-
అప్పుడు 'నీ తండ్రి స్థాయి తెలుసా అన్నారు': దీపిందర్ గోయల్
కేంద్ర మంత్రి 'హర్దీప్ సింగ్ పూరి' నిర్వహించిన విశేష్ సంపర్క్ కార్యక్రమానికి జొమాటో సీఈఓ 'దీపిందర్ గోయల్' హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన తన 20 సంవత్సరాల క్రితం నాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు.దీపిందర్ గోయల్ 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు.. ఫుడ్ డెలివరీ స్టార్టప్ను ప్రారంభించాలనే ఆలోచనను నా తండ్రితో చెప్పాను. అప్పుడు నా తండ్రి నాతో.. నీ తండ్రి ఏ స్థాయిలో ఉన్నారనే అర్థంతో.. 'జంతా హై తేరా బాప్ కౌన్ హై? అని అన్నట్లు వెల్లడించారు.చిన్న గ్రామంలో ఉన్న మనం స్టార్టప్ వంటివి సాధ్యం కాదని తన తండ్రి భావించినట్లు తెలిపారు. అయితే పంజాబ్లోని ఒక చిన్న పట్టణం నుంచి ప్రభుత్వ సహకారంతో జొమాటో వంటి సంస్థను స్థాపించగలిగాను. 2008లో కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాను. ఇది నాకు చాలా ఆనందంగా ఉందని గోయల్ అన్నారు.దీపిందర్ గోయల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. పేదరికం నుంచి వచ్చి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన గోయల్ వీడియోను ఇప్పటికే లక్షల మంది వీక్షించారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.Deepinder Goyal, ZomatoWhen I started Zomato in 2008, my father used to say “tu janta hai tera baap kaun hai” as my dad thought I could never do a start up given our humble background. This government and their initiatives enabled a small town boy like me to build something… pic.twitter.com/vogdM6v8oT— Hardeep Singh Puri (मोदी का परिवार) (@HardeepSPuri) May 20, 2024 -
న్యూ ఇయర్ను మించిన మదర్స్ డే! ఎలాగో చూడండి..
ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎన్ని పండుగలు, దినోత్సవాలు ఉన్నా మాతృ దినోత్సవానికి ఉన్న ప్రత్యేకత వేరు. ఇదిలా ఉంటే జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ మదర్స్ డేకి సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు.జొమాటో డెలివరీ ఆర్డర్ వాల్యూమ్ పరంగా మదర్స్ డే కొత్త సంవత్సర వేడుకలను అధిగమించిందని దీపిందర్ గోయల్ పేర్కొన్నారు. ఈ మేరకు జొమాటో కార్యాలయంలోని సందడిగా ఉన్న కార్యకలాపాల దృశ్యాలను ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేశారు. పెరిగిన డిమాండ్ను తీర్చడానికి ఉద్యోగులు శ్రద్ధగా పని చేస్తున్న "సర్వీస్ రూమ్"గా దీనిని పేర్కొన్నారు."మొదటిసారిగా మదర్స్ డే, నూతన సంవత్సర వేడుకల కంటే (చాలా) ఎక్కువ వాల్యూమ్ రోజుగా మారుతోంది. ఈరోజు తమ తల్లులకు ట్రీట్ ఇచ్చేవారి కోసం పనిచేస్తున్నాం" అని పోస్టులో రాసుకొచ్చారు. అలాగే ఆఫీస్లోని సిబ్బందికి కూడా ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఉందని ప్రకటరించారు. ఆహార పంపిణీ సేవలకు మదర్స్ డే ఒక ముఖ్యమైన సందర్భంగా ఉద్భవించడం వినియోగదారుల ప్రవర్తనలో వచ్చిన మార్పును సూచిస్తోంది.Mother's Day, for the first time ever, is turning out to be a (much) higher volume day than New Year's Eve. Full w̸a̸r̸ service room scenes at the office today. Fingers crossed, that we are able to serve everyone treating their moms today.A super cool surprise awaits… pic.twitter.com/3N37D00Udo— Deepinder Goyal (@deepigoyal) May 12, 2024 -
‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్న జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్’
‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’.. ఈ మాటను తు.చ తప్పకుండా పాటిస్తారు సినీతారలు. అవకాశాలు అన్నప్పుడు, స్టార్డమ్ సంపాదించినప్పుడే నాలుగు రాళ్లు వెనకేస్తారు. ఇప్పుడు ఈ కోవలోకే ప్రముఖ వ్యాపార వేత్తలు వచ్చి చేరుతున్నారు. వ్యాపారం బాగా జరిగినప్పుడే నాలుగు రాళ్లు వెనకేస్తున్నారు. భవిష్యత్పై ఆర్ధిక భరోసా నిచ్చే రంగాల్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ న్యూఢిల్లీలోని మెహ్రౌలీ అనే ప్రాంతంలో పక్క పక్కనే ఉన్న రెండు ప్రాంతాల్లో 5 ఎకరాల భూముని కొనుగోలు చేశారు. ఆ భూమి విలువ సుమారు రూ.79కోట్లు. వేర్వేరు యజమానుల నుంచి కొనుగోలు చేసిన ఆ భూమికి మొత్తం స్టాంప్ డ్యూటీ రూ.5.24 కోట్లు చెల్లించినట్లు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల గురించి అవగాహన ఉన్న సీఆర్ఈమ్యాటిక్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ తెలిపింది. గత ఏడాది మార్చి 28న తొలి సారి 2.5 ఎకరాల భూమిని Luxalon Building Private Limited నుంచి కొనుగోలు చేశారు. దాని విలువ రూ.29 కోట్లు కాగా.. స్టాంప్ డ్యూటీ కింద రూ.1.74 కోట్లు చెల్లించారు. రెండో సారి స్టెప్టెంబర్ 1, 2023న రవి కపూర్ అనే యజమాని నుంచి 2.53 ఎకరాల ల్యాండ్ను కొనుగోలు చేశారు. దీనికి రూ.50 వెచ్చించారు. స్టాంప్ డ్యూటీ కింద రూ.3.50 కోట్లు కట్టారు. పలు నివేదికల ప్రకారం.. రెండు ప్లాట్లు ఛతర్పూర్ ప్రాంతంలోని డేరా మండి అనే గ్రామంలో ఉన్నాయి. రెండు లావాదేవీల రిజిస్ట్రేషన్ హౌజ్ ఖాస్లో జరిగింది ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫారమ్ మేక్మైట్రిప్ గ్రూప్ సీఈఓ రాజేష్ మాగో గురుగ్రామ్లోని డిఎల్ఎఫ్ మాగ్నోలియాస్లో 6,428 చదరపు అడుగుల అపార్ట్మెంట్ను రూ. 33 కోట్లకు కొనుగోలు చేశారు. జెన్పాక్ట్ సిహెచ్ఆర్ఓ పీయూష్ మెహతా అదే ప్రాపర్టీలో రూ.32.60 కోట్లతో 6,462 చదరపు అడుగుల ఫ్లాట్ను కొనుగోలు చేశారు. -
జొమాటో సీఈవో దీపీందర్ మొదటి భార్య ఇప్పుడు ఏం చేస్తున్నారు..?
