-
థర్డ్ వేవ్ ముప్పు.. పండగలొస్తున్నాయ్ జాగ్రత్త
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో థర్డ్ వేవ్ ముప్పు ఇంక ఉండదని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం కొత్త హెచ్చరికలు చేసింది. అక్టోబర్, నవంబర్ నెలలే అత్యంత కీలకమని, ఆ రెండు నెలల్లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు, కోవిడ్ టాస్్కఫోర్స్ చీఫ్ వి.కె.పాల్ తెలిపారు. దేశంలో కరోనా పరిస్థితులపై గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇది పండగల సీజన్ కావడంతో ప్రజలు గుంపులుగా తిరగడం పెరుగుతుందని తద్వారా కరోనా మళ్లీ విజృంభించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: అంతరిక్ష పర్యాటకంలో మరో ముందడుగు ఈ రెండు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలని, స్థానిక యంత్రాంగం ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. థర్డ్ వేవ్ అన్న మాట వాడకుండానే పాల్ కరోనా కేసులపై మాట్లాడారు. కోవిడ్ నిబంధనలు అందరూ పాటిస్తూ, అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని, అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని హితవు పలికారు. ‘అయితే దేశంలో పెద్దవాళ్లలో దాదాపుగా 62% మంది సింగిల్ డోసు వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో కరోనా మొదటి, రెండు వేవ్ల స్థాయిలో తీవ్రంగా మూడో వేవ్ వచ్చే అవకాశాలు లేవు. కరోనా సోకితే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ హోం క్వారంటైన్ అయ్యే అంశంలో ప్రజలకు తగినంత అవగాహన రావడంతో మళ్లీ కరోనా కేసులు విజృంభించినా అంత ప్రమాదమేమీ ఉండడు’ అని వీకే పాల్ ధైర్యం చెప్పారు. చదవండి: ఆరోగ్యానికి కేరాఫ్ పనస ప్రస్తుతానికి బూస్టర్ డోసు ఆలోచన లేదు కోవిడ్ బూస్టర్ డోసు ఇవ్వాలన్న ప్రతిపాదనలేవీ కేంద్ర ప్రభుత్వం వద్ద లేవని, ప్రజలందరికీ రెండు డోసులు ఇవ్వడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ చెప్పారు. కరోనా రెండు డోసులు ఇవ్వడాన్ని ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నామని, దానికి ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని అన్నారు. బూస్టర్ డోసు గురించి కేంద్ర ప్రభుత్వం, శాస్త్రవేత్తలు, ప్రజారోగ్య వ్యవస్థలో ఎలాంటి చర్చ జరగడం లేదని ఆయన స్పష్టంచేశారు. -
కడపలో పాస్పోర్టు కార్యాలయం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : గల్ప్ దేశాలకు వెళ్లేవారు పాస్ పోర్టు కోసం తిరుపతి, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం జిల్లా ప్రజల కోసం కడప పోస్టల్ కార్యాలయంలో పాస్ పోర్టు కార్యాయాలన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం సరిపడా గదులను సైతం నిర్మిస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా కువైట్, సౌదీ అరేబియా, సింగపూర్ మలేషియా, అమెరికా వంటి దేశాలకు జీవనోపాధి కోసం ఎక్కువ సంఖ్యలో ప్రజలు వెళుతుంటారు. పాస్ పోర్టు తయారు చేయించుకోవడానికి ఇతర ప్రాంతాలైన తిరుపతి. హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేది. పాస్ పోర్టులో ఏవైనా పొరపాట్లు మళ్లీ వెళ్లాల్సిన పరిస్థితి. దీనివల్ల ప్రజలకు సమయం, డబ్బు వృథా అయ్యేవి. ఇకపై ఇలాంటి ఇబ్బందులు తొలగనున్నాయి. -
నగదు రహితం.. కష్టం
పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు కరెన్సీ కష్టాలు ఎదుర్కొంటున్నారు. నిత్యం బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. అయినప్పటికీ తగినంత నగదు లభించడం లేదు. బ్యాంకులకు నగదు సరఫరా నామమాత్రంగానే ఉండడంతో రోజువారీ లావాదేవీలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నగదు రహిత లావాదేవీల అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, స్వైపింగ్, ఈ వాలెట్లు తదితర మార్గాల ద్వారా లావాదేవీలు నిర్వహించాలని ప్రజలకు సూచిస్తోంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో గురువారం అనంతపురంలోని లలిత కళాపరిషత్లో ‘నగదు రహిత లావాదేవీలు-సాధ్యాసాధ్యాలు’ అనే అంశంపై సదస్సు జరిగింది. జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లీడ్బ్యాంక్ మేనేజర్ జయశంకర్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ హరిబాబు, టెక్నికల్ అధికారి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ వర్గాల ప్రజలు మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలు అంత సులువు కాదని అభిప్రాయపడ్డారు. నిరక్షరాస్యత, టెక్నాలజీపై మెజార్టీ ప్రజలకు అవగాహన లేకపోవడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదని తేల్చిచెప్పారు. -
