-
‘సైకిల్’ దొంగ దొరికాడోచ్!
గుంటూరు: పొన్నూరు నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి, తాయిలాల ఎరవేసి ఓట్లు దక్కించుకునేందుకు టీడీపీ పన్నాగం పన్నింది. విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసి తల్లిదండ్రుల మెప్పుపొందేందుకు భారీ సంఖ్యలో సైకిళ్లను కొనుగోలు చేసింది. టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల స్వగ్రామం చింతలపూడిలోని ఓ రైస్మిల్లులో నిల్వ చేశారు. సమాచారం అందుకున్న ఎన్నికల అధికారులు వాటిని సీజ్ చేశారు. శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు పొన్నూరు నియోజకవర్గం ఎన్నికల అధికారులకు ఫోన్ చేశారు. మండలంలోని చింతలపూడి గ్రామంలోని ఓ రైస్మిల్లో టీడీపీ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర ఫొటో, సైకిల్ గుర్తుతో ఉన్న నూతన సైకిళ్లు వందల సంఖ్యలో ఉన్నాయని సమాచారం అందింది. వెంటనే అధికారులు హుటాహుటిన రైస్మిల్కు చేరుకుని వందల సంఖ్యలో ఉన్న సైకిళ్లను చూసి అవాక్కయ్యారు. అన్ని సైకిళ్లకు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ రంగు, గుర్తులు, అభ్యర్థి ఫొటో ఉండటంతో అన్ని సైకిళ్లను సీజ్ చేశారు. సంఘటనా స్థలానికి ఓ వ్యక్తి చేరుకుని తాను కోర్టు ద్వారా ఆక్షన్లో సైకిళ్లను దక్కించుకున్నానని, అధికారులకు తెలిపాడు. అయితే ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా సైకిళ్లు ఉన్నాయని, ఒకేచోట పార్టీ సింబల్స్తో ఇన్ని సైకిళ్లు ఉండరాదని తేల్చిచెప్పారు. కోడ్ ఉల్లంఘించిన కారణంగా 567 సైకిళ్లను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారి వరదరాజులు, ఏంపీడీవో రత్నజ్యోతి తెలిపారు. ధూళిపాళ్ల నరేంద్ర ఎన్నికల తాయిలాల పంపకంతోనే విజయం సాధించే ప్రక్రియకు ఎన్నికల అధికారులు అడ్డుకట్ట వేశారు. ఇవి చదవండి: ‘ఆమ్ ఆద్మీ’ని అంతం చేసే కుట్ర -
సైకిల్పై అద్వానీ.. పోస్టాఫీసులో కమల.. పెళ్లి జరిగిందిలా!
బీజేపీ మాజీ అధ్యక్షుడు, అటల్ ప్రభుత్వంలో ఉప ప్రధాని సేవలందించిన లాల్ కృష్ణ అద్వానీకి అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను అందజేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ నేపధ్యంలో అద్వానీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత రాజకీయాల్లో భీష్మ పితామహునిగా పేరొందిన అద్వానీ రాజకీయ జీవితంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా మార్గదర్శకునిగా నిలిచారు. కమలతో అద్వానీ వివాహం అత్యంత విచిత్ర పరిస్థితుల్లో జరిగింది. కమలా అద్వానీ పాకిస్తాన్లోని సింధ్లో జన్మించారు. ఆమె అసలు పేరు కమలా జగత్యాని. విభజన తర్వాత వారి కుటుంబం భారతదేశానికి తరలి వచ్చింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన కమల చదువు పూర్తి చేసుకున్నాక, ఢిల్లీ పోస్టాఫీసులో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఇదీ చదవండి: ఎల్కే అద్వానీకి భారతరత్న.. మోదీ భావోద్వేగం అదే సమయంలో ఆమెకు లాల్ కృష్ణ అద్వానీ నుంచి వివాహ ప్రతిపాదన వచ్చింది. అప్పట్లో లాల్ కృష్ణ అద్వానీ జర్నలిస్టుగా పనిచేసేవారు. ప్యాంటు షర్టు వేసుకుని, సైకిల్పై ఆఫీసుకు వెళ్లేవారు. కమల అద్వానీలకు 1965, ఫిబ్రవరి 25న వివాహం జరిగింది. అద్వానీ భార్య కమలా అద్వానీ రాజకీయాల్లో కాలుమోపనప్పటికీ, పలు కార్యక్రమాలలో అద్వానీతో పాటు కనిపించారు. ఆమె అద్వానీ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవారు. అలాగే అద్వానీ తినే ఆహారం మొదలుకొని, అతనిని కలుసుకునే వారి జాబితా వరకు అన్నింటిపై కమలా అద్వానీ ఒక కన్నేసి ఉంచేవారు. అద్వానీ ఒక సందర్భంలో తాను దేశానికే హోంమంత్రినని, ఇంటిలో తన సతీమణి కమలనే హోంమంత్రి అంటూ చమత్కరించారు. -
అది పాత సైకిలే.. కానీ వారి ఆనందం వెలలేనిది!