-
జొమాటోలో ‘ప్యూర్ వెజ్’ చిచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఇటీవల అందుబాటులోకి తెచ్చిన ‘ప్యూర్ వెజ్’ ఫుడ్ డెలివరీ సర్వీసులు ఆ సంస్థలో చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ సమస్య నుంచి బయట పడేందుకు సంస్థ టాప్ ఎగ్జిక్యూటీవ్లతో సుమారు ఏకదాటిగా 20 గంటల పాటు జూమ్ కాల్స్ నిర్వహించినట్లు జొమాటో కోఫౌండర్, సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు. జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్’ ల కార్యక్రమం నిర్వహించింది. అయితే ఎంట్రప్రెన్యూర్ విభాగంలో దీపిందర్ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది అవార్డ్ను సొంతం చేసుకున్నారు. ఈ అవార్డ్ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ చేతులు మీదిగా అందుకున్నారు. పెద్ద ఎత్తున ట్రోలింగ్ ఈ సందర్భంగా ప్యూర్ వెజ్ వివాదంపై జొమాటో సీఈవో మాట్లాడారు. కస్టమర్లు, ఆయా రెస్టారెంట్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా మేం ప్యూర్ వెజ్ మోడ్, ప్యూర్ వెజ్ ఫ్లీట్ సేవల్ని అందుబాటులోకి తెచ్చాం. కానీ ఈ సర్వీసులపై ఊహించని విధంగా వివాదం తలెత్తింది. నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారని అన్నారు. తలెత్తిన ఆందోళనలు ‘‘ప్యూర్ వెజ్ వివాదంపై నెటిజన్లు సైతం రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు (RWAs) వెజ్ - నాన్ వెజ్ కలిపి తెస్తే ఆర్డర్లను తిరస్కరించే అవకాశం ఉందనే అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. డెలివరీ సిబ్బందిని సైతం అడ్డుకునే ప్రమాదం ఉందని వాపోయారు. ఇప్పటికే వెల్ఫేర్ అసోసియేషన్లలో విధించే ఆంక్షల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు గురించి ప్రస్తావించారు. అదే సమయంలో డెలివరీ సిబ్బంది సైతం ఓన్లీ వెజ్ పాలసీ వల్ల అవకాశాలు సన్నగిల్లుతాయనే ఆందోళనల్ని వ్యక్తం చేశారు.’’ ప్యూర్ వెజ్పై వెనక్కి తగ్గిన జొమాటో అయితే దీన్ని పరిష్కరించేందుకు జొమాటో ఉన్నత స్థాయి ఉద్యోగులతో సుమారు 20 గంటల పాటు జూమ్ కాల్ నిర్వహించామని గుర్తు చేశారు. ఆ తర్వాత వినియోగదారుల నుంచి వ్యతిరేకత రావడం, ప్యూర్ వెజ్పై దుమారం చెలరేగడంతో ఆయా ప్రభుత్వాలు జొమాటోకి నోటీసులు అందించాయి. ఫలితంగా పలు రాష్ట్రాల్లో ఆ సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్లు జొమాటో అధికారికంగా ఎక్స్.కామ్లో ట్వీట్ చేశారు. Hi, we have disabled delivery of non-veg items in Uttar Pradesh, Assam, Chhattisgarh, Madhya Pradesh and Rajasthan as per govt. notice. Hope this clarification helps! — Zomato Care (@zomatocare) January 22, 2024 ఇక ఎన్డీటీవీ అవార్డ్ల కార్యక్రమంలో ‘దయచేసి ఈ ప్యూర్ వెజ్ సర్వీస్ ఏ మతానికి, రాజకీయ ప్రాధాన్యతలకు వ్యతిరేకం కాదని జొమాటో అధినేత, సీఈవో దీపిందర్ గోయల్ మరోసారి పేర్కొన్నారు. మరి రానున్న రోజుల్లో ఈ ప్యూర్ వెజ్ సేవల్ని అందిస్తారా? లేదంటే నిలిపివేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. Even though RTIs and mails for hostel GSec shows that there is no institute policy for food segregation, some individuals have taken it upon themselves to designate certain mess areas as "Vegetarians Only" and forcing other students to leave that area.#casteism #Discrimination pic.twitter.com/uFlB4FnHqi — APPSC IIT Bombay (@AppscIITb) July 29, 2023 -
రెండోపెళ్లి చేసుకున్న జొమాటో సీఈవో.. అమ్మాయి ఎవరంటే!
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్(41) రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. మెక్సికన్కు చెందిన మోడల్ గ్రేసియా మునోజ్ను దీపిందర్ పెళ్లి చేసుకున్నారని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఈ వివాహం జరిగి మాత్రం నెలవుతుందని సమాచారం. తాజాగా గోయల్, గ్రేసియో సన్నిహితంగా ఉన్న ఫొటోలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో విషయం ఆరా తీశారు. దాంతో ఇద్దరికీ వివాహం జరిగినట్లు తెలిసింది. మునోజ్ ఇన్స్టాగ్రామ్ వివరాల ప్రకారం.. ఆమె మెక్సికోలో జన్మించారు. ప్రస్తుతం భారత్లో ఉన్నారు. గతంలో మోడలింగ్ చేసిన ఆమె.. ఇప్పుడు సొంతంగా లగ్జరీ కన్జూమర్ప్రొడక్ట్లకు సంబంధించి ఒక స్టార్టప్ నడుపుతున్నారు. 2022 ఏడాదికిగాను మెట్రోపాలిటన్ ఫ్యాషన్వీక్ విజేతగా నిలిచారు. దీపిందర్కు ఇది రెండో పెళ్లి. ఆయన ఐఐటీ దిల్లీలో చదువుతున్నపుడు కంచన్ జోషితో పరిచయం ఏర్పడింది. దాంతో ఇరువురు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం కంచన్ దిల్లీ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. దీపిందర్.. 2008లో హరియాణాలోని గురుగ్రామ్ కేంద్రంగా జొమాటో సంస్థను స్థాపించారు. కన్సల్టింగ్ సంస్థలో ఉద్యోగాన్ని వదిలి.. ఆహార డెలివరీ యాప్ ప్రారంభించారు. దేశంలో వెయ్యికి పైగా నగరాల్లోకి దీని కార్యకలాపాలు విస్తరించాయి. సుమారు రూ.1.5లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ కలిగిన జొమాటో ఇటీవల శాకాహారుల కోసం ప్రత్యేక సేవలు ప్రారంభించి వివాదంలోకి వెళ్లింది. ఇదీ చదవండి: మొదటి విద్యుత్కారును ఆవిష్కరించిన ఫేమస్ కంపెనీ ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ పేరుతో కొత్త సేవలు మొదలుపెట్టింది. అయితే ఆ ఫ్లీట్లో డెలివరీ స్టాఫ్కు ప్రత్యేకంగా గ్రీన్కలర్ డ్రెస్కోడ్ ఉంటుందని ప్రకటించడంతో వివాదం చెలరేగింది. అలా ప్రకటన వెలువరించిన కాసేపటికే కంపెనీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇకపై అందరూ ఎర్ర రంగు యూనిఫామ్ను ధరిస్తారని చెప్పింది. అయితే ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ సేవలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. వెజ్ ఆర్డర్లను అందించడానికి ప్రత్యేక సిబ్బంది ఉంటారని కంపెనీ వివరించింది. View this post on Instagram A post shared by Grecia Muñoz (@greciamunozp) -
ఇండియాలోనే మొట్టమొదటి ఆ కారు కొన్న జొమాటో సీఈఓ
-
భారత్లో మొదటిసారి ప్రవేశించిన లగ్జరీ కారు.. ధర ఎంతో తెలుసా..
కార్లంటే కొందరికి అవసరానికి ఉపయోగపడే వస్తువుగా ఉంటే.. ఇంకొందరికి అవో లగ్జరీ సింబల్గా మారుతున్నాయి. అందుకోసం రూ.కోట్లు ఖర్చు చేసి మరీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అలాంటి ఓ లగ్జరీ కారు తాజాగా మన దేశ రోడ్లపైకి వచ్చింది. భారత్లో మొట్టమొదటగా అడుగుపెట్టిన ఆస్టన్ మార్టిన్ డీబీ12 స్పోర్ట్స్ కారు అది. ఈ ఆస్టన్ మార్టిన్ డీబీ12 కారు ధర సుమారు నాలుగున్నర కోట్ల రూపాయలు. అయితే ఇంతకీ ఈ కారును కొన్న వ్యక్తి ఎవరిని అనుకుంటున్నారా. అలాంటి యోగం సాధారణ ప్రజలకు ఎక్కడుంటుంది. దీన్ని కొన్నది ఏకంగా రూ.1.34లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ కలిగిన ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్. ఇదీ చదవండి: ఏడు నిమిషాల్లో ఊడిన ఉద్యోగాలు ఆస్టన్ మార్టిన్ బ్రిటన్కు చెందిన కార్ల తయారీ సంస్థ. ఈ కంపెనీ డీబీ12 పేరుతో గతేడాది సెప్టెంబరులో కారును లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ.4.59 కోట్లు. దీపిందర్ గోయల్ ఈ లగ్జరీ కారును తాజాగా సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ స్పోర్ట్స్ కార్ మెర్సిడెస్-బెంజ్-సోర్డ్స్ ఇంజిన్తో రూపొందించారు. 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్డ్ వీ8 ఇంజిన్ కలిగి ఉంది. కేవలం 3.5 సెకెన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం దీన్ని ప్రత్యేకత. View this post on Instagram A post shared by Automobili Ardent India (@automobiliardent) -
‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్న జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్’
‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’.. ఈ మాటను తు.చ తప్పకుండా పాటిస్తారు సినీతారలు. అవకాశాలు అన్నప్పుడు, స్టార్డమ్ సంపాదించినప్పుడే నాలుగు రాళ్లు వెనకేస్తారు. ఇప్పుడు ఈ కోవలోకే ప్రముఖ వ్యాపార వేత్తలు వచ్చి చేరుతున్నారు. వ్యాపారం బాగా జరిగినప్పుడే నాలుగు రాళ్లు వెనకేస్తున్నారు. భవిష్యత్పై ఆర్ధిక భరోసా నిచ్చే రంగాల్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ న్యూఢిల్లీలోని మెహ్రౌలీ అనే ప్రాంతంలో పక్క పక్కనే ఉన్న రెండు ప్రాంతాల్లో 5 ఎకరాల భూముని కొనుగోలు చేశారు. ఆ భూమి విలువ సుమారు రూ.79కోట్లు. వేర్వేరు యజమానుల నుంచి కొనుగోలు చేసిన ఆ భూమికి మొత్తం స్టాంప్ డ్యూటీ రూ.5.24 కోట్లు చెల్లించినట్లు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల గురించి అవగాహన ఉన్న సీఆర్ఈమ్యాటిక్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ తెలిపింది. గత ఏడాది మార్చి 28న తొలి సారి 2.5 ఎకరాల భూమిని Luxalon Building Private Limited నుంచి కొనుగోలు చేశారు. దాని విలువ రూ.29 కోట్లు కాగా.. స్టాంప్ డ్యూటీ కింద రూ.1.74 కోట్లు చెల్లించారు. రెండో సారి స్టెప్టెంబర్ 1, 2023న రవి కపూర్ అనే యజమాని నుంచి 2.53 ఎకరాల ల్యాండ్ను కొనుగోలు చేశారు. దీనికి రూ.50 వెచ్చించారు. స్టాంప్ డ్యూటీ కింద రూ.3.50 కోట్లు కట్టారు. పలు నివేదికల ప్రకారం.. రెండు ప్లాట్లు ఛతర్పూర్ ప్రాంతంలోని డేరా మండి అనే గ్రామంలో ఉన్నాయి. రెండు లావాదేవీల రిజిస్ట్రేషన్ హౌజ్ ఖాస్లో జరిగింది ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫారమ్ మేక్మైట్రిప్ గ్రూప్ సీఈఓ రాజేష్ మాగో గురుగ్రామ్లోని డిఎల్ఎఫ్ మాగ్నోలియాస్లో 6,428 చదరపు అడుగుల అపార్ట్మెంట్ను రూ. 33 కోట్లకు కొనుగోలు చేశారు. జెన్పాక్ట్ సిహెచ్ఆర్ఓ పీయూష్ మెహతా అదే ప్రాపర్టీలో రూ.32.60 కోట్లతో 6,462 చదరపు అడుగుల ఫ్లాట్ను కొనుగోలు చేశారు. -
రూ.97 లక్షల టిప్స్ - సీఈఓ రియాక్షన్ ఇలా..
