-
విదేశీ చెల్లింపులకు డిజిటల్ కరెన్సీ!: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: విదేశీ చెల్లింపులకు వీలుగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని మెరుగుపరచడంలో ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ పూర్థిస్థాయి దృష్టి సారించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్బీఐ పైలట్ ప్రాజెక్స్గా దీనిని ప్రారంభించిందని, అమలుకుగాను తొమ్మిది బ్యాంకులు - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్ఎస్బీసీలను ఎంచుకుందని అన్నారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ పేపర్ కరెన్సీ, నాణేల మాదిరిగానే అదే విలువలతో జారీ అవుతుందన్నారు. బ్యాంకుల వంటి ఫైనాన్షియల్ మీడియేటర్ల ద్వారా పంపిణీ జరుగుతుందని అన్నారు. భాగస్వామ్య బ్యాంకులు అందించే డిజిటల్ వాలెట్ ద్వారా వినియోగదారులు ఈ–రూపాయితో లావాదేవీలు చేయగలుగుతారని కూడా వెల్లడించారు. ‘‘విదేశీ చెల్లింపులలో డిజిటల్ కరెన్సీ సహాయపడుతుందని మేము గట్టిగా విశ్వసిస్తున్నాము. ఇది మరింత పారదర్శకత, లభ్యత సౌలభ్యతలను సమకూర్చుతుంది’’ అని హిందూ కళాశాల 125 సంవత్సరాలను పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో సీతారామన్ అన్నారు. ఇది తక్కువ ఖర్చుతో చెల్లింపులను వేగవంతం చేయడంలో సహాయపడుతుందని, దేశీయంగా, అంతర్జాతీయంగా జరిగే చెల్లింపుల విషయాల్లో వ్యయాలను తగ్గిస్తుందని వివరించారు. తయారీ, వ్యవసాయంపై దృష్టి.. భారతదేశాన్ని ‘వికసిత భారత్’గా మార్చడానికి ప్రాధాన్యతా రంగాల గురించి అడిగిన ప్రశ్నకు ఆర్థికమంత్రి సమాధానం చెబుతూ, తయారీ వ్యవసాయంపై దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. ‘‘వ్యవసాయం దాని ప్రాధాన్యతను పటిష్టం చేసుకుంది. కొన్ని విధానాలు, ఆధునికీకరణల ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి తగిన కృషి చేస్తున్నాము’’ అని మంత్రి అన్నారు. తయారీలో, పునరుత్పాదక శక్తి, సెమీ కండక్టర్, మెషిన్ లెర్నింగ్, ఎర్త్ సైన్సెస్, స్పేస్తో సహా 13 పురోగతి బాటలో ఉన్న రంగాలను ప్రభుత్వం గుర్తించిందని ఆమె చెప్పారు. సామాజిక పథకాల అమల్లో పురోగతి పేదలకు కనీస అవసరాలు అందించడానికి రూపొందించిన సామాజిక రంగ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం సంతృప్తికరమైన స్థాయికి చేరుకుంటోందని ఆర్థికమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారతదేశం ఆర్థికంగా ’ఆత్మనిర్భర్’ (స్వయం సమృద్ధి) సాధించే సమయం ఆసన్నమైందని అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. ఈ శక్తి సామర్థ్యాలు భారత్కు ఉన్నాయని వివరించారు. ఎటువంటి పురోగతి లేకుండా స్వాతంత్య్ర భారత్ 60 సంవత్సరాలు గడిపిందన్న ఆమె, ‘‘మేము వికసిత భారత్కు భౌతిక పునాదిని వేశాము. అందరికీ ప్రాథమిక అవసరాలను అందించడం ద్వారా ప్రజలను శక్తివంతం చేశాము’’ అన్ని అన్నారు. డీబీటీతో పారదర్శకత బోగస్, అవాంఛనీయ లబ్ధిదారులను తొలగించడం ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా ప్రభుత్వం రూ. 