కసరత్తు చేసిన తర్వాతే పెద్ద నోట్ల రద్దు
కేంద్ర మంత్రి హన్స్ రాజ్ గంగారాం సాక్షి, హైదరాబాద్: నల్లధనాన్ని నిరోధించడానికి, అవి నీతిని అంతమొందించడానికి పెద్ద నోట్ల రద్దు నిర్ణయా న్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం అహిర్ చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్తో కలసి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. పెద్ద నోట్లను రద్దు చేయడానికి ముందుగా పెద్ద చర్చలు, కసరత్తును ప్రధాని మోదీ చేశారన్నారు. నల్ల వ్యాపారాన్ని అరికట్టడంవల్ల అభివృద్ధికి, సంక్షేమ పథకాల అమలుకు చాలా అవకాశం వచ్చిందన్నారు. నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి, కొత్తగా ఉద్యోగ అవకాశాలు రావడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. నోట్ల రద్దుతో కశ్మీర్లోనూ ఉగ్రవాదం తగ్గిపోరుుందన్నారు. దేశంలో చాలా బ్యాంకుల్లో నగదు మార్పిడితో సామాన్యులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. మోదీ చెప్పిన 50 రోజుల సమయంలోగా సమస్యలన్నీ తీరుతాయన్నారు. నగదు రహిత వ్యవహారాలను పెంచ డం ద్వారా మరింత నియంత్రణ చేస్తామన్నారు. తెలం గాణ ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేసిందన్నారు. కాజీపేట దర్గాలో పూజలు... కాజీపేట రూరల్: వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని హజ్రత్ సయ్యద్షా అఫ్జల్ బియాబానీ దర్గాను హన్స్రాజ్ ఆదివారం సందర్శించారు. ఈ దర్గాలో నాలుగు రోజుల ఉర్సు ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యారుు. ఈ సందర్భంగా మంత్రి చాదర్ సమర్పిం చారు. అనంతరం దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆయన అక్కడకు వచ్చిన భక్తులు, ముస్లిం మత పెద్దలుతో పెద్ద నోట్లు రద్దు వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. -
రూ. 450 కోట్ల ఎన్హెచ్ఎం నిధులకు బ్రేక్
► ఈ ఏడాది నయాపైసా విడుదల చేయని కేంద్రం ► గతేడాది నిధులను సొంతానికి వాడుకోవడంపై ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.450 కోట్లకు బ్రేక్ పడింది. గతేడాది ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య కార్యక్రమాలకు కాకుం డా ఇతరత్రా తన ప్రాధాన్యాలకు వినియోగించుకోవడంపై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. అందుకే 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం తన వాటా రూ.450 కోట్లు విడుదల చేసే పరిస్థితి కనిపించడంలేదని, ఈ మేరకు కేంద్ర ఎన్హెచ్ఎం అధికారులు స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఫలితంగా ఎన్హెచ్ఎం కింద రాష్ట్రంలో చేపట్టిన అనేక ఆరోగ్య కార్యక్రమాలు, పథకాలకు నిధుల కటకట ఏర్పడింది. ఆ పథకం కింద పనిచేసే దాదాపు 10 వేల మంది సిబ్బందికి వేతనాలు ఇచ్చే పరిస్థితి లేకుండాపోయింది. 2016-17లో కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం కింద రాష్ట్రానికి రూ.750 కోట్ల వరకు కేటాయించింది. అందులో కేంద్రం వాటా రూ.450 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 6నెలలు గడిచాయి. కానీ, కేంద్రం తన వాటాలో ఒక్క పైసా విడుదల చేయలేదు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం తన వాటాగా విడుదల చేసిన సొమ్ములో ఇప్పటికీ రూ.300 కోట్లు తన వద్దే ఉంచుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇలా నిధులను ఇతరత్రా అవసరాలకు బదలాయించడంపై కేంద్రం ఆగ్రహంతో ఉంది. అందుకే ఈ ఏడాది నిధులను ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంపై గతంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా సీఎం కె.చంద్రశేఖర్రావుకు లేఖ రాశారు. స్వయంగా జోక్యం చేసుకొని నిధులు విడుదల చేయాలని సీఎంను కోరారు. అయినప్పటికీ నిధులు విడుదల చేయలేదు. దీంతో రాష్ట్రంలో జన ని సురక్ష యోజన(జేఎస్వై), జనని శిశు సురక్ష కార్యక్రమం(జేఎస్ఎస్కే), కుటుంబ నియంత్రణ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. వివిధ రకాల మందు లు, పరికరాల కొనుగోలుకు బ్రేక్ పడింది. పిల్లల టీకాలకు, గర్భిణులకు అందించే ఆరోగ్య సేవలకు విఘాతం ఏర్పడింది. ఎన్హెచ్ఎం కింద పనిచేసే 300 మంది డాక్టర్లు, 2 వేల మంది స్టాఫ్ నర్సులు, 5 వేల మంది ఏఎన్ఎంలు సహా ఇతరత్రా సిబ్బంది ఉన్నారు. వారికి నెలకు రూ. 15 కోట్లు వేతనాల కింద ఖర్చు చేయాల్సి ఉంటుంది.
Pagination
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
Advertisement