2024 సంవత్సరానికి ఆహ్వానం పలకడానికి ప్రపంచంలోని చాలా దేశ ప్రజలతో పాటు భారతీయులు కూడా సిద్ధమయ్యారు. ఈ సందర్భంలో ఫుడ్, డ్రింక్స్ వంటి వాటి కోసం జొమాటో, స్విగ్గీ వంటి యాప్ల మీద పడ్డారు. 2023 డిసెంబర్ 31 రోజు మాత్రమే జొమాటో లెక్కకు మించిన డెలివరీలు చేసి ఏకంగా రూ. 97 లక్షల టిప్స్ పొందినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొత్త సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా ఇండియన్ జొమాటో డెలివరీ భాగస్వాములకు కస్టమర్లు ఏకంగా రూ. 97 లక్షలకు పైగా టిప్ ఇచ్చినట్లు జోమాటో సీఈవో 'దీపిందర్ గోయల్' తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. 2015 నుంచి 2020 వరకు కంపెనీ ఎన్ని ఆర్డర్లను స్వీకరించిందో.. ఒక్క 2023 డిసెంబర్ 31న ఒకే రోజు స్వీకరించి గతంలో నెలకొన్ని అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. సుమారు 3.2 లక్షల మంది జొమాటో డెలివరీ పార్ట్నర్స్ ఈ డెలివరీలను చేసినట్లు తెలిపారు. ఇదీ చదవండి: టెస్టింగ్ దశలో కొత్త ఫీచర్.. నచ్చిన ధరకే రైడ్! దేశంలో ఎక్కువ ఆర్డర్స్ మహారాష్ట్ర నుంచి వచ్చినట్లు, కలకత్తాకు చెందిన ఓకే వ్యక్తి 125 ఐటెమ్లను ఆర్డర్ చేసుకున్నాడు. ప్రజలు 1.47 లక్షల చిప్స్ ప్యాకెట్లు, 68,231 సోడా బాటిళ్లు, 2,412 ఐస్ క్యూబ్స్ ప్యాకెట్లు, 356 లైటర్లను ఆర్డర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. Love you, India! You’ve tipped over ₹97 lakhs till now to the delivery partners serving you tonight ❤️❤️❤️ — Deepinder Goyal (@deepigoyal) December 31, 2023 -
అలా కనిపిస్తాయంతే.. డిస్కౌంట్లపై జొమాటో సీఈవో నిజాయితీ కామెంట్
స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్లలో మనం తరచూ 50 శాతం.. 60 శాతం అంటూ కొన్ని డిస్కౌంట్ ఆఫర్లను చూస్తుంటాం. అయితే ఆ ఆఫర్ల గుట్టును బయటపెట్టారు జొమాటో (Zomato) సీఈవో దీపిందర్ గోయల్ (Deepinder Goyal). యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా తన పోడ్కాస్ట్ 'ది రణవీర్ షో'లో చర్చ సందర్భంగా, జొమాటో తన కస్టమర్లకు అంతంత తగ్గింపులను ఎలా అందించగలదని గోయల్ను ప్రశ్నించారు. దీనికాయన సమాధానమిస్తూ.. "ఆ డిస్కౌంట్లు అంత పెద్దవేమీ కావు, అలా కనిపిస్తాయంతే" అని నిష్కపటంగా వ్యాఖ్యానించారు. జొమాటో తరచుగా "రూ. 80 వరకు 50% తగ్గింపు" వంటి ఆఫర్లను అందజేస్తుందని, వాస్తవానికి ఇక్కడ లభించే డిస్కౌంట్ రూ. 80 మాత్రమేనని, పూర్తిగా 50 శాతం తగ్గింపు కాదు అని దీపిందర్ గోయల్ స్పష్టం చేశారు. ఉదాహరణకు గోయల్ లెక్కల ప్రకారం.. ఆర్డర్ మొత్తం రూ. 400 అయితే దానిపై లభించే డిస్కౌంట్ రూ.80 అంటే తగ్గింపు 20 శాతం మాత్రమే. అందులో నిజాయితీ లేదు ఈ డిస్కౌంట్ పద్ధతి కస్టమర్లను తప్పుదారి పట్టించవచ్చని గోయల్ అంగీకరించారు. దాన్ని మార్చాలని తనకు ఉన్నప్పటికీ, పోటీదారులు ఈ అతిశయోక్తి తగ్గింపు ఆఫర్లను కొనసాగిస్తున్నప్పుడు జొమాటో మాత్రమే దీన్ని మార్చడం కష్టమన్నారు. ‘నేను ఈ రకమైన డిస్కౌంట్లను నిజాయితీగా పరిగణించను. డిస్కౌంట్లు సూటిగా, నిజాయితీగా ఉండాలి. మీరు మీ కస్టమర్కు తగ్గింపును వాగ్దానం చేస్తే, అది స్పష్టంగా ఉండాలి’ అని గోయల్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక వ్యాపార ప్రత్యర్థులు అయినప్పటికీ, స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీహర్ష మెజెటీతో తన స్నేహపూర్వక సంబంధం గురించి గోయల్ పంచుకున్నారు. తాము కలిసినప్పుడు వ్యాపార విషయాలను మాట్లాడుకోమని వివరించారు. ఇదీ చదవండి: షాపింగ్ చేస్తున్నారా? బెస్ట్ క్యాష్ బ్యాక్ ఆఫర్లున్న క్రెడిట్కార్డులు ఇవే.. -
డెలివరీ బాయ్గా మారిన జొమాటో సీఈవో! బైక్పై ఫుడ్ డెలివరీ
ప్రముఖ ఫుడ్ డెలివరి సంస్థ జొమాటో (Zomato) సీఈఓ దీపిందర్ గోయల్ (Deepinder Goyal) ఫుడ్ డెలివరీ బాయ్గా మారిపోయారు. ఫ్రెండ్షిప్ డే (Friendship Day) సందర్భంగా సాధారణ డెలివరీ బాయ్ లాగా రెడ్ టీ షర్ట్ ధరించి బైక్పై ఫుడ్ డెలివరీలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జొమాటో టీ షర్ట్ వేసుకున్న దీపిందర్ గోయల్ ఫ్రెండ్షిప్డే సందర్భంగా పలువురు కస్టమర్లకు, డెలివరీ పార్ట్నర్స్కు, రెస్టారెంట్ పార్ట్నర్స్కు ఫుడ్ పార్సిల్స్, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అందించేందుకు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై బయలుదేరారు. ఇదీ చదవండి: ..అలా 15 కేజీలు బరువు తగ్గాను: ఫిట్నెస్ సీక్రెట్ చెప్పిన ఫుడ్ డెలివరీ యాప్ సీఈవో 'రెస్టారెంట్లు, వినియోగదారులతోపాటు డెలివరీ పార్ట్నర్స్కు ఆహారం, ఫ్రెండ్షిప్ బ్యాండ్లను అందించేందుకు వెళ్తున్నా. ఇది నాకు ప్రత్యేకమైన ఆదివారం' అంటూ దీపిందర్ గోయాల్ ట్వీట్ చేశారు. ఈ ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. వీటిపై యూజర్లు తమకు తోచిన విధంగా స్పందించారు. అంతా బాగుంది కానీ, ఆర్డర్లపై ఫ్రెండ్షిప్ డే చార్జ్లేవీ విధించరు కదా అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. Going to deliver some food and friendship bands to our delivery partners, restaurant partners and customers. Best Sunday ever!! pic.twitter.com/WzRgsxKeMX — Deepinder Goyal (@deepigoyal) August 6, 2023 -
..అలా 15 కేజీలు బరువు తగ్గాను: ఫుడ్ డెలివరీ యాప్ సీఈవో
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ నాలుగు ఏళ్లలో 15 కిలోలు బరువు తగ్గినట్లు ప్రకరించారు. తన ఫిట్నెస్ ప్రయాణం గురించి ఆయన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. 2019లో కోవిడ్ మహమ్మారి విజృంభణకు కొన్ని నెలల ముందు నుంచే తాను పనితోపాటు ఆరోగ్యానికీ సమాన ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించినట్లు దీపిందర్ గోయల్ రాసుకొచ్చారు. అంటే మరీ విపరీతంగా అన్నీ చేయడం కాకుండా చిన్న చిన్నగా స్థిరత్వాన్ని కొనసాగించినట్లు తెలిపారు. తాను 2019లో ఎలా ఉన్నాడో.. 2023 ఎలా మారాడో ఫొటోలను జత చేశారు. గోయల్ తన శరీరంలోని కొవ్వును 28 శాతం నుంచి 11.5 శాతానికి తగ్గించగలిగారు. 2019లో 87 కిలోల బరువున్న ఆయన ఇప్పుడు 72 కిలోలకు తగ్గారు. అలాగే ఆరోగ్యానికి అత్యంత హానికరమైన చెడు కొలెస్ట్రాల్ను కూడా గణనీయంగా తగ్గించుకున్నారు. 2019లో 165 mg/dL ఉన్న చెడు కొలెస్ట్రాల్ ప్రస్తుతం 55 mg/dL కు తగ్గింది. అదేవిధంగా గుండె జబ్బుకు కారణమయ్యే ట్రైగ్లిజరైడ్స్ 185 mg/dL నుంచి 86 mg/dLకి తగ్గాయి. ఇక బ్లడ్ షుగర్ కూడా 6.2 నుంచి 4.8కి తగ్గిందని దీపిందర్ గోయల్ పేర్కొన్నారు. ఇదీ చదవండి ➤ ChatGPT Diet Plan: చాట్జీపీటీ డైట్ ప్లాన్.. 11 కేజీల బరువు తగ్గాడు! కాగా దీపిందర్ గోయల్ చేసిన ఈ పోస్టు అనేక మంది యూజర్లను విశేషంగా ఆకర్షించింది. దీనిపై పలువురు ఫాలోవర్లు తమ నచ్చిన విధంగా కామెంట్లు చేశారు. దేశం మొత్తం జొమాటో నుంచి ఆర్డర్ చేస్తుంటే దాని సీఈవో మాత్రం ఇంటి ఫుడ్ తింటున్నారని ఓ యూజర్ చమత్కరించారు. ఈ అద్భుతమైన పరివర్తన వెనుక ఉన్న రహస్యం చెప్పాలని కోరుతూ ఓ ఫాలోవర్ చేసిన కామెంట్పై దీపిందర్ గోయల్ ప్రతిస్పందించారు. స్థిరత్వమే రహస్యంమని రిప్లై ఇచ్చారు. View this post on Instagram A post shared by Deepinder Goyal (@deepigoyal) -
జొమాటో సీఈఓ అద్భుతమైన కార్ల ప్రపంచం - చూద్దాం రండి!
దీపిందర్ గోయల్ (Deepinder Goyals) అనగానే అందరికి జొమాటో గుర్తొస్తుంది. భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అందరూ మెచ్చే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారమ్లలో జొమాటో ఒకటిగా నిలిచింది. పంజాబ్ రాష్ట్రంలో ఒక సాధారణ ఉపాధ్యాయ దంపతులకు జన్మించిన గోయల్ ఈ రోజు రూ. 2వేల కోట్లకంటే ఎక్కువ సంపాదించాడు. కోటీశ్వరుడైన దీపిందర్ గోయల్ ఉపయోగించే కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫెరారీ రోమా జొమాటో ప్రధాన కార్యాలయం సమీపంలోని రోడ్ల మీద తరచుగా దీపిందర్ గోయల్ తన ఫెరారీ రోమా కారులో కనిపిస్తూ ఉంటాడు. ఈ కారు రెడ్ కలర్లో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. చిత్రమేమంటే జొమాటో యాప్ కూడా ఇదే కలర్లో ఉండటం గమనార్హం. ఈ కారు ధర సుమారు రూ. 4.3 కోట్లు (ఆన్-రోడ్ ప్రైస్). ఫెరారీ రోమా 3.9 లీటర్ ట్విన్టర్బో వి8 ఇంజన్ కలిగి 690 బిహెచ్పి పవర్, 760 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్బాక్స్తో వస్తుంది. పోర్స్చే 911 టర్బో ఎస్ పోర్స్చే కంపెనీకి చెందిన 911 టర్బో ఎస్ కూడా దీపిందర్ గోయల్ ఉపయోగించే కార్లలో ఒకటి. దీని ధర రూ. 3.13 కోట్లు. ఈ కారు కేవలం 8.9 సెకన్లలో గంటకు 200 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులోని ఇంజిన్ 650 hp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. (ఇదీ చదవండి: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఐస్క్రీమ్ - ఈ ధరతో ఒక కారు కొనేయొచ్చు!) లంబోర్ఘిని ఉరుస్ మన దేశంలో ఎక్కువ మంది సెలబ్రిటీల వద్ద ఉన్న లగ్జరీ కార్లలో లంబోర్ఘిని ఉరుస్ ఒకటి. ఈ కారుని దీపిందర్ గోయల్ కూడా కొనుగోలు చేశారు. దీని ధర రూ. 4.18 కోట్లు. ఇందులో 4.0-లీటర్, ట్విన్-టర్బో వి8 ఇంజిన్ ఉంటుంది. ఇది 650 hp పవర్, 850 Nm టార్క్ అందిస్తుంది. కేవలం 3.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. పోర్స్చే కారెరా ఎస్ పోర్స్చే కంపెనీకి చెందిన కారెరా ఎస్ దీపిందర్ గోయల్ వద్ద ఉన్న సూపర్ కార్లలో ఒకటి. దీని ధర రూ. 1.88 కోట్లు. ఇందులోని 3.0 లీటర్ ప్లాట్ సిక్స్ సిలిండర్ బాక్సర్ పెట్రోల్ ఇంజిన్ 450 bhp పవర్, 530 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా ఉత్తమంగా ఉండటమే కాకుండా పనితీరు పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. (ఇదీ చదవండి: అపర కుబేరులు జిమ్లో ఉంటే ఇలాగే ఉంటారా? ఫోటోలు చూడండి!) ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
జొమాటో సిఈవో కొత్త కారు.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
సెలబ్రెటీలు, పారిశ్రామిక వేత్తలు ఎప్పటికప్పుడు ఖరీదైన, విలాసవంతమైన కార్లను కొనుగోలు చేస్తారనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే జొమాటో సిఈవో, వ్యవస్థాపకుడు 'దీపిందర్ గోయల్' ఇటీవల అత్యంత ఖరీదైన 'ఫెరారీ రోమా' కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో వెల్లడైన కొన్ని ఫోటోల ప్రకారం, ఈయన కొనుగోలు చేసిన కారు హర్యానాలోని గురుగ్రామ్ రోడ్లపై తిరుగుతున్నట్లు తెలిసింది. ఈ కారు ధర సుమారు రూ. 4.3 కోట్లు (ఆన్-రోడ్ ప్రైస్). ఇది రెడ్ కలర్లో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. చిత్రమేమంటే జొమాటో యాప్ కూడా ఇదే కలర్లో ఉండటం గమనార్హం. ఫెరారీ కంపెనీ 2021లో రోమా కారుని ప్రారంభించింది. అయితే ఇది భారతదేశంలో కొంతమంది ధనవంతుల వద్ద మాత్రమే ఉంది. దీనికి కారణం ఈ కారు ధర ఎక్కువగా ఉండటమే. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్లతో స్లిమ్ ఎల్ఈడీ హెడ్లైట్లను పొందుతుంది. అంతే కాకుండా క్వాడ్-ఎగ్జాస్ట్ సెటప్, ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ స్పాయిలర్ కూడా ఇందులో ఉన్నాయి. (ఇదీ చదవండి: బజాజ్ ప్రేమికుల కోసం చేతక్ ప్రీమియం ఎడిషన్.. ధర, రేంజ్ వివరాలు) ఫెరారీ రోమా క్యాబిన్, డ్రైవర్, కో డ్రైవర్ సీటు కూడా భిన్నంగా ఉంటాయి. సెంటర్ కన్సోల్లో 8.4 ఇంచెస్ టాబ్లెట్-స్టైల్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 16 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బటన్లతో కూడిన కొత్త స్టీరింగ్ వీల్ కూడా ఇందులో అమర్చబడి ఉంటాయి. ఫెరారీ రోమా 3.9 లీటర్ ట్విన్టర్బో వి8 ఇంజన్ కలిగి 690 బిహెచ్పి పవర్, 760 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్బాక్స్తో జతచేయబడి ఉంటుంది. జొమాటో సీఈఓ దీపేందర్ గోయల్ వద్ద ఫెరారీ రోమాతో పాటు లంబోర్ఘిని ఉరస్, పోర్షే 911 కారెరా వంటి సూపర్ కార్లు కూడా ఉన్నాయి. -
జొమాటోకు భారీ షాక్, కో-ఫౌండర్ రాజీనామా