2.5 లక్షల కోట్లను ఆదా చేయగలిగిందని ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. డీబీటీ ద్వారా ప్రభుత్వ నిధుల బదిలీలో పారదర్శకతను మెరుగుపరచడమే కాకుండా సాంకేతికతను ఉపయోగించడం ద్వారా సామర్థ్యాన్ని మెరుగుపరిచిందని ఆమె అన్నారు. ప్రజలకు సామాజిక కార్యక్రమాలను అందించడంలో ప్రభుత్వానికి ఎటువంటి పక్షపాతం ఉండబోదని స్పష్టం చేశారు. ప్రధాని భారతదేశాన్ని యువత, మహిళలు, రైతులు పేదలు అనే నాలుగు గ్రూపులుగా వర్గీకరించడారని, మతాలు, కులాలతో సంబంధం లేకుండా ఈ సమూహాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. నూనె గింజలు, పప్పుధాన్యాలు మినహా వ్యవసాయానికి సంబంధించినంతవరకు భారతదేశం దాదాపు స్వయం సమృద్ధి సాధించిందని ఆమె అన్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలు సమస్యలను ఎదుర్కొంటున్నందున ఆహారాన్ని వృథా చేయవద్దని ఆమె ఈ సందర్భంగా సూచించారు. రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్టతో నాగరికత విలువల పునరుద్ధరణ జనవరి 22న రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్ట వేడుకను ’నాగరికత గుర్తు’గా నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నాగరికత విలువల పునరుద్ధరణకు సాక్ష్యంగా నిలిచిన ప్రస్తుత తరానికి ఈ వేడుకలు అదృష్ట తరుణమని ఆమె అన్నారు. నైపుణ్యాల అభివృద్ధితో పాటు నాగరికత– జాతీయత రెండింటికీ సంబంధించి విలువల పటిష్టతపై దృష్టి పెట్టాలని ఆమె విద్యార్థులను కోరారు. దేశం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటోందని విద్యార్థులకు గుర్తు చేస్తూ, ఓటు వేయడం పౌరుల హక్కు మాత్రమే కాదని, అది వారి కర్తవ్యం కూడా అని అన్నారు. మొదటి సారి ఓటరుగా ఉన్న వారిపై ఎక్కువ బాధ్యత ఉందని ఆమె అన్నారు. సోషల్ మీడియా సహా వివిధ మాధ్యమాల ద్వారా వ్యాప్తి చెందుతున్న ప్రతికూలతలను చూసి విద్యార్థులు తప్పుదారి పట్టవద్దని ఆమె కోరారు. ఎకానమీపై తప్పుడు ప్రచారం భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని ఆర్థికమంత్రి పేర్కొంటూ, కంపెనీలు, స్టాక్ మార్కెట్ చాలా బాగా పని చేస్తున్నాయని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బాగా లేదని, తీవ్ర ఒడిదుడుకులతో పయనిస్తోందన్న కథనాలు అవాస్తమమని అన్నారు. అలాంటి ప్రచారం చేస్తున్న వారు ఏ ప్రాతిపదికన ఈ విషయాన్ని చెబుతున్నారో చెప్పాలని తాను కోరుకుంటున్నట్లు వివరించారు. అయితే సమాధానం చెప్పడానికి వారు అందుబాటులో ఉండరని విమర్శించారు. తోచింది చెప్పిడం కొందరి పనిగా మారిందని అన్నారు. -
ఫ్యూచర్ మనీ అదే.. ఆర్బీఐ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
డిజిటల్ కరెన్సీ గురించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) క్రాస్-బోర్డర్ చెల్లింపులను ఖర్చుతో కూడుకున్నది కాకుండా మరింత సమర్థవంతం, వేగవంతం చేయగలదని ఆయన భావిస్తున్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో భారత సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రసంగించారు. "CBDC గొప్ప ప్రయోజనం అంతర్జాతీయ చెల్లింపులు. దీని వల్ల అంతర్జాతీయ చెల్లింపులు మరింత సమర్థవంతంగా, వేగవంతంగా, చౌకగా మారతాయి. ఇతర దేశాలు ఈ డిజిటల్ కరెన్సీని స్వీకరించినప్పుడు అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థలు సమర్ధత, వేగం, ఖర్చు అంశాల్లో లాభపడతాయి. అంతిమంగా ఇది ఫ్యూచర్ మనీగా మారుతుందని నేను భావిస్తున్నాను" అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పైలట్ వెర్షన్ విజయవంతంపైనే దేశవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ అమలు ఆధారపడి ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. ‘దీన్ని మనం అధిగమించాల్సి