ఒక్కోసారి చిన్నచిన్న ఆనందాలు కూడా వెలకట్టలేనంత సంతృప్తినిస్తాయి. ఎవరికైనా చిన్నతనంలో కుటుంబంతో గడిపిన ప్రతి క్షణం జీవితాంతం గుర్తుండిపోతుంది. మనం బాల్యంలో అందుకున్న చిన్నపాటి మిఠాయి కూడా మనల్ని ఆనందడోలికల్లో ముంచెత్తుతుంది. ఇటీవల అటువంటి ఆనందాలను తిరగతోడే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ ఎమోషనల్ వీడియో చిన్నిచిన్ని సంతోషాలను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో నేర్పుతుంది. తండ్రీకుమారుల ఆనందం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఎవరి హృదయాన్నయినా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈ 15 సెకన్ల వీడియోలో తండ్రీకొడుకులు తమ ఇంటి ముందు సైకిల్ దగ్గర నిలబడి ఉండటాన్ని గమనించవచ్చు. తరువాత తండ్రి ఆ సైకిల్కు పూలమాల వేసి, నీటిని చిలకరించిన తర్వాత, సైకిల్కు పూజ చేస్తాడు. దీనిని చూస్తూ పిల్లవాడు ఆనందంతో గెంతులేస్తుంటాడు. వీడియోలో కనిపిస్తున్న సైకిల్ పాతదే కావచ్చు కానీ వారి ఆనందం వర్ణించేందుకు వీలు కాకుండా ఉంది. ఈ వీడియోను ఐఎఎస్ అధికారి అవనీష్ శరణ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. వీడియోను షేర్ చేసిన ఆయన.. ‘ఇది సెకండ్ హ్యాండ్ సైకిల్ మాత్రమే. అయినా వారి ముఖాల్లో సంతోషాన్ని ఒక్కసారి చూస్తే.. కొత్త మెర్సిడెస్ బెంజ్ కొన్నట్లుగా ఉంది. ఈ వీడియోను ఇప్పటివరకూ 85 వేల మందికి పైగా లైక్ చేయగా, 3 వేల మందికి పైగా యూజర్లు వీడియోపై తమ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఒక యూజర్ ‘బహుశా ప్రపంచంలోని ఖజానానంతా వెచ్చించినా ఇంతటి ఆనందాన్ని కొనుగోలు చేయలేకపోవచ్చు’ అని రాశారు. మరొక యూజర్ ‘వీరి సంతోషానికి ధర లేదు సార్’ అని రాశారు. అయితే కొంతమంది వినియోగదారులు ఈ వీడియోను షేర్ చేసే బదులు మీరు వారికి కొత్త సైకిల్ కొనుగోలు చేసి ఇవ్వవచ్చుకదా అని ఆ ఐఏఎస్ అధికారికి సూచించారు. ఇది కూడా చదవండి: ఖలిస్తానీ ఉగ్రవాదుల ఓసీఐ కార్డుల రద్దు? It’s just a second-hand bicycle. Look at the joy on their faces. Their expression says, they have bought a New Mercedes Benz.❤️ pic.twitter.com/e6PUVjLLZW — Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) May 21, 2022 -
కాలువ శుభ్రం చేస్తుంటే వందలకొద్దీ సైకిళ్లు.. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి?