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు భారీ షాక్ తగిలింది. కో ఫౌండర్ మోహిత్ గుప్తా ఆ సంస్థకు రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు. రిజైన్పై నోట్ను విడుదల చేసిన గుప్తా.. అందులో జొమాటో సంస్థకు శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ దీర్ఘకాలిక పెట్టుబడిదారుడిగా కొనసాగుతున్నట్లు తెలిపారు. ‘సంవత్సరాల తరబడి మేము నేర్చుకున్న ప్రతిదానిని మీరు కొనసాగించడం కోసం నేను ఎదురు చూస్తున్నాను. కనికరం లేకుండా ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. ప్రపంచానికి రోల్ మోడల్గా ఉండేలా సంస్థను నిర్మించండని’ అని అన్నారు. కోవిడ్-19 మహమ్మారి వంటి సవాళ్లు ఉన్నప్పటికీ జొమాటోను లాభదాయకమైన వ్యాపారం గా మార్చేందుకు ఫౌండర్ దీపిందర్ గోయల్, ఉద్యోగుల్ని కృషి చేశారని గుప్తా ప్రశంసించారు. గత కొన్ని సంవత్సరాలుగా దీపిందర్ గోయల్ మరింత పరిణతి చెందిన, నమ్మకమైన లీడర్గా మారడం నేను చూశాను. అతను ఇప్పుడు మీ అందరితో కలిసి వ్యాపారాన్ని ఉజ్వలమైన భవిష్యత్తుకు నడిపించగల సామర్థ్యం కలిగి ఉన్నాడు’ అని చెప్పారు. -
‘జొమాటో చెప్పినట్లే చేస్తోంది’
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో వాటాదారులకు చెప్పినట్టుగానే అడుగులు వేస్తోంది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో నష్టాలను మరింత తగ్గించుకుని.. రూ.251 కోట్లకు పరిమితం చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నష్టాలు రూ.435 కోట్లతో పోలిస్తే సగం తగ్గినట్టు తెలుస్తోంది. కార్యకలాపాల ద్వారా ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,024 కోట్లతో పోలిస్తే 60 శాతం పెరిగి రూ.1,661 కోట్లకు ఎగసింది. ఆగస్ట్ 10 నుంచి జొమాటో విలీనం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి జొమాటో గణాంకాలను కూడా కలిపి చూస్తే ఆదాయం త్రైమాసికం వారీగా 16 శాతం పెరిగి, (వార్షికంగా 48 శాతం వృద్ధి) రూ.2,107 కోట్లుగా ఉంది. వార్షికంగా చూస్తే బిలియన్ డాలర్ల (రూ.8,000 కోట్లు) ఆదాయ మార్క్ను మొదటిసారి ఓ త్రైమాసికంలో చేరుకున్నట్టు జొమాటో ప్రకటించింది. ‘‘దీర్ఘకాలం కోసం వ్యాపార నిర్మాణ క్రమంలో ఉన్నాం. దీర్ఘకాలం కోసం స్వల్పకాల అంచనాల విషయంలో రాజీపడడం, అవకాశాలను అంచనా వేయడం అన్నది ఎప్పటి మాదిరే కొనసాగుతుంది’’అని జొమాటో సీఈవో, వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ తెలిపారు. మెరుగైన పనితీరు అంశంపైనా మాట్లాడారు. ‘‘చాలా విభాగాల్లో మేము మెరుగుపడాల్సి ఉంది. నాణ్యమైన ఉత్పత్తులను పెద్ద మొత్తంలో, వేగంగా డెలివరీ చేయాలి. కస్టమర్ల అభిప్రాయాలను సరైన విధంగా అర్థం చేసుకోవాలి. అలాగే, రెస్టారెంట్ భాగస్వాములు, డెలివరీ భాగస్వాముల అభిప్రాయాలను కూడా తరచూ వినాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న నమూనాలను సవాలు చేస్తూ, మరిన్ని రిస్క్లు తీసుకోవాల్సి ఉంది’’అని వివరించారు. బ్లింకిట్పై అభిప్రాయం మారుతుంది బ్లింకిట్ గురించి మాట్లాడుతూ.. ‘‘చాలా మంది ఇన్వెస్టర్లు ప్రస్తుతం బ్లింకింట్ వ్యాపారానికి సున్నా విలువ కడుతున్నారు. అది అర్థం చేసుకోతగినది. కొంత కాలానికి ఇది మారుతుందని నాకు నమ్మకం ఉంది’’అని గోయల్ వివరించారు. అన్ని ఇబ్బందులను అధిగమించామని, ప్రస్తుతం బ్లింకిట్కు నిలకడైన టీమ్ ఏర్పడిందని చెప్పారు. ఈ బృందం మంచి ఫలితాలను తీసుకొస్తున్నట్టు చెప్పారు. -
ర్యాష్ డ్రైవింగ్: జొమాటో హాట్లైన్ నంబర్ లాంచ్
న్యూఢిల్లీ: డెలివరీ పార్ట్నర్లు ర్యాష్గా డ్రైవింగ్ చేస్తున్న పక్షంలో ప్రజలు తమకు ఫిర్యాదు చేసేందుకు వీలుగా కొత్త డెలివరీ బ్యాగ్లను ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని ఆన్లైన్ ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. తమ బ్యాగ్లపై ‘హాట్లైన్ ఫోన్ నంబర్‘ ముద్రించి ఉంటుందని ట్వీట్ చేశారు. వేగంగా డెలివరీలు చేయాలంటూ తాము పార్ట్నర్లను ఒత్తిడి చేయమని ఆయన పేర్కొన్నారు. సత్వరం అందిస్తే ప్రోత్సాహకాలు ఇవ్వడం, లేకపోతే పెనాల్టీలు విధించడం వంటివి ఏమీ ఉండవని గోయల్ స్పష్టం చేశారు. అసలు వారికి ఎస్టిమేటెడ్ డెలివరీ కూడా చెప్పం. ఈ నేపథ్యంలో తమ డె లివరీ పార్ట్నర్లు ఎవరైనా వేగంగా నడుపుతుంటే. తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. తద్వారా రోడ్లపై ట్రాఫిక్ను రద్దీ లేకుండా నివారించాలని ఆయన కోరారు. 10 నిమిషాల్లోనే ఇన్స్టంట్ డెలివరీ సర్వీసులు ప్రారంభిస్తున్నామని గతంలో ప్రకటించినప్పుడు డెడ్లైన్ పేరిట డెలివరీ పార్ట్నర్లపై ఒత్తిడి పెంచుతున్నారంటూ జొమాటోపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో గోయల్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. As promised earlier, we have started rolling out delivery bags which mention a hotline phone number to report rash driving by our delivery partners. Please remember – we don’t incentivise our delivery partners for on time deliveries, nor do we penalise them for late ones. (1/2) pic.twitter.com/Jic36Rt1qn — Deepinder Goyal (@deepigoyal) November 2, 2022 -
జొమాటో సీఈవో దీపిందర్ గోయల్కు భారీ షాక్, బెడిసి కొట్టిన మాస్టర్ ప్లాన్!