ఉంటుంది. అయితే ఇంతలోపే దీన్ని సాధించాలన్న లక్ష్యం అంటూ ఏమీ లేదు. దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అనవసరమైన తొందరపాటు లేదు. ఎందుకంటే అది కరెన్సీ అయిన తర్వాత, దాని భద్రత, సమగ్రత, సామర్థ్యాన్ని నిర్ధారించాలి’ అన్నారు. దేశంలో 2022లో నవంబర్-డిసెంబర్ టోకు, రిటైల్ కేటగిరీలలో డిజిటల్ కరెన్సీని పైలట్ ప్రాతిపదికన ఆర్బీఐ ప్రారంభించింది. ప్రస్తుతం రిటైల్ విభాగంలో 40 లక్షల మంది, వ్యాపారుల్లో 4 లక్షల మంది ఈ డిజిటల్ కరెన్సీ వినియోగిస్తున్నారు. -
సీబీడీసీ పైలట్ ప్రాజెక్టులోకి 1.7 లక్షల మంది వ్యాపారులు
ముంబై: అధికారిక సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) పైలట్ ప్రాజెక్టులో 1 లక్ష మంది కస్టమర్లు, 1.7 లక్షల మంది పైచిలుకు వ్యాపారులు భాగమైనట్లు ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు వెల్లడించింది. కస్టమర్ల నుంచి ఈ–రూపీల రూపంలో చెల్లింపులను స్వీకరించడంలో వ్యాపారవర్గాలకు ఉపయోగపడేలా యూపీఐ క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించినట్లు వివరించింది. ఇది ప్రస్తుతం ఆండ్రాయిడ్ 10 పైగా వెర్షన్లలో పని చేస్తుందని, త్వరలో ఐవోఎస్ కోసం కూడా అందుబాటులోకి తేనున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేమెంట్స్ విభాగం హెడ్ పరాగ్ రావు తెలిపారు. పెద్ద మెట్రో నగరాలు మొదలుకుని విశాఖ, విజయవాడ వంటి 26 నగరాల్లో ఈ–రూపీ చెల్లింపుల సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం రోజుకు రూ. 5,000 – 10,000 గా ఉన్న డిజిటల్ రూపాయి లావాదేవీల పరిమితిని ఈ ఏడాది ఆఖరు నాటికి రోజుకు రూ. 10 లక్షల స్థాయికి పెంచే యోచనలో ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ టి. రబి శంకర్ ఇటీవలే వెల్లడించారు. -
రోజుకు 10 లక్షల డిజిటల్ రూపీ లావాదేవీలు
ముంబై: ఈ ఏడాది చివరికి రోజువారీగా 10 లక్షల సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ/ఈ–రూపాయి) లావాదేవీల లక్ష్యాన్ని చేరుకుంటామని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రవిశంకర్ ప్రకటించారు. ప్రస్తుతం రోజువారీగా 5,000–10,000 ఈ–రూపీ లావాదేవీలు నమోదవుతున్నట్టు చెప్పారు. యూపీఐ వ్యవస్థతో సీబీడీసీ అనుసంధానతను ఈ ఏడాది జూన్లో ఆర్బీఐ ఎంపీసీలో భాగంగా ప్రకటించగా, ఈ నెలాఖరుకు ఇది కార్యరూపం దాలుస్తుందని రవిశంకర్ తెలిపారు. కాకపోతే సీబీడీసీ ఎకోసిస్టమ్ కిందకు మరిన్ని బ్యాంక్లు చేరాల్సిన అవసరం ఉందన్నారు. గతేడాది నవంబర్లో హోల్సేల్ లావాదేవీలకు సీబీడీసీని ప్రయోగాత్మకంగా ఆర్బీఐ ప్రారంభించగా, అదే ఏడాది డిసెంబర్ నుంచి రిటైల్ లావాదేవీలకు సైతం దీన్ని విస్తరించింది. తొలుత ఎనిమిది బ్యాంక్లను అనుమతించగా, ప్రస్తుతం 13 బ్యాంక్లకు సీబీడీసీ విస్తరించింది. ప్రస్తుతం 13 లక్షల మంది యూజర్లు సీబీడీసీని వినియోగిస్తున్నారని, ఇందులో 3 లక్షల మంది వర్తకులు ఉన్నట్టు రవిశంకర్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో రోజుకు 10 లక్షల లావాదేవీల లక్ష్యం కష్టమైనది కాదన్నారు. యూపీఐపై రోజుకు 31 కోట్ల లావాదేవీలు నమోదవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఎక్కువ మంది యూజర్లను ఆకర్షించడంపైనే దృష్టి పెట్టామని, ఏప్రిల్ నాటికి లక్షగా ఉన్న యూజర్ల సంఖ్య అనంతరం రెండు నెలల్లోనే 13 లక్షలకు పెరిగినట్టు వివరించారు. ఇక మీదట రోజువారీ లావాదేవీల పెంపు లక్ష్యంగా పనిచేయనున్నట్టు పేర్కొన్నారు. -
నా రిపోర్టుతోనే డిజిటల్ కరెన్సీ
సాక్షి, హైదరాబాద్: ‘‘ఐటీ విషయంలో నీకు బాగా అనుభవం ఉంది. డిజిటల్ కరెన్సీ మీద రిపోర్టు ఇవ్వు అని ప్రధాని మోదీ అడిగితే రిపోర్టు ఇచ్చాను. నేనిచ్చి న రిపోర్టు ఆధారంగానే డిజిటల్ కరెన్సీని తెచ్చారు. ఈరోజు కూరగాయల దుకాణం నుంచి ఎక్కడ చూసినా డిజిటల్ కరెన్సీ ఉంది. అలాగే 500, వెయ్యి, రెండు వేల నోట్లు రద్దు చేసి డిజిటల్ కరెన్సీని డెవలప్ చేద్దామని చెప్పాను. అది వస్తే దేశ ఆదాయం పెరుగుతుంది..’’అని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ 41వ వ్యవస్థాపక దినం సందర్భంగా హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎప్పటిలాగానే తన గురించి చెప్పుకునేందుకే ప్రాధాన్యత ఇచ్చారు. దేశంలో పెద్దనోట్లను రద్దు చేసి, డిజిటల్ కరెన్సీని అభివృద్ధి చేయాలని, అప్పుడే అవినీతి పోతుందని చెప్పారు. నా వల్లే సెల్ఫోన్లు వచ్చాయి: గతంలో తాను ఇచ్చి న రిపోర్టు ఆధారంగానే వాజ్పేయి టెలికం రంగంలో సంస్కరణలు తెచ్చారని, సెల్ఫోన్లు వచ్చాయని అన్నారు. ఇటీవల ఓ సమావేశంలో ప్రధాని మోదీని కలిసినప్పుడు విజన్–2027 రిపోర్టు తయారు చేయాలని.. దానితో ప్రపంచంలో భారత్ నంబర్ వన్ అవుతుందని చెప్పానని వివరించారు. అంటరానితనాన్ని నిర్మూలించిన పార్టీ టీడీపీ అని, జస్టిస్ పున్నయ్య కమిషన్ ద్వారా అంటరాని తనం లేకుండా చేశానని అన్నారు. మొదటి నేషనల్ హైవే తెలుగుదేశం హయాంలోనే వచ్చిందన్నారు. 1995లో తాను సీఎం అయిన తర్వాతే రంగారెడ్డి జిల్లాలో, రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు వచ్చాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అధికారం కావాలని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాలేదని, తెలుగు ప్రజల రుణం తీర్చుకునేందుకే పార్టీ పెట్టారన్నారు. త్వరలో రాజమండ్రిలో మహానాడు నిర్వహిస్తామని, ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు పాటుపడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఇక హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తెలుగు సినీ రంగానికి, రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఈ సభలో పార్టీ తెలంగాణ, ఏపీల అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, అచ్చెన్నాయుడు, నందమూరి రామకృష్ణ, పార్టీ ఏపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
చంద్రబాబుపై నమ్మకం లేకే ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ నో
జేబీ పౌడర్తో అండాశయ క్యాన్సర్.. పరిష్కారానికి రూ.54వేలకోట్లు
నడుస్తున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్!
శ్రీదేవి మొదటి లగ్జరీ ఇల్లు.. రెంట్కు ఇస్తారట!
ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
చంద్రబాబు మేనిఫెస్టోపై పోసాని అదిరిపోయే సెటైర్లు..
లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
కడపలో దుమ్ములేపుతున్న అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
బాబుకు గుర్తు గుబులు
తప్పక చదవండి
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- MLC Kavitha: కవిత బయటకు వచ్చేనా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- ‘కింగ్స్’ పోరులో పంజాబ్దే గెలుపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
Advertisement