భారతదేశం అయినా విదేశాల్లో అయినా సరే ప్రతి పౌరుడి బాధ్యత తన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం. విదేశాల్లో రోడ్డుపై చెత్త వేయడం నేరంతో సమానం. ఇందుకు కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నాయి. అయినా చాలామంది నిర్లక్ష్య ధోరణితోనే వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఇందుకు నిదర్శనంగా నిలిచింది. ఈ వీడియోలో కాలువను శుభ్రం చేస్తున్న దృశ్యం కనిపిస్తుంది. మురుగునీటిలో నుంచి పెద్ద సంఖ్యలో సైకిళ్లు బయటకు వచ్చి, కుప్పగా ఏర్పడిన తీరు వీడియోలో కనిపిస్తుంది. నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. కాలువను శుభ్రం చేస్తున్న కార్మికులు నీటి అడుగునుంచి పలు సైకిళ్లను వెలికితీశారు. జేసీబీతో ఈ క్లీనింగ్ పనులను చేపట్టారు. ఈ క్లిప్ @fasc1nate అనే ఖాతాతో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ది గార్డియన్’ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం వేలాది బైక్లు, సైకిళ్లను నదులు, చెరువులు, సరస్సులలో విసిరివేస్తున్నారు. ఇదేవిధంగా బైక్లు, సైకిళ్లు ప్రమాదవశాత్తు కూడా నీట మునుగుతున్నాయి. ఈ కారణంగా వాటిని శుభ్రపరిచే సమయంలో పెద్ద మొత్తంలో చెత్త బయటకు వస్తున్నది. కేవలం 2 నిమిషాల 9 సెకన్ల వీడియోను చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇది పలువురి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. పర్యావరణ పరిరక్షణ పరంగా ఇది ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఈ వీడియోకు 14 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కాయి. ఈ వీడియోను చూసిన యూజర్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ఇన్ని సైకిళ్లు ఎక్కడి నుంచి వచ్చాయని రాయగా, మరొకరు ఈ సైకిళ్లను అమ్ముతారా? అని ప్రశ్నించారు. మరొక యూజర్ కాలువలోకి ఇంత పెద్ద సంఖ్యలో సైకిళ్లు ఎక్కడ నుండి వచ్చాయి? అని రాశారు. ఇది కూడా చదవండి: శాంతినికేతన్తో చైనాకు లింకు ఏమిటి? తాన్ యున్ జెన్ ఏం సాయం చేశారు? Finding some surprises while cleaning the canals of Amsterdam. pic.twitter.com/QsEJgj5GHM — Fascinating (@fasc1nate) September 18, 2023 -
సైకిల్ పై ప్రపంచ యాత్ర చేస్తున్న యువకుడుకి ఆతిథ్యం ఇచ్చిన సింగపూర్ తెలుగు ప్రజలు