జొమాటో సీఈవో దీపిందర్ గోయల్కు భారీ షాక్ తగిలింది. పదినిమిషాల్లో డెలివరీ అంటూ గోయల్ వేసిన మాస్టర్ ప్లాన్ బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. ఆరంభం అదిరేలా గూర్గావ్ కేంద్రంగా జొమాటో 10నిమిషాల్లో ఫుడ్ డెలివరీ పైలెట్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. కానీ డెలివరీ బాయ్స్ లేక..చెప్పిన టైంకు కస్టమర్లకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ను డెలివరీ చేయడంలో విఫలమవుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదే సమస్యతో స్విగ్గీ సైతం తన 'జెనీ' సేవల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆర్డర్లు ఆలస్యం అవ్వడంతో ఏం జరుగుతుందో అర్ధం గాక కస్టమర్లు తలలు పట్టుకుంటున్నారు. మేం అందుబాటులోకి తెచ్చే పదినిమిషాల ఫుడ్ డెలివరీ సర్వీస్ ప్రపంచంలో ఇంత వరకు ఏ ఇతర ఫుడ్ డెలివరీ సంస్థలు కస్టమర్లకు అందించలేదు. కానీ మేం అందిస్తాం. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయబోతున్నాం. తొలత ఈ టెన్ మినిట్స్ డెలివరీ పైలెట్ ప్రాజెక్ట్ను గుర్గావ్లో ప్రారంభిస్తున్నాం. తర్వాత దేశ వ్యాప్తంగా కస్టమర్లకు ఫుడ్ డెలివరీ అందిస్తున్నామని ప్రకటించి జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ గట్టి ప్లానే వేశారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ బెడిసి కొట్టినట్లు తెలుస్తోంది. పది నిమిషాల సంగతి దేవుడెరుగు పది నిమిషాల సంగతి దేవుడెరుగు. ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఐటమ్ 15 నుంచి 20 నిమిషాలకు కూడా అందడం లేదంటూ జొమాటోపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ కంపెనీ ప్రతినిధులు మాత్రం తాము చెప్పినట్లుగానే జొమాటో ఇన్స్టంట్ ద్వారా పదినిమిషాల్లో ఫుడ్ను కస్టమర్లకు అందిస్తున్నామని చెబుతున్నారు. గూర్గావ్లో జొమాటో ఇన్స్టంట్ ద్వారా టెన్ మినిట్స్ డెలివరీపై ఊహించని రెన్సాన్స్ వచ్చిందని, మే నెలలో బెంగళూరులో సైతం ఈ డెలివరీ విధానాన్ని అమలు చేయనున్నట్లు చెబుతున్నారు. జొమాటో ఇన్స్టంట్ యాప్లో సైతం ఫుడ్ డెలివరీ టైం 15 నుంచి 20నిమిషాల సమయం చూపెట్టడంపై ఫుడ్ లవర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డెలివరీ బాయ్స్కు కొత్త కష్టాలు ఈ నేపథ్యంలో జొమాటో 10నిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేయడం సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతుండగా..సీఎన్బీసీ టీవీ18 ఆసక్తికర కథనం వెలుగులోకి వచ్చింది. ఆ కథనం ప్రకారం..క్విక్ కామర్స్ (10నిమిషాల్లో ఆర్డర్ అందించడం), జాబ్ మొబిలిటీ (ఉన్న జాబ్ వదిలేసి మరో కొత్త ఫీల్డ్లోకి వెళ్లడం) వంటి అంశాలు స్విగ్గీ, జొమాటోలకు డెలివరీ బాయ్స్ గుడ్ బై చెబుతున్నట్లు నివేదించింది. దీంతో పాటు సమ్మర్ సీజన్, ఐపీఎల్, వర్షాల కారణంగా డెలివరీ బాయ్స్..ఆర్డర్లను డెలివరీ చేసేందుకు ముందుకు రావడం లేదని తెలిపింది. సేమ్ టూ సేమ్ దీంతో ఇన్ టైమ్లో కస్టమర్లకు ఫుడ్ డెలివరీని అందించకపోవడంతో జొమాటో, స్విగ్గీలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్ సీజన్ కారణంగా డిమాండ్కు తగ్గట్లు డెలివరీ బాయ్స్ లేక స్విగ్గీ సంస్థ జెనీ పేరుతో నిర్వహిస్తున్న పిక్ అప్.. డ్రాప్ ఆఫ్ సేవల్ని ముంబై, హైదరాబాద్, బెంగళూరులలో సేవల్ని తాత్కాలికంగా నిలిపివేసింది. “క్రికెట్, పండుగల సీజన్ ఫలితంగా ఫుడ్ మార్కెట్ప్లేస్, ఇన్స్టామార్ట్ రెండింటికీ అవసరాల్ని తీర్చడానికి డిమాండ్ పెరిగింది. అందుకు అనుగుణంగా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిమాండ్కు అనుగుణంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రస్తుతం స్విగ్గీ జెనీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటలో స్విగ్గీ తెలిపింది. చదవండి👉స్విగ్గీ బంపరాఫర్: డెలివరీ బాయ్స్ కష్టాలకు చెక్.. కళ్లు చెదిరేలా జీతాలు! -
జొమాటో డెలివరీ పార్ట్నర్స్కి గుడ్న్యూస్!
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ తన ఉదారత చాటుకున్నారు. సంస్థ డెలివరీ పార్ట్నర్స్ పిల్లల చదువుకు ఆర్థికంగా తోడ్పాటు అందించే దిశగా జొమాటో ఫ్యూచర్ ఫౌండేషన్ (జెడ్ఎఫ్ఎఫ్)కు 90 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 700 కోట్లు) విలువ చేసే ఎసాప్స్ను (స్టాక్ ఆప్షన్స్) విరాళంగా ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు సంస్థ అంతర్గతంగా ఉద్యోగులకు ఆయన లేఖ రాశారు. జొమాటో పబ్లిక్ ఇష్యూకి వెళ్లడానికి ముందు .. ఇన్వెస్టర్లు, బోర్డు ఆయన పనితీరు ప్రాతిపదికన కొన్ని ఎసాప్స్ను కేటాయించింది. వీటన్నింటినీ ఫౌండేషన్కు అందిస్తున్నట్లు గోయల్ తెలిపారు. ఇద్దరు పిల్లలకు గత నెలలో షేరు సగటు ధర ప్రకారం వీటి విలువ సుమారు రూ. 700 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. అయిదేళ్లకు పైగా తమ డెలివరీ పార్ట్నర్స్గా పనిచేస్తున్న వారి పిల్లల (గరిష్టంగా ఇద్దరికి) చదువు ఖర్చుల కోసం ఏటా ఒక్కొక్కరికి రూ. 50,000 వరకూ ఈ ఫండ్ నిధులు అందిస్తుంది. అదే పదేళ్ల పైగా పని చేస్తున్న వారి పిల్లలకు ఏటా రూ. 1 లక్ష వరకూ లభిస్తుంది. మహిళా డెలివరీ పార్ట్నర్లకు ఈ పని కాలానికి సంబంధించి కొంత వెసులుబాటు ఉంటుంది. ఫండ్కు నిధులు సమకూర్చేందుకు తొలి ఏడాది తన ఎసాప్స్లో 10 శాతాన్ని విక్రయించనున్నట్లు గోయల్ పేర్కొన్నారు. చదవండి: శబాష్!! జొమాటో.. చెప్పింది చేసింది! -
జొమాటోపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..! సాధ్యమంటోన్న కంపెనీ సీఈవో
పది నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ అందించేందుకు సిద్దంగా ఉన్నామని జొమాటో ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా కంపెనీ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పది నిమిషాల్లో డెలివరీ చేసే డెలివరీ బాయ్స్ పరిస్థితి ఏంటని ట్విటర్లో ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా పది నిమిషాల డెలివరీ వ్యవహారం పార్లమెంట్లో చర్చకు దారి తీసింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం నిప్పులు చెరిగారు. సదరు కంపెనీలు వేగంగా డెలివరీ చేసే మోజులో పడ్డాయని, డెలివరీ బాయ్స్ భద్రత గురించి కంపెనీలు పట్టించుకోవడం లేదంటూ పార్లమెంట్లో ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ వ్యవహారంపై జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ స్పందించారు. 10 నిమిషాల్లో డెలివరీ సాధ్యమే..! సోషల్మీడియాలో నెటిజన్లు లేవనెత్తిన ప్రశ్నలకు జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ వివరణ ఇచ్చారు. అంతేకాకుండా పది నిమిషాల్లో డెలివరీ సాధ్యమంటూ పేర్కొన్నారు. జొమాటో ఇన్స్టంట్ సేవల్లో భాగంగా డెలివరీ బాయ్స్కు ఎలాంటి ఆటంకాలు రావని, వారి భద్రతకు కంపెనీ కట్టుబడి ఉందని పేర్కొన్నాడు. ► జొమాటో ఇన్స్టంట్ సేవల్లో భాగంగా 10 నిమిషాల డెలివరీ సర్వీస్...నిర్దిష్ట ప్రాంతాల్లో ఎక్కువగా జనాదరణ పొందిన, ప్రామాణిక ఫుడ్ ఐటమ్స్ రెండు నిమిషాల్లో రెడీ అయ్యే వాటిని మాత్రమే డెలివరీ చేస్తామని తెలిపారు. ► ఇక ఆలస్యమైన డెలివరీలపై ఎలాంటి జరిమానాలు లేవు. 10 నుంచి 30 నిమిషాల డెలివరీలకు ఎటువంటి ప్రోత్సాహకాలు లేవంటూ గోయల్ పేర్కొన్నారు. ► పది నిమిషాల్లో డెలివరీ అందించేందుగాను కొత్త ఫుడ్ స్టేషన్లను నిర్మిస్తామని తెలిపారు. వీటి సహాయంతో డెలివరీ వేగంగా అవుతుందని అభిప్రాయపడ్డారు. ► డెలివరీ భాగస్వాములకు రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తామని, వారికి ప్రమాద, జీవిత బీమాను కూడా అందిస్తామని గోయల్ చెప్పారు. ► 10 నిమిషాల్లో తమ కస్టమర్లకు వెంటనే రెడీ అయ్యే.. "బ్రెడ్, ఆమ్లెట్, పోహా, కాఫీ, చాయ్, బిర్యానీ, మోమోస్ మొదలైన ఫుడ్ ఐటమ్స్ను డెలివరీ చేస్తామని గోయల్ తెలిపారు. Again, 10-minute delivery is as safe for our delivery partners as 30-minute delivery. God, I love LinkedIn :P (2/2) pic.twitter.com/GihCjxA7aQ — Deepinder Goyal (@deepigoyal) March 22, 2022 చదవండి: జొమాటో సంచలన నిర్ణయం..! ఇకపై పది నిమిషాల్లోనే డెలివరీ..ముందుగా అక్కడే -
జొమాటో సంచలన నిర్ణయం..! ప్రపంచంలోనే మొదటి కంపెనీగా..!
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం జొమాటో సంచలన నిర్ణయం తీసుకుంది. కేవలం పది నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ అందించేందుకు సిద్దమైంది. జొమాటో ఇన్స్టంట్..! ప్రముఖ గ్రాసరీ సంస్థ జెప్టో కేవలం 10 నిమిషాల్లోనే గ్రాసరీ సేవలను డెలివరీ చేస్తోన్న విషయం తెలిసిందే. జెప్టో తరహాలోనే ఫుడ్ డెలివరీ సేవలను అందించేందుకు జొమాటో సిద్థమవుతోంది. అందుకోసం 'జోమాటో ఇన్స్టంట్'ని త్వరలో ప్రారంభించనున్నట్లు కంపెనీ సోమవారం రోజున ప్రకటించింది. వచ్చే నెల నుంచి గురుగ్రామ్లోని నాలుగు స్టేషన్లతో జోమాటో ఇన్స్టంట్ను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనుంది. మొదటి కంపెనీగా రికార్డు..! ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ కంపెనీ ఫుడ్ డెలివరీ సంస్థ 10 నిమిషాల్లోపు తాజా ఆహారాన్ని డెలివరీ చేయలేదు. కేవలం పది నిమిషాల్లో వేడి వేడి, తాజా ఆహారాన్ని అందించే సంస్థగా జొమాటో రికార్డులు క్రియేట్ చేయనుందని జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ వెల్లడించారు. రెస్టారెంట్లను క్రమబద్దీకరించడం, సదరు ప్రాంతంలో ఎక్కువగా తినే ఆహార పదార్థాల లిస్టింగ్ సహాయంతో ఫుడ్ డెలివరీ 10 నిమిషాల్లో చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా కస్టమర్ల నుంచి వస్తోన్న డిమాండ్ నేపథ్యంలో జొమాటో ఇన్స్టంట్ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. 10 నిమిషాల డెలివరీ ఎలా పని చేస్తుందంటే? జొమాటో ఏర్పాటు చేసే ప్రతి ఫినిషింగ్ స్టేషన్లో డిమాండ్ ప్రిడిక్టబిలిటీ , హైపర్లోకల్ ప్రాధాన్యతల ఆధారంగా వివిధ రెస్టారెంట్ల నుంచి బెస్ట్ సెల్లర్ వస్తువులు (సుమారు 20-30 వంటకాలు) అందుబాటులో ఉంటాయని గోయల్ చెప్పారు. ఇక కస్టమర్లకు డెలివరీ ఛార్జీలు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఛార్జీల తగ్గింపు జొమాటో రెస్టారెంట్ భాగస్వాములతో పాటు, డెలివరీ బాయ్స్కు వారి ఆదాయాల్లో మార్పు ఉండదని తెలిపారు. చదవండి: ఎంత పని చేశార్రా..! జోమోటో పేరును మార్చేశారుగా..!
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement