎస్లో చంద్రబాబుపై కేసు నమోదైంది. ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో అంగల్లులో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. ‘ఒళ్లు దగ్గర పెట్టుకోండి. నాతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. తమాషాలు చేస్తున్నారా, చూసుకుందాం రండి రా.. నా కొడకల్లారా.. వాళ్లను తరమండిరా..’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు పోలీసులపైకి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. ప్రాజెక్టుల పర్యటన పేరుతో గత శుక్రవారం ఆయన అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరు, పూతలపట్టులో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు, పోలీసులను ఇష్టానుసారం మాట్లాడారు. డీఎస్పీ కేశప్పను ఉద్దేశిస్తూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఆ బట్టలు తీసేయండయ్యా. అందరూ పెయిడ్ ఆర్టిస్టులే. గాడిదలు కాస్తున్నారా’ అంటూ నోరుపారేసుకున్నారు. చదవండి: పుంగనూరు ఘటన: పరారీలోనే కీలక సూత్రధారి, టీడీపీ నేత చల్లా బాబు కాగా, పుంగనూరులో పోలీసులపై తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల దాడి కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్కు తరలించారు. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ల సంఖ్య 74కు చేరింది. పలమనేరు డీఎస్పీ సుధాకర్రెడ్డి, పుంగనూరు సీఐ అశోక్కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ అల్లరి మూకలపై ఐదు కేసులు నమోదు చేశారు. వీరిలో ప్రధాన సూత్రధారి అయిన నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి చల్లా బాబు పరారీలో ఉన్నారు. ఆయన పీఏ గోవర్ధన్రెడ్డి పోలీసులకు చిక్కాడు. పథకం ప్రకారమే పోలీసులపై దాడులు చేశామని అతడు తెలిపినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..!
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
ఈసీ నుంచి రాని అనుమతి.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
ఎన్నికల ప్రచారం ఎంత కష్టమో తెలిసింది: కంగనా రనౌత్
టెక్నో క్యామాన్ 30ప్రో 5జీ, క్యామాన్ 30 ప్రీమియర్ 5జీ విడుదల.. ధర ఎంతంటే?
లోక్సభ ఎలక్షన్స్.. రతన్ టాటా సందేశం
‘సాక్షి’కి టీ 20 వరల్డ్కప్ ట్రోఫీ
ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
తప్పక చదవండి
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
Advertisement