కళ్లెదుటే కరోనాతో తన తండ్రి, ఎంతో మంది చనిపోవడం తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్ జిల్లా గిర్మాజీపేటకు చెందిన రంజిత్ని కదిలించింది. కాలుష్యం మానవ రోగ నిరోధక శక్తిని బలహీనపరిచి, ప్రజల్ని సులువుగా కరోనా,ఇతర అనారోగాల బారిన పడేటట్లు చేస్తుందని తెలుసుకున్నాడు. అందుకే ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంగా,శారీరక దృఢత్వం కలిగి ఉండాలన్న ఆలోచనని కలిగించాలని- "సొల్యూషన్ టు పొల్యూషన్ (కాలుష్యానికి పరిష్కారం)" అనే లక్ష్యంతో యాత్ర ప్రారంభించాడు. దానికై కాలుష్యం కలిగించని,శారీరక వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని అందించే సైక్లింగ్ చెయ్యాలని ధృడ సంకల్పతో అడుగులు వేసాడు రంజిత్. 2021 ఏప్రిల్ 5న మొదలైన 'రంజిత్ ఆన్ వీల్స్ సైక్లింగ్ భారతదేశం దాటి ఇప్పుడు ఆసియా ఖండంలోని వియత్నాం, కంబోడియా,థాయిలాండ్,మలేషియా దేశాలను చుట్టి 29-ఆగష్టు 29, 2023 న సింగపూర్ చేరుకున్నాడు. మంచి సంకల్పంతో రంజిత్ చేస్తున్న ఈ యాత్రకి సింగపూర్ తెలుగు సమాజం ఆతిథ్యం ఇచ్చింది. రంజిత్ చేస్తున్న కృషిని కమిటీ అభినందించింది. ఈ సందర్భంగా తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో కాలుష్యం ఒకటని, దీనివల్ల మానవాళి రోగనిరోధక సన్నగిల్లితుందని, మనమంతా కనీసం వారంలో ఒక్కరోజైనా సైక్లింగ్ చెయ్యాలని, దీనివల్ల పర్యావరణం మెరుగుపడటంతో పాటు మనమంతా శారీరకంగా దృఢంగా ఉంటామని తెలిపారు. అందరూ రంజిత్ లక్ష్యం నెరవేరాలని కోరుకుంటున్నామని తెలిపారు. తరవాత కమిటీ సభ్యులు రంజిత్ ను సత్కరించారు. తన ప్రపంచ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రంజిత్ మాట్లాడుతూ, సింగపూర్ దేశం చాల బాగుందని ఇక్కడ పచ్చని చెట్లు అధికంగా ఉండటం, ప్రజలందరూ మెట్రో రైలు, సిటీ బస్ లాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటం, చాలాచోట్ల సైకిల్ వాడటం గమనించానని, కాలుష్యానికి అవకాశం తక్కువ ఉందని తెలిపారు. తెలుగు సమాజం వారిచ్చిన ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపారు. రంజిత్ రెండు రోజులలో సింగపూర్ నుంచి ఇండోనేసియాలోని జకార్తాకు, తరువాత ఫిలిప్పైన్స్, ఇతర దేశాల గుండా ఆస్ట్రేలియా చేరుకొని సైక్లింగ్ పూర్తి చేయాలని ప్రణాళిక వేసుకున్నాడు. 2021 ఏప్రిల్ 5 నుండి ఇప్పటివరకు 22,300 కిలోమీటర్ల ప్రయాణం చేసాడు. ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అమెరికా, యూరప్ ఖండాల్లో సైక్లింగ్ చేసే దిశగా ముందుకు వెళుతున్నానని వెల్లడించాడు. రంజిత్ ఆన్ వీల్స్ ఫేస్బుక్ పేజీ, ఇంస్టాగ్రామ్ ద్వారా దాదాపు 3 లక్షల 60 వేలమంది ఫాలోవర్స్ వున్న రంజిత్ నిత్యం వారికి తన ప్రయాణంలో విశేషాల్ని పంచుకుంటున్నాడు. ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు అన్నారు. కాలుష్యం తమ తమ పరిధిలో నియంత్రిస్తూ, తగిన శారిరక శ్రమ చేయడం ద్వారా తప్పకుండా తనకోరిక నెరవేరుతుంది. (చదవండి: సిఎక్స్ఓ ఫోరమ్: స్టార్టప్ కాన్సెప్ట్లకు గొప్ప మార్గనిర్దేశం)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement