breaking news
Donald Trump
-
ట్రంప్ కోడలా మజాకా.. షాకిస్తున్న ఐదు సంచలనాలు..
అమెరికా రాజకీయ రంగంలో ‘ట్రంప్’ అనేది ఒక బ్రాండ్. ఇప్పుడు ఆ కుటుంబం నుండి మరో శక్తివంతమైన గొంతు ప్రపంచానికి వినిపిస్తోంది. ఆమెనే లారా ట్రంప్. కేవలం డోనాల్డ్ ట్రంప్ కోడలిగానే కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న లారా గురించి ఇప్పుడు ప్రపంచమంతటా చర్చ జరుగుతోంది. ఫోక్స్ న్యూస్ హోస్ట్గా, రాజకీయ విశ్లేషకురాలిగా ఆమె ప్రస్థానం దూసుకుపోతోంది. ఆమెకు సంబంధించిన ఐదు షాకిచ్చే సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం..ట్రంప్ కుటుంబంలో కీలకంలారా ట్రంప్.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మూడవ కుమారుడు ఎరిక్ ట్రంప్ను 2014లో వివాహం చేసుకున్నారు. అలా ట్రంప్ కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన ఆమె, అనతి కాలంలోనే ఆ కుటుంబంలో అత్యంత కీలకమైన, నమ్మకస్తురాలైన మనిషిగా మారారు.రాజకీయాల్లో చక్రం తిప్పుతూ..కేవలం ఇంటికే పరిమితం కాకుండా, రిపబ్లికన్ పార్టీలో ఆమె చురుకైన పాత్ర పోషిస్తున్నారు. 2024లో రిపబ్లికన్ నేషనల్ కమిటీ (ఆర్ఎన్సీ) కో-చైర్గా బాధ్యతలు చేపట్టి, పార్టీ నిధుల సేకరణలో, ఎన్నికల వ్యూహరచనలో తనదైన ముద్ర వేశారు.ఫోక్స్ న్యూస్ స్టార్ హోస్ట్గా..మీడియా రంగంలోనూ లారా తన సత్తా చాటుతున్నారు. 2025 ఫిబ్రవరిలో ఆమె ఫోక్స్ న్యూస్లో ‘మై వ్యూ విత్ లారా ట్రంప్’ (My View with Lara Trump) అనే సొంత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి శనివారం ప్రసారమయ్యే ఈ షోలో జాతీయ భద్రత, రాజకీయ పరిణామాలపై ఆమె చేసే విశ్లేషణలకు విపరీతమైన క్రేజ్ ఉంది.పబ్లిక్ లైఫ్ ఒత్తిడిపై ఓపెన్ కామెంట్స్రాజకీయాల్లోకి రాకముందు ఉన్న సాధారణ జీవితాన్ని తాము అప్పుడప్పుడు మిస్ అవుతుంటామని లారా గతంలో ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ట్రంప్ అధ్యక్ష బరిలోకి దిగిన తర్వాత తమ కుటుంబంపై పెరిగిన నిఘా, విమర్శల కారణంగా తమ పాత రోజులను గుర్తుచేసుకుంటామని ఆమె చెబుతుంటారు.వ్యక్తిగత జీవితంలారా, ఎరిక్ దంపతులకు ల్యూక్, కరోలినా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ట్రంప్ కుటుంబ సభ్యులతో కలిసి బహిరంగ వేడుకల్లో ఆమె తరచూ కనిపిస్తుంటారు. సోషల్ మీడియాలోనూ ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. ట్రంప్ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో లారా ట్రంప్ ఇప్పుడు ఒక బలమైన శక్తిగా కనిపిస్తున్నారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: మొజ్తబా ఖమేనీ ముఖం చిద్రమైందా? -
మోజ్తాబా ప్రాణాలతో లేడు.. ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ప్రాణాలతో లేడన్నారు. ఆయన మరణించినట్లు తాను వార్తలు విన్నానని పేర్కొన్నారు. అయితే ఇదివరకే ఇరాన్ మోజ్తాబా ఆరోగ్యంపై ప్రకటన విడుదల చేసింది ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఎటువంటి ప్రమాదం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి.ప్రస్తుతం ఇజ్రాయెల్, ఇరాన్ అధినేతల ఉనికిపై చర్చ జోరుగా నడుస్తోంది. మార్చి 2న ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయంపై ఇరాన్ దాడి జరిపింది. ఈ వివరాలను ప్రకటిస్తూ నెతన్యాహు అదృష్టం ఏలా ఉందో తెలియలేదు. అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ రోజు నుంచి నెతన్యాహు ఆరోగ్యంపై పుకార్లు ప్రచారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టెల్ అవీవ్ నెతన్యాహుకు సంబంధించిన వీడియో విడుదల చేసింది. అందులో నెతన్యాహు కుడిచేతికి ఆరువేళ్లు ఉన్నాయని అది ఏఐ జనరేటడ్ వీడియో అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే దీనిపై ఇజ్రాయెల్ ఎటువంటి స్పష్టమైన ప్రకటన విడుదల చేయలేదు.మరో వైపు ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించిన మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఇదే విధమైన ఆరోపణలు ప్రచారమవుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించినా వారిని లేపేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలోనే సుప్రీం లీడర్గా మోజ్తాబా ఖమేనీ బాధ్యతలు స్వీకరించారు. కొద్దిరోజులకే ఇరాన్పై జరిపిన దాడుల్లో ఆయనకు తీవ్రగాయాలయ్యాయని కోమాలో ఉన్నారని ప్రచారం జరిగింది. ఈ వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది.తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై స్పందించారు. శనివారం ఆ దేశ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ " మోజ్తాబా ఖమేనీ బ్రతికే ఉన్నాడో లేదో తెలియదు. ఆయన గురించి స్పష్టమైన సమాచారం లేదు. అయితే ఆయన ప్రాణాలతో లేడని నేను విన్నాను. ఒక వేళ ప్రాణాలతో ఉంటే వారి దేశం కోసం తెలివిగా ఆలోచిస్తారు. అది ఆయన లొంగిపోవడమే" అని ట్రంప్ అన్నారు.కాగా మోజ్తాబా ఖమేనీ సుప్రీంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి బహిరంగంగా కనిపించలేదు. సుప్రీం బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కేవలం రాతపూర్వక ఆదేశాలు మాత్రమే ఇస్తున్నారు. ఇటీవల ఇరాన్పై జరిగిన దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారని కాలు పోయిందని ప్రచారం జరిగింది. అయితే వాటిని ఇరాన్ ఖండించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఆయనపై మాట్లాడడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. -
పశ్చిమాసియాలో యుద్ధం.. మరింత తీవ్ర రూపు
పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్ర రూపు దాలుస్తోంది. ఇరాన్కు ఆర్థిక ఆయువుపట్టు వంటి ఖర్గ్ దీవిపై అమెరికా దాడులు, ప్రతీకారంగా పలు గల్ఫ్ దేశాల్లోని చమురు వ్యవస్థలపై ఇరాన్ తీవ్రస్థాయి ప్రతిదాడులతో శనివారం పోరు కీలక మలుపు తిరిగింది. -
‘ఒక్క మిసైల్తో లేపేస్తాం’.. కిమ్ వైరల్ వార్నింగ్ నిజమేనా?
ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం రోజురోజుకూ ఉధృతమవుతోంది. దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇరాన్ దాడులతో మిడిల్ ఈస్ట్ వణికిపోతోంది. ఇదిలా ఉండగా ఈ యుద్ధం గురించి సోషల్ మీడియాలో అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి.‘డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ఇరాన్తో యుద్ధం చేస్తున్నారంటే, ఆ దేశం తనకు ఎదురు నిలవలేదని ఆయన నమ్ముతున్నారు. అందుకే ఆయన నా దేశం ఉత్తర కొరియాను కానీ, చైనా, రష్యాను కానీ రెచ్చగొట్టే ధైర్యం చేయడు, ఎందుకంటే మా శక్తి, క్షిపణుల గురించి ఆయనకు బాగా తెలుసు.ఒక్క క్షిపణితో అమెరికా మొత్తాన్ని అదృశ్యం చేయగల సామర్థ్యం మాకు ఉంది. ఏ దేశాలైతే బదులు ఇవ్వలేవని అతడు (ట్రంప్) నమ్ముతాడో ఆ దేశాలతో విభేదాలను కోరుకుంటాడు.కానీ ఇరాన్ నిజంగా అనుకుంటే, అది అమెరికాపై పెద్ద ఎత్తున బాంబు దాడి చేయగలదు. ఇది చాలా పెద్ద సంఖ్యలో అమెరికన్ పౌరుల మరణానికి కారణమవుతుందని వారు భయపడుతున్నారు. బెదిరింపులు శక్తిని నిరూపించవు. ఒక దేశం నిజమైన గొప్పతనం శాంతి, న్యాయం, మానవ జీవితం పట్ల గౌరవంలో కనిపిస్తుంది’ అని కిమ్ వ్యాఖ్యానించినట్లుగా ఆయా వార్తల్లో ఉంది.అయితే ఈ వ్యాఖ్యలు నిజంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ చేసినట్లుగా ఎలాంటి ధ్రువీకరణలు లేవు. అటు ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ అయిన కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) కానీ, ఇటు ఇతర ప్రామాణిక అంతర్జాతీయ వార్తా సంస్థల నుంచి దీని గురించి ప్రస్తావన లేదు. -
మీ యుద్ధ నౌకలను పంపండి..!
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్లు సంయుక్త యుద్ధం. ఇది గత కొన్ని రోజులుగా నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం ప్రభావంతో ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆందోళనకర పరిస్థితి కనిపిస్తుంది. అమెరికా-ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తూ సహకరిస్తున్న అరబ్ దేశాలపై ఇప్పటికే ఇరాన్ విరుచుకుపడుతూ ఉంది. తమతో యుద్ధం చేస్తున్న అమెరికా-ఇజ్రాయెల్కు ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరిస్తే వారు తమ శత్రువులేనని ఇప్పటికే ఇరాన్ స్పష్టం చేసింది. ఆ క్రమంలోనే వారిపై భీకరమైన దాడులు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. విదేశాలకు సరఫరా అయ్యే చమురు విషయంలో కూడా ఇరాన్ కఠినంగానే ఉంది. ఇరాన్కు నచ్చిన దేశాలను మినహాయించి మిగతా దేశాలను కట్టడి చేస్తోంది. ప్రధానంగా హర్మూజ్ జలసంధి నుంచి వచ్చే చమురు నౌకల విషయంలో ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది. అయితే దీన్ని పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లో ఆందోళన మొదలైంది. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% ఈ జలసంధి ద్వారా వెళ్తుంది. ప్రపంచ ఇంధన భద్రతకు కీలకమైన చోక్పాయింట్గా చెప్పుకుంటారు. మరి దీన్ని ఇరాన్ పూర్తిగా క్లోజ్ చేస్తే ఏంటనేది పరిస్థితి. ఇదే ఇప్పుడు ట్రంప్లో మొదలైన భయం. మీ నౌకలను పంపండిహర్మూజ్ జలసంధి భద్రతపై తీవ్ర ఆందోళనలు నడుమ ట్రంప్.. ప్రపంచ దేశాలకు ఒక పిలుపునిచ్చారు. హర్మూజ్ జలసంధి భద్రతకు సంబంధించి పలు ఇతర దేశాల నౌకలను పంపమని విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, యూకేలకు ఆయన తన సందేశాన్ని పంపారు. ఈ జలసంధితో ఇబ్బంది తలెత్తితే ఎక్కువగా ప్రభావితమయ్యేది ఆయా దేశాలేనని అందుచేత ముందస్తు జాగ్రత్తగా ఆ జలసంధి భద్రతకు నౌకాదళాన్ని సిద్ధం చేసుకుని పంపాలన్నారు. ఇలా చేస్తే ముప్పు ఉండదని, లేకపోతే అతి తీవ్రమైన సంక్షోభాన్ని కూడా చూడాల్సి రావచ్చన్నారు. వారంతా హర్మూజ్ జలసంధి అంశంలో ముందుకొస్తారని ఆశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. -
వీళ్లను పట్టిస్తే కోటీశ్వరులైపోవచ్చు.. ఏకంగా రూ.93 కోట్లు
వాషింగ్టన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సహా ఆ దేశంలోని పలువురు ఉన్నతాధికారుల గురించి సమాచారం ఇచ్చిన వారికి 10 మిలియన్ డాలర్లు (రూ.92,47,48,000) బహుమతి ఇస్తామని అమెరికా ప్రకటించింది. యుద్ధం మరింత ముదురుతున్న పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రోత్సాహకాన్ని అమెరికా విదేశాంగ శాఖ నిర్వహించే “రివార్డ్స్ ఫర్ జస్టిస్” కార్యక్రమం ద్వారా ప్రకటించింది.రివార్డు ఉన్న వ్యక్తుల జాబితాలో మొజ్తబా ఖమేనీతో పాటు కీలక నేతలు, అధికారులు అలీ అస్గర్ హిజాజీ, యాహ్యా రహీమ్ సఫవి, అలీ లరిజాని, ఎస్మాయిల్ ఖతీబ్ ఎస్కందర్ మొమెని ఉన్నారు. ఈ నాయకులపై సమాచారం ఇచ్చే వారికి అమెరికా బహుమతి ప్రకటించింది.అమెరికా ఈ నాయకులకు వేర్వేరుగా కచ్చితమైన మొత్తాన్ని బహుమతిగా ప్రకటించలేదు. అమెరికా చెప్పింది ఒక్కటే.. ఎవరైనా తమకు ఇచ్చే సమాచారం ఉపయోగపడితే “గరిష్ఠంగా $10 మిలియన్ (సుమారు రూ.92-93 కోట్లు) వరకు” బహుమతి ఇవ్వవచ్చు.రివార్డ్స్ ఫర్ జస్టిస్ ప్రోగ్రాం అంటే అమెరికా మీద ఉగ్రదాడులు చేసినట్లు అనుమానించే వ్యక్తులను గుర్తించేందుకు సమాచారం ఇచ్చిన వారికి డబ్బు బహుమతి ఇచ్చే కార్యక్రమం. మొజ్తబా ఖమేనీ సహా పలువురు ఉన్నతాధికారులను “ఇరానియన్ టెర్రరిస్టులు”గా పేర్కొంటూ అమెరికా ఒక ప్రకటనలో వివరాలు తెలిపింది.“ఈ వ్యక్తులు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ)లో వివిధ విభాగాలను నడిపిస్తున్నారు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర చర్యలకు ప్రణాళికలు వేసి, అమలు చేస్తుంది” అని చెప్పింది.“ఈ ఐఆర్జీసీ నాయకులు లేదా దాని విభాగాలపై సమాచారం తెలిసినవారు ఆ విషయాన్ని టోర్ ఆధారిత టిప్లైన్ లేదా సిగ్నల్ ద్వారా మాకు పంపండి. సమాచారం ఇచ్చిన వారికి బహుమతి లభించే అవకాశం ఉంటుంది” అని తెలిపింది.టోర్ అంటే ఇంటర్నెట్లో గుర్తింపును దాచుతూ సమాచారాన్ని పంపే సాంకేతిక వ్యవస్థ. సిగ్నల్ అంటే గోప్యంగా సందేశాలు పంపే ఎన్క్రిప్షన్ ఆధారిత మెసేజింగ్ యాప్. -
ట్రంప్పై నిషేధం యోచనలో ఫిఫా!
పశ్చిమాసియాలోని ఇరాన్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరో షాక్ తగలనుంది. ప్రపంచక ఫుట్బాల్ సమాఖ్య(ఫిఫా) ఆయనపై నిషేధం విధించాలనే ఆలోచనతో ఉంది. పిఫా వరల్డ్కప్ పోటీలతో పాటు లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ 2028కు హాజరవ్వకుండా ట్రంప్పై నిషేధం పడే అవకాశముంది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థకు చెల్లించాల్సిన బకాయిలు భారీగా పేరుకుపోవడమే అందుకు కారణమని సమాచారం. గత కొన్నేళ్లుగా యూఎస్ఏ ప్రభుత్వానికి, ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థకు పొసగడం లేదు. దాంతో.. మూడేళ్ల నుంచి వాడాకు యూఎస్ ప్రభుత్వం ఒక్క డాలర్ కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం యూఎస్ఏ చెల్లించాల్సిన బకాయిల మొత్తం 7.3 మిలియన్ డాలర్ల(రూ.67 కోట్లకు పైగా)గా ఉన్నాయి. దాంతో.. వాడాకు బాకీపడిన దేశాలకు చెందిన అధ్యక్షులను, ప్రతినిధులను ఒలింపిక్స్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ వంటి ప్రధాన క్రీడలకు, స్పోర్ట్స్ ఈవెంట్లకు అనుమతించకూడదనే ప్రతిపాదన ఉంది. కాబట్టి.. ఫిఫా వరల్డ్కప్తో పాటు లాస్ ఎంజెలెస్ ఒలింపిక్స్లో ఈవెంట్లో పాల్గొనకుండా అమెరికా అధినేతపై నిషేధం విధించే అవకాశముందని సమాచారం. అయితే.. వాడా అధికార ప్రతినిధి జేమ్స్ ఫిట్జెరాల్డ్ మాత్రం అదేమీ లేదని అంటుండడం గమనార్హం.చదవండి: IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్కు షాక్! -
జెరూసలేం మీదుగా పేలుళ్లు
US-Israel War on Iran day 15: భీకర దాడులతో ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం 15 రోజు కూడా తీవ్రంగా కొనసాగుతోంది. ప్రధానంగా ఇరాన్లోని కీలకమైన ఖార్గ్ ద్వీపంపై అమెరికా దళాలు (CENTCOM) అత్యంత శక్తివంతమైన వైమానిక దాడులు నిర్వహించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మరోవైపు ఖార్గ్ ద్వీపం బాంబు దాడి తర్వాత అమెరికా మద్దతు ఉన్న చమురు కేంద్రాలపై దాడులు చేస్తామని ఇరాన్ గట్టి కౌంటరిచ్చింది.2,500 మంది అమెరికన్ మెరైన్లు, నౌకలు గల్ఫ్కు పయనమవుతుండగా టెహ్రాన్ ‘మరింత విధ్వంసక’ క్షిపణులను సిద్ధం చేస్తోంది.ఇరాన్ నుండి వస్తున్న క్షిపణులను గుర్తించామని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శనివారం ఇజ్రాయెల్రాజదాని నగరం జెరూసలేం మీదుగా భారీ పేలుళ్లు వినిపించాయని AFP నివేదించింది. ఇది ఇలా ఉంటే యుఎఇ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) వైమానిక రక్షణ దళాలు మార్చి 13న 7 బాలిస్టిక్ క్షిపణులు , 27 యుఎవిలను అడ్డుకున్నాయి. UAE ఈ రోజు 9 క్షిపణులు , 33 డ్రోన్లను అడ్డుకుంది. దీంతో వీటి సంఖ్య 285 బాలిస్టిక్ క్షిపణులు, 15 క్రూయిజ్ క్షిపణులు , 1,567 యుఎవిలకు చేరుకున్నాయి. ఇరాక్లోని కుర్దిస్తాన్ ప్రాంతంలోని యుఎఇ కాన్సులేట్ జనరల్ను లక్ష్యంగా చేసుకుని వారం రోజుల్లో రెండవసారి జరిగిన ఉగ్రవాద డ్రోన్ దాడిని తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడగా, కాన్సులేట్ భవనం దెబ్బతింది.45 మంది అరెస్ట్ మరోవైపు యుఎఇలో, తప్పుదారి పట్టించే లేదా ఏఐ వీడియోలను ఆన్లైన్లో పంచుకున్నందుకు 10 మంది నిందితులకు భారీ షాక్ తగలనుంది. వీరిపై విచారణణు వేగవంతం చేశారు. సంఘటనాస్థలాలను చిత్రీకరించడం, లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు 45 మందిని అబుదాబి అధికారులు అరెస్టు చేశారు. ఇది తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి, జాతీయ భద్రతను రక్షించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగమని అక్కడి అధికారులు తెలిపారు. కాగా ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం మధ్యప్రాచ్య వివాదం మూడవ వారంలోకి ప్రవేశించింది. దాదాపు 43,000 నివాస, వాణిజ్య యూనిట్లు దెబ్బతిన్నాయని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫతేమెహ్ మొహజెరానీ వెల్లడించారు. ప్రభుత్వ నిర్వహణలోని IRNA వార్తా సంస్థ ప్రకారం, దెబ్బతిన్న నిర్మాణాలలో 36,469 నివాసాలు, 6,179 వాణిజ్య సౌకర్యాలు ఉన్నాయి..అమెరికా- ఇజ్రాయెల్ దాడుల్లో మహిళలు తీవ్రంగా నష్టపోయారని, 223 మంది మహిళలు , బాలికలు మరణించారని మరియు 2,129 మంది గాయపడ్డారని మొహజెరానీ చెప్పారు. ఆమె మొత్తం మరణాల సంఖ్యను ప్రకటించలేదు కానీ గతంలో అధికారులు 1,230 మంది మరణించారని చెప్పారు.సైనిక నష్టం గురించి ఇరాన్ ఎటువంటి సమాచారం అందించలేదు. -
ఇంటర్వ్యూ ఆపండి.. మీకు ట్రంప్ నుంచి కాల్ వచ్చింది!
ప్రస్తుతం అమెరికా-ఇజ్రాయెల్లు సంయుక్తంగా ఇరాన్పై యుద్ధంలో ఉన్నాయి. ఇరాన్ను తమ గుప్పిట్లోకి తీసుకునే వరకూ యుద్ధం ఆపేది లేదంటోంది అమెరికా. అదే సమయంలో ఇరాన్ కూడా తాము కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెబుతోంది. ఈ యుద్ధం ఎంతవరకూ వెళుతుందో అనే భయం సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఇరాన్ గగనతలం తమ గుప్పిట్లోకి వచ్చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ చెబుతున్నా.. పరిస్థితులు చూస్తే అలా కనిపించడం లేదు. ఇరాన్ సైతం అంతే ధీటుగా బదులిస్తూ ఉండటంతో అటు గల్ఫ్ దేశాలతో పాటు అమెరికాలో కూడా ఆందోళన చాయలు కనిపిస్తూనే ఉన్నాయి. ట్రంప్ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని, ఇంకా ఇరాన్ లొంగిపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంచితే, ఒక లైవ్ షోలో ఉండగా అమెరికా ఆర్థికశాఖ కార్యదర్శి స్కాట్ బీసెంట్కు ఉన్నపళంగా అధ్యక్షుడు ట్రంప్ నుంచి కాల్ రావడం చర్చనీయాంశమైంది. బీసెంట్ స్కై న్యూస్ స్టూడియోలో లైవ్ ప్రోగ్రామ్లో ఉండగా పిలుపు వచ్చింది. ఆ స్టూడియోకు ట్రంప్ నుంచి కాల్ రావడంతో ఉన్నపళంగా బీసెంట్ మధ్యలోనే వెళ్లిపోయారు.ఆ కాల్ సారాంశం ఏంటంటే.. ‘ఇంటర్వ్యూ ఆపండి.. మీకు ట్రంప్ నుంచి కాల్ వచ్చింది.. మిమ్మల్ని ట్రంప్ వెంటనే కలవాలట. వైట్హౌస్ సిట్యువేషన్ రూమ్కి రమ్మన్నారు’ అని లైవ్ ప్రోగ్రామ్ మధ్యలో సందేశం వెళ్లింది. దాంతో బీసెంట్ తన ఇంటర్వ్యూను అక్కడే వదిలేసి పరుగు పరుగున వెళ్లి ట్రంప్ను కలిశారు. అయితే ఆ తర్వాత బీసెంట్ తన లైవ్ ప్రోగ్రామ్లో పాల్గొన్నారు. సుమారు రెండు గంటల పాటు బీసెంట్ ప్రోగ్రామ్ వాయిదా పడిన తర్వాత కొనసాగించారు. దీనిలో భాగంగా బీసెంట్ మాట్లాడుతూ.. ‘అధ్యక్షుడు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇరాన్ మిషన్ షెడ్యూల్కి ముందుగానే విజయవంతంగా కొనసాగుతోంది. అలాగే ప్రభుత్వ నాయకత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉంది’ అని ట్రంప్ను కొనియాడారు.U.S. Treasury Secretary Scott Bessent was abruptly pulled from a live interview after being told “the President wants you right away.” After returning, his voice was noticeably shaken. pic.twitter.com/jx5CamFi03— Clash Report (@clashreport) March 13, 2026 ఇదీ చదవండి: ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన కిమ్ -
ట్రంప్ విధ్వంసం: ‘క్రౌన్ జ్యువెల్’పై భీకర దాడి
వాషింగ్టన్/టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత ఉగ్రరూపం దాల్చాయి. ఇరాన్ ఆర్థిక రాజధానిగా భావించే ‘ఖర్గ్ ఐలాండ్’పై అమెరికా సైన్యం విరుచుకుపడింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్కు అత్యంత కీలకమైన ఈ దీవిపై అమెరికా సెంట్రల్ కమాండ్ అత్యంత శక్తివంతమైన దాడులు నిర్వహించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు.సైనిక స్థావరాలు ధ్వంసం‘పశ్చిమాసియా చరిత్రలోనే అత్యంత భారీ బాంబు దాడులను మా సైన్యం చేపట్టింది. ఇరాన్ కిరీటంలోని రత్నం లాంటి ఖర్గ్ ఐలాండ్లోని ప్రతి సైనిక లక్ష్యాన్ని తునాతునకలు చేశాం’ అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే, ఒక వ్యూహాత్మక నిర్ణయంతో అక్కడి చమురు మౌలిక సదుపాయాలను ప్రస్తుతానికి ధ్వంసం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా ఇరాన్ ఎగుమతి చేసే చమురులో 90 శాతం ఈ దీవి నుంచే సరఫరా అవుతుంది. రోజుకు సుమారు 70 లక్షల బారెళ్ల సామర్థ్యం కలిగిన ఈ కేంద్రంపై దాడి జరిగితే ప్రపంచ చమురు మార్కెట్ కుప్పకూలుతుందనే ఉద్దేశంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హోర్ముజ్ జలసంధిపై హెచ్చరికవ్యాపార నౌకల రాకపోకలకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. ‘ఒకవేళ హోర్ముజ్ జలసంధిలో నౌకల స్వేచ్ఛా ప్రయాణానికి అడ్డుతగిలితే, చమురు క్షేత్రాలను వదిలిపెట్టే ప్రసక్తి లేదు’ అని ఆయన హెచ్చరించారు. యుద్ధ ట్యాంకర్లకు రక్షణగా త్వరలోనే అమెరికా నౌకాదళం కాపలాగా వస్తుందని ఆయన పేర్కొన్నారు.‘ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తాం’పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అమెరికా అదనంగా 2,500 మంది మెరైన్ సైనికులను, మూడు అత్యాధునిక యుద్ధ నౌకలను యుద్దప్రాంతానికి పంపింది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తామని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ పేర్కొన్నారు. మరోవైపు హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రకటించడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇది కూడా చదవండి: సిలిండర్లు దాచారో.. జైలుకే! -
ఏం కావాలో ‘ట్రంప్’కు తెలుసు!
‘ట్రంప్ ఏం కోరుకుంటున్నారో ఆయనకే తెలియడం లేదు’ అని మాజీ దౌత్యవేత్త తల్మీజ్ అహ్మద్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. తనకి ఏమి కావాలో ట్రంప్కు బాగానే తెలుసు. తెలియంది తల్మీజ్కే! ఇరాన్లో చమురు ఉంది. గ్యాస్ ఉంది. అది తనకి కావాలి. ఈ మాట మనం చెప్పడం కాదు; ట్రంపే స్వయంగా చెప్పాడు. 2019లో సిరియా యుద్ధం గురించి మాట్లాడుతూ ‘ఆ చమురు మనదే. దాన్ని మనమే ఉంచుకోవాలి అని నేను ఎప్పటినుంచో చెబు తున్నాను’ అని అన్నాడు. ఇరాన్ సుమారుగా 4,800 పై చిలుకు బావులున్న ప్రాంతం. వాటి మీద అనాదిగా అమెరికా కన్ను ఉంది.‘ఇరాన్ అణ్వాయు ధాల్ని తయారు చేస్తుంది అందుకే దాడుల్ని చేశాము’ అనేది పైకి చెప్పే మాట. చమురు, గ్యాస్ ఉన్న ప్రాంతాలన్నిటినీ కబళించాలనేది అమెరికా చిరకాల వాంఛ. ఇరాక్, లిబియా, సిరియాల మీదా అందుకే దాడి చేసింది. అవి ఆక్రమణలోకి రాక పోవొచ్చు. అది వేరే సంగతి. ‘అవి రావు’ అని కూడా అమెరికాకు తెలుసు. కానీ తన ప్రయత్నం మానదు. అ ప్రయత్నం వల్ల కొంత లొంగుబాటు ఉంటుంది. రాజీలు ఉంటాయి. టెక్నాలజీ పేరుతో ప్రపంచంలో పెద్ద చమురు కంపెనీలైన ఎక్సోనా మొబైల్, చెవ్రోనా (అమెరికా), బీపీ (బ్రిటన్), షెల్ (నెదర్లాండ్), టోటల్ ఎనర్జీస్ (ఫ్రాన్స్) లాంటి కంపెనీలను అక్కడ దించుతుంది. ఎక్కువ కమి షన్లను రాబడుతుంది. ఇది ఇప్పటి కథ కాదు, అనాదిగా జరుగుతున్నది ఇదే! ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, కువైట్ లాంటి దేశాల్లో చమురు ఉంది. కానీ టెక్నాలజీ ఉండేది కాదు. 1940–1970 మధ్యకాలంలో ‘సెవెన్ సిస్టర్స్’ అని పెద్ద చమురు కంపెనీలు ఉండేవి. ఇవి ఆ యా దేశాల్లోకి వెళ్లి తక్కువ ధరలకే ఒప్పందాలు చేసుకుని, ఎక్కువ లాభం వేసుకునేవి. ఈ దోపిడీని భరించలేక, 1960లో కొన్ని చమురు దేశాలు కలిసి ‘ఒపెక్’ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నాయి. ఆ సంస్థ ద్వారా చమురు ధరలపై ఆ యా దేశాల స్వయం నియంత్రణ పెంచడం, పాశ్చాత్య కంపెనీల ప్రభావాన్ని తగ్గించడం చేశాయి. 1973లో జరిగిన ఒక పెద్ద సంఘటన ప్రపంచ చమురు రాజకీయాలను పూర్తిగా మార్చింది. దీనిని ‘చమురు ఆయుధం (ఆయిల్ వెపన్)’ అని అంటారు. 1973లో మధ్యప్రాచ్యంలో ‘యోమ్ కిప్పూర్’ పేరుతో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఈజిప్ట్, సిరియా కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేశాయి. అప్పుడు అమెరికా ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చింది. దానికి ప్రతిగా చమురు ఉత్పత్తి చేసే అరబ్ దేశాలు ‘అమెరికాకు, దానికి మద్దతు ఇచ్చిన దేశాలకు చమురు అమ్మకాలు ఆపివేయాలి’ అని ఒక నిర్ణయం చేశాయి. దీంతో ప్రపంచంలో పెద్ద సమస్య వచ్చింది: చమురు ధర 4 రెట్లు పెరిగింది. ఈ యుద్ధం వలన కూడా మళ్లీ అలాంటి సంక్షోభం వచ్చినా ఆశ్చర్యం లేదు! – నన్నూరి వేణుగోపాల్ ‘ మానవ హక్కుల కార్యకర్త -
అణ్వస్త్రాలతో సర్వత్రా కలవరం!
పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్ర ఘర్షణలు ప్రపంచాన్ని మరోసారి అణ్వస్త్ర యుద్ధం ముంగిట నిలిపాయి. అణు శక్తి సదుపాయాలపై దాడులు జరిగిన సూచనలు ఇంతవరకు అయితే ఏవీ లేవని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) పేర్కొంది. అయితే, ఈ ప్రాంతీయ యుద్ధంలో అణ్వస్త్రాల ప్రయోగానికి అవ కాశం హెచ్చుగానే ఉంది. ఇరాన్, ఇజ్రా యెల్తో పాటు సైనిక దాడులను ఎదు ర్కొంటున్న ఆ ప్రాంతంలోని అనేక ఇతర దేశాల్లో అణు విద్యుదు త్పాదన కేంద్రాలున్నాయి. అణు పరిశోధనా రియాక్టర్లతో పాటు, అణు ఇంధన స్టోరేజి సదుపాయాలున్నాయి. ఇరాన్–ఇజ్రాయెల్తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నాలుగు అణు రియాక్టర్లున్నాయి. జోర్డాన్, సిరియా, బహ్రెయిన్, ఇరాక్, కువైట్, ఒమన్, సౌదీ అరేబియాలు ఏదో ఒక రూపేణా అణుశక్తిని వినియోగించుకుంటున్నాయి. ‘ఫిసైల్’పై చర్చలు ముగియక ముందే..!ఇరాన్ అణ్వాయుధాల కార్యక్రమానికి ఆలంబనగా నిలుస్తు న్నట్లు అనుమానిస్తున్న సదుపాయాలపై ఇజ్రాయెల్–అమెరికా 2025 జూన్లో వైమానిక దాడులకు దిగినపుడు కూడా ఇదే రకమైన ఆందోళనలు పొడసూపాయి. రష్యా–ఉక్రెయిన్ వంటి ఇతర అణ్వా యుధ ప్రయోగావకాశ ఘర్షణలు గత ఏడాది కూడా గుబులు రేపాయి. బులెటిన్ ఆఫ్ ఆటమిక్ సైంటిస్ట్స్ అనే బృందం అణు వినాశనం సంభవించగల సమయానికి సంబంధించిన అంచనా లను వెల్లడిస్తూ ఉంటుంది. ఇరాన్ శుద్ధి చేసినట్లుగా భావిస్తున్న 400కు పైగా కిలోల యురేనియంను దృష్టిలో పెట్టుకుని, 2026 జనవరిలో ఓ రోజు అర్ధరాత్రికి 85 సెకన్ల ముందు అది ఆ అవకా శాన్ని సవరించింది. శుద్ధి చేసిన యురేనియంలో 60 శాతం ఫిసైల్ యురేనియం 235 ఐసోటోప్ ఉంది. అంటే, దాన్ని మరింత శుద్ధి చేయనవసరం లేకుండానే ఆ యురేనియంతో పెక్కు అణ్వా యుధాలు తయారు చేయవచ్చు. ఈ ఫిసైల్ పదార్థ వాడకం గురించి ఓ పక్క చర్చలు కొనసాగుతూండగానే ఇరాన్పై ఇటీవల అమె రికా–ఇజ్రాయెల్ దాడులకు దిగాయి. గత ఏడాదే ముంచుకొచ్చిన ముప్పు!ఇరాన్లో అణుశక్తి మౌలిక వసతులు విస్తృతంగానే ఉన్నాయి. అది పైకి ప్రకటించిన సదుపాయాలే 13 నడుస్తున్నాయి. టెహ్రాన్ రిసెర్చ్ రియాక్టర్, ప్రాసెస్ రిసెర్చ్ ఫెసిలిటీ, మోలిబ్డెనమ్ అయోడిన్ అండ్ జినాన్ (ఎం.ఐ.ఎక్స్.) రేడియో ఐసోటోప్ ప్రొడక్షన్ ఫెసిలిటీ, జబార్ ఐబిన్ హయన్ మల్టీపర్పస్ ల్యాబొరేటరీస్, మినియేచర్ న్యూట్రాన్ సోర్స్ రియాక్టర్, లైట్ వాటర్ సబ్–క్రిటికల్ రియాక్టర్, హెవీ వాటర్ జీరో పవర్ రియాక్టర్, 10 మెగావాట్ల ఇస్పహాన్ రిసెర్చ్ రియాక్టర్, కరాజ్ వాటర్ స్టోరేజి ఫెసిలిటీ, బుషెహర్ అణు విద్యు దుత్పాదన కేంద్రానికి చెందిన నాలుగు యూనిట్లు, కరున్ న్యూక్లి యర్ పవర్ ప్లాంట్ వంటివి ఆ కోవలోకి వస్తాయి. గత ఏడాది జూన్లో జరిగిన దాడుల్లో ఫోర్డౌ వంటి కొన్ని సదుపాయాలు దెబ్బ తిన్నాయి. కోర్ రియాక్టర్లు చెక్కు చెదరకపోవడంతో అణు ధార్మికత లీక్ అవలేదు. సంరక్షణ చర్యలకు వీలుగా ఇరాన్ ఆ తర్వాత నూతన ఇస్పహాన్ అణు ఇంధన శుద్ధి కేంద్రం గురించి ఐఏఈఏకి తెలియ జేసింది. కానీ, ఆ కేంద్రం తనిఖీ ప్రక్రియ ఇంకా మొదలు కానేలేదు. తాజా విడత దాడుల్లో ఇస్పహాన్ లేదా మరి ఏ ఇతర అణు శక్తి సదుపాయమైనా దెబ్బతిన్నదీ లేనిదీ ఇంకా స్పష్టం కాలేదు. గడువు తీరిన ‘తగ్గింపు ఒడంబడిక’ మరొకవైపు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం వంటి అంత ర్జాతీయ ఒడంబడికల వల్ల సాధించిన పురోగతి ఏమీ కనిపించడం లేదు. పైగా, కొన్ని దేశాలు తమ అణ్వాయుధాలకు సాంకేతిక పరంగా మరింతగా పదును పెట్టుకుంటున్నాయి. ఈ స్థితిలో కొత్త అణ్వాయుధ పోటీ మొదలైనా ఆశ్చర్యపోనక్కర లేదు. ఇటువంటి వాటిలో కడపటి ఒప్పందంగా చెప్పదగిన, అమెరికా–రష్యాల మధ్య నున్న నూతన వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒడంబడిక (న్యూ స్టార్ట్) గడువు 2026 ఫిబ్రవరి 5తో ముగిసింది. ఇన్నాళ్లూ (1971 నుంచి) ఆ ఒడంబడిక ఆ రెండు దేశాల అణ్వాయుధ శక్తులను పరి మితం చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ రెండు దేశాలూ తమ వద్ద ఉంచుకోదగిన వ్యూహాత్మక అణ్వాయుధాల సంఖ్యకు సంబంధించి ఎటు వంటి పరిమితికీ చట్టబద్ధంగా కట్టుబడి ఉండనవ సరం లేదు. ‘పరిమితం’తో ఒరిగేదేమీ లేదు!అసలు రష్యా–ఉక్రెయిన్ల మధ్య యుద్ధం మొదలవడంతోనే పరిమిత అణుయుద్ధ భావన తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అది చర్చకు వస్తోంది. పూర్తి స్థాయిలో ప్రపంచ అణు యుద్ధానికి పురికొల్పకుండా, తమ నిర్దిష్ట సైనిక లేదా రాజ కీయ లక్ష్యాల సాధనకు పరిమితమైన రీతిలో అణ్వాయుధాలను ఉపయోగించుకుని యుద్ధం చేయడం గురించిన ఆలోచన 1980ల నుంచి ఉంది. వ్యూహాత్మక, రక్షణ నిపుణులు అడపాదడపా దానిపై చర్చిస్తూనే ఉన్నారు. పరిమిత అణు యుద్ధంలో పాల్గొనే దేశాలు తాము ప్రయోగించే అణ్వాయుధాల సంఖ్యలో, అవి విడు దల చేయగల శక్తిలో, లక్ష్యాలను ఎంచుకోవడంలో కొంత నిగ్రహాన్ని పాటిస్తాయన్నమాట. సిద్ధాంతపరంగా దాన్ని ‘పరిమిత’ యుద్ధంగానే పరిగణించవచ్చునేమో కానీ, అణ్వాయుధాల వినియోగం ప్రపంచ వ్యాప్తంగా వినాశనాన్ని సృష్టించగలదు. దౌత్యం ఒక్కటే నివారణ మార్గం!ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితి తీవ్ర ఆందోళనదాయకంగా ఉంది. అణు ధార్మికత విడుదలకు గల అవకాశాన్ని ఐఏఈఏ తోసిపుచ్చలేదు. పెద్ద నగరాలను మించిన విస్తృత ప్రాంతాల నుంచి జనాన్ని ఖాళీ చేయించవలసి ఉంటుంది. ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకోకూడదన్నదే (మొదట్లో అనుకున్నట్లుగా) అమె రికా, దాని మిత్రపక్షాల లక్ష్యమైతే, ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫేల్ మరియానో గ్రాసి చెప్పినట్లుగా, రెండు పక్షాలూ దౌత్యానికీ, చర్చ లకూ తప్పనిసరిగా తిరిగి ఉపక్రమించాలి. అణు జ్వాల రేగకుండా నివారించేందుకు అదొక్కటే నివారణ మార్గం. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
‘ఇరాన్ గగనతలం పూర్తిగా మా గుప్పిట్లోకి వచ్చింది’
వాషింగ్టన్: ఇరాన్ గగనతలం పూర్తిగా తమ గుప్పిట్లోకి వచ్చిందని అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్ ఆయుధ నిల్వలు బలహీనపడిన క్రమంలో ఆ దేశ గగనతలాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకున్నామని అమెరికా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇరాన్పై కొనసాగిస్తున్న యుద్ధంపై అమెరికా తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో దాడులు చేశాం. ఫైటర్ జెట్లు, బాంబర్లతో ఇరాన్పై దాడులు చేశాం. ఇరాన్ అణు సామర్థ్యాలు, మిస్సైల్ స్థావరాలు, నేవీ వ్యవస్థను నాశనం చేయడమే మా టార్గెట్. ఇరాన్ గగనతలం పూర్తిగా మా గుప్పిట్లోకి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాడులు ఆపేది లేదు. యుద్ధంలో ఏడుగురు అమెరికా సైనికులు మృతి చెందారు. 140 మంది సైనికులకు గాయాలయ్యాయి. ఇరాన్ ఒంటరి అయిపోయింది. ఇరాన్ ఆయుధ నిల్వలు తగ్గిపోతున్నాయి. ఇరాన్పై దాడులను మరింత ఉధృతం చేస్తాం’ అని అమెరికా పేర్కొంది.అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహుల సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఇరాన్ తమకు సరెండర్ కాబోతుందన్న ట్రంప్.. తమ దాడులకు ఇరాన్ భయపడిందంటూ వ్యాఖ్యానించారు. యుద్ధంపై నిర్ణయం తీసుకోవడానికి టెహ్రాన్లో అధికారులు ఎవరూ సజీవంగా లేరని.. ఇరాన్ లొంగిపోయేందుకు సిద్ధంగా ఉందన్నారు. లొంగిపోతున్నట్లు ప్రకటించేవారు ఎవరూ లేరని.. మొజ్తబా ఖమేనీ ఎవరికీ తెలియదని ట్రంప్ అన్నారు.మరో వైపు, తమ దేశం ఎప్పటికన్నా బలంగా మారుతోందంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు వ్యాఖ్యానించారు. అలాగే తాము ఇరాన్, దాని ప్రాక్సీలపై దాడి చేస్తున్నామంటూ ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ కూడా పెట్టారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి విలేకరుల సమావేశం నిర్వహించిన నెతన్యాహు.. ఇరాన్ కొత్త ప్రభుత్వం కుప్ప కూలుతుందని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము చోద్యం చూడటం లేదనీ, పూర్తి బలంతో దాడి చేస్తున్నామన్నారు. "ధైర్యవంతులు గెలుస్తారు" అనే సూత్రంతో, మధ్యప్రాచ్య ముఖచిత్రాన్ని మార్చేస్తామని, శత్రువులను వెంటాడి మరీ దాడి చేస్తామని నెతన్యాహు అన్నారు. -
ఇరాన్ ఆడకపోవడమే మంచిది.. ట్రంప్ వార్నింగ్!
మరో రెండు నెలల్లో ఫుట్బాల్ సాకర్ ఫీవర్ మొదలుకానుంది. అమెరికా,మెక్సికో,కెనడా దేశాలు సంయుక్తంగా 2026 ఫిపా వరల్డ్కప్కు ఆతిథ్యమివ్వనున్నాయి.ఈ ఏడాది జూన్ 11 నుంచి జూలై 19 వరకు సాకర్ మెగాటోర్నీ జరగనుంది. అయితే పశ్చిమాసియాలో ఇరాన్తో ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధం ప్రస్తుతం భీకరరూపం దాల్చింది. దీంతో ఇరాన్ జట్టు ఫిఫా వరల్డ్కప్ ఆడలేమని ఇప్పటికే తేల్చి చెప్పింది. అయితే మధ్యప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఇరాన్ జట్టు ఫిపా వరల్డ్కప్ ఆడేందుకు స్వాగతిస్తామని ఫిఫా చీఫ్ జియాని ఇన్ఫాంటినో పేర్కొన్నారు. తాజాగా జియాని వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్సోషల్ వేదికగా స్పందించారు. ‘ఇరాన్ ఫుట్బాల్ జట్టు సాకర్ ప్రపంచకప్లో ఆడడం, ఆడకపోవడమనేది వారిష్టం. యుద్ధం పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ ఆటగాళ్లు అమెరికాకు వస్తే మాత్రం వారి ప్రాణాలకు, భద్రతకు మేము ఎంతమాత్రం గ్యారంటీ ఇవ్వలేం. కాబట్టి వీలైనంత వరకు ఇరాన్ వరల్డ్కప్కు దూరంగా ఉండడమే మంచిది’ అని సున్నితంగా హెచ్చరించారు.2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్కప్లో అర్జెంటీనా విజేతగా నిలిచింది. నాటి ఫైనల్లో లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో (4-2) ఫ్రాన్స్ను ఓడించింది. తద్వారా 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనా ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్ కైవసం చేసుకుంది. ఈ ఏడాది జూన్ 11 నుంచి మొదలుకానున్న ఫిఫా వరల్డ్కప్ జూలై 19 వరకు జరగనుంది. మొత్తం 48 జట్లు పాల్గొననుండగా.. నాలుగేసి జట్లు 12గ్రూపులుగా విడిపోయి మ్యాచ్లు ఆడనున్నాయి. మొత్తం 104 మ్యాచ్లు జరగనుండగా, అందులో 78 మ్యాచ్లు అమెరికాలో, కెనడా, మెక్సికోలు చెరో 13మ్యాచ్లకు ఆతిథ్యమివ్వనున్నాయి. గ్రూప్-జిలో ఉన్న ఇరాన్.. బెల్జియం, ఈజిప్టు, న్యూజిలాండ్తో మ్యాచ్లు ఆడాల్సి ఉంది.చదవండి: మా అన్న పెళ్లికి ధూంధాం చేస్తా! -
పశ్చిమాసియాలో యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన
-
వారు సజీవంగా లేరు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఇరాన్ తమకు సరెండర్ కాబోతుందన్న ట్రంప్.. తమ దాడులకు ఇరాన్ భయపడిందంటూ వ్యాఖ్యానించారు. యుద్ధంపై నిర్ణయం తీసుకోవడానికి టెహ్రాన్లో అధికారులు ఎవరూ సజీవంగా లేరని.. ఇరాన్ లొంగిపోయేందుకు సిద్ధంగా ఉందన్నారు. లొంగిపోతున్నట్లు ప్రకటించేవారు ఎవరూ లేరని.. మొజ్తబా ఖమేనీ ఎవరికీ తెలియదని ట్రంప్ అన్నారు.మరో వైపు, తమ దేశం ఎప్పటికన్నా బలంగా మారుతోందంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. అలాగే తాము ఇరాన్, దాని ప్రాక్సీలపై దాడి చేస్తున్నామంటూ ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ కూడా పెట్టారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి విలేకరుల సమావేశం నిర్వహించిన నెతన్యాహు.. ఇరాన్ కొత్త ప్రభుత్వం కుప్ప కూలుతుందని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము చోద్యం చూడటం లేదనీ, పూర్తి బలంతో దాడి చేస్తున్నామన్నారు. "ధైర్యవంతులు గెలుస్తారు" అనే సూత్రంతో, మధ్యప్రాచ్య ముఖచిత్రాన్ని మార్చేస్తామని, శత్రువులను వెంటాడి మరీ దాడి చేస్తామని నెతన్యాహు అన్నారు. -
అమెరికా విమాన వాహక నౌక అబ్రహం లింకన్పై ఇరాన్ దాడి
-
ఇరాన్ వార్ : ట్రంప్ సరికొత్త వార్నింగ్
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు రోజురోజుకి పెరుగుతున్నాయి ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మొదలు పెట్టిన దాడులు, 14వ రోజుకు చేరుకున్నాయి. ఇరాన్ చేస్తున్న ప్రతి దాడులు నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రాచ్య పరిస్థితులపై స్పందిస్తూ, పరిస్థితి "చాలా వేగంగా మారుతోంది" అని, అతి త్వరలో ఇరాన్మాకు లొంగిపోనుందంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ కొత్త బెదిరింపు తర్వాత ఇరాన్, లెబనాన్లో కొత్త దాడులు జరిగినట్లు తెలుస్తోంది.యుద్ధంలో తన పక్షం గెలిచిందని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్, హార్ముజ్ జలసంధి మూసివేతతో ఉత్పన్నమైన సరఫరా సమస్యల కారణంగా చమురు ధరలు పెరగడం ద్వారా అమెరికా గణనీయమైన డబ్బు సంపాదించే అవకాశం ఉందని గురువారం అన్నారు. ఇరాన్ ఇంధన బెదిరింపులు చేస్తున్నప్పటికీ, అణ్వాయుధాలను పొందకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. "అమెరికా ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు, కాబట్టి చమురు ధరలు పెరిగినప్పుడు, మేము చాలా డబ్బు సంపాదిస్తాము." ఇరాన్ అణు ఆయుధాలను కలిగి ఉండకుండా అడ్డుకోవడం ఎంతో ముఖ్యమని ఆయన సోషల్ మీడియాలో పేర్కొనడం చర్చకు దారి తీసింది. ఇరాక్లో విమాన ప్రమాదం: అమెరికా విమానం కూలిపోయిన ఘటన కలకలం రేపింది. అయితే శత్రుదాడిలో కాకుండా ఇరాక్లో అమెరికాకు చెందిన KC-135 రీఫ్యూయలింగ్ (ఇంధనం నింపే) విమానం ప్రమాదానికి గురైంది. మరో విమానంతో జరిగిన ఢీకొనడం వల్ల జరిగినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. అటు ఇరాక్లోని కుర్దిస్తాన్ రీజియన్లో జరిగిన దాడిలో ఒక ఫ్రెంచ్ సైనికుడు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. దీనిని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తీవ్రంగా ఖండించారు.UAE పై ఇరాన్ దాడులుమార్చి 12న ఇరాన్ నుండి ప్రయోగించిన 10 బాలిస్టిక్ క్షిపణులు మరియు 26 డ్రోన్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) విజయవంతంగా అడ్డుకుంది.దాడులు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు UAE మొత్తం 278 బాలిస్టిక్ క్షిపణులు, 15 క్రూయిజ్ క్షిపణులు మరియు 1,540 డ్రోన్లను గాలిలోనే ధ్వంసం చేసింది. దుబాయ్ మధ్య భాగంలో క్షిపణి శకలాలు పడటంతో ఒక భవనం పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.ఇది ఇలా ఉంటే ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో స్వదేశాలకు వెళ్లాల్సిన ప్రవాసులకు యూఏఈ భారీ ఊరట కల్పించింది. ఫిబ్రవరి 28 లేదా ఆ తర్వాత వీసా గడువు ముగిసిన వారు, కొత్త ఎంట్రీ పర్మిట్ అవసరం లేకుండానే మార్చి 31 వరకు ఉండేందుకు అనుమతినిచ్చింది. మరోవైపు యుద్ధ పరిణామాలపై తొలిసారి స్పందించిన ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడు మోజ్తాబా ఖమేనీ పోరాడుతూనే ఉంటామన , హోర్ముజ్ జలసంధిని మూసివేస్తానని గురువారం నాటి ఒక టెలివిజన్ ప్రెజెంటర్ చదివిన సందేశంలో స్పష్టం చేశారు. రక్తం ధారబోసిన తమ అమరవీరుల కోసం ప్రతీకారం తీర్చు కుంటామని ప్రకటించాడు.కాగా పశ్చిమాసియా యుద్ధం రెండవ వారంలోకి అడుగుపెడుతుండగా ఇరు పక్షాలు ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నాయి. ఎక్కడా తగ్గేదే లేదు పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తుండటం గమనార్హం. ఈ అనూహ్య యుద్ధంలో మరణించిన వారి సంఖ్య 2వేలకు పైగా పెరిగింది. వీరిలో ఎక్కువమంది ఇరాన్లోనే ఉన్నారని రాయిటర్స్ నివేదించింది. ఇరు పక్షాల భీకర దాడుల మధ్య కొనసాగుతున్న యుద్ధం లక్షలాది మంది జీవితాలను అస్తవ్యస్తం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం, ఆర్థిక మార్కెట్లను కుదిపేస్తోంది. -
మోజ్తాబా ఆరోగ్యంపై పెదవి విరిచిన ట్రంప్
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏ మాత్రం చల్లారడం లేదు. ఇరాన్పై అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆయన కుమారుడు ప్రస్తుత సుప్రీం మెుజ్తాబా ఖమేనీ సైతం అమెరికా దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారని ఊహగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై తొలిసారిగా స్పందించారు.ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..‘నాకు తెలిసి ఆయన గాయపడ్డాడు. ఎదో ఒక రూపంలో బ్రతికే ఉన్నాడని అనుకుంటున్నాను’ అని అన్నారు. అయితే మెుజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డట్లు కథనాలు పేర్కొంటున్నాయి. టెహ్రాన్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అతను ఓ కాలు పూర్తిగా కోల్పోయాడని, లివర్ డ్యామేజ్ జరిగిందని ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నట్లు సమాచారం. ఇటీవలే ఇరాన్ సుప్రీంలీడర్గా మోజ్తాబా ఖమేనీ ఎన్నికయ్యారు. ఆ దేశానికి చెందిన 88 మంది సభ్యుల అసెంబ్లీ ఎక్స్పర్ట్ కమిటీ కొత్త సుప్రీం లీడర్గా మోజ్తాబాను ఎన్నుకుంది. ఈ ఎన్నికపై ఇజ్రాయెల్ ప్రకటన విడుదల చేసింది. సుప్రీం లీడర్గా ఎవరిని ఎన్నుకుంటే వారే తమ లక్ష్యమని హెచ్చరించింది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ దీనిపై స్పందించారు.కాగా పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. చమురు రవాణాకు ఎంతో కీలకమైన హార్మూజ్ జలసంధిని మూసివేయడంతో చమురు కొరత ఏర్పడింది. హార్మూజ్ను ఎట్టిపరిస్థితుల్లో తెరిసేది లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలోనే వారి అనుమతి లేకుండా ఆ మార్గం గుండా ప్రయాణించే నౌకలపై దాడి చేస్తుంది. -
రష్యా చమురుపై అమెరికా కీలక నిర్ణయం
వాషింగ్టన్: ప్రపంచ ఇంధన మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితిని తొలగించేందుకు అమెరికా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. సముద్ర మార్గంలో చిక్కుకుపోయిన రష్యా చమురును కొనుగోలు చేసేందుకు భారత్తో పాటు మరికొన్ని దేశాలకు 30 రోజుల పాటు తాత్కాలిక అనుమతులు మంజూరు చేసింది. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను స్థిరీకరించడంతో పాటు పెరుగుతున్న ఇంధన ధరల నుంచి ఉపశమనం కలిగించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ట్రెజరీ విభాగం వెల్లడించింది.ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సముద్ర రవాణాలో ఉన్న రష్యా చమురును కొనుగోలు చేసేందుకు పలు దేశాలకు వెసులుబాటు కల్పిస్తూ అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఉత్తర్వులు జారీ చేశారు. ‘ఇరాన్ ఉగ్రవాద పాలన వల్ల తలెత్తిన అస్థిరతను ఎదుర్కొంటూనే, చమురు ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది’ అని ఆయన సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. అయితే ఈ మినహాయింపు కేవలం మార్చి 5 లోపు నౌకల్లో లోడ్ అయిన చమురుకు మాత్రమే వర్తిస్తుందని, ఇది ఏప్రిల్ 4 వరకు మాత్రమే అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. .@POTUS is taking decisive steps to promote stability in global energy markets and working to keep prices low as we address the threat and instability posed by the terrorist Iranian regime.To increase the global reach of existing supply, @USTreasury is providing a temporary…— Treasury Secretary Scott Bessent (@SecScottBessent) March 12, 2026ఈ నిర్ణయం వల్ల రష్యా ప్రభుత్వానికి పెద్దగా ఆర్థిక లాభం చేకూరదని అమెరికా అధికారులు విశ్లేషిస్తున్నారు. రష్యాకు వచ్చే ఆదాయంలో మెజారిటీ భాగం చమురు వెలికితీత సమయంలో విధించే పన్నుల ద్వారానే లభిస్తుందని, ప్రస్తుతం కేవలం రవాణాలో ఉన్న నిల్వలను విక్రయించుకునేందుకు మాత్రమే అనుమతినిచ్చామని స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నారు. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఆసియా జలాల్లో సుమారు 9.5 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురు నిలిచిపోయి ఉంది. తాజా ఉత్తర్వులతో ఈ నిల్వలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: ఇరాన్పై మళ్లీ ఉరిమిన ట్రంప్ -
ఇరాన్పై మళ్లీ ఉరిమిన ట్రంప్
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పట్ల మరోసారి తన కఠిన వైఖరి ప్రదర్శించారు. ఇరాన్తో నెలకొన్న సంఘర్షణ ‘అత్యంత వేగంగా’ క్లైమాక్స్కు చేరుకుంటోందని, ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు. శ్వేతసౌధంలో జరిగిన ‘ఉమెన్స్ హిస్టరీ మంత్’ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ ప్రస్తుత యుద్ధ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైనిక పటిమను కొనియాడారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు తాము చరమగీతం పాడుతున్నామని ట్రంప్ పేర్కొన్నారు.అమెరికా సైనిక బలగాలు క్షేత్రస్థాయిలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాయని ట్రంప్ ప్రశంసించారు. ‘ఇరాన్ విషయంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. మా సైనిక శక్తి అజేయమైనది. చరిత్రలో ఇలాంటి శక్తివంతమైన సైన్యాన్ని ఎవరూ చూసి ఉండరు. ప్రస్తుతం ఏం చేయాలో అదే చేస్తున్నాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. గడిచిన 47 ఏళ్లలో ఏ ప్రభుత్వమూ చేయలేని ధైర్యసాహసాలను తమ ప్రభుత్వం ప్రదర్శిస్తోందని, గత పాలకులు వదిలేసిన సమస్యలను తాము పరిష్కరిస్తున్నామని ట్రంప్ వ్యాఖ్యానించారు. President Trump on Iran: 🇮🇷🇺🇸"Situation with Iran is moving along very rapidly..They really are a nation of terror and hate (regime)...They are paying a big price." pic.twitter.com/BHwApCfpLJ— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) March 12, 2026ఇరాన్ పాలకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ట్రంప్, ఆ దేశాన్ని ‘విద్వేషానికి, ఉగ్రవాదానికి నిలయం’గా అభివర్ణించారు. ఆ ప్రాంతంలో అశాంతిని రేకెత్తిస్తున్న ఇరాన్ పాలక యంత్రాంగం ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తోందని వ్యాఖ్యానించారు. తన మొదటి పదవీకాలంలో అమెరికా సైన్యాన్ని ఆధునీకరించడం కారణంగానే ఇప్పుడు ఈ స్థాయిలో విజయాలు సాధిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ‘మేము సైన్యాన్ని పునర్నిర్మించాం. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాం. సైన్యాన్ని ఇంత భారీగా ఉపయోగించాల్సి వస్తుందని నేను అనుకోలేదు, కానీ ప్రస్తుత ప్రపంచ పరిణామాలు ఆ అవసరాన్ని కల్పించాయి’ అని ట్రంప్ పేర్కొన్నారు. వివరించారు.ఇది కూడా చదవండి: అమెరికాకు ఇరాన్ షాక్: 12 రోజుల్లో వేల కోట్ల సైనిక సంపత్తి బుగ్గి -
మన నిజమైన భాగస్వాములెవరు?
ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశం పోకడలతో చాలా దేశాలు సంక్షోభంలో ఉన్నాయి. అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత దేశపు ‘గొప్ప వ్యూహం’ ఏమిటి? దేశ, విదేశీ వ్యవహారాలలో మన విధానాలు ఏమిటి? అని ప్రశ్నించుకోవడం సము చితం. మనకు మనం నిర్దేశించుకున్న ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు అవి ఎలా ఉపకరిస్తాయో ఆలోచించాలి.అసలు వృద్ధి మార్గం‘‘అధికార సమతూకం సూచించే దానికన్నా ఒక పరిస్థితి నుంచి ఎంత ఎక్కువ లాభపడగలమో చూడాలి. అది అధికారాన్ని సృష్టించుకునే కళ’’ అని లారెన్స్ ఫ్రీడ్మ్యాన్ తన ‘స్ట్రాటెజీ: ఎ హిస్టరీ’ అనే పుస్తకంలో వ్యాఖ్యానిస్తారు. అధికారానికి అనేక కొలమానాలుంటా యని బెర్ట్రండ్ రసెల్, ఇంకా చాలామంది చెప్పారు. కనుక, వ్యూహాలు కూడా వాటిని అమలుపరచుకునేందుకు నిర్దేశించుకున్న కాల వ్యవధులను బట్టి అనేక రూపాల్లో, పరిమాణాల్లో ఉంటాయి. మరి గొప్ప వ్యూహం అంటే ఏమిటి? దీనికీ అనేక నిర్వచనాలు న్నాయి. ఎంచుకున్న రంగాన్ని బట్టి అవి మారిపోతూ ఉంటాయి. సైనిక వ్యవహారాల్లో ఒకలా, వ్యాపారంలో ఒకలా! అధికారాన్ని హస్త గతం చేసుకునేందుకే కాదు, దాన్ని నిలబెట్టుకునే, వినియోగించు కునే దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. అయితే, భారతదేశపు గొప్ప వ్యూహం ఏమిటి? అలీనోద్యమం మాదిరిగానే, ‘బహుళ–అనుగుణ్యత’ మన విధానమని ఇపుడు చాలా మంది సూచిస్తున్నారు. కానీ, అది ఆ రెండు భావనలను తప్పుగా అర్థం చేసుకోవడమవుతుంది. అలీనోద్యమమైనా, బహుళ –అనుగుణ్యత అయినా ఒక లక్ష్యాన్ని సాధించుకునే మార్గం. అవి వాటికవే ప్రయోజనాలు కావు. జాతీయ అజెండాయే వ్యూహందివంగత కె.సుబ్రహ్మణ్యం ఈ విషయంలో నాకు గురువు. అభివృద్ధి చెందిన దేశంగా పునరావిర్భవించడం; ఆయుధాలను కాక, విజ్ఞానాన్ని అధికార చలామణీకి సాధనంగా గుర్తించడం భారత దేశపు గొప్ప వ్యూహమని ఆయన చెప్పేవారు. ‘స్వీయ జనాభాతో పాటు మొత్తం మానవాళి సంక్షేమానికి, ప్రపంచ శాంతికి భారత్ పాటుపడాలనీ; పారిశ్రామికీకరణ చెందిన ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా తనను తాను అభివృద్ధి చేసుకున్నప్పుడే ప్రపంచంలో దానికి సరైన స్థానం దక్కుతుందనే భావన రాజ్యాంగ పరిషత్ 1947లో చేసిన ప్రమాణంలో ఉందనీ’ సుబ్రహ్మణ్యం 2012లో రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. భారత్ చెప్పుకునే ఏ గొప్ప వ్యూహానికైనా ఇదే సరైన నిర్వచనం కావాలని ఆయన సూచించారు. భారత ఉపఖండం ఒకప్పుడు సుసంపన్నమైన ఆర్థిక వ్యవస్థతో వర్ధిల్లింది. 18వ శతాబ్దంలో కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాని వాటా నాల్గవ వంతుగా ఉంది. చైనాది మరో నాల్గవ వంతు వాటా. ఈ భావనే భారత జాతీయోద్యమ నాయకత్వానికి స్ఫూర్తినిచ్చింది. పదిహేడవ శతాబ్దంలో ప్రపంచ ఆదాయంలో చైనా–భారత్ల వాటా దాదాపు 25 శాతంగా లెక్కకు వచ్చేదని బ్రిటిష్ చరిత్రకారుడు ఆంగస్ మాడిసన్ ఎంతో శ్రమకోర్చి రూపొందించిన గణాంక అధ్యయనంలో వెల్లడించారు. ఈ రెండు దేశాల వాటా 1950 కల్లా 5% కన్నా తక్కువకు పడిపోయింది. రెండు దేశాలు వలస పాలకు లను గద్దె దింపి, ప్రపంచ ఆదాయంలో తమ వాటా తిరిగి దక్కించు కోవాలని కోరుకున్నాయి. ప్రపంచ దేశాల సరసన తనకుండవలసిన గౌరవ స్థానాన్ని పునరుద్ధరించుకునేందుకూ, ప్రపంచ ఆదాయ, వాణిజ్యాలలో రావలసిన వాటాను దక్కించుకునేందుకూ వీలు కల్పించే అంతర్జాతీయ క్రమ వ్యవస్థ రూపుదిద్దుకునేటట్లు చూడటం స్వతంత్ర భారతదేశ జాతీయ అజెండా అయింది. ఒక రకంగా, అదే దాని గొప్ప వ్యూహమని చెప్పుకోవచ్చు. అమెరికాను నమ్మగలమా?ప్రపంచ పర్యావరణం సానుకూలంగా ఉన్నప్పుడే ఏ దేశమైనా ఆర్థికాభివృద్ధి దిశగా అడుగులు వేయగలుగుతుంది. ప్రపంచ వ్యవ హారాలలో ప్రస్తుత స్థితిని చూడండి: అమెరికా, ఇజ్రాయెల్ తీసుకునే చర్యలు భారత్ ఆర్థికాభివృద్ధికి దోహదపడే ప్రపంచ, ప్రాంతీయ పర్యావరణాన్ని సృష్టించేవిగా ఉన్నాయా? లేకపోతే, మనం మౌన ముద్ర వహించడానికి బదులుగా వాటి చర్యలకు అభ్యంతరం చెప్ప వద్దా? అల్లకల్లోల పశ్చిమాసియా ‘వికసిత్ భారత్’ దిశగా భారత్ పయనాన్ని మందగింపజేయడం లేదా? అలా అయితే, మోదీ ప్రభుత్వ ప్రస్తుత వైఖరి మన గొప్ప వ్యూహానికి అనువైనదిగానే ఉందా?భారత్ గొప్ప వ్యూహ సాధనకు అమెరికా ఒక భాగస్వామిగా తోడ్పడగలదనే ఉద్దేశంతోనే మనం దానితో వ్యూహాత్మక భాగ స్వామ్యం కుదుర్చుకున్నాం. ఆ లక్ష్య సాధనకు చేసే కృషిలో అమెరి కాను ఇక ఎంతమాత్రం ‘వ్యూహాత్మక’, ‘విశ్వసనీయ’ భాగస్వామిగా పరిగణించడానికి లేదని ఇటీవలి పరిణామాలు, ట్రంప్ ప్రభుత్వ ప్రకటనలు సూచిస్తున్నాయి. మన రాజ్యాంగ సూత్రాలు, విలువలే మనల్ని ఒక ఉదారవాద, బహుళ సాంస్కృతిక, సెక్యులర్ ప్రజాస్వామిక దేశంగా నిల బెడుతూ, ప్రపంచంలో మనకొక స్థాయిని కల్పిస్తున్నాయి. ప్రపంచంలోని ప్రధాన దేశాలు అనుసరిస్తున్న సైనిక, ఆర్థిక విధానాలు భారత్ ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించేందుకు; ఉదారవాద, బహుళత్వ, సెక్యులర్ ప్రజాస్వామిక దేశంగా వర్ధిల్లేందుకు దోహదపడే ప్రపంచ పర్యావరణాన్ని సృష్టించేవిగా లేవు.ఈ నేపథ్యంలో మనల్ని మనం ఎలా పరిపాలించుకుంటాం, ఎలా అభివృద్ధికి బాటలు పరచుకుంటామన్నది మరింత ముఖ్యమైనఅంశంగా పరిణమిస్తుంది. మనం దేశీయంగా అనుసరిస్తున్న విధానాలు ఆత్మనిర్భరత, ‘వికసిత్ భారత్’ లక్ష్యాల సాధనకు వీలు కల్పించేవిగా ఉన్నాయా? క్రమేపీ మత భావనలను పెంచుకుంటున్న పాలక వ్యవస్థ అనుస రిస్తున్న విధానాలు ఆర్థికాభివృద్ధిని మందగింపజేసేవిగా ఉన్నాయి. మన రాజ్యాంగం దేన్ని గొప్ప వ్యూహంగా వీక్షించిందో ఆ ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నవిగా లేవు. సరిగ్గా ఈ కారణాన్ని దృష్టిలో పెట్టుకునే మోదీ ప్రభుత్వం దేశ, విదేశాలలోని పరిణా మాలను మరింత దీర్ఘకాలిక దృష్టితో పరిశీలించవలసి ఉంది. దేశీయ, ప్రపంచ పరిణామాలను వేటికవిగా తాత్కాలిక దృష్టితో చూడటంతోనే సమస్య వచ్చి పడుతోంది. అంతర్జాతీయ వ్యవస్థలో మౌలికమైన మార్పులు చోటుచేసుకుంటున్నప్పుడు, ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు నిజంగా చేయూత నివ్వగల భాగస్వాములెవరో విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. కర్తవ్యం మన చేతుల్లోనే ఉంది. కానీ, బాహ్య వాతావరణం కూడా లెక్కకు వస్తుంది. సంజయ బారువ్యాసకర్త జర్నలిస్ట్ – ప్రధానికి మాజీ మీడియా సలహాదారు -
బిగ్ బ్రేకింగ్.. అమెరికా తీరానికి ఇరాన్ యుద్ధ నౌక
-
ప్రముఖ డేటా సెంటర్లకు ఇరాన్ హెచ్చరిక
పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల జరిగిన దాడుల్లో నూతన ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా సైతం తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. -
మొజ్తాబా నా మాట విను : డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు అంతర్జాతీయ కథనాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా చేస్తున్న ప్రధాన డిమాండ్లలో ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తిగా వదులుకోవాలి. ఆ డిమాండ్ను తిరస్కరిస్తే, కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీయే లక్ష్యంగా చేసే దాడులకు తాను మద్దతు ఇస్తానని ట్రంప్ స్పష్టంగా పేర్కొన్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక తెలిపింది.37 ఏళ్ల పాటు ఇరాన్ను ఒంటిచేత్తో పాలించిన అయతుల్లా అలీ ఖమేనీ జీవితం విషాదాంతమైంది. ఫిబ్రవరి 28న టెహ్రాన్లో అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతుండగా, ఇజ్రాయెల్ సైన్యం ‘బ్లూ స్పారో’ అనే ఖండాంతర క్షిపణిని ప్రయోగించి దాడి చేసింది. ఆ దాడిలో అయతుల్లా ఖమేనీ మరణించారు. ఇజ్రాయెల్ ఎలా మిలటరీ ఆపరేషన్ చేపట్టిందో, అదే తరహా చర్యలు మోజ్తబా ఖమేనీపై కూడా జరగవచ్చని అమెరికా అధికారులు హెచ్చరిస్తున్నారు.అలీ ఖమేనీ మరణం తర్వాత, ఆయన రెండవ కుమారుడు మోజ్తబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్గా ఎన్నుకోవడంపై ట్రంప్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోజ్తబా ఖమేనీ ప్రశాంతంగా జీవిస్తారని నేను నమ్మను’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. మోజ్తబా నియామకానికి ముందు, అమెరికా ఇరాన్ తదుపరి నాయకుడి ఎంపికలో కూడా తమకు పాత్ర ఉండాలని పట్టుబట్టింది. వెనిజువెలా పాలనా పరమైన అంశాల్లో అమెరికా జోక్యం చేసుకున్నట్లే, ఇరాన్లో కూడా అదే విధంగా ప్రభావం చూపాలని ట్రంప్ కోరుకున్నారు.అయితే, దివంగత అయతుల్లా ఖమేనీ తన వీలునామాలో మోజ్తబా తన వారసుడిగా రావాలని కోరుకోలేదని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఒత్తిడితో మోజ్తబా ఎంపిక లాంఛనమైంది. ఇదే అంశంపై ఇరాన్ ప్రతిపక్ష గ్రూప్ ‘నేషనల్ యూనియన్ ఫర్ డెమోక్రసీ రీసెర్చ్’ డైరెక్టర్ ఖోస్రో ఇస్ఫహానీ మాట్లాడుతూ..‘ఖమేనీ తన కుమారుడిని వారసుడిగా కోరుకోలేదు. ఆయన వీలునామాలో మోజ్తబాను వారసుడిగా పేర్కొనవద్దని స్పష్టంగా రాశారు’ అని తెలిపారు. -
ట్రంప్ మరో సంచలన నిర్ణయం
వాషింగ్టన్: అంతర్జాతీయ వాణిజ్య రంగంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెరతీశారు. విదేశీ తయారీ రంగంలో అనుసరిస్తున్న ‘అనుచిత వాణిజ్య విధానాలపై’ విచారణ చేపట్టాలని ట్రంప్ యంత్రాంగం నిర్ణయించింది. ఈ జాబితాలో భారత్ సహా ప్రపంచంలోని 16 ప్రధాన ఆర్థిక వ్యవస్థలను చేర్చడం గమనార్హం. అమెరికా పారిశ్రామిక రంగాన్ని కాపాడుకునేందుకు, విదేశాల నుంచి వస్తున్న మిగులు ఉత్పత్తిని అడ్డుకునేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు శ్వేతసౌధం వెల్లడించింది.అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల ట్రంప్ విధించిన సుంకాలను నిలిపివేస్తూ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో, ఈ కొత్త విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) జామీసన్ గ్రీర్ బుధవారం ఈ విచారణలపై అధికారిక ప్రకటన చేశారు. 1974 వాణిజ్య చట్టంలోని ‘సెక్షన్ 301’ కింద ఈ విచారణలు ప్రారంభించనున్నారు. దీనివల్ల భవిష్యత్తులో భారత్ వంటి దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై భారీగా పన్నులు మోపే అవకాశం ఉంది.అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వాములుగా ఉన్న చైనా, యూరోపియన్ యూనియన్, మెక్సికో, భారత్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ దేశాలను ఈ విచారణలో ప్రధాన లక్ష్యంగా చేసుకున్నారు. వీటితో పాటు స్విట్జర్లాండ్, నార్వే, ఇండోనేషియా, సింగపూర్, థాయ్లాండ్, మలేషియా, కంబోడియా, వియత్నాం, బంగ్లాదేశ్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ‘చాలా దేశాలు తమ దేశీయ అవసరాలకు మించి వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ మిగులు ఉత్పత్తిని అమెరికాపైకి నెట్టడం వల్ల మా దేశీయ తయారీ రంగం దెబ్బతింటోంది. అమెరికా పారిశ్రామిక పునాదిని ఇకపై బలి చేయబోము’ అని జామీసన్ గ్రీర్ పేర్కొన్నారు.ఇటీవలే భారత్-అమెరికా మధ్య ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందన్న హామీతో, అమెరికా తన సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. గతంలో ట్రంప్ చేపట్టిన ‘లిబరేషన్ డే’ విన్యాసాల తర్వాత భారత్పై 25 శాతం సుంకాలు ఉండగా, రష్యా చమురు కొనుగోలు నెపంతో మరో 25 శాతం పెనాల్టీ విధించారు. తాజా విచారణతో ఈ ఒప్పందంపై ఎలాంటి ప్రభావం పడుతున్నదనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఇది కూడా చదవండి: పప్పన్నం పెట్టకుండా 10 వేల పెళ్లిళ్లు? -
వాణిజ్య నౌకలపై గురి!
దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధ బీభత్సం తగ్గుముఖం పట్టే సూచనలే కన్పించడం లేదు. 12వ రోజైన బుధవారం ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ భారీ స్థాయిలో పరస్పర దాడులను కొనసాగించాయి. పర్షియన్ గల్ఫ్ పొడవునా పలు వాణిజ్య నౌకలపై ఇరాన్ భారీ స్థాయిలో దాడులకు దిగింది. యూఏఈ నౌకాశ్రయంలో ఒక కంటైనర్ నౌకపై డ్రోన్ దాడి జరిపింది. నౌక పూర్తిగా ధ్వంసమైనట్టు పేర్కొంది. అంతేగాక దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపైనా ఇరాన్ మరోసారి డ్రోన్ దాడులు జరిపింది. రెండు డ్రోన్లు విమానాశ్రయంపైనే పడి పేలిపోయాయి. ఈ ఘటనలో ఒక భారతీయునితో సహా నలుగురు గాయపడ్డారు. అయితే విమానాల రాకపోకలు యథావిధిగా కొనసాగినట్టు విమానాశ్రయ వర్గాలు పేర్కొన్నాయి. అంతేగాక గల్ఫ్లోని అతి పెద్ద చమురు శుద్ధి కేంద్రాలపై కూడా ఇరాన్ ఎడాపెడా దాడులు జరిపింది. ఇకపై పశ్చిమాసియాలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలను కూడా లక్ష్యంగా చేసుకుని పెద్దపెట్టున దాడులు చేస్తామని ఇరాన్ జాయింట్ మిలిటరీ కమాండ్ ప్రకటించింది. దాంతో ఆ ఆర్థిక సంస్థల పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్ ప్రయోగించిన 8 డ్రోన్లను నేలకూల్చినట్టు కువైట్, 5 డ్రోన్లను అడ్డుకున్నట్టు సౌదీ అరేబియా వెల్లడించాయి. ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపైకి ప్రయోగించిన 6 బాలిస్టిక్ క్షిపణులను కూడా నేలకూల్చినట్టు సౌదీ తెలిపింది. ఖతర్, ఒమన్, బహ్రెయిన్పై కూడా ఇరాన్ పెద్ద సంఖ్యలో డ్రోన్ దాడులు జరిపింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో రువైస్ చమురు శుద్ధి కేంద్రాన్ని మూసేస్తున్నట్టు యుఏఈ ప్రకటించింది. ఇజ్రాయెల్లో టెల్ అవీవ్, జెరూసలేంతో పాటు పలు నగరాలపైకి భారీగా క్షిపణులు ప్రయోగించింది.ఇరాన్పై తీవ్ర దాడులు మరోవైపు ఇజ్రాయెల్–అమెరికా సంయుక్త దాడులు బుధవారం కూడా ఇరాన్ను అల్లాడించాయి. రాజధాని టెహ్రాన్తో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాలపై క్షిపణులు, బాంబుల వర్షం కురిసింది. టెహ్రాన్లోని బ్యాంక్ సఫా భవనం దాడుల్లో తీవ్రంగా దెబ్బ తింది. దాని సిబ్బందిలో పలువురు మృత్యువాత పడ్డట్టు ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ తెలిపింది. నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపైనా భారీగా క్షిపణి దాడులు జరిగాయి. హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థను లక్ష్యం చేసుకుని లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు బుధవారమూ కొనసాగాయి. రాజధాని బీరూట్లో అత్యంత జనసమ్మర్ధంతో కూడిన ఐచా బకర్ ప్రాంతంలో పలు భవనాలు దాడుల్లో పూర్తిగా దెబ్బతిని మంటల్లో చిక్కుకున్నాయి. దక్షిణ, తూర్పు లెబనాన్లో జరిపిన దాడుల్లో కనీసం 14 మంది మరణించినట్టు తెలుస్తోంది. వారిలో ఒక రెడ్క్రాస్ సిబ్బంది కూడా ఉన్నట్టు సమాచారం. లెబనాన్లో మృతుల సంఖ్య 570 దాటినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. 160 మంది అమెరికా సైనికులకు గాయాలు ఇరాన్పై యుద్ధంలో ఇప్పటిదాకా 140 మంది అమెరికా సైనికులు గాయపడ్డట్టు పెంటగాన్ ప్రధాన అధికార ప్రతినిధి సీన్ పార్నెల్ ధ్రువీకరించారు. ‘‘వారిలో ఎనిమిది మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. 108 మంది ఇప్పటికే ఆస్పత్రుల నుంచి డిశ్చార్జై విధుల్లో చేరారు’’అని చెప్పారు. అయితే గాయపడ్డ అమెరికా సైనికుల సంఖ్య 160 పై చిలుకేనని తెలుస్తోంది. 40 కోట్ల బ్యారెళ్ల చమురు విడుదల: ఐఈఏపారిస్: పశ్చిమాసియా యుద్ధంతో చమురు సరఫరా పడకేసిన నేపథ్యంలో అత్యవసర నిల్వల నుంచి 40 కోట్ల బ్యారెళ్ల చమురును విడుదల చేయాలని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐఈఏ ఈ స్థాయిలో చమురు నిల్వలను విడుదల చేయడం చరిత్రలో ఇదే తొలిసారి! అయితే హార్మూజ్ జలసంధి గుండా చమురు, సహజ వాయువు రవాణా వీలైనంత త్వరగా పునఃప్రారంభం కావడమే సమస్యకు పరిష్కార మార్గమని ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫతీ బిరోల్ ఆశాభావం వెలిబుచ్చారు.మధ్యవర్తిత్వానికి తెర: ఖతర్ దోహా: ఇరాన్ దాడుల నేపథ్యంలో ఆ దేశం తరఫున చర్చల్లో మధ్యవర్తిగా కొనసాగబోనని ఖతర్ ప్రకటించింది. అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన అణు చర్చలకు ఆ దేశం మధ్యవర్తిత్వం వహించడం తెలిసిందే. అయినా తమపై ఇరాన్ దాడులు చేసిందంటూ ఖతర్ విదేశాంగ శాఖ ఉప మంత్రి మహమ్మద్ బిన్ అద్బుల్ అజీజ్ అల్ఖులైఫీ ఆవేదన వెలిబుచ్చారు. హార్మూజ్ పొడవునా మందుపాతర్లు హార్మూజ్ గుండా నౌకల ప్రయాణాన్ని అడ్డుకునేందుకు ఆ జలసంధిలో భారీ స్థాయిలో ఇరాన్ మందుపాతరలు అమర్చుతోంది! వీటిని తొలగించడం అత్యంత భారీ వ్యయప్రయాసలతో కూడిన పని. వాటి బారిన పడకుండా సురక్షితంగా హార్మూజ్ను దాటే మార్గం ఇరాన్కు మాత్రమే తెలుసు! ఈ నేపథ్యంలో ఆ మందుపాతరలను తక్షణం తొలగించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు అల్టిమేటమిచ్చారు. లేదంటే ఆ దేశంపై దాడులను కనీవినీ ఎరగని స్థాయికి పెంచుతామని హెచ్చరించారు. హార్మూజ్లో మందుపాతరలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ఇరాన్కు చెందిన 16 మైన్లేయర్ పడవలను పేల్చేసినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. మరోవైపు, హార్మూజ్ను మూసేసినట్టు ఇరాన్ ప్రకటించినా, ఆ దేశానికి చెందినవిగా భావిస్తున్న పలు చమురు నౌకలు మాత్రం దానిగుండా ప్రయాణాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో బ్యారెల్కు 200 డాలర్లు! ప్రపంచం సిద్ధపడాలి: ఇరాన్ పశ్చిమాసియా కల్లోలం నేపథ్యంలో చమురు ధరలు త్వరలో ఆకాశాన్నంటడం ఖాయమని ఇరాన్ జోస్యం చెప్పింది. ‘‘అవి త్వరలో బ్యారెల్కు ఏకంగా 200 డాలర్ల దాకా చేరవచ్చు. ప్రపంచమంతా అందుకు సిద్ధంగా ఉండాలి’’అని ఇరాన్ మిలిటరీ కమాండ్ అధికార ప్రతినిధి ఇబ్రహీం జొల్ఫకరీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బ తీసినందుకు ఇలాంటి పర్యవసానాలు తప్పవన్నారు. ‘‘ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇప్పటిదాకా పరిమిత స్థాయి ప్రతీకార దాడులకే పరిమితమయ్యాం. కానీ ఇకపై వాటిపై పూర్తిస్థాయిలో ఎడతెరిపి లేకుండా దాడులకు దిగుతాం’’అంటూ హెచ్చరించారు. చమురు, సహజవాయువు సరఫరాల్లో ఆటంకానికి అమెరికాయే కారణమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ దుయ్యబట్టారు. యుద్ధానికి త్వరలో తెర: ట్రంప్ ఇరాన్లో ఏమీ మిగల్లేదన్న అధ్యక్షుడు ఇరాన్పై యుద్ధానికి త్వరలో తెర దించుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంకేతాలిచ్చారు. బుధవారం ఈ మేరకు ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. తమ దాడుల అనంతరం ఇరాన్లో ఇంకేమీ మిగల్లేదని అభిప్రాయపడ్డారు. ‘‘లక్ష్యం చేసుకోవడానికి ఇంకేమీ లేదక్కడ. యుద్ధం ద్వారా మేం ఆశించిన లక్ష్యాలన్నీ దాదాపుగా నెరవేరినట్టే. కాబట్టి ఇక నేను ఎప్పుడనుకుంటే అప్పుడు యుద్ధానికి తెర పడుతుంది’’అని ఆక్సియోస్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. -
తుది దశకు యుద్ధం.. ట్రంప్ గుడ్న్యూస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఇరాన్తో యుద్ధం ముగిస్తామని అన్నారు. ఇప్పటికే ఇరాన్లోని అన్ని లక్ష్యాలను ఛేదించామని తెలిపారు. ఇప్పుడు కొత్తగా టార్గెట్ చేయడానికి ఇరాన్ దగ్గర ఇంకేమీ మిగల్లేదని అన్నారు. తాను ఎప్పుడు అనుకుంటే అప్పుడు యుద్ధం ఆగుతుందని చెప్పారు.కాగా, ఇరాన్ నౌకాదళం పనిచేస్తున్న పోర్టుల దగ్గరకు వెళ్లవద్దని అమెరికా సైన్యం పౌరులను హెచ్చరించింది. ఆ ప్రాంతాల్లో భద్రతకు హామీ ఇవ్వలేమని తెలిపింది. యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ ఇరానీ డాక్ కార్మికులు, పరిపాలనా సిబ్బంది, వాణిజ్య నౌకల సిబ్బంది ఇరాన్ నేవీ నౌకలు దగ్గరికి, సమీప సైనిక ప్రాంతాల వద్దకు వెళ్లవద్దని సూచించింది. అమెరికా దళాలు ఇరాన్ నౌకాదళ ఆస్తులపై దాడులు కొనసాగిస్తున్న సమయంలో యూఎస్ ఈ హెచ్చరిక చేసింది. ఇప్పటివరకు సుమారు 60 ఇరానీ నౌకలు ధ్వంసం చేశామని అమెరికా తెలిపింది.మరోవైపు, ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. దాడుల్లో కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ గాయపడినట్లు ప్రచారం జరుగుతోంది. ఖమేనీ కాలికి ఫ్రాక్చర్, ఎడమ కంటి వద్ద గాయాలైనట్లు సమాచారం. అయితే, గత ఏడాది జరిగిన హత్యాప్రయత్నంలోనే ఖమేనీ గాయపడ్డారని ఇజ్రాయెల్ అంటోంది. ఇప్పటి వరకు ప్రజల ముందుకు మొజ్తబా ఖమేనీ రాలేదు. -
పశ్చిమాసియాలో ఆరని యుద్ధ జ్వాలలు..ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు
-
యుద్దం వేళ భారీ ట్విస్ట్.. ఇరాన్కు ఉత్తర కొరియా మద్దతు
ప్యాంగ్యాంగ్: ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నికపై తాజాగా ఉత్తర కొరియా స్పందించింది. కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ఎన్నికను ఉత్తర కొరియా స్వాగతించింది. అదే సమయంలో పశ్చిమాసియా దేశంపై చట్టవిరుద్ధమైన దాడులకు ఇజ్రాయెల్, బద్ధ శత్రువు అమెరికాను విమర్శించింది.ఉత్తర కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తాజాగా ఓ ప్రకటనలో.. ఇరానియన్లు తమ నాయకుడిని ఎన్నుకునే హక్కును ఉత్తర కొరియా గౌరవిస్తుందని పేర్కొంది. అలాగే, ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చట్ట విరుద్ధం. ఇరాన్పై వారి సైనిక చర్యలు, ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరైంది కాదు. ఇరాన్ సామాజిక వ్యవస్థను పడగొట్టే ప్రయత్నం చేయడమేంటి?. ఇవి ప్రపంచవ్యాప్తంగా శాంతిని నాశనం చేయడంతో పాటుగా అస్థిరతను పెంచుతున్నాయి.ఇదిలా ఉండగా.. ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ భద్రతపై ఆందోళన పెరుగుతోంది. దీనిపై చైనా (china) తాజాగా స్పందించింది. మోజ్తాబా ఖమేనీని లక్ష్యంగా చేసుకోవడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరాన్లో హత్యకు గురైన తండ్రి అలీ ఖమేనీ వారసుడికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ సైన్యం బెదిరింపుల నేపథ్యంలో ఆయనను లక్ష్యంగా చేసుకోవడంపై తాము వ్యతిరేకిస్తున్నట్లు చైనా తెలిపింది. మోజ్తాబా ఖమేనీని నియమించాలనే ఇరాన్ నిర్ణయాన్ని వారి అంతర్గత విషయంగా చైనా పేర్కొంది.ఏ సాకుతోనైనా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని చైనా వ్యతిరేకిస్తుందని తెలిపింది. ఇరాన్ సార్వభౌమాధికారం, భద్రత , ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ ఇజ్రాయెల్ కు హితవు పలికారు. ఇరాన్ రాజ్యాంగ ప్రక్రియ ద్వారా మోజ్తాబా పేరును ఖరారు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులను చైనా గతంలో చట్టవిరుద్ధమైన దురాక్రమణగా ఖండించింది. కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. -
ఇంధన రంగంలో ట్రంప్ సంచలనం
వాషింగ్టన్: అమెరికా ఇంధన రంగ చరిత్రలో సరికొత్త సంచలనం నమోదయ్యింది. గత ఐదు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా నూతన చమురు శుద్ధి కర్మాగారాన్ని (ఆయిల్ రిఫైనరీ) టెక్సాస్లోని బ్రౌన్స్విల్లే పోర్ట్ వద్ద ప్రారంభించినట్లు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దాదాపు 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 25 లక్షల కోట్లు) భారీ వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భారత దిగ్గజ సంస్థ ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’ కీలక భాగస్వామిగా ఉండటం విశేషం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో, ఇంధన స్వావలంబన దిశగా అమెరికా వేసిన ఈ అడుగు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. చారిత్రక ఒప్పందంఈ చారిత్రక ఘట్టాన్ని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’ వేదికగా వెల్లడించారు. ‘అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ పేరిట గత 50 ఏళ్లలో తొలిసారిగా సరికొత్త రిఫైనరీని ప్రారంభిస్తున్నందుకు గర్వపడుతున్నాను. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందం. మా భాగస్వామి అయిన భారతీయ ప్రైవేట్ ఇంధన రంగ దిగ్గజం రిలయన్స్ సంస్థకు, వారి భారీ పెట్టుబడులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నాను’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో అమెరికాలోని వేలాది కార్మికులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది ఊతమిస్తుందని అని ట్రంప్ వివరించారు.పర్యావరణ హితంఈ రిఫైనరీ కేవలం ఇంధన ఉత్పత్తికే పరిమితం కాకుండా, ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన (Cleanest) రిఫైనరీగా గుర్తింపు పొందుతుందని ట్రంప్ పేర్కొన్నారు. సరళీకృత అనుమతులు, పన్ను తగ్గింపుల వంటి ప్రభుత్వ విధానాల వల్లే ఇటువంటి భారీ పెట్టుబడులు దేశానికి వస్తున్నాయని ఆయన అన్నారు. దీనివల్ల దక్షిణ టెక్సాస్ ప్రాంతం ఆర్థికంగా పటిష్టమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇరాన్ దాడుల కారణంగా గల్ఫ్ దేశాల్లో ఇంధన సరఫరాకు అంతరాయం కలుగుతున్న వేళ, అమెరికా సొంతంగా ఇంధన ఉత్పత్తిని పెంచుకుని, గ్లోబల్ మార్కెట్పై తన పట్టును నిలుపుకోవాలని చూస్తోంది.తగ్గనున్న ఇంధన ధరలుమరోవైపు పెరుగుతున్న చమురు ధరలపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పందిస్తూ.. ప్రస్తుతం ఉన్న ధరల పెరుగుదల తాత్కాలికమేనని అన్నారు. 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' లక్ష్యాలు పూర్తయిన తర్వాత అమెరికన్లకు తక్కువ ధరలకే ఇంధనం అందుబాటులోకి వస్తుందని ఆమె హామీ ఇచ్చారు. ఇరాన్ నుంచి ఎదురయ్యే అణు ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొంటామని, మిత్రదేశాల ప్రయోజనాలను కాపాడతామని ఆమె పేర్కొన్నారు. -
ఇరాన్తో యుద్ధం.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక ఇదే..
పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతోంది.. -
పుతిన్కు ట్రంప్ ఫోన్
మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం రాత్రి రష్యా అధినేత పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. వారిద్దరి మధ్య దాదాపు గంటపాటు సంభాషణ సాగింది. ఇరాన్–అమెరికా, ఉక్రెయిన్–రష్యా సంఘర్షణలపై ఇరువురు నేతలు చర్చించినట్లు రష్యా విదేశాంగ విధాన ప్రతినిధి యూరీ ఉషకోవ్ వెల్లడించారు. ప్రధానంగా పశ్చిమాసియా సంక్షోభంతోపాటు ఉక్రెయిన్లో శాంతి సాధన కోసం కొనసాగుతున్న మాస్కో–వాషింగ్టన్–కీవ్ చర్చలపై అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలిపారు. ట్రంప్, పుతిన్ మధ్య సంభాషణ స్వేచ్ఛాయుతంగా, నిర్మాణాత్మకంగా జరిగిందని పేర్కొన్నారు.ఇరాన్లో జరుగుతున్న యుద్ధం పట్ల పుతిన్ తన అభిప్రాయాలు వ్యక్తంచేశారని, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తోపాటు గల్ఫ్ దేశాల నాయకులతో గతవారం జరిగిన చర్చల సారాంశాన్ని ట్రంప్కు పుతిన్ తెలియజేశారని చెప్పారు. ట్రంప్ సైతం తాజా పరిణామాలపై తన మనసులో మాటను పుతిన్తో పంచుకున్నారని స్పష్టంచేశారు. ఈ ఏడాది ట్రంప్, పుతిన్ ఫోన్లో మాట్లాడుకోవడం ఇది 11వ సారి కావడం విశేషం. భారత్, చైనాలతోపాటు యూరప్లోని మిత్రదేశాలకు చమురు సరఫరాను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నామని పుతిన్ తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయనతో ట్రంప్ ఫోన్లో మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. యుద్ధానికి త్వరలోనే ముగింపు ఇరాన్పై యుద్ధం అతి త్వరలో ముగిసిపోతుందని తాను అంచనా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ఇరాన్పై గత పది రోజులుగా జరుగుతున్న యుద్ధాన్ని ‘స్వల్పకాలిక విహారయాత్ర’గా అభివర్ణించారు. ఆయన తాజాగా ఫ్లోరిడాలో మీడియాతో మాట్లాడారు. ఇరాన్లో ఇప్పటిదాకా 5,000 లక్ష్యాలపై అమెరికా–ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసిందని వెల్లడించారు. త్వరలోనే యుద్ధం ముగిసి, సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్న నమ్మకం ఉందన్నారు. చమురు సరఫరాను అడ్డుకుంటే ఖబడ్దార్ హొర్మూజ్ జలసంధిలో చమురు రవాణాను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ను ట్రంప్ హెచ్చరించారు. ఉగ్రవాద భావజాలం కలిగిన పాలకులు ప్రపంచ దేశాలకు ఇబ్బందులు సృష్టిస్తామంటే సహించబోమని అన్నారు. చమురు సరఫరాను అడ్డుకొనే ప్రయత్నం చేయొద్దని సూచించారు. హొర్మూజ్లో ఎలాంటి దుశ్చర్యకు పాల్పడినా.. ఇప్పటిదాకా ఇరాన్ చేసిన దాడి కంటే 20 రెట్లు బలంగా ఆ దేశాన్ని దెబ్బకొడతామని తేల్చిచెప్పారు. హొర్మూజ్లో చమురు సరఫరాకు ఆటంకాలు లేకుండా చూస్తున్నామని, ఇది చైనాకు, ఇతర దేశాలకు తాము ఇస్తున్న బహుమతి అని వ్యాఖ్యానించారు. ఒక్క లీటర్ కూడా రవాణా చేయలేరు: ఇరాన్ ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్(ఐఆర్జీసీ) మంగళవారం ఘాటుగా స్పందించింది. హొర్మూజ్ జలసంధి నుంచి ఒక్క లీటర్ చమురు కూడా రవాణా చేయలేరని తేల్చిచెప్పింది. తమదేశంపై దాడులు ఇలాగే కొనసాగితే హొర్మూజ్ నుంచి చమురు రవాణాను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టంచేసింది. -
హర్మూజ్ జలసంధిపై.. ట్రంప్ కీలక ప్రకటన
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ జలసంధిని అమెరికా తన ఆధీనంలోకి తీసుకుంటుందని ప్రకటించారు. ఇదే జరిగితే చమురు సంక్షోభానికి తెరపడే అవకాశం ఉంది.పశ్చిమాసియాలో పరిస్థితులు నానాటికీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ ఏ మాత్రం తగ్గకుండా అమెరికా, ఇజ్రాయెల్పై దాడులకు తెగబడుతుంది. గల్ఫ్ కంట్రీస్లోని అమెరికా స్థావరాలే లక్షంగా దాడులు చేస్తోంది. అయితే ప్రస్తుతం ఈ యుద్ధం మరింతగా ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా హర్మూజ్ జలసంధిని ఆధీనంలోకి తీసుకుంటామని ప్రకటించారు. దీంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.అయితే పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. ముడిచమురు రవాణాలో 20 శాతం వరకూ ఈ మార్గం మీదుగానే రవాణా అవుతుంది. దీనిని ఇరాన్ బ్లాక్ చేసింది. నౌకలు కదిలితే పేల్చేస్తామని హెచ్చరించింది. దీంతో భారత్తో పాటు చాలా దేశాలకు ముడిచమురు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో చమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థికసంక్షోభం తలెత్తే అవకాశం తలెత్తే అవకాశం ఉందని పలు సంస్థలు హెచ్చరించాయి.ఈ నేపథ్యంలోనే ట్రంప్ హర్మూజ్ జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.ఒకవేళ ఇదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా తలెత్తిని చమురు సంక్షోభానికి పులిస్టాప్ పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే అమెరికా స్థావరాలపై దాడులు తీవ్రతరం చేస్తున్న ఇరాన్.. హర్మూజ్ను స్వాధీనం చేసుకుంటే మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉంది. ఈ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. -
అదే జరిగితే సంక్షోభం తప్పదు యుద్ధంపై పుతిన్ వార్నింగ్
-
ఆ ధైర్యం ఇరాన్కు ఎక్కడనుంచి వచ్చింది?
ఇరాన్ యుద్ధం.. ఆ దేశం కోరుకున్నది కాదు.. అమెరికా-ఇజ్రాయెల్లు కలిసి ఇరాన్పై యుద్ధానికి కాలు దువ్వితే, దానికి ఆ దేశం అంతే ధీటుగా బదులిస్తోంది. తమ సుప్రీం లీడర్ ఆయుతుల్లా ఖమేనిని కోల్పోయి తీవ్ర వేధనను భరిస్తూనే అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు అదే స్పీడ్లో ప్రతిదాడులు చేస్తోంది ఇరాన్. ఖమేనీ హత్య తరువాత ఇరాన్ పరిస్థితి ఇక ముగిసినట్లే అనుకున్నవారికి ఆ వాదన తప్పు అని నిరూపిస్తూ ఇరాన్ వరుస దాడులతో చెలరేగిపోతోంది. ‘నిండా మునిగిన వాడికి చలేమిటి’ అన్నట్లు ఇరాన్ యుద్ధం చేసే తీరును గమిస్తేనే అర్థమవుతోంది.అటు చేతలతోనూ, ఇటు మాటలతోనూ అమెరికాకు గుబెల్ పుట్టిస్తోంది. ఇరాన్ సైనిక శక్తిని పూర్తిగా దెబ్బకొట్టామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోట రాగానే, అంతే వేగంగా స్పందించింది ఇరాన్. తమను తక్కువ అంచనా వేయొద్దని అమెరికా--ఇజ్రాయెల్పై దాడులు కొనసాగిస్తూనే ఉంటామని హెచ్చరించింది. యుద్ధాన్ని ముగించేది మీరు కాదు.. మేం అంటూ ట్రంప్కు కౌంటరిచ్చింది. తాము చేసే యుద్ధం ఒక నెల, రెండు నెలలు కాదు.. ఆరు నెలలైనా కంటిన్యూగా చేస్తామని రెండు రోజుల క్రితం చెప్పిన ఇరాన్.. ఇప్పుడు పదేళ్లు అయినా యుద్ధం చేస్తూనే ఉంటామని, ఆ రెండు దేశాలే తమ శత్రువులని, వారికి నేరుగా మద్దతిచ్చే వారు కూడా తమ శత్రువులేననే చెబుతోంది. ఈ యుద్ధంలో తాము ఒంటరిగానే పోరాటం చేస్తున్నామని, తమకు ఎవరి సహాయం అవసరం లేదని కూడా అంటోంది. ట్రంప్లో భయం మొదలైందా..?ఇరాన్ చమురు నిల్వలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సమయంలో ట్రంప్ ఒక్కసారిగా హుకుం జారీ చేశారు. ఇరాన్ చమురు నిల్వలు మన టార్గెట్ కాదని, వాటిపై దాడులు వద్దంటూ ఇజ్రాయెల్ను హెచ్చరించారు. దాంతో అమెరికా-ఇజ్రాయెల్లో భిన్న వైఖరి కనిపించింది. ఇక ‘ మీ పని అయిపోయింది’ అంటూ ఇరాన్ స్వయంగా లొంగిపోవాలంటూ బహిరంగంగా ప్రకటనలు ఇస్తున్న ట్రంప్కు ఎక్కడో భయం ఉన్నట్లే కనిపిస్తోంది. ఇరాన్ చమురు నిల్వలపై ఇజ్రాయెల్ దాడులు చేసే సమయంలో అది ప్రపంచ మార్కెట్పై ప్రభావం చూపుతుందని, వాటిని వద్దని ట్రంప్ ఖండించారు. అయితే ఇక్కడ ట్రంప్లో ఉన్నది ఒక్కటే భయం ఉండి ఉండవచ్చు. చమురు సంక్షోభం ఏర్పడితే మొత్తం ప్రపంచదేశాల ట్రంప్ ముఖాన్ని చీదిరించుకుంటారనే ఉద్దేశంతోనే ఇరాన్ చమురు నిల్వలపై దాడిని ఆపి ఉండవచ్చనేది విశ్లేషకులు అభిప్రాయం. మరొకవైపు అమెరికా నిఘా వర్గాల సమాచారం కూడా ట్రంప్లో అలజడి రేపుతున్నట్లే కనబడుతోందని అంటున్నారు. ఇరాన్ను తక్కువగా చూడొద్దు: అమెరికా నిఘా వర్గాలుమరొకటి ఏమిటంటే ఇరాన్ అణుబాంబును తయారు చేసే శక్తిని దాదాపు క్రోడీకరించుకుందనే అనుమానం కూడా ట్రంప్లో ఉంది. అమెరికా నిఘా వర్గాలు కూడా ఇదే విషయాన్ని చెప్పాయి. తాము ధ్వంసం చేశామనే ఇరాన్ అణు కేంద్రాలను ఆ దేశం తిరిగి పునరుద్ధరించే పనిలో ఉందని అమెరికా నిఘా వర్గాలే చెప్పాయి. అయితే దానిపైనే ప్రస్తుతం తమ ఫోకస్ ఉందని, వాటిని వారు ఎక్కడికి తరలిస్తారు.. ఎలా పునరుద్ధరిస్తారు అనే దానిపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నాయి. అంటే ఇరాన్ అణు ఆయుధాల అవసరమైన స్థాయిలో యురేనియంను శుద్ధిచేస్తోందనే విషయం అమెరికా చెప్పకనే చెప్పేసింది. అంటే అణు ఆయుధాలు ఇరాన్ నుంచి తయారైతే అదే తమకు ముప్పని అమెరికాకు బాగా తెలుసు. దాంతోనే అమెరికా కాస్త వెనక్కి తగ్గినట్లు కనబడుతుండగా, ఇరాన్ మాత్రం యుద్ధాన్ని ఘనంగా ముగిస్తామని అంటోంది. అది అమెరికా-ఇజ్రాయెల్కు బుద్ధిచెప్పిన తర్వాతే తమ యుద్ధం ఆగుతుందని.. అంత వరకూ యుద్ధంలో వెనకడుగేసి ప్రసక్తే లేదని అంటోంది.పుతిన్కు ట్రంప్ ఎందుకు ఫోన్ చేసినట్లు?ఇక్కడ మరొక విషయం ఏంటంటే రష్యా అధ్యక్షుడు పుతిన్కు ట్రంప్ ఫోన్ చేయడం. ఇరాన్పై దాడిని తొలుత ఖండించిన వారిలో పుతినే ఉన్నారు. మరి అటువంటి పుతిన్కు ట్రంప్ ఫోన్ చేయడం కూడా ఆసక్తికరంగా మారింది. ఇరాన్కు రష్యా, చైనాలు ఆయుధాలను సప్లై చేస్తున్నాయి ఆరోపించిన అమెరికా.. ఒక్కసారిగా రూట్ మార్చిందా అనేది కూడా అనుమానంగా ఉంది. అసలు ఇరాన్ పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవడానికి ఫోన్ చేశారా.. లేక యుద్ధాన్ని ఇక్కడితో ఆపేద్దాం అని ఇరాన్తో మధ్యవర్తిత్వం కోసం ఫోన్ చేశారా? అనే దానిపైనే చర్చ నడుస్తోంది. ఇరాన్కు రష్యా సపోర్ట్ చేస్తుందని ఆరోపించిన అమెరికా.. ఇప్పుడు ఆ ధేశ అధ్యక్షుడికే ఫోన్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏమిటి అనేది మరొక ప్రశ్న. తాడోపేడో తేల్చుకుందామని స్థితిలో ఉన్న ఇరాన్.. ఇప్పుడు ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోంది. ట్రంప్కు ఏదో రకంగా చెప్పి యుద్ధాన్ని ఆపొచ్చు.. కానీ ఇరాన్ ఎవరు చెబితే వింటుంది అనేది మాత్రం ప్రపంచ నాయకులకు సవాల్గా మారింది. ఒకవేళ అమెరికా అనుమానపడుతున్నట్లే అణ్వాయుధాలను ఇరాన్ తయారు చేసే పనిలో ఉంటే మాత్రం అది ప్రపంచానికి ముప్పుగానే చెప్పొచ్చు. -
ఏడాది కాలంలోనే సీన్ రివర్స్!
అమెరికా రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతున్న భారత సంతతి ప్రజలు (ఇండో అమెరికన్లు) డొనాల్డ్ ట్రంప్ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారా? భారత్తో సంబంధాలను నెరపడంలో ట్రంప్ కంటే అంతకుముందు అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయాలు మెరుగని భావిస్తున్నారా? అంటే అవుననే అంటోంది ప్రతిష్టాత్మక ‘కార్నెగీ ఎండోమెంట్’ సర్వే. ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టిన ఏడాది కాలంలోనే ఇండో-అమెరికన్లలో ఆయనపై వ్యతిరేకత పెరగడం చర్చనీయాంశమైంది.సర్వే ఏం చెబుతోంది?‘ఇండియన్–అమెరికన్ యాటిట్యూడ్ సర్వే’ పేరుతో ‘కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్’ చేసిన ఈ సర్వేలో ఫలితాల ప్రకారం.. దాదాపు 71 శాతం మంది భారత సంతతి ప్రజలు ట్రంప్ పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత్తో సంబంధాల విషయంలోనూ 55 శాతం మంది ఆయన తీరును తప్పుబడుతున్నారు. కేవలం 20 శాతం మంది మాత్రమే ట్రంప్ విదేశాంగ విధానాన్ని సమర్థిస్తుండటం గమనార్హం.బైడెన్ ఎందుకు మెరుగనిపిస్తున్నారు?జో బైడెన్ తన పదవీ కాలంలో భారత్తో సంబంధాలను కేవలం వ్యాపార కోణంలో కాకుండా వ్యూహాత్మక భాగస్వామ్యంగా చూశారని మెజారిటీ ఇండో-అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు. క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ (ఐ-సీఈటీ) ద్వారా రక్షణ, అంతరిక్ష రంగాల్లో భారత్కు బైడెన్ అండగా నిలిచారు. బైడెన్ హయాంలో వీసా విధానాలు (హెచ్1బీ), కమలాహారిస్ వంటి వారిని కీలక పదవుల్లో కూర్చోబెట్టడం ద్వారా భారత సంతతికి ఆయన ప్రాధాన్యత ఇచ్చారు.ట్రంప్ 2.0.. పెరిగిన ఆందోళనలుట్రంప్ మొదటి హయాంతో పోలిస్తే ప్రస్తుతం ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇండో-అమెరికన్లలో అసహనాన్ని పెంచుతున్నాయి.భారతీయ ఉత్పత్తులపై 50 శాతం వరకు సుంకాలు విధించడం, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుపై భారత్ను హెచ్చరించడం వంటి అంశాలు కేవలం ఇచ్చిపుచ్చుకోవడమనే ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి.‘అమెరికా ఫస్ట్’ నినాదంతో ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేయడం భారతీయ టెక్కీలను ఆందోళనకు గురిచేస్తోంది.ట్రంప్ హయాంలో ఆన్లైన్ విద్వేషం, వర్ణ వివక్ష పెరిగిందని సగం మందికి పైగా భారత సంతతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: డబుల్ ర్యాలీ.. పసిడి, వెండి ధరల్లో మార్పులు -
గల్ఫ్ ఫ్యూచర్ డిసైడ్ చేసేది మీరు కాదు.. మేమే: ఇరాన్
యుద్ధానికి సంబంధించి ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. ఇరాన్ ప్రధానమైన నేవీ, ఆర్మీ, ఎయిర్ఫోర్స్లతో పాటు కీలకమైన స్థావరాలను నాశనం చేశామని, యుద్ధం ముగింపు ఒక్కటే మిగిలి ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు ప్రకటనలపై ప్రకటనలు చేస్తుంటే.. ఇరాన్ మాత్రం అందుకు ధీటుగా బదులిస్తోంది. తమకు ఏమీ కాలేదని, ఇక నుంచి తమ నుంచి ఎదుర్కోబోయే పరిణామాలను ప్రపంచం చూడబోతుందనే అర్ధం వచ్చేలా ఇరాన్ కౌంటర్ల మీద కౌంటర్ల ఇస్తోంది. తమను తక్కువగా అంచనా వేయొద్దని ట్రంప్కు నేరుగా వార్నింగ్ కూడా ఇచ్చింది. తమతో యుద్ధాన్ని ముగించేది మీరు కాదని, ఆ యుద్ధానికి ముగింపు తామిస్తామంటూ స్పష్టం చేసింది. ‘ యుద్ధం ముగించేది మీరు కాదు. మేం. గల్ఫ్ ఫ్యూచర్ డిసైడ్ చేసేది కూడా మేమే. మీపై(అమెరికా-ఇజ్రాయెల్) దాడులు చేస్తూనే ఉంటాం’ అని ఇరాన్ హెచ్చరించింది. కాగా, ఇరాన్తో జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్తో జరుగుతున్న యుద్ధానికి త్వరలోనే ముగింపు దొరుకుతుందన్నారు. ఇరాన్పై తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిండానికి చాలా చేరువలో ఉన్నామన్నారు. మరోవైపు అంతర్జాతీయంగా చమురు సరఫరాకు సంబంధించి ఇరాన్ను హెచ్చరించారు. అంతర్జాతీయంగా చమురు సరఫరాలో అంతరాయం కలిగిస్తే ఇరాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు. పుతిన్ ఆందోళనఅమెరికా, ఇజ్రాయెల్లు సంయుక్తంగా ఇరాన్పై చేస్తున్న యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ యుద్ధంతో ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం ఉంటుందన్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం 30 రోజుల్లో హర్మూజ్ జలసంధి పూర్తిగా మూతబడిపోతుందని, అదే గనుక జరిగితే ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభం తప్పదని వార్నింగ్ ఇచ్చారు. -
అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఫైట్ అసలు కారణం ఇదే..
-
చిక్కుల్లో ట్రంప్.. ఇరాన్ స్కూల్పై దాడి ఇజ్రాయెల్ పనే..
-
ఇరాన్ వార్ యూటర్న్.. గల్ఫ్లో నీటి యుద్ధం మొదలైందా?
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. మూడో ప్రపంచ యుద్ధమే కనుక జరిగితే అది నీటి కోసమే అని పలువురు నిపుణులు చాలాకాలంగా చెబుతున్న క్రమంలో అది వాస్తవమే అనే విధంగా ఇరాన్ యుద్ధం టర్న్ తీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్ యుద్ధంలో భాగంగా నీటిశుద్ధి ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు చూస్తుంటే తాగునీరు యుద్ధానికి లక్ష్యంగా మారుతుందనే విషయం స్పష్టమైంది. రెండు వైపుల వారు ఆయా దేశాల్లోని నీటి వనరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.గల్ఫ్ దేశాల బలం చమురు అయితే.. బలహీనత నీరు. ఇరాన్-అమెరికా యుద్ధం గల్ఫ్ దేశ దుర్భలత్వాన్ని బయటపెట్టింది. ఎడారి వాతావరణం ఉన్న గల్ఫ్ దేశాల్లో నీటికొరత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్ యుద్ధంలో భాగంగా నీటిశుద్ధి ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. తమ నీటి శుద్ధి ప్లాంట్పై దాడి చేశారని ఇరాన్ ఆరోపించగా, తమ ప్లాంట్పై ఇరాన్ దాడి చేసిందని బహ్రెయిన్ తెలిపింది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన తర్వాత గ్లోబల్ మార్కెట్లు ఆత్రుతగా పర్షియన్ గల్ఫ్ ఇంధన మౌలిక సౌకర్యాలను పరిశీలించడం ప్రారంభించాయి. అయితే యుద్ధం తీవ్రమవుతున్న కొద్దీ రెండు ప్రాంతాల్లో దుర్బలమైన తాగు నీటి అంశం అతిపెద్ద సమస్యగా ఉద్భవించింది. దీంతో రెండు వైపుల వారు ఆయా దేశాల్లోని నీటి వనరులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా నీటి శుద్ది ప్లాంట్లపై దాడులు ప్రారంభించారు. ఆయా దేశ పౌరులను తీవ్ర ఇక్కట్లలోకి నెట్టాలన్నది వారి వ్యూహంగా తెలుస్తోంది.పశ్చిమాసియాలోనే అధికం..గల్ఫ్ దేశాల్లో తాగునీటి కొరత అత్యంత తీవ్రంగా ఉంది. పశ్చిమాసియాలో మంచినీటి కొరత కారణంగా ఉప్పు శాతం ఎక్కువగా ఉన్న నీటిని శుద్ధి చేసి మంచినీటిగా మార్చేందుకు నీటి శుద్ధి ప్లాంట్లను (డీసాలినేషన్ ప్లాంట్స్.. ఉప్పునీటిని తాగునీటిగా మార్చే యంత్రాలు) ఆయా దేశాలు విస్తృతంగా ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో ప్రపంచంలోని 60 శాతం నీటి శుద్ధి యూనిట్లు ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్ తదితర అరబ్ దేశాల వారు అత్యధికంగా వీటిపైనే ఆధారపడటంతో శత్రు దేశానికి ఇప్పుడు అవే అత్యంత విలువైన లక్ష్యాలుగా మారాయి. అలాగే ఇరాన్లోని ప్లాంట్లను అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నాయి. కాగా, ఒక పెద్ద ప్లాంట్ దెబ్బతింటే కొన్ని రోజుల్లోనే రాజధానులు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుందని అమెరికాకు చెందిన కొన్ని రహస్య నివేదికలు హెచ్చరించాయి.గల్ఫ్ దేశాలు ఆధారపడే స్థితి ఇలా.. కువైట్: 90% నీరు డీసాలినేషన్ ద్వారా మంచి నీరుయుఏఈ: 90% నీరు డీసాలినేషన్ ద్వారా తాగునీరు ఒమాన్: 86% నీరు డీసాలినేషన్ ద్వారా మంచి నీరు దొరుకుతుంది.బహ్రెయిన్: 80 శాతం.. అత్యధికంగా డీసాలినేషన్ మీద ఆధారపడుతోంది. సౌదీ అరేబియా: 70% నీరు డీసాలినేషన్ ద్వారా తాగు నీరు ఖతార్: 70 శాతం చిన్న దేశం కావడంతో నిల్వలు తక్కువ, ప్లాంట్లపై అధికంగా ఆధారపడే పరిస్థితి.నీటిపై యుద్ధ ప్రభావం.. యుద్ధం నేపథ్యంలో ప్లాంట్లకు ప్రమాదం జరిగి నీటి సరఫరా ఆగిపోతే, ఆహార సంక్షోభం మరింత పెరుగుతుంది. గల్ఫ్ దేశాలు 80–90% ఆహారాన్ని దిగుమతి చేసుకుంటాయి. నీరు లేకపోతే ఆహారం కూడా నిల్వ చేయలేరు. ఆరోగ్య బీమా కంపెనీలు యుద్ధ ప్రమాద కవరేజీ తొలగించడంతో సరుకు రవాణా కూడా ఆగిపోతోంది.ఇరాన్కు నష్టం తక్కువే.. ఇరాన్ తాగునీటి కోసం ప్రధానంగా డ్యామ్లు, భూగర్భ జలాలు మీద ఆధారపడుతుంది. అందువల్ల తీరప్రాంత డీసాలినేషన్ ప్లాంట్లపై దాడులు జరిగినా, ఇరాన్కు పెద్ద నష్టం ఉండదు. కానీ గల్ఫ్ దేశాలకు ఇది ప్రాణాంతక సమస్యగా ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలు నీటి భద్రతను జాతీయ భద్రత స్థాయిలో చూడాల్సిన సమయం వచ్చింది. -
ట్రంప్నకు హైబీపీ తెప్పించిన ఇరాన్!
ఇరాన్ అధికారికంగా మోజ్తాబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్గా ప్రకటించింది. ఆయన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. తీవ్ర తర్జన భర్జనల తర్వాత (మార్చి 8–9, 2026) ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆయన వారసుడిగా మోజ్తాబానే ఎన్నుకుంది.ఇరాన్ చరిత్రలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఆ దేశ అత్యున్నత మతపరమైన మండలి తమ కొత్త నాయకుడిగా ఖమేనీ తనయుడు సయ్యద్ మోజ్తాబాను (అలీ ఖమేనీ రెండవ కుమారుడు)ని ఎన్నుకుంది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత మొదటిసారి సుప్రీం లీడర్ పదవి తండ్రి నుండి కుమారుడికి వారసత్వంగా వెళ్లడం ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోదగ్గ విషయం.అయితే ఇరాన్లో సాధారణంగా సుప్రీం లీడర్ను మతపరమైన మండలి ఎన్నుకుంటుంది. కానీ ఈసారి తండ్రి నుండి కుమారుడికి పదవి రావడం హెరిడిటరీ సక్సెషన్ (వంశపారంపర్య వారసత్వం)పై విమర్శలు వెల్లువెత్తవచ్చని అంతా భావించారు. దీనికి తోడు.. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. మోజ్తాబా ఎంపిక అంశంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇరాన్లో వారసత్వ ఎంపిక ఏ రకంగానూ చెల్లదని, మోజ్తాబా ఒక మూర్ఖుడు అని, ఆ పదవికి అనర్హుడని, ఇరాన్ కొత్త నాయకుడిని ఆ దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జరపాలని, ఆ ఎంపికలో తమ దేశ ప్రమేయం(తనకు అనుకూలంగా ఉండాలనే..) ఉంటుందని ప్రకటించారు. వాషింగ్టన్ ఆమోదం లేకుండా ఇరాన్ గద్దెపై ఎవరు కూర్చున్నా, వారు ఎక్కువ కాలం నిలబడలేరని ఆయన హెచ్చరించారు.🚨 BREAKING: The Islamic regime of Iran just named Ali Khamenei's SON as the NEW SUPREME LEADER — Mojtaba KhameneiPresident Trump has already said he is an "UNACCEPTABLE" successor to Ali Khamenei"Everybody that seems to want to be a leader, they end up DEAD!"How long will… pic.twitter.com/2MiCYtXrxT— Eric Daugherty (@EricLDaugh) March 8, 2026కాగా, ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ చాలా తేలికగా తీసుకుంది. ప్రాంతీయ యుద్ధ పరిస్థితుల్లో.. మోజ్తాబా ఎంపికే సరైందని భావించింది. అయితే ఆ ప్రకటన తర్వాత ఇరాన్ అంతటా అనూహ్య పరిస్థితులు కనిపించాయి. వ్యతిరేకతకు బదులు.. ఇరాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆనందం వ్యక్తం చేశారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), సైనిక ప్రధాన సిబ్బంది మోజ్తాబాకు మద్దతు ప్రకటించారు. ఇది అగ్రరాజ్యం, ఇజ్రాయెల్ ఏమాత్రం ఊహించిన ఉండకపోవచ్చు!.56 ఏళ్ల వయసున్న మోజ్తాబా ఖమేనీ గతంలో ఎన్నికైన పదవులు చేపట్టకపోయినా, తన తండ్రి కార్యాలయం ద్వారా సైనిక, భద్రతా వ్యవస్థలపై ప్రభావం చూపుతూ వచ్చారు. అలాగే హెజ్బొల్లా లాంటి అమెరికా-ఇజ్రాయెల్ వ్యతిరేక గుంపులతోనూ ఆయన సంబంధాలు కలిగి ఉన్నారు. అయితే మోజ్తాబా, డొనాల్డ్ ట్రంప్ మధ్య సంబంధం తీవ్ర ప్రతిస్పందనలతో నిండింది. మోజ్తాబాపై పలు రాజకీయ(ఎన్నికల్లో అవకతవకలు, అవినీతి సంబంధిత) విమర్శలు ఉన్నా.. కరడుగట్టిన ట్రంప్ వ్యతిరేకి అనే ముద్ర కూడా ఉంది. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో మోజ్తాబా నియామకమే సరైందని భావించి.. అమెరికాకు ప్రత్యక్ష సవాలు విసిరింది ఇరాన్.మొత్తంగా.. మోజ్తాబా నియామకంతో ఇరాన్ మతపరమైన నాయకత్వం “సమరాన్ని ఎంచుకుంది, రాజీని కాదు” అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ట్రంప్ మోజ్తాబాను “అంగీకరించలేని నాయకుడు” అని చెబుతున్నారు. కాబట్టి తాజా నిర్ణయం ఆయనకు మరింత మంట పుట్టించి తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేయించే అవకాశం లేకపోలేదు. అదే సమయంలో ఉద్రిక్తతలకు ధీటుగానే స్పందించాలనే ధోరణిని మోజ్తాబా కొనసాగించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్లో జరిగిన నాయకత్వ మార్పు .. మధ్య ప్రాచ్యంలో(మిడిల్ఈస్ట్లో) ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది. -
ట్రంప్కు బానిసలా మోదీ.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు
కలబురిగి (కర్నాటక): పశ్చిమాసియా సంక్షోభం, అమెరికాతో వాణిజ్య ఒప్పందం, టారిఫ్ అంశాల్లో కేంద్రంలోని బీజేపీ వైఖరిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఒక నియంతగాను, ప్రధాని మోదీని ఆయనకు బానిసగాను అభివర్ణించారు. ట్రంప్ ఎప్స్టీన్ ఫైళ్లను అడ్డుపెట్టుకుని మోదీని ఆడిస్తున్నారన్నారు.కర్నాటకలోని కలబురిగి జిల్లా చిత్తాపూర్లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఖర్గే మాట్లాడారు. ‘ఇరాన్ సుప్రీం నేతను అమెరికా చంపేసింది. ఏకంగా దేశ నేతనే చంపేస్తే ఆ దేశం, ఇక ప్రపంచం సురక్షితంగా ఉంటుందా? ఇరాన్ నేత ఖమేనీ లేదా వెనెజువెలా నేత మదురో..ఇలా ఎవరైనా కావచ్చు. దేశాల నేతలను ఇలా బెదిరింపులకు గురిచేస్తే ప్రపంచంలో శాంతి అనేదే ఉండదు. అమెరికా తన అహంకారంతో అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కుతోంది’ అని ఖర్గే మండిపడ్డారు. భారత్ను టారిఫ్ల పేరుతో బెదిరింపులకు గురి చేస్తూ అమెరికా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయించిందన్నారు. మోదీ, ట్రంప్లు మన దేశాన్ని నాశనం చేస్తూ, అమెరికాకు దాసోహమనేలా చేస్తున్నారని ఆరోపించారు. -
టీనేజర్పై ట్రంప్ లైంగిక వేధింపులు!
వాషింగ్టన్: అమాయక టీనేజర్లు, యువతులను సంపన్నులు, రాజకుటుంబీకులు, ఉన్నతాధికారుల లైంగిక అవసరాల కోసం ఎరవేసిన అంతర్జాతీయ లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ ఉదంతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం నేరాలకు పాల్పడ్డాడని బాధిత యువతి సంచలన విషయం బయటపెట్టింది. అమెరికా న్యాయశాఖ ఇటీవల విడుదల చేసిన తాజా పత్రాల్లో ఈ విషయం వెల్లడైంది. టీనేజర్గా ఉన్నకాలంలో తనను ట్రంప్కు ఎప్స్టీన్ పరిచయం చేశాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ యువతి ఒక ఇంటర్వ్యూల్లో ఆరోపించింది.2019 ఏడాదిలో జరిగిన పలు ఇంటర్వ్యూల తాలూకు మూడు భాగాలను ఎఫ్బీఐ తన నివేదికలో పొందుపరిచింది. 2019 ఆగస్ట్ ఏడో తేదీ నాటి ఇంటర్వ్యూలో ‘‘13–15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నన్ను ట్రంప్కు ఎప్స్టీన్ పరిచయం చేశాడు. సరిగా గుర్తులేదుగానీ అప్పుడు న్యూయార్క్ లేదా న్యూజెర్సీ నగరంలో వాళ్లను కలిశా. ఎప్స్టీన్, ట్రంప్ ఇద్దరూ నాపై లైంగిక దాడికి ప్రయత్నించారు. లైంగిక దాడి వేళ తప్పించుకునేందుకు ట్రంప్ను కొరికేశా. దాంతో కోపంతో ట్రంప్ నన్ను కొట్టాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని నాకు, నా ఆప్తులకు బెదిరింపులు ఫోన్కాల్ వచ్చాయి’ అని ఆమె చెప్పారు. ఇవి తప్పుడు ఆరోపణలని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కొట్టిపారేశారు. -
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం.. ఏం జరగబోతుంది?
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి తెర తీసి దాదాపు తొమ్మిది రోజులు పూర్తయ్యాయి. ఈ యుద్ధం కనీసం మరో రెండు వారాలు, అంతకుమించి కొనసాగేలా కనిపిస్తోంది. తీవ్రస్థాయి దాడులు, ప్రతి దాడులతో ఇరాన్, ఇజ్రాయెల్ దద్దరిల్లిపోతున్నాయి. దాడులను మరింత విస్తరిస్తామని.. చాలా బలంగా దెబ్బతీస్తామంటూ ఇరాన్కు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇరాన్ ప్రజలు లొంగిపోవాలనే శత్రువుల కోరిక వారి సమాధుల్లోనే కలిసిపోతుందంటూ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఘాటుగానే స్పందించారు.కాగా, రెండు, మూడు రోజులుగా ఇరాన్ దాడుల తీవ్రత తగ్గినట్టు అమెరికా చెబుతోంది. క్షిపణి దాడులు 90 శాతం, డ్రోన్ దాడులు 83 శాతం తగ్గుముఖం పట్టాయంటోంది. నానాటికీ నిండుకుంటున్న ఆయుధ నిల్వలే ఇందుకు కారణం కావచ్చు. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను 80 శాతానికి పైగా నాశనం చేసి దాని గగనతలంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించినట్టు ఇజ్రాయెల్ చెబుతోంది. అమెరికా వద్ద కూడా క్షిపణి నిల్వలు మరో వారం రోజులకు మించి లేవని పెంటగాన్ నివేదిక పేర్కొంది. కానీ తొలి రోజే నాయకున్ని కోల్పోయినా ఇరాన్ మాత్రం మొండిగా పోరాడుతూనే ఉంది. యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలకు నానా సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం దాకా జరిగే హార్మూజ్ జలసంధి మూతబడింది. దాంతో సరఫరా తగ్గి చమురు ధరలు ఇప్పటికే 10 శాతానికి పైగా పెరిగిపోయాయి. ఈ ప్రభావం భారత్పైనా అధికంగానే పడుతోంది. తాత్కాలిక ప్రత్యామ్నాయంగా మళ్లీ రష్యా చమురు వైపు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.హార్మూజ్ గుండా భారత్కు వచ్చే పామాయిల్, పప్పులు, ఔషధాల దిగుమతులు ఆగిపోవడంతో వాటి ధరలు పెరిగేలా కనిపిస్తున్నాయి. అలాగే పశ్చిమాసియా దేశాలకు మన బాస్మతి బియ్యం ఎగుమతులపైనా ప్రభావం పడుతోంది. పశ్చిమాసియా నుంచి సహజ వాయువు సరఫరాలు కూడా పడకేశాయి. దాంతో వాటిపై అధికంగా ఆధారపడే యూరప్, ఆసియా దేశాలు కూడా అల్లాడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రవాణా కూడా తీవ్రంగా ప్రభావితమైంది. పశ్చిమాసియాలో ఈ వారం రోజుల్లో ఏకంగా 11 వేల విమానాలు రద్దయ్యాయి! ఆ దేశాల్లో లక్షలాదిగా ప్రయాణికులు చిక్కుబడిపోయారు. -
అందుకే భారత్కు మినహాయింపు ఇచ్చా: ట్రంప్
వాషింగ్టన్: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ప్రపంచ ఇంధన మార్కెట్లపై ఒత్తిడిని తగ్గించడానికే రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు భారత్కు తాత్కాలిక అనుమతి ఇచ్చామని అన్నారు. పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరా మార్గాలు దెబ్బతింటున్నాయని తెలిపారు.ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. “కొంత ఒత్తిడిని తగ్గించడానికి నేను ప్రయత్నిస్తాను. మా దేశంలో భారీగా చమురు ఉంది. బయటి దేశాల్లో కూడా చాలా చమురు ఉంది. చమురు సరఫరా సమస్య చాలా త్వరగా సర్దుకుంటుంది” అని ట్రంప్ తెలిపారు.కాగా, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు అంశంపై అమెరికా-భారత్ మధ్య విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. యుక్రెయిన్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ చేయిస్తున్న యుద్ధానికి భారత్ చమురు కొనుగోలు ద్వారా మద్దతు ఇస్తోందని అమెరికా ఆరోపించింది. శాంతి కోసం ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు కూడా దీని ద్వారా దెబ్బతింటున్నాయని విమర్శించింది.ఇదీ చదవండి: నీటిలో అంతిమ సంస్కారాలు.. స్కాట్లాండ్ అనుమతి మరోవైపు, అమెరికాలోని ప్రజలు, వ్యాపారాలు, కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరాలు, మోసాలు, దోపిడీదారులపై విస్తృతంగా చర్యలు తీసుకోవాలని ఫెడరల్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కార్యనిర్వాహక ఆర్డర్లపై డొనాల్డ్ ట్రంప్ ఆదివారం సంతకం చేశారు.ఆ ఆదేశం ప్రకారం అమెరికా విదేశాంగ కార్యదర్శి విదేశీ ప్రభుత్వాలతో చర్చలు జరిపి, వారి భూభాగాల్లో పనిచేస్తున్న అంతర్జాతీయ నేరస్థులపై చర్యలు తీసుకోవాలని కోరాల్సి ఉంటుంది. -
ట్రంప్ నిన్ను వదలం.. ఖమేనీ సన్నిహితుడి వార్నింగ్
ఇరాన్ సుప్రీం ఆయతుల్లా ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన హత్యతో పశ్చిమాసియా భగ్గుమంది. ఇరాన్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే ఖమేనీ హత్యపై ఇరాన్ దేశ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ తీవ్రంగా స్పందించారు. తమ దేశ సుప్రీం హత్యకు ట్రంప్ మూల్యం చెల్లించాల్సిందేనని హెచ్చరించారు.ఫిబ్రవరి 28 ఇరాన్ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజు ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ.. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడిలో మృతి చెందారు. దీంతో ఇరాన్ శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రతీకారేచ్చతో రగిలిపోయి ఏక కాలంలో గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయెల్పై దాడులకు తెగబడుతుంది. తాజాగా ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ లారిజానీ ఈ అంశంపై స్పందించారు. ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు."మేము మా నాయకుడి రక్తానికి మా ప్రజల మృతికి నిరంతరం ప్రతీకారం తీర్చుకుంటాం. ట్రంప్ దీనికి మూల్యం చెల్లించాలి. చెల్లిస్తాడు కూడా మేము ఆయనను ఒంటరిగా వదిలిపెట్టం, అతను మా నాయకున్ని చంపడంతో పాటు 1000 మందికి పైగా ప్రాణాలను బలిగొన్నాడు. ఇది మాములు విషయం కాదు " అని అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇస్లామిక్ రిపబ్లిక్ను విడగొట్టే కుట్రలు పన్నుతున్నాయని తెలిపారు.వెనెజువెలా మాదిరి ఇరాన్లో కూడా ప్రభుత్వాన్ని కూలదోయాలనుకున్నారు. కానీ వారు అనుకున్న విధంగా జరగలేదు. ఇరాన్లోని పరిస్థితిని అంచనా వేయడంలో వారు పూర్తిగా విఫలమయ్యారని లారిజానీ అన్నారు. గల్ఫ్ దేశాలు వారి దేశంలో నుంచి తమపై దాడి చేయకుండా నియంత్రించాలని లేని పక్షంలో ప్రతి దాడి చేయడం తప్పదన్నారు.లారిజానీ ఖమేనీకి సన్నిహితుడు ఇతను గతంలో IRGCలో పనిచేశారు. ఇతని సోదరుడు సాదిక్ లారిజానీ ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ పోటీదారులలో ఒకరు. -
" ప్రెసిడెంట్ మీ పని మీరు చూసుకొండి "
అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. రెండు సౌర్వభౌమాధికారం ఉన్న దేశాలు అభిప్రాయాలను పరస్పరం గౌరవించుకోవడమే ప్రపంచ శాంతికి పునాది రాయన్నారు. అవతలి వారి విషయాల్లో తలదూర్చకుండా ట్రంప్ తన పని తాను చూసుకోవాలని హెచ్చరించారు.ఇండియా విషయంలో ట్రంప్ వ్యవహార శైలి తొలి నుంచి వివాదాస్పదంగానే ఉంది. ఇది వరకే భారత అంతరంగిక విషయాలు పలు మార్లు అమెరికా అధ్యక్షుడు బహిరంగ విమర్శలు చేశారు. వీటిని భారత్ పలుమార్లు ఖండించింది. అయినప్పటికీ ట్రంప్ తీరు మార్చుకోలేదు. తాజాగా రష్యా నుంచి భారత్ నెల రోజుల పాటు చమురు కోనుగోలు చేసుకోవచ్చని దానికి అనుమతిచ్చామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. తాజాగా ఈ అంశంపై రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ స్పందించారు. ఈ అంశంపై ఎక్స్ వేదికగా ట్రంప్కు లేఖ రాశారు. " ప్రియమైన ప్రెసిడెంట్ భారత ప్రజలు సౌర్వభౌమ దేశానికి చెందిన వారు. మాకు వేరే దేశాల అనుమతులు అవసరం లేదు. దయచేసి మీ సామర్థ్యం మేరకు మీ పని చూసుకొండి" అన్నారు. సౌర్వభౌమ దేశాల అభిప్రాయాలకు పరస్పర గౌరవమివ్వడమే శాంతికి మూలమని మీ దేశ ప్రజలకు శాంతి, సౌభాగ్యం లభించాలని కోరుకుంటున్నానని లేఖలో పేర్కొన్నారు.అంతకు మందు స్కాట్ బెసెంట్ " ఇండియన్స్ మంచి యాక్టర్స్, వారికి మేము రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపాలని కోరాం. వారు అలానే చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్యా ఆజ్ఞలకు తాత్కాలిక విరమింపు ఇచ్చాం. వారికి చమురు కొనుగోలుకు అనుమతి ఇచ్చాం" అని అన్నారు. దీంతో బీసెంట్ వ్యాఖ్యలపై భారత్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.ToThe President of the United States of America @POTUSDear Mr. President, We, the people of India, belong to a free and sovereign nation. We no longer take orders from distant foreign shores.Please mind your own business to the best of your abilities.Mutual respect…— Kamal Haasan (@ikamalhaasan) March 7, 2026 -
పూటకో మాట!
ఒకటే నోరు. కానీ పూటకో మాట. రోజుకోవైఖరి. ఇరాన్ యుద్ధంపై అమెరికా, ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి విస్మయం గొలుపుతోంది. సహేతుకమైన కారణమేదీ లేకుండానే ఏకపక్షంగా తెర తీసిన ఈ యుద్ధాన్ని ఎలా సమర్థించుకోవాలో తెలియక అగ్ర రాజ్యం కిందా మీదా పడుతోంది. ఫిబ్రవరి 28న శనివారం ఇజ్రాయెల్తో కలిసి ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరిట ఇరాన్పై అమెరికా భారీ స్థాయి యుద్ధానికి దిగడం తెలిసిందే. ఆ క్రమంలో యుద్ధ కారణాలకు సంబంధించి ట్రంప్ మొదలుకుని ఆయన యంత్రాంగంలోని ఇతర నేతల దాకా పదేపదే మాట మారుస్తూ నవ్వులపాలు అవుతున్నారు.ఇప్పటికీ కనీసం ఒక్కటంటే ఒక్క ఆమోదయోగ్యమైన కారణం కూడా చూపలేకపోయారు. ఫలితంగా ట్రంప్ సర్కారు సొంత ప్రజల దృష్టిలోనే పలుచన కావడంతో పాటు స్వదేశంలో శరవేగంగా ఆదరణ కోల్పోతోంది. ఇరాన్లో నాయకత్వ మార్పే లక్ష్యమని ట్రంప్ తొలుత చెప్పారు. తర్వాత అణు ముప్పును బూచిగా చూపారు. కొన్ని కారణాలైతే పరస్పర విరుద్ధంగా కూడా ఉండటం విశేషం! ఇలా యుద్ధం మొదలైన ఈ 8 రోజుల్లోనే ట్రంప్, ఆయన యంత్రాంగం పదేపదే మాట ఎలా మారుస్తూ వచ్చిందంటే...ఇరాన్ విముక్తి కోసమే!ఇరాన్ మత పాలకుల దశాబ్దాల దమననీతికి బదులిచ్చేందుకు, వారి బారినుంచి ఆ దేశాన్ని విముక్తం చేసేందుకే యుద్ధం మొదలు పెట్టినట్టు ఫిబ్రవరి 28న శనివారం ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ పెట్టారు. ‘‘ఇరాన్ నుంచి ప్రపంచానికి అణు ముప్పు పొంచి ఉంది. దానికి చరమగీతం పాడబోతున్నాం. అలాగే ఇరాన్ క్షిపణి వ్యవస్థను కూడా పూర్తిగా నేలమట్టం చేయబోతున్నాం’’ అని 8 నిమిషాల వీడియోలో చెప్పుకొచ్చారు. అంతేగాక, ‘‘ఈ సువర్ణావకాశాన్ని ఇరాన్వాసులు అందిపుచ్చుకోవాలి. దేశాన్ని వారి చేతుల్లోకి తీసుకునే సాహసం ప్రదర్శించాలి’’ అంటూ పిలుపునిచ్చారు! అనంతరం తొలి బాంబులు ఇరాన్ను తాకిన కాసేపటికి ఆక్సియోస్ న్యూస్ వెబ్సైట్తో ట్రంప్ మాట్లాడారు. ‘‘యుద్ధాన్ని దీర్ఘకాలం పాటు కొనసాగిస్తా. లేదంటే రెండు మూడు రోజుల్లోనే ముగించేస్తా. మా దాడి నుంచి కోలుకునేందుకు ఇరాన్కు ఎలాగూ ఏళ్లు పడుతుంది’’ అని చెప్పుకొచ్చారు.స్వీయ రక్షణకే!ఫిబ్రవరి 28న యుద్ధం మొద లైన కాసేపటికే ఐక్యరాజ్య సమితిలో యూఎన్ మిషన్ మరో వైఖరి తీసుకుంది. స్వీయరక్షణ కోసమే ఇరాన్పై దాడికి దిగాల్సి వచ్చిందంటూ భిన్న స్వరం వినిపించింది! ‘‘ఇరాన్ క్షిపణి పాటవం, అణ్వాయుధ ఆకాంక్షలు గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలకు పెను ముప్పుగా మారాయి. అందుకే దానిపై దాడులు తప్పలేదు’’ అని చెప్పుకొచ్చింది. శాంతియుత పరిష్కారం కోసం ఎంతగా సంప్రదింపులు జరిపినా లాభం లేకపోయిందంటూ ఐరాసలో అమెరికా రాయబారి వైక్ వాల్జ్ మొసలి కన్నీరు కార్చారు. ‘‘కనుక ఇజ్రాయెల్తో కలిసి దాడులకు దిగక తప్పలేదు. యూఎన్ చార్టర్లోని ఆర్టికల్ 51 ప్రకారం మా చర్య పూర్తిగా చట్టబద్ధమే’’ అంటూ వాదించారు. తమ చర్యను స్వాగతిస్తూ ఇరాన్ ప్రజలంతా వీధుల్లోకి వచ్చి మరీ పండుగ చేసుకుంటున్నారని అదేమీ లేదు!ఐరాసలో అమెరికా వినిపించిన స్వరాన్ని పెంటగాన్ వర్గాలు ఆ మర్నాడే ఖండించడం విశేషం! యుద్ధం మొదలైన మర్నాడు మార్చి 1న తాజా పరిస్థితిని అవి కాంగ్రెస్కు నివేదించాయి. ఆ క్రమంలో, ‘‘గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై గానీ, సిబ్బందిపై గానీ తొలుత దాడులకు దిగే ఉద్దేశం ఇరాన్కు ఏమాత్రమూ లేదు. దానిపై ఇజ్రాయెల్ తొలుత దాడి చేస్తే తప్ప ఇరాన్ నాయకత్వం అలాంటి ఆలోచన కూడా చేయబోదు’’ అని స్పష్టం చేశాయి!రూబియోను ఖండించిన ట్రంప్!రూబియో వ్యాఖ్యలను ఆ మర్నాడే ట్రంప్ ఖండించారు. ఇరాన్పై సైనిక చర్యకు దిగాలన్న నిర్ణయం పూర్తిగా తనదేనని మార్చి 3న స్పష్టం చేశారు. ‘‘ఇజ్రాయెల్ మమ్మల్ని ఒత్తిడి చేయడమేమిటి? అయితే గియితే మేమే ఇజ్రాయెల్ను ఒత్తిడి చేశామని చెప్పాలి’’ అని కూడా అన్నారు. ఇరాన్ దురుద్దేశాలే సైనిక చర్యకు కారణం తప్ప ఇజ్రాయెల్ కాదన్నారు. దాంతో రూబియో కంగుతిన్నారు. ముందు రోజు తాను చేసిన వ్యాఖ్యలను మీడియానే సందర్భరహితంగా చూపించి దురుద్దేశాలు ఆపాదించిందంటూ నాలిక మడతేశారు.– సాక్షి, నేషనల్ డెస్క్రూబియో భిన్న స్వరంపెంటగాన్ వర్గాల వ్యాఖ్యలు చేసిన మర్నాడే, అంటే మార్చి 2న అందుకు పూర్తి భిన్నంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడారు. ‘‘ఇరాన్ ఏ క్షణంలోనైనా గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై దాడి చేయొచ్చు. ఇరాన్ సైనిక ఫీల్డ్ కమాండర్లకు ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్పై దాడి యోచనలో ఉన్నట్టు నాకు కచ్చితమైన సమాచారముంది. అప్పుడు మన స్థావరాలకూ ముప్పు తప్పదు. కనుక మనమే ముందస్తు దాడులకు దిగడం తప్ప మరో మార్గం లేదు. లేదంటే భారీగా నష్టపోతాం’’ అని క్యాపిటల్ హిల్ భవనంలో జరిగిన ఉన్నత స్థాయి రహస్య భేటీలో చెప్పుకొచ్చారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ మాత్రం తమ మిత్రదేశమైన ఇజ్రాయెల్ ఇరాన్పై దాడికి దిగుతుండటంతో తమకూ మరో మార్గం లేకపోయిందనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు!ట్రంప్ను చంపాలనుకున్నారు!మార్చి 4న పెంటగాన్ బ్రీఫింగ్లో అమెరికా రక్షణ మంత్రి ఇరాన్పై యుద్ధానికి సరికొత్త కారణాన్ని తెరపైకి తెచ్చారు. ‘‘ట్రంప్ను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర పన్నింది. ఇరాన్ ఐఆర్జీసీ సైనిక యూనిట్ కమాండర్కు ఈ మేరకు బాధ్యతలు కూడా అప్పగించింది. కానీ (ఖమేనీ హత్య ద్వారా) వారిపై ట్రంపే పై చేయి సాధించారు’’ అని చెప్పుకొచ్చారు! -
గల్ఫ్ దేశాలకు ఇరాన్ క్షమాపణలపై ట్రంప్ రియాక్షన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణలపై ట్రంప్ స్పందించారు. మధ్యప్రాచ్యాన్ని ఇరాన్ ఇక బెదిరించలేదన్న ట్రంప్.. తాజా పరిణామాలపై మాట్లాడారు. ఇరాన్ తన పట్టు కోల్పోయిందని.. పొరుగు దేశాలకు లొంగిపోయిందంటూ వ్యాఖ్యానించారు. అమెరికా, ఇజ్రాయెల్ నిరంతర దాడులతోనే ఇరాన్ వెనక్కి తగ్గిందన్నారు. ఇకపై పొరుగు దేశాలను ఆ దేశం బెదిరింపులకు దిగదంటూ చురకలు అంటించారు.ఇరాన్.. ఓడిపోయింది. పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పి లొంగిపోయింది. ఇరాన్ ఇక మధ్యప్రాచ్య రౌడీ కాదు. ఇరాన్ నలిగిపోతోంది. పొరుగు దేశాలపై ఇకపై దాడులు చేయబోమని మాట ఇచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్లు జరిపిన నిరంతర దాడుల వల్లే ఇది సాధ్యమైంది’’ అంటూ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో పోస్ట్ చేశారు. వేల ఏళ్ల చరిత్రలో ఇరాన్ తన పొరుగు దేశాల ముందు ఓడిపోవడం ఇదే మొదటిసారి అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు మధ్యప్రాచ్యంలో అందరినీ భయపెట్టిన ఇరాన్.. ఇప్పుడు మధ్యప్రాచ్య పరాజితగా మారిందని ట్రంప్ ఎద్దేవా చేశారు.కాగా, ఉద్రిక్తతలను తగ్గించేలా.. పొరుగు దేశాలను తమ సోదరులుగా అభివర్ణించిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్.. దాడులు చేసినందుకు క్షమాపణలు తెలిపిన సంగతి తెలిసిందే. తమపై దాడులు జరిగితే తప్ప, పొరుగు దేశాలపై క్షిపణులు ప్రయోగించవద్దని తమ సాయుధ దళాలకు ఆదేశాలిచ్చామని ఆయన పేర్కొన్నారు.మరోవైపు, ఇరాన్పై ఇవాళ మరింత తీవ్రమైన దాడులు జరుగుతాయని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటివరకు లక్ష్యంగా చేసుకోని ప్రాంతాలను కూడా ఈసారి ధ్వంసం చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. కాగా, ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణలు చెప్పినప్పటికీ, గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దుబాయ్, అబుదాబిలలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా తాత్కాలికంగా సేవలను నిలిపివేసింది. -
"ఆ మూడు పనుల వల్లే అమెరికా-భారత్ దూరం"
డొనాల్ట్ ట్రంప్ ఇంతకాలం పాటు తన విధానాలు చేష్టలతో భారత్ను ఇబ్బంది పెట్టే యత్నం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ.. ట్రంప్ తన మాటలతో భారత్ను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అయితే ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్ తాజాగా ఈ అంశంపై మాట్లాడారు. ట్రంప్ అనాలోచితంగా చేసిన మూడు పనులు అమెరికాకు భారత్ను దూరం చేశాయన్నారు.ట్రంప్ విదేశాంగ విధానానికి తల ఊపే వ్యక్తిని కాదని ఆయన అన్నారు. ఆయన చేసిన పనుల వల్ల అమెరికాకు భారత్ దూరం అయ్యిందన్నారు. "మెుదటగా ఆయన పన్నుల విధానం భారత్తో దూరం పెంచింది. అనంతరం పాకిస్థాన్, భారత్ మధ్య జరిగిన యుద్ధం తన జోక్యంతోనే ముగిసిందని అనడం. తదనంతరం పాక్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్కు వైట్ హౌస్లో అతిథ్యం ఇవ్వడం" భారత్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయన్నారు.పాకిస్థాన్ తరచుగా ఉగ్రవాదాన్నిప్రోత్సహిస్తుందనే భారత్తో ఎన్నో ఏళ్లుగా అనేక వేదికలపై తెలుపుతుందని అయినప్పటికీ ట్రంప్ ఇలా చేయడం భారత్ను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. అయితే ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేదన్నారు. ఇరాన్లో ప్రభుత్వం మారుతుందో లేదో ఖచ్చితంగా చెప్పలేమని తెలిపారు.కాగా ఇప్పటికే ఇరాన్ దాడుల తీవ్రత గణనీయంగా తగ్గిందని అదే సమయంలో ఇజ్రాయెల్ మరియు అమెరికా దాడుల తీవ్రత పెరిగిందన్నారు. అయితే అమెరికా, ఇజ్రాయెల్లు పాలక వ్యవస్థల పైనే దాడి జరుపుతున్నాయని ఇరాన్ ఆర్థిక, సామాజిక మౌలిక వసతులకు హాని కలగకుండా ఆ రెండు దేశాలు జాగ్రత్త పడుతున్నాయని ఆస్ట్రేలియా మాజీ ప్రధాని తెలిపారు. -
బలహీనపడుతోన్న ఇరాన్.. యుద్ధం ఆపేది ఎప్పుడో.. క్లారిటీ ఇచ్చిన ట్రంప్..
-
ఇరాన్లో విషపూరిత పొగలు.. హెచ్చరికలు జారీ
ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం రెండో వారానికి చేరుకుంది. ఇరాన్పై దాడుల తీవ్రత పెరిగింది.. -
యుద్ధంలో బిగ్ ట్విస్ట్.. అమెరికా దాడులకు పుతిన్ చెక్?
వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్కు రష్యా చాటుగా సాయపడుతోందా? అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాల కదలికలతో పాటు గల్ఫ్లోని ఆ దేశ సైనిక స్థావరాలు తదితరాలకు సంబంధించిన సున్నితమైన నిఘా సమాచారాన్ని వారం రోజులుగా ఎప్పటికప్పుడు ఇరాన్కు అందిస్తూ వస్తోందా? తద్వారా వాటిపై దాడులకు సహకరిస్తోందా? అంటే, అవునని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్టు వార్తా సంస్థ సంచలనాత్మక కథనం వెలువరించింది.‘యుద్ధం మొదలైన ఒకట్రెండు రోజుల్లోనే ఇరాన్ నిఘా సామర్థ్యం దాదాపుగా కుప్పకూలింది. అయినా అమెరికా యుద్ధ నౌకలు, గల్ఫ్ దేశాల్లోని స్థావరాలు, రాయబార కార్యాలయాలపై ఇరాన్ కచ్చితత్వంతో దాడులు చేయగలిగింది. రష్యా అందించిన నిఘా సమాచారంతోనే ఇది సాధ్యమైందనడం సుస్పష్టం’ అని సదరు అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ దీనిపై ఎలా స్పందిస్తారోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యాపైనా ఆయన తీవ్ర చర్యలకు దిగితే ఇప్పటికే పశ్చిమాసియా అంతటా కుంపట్లు రాజేస్తున్న యుద్ధం మరింతగా విస్తరించే ప్రమాదముంది.ఇరాన్కు కావాల్సింది.. ఓ మంచి నాయకుడు: ట్రంప్ మరోవైపు.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్కు ఒక మంచి నాయకుడు కావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ విషయమై పలువురు నేతల పేర్లు తమ దృష్టిలో ఉన్నట్టు చెప్పారు. ‘ఇరాన్కు మంచి భవిష్యత్తుంటుంది. ఇతర దేశాల సాయంతో ఆ దేశాన్ని సంక్షోభం నుంచి బయట పడేస్తాం. ఆర్థికంగా అత్యంత బలోపేతం చేస్తాం’ అని ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా)’తరహాలో ‘మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్’అంటూ అధ్యక్షుడు ముక్తాయించడం విశేషం! మధ్యవర్తిత్వం ద్వారా యుద్ధానికి తెర దించేందుకు పలు దేశాలు ప్రయత్నిస్తున్నట్టు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చెప్పారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు.ఇరాన్ యుద్ధ నౌకను ముంచేశాం: అమెరికా డ్రోన్లు, ఇతర ఆయుధాలతో కూడిన ఇరాన్ యుద్ధ నౌక ఐఆర్ఐఎస్ షహీద్ బఘేరీని ముంచేసినట్టు అమెరికా ప్రకటించింది. అది మంటల్లో తగలబడిపోతున్న ఫుటేజీని యూఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ శుక్రవారం విడుదల చేసింది. ఇరాన్ సైన్యం మాత్రం దీన్ని ధ్రువీకరించలేదు. 180 మీటర్ల పొడవైన షహీద్ నిజానికి రవాణా నౌక. యుద్ధ అవసరాల రీత్యా ఇరాన్ దాన్ని తాత్కాలికంగా డ్రోన్ క్యారియర్గా మార్చినట్టు సమాచారం. ఇది రీ ఫ్యూయలింగ్ కోసం ఆగకుండా ఏకబిగిన 22 వేల నాటికల్ మైళ్లు ప్రయాణించగలదు!. -
ముందుంది ‘యుద్ధ గండం’.. ట్రంప్నకు భారీ షాక్?
ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించి వారం రోజులవుతోంది. ఈ యుద్ధం పశ్చిమాసియాలో తొమ్మిది దేశాలకు విస్తరించింది. ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించకపోవడం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ సైన్యం ఎక్కడా తగ్గకుండా శక్తిమేరకు పోరాడుతోంది. ఇజ్రాయెల్తోపాటు పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలకే లక్ష్యంగా దాడులకు దిగుతోంది. ఈ ఘర్షణ మరింత ముదిరే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై సొంతదేశంలో అసంతృప్తి మొదలైనట్లు తెలుస్తోంది. ఇరాన్పై యుద్ధాన్ని అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. ఈ ఘర్షణను త్వరగా ముగించకపోతే మిడ్టర్మ్ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయని, చివరకు ట్రంప్కు పదవీ గండం తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ను ఎలాగైనా లొంగదీసుకోవడానికి అమెరికా సైన్యం వనరుల సమకూర్చుకుంటోంది. తమ సైన్యాన్ని, ఆయుధాలను పశ్చిమాసియాకు తరలిస్తోంది. ఈ యుద్ధం మరో ఆరు నెలలకుపైగానే.. అంటే సెపె్టంబర్ దాకా కొనసాగే పరిస్థితి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మరణిస్తే యుద్ధం ముగిసిపోతుందని, ఇరాన్ తలవంచడం ఖాయమని, అక్కడ ప్రభుత్వం మారిపోతుందని ఇజ్రాయెల్, అమెరికా భావించాయి. కానీ, క్షేత్రస్థాయిలో జరుగున్నది మరొకటి. ఖమేనీ హత్యపట్ల ఇరాన్ ప్రజలు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. ఇజ్రాయెల్, అమెరికాలకు వ్యతిరేకంగా వారంతా ఒక్కతాటిపైకి వస్తున్నారు. ముందస్తు ప్రణాళిక లేని యుద్ధం సుదీర్ఘ యుద్ధానికి ఇజ్రాయెల్తోపాటు అమెరికా సైతం సిద్ధమైనట్లే కనిపిస్తోంది. అమెరికా రక్షణ శాఖ ఇరాన్లో నిఘా కార్యకలాపాలు ముమ్మరం చేస్తోంది. అదనంగా మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులను ఫ్లోరిడాలోని తమ ప్రధాన కార్యాలయానికి పంపించాలని పెంటగాన్కు యూఎస్ సెంట్రల్ కమాండ్ విజ్ఞప్తి చేసింది. మరోవైపు రష్యా నుంచి 30 రోజులపాటు చమురు దిగుమతి చేసుకోవడానికి భారత్కు అమెరికా తాత్కాలికంగా మినహాయింపు ఇచి్చంది. పశ్చిమాసియాలో యుద్ధం ముగిసి, సాధారణ పరిస్థితులు నెలకొనడానికి చాలా రోజులు పడుతుందని అమెరికా భావిస్తున్నట్లు సమాచారం. ముందస్తు ప్రణాళికతో జరిగే యుద్ధాలు కొన్ని నెలలపాటు కొనసాగుతుంటాయి. ఇరాన్లో యుద్ధానికి అప్పటికప్పుడు ప్రణాళిక తయారుచేశారు. ముందస్తు సన్నద్ధత అంటూ ఏదీ లేదు. అందుకే ఇది ఎప్పుడు ఆగిపోతుందో చెప్పలేని పరిస్థితి. ట్రంప్కు నష్టమెందుకు? అమెరికాలో నవంబర్లో మిడ్టర్మ్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ట్రంప్ రెండేళ్ల పాలన పూర్తి కావడానికి ముందు ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇరాన్ యుద్ధం ఈ ఎన్నికలపై గట్టి ప్రభావం చూపడం తథ్యమని అంటున్నారు. ట్రంప్ అనవసరంగా ఈ యుద్ధం తెచి్చపెట్టారన్న అభిప్రాయం అమెరికాలో వ్యక్తమవుతోంది. పశ్చిమాసియాలో మరో యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదని అంటున్నారు. వీరిలో ట్రంప్ సొంత పార్టీ నేతలు కూడా ఉన్నారు. రిపబ్లికన్ పారీ్టలో చీలిక కనిపిస్తోంది. ట్రంప్ను వ్యతిరేకించేవారు ఎక్కువవుతున్నారు. తన మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ అండతోనే ఇరాన్పై దాడులు ఆరంభించామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ప్రకటించారు. తద్వారా ట్రంప్ పోద్బలంతోనే ఇరాన్లో నిప్పుల కుంపటి రగించారని అమెరికన్లు నిర్ణయానికొచ్చారు. అసలు ఖమేనీని హత్య చేయడం వెనుక ఔచిత్యం ఏమిటని ప్రశి్నస్తున్నారు. గత అమెరికన్ అధ్యక్షులు ఇరాన్పై యుద్ధానికి ఇష్టపడలేదు. ఆ పని మొదట తానే చేశానని ట్రంప్ గొప్పగా చెప్పుకోవడం ప్రజలకు రుచించడం లేదు. యుద్ధ ప్రభావం ఇప్పటికే మొదలైంది. ధరలు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే సూచనలున్నాయి. ఇవన్నీ ట్రంప్కు సవాలుగా మారుతున్నాయి. మిడ్టర్మ్ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు లభిస్తే అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ తప్పుకోవాలన్న డిమాండ్లు సొంత పారీ్టలోనే ఊపందుకోవచ్చు. అది ప్రజా ఉద్యమంగా మారితే ట్రంప్ మధ్యలోనే దిగిపోక తప్పదని విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్. -
ఎప్స్టీన్ ఫైల్స్ : మైనర్పై దారుణం, ట్రంప్కు మరో షాక్
ఇరాన్పై భీకర దాడులు వరుసగా 7వ రోజు కూడా కొనసాగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరో షాక్ తగింది. ట్రంప్పై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన మరికొన్ని కీలక పత్రాలను అమెరికా న్యాయశాఖ (Department of Justice) తాజాగా విడుదల చేసింది. దివంగత లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ (Epstein Files) కేసులో భాగంగా వీటిని బహిర్గతంచేసింది.తాజాగా విడుదలలైన ఈ పత్రాలు ప్రకారం ఎప్స్టీన్ ద్వారా ట్రంప్కు పరిచయమైన ఒక మహిళను, ఆమె మైనర్గా ఉన్నప్పుడు (13 -15 ఏళ్ల వయస్సులో) ట్రంప్ లైంగికంగా వేధించారని పేర్కొంటున్నాయి.ఎప్స్టీన్ ఆ బాలికను న్యూయార్క్ లేదా న్యూజెర్సీకి తీసుకెళ్లి ట్రంప్కు పరిచయం చేశాడు. ఆ సమయంలో ట్రంప్ తనపై లైంగిక దాడికి ప్రయత్నించగా, తాను అతణ్ని కొరికి గాయపరిచినట్టు ఆ మహిళ దర్యాప్తు అధికారులకు వివరించిందని 2019లో FBI జరిపిన ఇంటర్వ్యూల ప్రకారం తెలుస్తోంది.అంతేకాదు ఈ విషయం బయటకు రాకుండా ఉండాలని తనకు, తన కుటుంబ సభ్యులకు పలు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆమె ఆరోపించింది.రాజకీయ దుమారంఈ పత్రాలు గతంలోనే విడుదల కావాల్సి ఉన్నా, పొరపాటున "డూప్లికేట్" (నకలు) అని మార్క్ చేయబడటం వల్ల అప్పట్లో బయటకు రాలేదని న్యాయశాఖ తెలిపింది. దీనిపై స్పందించిన డెమోక్రాట్లుట్రంప్ ప్రభుత్వం ఎప్స్టీన్ కేసులో కీలక వివరాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించిందని డెమోక్రాట్లు ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టడానికి అటార్నీ జనరల్ పామ్ బాండీకి సమన్లు (Subpoena) జారీ చేయాలని హౌస్ కమిటీ నిర్ణయించింది.అయితే ఈ ఆరోపణలను డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ట్రంప్ వాదిస్తున్నారు. ఈ పత్రాల్లో ఉన్నవి అవాస్తవాలు, సంచలనం కోసం సృష్టించిన ఆరోపణలని గతంలోనే ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఎప్స్టీన్ కేసులో వాస్తవాలు బయటికి రాకుండా ఉండేందుకు ఇరాన్పై దాడులకు పూనుకున్నాడని ట్రంప్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: పరీక్షలకు వెళుతుండగా పిల్లల్ని కొట్టి చంపేశాడు.. సొంత బాబాయే! -
ట్రంప్ మార్క్ పాలిటిక్స్ .. ఉండే అమెరికా భద్రతలో DHS కీలకం
-
ఇరాన్ యుద్ధం వేళ.. ట్రంప్నకు బిగ్ ఝలక్!
ఇరాన్ టార్గెట్గా ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. యూఎస్ డ్రోన్లు, క్షిపణులు.. ఇరాన్పై విరుచుకుపడుతున్నాయి. మరోవైపు.. సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్యకు, దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై మెరుపు దాడులు చేస్తోంది. పరస్పర దాడుల కారణంగా ఇప్పటికే వేల సంఖ్యలో పౌరులు మృతి చెందగా.. భారీ నష్టం వాటిల్లింది. ఇరాన్ దాడులతో కొన్ని గల్ఫ్ దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా, ఇజ్రాయెల్పై కొన్ని గల్ఫ్ దేశాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు ప్రారంభించిన తర్వాత.. ఇరాన్ ప్రతి దాడులకు దిగింది. ఇజ్రాయెల్ సహా ఐదు గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసి డ్రోన్లు, క్షిపణి దాడులు జరిపింది. బహ్రెయిన్, కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (దుబాయ్, అబుదాబి), అలాగే సౌదీ అరేబియా లక్ష్యంగా మారాయి. ఈ దాడులు అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడులకు ప్రతీకారంగా జరిగాయి. గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్.. కనీసం 380 క్షిపణులు, 1,480 కంటే ఎక్కువ డ్రోన్లను ప్రయోగించింది. ఆ దేశాలలో కనీసం 13 మంది మరణించారని అధికారిక ప్రకటనల ప్రకారం తెలిసింది. ఆదివారం కువైట్లో ఇరాన్ డ్రోన్ దాడి ప్రధాన ఆర్మీ స్థావరం నుండి 10 మైళ్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న ఒక పౌర ఓడరేవులోని ఆపరేషన్ సెంటర్ను తాకింది. ఈ దాడిలో ఆరుగురు అమెరికా సైనికులు మరణించారు.మరోవైపు.. ఇరాన్ దాడులు గల్ప్ ప్రాంతాన్ని అస్థిరం చేస్తున్నాయి. అమెరికా సైనిక స్థావరాలు ఉన్న దేశాలు నేరుగా లక్ష్యంగా మారాయి. ఇది చమురు సరఫరా, అంతర్జాతీయ భద్రతపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, అమెరికాపై గల్ఫ్ దేశాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్పై దాడులకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మండిపడుతున్నాయి. దాడులపై తమకు ముందుగానే సమాచారం ఇచ్చి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధ సన్నద్ధతకు తమకు తగినంత సమయం అమెరికా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధం, దాడుల విషయంలో ఇజ్రాయెల్ ప్లాన్ ప్రకారం ఎంతో భద్రతతో ఉందని ఆరోపిస్తున్నాయి. అమెరికా సైన్యం కూడా తమకు రక్షణ ఇవ్వలేదని చెబుతున్నాయి.కాగా, గల్ఫ్ దేశాల అసహనంపై తాజాగా వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ స్పందించారు. ఈ సందర్బంగా కెల్లీ..‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ ఆయుధాలను ప్రయోగించే లేదా ఉత్పత్తి దేశాలను అణచివేస్తుంది. ఈ కార్యక్రమం వల్లే ఇరాన్ ప్రతీకార బాలిస్టిక్ క్షిపణి దాడులు 90 శాతం తగ్గాయి. అధ్యక్షుడు ట్రంప్ మా ప్రాంతీయ భాగస్వాములందరితో సన్నిహిత సంబంధంలో ఉన్నారు. ఉగ్రవాద ఇరాన్ పాలన, పొరుగు దేశాలపై చేసిన దాడులను అధ్యక్షుడు ట్రంప్ పర్యవేక్షిస్తున్నారు. మా మిత్రదేశాలకు ఈ ముప్పును తొలగించడం ఎంత అవసరమో అని చర్యలు తీసుకుంటున్నారు’ అని క్లారిటీ ఇచ్చారు. -
ఖమేనీ హత్యకు ఇలా ప్లాన్.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి
టెలీ అవీవ్: ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు.. ఇరాన్ సైతం ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసి బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇలాంటి తరుణంలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి హత్య ప్లాన్కు సంబంధించిన కీలక వివరాలను ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ వెల్లడించారు. ఖమేనీని హతమార్చే లక్ష్యాన్ని గత ఏడాది నవంబర్లోనే నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది.ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చే లక్ష్యాన్ని గత ఏడాది నవంబర్లోనే నిర్ణయించుకున్నాం. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూతో కలిసి జరిగిన అత్యంత రహస్య భద్రతా సమావేశంలో ఆ లక్ష్యాన్ని నిర్ణయించాము. మొదట ఆ ఆపరేషన్ను 2026 మధ్యలో అమలు చేయాలని భావించినప్పటికీ, ఇరాన్లో నెలకొన్న అంతర్గత అస్థిరత కారణంగా దాడి సమయాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వ్యూహాన్ని అమెరికాకు కూడా వెల్లడించాం’ అని తెలిపారు.అలాగే.. ఇరాన్లో మతపెద్దల పాలనపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో వారు ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యాలపై దాడులకు దిగే అవకాశముందని భావించి ముందస్తు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ రోరింగ్ లయన్, ఎపిక్ ఫ్యూరీ ప్రారంభ దశలోనే ఈ లక్ష్యాన్ని అమలు చేసినట్లు సమాచారం. ఒక సార్వభౌమ దేశ అత్యున్నత నాయకుడిని వైమానిక దాడి ద్వారా హతమార్చడం ఇదే మొదటిసారి అని అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇజ్రాయెల్ మాత్రం ఈ చర్యను సమర్థించుకుంటోంది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం, అణు కార్యక్రమం తమ దేశానికి అస్తిత్వ ముప్పుగా మారిందని చెబుతోంది. అందుకే ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా బలహీనపరచడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొంది. -
ఇరాన్ కొత్త నాయకుడికి షాకిచ్చిన ట్రంప్
వాషింగ్టన్: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ.. అమెరికా అధ్యక్ష్యుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎంపికలో అగ్రరాజ్యం పాత్ర ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ తరుణంలో అయతొల్లా అలీ ఖమేనీ కొడుకు మోజ్తబా ఖమేనీ తదుపరి సుప్రీంగా ఎంపిక అయ్యారనే ప్రచారంపైనా ట్రంప్ తీవ్రంగా స్పందించారు.ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్గా మోజ్తబాను చూడటం దాదాపుగా అసాధ్యం అని ట్రంప్ తేల్చేశారు. రాయిటర్స్ మీడియాకు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇరాన్ భవిష్యత్తు కోసం జరిగే నాయకత్వ ఎంపికలో మేము (అమెరికా) భాగం కావాలి. అప్పుడే ఎంపికలో పారదర్శకత ఉంటుంది. ప్రతీ ఐదు సంవత్సరాలకొకసారి మళ్లీ ఇదే చేయాల్సిన అవసరం ఉండదు. ఇరాన్కు, ఆ దేశ ప్రజలకు గొప్ప సేవ అందించే నాయకుడిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మోజ్తబాను తదుపరి నాయకుడిగా పరిగణించడం అసాధ్యమనే రీతిలో ఆయన మాట్లాడినట్లు సదరు మీడియా సంస్థ కథనం ఇచ్చింది.మరోవైపు.. ఇరాన్ మాజీ రాజకుమారుడు రెజా పహ్లవికి ఆ అవకాశం ఉండొచ్చా? అని రాయిటర్స్ ప్రతినిధి వేసిన ప్రశ్నకు.. ఎంపికలో ఎంతో మంది పేర్లను పరిశీలించవచ్చు. అది ఇప్పుడే చెప్పలేం అని ట్రంప్ బదులిచ్చినట్లు తెలుస్తోంది. ఇరాన్ కొత్త నాయకుడి ఎంపికలో అమెరికా ప్రమేయం ఉండాల్సిందేనన్న ట్రంప్ ప్రకటన చేయడం ద్వారా మధ్య ప్రాచ్యంలో మిడిల్ ఈస్ట్లో అమెరికా ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే ఈ వ్యాఖ్యలు ఇరాన్ నుంచి తీవ్ర ప్రతిఘటనకు, రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 28న(2026)అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో అయతొల్లా ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు పలువురు మరణించారు. ఆయన మరణాంతరం గార్డియన్ కౌన్సిల్కు చెందిన అయతొల్లా అలిరెజా ఆరఫీని (ఖమేనీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడు కూడా) తాత్కాలిక సుప్రీం లీడర్గా నియమించారు. ఆపై మార్చి 4న ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఖమేనీ తనయుడు మోజ్తబాను అధికారికంగా ఎన్నుకుంది. అయితే ఈ ఎంపిక సజావుగా జరగలేదని, ఇందులో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఒత్తిడి ఉందని పలు కథనాలు చెబుతున్నాయి. -
మరో దేశంపై యుద్ధం ప్రకటించిన ట్రంప్
వాషింగ్టన్: ప్రపంచమంతా యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. అటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధం కారణంగా తీవ్ర సంక్షోభం నెలకొంది. ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇరాన్తో యుద్దం ముగిసిన వెంటనే క్యూబా సంగతి తేలుస్తామని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీంతో, మరో యుద్ధం తప్పదని ట్రంప్ పరోక్షంగా చెప్పుకొచ్చారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వైట్హౌస్లో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇరాన్పై యుద్ధం జరుగుతోంది. ఇరాన్తో యుద్ధం ముగిసిన వెంటనే క్యూబా సంగతి తేలుస్తాం. అమెరికాతో డీల్ చేసుకునేందుకు క్యూబా ఎంతో ఉత్సాహంగా ఉంది. క్యూబా అమెరికా మాట వినకపోతే ఇలాంటి పరిస్థితే ఉంటుంది అంటూ హెచ్చరించారు. చివరకు స్నేహ పూర్వకంగా క్యూబాను దక్కించుకునే అవకాశం ఉందని ట్రంప్ వెల్లడించారు. మరి ఇరాన్ యుద్ధం అయిన తర్వాత ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది. CAN ANYONE STOP THIS LUNATIC⁉️Trump says that America will go to war with Cuba after the war in Iran is "finished." pic.twitter.com/DlOuWd8dFo— Earth Hippy 🌎🕊️💚 (@hippyygoat) March 6, 2026అంతకుముందు కూడా క్యూబా లక్ష్యంగా డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశానికి చమురు విక్రయించే ఏ దేశంపైనైనా టారిఫ్లు విధిస్తానని హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం కూడా చేశారు. క్యూబా విషయంలో జాతీయ అత్యవసర పరిస్థితి కింద ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ దేశ ప్రభుత్వం అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి తీవ్రమైన ముప్పుగా మారిందని పేర్కొన్నారు. ఇదే సమయంలో స్నేహపూర్వక రీతిలోనే క్యూబాను తమ ఆధీనంలోకి తీసుకోవాల్సి రావచ్చు అంటూ కామెంట్ చేశారు. -
ఇరాన్ దాడులు.. దుబాయిలో హైఅలర్ట్ బంకర్లలోకి ప్రజలు?
ఇరాన్పై అమెరికా సైన్యం విరుచుకుపడుతోంది.. మరోవైపు.. ఇరాన్ సైతం.. -
డొనాల్డ్ ట్రంప్కు మరో ఎదురుదెబ్బ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తన పరిధిలో లేని 1977 అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం(ఐఈఈపీఏ)ను అడ్డుపెట్టుకుని విదేశాలపై విధించిన అధిక టారిఫ్ల మాటున వసూలుచేసిన 130 బిలియన్ డాలర్లను తిరిగి ఆయా కంపెనీలకే చెల్లించాలని మాన్హట్టన్ నగరంలోని ‘యూఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్’లో జడ్జి రిచర్డ్ ఈటన్ తీర్పు చెప్పారు.టెన్నిస్సీ రాష్ట్రంలోని నాష్విల్లే నగరంలోని అట్మాస్ ఫిల్ట్రేషన్ అనే సంస్థ వేసిన పిటిషన్ను విచారిస్తూ జడ్జి ఈ తీర్పు వెలువర్చారు. ప్రపంచదేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్లు చట్టవిరుద్ధమంటూ ఫిబ్రవరి 20వ తేదీన అమెరికా దేశ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు చెప్పింది. కానీ ఆయా దేశాల కంపెనీలు చెల్లించిన అధిక టారిఫ్లను తిరిగి వాళ్లకే రీఫండ్ చేయాలని తీర్పులో ఎక్కడా పేర్కొనలేదు. అయితే గురువారం ట్రేడ్ కోర్టు ఇచ్చిన తీర్పుతో రీఫండ్ విషయంలో స్పష్టత వచి్చనట్లయింది. -
ఎన్నికల్లో నా పాత్ర ఉండాల్సిందే.. ఇరాన్పై ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ఎన్నిక ప్రక్రియలో తనను కచ్చితంగా భాగస్వామిని చేయాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఆ పదవికి దివంగత నేత అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా తమకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారయోగ్యం కాదన్నారు. గురువారం డిజిటల్ మీడియా సంస్థ ‘ఆక్సియోస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అధ్యక్షుడు ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ‘‘వాళ్లు (ఇరాన్) సమయం వృథా చేస్తున్నారు. వెనెజువెలాలో డెల్సీ రోడ్రిగ్స్ అధ్యక్షురాలయ్యేందుకు సహకరించాను. అలాగే ఇరాన్ సుప్రీం నేత ఎన్నికలోనూ నా పాత్ర ఉండి తీరాల్సిందే’’ అని చెప్పుకొచ్చారు.సుప్రీం లీడర్ను ఇంకా ఎన్నుకోలేదు..ఇరాన్ తన సుప్రీం నేతను ఇంకా అధికారికంగా ఎన్నుకోలేదని ఆ దేశ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. భారత్లో ఇరాన్ సుప్రీం నేత అధికారిక ప్రతినిధి అయతొల్లా అబ్దుల్ మజీద్ హకీం ఎలాహీ గురువారం ఈ మేరకు పేర్కొన్నారు. సుప్రీం నేత ఎన్నిక ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. గత శనివారం ఇజ్రాయెల్, ఇరాన్ దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ మరణించడం తెలిసిందే. ఆయన వారసునిగా రెండో కుమారుడు మొజ్తబా ఖమేనీని అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ బుధవారం ఎన్నుకున్నట్టు వార్తలొచ్చాయి. అవి నిజం కాదని ఎలాహీ చెప్పుకొచ్చారు.‘‘సుప్రీం నేత పదవికి పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మొజ్తబా పేరు కూడా వాటిలో ఒకటి. మొజ్తబా అర్హతల దృష్ట్యా బహుశా ఆయనను సుప్రీం నేత పదవికి కమిటీ పరిశీలించవచ్చేమో’’ అని అభిప్రాయపడ్డారు. సుప్రీం నేతగా ఎన్నికయ్యేవారిని వెంటనే మట్టుబెడతామని ఇజ్రాయెల్ ఇప్పటికే హెచ్చరించడం తెలిసిందే. అయినా ఆయన ఎన్నికను గోప్యంగా ఉంచబోమని ఎలాహీ స్పష్టం చేశారు. తమ నాయకున్ని ఎలా కాపాడుకోవాలో ఇరాన్కు తెలుసన్నారు. -
అంతులేని ట్రంప్ అబద్ధాలు
ఎక్కువ ఉపయోగంలో లేదు గానీ ‘పారదర్శక అబద్ధాలు’ అనే మాట ఒకటుంది. దాని అర్థం, ఒక మనిషి అబద్ధాలు చెప్తే అవి అబద్ధాలని వెంటనే అందరికీ అర్థమైపోవటం. అటువంటి పారదర్శక అబద్ధాలు చెప్పటంలో ఘనా పాఠిగా మారిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మరో వరుస అబద్ధాలు చెప్తూ ఇరాన్పై ఫిబ్రవరి 28న యుద్ధానికి తలపడ్డారు. యుద్ధానికి చెప్పిన కారణాలన్నీ పచ్చి అబద్ధాలని పరిశోధనలు చేసి నిరూపించవలసిన అవసరమేమీ లేదు. స్వయంగా అమెరికన్ ప్రభుత్వపు నివేదికలు, అక్కడి మీడియా, చివరకు గతంలో ట్రంప్ తానే చేసిన ప్రకటనలు తేల్చి చూపుతున్నాయి. ‘యుద్ధాలు చేయ బోను, యుద్ధాలను అంతటా ఆపుతున్నాను’ అంటూ జనవరిలో మాదక ద్రవ్యాల విషయమై అబద్ధపు ఆరోపణలతో వెనిజులా అధ్యక్షుడిని, ఆయన భార్యను అపహరించారు; కేవలం రెండు నెలల తర్వాత, ఇరాన్ ‘కొద్ది రోజులలోనే’ అణ్వస్త్రాలు తయారు చేసి తమకు ముప్పుగా మారనుందనే అబద్ధం చెప్తూ ఆ దేశ అధినేతను కుటుంబ సభ్యులతో సహా బలిగొన్నారు.మళ్లీ అవే అబద్ధాలుప్రస్తుత యుద్ధం ఎట్లా సాగి, ఏ విధంగా ముగుస్తుందన్నది అట్లుంచుదాం. అమెరికా, ఇజ్రాయెల్ తామే ప్రకటించినట్లు ‘గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో’ సైనిక సన్నాహాలు సాగించి మొదలుపెట్టిన యుద్ధం వారు ఆశించినట్లు రెండు రోజులలోనే ముగియక పోగా, రోజులు గడిచేకొద్దీ ఇరాన్ పట్టుదలతో మరింత భీకరంగా మారటం మాత్రం కనిపిస్తున్నది. ఇరాన్ అణుకేంద్రాలపై నిరుడు జూన్లో ఇజ్రాయెల్తో కలిసి దాడులు జరిపిన ట్రంప్, ఆ కేంద్రాలు ‘పూర్తిగా తుడిచి పెట్టుకుపోయా’యని ప్రకటించారు. ఆ దాడులకు ముందు కూడా, ఇరాన్ అణ్వస్త్రాలు ఇక ‘కొద్ది వారాలలోనే’ తయారు కానున్నాయన్నారు. ఆ మాట అబద్ధమని అపుడు కూడా ప్రపంచానికి వెంటనే అర్థమైంది. తమ లక్ష్యం శాంతియుత వినియోగమే తప్ప అస్త్రాల తయారీ ఎంత మాత్రం కాదనీ, అంతర్జాతీయ చట్టాల మేరకు శాంతియుత వినియోగం తమ హక్కనీ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో అందుకే చేరామనీ అన్న ఇరాన్ మాటలను నమ్మకపోయినా, యథాతథంగా అణ్వస్త్ర తయారీ సన్నాహాలు ఎప్పుడూ ఎవరికీ కనిపించలేదు. అస్త్రాల కోసం యురేనియం శుద్ధి 90 శాతం అవసరం కాగా ఆ కేంద్రాలలో శుద్ధి ఎన్నడూ 60 శాతానికి దాట లేదు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నది. అమెరికన్ నిఘా సంస్థల నివేదికలు సైతం 60 శాతమనే చెప్పాయి. ఇవన్నీ గాక, అణుశక్తి వినియోగంపై ఇరానియన్ ప్రభుత్వం అమెరికా, యూరప్లతో చర్చలు జరుపుతూనే ఉంది. అయినా తమ సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం, ట్రంప్ ఇరాన్ కేంద్రాలపై బి–52 బాంబర్లతో దాడులు చేశారు.గ్రేటర్ ఇజ్రాయెల్ కోసమే!అవే ప్రయోజనాల కోసం ఇపుడు తిరిగి సరిగా అవే అబద్ధాలు చెప్తూ యుద్ధం మొదలు పెట్టారు. గత జూన్ దాడులలో ఆ నిర్మాణాలు బాగా దెబ్బతినగా అక్కడి యురేనియం నిల్వలు, యంత్ర సామగ్రి ఆ శిథిలాల కింద కూరుకుపోయి ఉన్నాయి. వాటిని ఇరాన్ కనీసం బయటకు అయినా తీయలేదు. అటువంటపుడు అస్త్రాల తయారీ ప్రసక్తి ఎక్కడిది? పైగా, భవిష్యత్తులో శాంతియుత వినియోగం లేదా మరొకటి అన్న ప్రశ్నలపై ఇరాన్, అమెరికాల మధ్య కొద్ది నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. ఆ విషయమై ఒప్పందం కుదిరే సూచనలున్నట్లు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఒమన్ గత వారమే ప్రకటించింది. విషయమేమంటే, ఇజ్రాయెల్కు, వారి పలుకుబడితో వ్యవహ రిస్తున్న ట్రంప్కు, పశ్చిమాసియాలో ఇరాన్ ఒక్కటే స్వతంత్రంగా నిలబడి అభివృద్ధి చెందటం కంటగింపుగా మారింది. వారి పరమ లక్ష్యం పాలస్తీనా దేశం ఏర్పడక పోవటం, గ్రేటర్ ఇజ్రాయెల్ సృష్టి, ఇరాన్ను సామంత రాజ్యంగా మార్చి అక్కడి చమురు నిల్వలు కాజేయటం! అమెరికా అధ్యక్షుడు అంతే పెద్ద అబద్ధం మరొకటి ప్రచారం చేస్తున్నారు. ఇరాన్ అణ్వస్త్రాలనే గాక, వాటిని అమెరికాపై ప్రయో గించగల క్షిపణుల తయారీని పూర్తి చేస్తున్నదని! ఇరాన్ వద్ద గల క్షిపణులలో అతి ఎక్కువ దూరం ప్రయాణించగల వాటి పరిధి సుమారు 1,200 కి.మీ. కాగా, ఇరాన్ నుంచి అమెరికా దూరం దాదాపు 12,000 కి.మీ.లు. అనగా 10 రెట్లు ఎక్కువ. ఇవన్నీ అమె రికా నివేదికలు, నిపుణుల లెక్కలే. అటువంటి స్థితిలో అణ్వస్త్రా లెక్కడ? వాటిని అమెరికా వరకు ప్రయోగించగల క్షిపణులెక్కడ? అసలు విషాదంట్రంప్ ఒక పారదర్శక అబద్ధాలకోరు అన్నది ప్రపంచంతో పాటు స్వయంగా అమెరికన్లకు, తన ‘మాగా’ ఓటర్లకు కూడా అర్థమైంది. అందువల్లనే ఆయన ‘అప్రూవల్ రేటింగ్’ 27 శాతానికి పడిపోయింది. ‘మాగా’ అనే ఉత్తేజకర నినాదంతో గెలిచిన ఆయన ఆ లక్ష్యాల సాధనకు సవ్యమైన మార్గాలను ఎంచుకునే బదులు, వ్యక్తిగత ప్రయోజనాలకు, విధానపరమైన వైఫల్యాలకు, ఇజ్రాయెలీ లాబీకి బందీ అయి, ఈ అరాచకాలన్నీ సృష్టిస్తున్నారు.యుద్ధం మొదలు పెట్టినప్పుడు ఇరాన్లో ప్రభుత్వాన్ని, రాజ కీయ వ్యవస్థనే మార్చివేసి, రివల్యూషనరీ గార్డ్స్ను అంతం చేయగలమన్న ట్రంప్, 48 గంటలు గడవగానే ప్రభుత్వాన్ని, వ్యవస్థను మార్చటం తమ లక్ష్యం కాదంటున్నారు. ఆయన బహిరంగంగా పిలుపు ఇచ్చినట్లు అక్కడి ప్రజలేమీ తిరుగుబాటు చేసి ‘ప్రభుత్వాన్ని తమ చేతులలోకి తీసుకోవటం’ లేదు. ట్రంప్, నెతన్యాహూల దుర్మా ర్గానికి, పశ్చిమాసియాలో అమెరికన్ స్థావరాలకు అవకాశమిచ్చి సామంతులుగా వ్యవహరిస్తున్న గల్ఫ్ దేశాలు బలవుతున్నాయి. గతంలోకి వెళితే, ఇరాన్ చమురును మొదటి నుంచి తమ అధీనంలో ఉంచు కున్న పాశ్చాత్య దేశాలు అక్కడ ఎన్నికల ద్వారా అధికారానికి వచ్చిన ప్రధాని మొసాదెగ్ను 1953లో సీఐఏ, ఎంఐ6 కుట్రతో పడగొట్టినప్పటి నుంచి ఈ క్రీడ సాగుతున్నది. 1979లో వచ్చిన ఇస్లామిక్ పాలన అందుకు అడ్డుకట్ట వేయటాన్ని సహించలేక, షా పహ్లవీ కుమారుడిని తిరిగి అమెరికా నుంచి దిగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ పరిణామాల మధ్య పెద్ద విషాదం ఒకటున్నది. గ్లోబల్ సౌత్కు నాయకత్వం వహించాలని ఉవ్విళ్లూరుతున్న ప్రధాని మోదీ– మదురో దంపతుల అపహరణను, వెనిజులాపై దాడిని, ఇరాన్పై దాడిని, ఖమేనీ హత్యను కనీసం పరోక్షంగానైనా ఖండించే సాహసం చేయలేదు.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అణ్వాయుధ ప్రోగ్రామ్.. అమెరికాకు ఇరాన్ కండీషన్..!
అణు కార్యక్రమాన్ని వదులుకుంటున్నట్లు వస్తున్న కథనాలపై ఇరాన్ స్పందించింది. తమకు సంతృప్తికర ప్రత్యామ్నాయ ఆఫర్ ఇస్తేనే.. అణ్వాయుధ ప్రోగ్రామ్ను ఆపేస్తామంటూ అమెరికాకు ఇరాన్ షరతు విధించింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి మజిద్ తఖ్త్-రవాంచి ఈ ప్రకటన చేసినట్లు ఇరాన్ ప్రభుత్వ ఆధీనంలోని ఐఆర్ఎన్ఏ (IRNA) వార్తా సంస్థ వెల్లడించింది.ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అణు హెచ్చరికను మరోసారి పునరావృతం చేశారు. ఇరాన్పై దాడి చేయాలనే నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించుకున్నారు. పిచ్చివాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నప్పుడు, ఇలాంటి చెడు విషయాలు జరుగుతాయంటూ మండిపడ్డారు. ఇరాన్పై ఇంకా ఆపరేషన్ ముగియలేదన్నారు.మరోవైపు, పశ్చిమాసియాలో యుద్ధం మరింత భీకర రూపు దాలుస్తోంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా నిప్పుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్లో ఇప్పటివరకు 1230 మంది మృతి చెందారు. ఇవాళ(మార్చి 5, గురువారం) ఒమన్ పోర్టుపై ఇరాన్ దాడి చేసింది. ఇద్దరు భారతీయులు అశిష్కుమార్, దిలీప్ సింగ్ మృతిచెందారు.ఇప్పటిదాకా ఇరాన్కు చెందిన 17 యుద్ధ నౌకలను పేల్చేసినట్టు అమెరికా ప్రకటించింది. ఇరాన్లో 2,000కు పైగా లక్ష్యాలను ఛేదించినట్టు అమెరికా సైన్యం సెంట్రల్ కమాండ్ చీఫ్, నేవీ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వెల్లడించారు. ‘‘వందలాది ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, లాంచర్లు, డ్రోన్లను నాశనం చేశాం. ఇరాన్ ఇప్పటిదాకా 500కు పైగా బాలిస్టిక్ క్షిపణులు, 2,000కు పైగా డ్రోన్లు ప్రయోగించింది’’అని తెలిపారు. -
ట్రంప్ కు జై కొట్టిన సెనేట్ వీగిపోయిన డెమొక్రాట్ల తీర్మానం
-
ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి 100 గంటలు పూర్తి వీడియో రిలీజ్ చేసిన అమెరికా
-
ఇరాన్ భవిష్యత్తుపై ట్రంప్ ప్లాన్.. మారనున్న ఇరాన్ ముఖచిత్రం?
-
‘ఇరాన్పై యుద్ధంలో అమెరికాకు ఓటమి ఖాయం’.. కారణాలివే..
బీజింగ్: ప్రముఖ చైనీస్-కెనడియన్ విద్యావేత్త, జియోపాలిటికల్ విశ్లేషకుడు షూఏచిన్ జియాంగ్ (Xueqin Jiang) చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఆయన ప్రకారం, అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఇరాన్పై కొనసాగుతున్నప్పటికీ, ఈ యుద్ధంలో అమెరికా ఓటమి తప్పదని అంచనా వేశారు.జియాంగ్ ‘ప్రిడిక్టివ్ హిస్టరీ’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తూ, గేమ్ థియరీ ఆధారంగా జియోపాలిటికల్ విశ్లేషణలు చేస్తుంటారు. ఇటీవల విడుదల చేసిన వీడియోలో, అమెరికా-ఇరాన్ యుద్ధాన్ని ప్రాచీన గ్రీకు చరిత్రలోని అథెన్స్ సిసిలీ యాత్రతో పోల్చారు. ఆయన అభిప్రాయం ప్రకారం, అధిక ఖర్చులు, వ్యూహపరమైన తప్పిదాలు కారణంగా అమెరికా ఈ యుద్ధంలో ఓడిపోతుందని చెప్పారు.1976లో చైనాలో జన్మించిన జియాంగ్, యేల్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ సాహిత్యంలో డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం బీజింగ్లోని మూన్షాట్ అకాడమీలో చరిత్ర, తత్వశాస్త్రం బోధిస్తున్నారు. విద్యా రంగంలో ఆయన చేసిన సంస్కరణలు, సృజనాత్మకతను ప్రోత్సహించే ప్రయత్నాలు ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. 2024లో ఆయన ఇచ్చిన ఒక లెక్చర్లో, అమెరికా-ఇరాన్ యుద్ధం తప్పనిసరిగా జరుగుతుందని, అది అథెన్స్ సిసిలీ యాత్ర లాంటి ఘోర పరాజయానికి దారితీస్తుందని చెప్పారు. ఆయన అంచనాలు ఇప్పటివరకు నిజమవుతున్నందున, ప్రపంచవ్యాప్తంగా ఆయనను చైనాకు చెందిన నోస్ట్రాడమస్గా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, జియాంగ్ చేసిన విశ్లేషణలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చరిత్ర ఆధారంగా భవిష్యత్తు అంచనా వేసే ఆయన విధానం, గేమ్ థియరీ వినియోగం, జియోపాలిటికల్ విశ్లేషణలు అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మొత్తానికి, షూఏచిన్ జియాంగ్ ఒక విద్యావేత్త మాత్రమే కాకుండా, చరిత్రను ఆధారంగా చేసుకుని భవిష్యత్తు అంచనా వేసే విశ్లేషకుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. -
నార్కో గ్యాంగ్లకు ట్రంప్ వార్నింగ్: ఈక్వెడార్లో వేట షురూ!
వాషింగ్టన్: దక్షిణ అమెరికాలో వేళ్లూనుకున్న మాదకద్రవ్యాల ముఠాలు, ఉగ్రవాద నెట్వర్క్లను అంతం చేయడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈక్వెడార్ ప్రభుత్వంతో చేతులు కలిపి ఆ దేశ భూభాగంపై 'నార్కో-టెర్రరిస్టుల'ను ఏరివేసేందుకు అమెరికా సైన్యం వ్యూహాత్మక కార్యకలాపాలను ప్రారంభించింది. మార్చి 3వ తేదీన ఉమ్మడి బలగాలు ఈ ఆపరేషన్ను మొదలుపెట్టినట్లు అమెరికా సదరన్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది.లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతాల్లో విస్తరిస్తున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణా, హింసను అరికట్టేందుకు భాగస్వామ్య దేశాల నిబద్ధతకు ఈ చర్య ఒక నిదర్శనమని సదరన్ కమాండ్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ డోనోవన్ అన్నారు. ఈ ఆపరేషన్కు సంబంధించి హెలికాప్టర్లు గగనతలానికి ఎగురుతున్న దృశ్యాలను, నిఘా నీడలో ఉన్న ఉగ్రవాద స్థావరాల వీడియోలను అమెరికా ప్రభుత్వం విడుదల చేసింది.రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి డ్రగ్ కార్టెల్స్ను 'విదేశీ ఉగ్రవాద సంస్థలు'గా పరిగణిస్తున్న ట్రంప్ యంత్రాంగం, ప్రస్తుతం తన సైనిక వ్యూహానికి మరింత పదును పెట్టింది. తాజా ఆపరేషన్లో భాగంగా అమెరికా దళాలు నేరుగా యుద్ధరంగంలోకి దిగకుండా, ఈక్వెడార్ సైన్యానికి అవసరమైన నిఘా సమాచారాన్ని, అత్యాధునిక లాజిస్టిక్స్ సదుపాయాలను అందిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న ముఠాలపై రాజీలేని పోరాటం చేస్తామని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ఉద్ఘాటించారు. అయితే అంతర్జాతీయ చట్టాల ప్రకారం డ్రగ్ ట్రాఫికింగ్ అనేది నేరమే తప్ప యుద్ధం కాదని, అమెరికా చేపడుతున్న వైమానిక దాడులు చట్టవిరుద్ధమైన హత్యల కిందకు వస్తాయని కొందరు విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరేబియన్, పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో జరిగిన 44 వైమానిక దాడుల్లో సుమారు 150 మంది మరణించగా, వారిలో కొందరు సాధారణ కార్మికులు కూడా ఉన్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.2020 కరోనా మహమ్మారి తర్వాత ఈక్వెడార్లో నేరాల రేటు గణనీయంగా పెరగడం, నిరుద్యోగం, భౌగోళిక పరిస్థితుల వల్ల ఆ దేశం డ్రగ్ రవాణాకు అడ్డాగా మారడంతో నోబోవా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే మార్చి 1 నుండి కొలంబియా దిగుమతులపై 50 శాతం టారిఫ్ విధిస్తూ ఈక్వెడార్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గతంలో వెనిజులా భూభాగంపై దాడులు చేసి, అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్న తరహాలోనే, ఇప్పుడు ఈక్వెడార్ వేదికగా డ్రగ్ మాఫియాపై మరో యుద్ధాన్ని అమెరికా ప్రకటించింది. అక్రమ గనుల తవ్వకం, డ్రగ్స్ మాఫియాను తుదముట్టించేందుకు ఇది ఒక ప్రయత్నమని ఈక్వెడార్ అధ్యక్షుడు తెలిపారు. -
ఆపరేషన్ ముగియలేదు.. ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో యుద్ధంలో అమెరికా సైన్యం పనితీరుకు అసాధారణ రేటింగ్ ఇచ్చారు. అమెరికా ఇప్పుడు కమాండింగ్ స్థానంలో ఉందన్నారు. యుద్ధ రంగంలో అమెరికా సైన్యం పైచేయి సాధించిందని.. బాగా పనిచేసిందని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా ట్రంప్.. 15/10 రేటింగ్ ఇచ్చారు.వైట్ హౌస్లో టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్లతో ట్రంప్ మాట్లాడుతూ..‘అమెరికా, మిత్రదేశాలు.. ఇరాన్పై యుద్ధంలో పైచేయి సాధిస్తున్నాయి. వారం కంటే తక్కువ సమయంలోనే వేగంగా పురోగతి సాధించాం. మేము యుద్ధ రంగంలో బాగానే ఉన్నాము. ఈజీగా చెప్పాలంటే. 10 స్కేల్లో 15 రేటింగ్తో ముందంజలో ఉన్నాం. మనం ఇప్పుడు చాలా బలమైన స్థితిలో ఉన్నాం. ఇరాన్ నాయకత్వం వేగంగా ముందుకు సాగుతోంది. ఇరాన్కు నాయకుడిగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ చనిపోతారు. ఇరాన్ నాయకత్వ వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం కొనసాగుతుంది’ అని ట్రంప్ పేర్కొన్నారు.ఇదే సమయంలో ట్రంప్ అణు హెచ్చరికను పునరావృతం చేశారు. ఇరాన్పై దాడి చేయాలనే నిర్ణయాన్ని అమెరికా నాయకుడు మళ్ళీ సమర్థించుకున్నారు. ఇరాన్ అణ్వాయుధాలను సంపాదించడానికి దగ్గరగా ఉందని వాదించారు. పిచ్చివాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నప్పుడు, ఇలాంటి చెడు విషయాలు జరుగుతాయి అని మండిపడ్డారు. ఇరాన్పై ఇంకా ఆపరేషన్ ముగియలేదు అంటూ కామెంట్స్ చేశారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల ఆయుధశాల వేగంగా తుడిచిపెట్టబడుతోందన్నారు. చివరగా.. వాషింగ్టన్ చివరికి టెహ్రాన్లో పాలన మార్పును కోరుకుంటుందో లేదో వైట్ హౌస్ నిర్ధారించకుండా ఉంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఒమన్ పోర్టుపై ఇరాన్ దాడి.. ఇద్దరు భారతీయులు మృతి
కొనసాగుతున్న అమెరికా,ఇజ్రాయెల్ యుద్ధంయుద్ధం దృష్ట్యా ఖమేనీ అంత్యక్రియలు వాయిదా వేస్తున్నట్లు ఇరాన్ ప్రకటన -
లొంగే ప్రసక్తే లేదు
మాడ్రిడ్: ఇరాన్పై దాడుల కోసం మీ వైమానిక స్థావరాలను ఉపయోగించుకునేందుకు అనుమతించాలని లేదంటే వాణిజ్య బంధం తెంచుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలను స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాన్చెజ్ బేఖాతరు చేశారు. బెదిరింపులకు లొంగే ప్రసక్తేలేదని తెగేసి చెప్పారు. అర్ధంలేని యుద్ధంలో భాగస్వాములం కాబోమని స్పష్టంచేశారు. వాణిజ్య బంధాన్ని వదులుకుంటామని ట్రంప్ చేసిన హెచ్చరికలపై పెడ్రో దీటుగా స్పందించారు. బుధవారం టెలివిజన్లో దేశ ప్రజలనుద్దేశించి పెడ్రో ప్రసంగించారు. ‘‘ప్ర పంచానికి అశుభంగా దాపురించిన పశ్చి మాసియా యుద్ధంలోకి మేం దిగదల్చు కోలేదు. ఈ సమరం అనేది మా దేశ విలు వలు, స్వ ప్రయోజనాలకు పూర్తి విరుద్ధం. ట్రంప్ హెచ్చరికలకు బెదిరిపోయే వాళ్లు ఎవరూ లేరిక్కడ. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ అన్యాయంగా దాడులు చేస్తున్నాయి. ఇతర దేశాల వ్యవహారల్లోకి సైనిక జోక్యం చేసుకోవడం అనేది అత్యంత ప్రమాదకరం. ఇరాన్పై దాడులతో పశ్చిమాసియాలో అత్యంత భీకరమైన యుద్ధం సుదీర్ఘంగా కొనసాగే పెను ప్రమాదం పొంచి ఉంది’’అని ఆయన అన్నారు.బుల్లెట్ ఎప్పుడు పేలుతుందో తెలీదు..‘‘ఇరాక్, అఫ్గానిస్తాన్ విషయాల్లో అమెరికా జోక్యం చేసుకున్నప్పుడూ ప్రపంచం దారుణ విపరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధంలో భాగస్వాములుకావడం అంటే నిప్పుతో చెలగాటం ఆడినట్లే. రివాల్వర్లో ఒక బుల్లెట్ పెట్టి బుల్లెట్ చాంబర్ గిరగిరా తిప్పి కాల్చడం లాంటిది. బుల్లెట్ ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలీదు. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, ఏ దారుణ దిశగా వెళ్తుందో, ఎలాంటి విషాదాలను మిగుల్చుతుందో ఎవరూ ఊహించలేరు. తాజా పరిణామాలపై స్పెయిన్ ప్రభుత్వ వైఖరిని నాలుగు ముక్కల్లో చెప్పాలంటే మేం యుద్ధం అస్సలు చేయదల్చుకోలేదు’’ అని ఆయన స్పష్టంచేశారు. దక్షిణ స్పెయిన్లోని రోటా, మొరాన్ స్థావరాలను ఎప్పుడంటే అప్పుడు మేం వినియోగించుకోగలమని మంగళవారం ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘ ఈ స్థావరాలను ఉపయోగించకూడదు అని మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు’’ అని ట్రంప్ అన్నారు. యుద్ధంలో భాగస్వాములు కాకపోతే అత్యధిక టారిఫ్ల మోత, పరస్పర వాణిజ్యంపై ఆంక్షలు విధించడం వంటి చర్యలు తప్పవని ట్రంప్ హెచ్చరించడం తెల్సిందే. ట్రంప్ వ్యాఖ్యలపై స్పెయిన్ ఆర్థిక మంత్రి కార్లోస్ క్యూయెర్పో స్పందించారు. ‘‘ ప్రశాంతంగా ఉండాలని ట్రంప్కు సందేశం పంపిస్తా. ట్రంప్ బెదిరింపులకు దిగుతారుగానీ ఆచరణలో ఏమీ ఉండదు’’ అని కార్లోస్ ఎద్దేవాచేశారు. అమెరికాతో స్పెయిన్ ఎగుమతి, దిగుమతుల విలువ దేశ జీడీపీలో కేవలం 4.4 శాతానికి సమానం. స్పెయిన్కు ఆరో అతిపెద్ద ఎగుమతి మార్కెట్గా అమెరికా కొనసాగుతోంది. నాటో దేశాలు తమ జీడీపీలో 5 శాతానికి సమానమైన నిధులను రక్షణ బడ్జెట్ కోసం కేటాయించాలంటూ గతంలో అమెరికా చేసిన ప్రతిపాదననూ స్పెయిన్ ఆనాడే తీవ్రంగా తప్పుబట్టింది. బడ్జెట్ కేటాయింపులు ఏ మేరకు ఉండాలనేది తమ సొంత విషయమని తెగేసి చెప్పింది. దీంతో అధిక టారిఫ్లు విధిస్తానని ట్రంప్ ఆనాడే స్పెయిన్ను బెదిరించారు. -
" నేనే ఒత్తిడి చేసి ఉండవచ్చు"
ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్నాయి. టెహ్రాన్ సైతం తగ్గేదిలేదంటూ పెద్ద ఎత్తున ప్రతి దాడులు చేస్తోంది. అయితే మారణహోమం ఎలా మెుదలైందనే విషయంపై ట్రంప్ మాట్లాడారు. తమ మిత్రదేశం కోసమే అమెరికా యుద్ధం ప్రారంభించిందనే వ్యాఖ్యల్ని ఖండించారు. యుద్ధాన్ని తానే ప్రోత్సహించాననే విధంగా సమాధానం ఇచ్చారు.ఇరాన్పై అమెరికా "ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ" పేరుతో దాడులు ప్రారంభించింది. టెహ్రాన్పై విరుచుకపడుతూ ఆ దేశ సుప్రీం నేత ఆయాతుల్లా ఖమేనీ, ఆయన భార్యతో పాటు ఇతర కీలక నేతలను మట్టుబెట్టింది. ఈ దాడులలో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ చిన్నాభిన్నం అయ్యింది. అయితే ఈ యుద్ధంపై అమెరికా సెక్రటరీ మార్క్ రుబియో స్పందించారు. ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేయబోతుందని తెలిసిన తర్వాతే అమెరికా ఈ దాడులలో పాల్గొందన్నారు.అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం దీనిపై స్పందించారు." నాకు తెలిసి మెుదటగా ఇరాన్ దాడికి ప్రణాళికలు రచించింది. అయితే నేను అది జరగనివ్వకూడదు అనుకున్నా. అయితే ఈ సందర్భంలో నేను ఇజ్రాయెల్ని కొంత ఒత్తిడి చేసి ఉండవచ్చు" అన్నారు. అమెరికాలోని ఆయన అధ్యక్ష కార్యాలయంలో జర్మన్ ఛాన్సిలర్ ఫ్రెడరిక్ మెర్జ్తో ట్రంప్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ రక్షణ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందన్నారు. ఆ దేశానికి చెందిన నేవీ, ఎయిర్ఫోర్స్, రాడార్ సిస్టమ్స్ ఏవి ప్రస్తుతం పనిచేయడం లేదని తెలిపారు. అదే విధంగా ఖమేనీతో పాటు ఇతర కీలక నేతలు ఈ దాడులలో మృతి చెందారని ప్రకటించారు. అయితే ఇరాన్తో అణుచర్చలు విఫలమైతే ఈ సారి దాడి మరింతగా పెద్దగా ఉంటుందని తొలుత నుంచి ట్రంప్ హెచ్చరిస్తూ వచ్చారు.అయితే ప్రస్తుతం యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరాన్ గల్ప్ కంట్రీస్లోని అమెరికా స్థావరాలపై విరుచుకపడుతుంది. మరోవైపు ఇజ్రాయెల్పైనా బాలిస్టిక్ క్షిపణిలతో దాడి చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
‘ఆయుధాల్లేవ్’.. ట్రంప్ ఎదుట వాపోయిన అమెరికా సైన్యం?
వాషింగ్టన్: మీరేమో ఇరాన్పై యుద్ధం ఐదారు వారాలు కొనసాగిస్తాం’ అని అంటున్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే అలా కనిపించడం లేదు. పదిరోజుల్లో దాటితే దాడులు చేసేందుకు మన దగ్గర సరిపడ ఆయుధాలు లేవని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం ప్రతినిధులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎదుట వాపోయినట్లు తెలుస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్,ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ తన దాడులను తీవ్రతరం చేసింది. పశ్చిమాసియా దేశాల్లోని అమెరికా స్థావరాలు, రాయబార కార్యాలయాలే లక్ష్యంగా దాడులతో బీభత్సం సృష్టిస్తోంది. అమెరికా సైతం అదే స్థాయిలో దాడుల్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ట్రంప్కు పెంగటాన్ రిక్వెస్ట్ చేసింది. ఇరాన్పై దాడి చేస్తూ వెళితే 10రోజుల తర్వాత మిసైళ్లు లేవని తెలిపింది. ఇప్పటికే ఇంటర్ సెప్టార్ మిసైళ్ల కొరత ఉంది. ఇది ఇలాగే కొనసాగితే మనకే ప్రతికూల ప్రభావం పడుతుందని, యుద్ధానికి భారీగా ఖర్చవుతుందంటూ పెంటగాన్ వాపోతుంది’మరి ఆయుధాల కొరతపై ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారు. తదుపరి ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది చర్చాంశనీయంగా మారింది. ఇరాన్పై దాడులు, ఇటీవలి అనేక ఇతర సైనిక ప్రయత్నాల తర్వాత ఆయుధాల కొరత తగ్గించేలా పెంటగాన్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఆయుధాల ఉత్పత్తిని పెంచేందుకు ట్రంప్ పరిపాలన విభాగం వైట్ హౌస్లో అతిపెద్ద యుఎస్ రక్షణ కాంట్రాక్టర్ల కార్యనిర్వాహకులతో సమావేశం కావాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే ఇరాన్ హర్మూజ్ జలసంధిని దిగ్భందనం చేసింది. గీత దాటితే నౌకల కింద బాంబులు పెట్టి పేల్చేస్తానమి హెచ్చరిస్తోంది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన అంశంలో డొనాల్డ్ ట్రంప్ మాత్రం ప్రపంచానికి ఇంధన సరఫరాకు ఇబ్బంది లేకుండా చూస్తామని భరోసా కల్పిస్తున్నారు. హర్మూజ్ జలసంధిలో ప్రస్తుతం 700నౌకలు ఉన్నాయి. ఆ నౌకలు గమ్య స్థానానికి వెళ్లేలా తమ సైన్యం రక్షణ కల్పిస్తుందని చెబుతున్నారు. -
ట్రంప్ సంచలనం! ఇరాన్ ను తుడిచి పెట్టేసాం.. యుద్ధం ముగిసినట్టేనా ?
-
ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చ..! స్కిన్ క్రీములతో జర భద్రం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చ కనిపించడంలో సర్వత్రా రకరకాల ఊహగానాలు మొదలయ్యాయి. ట్రంప్ అనారోగ్యం పాలయ్యారా? అని యూఎస్ ప్రజానీకం చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైట్హౌస్ వివరణ ఇచ్చింది కూడా. ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చకు గల కారణాన్ని వైట్ హౌస్ వైద్యుడు సీన్ బార్బబెల్లా వెల్లడించారు. అది సాధారణ చర్మక్రీమ్ని ఉపయోగించడం వల్ల వచ్చిన అలెర్జీగా పేర్కొన్నారు. కొన్ని వారాలపాటు ఇలా ఉంటుందని కూడా అన్నారు. దీంతో ఒక్కసారిగా మనం సాధారణంగా వాడే స్కిన్ క్రీములు కూడా ఒక్కోసారి అలెర్జీకి దారితీస్తుందా అనే సందేహాలు వెల్లువెత్తాయి. అయితే దీని గురించి డెర్మటాలజిస్టులు ఏమంటున్నారంటే..మనం రెగ్యులర్గా వాడే స్కిన్ క్రీములు కూడా ఒక్కోసారి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు నిపుణులు. అదిగాక డీ హైడ్రేషన్ వల్ల, చర్మం పైపొర దెబ్బతిని ఇలా సమస్యలు ఉత్పన్నమవుతాయట. మనం రెగ్యులర్ రాసే ఈ క్రీమ్ సున్నితత్వానికి అలవాటుపడి కూడా ఇలా దద్దుర్లతో కూడిన ఇరిటేషన్ వస్తుంటుందని చెబుతున్నారు. కొందరి సున్నితమైన వ్యక్తుల్లో ఈ అలెర్జీ మరింత తీవ్రంగా ఉండొచ్చని కూడా అన్నారు. ఒక్కోసారి ఏజ్ పైబడటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి సన్నగిల్లినా..ఇలా ఎప్పుడూ రాసే స్కిన్ క్రీమ్ ప్రతిచర్య చూపించి చర్మ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయని అంటున్నారు. కొందరికి వెంటనే ఈ సమస్య చూపించగా, మరికొందరికి కనీసం 24 నుంచి 72 గంటల్లో ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. అందుకే మన శరీరానికి సరిపడే క్రీమ్ అయినా ప్రతిచర్య చూపిన వెంటనే కడిగేయాలని సూచిస్తున్నారు నిపుణులు. ఆ సమస్య తగ్గేంత వరకు ఆయా క్రీమ్లు వినియోగించకపోవడమే మేలు అని అంటున్నారు. ఇది అందరికీ ఒకేలా ఉండదు..కొందరికీ తక్కువ రియాక్టివ్ చర్మం ఉంటుంది.పదే పదే అదే క్రీమ్ వాడటం వల్ల ఆ సంరక్షణకు మించి చర్మానికి ఎఫెక్టివ్ క్రీమ్ అవసరమై ఇలా ప్రతిచర్య చూపించొచ్చు కూడా. అంతేగాదు కొందరికీ ఆ క్షణం అలెర్జీ వచ్చినా..ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే సమస్య తగ్గుముఖం పడుతుంది. అందువల్ల మన శరీరాని పడిన క్రీమ్ అని గుడ్డిగా అదే పనిగా రాసేయొద్దు..ఒక్కోసారి మనం వేరే ప్రాంతంలో ఉంటే అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా స్కిన్క్రీమ్ మార్చాల్సి ఉంటుందనే విషయం గుర్తెరగండి అని చెబుతున్నారు. అలాగే ఏ మాత్రం దురదగా..ఇబ్బందిగా అనిపించినా తక్షణమే ఆ ప్రదేశాన్ని నీళ్లతో శుభ్రపరుచుకుని ఆయా క్రీమ్లను కొద్దిరోజులపాటు వినియోగించకుండా ఉండటమే బెస్ట్ అని చెబుతున్నారు. ఒకరకంగా ఈ ఘటన స్కిన్క్రీమ్ల విషయంలో ఎంత జాగురకతతో వ్యవహరించాలో హైలెట్ చేసిందని చెబుతున్నారు చర్మ నిపుణులు.(చదవండి: బుల్లి ఫ్యాషన్ డిజైనర్..! జస్ట్ పదేళ్లకే..) -
అమెరికాతో చర్చలకు ఇరాన్ నో.. ట్రంప్ కు ఇరాన్ గట్టి కౌంటర్
-
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఖమేనీ రెండో కుమారుడు
టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా మోజ్తాబా హోస్సేనీ ఖమేనీ ఎన్నికయ్యారు. ఆయతుల్లా అలీ ఖమేనీ రెండవ కుమారుడే మోజ్తాబా.ఇరాన్ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం.. ఇరాన్ 88 మంది సభ్యుల అసెంబ్లీ ఎక్స్పర్ట్ కమిటీ మోజ్తాబాను ఎంపిక చేసింది. అసెంబ్లీ ఎక్స్పర్ట్ కమిటీ అంటే భారత్లో లోక్సభ,రాజ్యసభ సభ్యులని అర్ధం. మోజ్తాబా ఎన్నికలు ఐఆర్జీసీ ఒత్తిడి మేరకు అసెంబ్లీ ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులు మోజ్తాబాను నియమించినట్లు తెలుస్తోంది. ఖమేనీ రెండో కుమారుడు ఇరాన్ ప్రభుత్వంలో ఇంత వరకు ఎలాంటి అత్యున్నత పదవి చేపట్టలేదు. కానీ ఇరాక్-ఇరాన్ యుద్ధ సమయంలో ఇరాన్ సైన్యంలో సేవలందించారు.ఐఆర్జీసీతో బలమైన సంబంధాలు ఉన్ మోజ్తబా, ఇరాన్ సంప్రదాయవాద రాజకీయ నాయకురాలు, మాజీ పార్లమెంట్ చైర్మన్ ఘోలం-అలీ హద్దాద్-అదెల్ కుమార్తెను వివాహం చేసుకున్నారు. ఇటీవల అమెరికా -ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్లో ఇరాన్పై దాడి చేసినప్పుడు మోజ్తబా భార్య జహ్రా హద్దాద్-అదెల్ మరణించారు. -
ఇరాన్తో యుద్ధం.. అమెరికా చేస్తున్న ఖర్చు ఎంతో తెలుసా?
వాషింగ్టన్: ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్త దాడులు పతాక స్థాయికి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అంటూ యుద్ధ రూపాన్ని మారుస్తూ మరింత ముందుకు కొనసాగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటనతో ఇరాన్పై చేస్తున్న యుద్ధంలో అమెరికా రోజుకు ఎంత ఖర్చు చేస్తుందనే అంశంపై తెరపైకి వచ్చింది. అమెరికా తొలిరోజు ఇరాన్పై దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సహా పలువురు ముఖ్య నేతలు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆ దాడి కోసం అమెరికా అక్షరాల 779 మిలియన్ డాలర్లు.. భారత కరెన్సీలో రూ.6,900కోట్లు ఖర్చు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ లెక్క ప్రకారం ట్రంప్ ప్రకటించినట్లుగా ఇరాన్పై దాడులు నాలుగు లేదా ఐదు వారాలు అంతకంటే ఎక్కువ సమయం పడితే లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా.సెంటర్ ఫర్ న్యూ అమెరికన్ సెక్యూరిటీ డేటా ప్రకారం..క్యారియర్ స్ట్రైక్ గ్రూపులు (ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వంటివి) పనిచేయడానికి రోజుకు దాదాపు 6.5 మిలియన్లు (రూ.58 కోట్లు) ఖర్చయ్యాయి. అయతుల్లా అలీ ఖమేనీ, ఇతర కీలక వ్యక్తులను టార్గెట్ చేస్తూ అమెరికా జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ సహా రెండు యుద్ధ విమానాలను మొహరించింది. దీంతో పాటు విమానాలను తిరిగి తెచ్చుకోవడం, నేవి నౌకలను మోహరించడం, సైన్యాన్ని సిద్ధం చేసుకోవడంతో పాటు సైనికుల నిత్యవసరాలు, యుద్ధసామాగ్రి, యుద్ధంలో వినియోగించేందుకు ట్యాంకర్లు ఇతర వాహనాలకోసం వినియోగించే ఇంధనంతో పాటు వ్యవహారాల కోసం దాదాపు 630 మిలియన్ డాలర్లు (రూ.5,556 కోట్లు) ఖర్చైంది. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో భాగమైన పెన్ వార్టన్ బడ్జెట్ మోడల్ ఒక భాగం. దీని డైరెక్టర్, అమెరికా ప్రముఖ ఆర్థిక విశ్లేషకులలో ఒకరైన కెన్ స్మార్టర్ అంచనా ప్రకారం అమెరికా ఇరాన్పై దాడికి అక్షరాల రూ.18.87లక్షల కోట్లపైగా అయ్యే ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు.ఆ మొత్తం ఈ ఫిబ్రవరి నుంచి ప్రారంభమైన ఇరాన్పై అమెరికా దాడి కోసం చేసే ఖర్చు మాత్రమే కాదు.. 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసి దాదాపు 1,200 మందిని చంపి 251 మందిని బందీలుగా తీసుకున్నప్పటి నుండి, అమెరికా ఇజ్రాయెల్కు 21.7 బిలియన్ల సైనిక సహాయాన్ని అందించింది. ఇతర కార్యకలాపాల కోసం కోసం 9.65 బిలియన్ నుండి 12.07 బిలియన్ల వరకు ఖర్చు చేసింది. ఇలా మొత్తంగా కలిపితే..18లక్షల కోట్లు ఖర్చు అవుతుందని నివేదికలు హైలెట్ చేస్తుండగా.. ఇరాన్పై దాడికి అమెరికా ఎంత ఖర్చు చేస్తుందనే అధికారిక లెక్కలు విడుదల కావాల్సి ఉంది. -
ఇరాన్ నౌకను కూల్చింది మేమే: అమెరికా
ఇరాన్, ఇజ్రాయెల్ -అమెరికా మధ్య భీకర యుద్ధం నడుస్తోంది.. -
డొనాల్డ్ ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చ.. వైట్హౌస్ క్లారిటీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెడపై ఉన్న ఎర్రటి మచ్చ కనిపించడంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. దీంతో ఆయన ఆరోగ్యంపై ఊహగానాలు మొదలయ్యాయి. ట్రంప్కు ఏమైనా జరిగిందా అని.. ఆయన ఆరోగ్యంపై యూఎస్ ప్రజానీకం చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైట్హౌస్ క్లారిటీ ఇచ్చింది. ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చకు గల కారణాన్ని వైట్ హౌస్ వైద్యుడు వైట్ హౌస్ వైద్యుడు వివరించాడు.ఇది సాధారణ చర్మ వ్యాధి చికిత్స వల్లే ఏర్పడిందని అని వైట్ హౌస్ వైద్యుడు సీన్ బార్బబెల్లా స్పష్టం చేశాడు. అందువల్లే ఎర్రటిమచ్చ ఏర్పడిందని తెలిపాడు. ఈ మచ్చ తీవ్రమైన అనారోగ్యం వల్ల వచ్చింది కాదని.. సాధారణ చర్మ చికిత్స క్రీమ్ను ఉపయోగించడం వల్ల వచ్చిందని స్పష్టం చేశారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని వెల్లడించారు. కాగా.. సోమవారం మెడల్ ఆఫ్ ఆనర్ వేడుక సందర్భంగా ట్రంప్ చొక్కా కాలర్ పైన ఉన్న ఎర్రటి మచ్చ సోషల్ మీడియాలో తెగ వైరలైంది. దీంతో ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే డాక్టర్ బార్బరా బెల్లా క్లారిటీ ఇచ్చారు.గతేడాది ట్రంప్ వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్లో రెండుసార్లు వైద్య పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని డాక్టర్ బార్బరా బెల్లా పేర్కొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం ప్రస్తుతం సాధారణంగా ఉందని .. ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైట్ హౌస్ పేర్కొంది. -
సోషల్ మీడియాలో మోదీ దూకుడు.. సాటెవ్వరు..
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు యూట్యూబ్లో మోదీ మరో ఘనత సాధించారు. 30 మిలియన్ల (3 కోట్ల) సబ్స్క్రైబర్లు ఉన్న ప్రపంచ నేతగా మైలురాయిని చేరుకున్నారు. ప్రపంచంలో ఏ నేతకూ ఇంతమంది సబ్స్క్రైబర్లు లేరు. ఈ జాబితాలో మోదీ తర్వాతి స్థానంలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బొల్సొనారో (6.58 మిలియన్ల సబ్స్క్రైబర్లు ) ఉన్నారు. అయితే, బొల్సొనారోకు ఉన్న ఫాలోవర్లు మోదీకి ఉన్న ఫాలోవర్లలో నాలుగింట ఒకవంతు మాత్రమే.అలాగే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే మోదీకి ఉన్న సబ్స్క్రైబర్లు ఏడు రెట్లు. ఇక భారత్లోని నేతల విషయానికి వస్తే కూడా ఫాలోవర్ల విషయంలో మోదీదే ఆధిపత్యం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కంటే మోదీకి ఉన్న సబ్స్క్రైబర్ల సంఖ్య మూడురెట్లు ఎక్కువ. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కంటే మోదీకి ఉన్న సబ్స్క్రైబర్లు నాలుగేసి రెట్ల చొప్పున అధికం.మోదీకి యూట్యూబ్లో 30 మిలియన్ల (3 కోట్ల) సబ్స్క్రైబర్లతో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లోనూ భారీగా ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో మోదీకి 100 మిలియన్ల (10 కోట్ల) మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ప్రపంచ నేతగా ఆయన నిలిచారు.మోదీ ఇన్స్టాగ్రామ్లో 2014లో జాయిన్ అయ్యారు. డొనాల్డ్ ట్రంప్నకు ఉన్న ఫాలోవర్ల కంటే మోదీకి రెట్టింపు మంది ఫాలోవర్లు ఉన్నారు. ట్రంప్నకు ఇన్స్టాలో 43.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇండొనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు 15 మిలియన్లు, బ్రెజిల్ అధ్యక్షుడు లులాకు 14.4 మిలియన్లు, తుర్కియే అధ్యక్షుడు ఎర్డొగాన్కు 11.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. భారత్లో మోదీ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. యోగికి ఇన్స్టాలో 16.1 మిలియన్ల మంది, రాహుల్ గాంధీకి 12.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. -
తగ్గేదేలే అంటున్న ట్రంప్.. చుక్క చమురు బయటకు రాదని ఇరాన్ వార్నింగ్
-
బాంబుల మోతతో వణికిపోతున్న గల్ఫ్
-
ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలనం
వాష్టింగన్: పశ్చిమాసియాలో అంతకంతకూ ఉద్రిక్తలు పెరుగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్నికి ఆజ్యం పోశారు. ఇరాన్ దాడులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు కంబాట్ దాడులే చేశాం. అవసరమైతే అమెరికా సైన్యాన్ని ఇరాన్కు పంపిస్తాం. ప్రత్యక్ష యుద్ధం చేస్తాం’అని స్పష్టం చేశారు. ఇరాన్పై కొనసాగుతున్న దాడులపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ ప్రతిసారి అబద్ధం చెబుతోంది. ఇరాన్ దగ్గర అమెరికాను టార్గెట్ చేసే మిసైల్ వ్యవస్థ ఉంది. ఇరాన్ నాయకత్వం లొంగిపోయేందుకు సిద్ధంగా ఉంది. ఇరాన్లో ఆపరేషన్ ఫ్యూరీ కొనసాగుతుంది.అణ్వాయుధాల తయారీని ఇరాన్ ఆపడం లేదు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. ఖమేని మరణంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్కు చెందిన మొత్తం యుద్ధ నౌకల్ని ధ్వంసం చేశాం. ఆదేశంపై మరిన్ని దాడులు జరుపుతాం.ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేస్తాం. ఇప్పటికే ఇరాన్ నావికాదళాన్ని తుడిచిపెట్టాం. ఇరాన్ క్షిపణి కేంద్రాలను భూగర్భంలో కొండల మధ్య దాచింది. అమెరికా,ఇజ్రాయెల్ సైన్యాలకు పెనుసవాల్గా మారింది. లక్ష్యాలను సాధించడానికి నాలుగు నుంచి ఐదు వారాల సమయం పడుతుంది. అవసరమైతే గ్రౌండ్ ట్రూప్స్ పంపడానికి వెనకాడబోం. ఇవాళ రాత్రంతా ఇరాన్పై దాడులు జరుపుతాం’అని హెచ్చరించారు.ఇజ్రాయెల్,అమెరికా లక్ష్యంగా ఇరాన్ దాడుల్ని తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో సౌదీ రియాద్లో యూఎస్ ఎంబీసీపై ఇరాన్ రెండు డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడులతో రాయబార కార్యాలయం అగ్నికి ఆహుతైంది. అమెరికా ఎంబసీపై ఇరాన్ దాడిని ట్రంప్ ఖండించారు. ఇరాన్కు గట్టి బుద్ధి చెబుతాం. ప్రతీకారం ఎలా ఉంటుందో చూపిస్తాం’అని పునరుద్ఘాటించారు. -
తీవ్రరూపం దాలుస్తున్న పశ్చిమాసియా యుద్ధం... ఇరాన్కు అండగా బరిలోకి మిలిటెంట్ గ్రూపులు...
-
పశ్చిమాసియా మంటలు!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూల బాధ్యతారహిత చర్యతో ఒక్కసారిగా పశ్చిమాసియా నిప్పులకొలిమైంది. శనివారం ఉదయం ఒక పథకం ప్రకారం ఇజ్రాయెల్, అమెరికా సైనిక బలగాలు ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా అనేక నగరాలు, పట్టణాలపై బాంబులతో, క్షిపణులతో విరుచుకుపడి ఆరంభంలోనే ఇరాన్ మత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీతోపాటు ఆయనతో చర్చిస్తున్న కీలకమంత్రులు, రక్షణరంగ బాధ్యులతో సహా దాదాపు 30 మందిని హత మార్చాయి. పర్యవసానంగా యుద్ధం ఆరంభమైన మూడో రోజుకే ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియా దేశాలన్నీ భగ్గున మండుతున్నాయి. అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా సాగుతున్న ఈ దాడులతో కోట్లాదిమంది ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టు కుని ఉన్నారు. మంగళవారం విమాన రాకపోకలు మొదలెడతామని దుబాయ్ అంటు న్నది. సాధ్యాసాధ్యాలపై సంశయాలున్నాయి.సాధారణంగా యుద్ధం తొలి దశలో దేశాధినేతలు, ఇతర కీలక బాధ్యుల జోలికి పోరు. చర్చలకు రప్పించటం, రాజీ తప్ప మరే మార్గమూ లేదన్న అభిప్రాయం కలిగించడం దీని వెనకుండే వ్యూహం. కానీ ట్రంప్, నెతన్యాహూల దుందుడుకుతనం ఆ అవ కాశానికి శాశ్వతంగా తలుపులు మూసింది. అందుకే యుద్ధం ఎడతెగకుండా సాగుతుందన్న అభిప్రాయం బలపడుతోంది. బాలలపై లైంగిక నేరాలకు పాల్పడ్డ ఎప్స్టీన్తో ఉన్న నీతిబాహ్య సంబంధాలు బట్టబయలు కావటం, స్వీయ తప్పిదాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థ దివాలా స్థితికి చేరుకుని సాధారణ ప్రజానీకం దుర్భరమైన స్థితిలో బతుకీడ్వటంవంటి పరిణామాల నేపథ్యంలో వచ్చే నవంబర్ మధ్యంతర ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి ట్రంప్ ఈ దుస్సాహసానికి తెగించారు. అటు పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి పదవీభ్రష్టత్వం, జైలు తప్పవని బెంగటిల్లుతున్న నెతన్యాహూ సరిజోడీ అయ్యారు. ఇద్దరికిద్దరూ ప్రపంచాన్ని ప్రమాదపుటంచుల్లోకి నెట్టారు. అంతక్రితం మాటెలా ఉన్నా పశ్చిమాసియాకు సంబంధించి అమెరికా మూడున్నర దశాబ్దాలుగా కట్టుకథలతో కాలక్షేపం చేస్తోంది. అకారణంగా దాడులకు దిగుతూ, జనహననానికి పాల్పడుతూ తప్పుడు సాకులు వెదుకుతోంది. మొదట ఇరాక్–కువైట్ల మధ్య చిచ్చురగిల్చి, ఆ తర్వాత ఇరాక్ను అదుపు చేయడానికంటూ 1990–91లో ‘ఆపరేషన్ డిజర్ట్ స్టార్మ్’ పేరిట అమెరికా విరుచుకుపడింది. కనీసం అప్పుడు భద్రతా మండలి అనుమతి తీసుకుంది. 35 దేశాలను తోడుతెచ్చుకుంది. అసత్యాలే చెప్పినా దేశ ప్రజలనుద్దేశించి సీనియర్ బుష్ నాలుగు దఫాలు ప్రసంగించారు. కానీ చివరకు అదంతా అమెరికా మాయోపాయం వల్లే జరిగిందని ఆలస్యంగా గ్రహించిన చాలా దేశాలు సీనియర్ బుష్ కుమారుడు జార్జి డబ్ల్యూ బుష్ ఆధ్వర్యంలో సాగిన 2003 నాటి ‘ఆపరేషన్ ఇరాకీ ఫ్రీడమ్’ యుద్ధానికి మొహం చాటేశాయి. ‘జీవ రసాయన ఆయుధాల’ సాకుతో జరిపిన ఆ యుద్ధానికి బ్రిటన్, పోలెండ్, ఆస్ట్రేలియాలు మాత్రమే సహకరించాయి. భద్రతామండలి ఆమోదం దక్కలేదు. 2015 నాటికి ‘జీవ రసాయన ఆయుధాలు’ కూడా బూటకమని తేలింది. అందుకే కావొచ్చు... ట్రంప్ భద్రతామండలి సంగతలా ఉంచి, కనీసం చట్ట ప్రకారం అమెరికా ప్రతినిధుల సభ అనుమతి సైతం తీసుకోకుండా ఇప్పుడు చిచ్చు రగిల్చారు. ప్రపంచంలో జరిగే ఏ యుద్ధంలోనూ తలదూర్చబోనని హామీ ఇచ్చి ట్రంప్ గద్దెనెక్కారు. తీరా అందుకు విరుద్ధమైన పోకడలుపోతున్నారు. వాస్తవానికి అమెరికా–ఇరాన్లు ఒప్పందానికి చేరువలోవున్నాయని మధ్యవర్తి ఒమన్ ప్రకటించింది. కానీ 24 గంటలు గడవకుండానే ఏకపక్షంగా ట్రంప్ ఈ దుస్సాహసానికి తెగబడ్డారు. ఇరాన్తో స్నేహం నటిస్తూనే సౌదీ ద్రోహం చేసిందనీ, ఖమేనీపై దాడి వెనక దాని పాత్ర ఉన్నదనీ మీడియా కథనం. తమ సైనిక స్థావరాలుంటే ఇరుగుపొరుగు కన్నెత్తి చూడరని చెబుతూ 80వ దశకం నుంచి గల్ఫ్ దేశాలన్నిటా అమెరికా వాటిని నెలకొల్పింది. ఇరాన్ ప్రతీకార దాడులు అదంతా భ్రమగా తేల్చాయి. ఇప్పుడు హోర్మూజ్ జలసంధి మూతబడింది. ట్రంప్– నెతన్యాహూ ద్వయం కదిలించిన ఈ తేనెతుట్టె ఇంకెన్ని పరిణామాలకు దారి తీస్తుందో,ఎంత జన నష్టానికీ, విధ్వంసానికీ కారణమవుతుందో చూడాల్సి ఉంది. -
ఇరాన్పై మరిన్ని దాడులు.. డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
ఇరాన్ మాతో చర్చలకు సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాము చేసిన దాడుల్లో ఇప్పటికే సైనిక ఉన్నతాధికారులు పెద్దసంఖ్యలో మరణించారని తెలిపారు. ఇరాన్పై ఆపరేషన్ ఫ్యూరీ కొనసాగుతుందని అన్నారు. తాము ఇంకా దాడులు ఉధృతం చేయలేదని అన్నారు. త్వరలోనే దాడులు మరింత తీవ్రతరం చేస్తామని ఇరాన్ హెచ్చరించారు.ఇరాన్ ప్రతిసారి అబద్ధాలు చెబుతోందని ట్రంప్ అన్నారు. ఈ యుద్ధం మరో 4 నుంచి ఐదు వారాల పాటు కొనసాగుతందని స్పష్టం చేశారు. ఇరాన్ను మా బలగాలు తరిమికొట్టాయని తెలిపారు. ఇరాన్కు చెందిన 10 వార్షిప్లను అమెరికా ధ్వంసం చేసిందని వెల్లడించారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడి చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని ట్రంప్ అన్నారు. ఇవాళ రాత్రంతా ఇరాన్పై దాడులు జరుపుతామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. -
ఇరాన్పై దాడులు.. నెతన్యాహు ఒత్తిడికి తలొగ్గిన ట్రంప్..!
ఇరాన్పై దాడుల వెనక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒత్తిడి ఉందా? నిజానికి చర్చలతో ఇరాన్ను దారికి తీసుకువద్దామనుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం నెతన్యాహు ఒత్తడికి తలొగ్గాడా? తాను సంయమనం పాటిద్దామనుకున్నా.. నెతన్యాహు ఆగేలా లేడని తెలిసి.. అతనికి జైకొట్టాడా? గడిచిన నెల రోజుల్లో మారిన పరిణామాలన్నీ ఈ ప్రశ్నలకు ఔననే సమాధానం చెబుతున్నాయి. అసలు ఏం జరిగింది? ఉన్నఫళంగా ఇరాన్పై ఉరుము ఉరిమినట్లుగా ఫైటర్ జెట్లు విరుచుకుపడడం.. సుప్రీంలీడర్ ఖమేనీని అంతమొందించడం వెనక అసలు వ్యూహం ఎవరిది? నోబెల్ శాంతి బహుమతి కోసం తహతహలాడుతున్న ట్రంప్.. చర్చల ద్వారా ఇరాన్ను దారికి తీసుకురావాలనుకున్నారు. ఈ ఏడాది జనవరిలో ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చెలరేగినప్పుడు.. ట్రంప్ నిరసనకారులకు బేషరతుగా మద్దతిచ్చారు. నిరసనలను అణిచివేస్తే.. ఇరాన్పై దాడి చేస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేశారు. ఫలితంగా.. ఉరిశిక్ష పడ్డ పలువురు ఆందోళనకారులకు ఆ శిక్ష నుంచి విముక్తి లభించింది. గత ఏడాది జూన్లో అమెరికా దళాలు ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు జరిపిన విషయం తెలిసిందే..! అదే సమయంలో ఇజ్రాయెల్తో కలిసి.. ఇరాన్ అగ్రశ్రేణి జనరల్స్ను హతమార్చింది. ఈ నేపథ్యంలో.. ట్రంప్ కన్నెర్ర చేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఊహించిన పశ్చిమాసియాలోని గల్ఫ్ దేశాలు దౌత్యపరమైన పరిష్కారం కోసం ముందుకు వచ్చాయి.నిజానికి ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైన ఇరాన్లో ప్రజాందోళనలతో పరిస్థితులు దిగజారాయి. దాంతో.. ఇప్పటికిప్పుడు ఇరాన్ నుంచి ఇటు అమెరికాకు గానీ, అటు ఇజ్రాయెల్కి గానీ ముప్పు లేదని ట్రంప్కు తెలుసు. అందుకే ట్రంప్ దౌత్య మార్గంలో వెళ్దామని భావించారు. ఇరాన్ నేతలు తెరవెనక నుంచి అమెరికాలో ట్రంప్, ఇజ్రాయెల్లో నెతన్యాహు ప్రభుత్వాలను కూల్చివేసేందుకు కుయుక్తులు పన్నుతున్నా.. ఇజ్రాయెల్లో ఈ ఏడాది చివర్లో జరగనున్నఎన్నికల్లో నెతన్యాహును దింపేందుకు వ్యూహాలు చేస్తున్నా.. ట్రంప్ మాత్రం చర్చల వైపే మొగ్గుచూపారు. గత నెల 26న స్విట్జర్లాండ్లో అమెరికా-ఇరాన్ చర్చలు కొంత వరకు పురోగతిని సాధించాయనే చెప్పవచ్చు. దీంతో.. వచ్చేవారం వియన్నాలో చర్చలకు షెడ్యూల్ను ప్రకటించారు. ఇందుకు ఒమన్ మధ్యవర్తిత్వం వహించింది. చర్చల వైపు ట్రంప్ మొగ్గుచూపుతూ.. ముందుకు సాగుతుంటే.. ఇజ్రాయెల్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. ఏ క్షణమైనా దాడి చేద్దామంటూ అమెరికాపై నెతన్యాహు ఒత్తిడి పెంచారు. ఇరాన్తో దౌత్యం సరికాదంటూ నచ్చజెబుతూ వచ్చారు. ఇరాన్ వైఖరిలో ఏమాత్రం మార్పు రాదని.. గత ఏడాది జూన్లో అణుకేంద్రాలపై దాడులు చేసినా.. ఇప్పుడు మళ్లీ న్యూక్లియర్ ప్రోగ్రామ్లను కొనసాగిస్తోందని హెచ్చరించారు. ఇజ్రాయెల్ దూకుడుతో ట్రంప్ ముందస్తు రక్షణ ఏర్పాట్లు చేశారు. ఇజ్రాయెల్కు అండగా.. గత నెల 24న యూఎస్ నేవీ ఏవియేషన్ను ఇజ్రాయెల్కు పంపారు. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ను అరేబియా సముద్రంలో మోహరించారు. అమెరికా ఇంతలా సహకరించినా.. ఇజ్రాయెల్ మాత్రం తనకు ఇరాన్ బద్ధశత్రువని.. గుణపాఠం చెప్పాల్సిందేనని భీష్మించుకుంది. ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్లో యుద్ధాలు తగదని చరిత్ర చెబుతున్నా.. నెతన్యాహు తన మొండిపట్టును వీడలేదు. చివరికి శుక్రవారం అర్ధరాత్రి దాటాక.. ఇరాన్పై ఇజ్రాయెల్ వాయుసేన భీకర దాడులు జరిపింది. ఆ తర్వాత పెద్దన్న అమెరికా కూడా యుద్ధంలో జతకట్టక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత ఇజ్రాయెల్ దాడులు జరిపాకే.. అమెరికా ఈ యుద్ధంలో పాల్గొనడం గమనార్హం..! అయితే.. అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మాత్రం.. అమెరికా వ్యూహంలో భాగంగానే ఇజ్రాయెల్ తొలి దాడి చేసినట్లు చెబుతున్నారు. ఎందుకంటే.. ఇరాన్ ప్రతిదాడి నేరుగా పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపైనే ఉంటుంది. ఈ నేపథ్యంలో తప్పించక తానొవ్వక అన్నట్లుగా వ్యవహరించాలనేది ట్రంప్ వ్యూహమని వివరిస్తున్నారు. ఏది ఏమైనా.. అటు ఇజ్రాయెల్.. ఇటు అమెరికా ఆశించిన ఫలితాలను ఈ దాడులు అందజేశాయి. ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా ఖమేనీతోపాటు.. మాజీ అధ్యక్షుడు అహ్మదీ నేజాద్, ఇతర మిలటరీ నాయకులు కూడా ఈ దాడులతో నేలకొరిగారు. -
ఇరాన్పై ట్రంప్ ప్లానేంటి.. ఇరాక్ పరిస్థితి వస్తుందా?
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని టార్గెట్ చేసి అమెరికా, ఇజ్రాయెల్.. అగ్రనేతను మట్టుబెట్టాయి. ప్రత్యర్థి దాడిలో ఖమేనీ అత్యంత సులువుగా హత్యకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇరాన్పై అమెరికా దాడులు కొనసాగుతాయా?. ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యం నెరవేరిందా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మరి ఇరాన్ ప్రాక్సీ గ్రూపుల సంగతేంటి?. ఖమేనీ మృతిపై పగ తీర్చుకునేందుకు ఇరాన్ ఎలాంటి ప్లాన్ చేస్తోంది. భవిష్యత్లో అమెరికా ఎదుర్కొవాల్సిన పరిస్థితులేంటి?. 2003 నాటి ఇరాక్ యుద్దం ఏం చెబుతోంది? అని సంగతులు తెలియాల్సిందే.. సుప్రీం లీడర్ ఖమేనీ దశాబ్దాల పాటు తిరుగులేని రీతిలో ఇరాన్ను శాసించిన అగ్రనాయకుడు. 1989లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ(86) మరణించడంతో, ఆయన వారసుడిగా.. ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్’ (మత పెద్దల మండలి) అయతుల్లా అలీ ఖమేనీని ఎంపిక చేసింది. తదుపరి 30 ఏళ్లలో ఖమేనీ పార్లమెంటు, న్యాయవ్యవస్థ, పోలీసులు, మీడియా, మతపరమైన ఉన్నత వర్గాలతో సహా, తనకు విధేయులైన వారి నెట్వర్క్లను అభివృద్ధి చేసుకున్నారు. ప్రజలలో తన పట్ల భక్తిభావాన్ని పెంపొందించుకోవడానికి ఖమేనీ వ్యక్తిత్వ ఆరాధనను ప్రోత్సహించారు. రాజకీయ అణచివేత, ప్రత్యర్థుల అక్రమ అరెస్టులూ జరిగాయి. ఆయన చాలా అరుదుగా విదేశాలకు వెళ్లేవారు. ఖమేనీ తన భార్య, ఆరుగురు పిల్లలు, మనవరాళ్లు, మనవళ్లతో కలిసి సెంట్రల్ టెహ్రాన్లోని ఒక నివాస సముదాయంలో చాలా నిరాడంబరంగా జీవించేవారని రిపోర్టులున్నాయి.1999లో విద్యార్థుల నిరసనలు ఆయన అధికారానికి ముప్పుగా మారినప్పటికీ, వాటిని అణచివేయగలిగారు. ఒక దశాబ్దం తర్వాత, అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని కొందరు తిరుగుబాటు చేయడంతో, వారిపై పెప్పర్ స్ప్రే వాడటం, కొట్టడం, కాల్పులు జరపడం వంటివి జరిగాయి. 2019లో ఇంధన ధరల పెరుగుదల కారణంగా నిరసనలు మిన్నంటినప్పుడు, చట్టవిరుద్ధమైన ప్రదర్శనలను అడ్డుకోవడానికి ఖమేనీ రోజులు తరబడి ఇంటర్నెట్ను నిలిపివేశారు. మహిళా విద్యపై గత పాలకులు విధించిన అడ్డంకులను ఖమేనీ తొలగించారు. కానీ, ఆయనకు లింగ సమానత్వంపై ఏమాత్రం నమ్మకం లేదు. హిజాబ్ ధరించడానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన మహిళలను అరెస్టు చేసి, చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా ఏకాంత కారాగారంలో ఉంచారు. వారికి మద్దతు ఇచ్చిన వారిని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఒక మానవ హక్కుల న్యాయవాదికి 38 ఏళ్ల జైలు శిక్ష, 148 కొరడా దెబ్బల శిక్ష విధించారు.అమెరికాతో వివాదాలుఅమెరికాపై సెప్టెంబర్ 11 (2001) దాడుల తర్వాత, అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్ ఇరాన్ను విమర్శించారు. ఖమేనీ వాషింగ్టన్తో అటు రాజీ పడకుండా, ఇటు నేరుగా యుద్ధానికి దిగకుండా చాలా జాగ్రత్తగా విదేశీ విధానం అమలుచేశారు. అమెరికాతో అత్యంత ఘర్షణ వాతావరణం నెలకొన్న అంశం అణ్వాయుధాలు. ఇరవై ఏళ్ల కిందట ఖమేనీ.. అణ్వాయుధాలు ఇస్లాంకు వ్యతిరేకమని ప్రకటిస్తూ, వాటి అభివృద్ధిని నిషేధిస్తూ ఒక ‘ఫత్వా’ జారీ చేశారు. కానీ, ఆయన పాలనలో ఇరాన్ రహస్యంగా అణు ఆయుధ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తోందని ఇజ్రాయెల్, పాశ్చాత్య దేశాలు బలంగా నమ్మాయి.2018లో ట్రంప్ అణు ఒప్పందం నుంచి వైదొలిగి, ఇరాన్ను కొత్త ఒప్పందానికి తీసుకువచ్చేందుకు ఆంక్షలు విధించారు. రెండు సంవత్సరాల తర్వాత, సుప్రీం లీడర్కు అత్యంత సన్నిహితుడైన టాప్ రివల్యూషనరీ గార్డ్స్ జనరల్ ఖాసీం సులేమానీని ఇరాక్లో హతమార్చాలని అమెరికా అధ్యక్షుడు ఆదేశించారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఖమేనీ ప్రతిజ్ఞ చేయడమే కాకుండా, రష్యా, చైనాలతో మరింత సన్నిహితంగా మెలిగారు. అలాగే, జూన్ 2025లో ఇరాన్ అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణి నిల్వలు, అగ్రశ్రేణి సైనిక కమాండర్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దళాలు దాడి చేసినప్పుడు, ఇరాన్ ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ నగరాలపైకి క్షిపణుల వర్షం కురిపించింది.ఈ యుద్ధంలో అమెరికా కూడా చేరి, ఇరాన్లోని మూడు కీలక అణు కేంద్రాలపై దాడులు చేసినప్పుడు, ఖమేనీ లొంగిపోబోనని శపథం చేశారు. అనంతరం, ఇరాన్ తన అణు కార్యక్రమంపై కొత్త ఒప్పందానికి అంగీకరించకపోతే దాడులు చేస్తామని హెచ్చరించారు. కానీ, ఖమేనీ యురేనియం శుద్ధిని ఆపడానికి నిరాకరించారు. దీంతో, ట్రంప్ ఆ ప్రాంతంలో అమెరికా సైనిక బలాన్ని పెంచాలని ఆదేశించారు. అనంతం, దాడుల్లో ఖమేనీ సహా కీలక నేతలు మృతి చెందారు.ట్రంప్ ప్లానేంటి? ఆత్మరక్షణ కోసమే ఇరాన్పై దాడులు చేస్తున్నట్లు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ప్రకటించాయి. అయితే ఇరాన్ మిలిటరీ బలాన్ని యూఎస్, ఇజ్రాయెల్తో పోలిస్తే అది పోటీనే కాదు. అలాంటప్పుడు ఇది ఆత్మరక్షణ ఎలా అవుతుందనేది ప్రశ్న. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ఇరాన్ మొత్తం ప్రపంచానికే ముప్పు అని తన వీడియో సందేశంలో ప్రకటించడం గమనార్హం. ఇప్పుడు ఖమేనీ మృతితో ట్రంప్ ఏం చేస్తారు. అక్కడి కొత్త ప్రభుత్వం దిశగా ప్లాన్ చేస్తారా? కొత్త నాయకుడిని ఏర్పాటు చేస్తారా?. అయితే, ఇరాన్లో నాయకత్వ మార్పు అకస్మాత్తుగా జరిగే అవకాశం లేదు. ఇరాన్ వ్యవస్థ కూలిపోవడం కష్టమే. మతపెద్దలు, IRGC (Islamic Revolutionary Guard Corps) ముందుగానే contingency plans సిద్ధం చేసుకోవడం వల్ల, నాయకత్వం మారినా వ్యవస్థ కొనసాగుతుంది. ఇరాన్ వ్యవస్థ వ్యక్తి ఆధారంగా కాకుండా, సంస్థాగతంగా నిర్మించబడింది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ ఏం చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఇరాన్ ఏం చేయనుంది?.ఖమేనీ మృతి పట్ల ఇరాన్ చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ఇజ్రాయెల్, అరబ్ దేశాలను టార్గెట్ చేసింది. అమెరికాను సైతం హెచ్చరించింది. ప్రతి దాడులు చేస్తామని.. పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. అందులో భాగంగానే ఇరాన్.. ఇప్పటికే సౌదీ అరేబియా, దుబాయ్, ఇజ్రాయెల్, బహ్రెయిన్ దేశాలపై దాడులు చేస్తోంది. ఇరాన్తోడు తాజాగా హెచ్బొల్లా దళాలు కూడా రంగంలోకి దిగి ఇజ్రాయెల్పై దాడులు చేస్తున్నాయి. దీంతో, ఇరాన్కు మద్దతు పెరిగి మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది.ఇరాన్ ప్రాక్సీ నెట్వర్క్లుఇరాక్లోని మిలీషాలు, యెమెన్లోని హౌతీలు వంటి గ్రూపులు బలహీనపడినప్పటికీ ఇంకా చురుకుగా ఉన్నాయి. వీటి ప్రధాన పాత్ర.. అమెరికా బేస్లు, ఇజ్రాయెల్ లక్ష్యాలు, గల్ఫ్ ప్రాంతంలో అస్థిరత సృష్టించడం. హౌతీలు గతంలో కూడా రెడ్ సీ షిప్పింగ్ మార్గాలను దాడి చేశారు, ఇది ప్రపంచ వాణిజ్యానికి పెద్ద సవాలుగా మారింది. మరోసారి ఇలాంటి దాడులు జరిగితే తీవ్ర నష్టం వాటిల్లనుంది.2003 ఇరాక్ యుద్ధం (Operation Iraqi Freedom)2003 మార్చి 20న అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ నేతృత్వంలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, పోలాండ్ వంటి దేశాలు ఇరాక్పై దాడి చేశాయి. ఇరాక్ వద్ద Weapons of Mass Destruction (WMDs) ఉన్నాయని, అలాగే అల్-ఖైదా వంటి ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇస్తోంది అనే ఆరోపణలతో దాడులు చేశాయి. కేవలం మూడు వారాల్లోనే అమెరికా నేతృత్వంలోని బలగాలు బగ్దాద్లోకి ప్రవేశించి, సద్దాం హుస్సేన్ 30 ఏళ్ల పాలనను ముగించాయి. ఏప్రిల్ 2003లో బగ్దాద్లోని సద్దాం విగ్రహాన్ని కూల్చడం యుద్ధానికి ప్రతీకగా నిలిచింది. దీంతో, సద్దాం హుస్సేన్ పాలన ముగిసింది. యుద్ధం తర్వాత ఇరాక్లో సెక్టారియన్ హింస, ఉగ్రవాదం, ISIS ఉద్భవం వంటి సమస్యలు పెరిగాయి. 2003–2011 మధ్య US బలగాలు ఇరాక్లో ఉండి, చివరికి వెనక్కి వెళ్లాయి. అయితే, ఇలాంటి పరిస్థితులు ఇరాన్లో ఉండకపోవచ్చు.ఇరాక్ vs ఇరాన్ పోలికఇరాక్ (2003): వ్యక్తి ఆధారిత పాలన (సద్దాం హుస్సేన్). నాయకుడిని తొలగించగానే వ్యవస్థ కూలిపోయింది.ఇరాన్ (ప్రస్తుత వ్యవస్థ): వ్యక్తి ఆధారంగా కాకుండా, మతపెద్దల సంస్థాగత వ్యవస్థ. ఒక నాయకుడు లేకపోయినా, Assembly of Experts, Guardian Council, IRGC వంటి సంస్థలు పాలన కొనసాగిస్తాయి. అందువల్ల, ఇరాన్ను ఇరాక్లా త్వరగా కూల్చడం కష్టమవుతుంది. -
‘ఒక్క దెబ్బకు..’ ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: మిడిల్ ఈస్ట్లో యుద్ధ జ్వాలలు మిన్నంటుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా చేపట్టిన మెరుపు దాడుల్లో ఇరాన్కు చెందిన 48 మంది అగ్రశ్రేణి నేతలు ఒకేసారి హతమయ్యారని ట్రంప్ పేర్కొన్నారు. ఫాక్స్ న్యూస్ ప్రతినిధులతో మాట్లాడిన ట్రంప్.. ఈ ఆపరేషన్ ఊహించిన దానికంటే వేగంగా, అత్యంత విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు. ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా సాగిన ఈ దాడులు ఆ దేశ నాయకత్వాన్ని కోలుకోలేని దెబ్బ తీశాయయన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ నూతన నాయకత్వం తమతో చర్చలకు సిద్ధమనే సంకేతాలు పంపిందని ట్రంప్ పేర్కొన్నారు.గతంలోనే చర్చలకు రావాల్సింది పోయి మొండిగా వ్యవహరించిన ఇరాన్.. ఇప్పుడు దిగి రాక తప్పని పరిస్థితి ఏర్పడిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ నౌకాదళాన్ని అమెరికా బలగాలు నామరూపాల్లేకుండా చేశాయని అన్నారు. ఇరాన్కు చెందిన తొమ్మిది భారీ యుద్ధనౌకలను సముద్రంలో ముంచివేశామని, ఆ దేశ నావికాదళ ప్రధాన కార్యాలయాన్ని కూడా దాదాపుగా ధ్వంసం చేశామని ఆయన పేర్కొన్నారు. మిగిలిన నౌకలను కూడా త్వరలోనే నామరూపాలు లేకండా చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు.. ఇరాన్ గుండెకాయ లాంటి టెహ్రాన్ నగరంపై తమ దాడులు కొనసాగుతాయని, రానున్న రోజుల్లో వీటి తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించారు. రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్, మొసాద్ అధిపతితో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఈ ఉగ్రవాద పాలనను అంతం చేయడమే తమ లక్ష్యమని నెతన్యాహు పునరుద్ఘాటించారు. తమ పోరాటానికి అమెరికా ప్రభుత్వం, అధ్యక్షుడు ట్రంప్ అందిస్తున్న సహకారానికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ ఘర్షణల్లో ప్రాణనష్టం కూడా భారీగా పెరుగుతోంది. ఇరాన్ జరిపిన ఎదురు దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోగా, టెల్ అవీవ్, బీట్ షెమెష్ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ పౌరులు కూడా మరణించారు. కాగా ప్రాంతీయ దౌత్యవేత్తలు శాంతి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్న ఒమన్ విదేశాంగ మంత్రి యుద్ధ విరమణను గట్టిగా కోరుతున్నారు. ఇరాన్ కూడా ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు ఆయన సంకేతాలిచ్చారు. ఇది కూడా చదవండి: వైమానిక దాడి.. ఇరాన్ మాజీ అధ్యక్షుడు నెజాద్ మృతి -
ఇరాన్పై దాడులు.. ఆంథ్రోపిక్ నెత్తిన పాలు పోసిన డొనాల్డ్ ట్రంప్!
వాషింగ్టన్: ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ. ఫిబ్రవరి 28న అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన సైనిక చర్య. మిలటరీ ఆపరేషన్లో ఇరాన్ అణు కేంద్రాలు, సైనిక మౌలిక సదుపాయాలతో సహా ఇరాన్ ప్రభుత్వంలోని ముఖ్య కేంద్రాల్లో భీభత్సం సృష్టించాయి. వెన్నులో వణుకు పుట్టించేలా చేపట్టిన మిలటరీ ఆపరేషన్ వెనుక ప్రముఖ ఏఐ టెక్నాలజీ సంస్థ ఆంత్రోపిక్ ఏఐ మోడళ్లు ఉన్నట్లు తేలింది. దీంతో నాడు తన మాట వినలేదని వెళ్లగొట్టిన ఆంథ్రోపిక్ ఇప్పుడు అక్కరకు వచ్చింది’ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధంలో ఏఐ మోడళ్లు సైనికుల కళ్లూ, మెదడులా పనిచేస్తాయి. ఇవి నేరుగా ఆయుధం కాకపోయినా.. ఎక్కడ దాడి చేయాలి. ఎలా రక్షించుకోవాలి. శత్రువు కదలికలు ముందుగానే అంచనా వేస్తాయి. సైనికులకు సమాచారం అందిస్తాయి. అందుకు అనుగుణంగానే దాడి చేయొచ్చు. తాజాగా, ఇరాన్పై దాడుల సమయంలో అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్తంగా ఆంథ్రోపిక్ క్లాడ్ మోడల్స్ను వినియోగించాయి. అయితే, వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్ ఆంథ్రోపిక్ సప్లయ్ చైన్ను ప్రమాదంగా భావించారు. ఆంథ్రోపిక్ సప్లయ్ చైన్ను నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. అనూహ్యంగా కొన్ని గంటల్లో ట్రంప్ తన నిర్ణయంపై యూటర్న్ తీసుకున్నారు. అమెరికా తన మిలిటరీ కార్యకలాపాల కోసం క్లాడ్ను ఉపయోగించింది. ఇరాన్లో తాను నిర్ధేశించిన లక్ష్యాల్ని ఛేదించగలిగింది. అమెరికా ప్రభుత్వం, దాని ఏజెన్సీలు ఆంథ్రోపిక్ క్లాడ్ ఏఐ మోడల్ను ఉపయోగించడం మానేస్తాయని ట్రంప్ ప్రకటించారు. ఈ మార్పు రాత్రికి రాత్రే సాధ్యం కాదని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. క్లాసిఫైడ్ నెట్వర్క్ అంటే అత్యంత రహస్యమైన, భద్రతా ప్రమాణాలు ఉన్న ప్రభుత్వ,సైనిక కంప్యూటర్ వ్యవస్థలు. వీటిలో సాధారణ సాఫ్ట్వేర్ లేదా టూల్స్ను సులభంగా అమలు చేయలేరు.కానీ ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ఇరాన్పై దాడి చేసేందుకు ఆంథ్రోపిక్ ఏఐ క్లౌడ్ను ఉపయోగిస్తోంది. ఆంథ్రోపిక్ ఏఐ క్లౌడ్ను మార్చి వాటి స్థానంలో మరో ఏఐ క్లౌడ్ను మార్చాలంటే కనీసం ఆరునెలల సమయం పట్టనుంది. ఈలోపు సైనికులకు వాటిపై శిక్షణ, వినియోగం వంటి కార్యకలాపాలు చేయాల్సి వస్తుంది. -
ఖమేనీ చావు ఇరాన్ కు వరం.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్
-
యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్ టార్గెట్గా అమెరికా, ఇజ్రాయెల్ దళాల దాడులు కొనసాగుతున్నాయి.. -
‘ఇరాన్పై యుద్ధం ఆగదు.. మా టార్గెట్ అదే’ దాడులపై ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్: దశాబ్దాల పాటు తిరుగులేని రీతిలో ఇరాన్ను శాసించిన సుప్రీమ్ లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఖమేనీ మరణంతో దాడులు ఆగుతాయని అందరూ భావించారు. కానీ ఆ దాడులు ఆగవని, నాలుగు వారాల పాటు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు నాలుగు వారాలు కొనసాగుతాయి. ఇరాన్ పెద్ద దేశం. ఈ దాడులు నాలుగు వారాలు లేదా అంతకంటే ఎక్కువ రోజుల సమయం పడుతుందని మేం భావిస్తున్నాం’అని ట్రంప్ తన మార్ ఎ లాగో రిసార్ట్ నుండి ఫోన్ ఇంటర్వ్యూలో తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్తంగా జరిపిన భీకర దాడిలో సుప్రీమ్ లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ,వారి కుటుంబ సభ్యులు, ఇతర కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో వారి మరణాలను ట్రంప్ ధృవీకరించారు. అమెరికా సైనిక చర్య ప్రణాళిక బద్ధంగా జరుగుతుందన్న ట్రంప్.. ఊహించని దాని కంటే చాలా ఎక్కువ మొత్తంలో ఇరాన్ నాయకత్వాన్ని అంతమొందించాం. ఆ మొత్తం 48 మంది ఉన్నట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ ఇరాన్పై మా యుద్ధ కార్యకలాపాలు కొనసాగుతాయి. ఇప్పట్లో ఆగవు. పెద్ద దేశం కాబట్టి వారాల సమయం పట్టొచ్చు. ఇరాన్లో మాకు చాలా బలమైన లక్ష్యాలు ఉన్నాయి. తాము నిర్ధేశించిన లక్ష్యాలను నాశనం చేసేందుకు వరకు ఉపేక్షించం. అమెరికా తన మొత్తం ఫోర్స్ను రంగంలోకి దింపిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఓ వైపు దాడులు చేస్తూనే ఇరాన్తో దౌత్యానికి సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. అందుకు.. త్వరలో మీరు ఇరాన్తో చర్చలు జరుపుతారా? అని మీడియా ప్రశ్నించగా.. వాళ్లు మాతో మాట్లాడాలని అనుకుంటున్నారు. ఆ పనేది గత వారం చేయాల్సి ఉంది. ఈ వారం కాదని పునరుద్ఘాటించారు. ఇరాన్ జరిపిన దాడుల్లో ముగ్గురు అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. వారి మరణంపై డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా స్పందించారు. వాళ్ళు గొప్ప వ్యక్తులు. దురదృష్టవశాత్తూ ఇలా జరుగుతుందని మేం ముందే ఊహించాం. మరి కొంతమంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. బంకర్ బస్టర్ బాంబులతోఇరాన్లో ప్రతి శుక్రవారం ప్రభుత్వ సెలవు దినం. ఖమేనీ ప్రతీ వారం ప్రారంభం రోజున(శనివారం) తన అధికారిక నివాసంలో కీలక ప్రభుత్వ పెద్దలు, సైనిక ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించేవారు. ఈ సారి ఖమేనీ తన అధికారిక నివాసంలో కాకుండా ఓ స్కూల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంపై నిఘా పెట్టిన అమెరికా, ఇజ్రాయెల్ 30కి పైగా శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించాయి. ఖమేనీ ప్రాణాలు తీశాయి. -
పక్కా సమాచారంతోనే దాడి
శత్రు దుర్భేద్యమైన భద్రత కలిగిన అయతొల్లా అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించడం సంచలనాత్మకంగా మారింది. ఖమేనీ కోసం కొన్ని నెలలపాటు కొనసాగిన వేట చివరకు రెండు గంటల ఐదు నిమిషాల ఆపరేషన్తో ముగిసింది. నిఘా వర్గాలు అందించిన పక్కా సమాచారంతోనే ఆయనను అంతం చేసినట్లు తెలుస్తోంది. ఖమేనీ నివాసంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఏకంగా 30 క్షిపణులను ప్రయోగించాయి. దాంతో ఆయన తప్పించుకోలేకపోయారు. అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తమ హిట్లిస్ట్లో ఉన్న ఖమేనీపై అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఎప్పటినుంచో దృష్టి పెట్టింది.డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచి్చన తర్వాత వేట మరింత ముమ్మరంగా సాగింది. టెహ్రాన్ నడి»ొడ్డున ఖమేనీ నివాసంలో శనివారం తెల్లవారుజామున కీలక సమావేశం జరుగబోతున్నట్లు సీఐఏకు సమాచారం అందింది. ఖమేనీతోపాటు సీనియర్ నేతలు, సైనికాధికారులు హాజరుకాబోతున్నట్లు తెలిసింది. సీఐఏ వెంటనే ఇజ్రాయెల్ను అప్రమత్తం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ ప్రభుత్వాలు మంతనాలు జరిపాయి. తెల్లవారకముందే చిమ్మచీకట్లోనే దాడికి దిగాలని తొలుత భావించారు. ఉదయం అయితే ఆపరేషన్ కచ్చితంగా విజయవంతం అవుతుందన్న ఉద్దేశంతో తెల్లవారిన తర్వాత దాడులకు టైమ్ ఫిక్స్ చేశారు.సమాచారం ఇచ్చిందెవరు? ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఇందులో ఖమేనీ వ్యతిరేకులు కూడా ఉన్నారు. అతడి కదలికల గురించి వారే అమెరికా సీఐఏకు సమాచారం చేరవేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖమేనీపై దాడికి ఎంచుకున్న సమయానికి కూడా యూదు మతంలో కొంత ప్రాముఖ్యత ఉంది. ఈ నెల 2న యూదులకు పూరిమ్ సెలవుదినం. ఇదొక పండుగ రోజు. ప్రాచీన కాలంలో యూదులను అంతం చేయడానికి అప్పటి పర్షియా(నేటి ఇరాన్) పాలకులు సాగించిన కుట్ర ఇదే రోజున విఫలమైంది. సరిగ్గా ఈ పండుగకు ముందు ఖమేనీని అంతం చేయడం గమనార్హం.కీలక నేతలు, అధికారులు హతంఖమేనీ నివాసం చుట్టూ నిత్యం కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. నిజానికి ఇదొక భారీ కాంపౌండ్. ఇందులో ఖమేనీ కార్యాలయాలు, ఇరాన్ ప్రభుత్వ కార్యాలయాలు, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫీసులు ఉన్నాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్కు ఇదొక గుండెకాయ అని చెప్పుకోవచ్చు. ఖమేనీతో జరిగిన భేటీకి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ కమాండర్ ఇన్ చీఫ్ మొహమ్మద్ పాక్పౌర్, రక్షణ శాఖ మంత్రి అజీజ్ నజీర్జాదే, మిలటరీ కౌన్సిల్ అధినేత అడ్మిరల్ అలీ షామ్ఖనీ, ఐఆర్జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ సయ్యద్ మాజిద్ మౌసావీ, డిప్యూటీ ఇంటెలిజెన్స్ మంత్రి మొహమ్మద్ షిరాజీతోపాటు మరికొందరు ముఖ్యులు హాజరయ్యారు. ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో వీరంతా హతమయ్యారు.క్షణాల్లోనే శిథిలాలుగా.. ఉన్నతస్థాయి వర్గాల నుంచి ఆదేశాలు అందిన వెంటనే స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 6 గంటలకు ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు తమ స్థావరాల నుంచి గాల్లోకి లేచాయి. రెండు గంటల ఐదు నిమిషాల్లో.. ఇరాన్ కాలమానం ప్రకారం ఉదయం 9.40 గంటలకు టెహ్రాన్కు చేరుకున్నాయి. ఇజ్రాయెల్ లాంగ్ రేంజ్ మిస్సైళ్లు ఖమేనీ కాంపౌండ్ను శిథిలాలుగా మార్చేశాయి. ఖమేనీతోపాటు అక్కడే ఉన్న సైనికాధికారులు క్షణాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో సైనికాధికారుల ఒక భవనంలో, ఆ పక్కనే మరో భవనంలో ఖమేనీ ఉన్నారు.ఇజ్రాయెల్ దాడుల్లో ఈ రెండూ నామరూపాల్లేకుండాపోయాయి. లక్ష్యం ఎక్కడా గురితప్పలేదు. అంతా అనుకున్నట్లుగానే పూర్తయ్యింది. ఖమేనీపై దాడికి ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతోపాటు అమెరికా క్షిపణులు, డ్రోన్లు కూడా ఉపయోగించినట్లు సమాచారం. అమెరికా యుద్ధనౌకల నుంచి తోమహక్ క్రూయిజ్ మిస్సైళ్లను ప్రయోగించారు. ఖమేనీ కదలికలను తమ నిఘా వర్గాలు సక్సెస్ఫుల్గా ట్రాక్ చేశాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. -
ఖమేనీ మృతి.. ఒకవైపు విషాదం.. మరోవైపు ఆనందం
వాషింగ్టన్/దుబాయ్: దశాబ్దాలపాటు ఇరాన్ను శాసించి, పశ్చిమదేశాలకు కంట్లో నలుసులా మారిన సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ(86) కథ ముగిసింది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడిలో ఆయన మరణించారు. ఖమేనీతోపాటు ఆర్మీ చీఫ్ అబ్దుల్ రహీం ముసావీ, రక్షణ మంత్రి అమీర్ నజీర్జాదే తదితరులు కూడా మృతి చెందారు. రాజధాని టెహ్రాన్లోని ఆయన నివాసంపై శనివారం ఉదయం ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు క్షిపణుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో ఖమేనీ మృతిచెందినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా ధ్రువీకరించింది. ఖమేనీ మృతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ప్రకటన చేశారు. చరిత్రలోనే అత్యంత క్రూరమైన వ్యక్తి విగతజీవిగా మారిపోయాడని వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దేశాన్ని తిరిగి అదీనంలోకి తీసుకొనే ఏకైక అతిపెద్ద అవకాశం ఇరాన్ ప్రజలకు లభించిందని సూచించారు. ఇరాన్పై భారీ, పిన్పాయింట్ దాడులు మరో వారంపాటు.. అవసరమైతే ఆ తర్వాత కూడా యథాతథంగా కొనసాగుతాయని తేల్చిచెప్పారు. ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేదాకా దాడులు తప్పవని ఉద్ఘాటించారు. తమ అత్యున్నత నిఘా వ్యవస్థ నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయాడని ట్రంప్ వెల్లడించారు. ఖమేనీ మృతిపై ఇజ్రాయెల్ కూడా స్పందించింది. ఇరాన్ సుప్రీం లీడర్తోపాటు రక్షణ శాఖ మంత్రి అమీర్ నజీర్జాదే, ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి, ఖమేనీ సలహాదారు, 30 మందికి పైగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డు టాప్ కమాండర్లు కూడా అంతమయ్యారని తేల్చిచెప్పింది. ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో ఖమేనీ సారథ్యంలోని సుప్రీం డిఫెన్స్ కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా దాడులు చోటుచేసుకున్నాయి. 40 రోజులపాటు సంతాప దినాలు వైమానిక దాడిలో ఖమేనీ నివాసం చాలావరకు ధ్వంసమైనట్లు ఉపగ్రహ చిత్రాలను బట్టి స్పష్టమవుతోంది. ఈ ఘటనలో ఆయన కుటుంబ సభ్యులు సైతం మరణించినట్లు తెలిసింది. వీరిలో ఖమేనీ కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు ఉన్నట్లు తెలిసింది. శత్రుదేశాల దాడిలో తమ అత్యున్నత నాయకుడు ఖమేనీ ప్రాణాలు కోల్పోవడం పట్ల ఇరాన్ కేబినెట్ రగిలిపోయింది. ప్రతీకారం తప్పదని తేల్చిచెప్పింది. శత్రువులు అతిపెద్ద తప్పు చేశారని, కచ్చితంగా సమాధానం చెబుతామని స్పష్టంచేసింది. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఖమేనీతోపాటు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కారŠప్స్ ఉన్నతస్థాయి కమాండర్ మేజర్ జనరల్ మొహమ్మద్ పాక్పౌర్, ఖమేనీ అత్యున్నత భద్రతా సలహాదారు అలీ షామ్ఖనీ కూడా మృతిచెందినట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఖమేనీ కన్నుమూయడంతో దేశంలో 40 రోజలపాటు సంతాప దినాలు పాటించాలని ఇరాన్ ప్రభుత్వం ఆదేశించింది. ఆయన స్మారకార్థం వారం రోజులపాటు దేశవ్యాప్తంగా సెలువులు ప్రకటించింది. దాంతో సంతాప సూచకంగా జనం నల్ల జెండాలు ప్రదర్శించారు. షియా ముస్లింలకు పవిత్ర క్షేత్రమైన మషాద్ సిటీలోని ఇమామ్ రెజా మసీదుపై నల్ల జెండా ఎగురవేశారు. ఒకవైపు విషాదం.. మరోవైపు ఆనందం తమ అధినేత ఖమేనీ ఇక లేరన్న నిజాన్ని ఆయన మద్దతుదారులు జీర్ణించుకోలేకపోయారు. శోకసంద్రంలో మునిగిపోయారు. ఇజ్రాయెల్, అమెరికా దేశాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శాపనార్థాలు పెట్టారు. ఖమేనీ చిత్రపటాలు చేతబూని నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఇజ్రాయెల్, అమెరికాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. మరోవైపు ఖమేనీ మరణించడం పట్ల సంతోషం వ్యక్తంచేస్తూ ఆయన వ్యతిరేకులు వీధుల్లోకి వచ్చారు. పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఆనందంతో నృత్యాలు చేశారు. నియంత పాలన అంతమైందంటూ నినదించారు. బూరలు ఊదుతూ పెద్ద ఎత్తున శబ్దాలు చేస్తూ పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కోరుకుంటున్నామని వారు స్పష్టంచేశారు. -
ఇరాన్పై యుద్ధం.. కియోసాకి సంచలన ట్వీట్
బంగారం, వెండి, స్టాక్ మార్కెట్లు, బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పరిణామాలు, పెట్టుబడులపై ఎప్పటికప్పుడు తర అభిప్రాయాలను, సమాచారాన్ని పంచుకునే ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా విభిన్న అంశంపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు.. దానికి ఇరాన్ ప్రతిదాడులతో ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం (#IranWar)నెలకొన్న నేపథ్యంలో ఆయన చేసిన సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ విస్తృతంగా చర్చకు దారితీశాయి.కియోసాకి తన ట్వీట్లో తాను హనోయి (వియత్నాం రాజధాని)లో దిగిన సమయానికే ఇరాన్పై యుద్ధం ప్రారంభమైందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఘర్షణలు మత, ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఉంటాయని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ రక్షణ, చమురు ప్రయోజనాల అంశాలు కూడా యుద్ధాల వెనుక ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.అలాగే గతంలో జరిగిన వియత్నాం యుద్ధాన్ని ప్రస్తావిస్తూ, ఆ సంఘర్షణలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. తాను ఆ యుద్ధంలో సహచరులను కోల్పోయానని భావోద్వేగంగా పేర్కొన్నారు. ప్రపంచం ఎప్పుడు శాంతి వైపు అడుగులు వేస్తుందో అంటూ నిట్టూర్చారు.ఇదే ట్వీట్లో అమెరికా రాజకీయాలపై కూడా కియోసాకి స్పందించారు. అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్ హయాంలో మొదలైన ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అని ప్రశ్నించారు. ప్రపంచ శాంతి కోసం ప్రార్థించాలని పిలుపునిచ్చారు.తర్వాత చేసిన మరో ట్వీట్లో మిన్నెసోటా రాష్ట్ర రాజకీయాలపై వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సభ్యురాలు ఇల్హాన్ ఓమర్, గవర్నర్ టిమ్ వాల్జ్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. సైకాలజిస్ట్, రచయిత జోర్డన్ పీటర్సన్ మాటలను ఉదహరిస్తూ, “బలహీన నాయకత్వం మరింత నష్టం కలిగిస్తుంది” అని పేర్కొన్నారు. అదే సమయంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను (Donald Trump) “దృఢ నాయకుడు”గా అభివర్ణించారు.WAR!!!! Whst is it good for?Ironically I was landing in Hanoi when the war against Iran started .If truth be told we all know the war against Iran is a war financed by American Jews and Christians against Muslims for oil and to protect Israel.Vietnam was a war of Christians…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 28, 2026 -
అమెరికా, ఇజ్రాయెల్ వేడుకోవాల్సిందే: ఇరాన్ వార్నింగ్
టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య దాడులు, మాటల యుద్ధం నడుస్తోంది. సుప్రీం లీడర్ ఖమేనీ మృతి నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు పెంచింది. దీంతో, ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం, అమెరికాకు ఇరాన్ అదిరిపోయే కౌంటరిచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని స్ట్రాంగ్ వార్నింగ్ జారీ చేసింది. ఇక, ఆపరేషన్ ట్రూ ప్రామిస్-4 పేరుతో ఇరాన్ దాడులు చేస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలపై తాజాగా ఇరాన్ స్పీకర్, అధికారులు స్పందించారు. ఈ క్రమంలో ఇరాన్..‘సుప్రీం లీడర్ ఖమేనీ హత్య పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మా జవాబు చూసి శత్రువులు ఏడ్వాల్సిందే, వేడుకోవాల్సిందే. అమెరికా, ఇజ్రాయెల్ మూల్యం చెల్లించుకోవాల్సిందే. మేము దాడులు చేస్తే శత్రువులు కూడా బెంబెలెత్తిపోవాల్సిందే. ఖమేనీ చూపిన బాటలోనే నడుస్తాం. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క’ అని డైరెక్ట్ హెచ్చరికలు జారీ చేసింది.ట్రంప్ హెచ్చరికలు.. అంతకుముందు ఇరాన్ను ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్తోపాటు మిడిల్ ఈస్ట్లోని అమెరికా స్థావరాలపై ఎడతెరిపి లేకుండా చేస్తున్న ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. ఇంతకు ముందెన్నడూ చూడని బలంతో ప్రతిదాడులు చేస్తామని ట్రంప్ స్పష్టంచేశారు. చాలా తీవ్రంగా ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా దాడులు చేయనున్నట్లు ఇరాన్ ప్రకటించిందని ట్రంప్ గుర్తుచేశారు. వారు అలా చేయకపోవడమే మంచిదని, ఒక వేళ చేస్తే వారు కూడా ఇంతకు ముందు చూడని శక్తితో విరుచుకుపడతామని వార్నింగ్ ఇచ్చారు.🚨 BREAKING: DUBAI AIRPORT HIT! 🇦🇪An explosion has been reported at Dubai International Airport following Iran's strike. All flight operations have been suspended and there is a high alert throughout the UAE. pic.twitter.com/lAQSBDwrZN— Crypto Aman (@cryptoamanclub) March 1, 2026 దుబాయ్ విలవిల.. మరోవైపు.. సుప్రీం లీడర్ ఖమేనీ హత్య తర్వాత పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రతరమైంది. ఇరాన్ సైన్యం.. ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇరాన్ క్షిపణుల రాకతో ఇజ్రాయెల్లో చాలా చోట్ల మోగిన సైరన్లు మోగాయి. ఇరాన్ డ్రోన్లు మరోసారి దుబాయ్ ఎయిర్పోర్టును మరోసారి తాకాయి. దీంతో, దుబాయ్ విమానాశ్రయం తీవ్రంగా దెబ్బతిన్నది. యూఏఈ, ఖతార్లలో అనేక చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. యూఏఈలోని అమెరికా స్థావరమైన జబేలీ అలీ పోర్టును ఇరాన్ క్షిపణి తాకింది. అబుదాబి విమానాశ్రయంపై కూడా ఇరాన్ దాడి చేసినట్లు సమాచారం. బుర్జ్ ఖలీఫా మీదుగా క్షిపణులు వెళ్తున్న దృష్యాలను ఇరాన్ మీడియా విడుదల చేసింది. పశ్చిమాసియాలోని 27 అమెరికా స్థావరాలపై దాడులు చేస్తున్నట్లు ఇరాన్ సైన్యం తెలిపింది. ఇరాన్ దాడులతో బహ్రెయిన్, కువైట్లలో సైరన్ల మోత మోగిపోయాయి. This isn’t looking good! Dubai Airport hit by Iranian missiles #DBX #Israel #Iran #Dubai pic.twitter.com/ELpEuHonDd— Bashir Gharwal غروال (@bashir_gharwall) February 28, 2026Burj Al Arab hotel in Dubai, has been hit by an Iranian drone😳😳😳World War III looming 💔 pic.twitter.com/p0ItUPfthh— Risi Arab Money (@OyinLadun0) March 1, 2026 -
ఇరాన్కు మరోసారి డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
ప్రతీకారానికి దిగకపోవడం ఇరాన్కు మంచిదంటూ ఇరాన్కు మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతీదాడులు చేస్తే మరింత తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. మరోవైపు, ఇరాన్ కూడా దీటుగా బదులిస్తోంది. అమెరికా హద్దు మీరిందని.. మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొంది. యూఎస్పై దాడులు మరింత తీవ్రతరం చేస్తామంటూ ఇరాన్ హెచ్చరించింది.సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణాన్ని ధృవీకరించిన అనంతరం ఇవాళ (ఆదివారం) ఉదయం ఇరాన్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ట్రంప్ తన 'ట్రూత్ సోషల్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఖమేనీ హత్యకు నిరసనగా ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టింది. ఇరాన్ దాడులతో అమెరికా అప్రమత్తమైంది. ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా దాడులు చేపట్టింది. ఖమేలీ మృతిపై ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ స్పష్టం చేసింది.ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారంటూ ట్రంప్ నిన్న(శనివారం) ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఖమేనీని చరిత్రలో అత్యంత దుష్టులలో ఒకరిగా ఆయన అభివర్ణించారు. ఇరాన్ ప్రజలకు మాత్రమే కాదు.. అమెరికన్లకు, ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. -
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అతనే.. ప్రతీకారం తీర్చుకుంటాం..
టెహ్రాన్: ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందాడు. ఈ మేరకు ఇరాన్, అమెరికా.. ఖమేనీ మృతిని నిర్ధారించాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తర్వాత వారసుడు ఎవరనేది చర్చకు దారి తీసింది. అయితే, ఖమేనీ తన జీవితకాలంలో ఎవరినీ అధికారిక వారసుడిగా ప్రకటించలేదు. అయితే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఖమేనీ కొడుకు రెండో కుమారురు మొజ్తబా ఖమేనీకి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ఈ మేరకు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఎంపిక బాధ్యత ఎవరిది? ఇరాన్ రాజ్యాంగం ప్రకారం, కొత్త సుప్రీం లీడర్ను ఎంపిక చేసే బాధ్యత అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కి ఉంటుంది. ఇందులో 88 మంది అగ్రశ్రేణి మత పండితులు ఉంటారు. వీరు చర్చించి కొత్త నేతను ఎన్నుకుంటారు. కేవలం మత పెద్దలే కాదు, ఇరాన్ సైనిక విభాగమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) పాత్ర ఇందులో అత్యంత కీలకం. దేశంలో అత్యంత శక్తివంతమైన ఈ సైన్యం ఎవరికి మద్దతు ఇస్తే వారే పీఠం దక్కించుకునే అవకాశం ఉంది.కాగా, తాజా దాడుల్లో ఐఆర్జీసీ కమాండర్ మొహమ్మద్ పాక్పూర్ కూడా మరణించారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో కొత్త ఐఆర్జీసీ చీఫ్గా అహ్మద్ వహిదీ నియామకం అయ్యారు. అనంతరమే.. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఖమేనీ కొడుకు రెండో కుమారురు మొజ్తబా ఖమేనీని ఎన్నుకున్నట్టు తెలిసింది.మరోవైపు.. ఖమేని హత్య కారణంగా ఇరాన్ సైన్యం విరుచుకుపడుతోంది. యూఏఈ, ఖతార్, బహ్రెయిన్పై ఇరాన్ దాడులను తీవ్రతరం చేసింది. ఇరాన్ దాడులతో బహ్రెయిన్ ఎయిర్పోర్టు ధ్వంసమైంది. ఇదే సమయంలో అమెరికా- ఇజ్రాయెల్పై కచ్చితంగా బదులు తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఖమేనీ మృతికి సరైన సమాధానం చెప్పకుండా వదిలిపెట్టేది లేదని ఇరాన్ కేబినెట్ పేర్కొంది. ఖమేనీ మృతిపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) సంతాపం తెలిపింది. ఈ సందర్బంగా తమ సుప్రీం నేతను చంపిన వారికి కఠిన శిక్ష విధిస్తామని.. చరిత్రలో ఎన్నడూ చూడని భయంకరమైన దాడులు ఏ క్షణాల్లోనైనా జరగొచ్చని హెచ్చరించింది. ఇజ్రాయెల్, యూఎస్ స్థావరాల లక్ష్యంగా భారీ ఆపరేషన్ చేపట్టేందుకు ఐఆర్జీసీ సిద్ధమైనట్లు అక్కడి మీడియా వెల్లడించింది. -
ఇరాన్ వీధుల్లో సంబరాలు.. యువరాజు రెజా కీలక వ్యాఖ్యలు
టెహ్రాన్: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారు. ఈ మేరకు ఇరాన్ మీడియా అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రజలు పలుచోట్ల సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఇరాన్ యువరాజు రెజా కూడా స్పందించారు. ఖమేనీ పాలన ముగిసిందంటూ పోస్ట్ చేశారు. ఈ సందర్బంగా ఇరాన్ సైన్యం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.హిజాబ్ లేకుండా డ్యాన్స్.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందడంతో ఇరాన్లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఇరాన్లోని పలు నగరాల్లో ప్రజలు ఈలలు వేస్తూ, కేరింతలు కొడుతున్నట్లు సీఎన్ఎస్ పేర్కొంది. ఇస్లామిక్ రిపబ్లిక్ అంతం కావాలనే నినాదాలతో వీధులు మార్మోగినట్లు రిపోర్టు చేసింది. ఇరాన్ శివారు ప్రాంతమైన బేసత్ టౌన్లో ప్రజలు సంబరాలు చేసుకుంటున్న వీడియోను ఫాక్స్ న్యూస్ పోస్టు చేసింది. ఖమేనీ నియంత మరణించాడని తెలియగానే ఇరాన్ మహిళలు హిజాబ్ లేకుండా వీధుల్లో నృత్యాలు చేస్తున్నారని ఇజ్రాయెల్ మాజీ అధికార ప్రతినిధి ఎలాన్ లెవీ ఒక వీడియోను పంచుకున్నారు.Women without hijab 😱Women singing Women dancing #Khamenei Welcome to the new, old Iran that is once again free!#Iran #Israel #Tehran #Bahrain #IranMassacre #Khamenei pic.twitter.com/BPJmFmOyku— DJ BROID (@DjBroid) March 1, 2026నా కల నిజమైంది.. మరోవైపు.. ప్రముఖ ఇరాన్ సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ మసిహ్ అలీనెజాద్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ సందర్భంగా అలీనెజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ప్రతిరోజు ఇరాన్ ప్రజలు ప్రజలు ఖమేనీ చేతిలో మరణించారన్న వార్తలు చూస్తూ నిద్రలేచేదాన్ని. కానీ నా జీవితంలో మొదటిసారి ఒక శుభవార్తతో నిద్రలేచాను. నాకు గట్టిగా అరవాలని, పరిగెత్తాలని అనిపిస్తోంది. నేను కల గంటున్నానా? కొత్త ప్రపంచానికి స్వాగతం' అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.Huge crowds in Tehran and multiple other Iranian cities celebrating the news of #Khamenei’s death 🤯While crowds celebrate in the streets, Iran’s Revolutionary Guard promises retaliation for Khamenei’s killing 🇮🇷 The situation is escalating fast 😐😐 pic.twitter.com/wXaBdW7z3F— Hinduism_and_Science (@Hinduism_sci) March 1, 2026 ఖమేనీ వారసుడికి తావు లేదు: రెజా పహ్లావీఇరాన్ మాజీ రాజవంశానికి చెందిన వారసుడు, యువరాజు రెజా పహ్లావీ కూడా ఖమేనీ మరణంపై స్పందించారు. ఈ సందర్భంగా..‘నిరంకుశ పాలకుడు, పదివేల మంది ఇరాన్ ముద్దుబిడ్డలను బలిగొన్న హంతకుడు అలీ ఖమేనీ చరిత్ర పుటల నుంచి తుడిచిపెట్టుకుపోయాడు. అతని మరణంతో, ఇస్లామిక్ రిపబ్లిక్ పాలన ముగింపు దశకు చేరుకుంది. అతి త్వరలోనే ఇది చరిత్రలోని చెత్తబుట్టలోకి వెళుతుంది. ఖమేనీ వారసుడిని నియమించడానికి ఈ వ్యవస్థలోని మిగిలిన శక్తులు చేసే ఏ ప్రయత్నమైనా విఫలమవుతుంది. అతని స్థానంలో వారు ఎవరిని ఉంచినా, వారికి చట్టబద్ధత ఉండదు, మనుగడ ఉండదు. వారు కూడా నిస్సందేహంగా ఈ పాలన చేసిన నేరాల్లో భాగస్వాములుగానే ఉంటారు. 👏Breaking: Fardis, Iran — NOW: Iranians launch fireworks, honk horns in joy, crowds celebrate death of regime dictator Khamenei. Support Trump & Israel freeing Iran? A. Yes B. NoVia @realRayanAmiri pic.twitter.com/VylUx1S27S— 𝔉🅰𝒏 Karoline Leavitt (@WHLeavitt) March 1, 2026నేరస్థుడైన ఖమేనీ మరణం ఇరాన్ 'లయన్ అండ్ సన్ నేషనల్ రివల్యూషన్' కోసం తమ ప్రాణాలను అర్పించిన వారి కుటుంబాలకు, బాధిత తల్లులకు, గాయపడిన పిల్లల హృదయాలకు ఒక ఓదార్పుగా అవుతుంది. ఖమేనీ మరణంతో ఇస్లామిక్ రిపబ్లిక్ పాలన ముగిసింది. ఇరాన్ సైన్యం (ఐఆర్జీసీ), పోలీసులు, భద్రతా దళాలు ఇకనైనా ప్రజలతో చేతులు కలపాలి. కూలిపోతున్న వ్యవస్థను కాపాడటానికి ప్రయత్నించవద్దు. ఇది సైన్యానికి లభించిన చివరి అవకాశం. స్వేచ్ఛాయుతమైన ఇరాన్ నిర్మాణంలో భాగస్వాములు కావాలి’ అని పిలుపునిచ్చారు. -
అమెరికా సైన్యం తొమ్మిది ఇరానియన్ నౌకలను ముంచేసింది: ట్రంప్
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. దాడులకు సంబంధించిన... -
ట్రంప్ వ్యాఖ్యల కలకలం.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారని ప్రకటించారు. ఆయన ఖమేనీను "చరిత్రలో అత్యంత దుష్టులలో ఒకరు" అని పేర్కొన్నారు. ఇది "ఇరాన్ ప్రజలకు మాత్రమే కాదు అమెరికన్లకు, ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలకు న్యాయం" జరిగిందని అన్నారు. అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్లో ఖమేనీ నివాస సముదాయంపై 30 బాంబులు వేశారని ఇజ్రాయెల్ ఛానల్ 12 నివేదిక తెలిపింది. ఇజ్రాయెల్ ప్రధాని నెటాన్యాహు కూడా ఖమేనీ మరణించి ఉండవచ్చన్న సంకేతాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అయితే, ఇరాన్ విదేశాంగ మంత్రి NBC Newsతో మాట్లాడుతూ, "ఖమేనీ బతికే ఉన్నారు, నాకు తెలిసినంతవరకు అందరు ఉన్నతాధికారులు సురక్షితంగానే ఉన్నారు" అని తెలిపారు. BBCకి ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బకాయీ మాట్లాడుతూ, "ఏదైనా ధృవీకరించే స్థితిలో లేను, కానీ దేశం మొత్తం జాతీయ సమగ్రతను కాపాడడంపై దృష్టి పెట్టింది" అని అన్నారు. శనివారం జరిగిన దాడుల తర్వాత ఇరాన్ ప్రతిస్పందనగా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై (బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఎఇ) దాడులు జరిపింది. ఈ పరిణామాలు ప్రాంతీయంగా పెద్ద ఎస్కలేషన్కు దారితీశాయి. అయతొల్లా అలీ ఖమేనీ 1989లో రుహొల్లా ఖొమేనీ తరువాత సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. గత 36 ఏళ్లుగా ఆయన ఇరాన్ను పాలించారు. చివరి సంవత్సరాల్లో ఆర్థిక సంక్షోభం, ప్రజా నిరసనలు, హమాస్–హిజ్బుల్లా బలహీనత, అమెరికా–ఇజ్రాయెల్ దాడులు వంటి పరిణామాలు ఆయన పాలనను కుదిపేశాయి. అయితే ఖమేనీ మృతిపై ఇరాన్ నుంచి అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడలేదు. కానీ దీంతో అంతర్జాతీయంగా పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారాయి. -
మీ ప్రభుత్వం మీ చేతుల్లోనే..
వెస్ట్ పామ్ బీచ్: ‘మీ ప్రభుత్వాన్ని మీరు స్వదీనం చేసుకోండి’అంటూ ఇరాన్ ప్రజలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ఇరాన్ అణ్వాయుధాల అభివృద్ధి కార్యక్రమం కొనసాగిస్తోందని, అమెరికా భూభాగాన్ని తాకే క్షిపణులను తయారు చేసే పనిలో నిమగ్నమైందని ఆరోపించారు. తమ మాట పెడచెవిన పెట్టినందుకే ఇరాన్పై దాడులకు దిగాల్సి వచ్చిందని తేల్చిచెప్పారు. ఇరాన్పై వైమానిక దాడుల పట్ల ఆయన స్పందించారు. ఈ మేరకు 8 నిమిషాల నిడివి గల వీడియోను ‘ట్రూత్ సోషల్’లో పోస్టుచేశారు. ట్రంప్ ఏం చెప్పారంటే.. ఇరాన్ పాలకులు అమెరికా చావును కోరుకుంటున్నారు ‘‘కొద్దిసేపటి క్రితమే అమెరికా సైన్యం ఇరాన్లో ఆపరేషన్ ప్రారంభించింది. ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పును అంతంచేసి, అమెరికా ప్రజలను రక్షించడమే మా అంతిమ ధ్యేయం. దుష్ట మనస్తత్వం కలిగిన కొందరు వ్యక్తుల గుంపు, వారి హానికర కార్యకలాపాలు అమెరికాకు, మా సైనిక దళాలకు, విదేశాల్లోని మా స్థావరాలకు, మా మిత్రదేశాలకు ప్రత్యక్షంగా ప్రమాదకరంగా మారాయి. ఇరాన్ పాలకులు గత 47 ఏళ్లుగా అమెరికా చావును కోరుకుంటున్నారు. రక్తపాతం సృష్టిస్తున్నారు. సామూహిక హత్యలకు తెగబడుతున్నారు. మా దేశాన్ని, మా సైన్యాన్ని, ఇంకా చాలా దేశాల్లో అమాయక ప్రజలను టార్గెట్ చేశారు. గతంలో టెహ్రాన్లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని హింసాత్మకంగా స్వా«దీనం చేసుకున్నారు. పదుల సంఖ్యలో అమెరికన్లను 444 రోజులపాటు బందీలుగా మార్చారు. 1983లో ఇరాన్ అండదండలున్న ముష్కరులు బీరూట్లో అమెరికా జవాన్లపై భీకర దాడులకు పాల్పడ్డారు. 241 మంది జవాన్లను బలి తీసుకున్నారు. 2000 సంవత్సరంలో మా నౌక(యూఎస్ఎస్ కోల్)పై దాడులు చేశారు. ఈ ఘటనలో చాలామంది మృతిచెందారు. ఇదంతా మేము మౌనంగా చూస్తూ కూర్చోవాలా? అరాచకానికి ముగింపు పలకాల్సిన అవసరం లేదా? మీరు కోరుకున్నది ఇచ్చే అధ్యక్షుడిని నేనే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డులకు, ఇరాన్ సైనిక దళాలకు, పోలీసులకు నేను చెప్పేది ఒక్కటే. తక్షణమే ఆయుధాలు వదిలేసి లొంగిపోండి. అది సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయం ఒకటి ఉంది. అదే.. చచ్చిపోవడం. లొంగిపోతారో, చచ్చిపోతారో తేల్చుకోండి. లొంగిపోతే గౌరవప్రదంగా చూసుకుంటాం. ఇరాన్ ప్రజలకు చివరిగా నేను చెప్పేది ఏమిటంటే.. మీ స్వాతంత్య్రం మీ చేతుల్లోనే ఉంది. భద్రంగా ఉండండి. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దు. బయట పరిస్థితి భయానకంగా ఉంది. బాంబుల మోత మోగుతోంది. ఈ దాడులు ఆగిపోయాక మీ ప్రభుత్వాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి. ఈ ప్రభుత్వం ముమ్మాటికీ మీదే. ప్రభుత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మీదే. మీరు ఎన్నో ఏళ్లుగా అమెరికా నుంచి సాయం కోరుతున్నారు. కానీ, ఆ సాయం దక్కలేదు. గతంలో ఏ అధ్యక్షుడు కూడా ఇరాన్ ప్రజలకు అండగా ముందుకు రాలేదు. ఈరోజు రాత్రి నేను ముందుకొచ్చా. మీరు కోరు కున్నది ఇచ్చే అధ్యక్షుడు మీ ముందున్నాడు. మా మద్దతు మీకు ఉంటుంది. ఇది చర్యకు దిగే క్షణం. ఈ సందర్భాన్ని వృథా కానివ్వొద్దు. మీ విధిని మీరే రాసుకోండి. సౌభాగ్యవంతమైన, గొప్పదైన భవిష్యత్తు మీకు చేతికి అందేటంత దూరంలోనే ఉంది’’అని డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు. -
ఆ కొత్త ఆయుధాలు ప్రయోగిస్తే తట్టుకోలేవ్ ట్రంప్!
మేం ఇప్పటికి వరకు పాత ఆయుధాలే వాడాం.. కొత్త ఆయుధాలు ప్రయోగిస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తట్టుకోలేరంటూ ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికాపై ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్.. ఊహించని రీతిలో ముగింపు ఉంటుందంటూ హెచ్చరించింది. యుద్ధం మీరు ప్రారంభించారు.. మేము ముగిస్తామన్న ఇరాన్.. ప్రతీకారం దారుణంగా ఉంటుందని తెలిపింది. వేలాది మంది సైనికులు మరణించారని ఇరాన్ ప్రకటించింది.కాగా, అమెరికాను కొట్టగల మిసైళ్లను ఇరాన్ సిద్ధం చేస్తోందన్న ట్రంప్.. అందుకే అమెరికా సైన్యం ఇరాన్పై దాడులు చేపట్టిందన్నారు. అమెరికాకు పొంచి ఉన్న ప్రమాదాన్ని అరికట్డడానికే దాడులు అంటూ చెప్పుకొచ్చారు. ఇరాన్ మద్ధతుతోనే హామాస్ ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది. ఇరాన్లో ఉన్న నరహంతక నాయకత్వాన్ని అంతం చేస్తాం. ఇరాన్ నావికా దళాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తామంటూ ట్రంప్ హెచ్చరించారు.అమెరికా బేస్ క్యాంప్లే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోంది. బహ్రెయిన్లో అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ దాడి చేసింది. ఒకేసారి 10 దేశాలపై మిస్సైళ్లను ఇరాన్ ప్రయోగించింది. ఇజ్రాయెల్, బహ్రెయిన్, కువైట్, సౌదీ, అబుదాబి, ఖతార్, జోర్డాన్, యూఏఇ, ఇరాక్, దుబాయ్పై ఇరాన్ దాడులకు దిగింది. దాబాయ్ టార్గెట్గా దాడులు చేస్తోన్న ఇరాన్.. ఆ దేశంపై వరుసగా మిసైళ్ల వర్షం కురిపించింది. దీంతో బుర్జ్ ఖలిఫాను అధికారులు ఖాళీ చేయించారు.అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం మరింత తీవ్రతరమైంది. ఇరాన్లో నాయకత్వ మార్పుదిశగా అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించాయి. సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. ఖమేనీ పరిస్థితిపై స్పష్టత లేదు. ఆయన రహస్య ప్రదేశానికి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ రైట్ హ్యాండ్ జనరల్ అలీ ఖంబాని హతం కాగా, ఇరాన్కు చెందిన పలువురు సినియర్ కమాండర్లు మృతిచెందినట్లు సమాచారం. -
యుద్ధం ఎఫెక్ట్.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేటు!
ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్పై దాడి చేయడం మొదలుపెట్టేశాయి. దీంతో పెట్టుబడిదారుల్లో భయం పెరిగిపోయింది. ఈ తరుణంలో అందరూ సురక్షితంగా భావించే బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేటు.. దేశంలోని ఏ నగరంలో ఎలా ఉందో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో తులం 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 7140 పెరిగి రూ. 1,68,170 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 6550 పెరిగి రూ. 1,54,650 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా ఉన్నాయి.చెన్నైలో కూడా ధరలు పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,69,640 (రూ. 7090 పెరిగింది). 22 క్యారెట్ల రేటు రూ. 1,55,500 (రూ. 6500 పెరిగింది) వద్ద ఉంది.ఢిల్లీ విషయానికి వస్తే.. దేశ రాజధాని నగరంలో 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 7140 పెరిగి, రూ. 1,68,860 వద్ద నిలిచింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 6550 పెరిగి రూ. 1,54,800 వద్ద నిలిచింది.వెండి ధరలుబంగారం బాటలోనే వెండి అన్నట్లు.. వెండి రేటు కూడా అమాంతం పెరిగిపోయింది. దీంతో హైదరాబాద్, విజయవాడ మొదలైన నగరాల్లో కేజీ సిల్వర్ రేటు రూ. 3.20 లక్షలు చేరింది. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 2.95 లక్షల వద్ద నిలిచింది.ఇదీ చదవండి: అమెరికాను విడిచిపెడుతున్న లక్షలాది మంది ప్రజలు! -
ఆయుధాలు వీడకుంటే చావే: ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత ముదిరాయి. ఇరాన్ అణు కార్యక్రమ పునరుద్ధరణ ప్రయత్నాలను అడ్డుకోవడమే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఆ దేశంపై మెరుపు దాడులు జరిపాయి. ఈ దాడిని ధృవీకరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ పాలకులకు అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ తక్షణమే ఆయుధాలను వీడాలని, లేనిపక్షంలో మరణాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్ఛరించారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణు ఆయుధాన్ని కలిగి ఉండకూడదన్నదే తమ ఏకైక లక్ష్యమని, అందుకోసం ఆ దేశ అణు కేంద్రాలను అమెరికా సర్వనాశనం చేస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు.అమెరికా సైన్యం ఇరాన్పై దాడులు చేపట్టిందని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాకు పొంచి ఉన్న ప్రమాదాన్ని అరికట్డడానికే దాడులు చేశామని తెలిపారు. ఇరాన్ అణ్వాయుధాలు మళ్లీ తయారు చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. అమెరికా సైనిక స్థావరాలకు ముప్పు ఉండడం వల్లే దాడులు తీవ్రతరం చేశామన్నారు. ఇరాన్ మద్ధతుతోనే హామాస్ ఇజ్రాయెల్పై దాడులు చేస్తోందని ఇరాన్లో ఉన్న నరహంతక నాయకత్వాన్ని రూపుమాపుతామని ట్రంప్ హెచ్చరించారు.టెహ్రాన్ లోని దుష్ట నియంతృత్వ పాలనను అంతమొందించే లక్ష్యంతో భారీ పోరాట కార్యకలాపాలు ప్రారంభమైనట్లు ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో ట్రంప్ తన వ్యూహాన్ని స్పష్టం చేస్తూ, ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పునర్నిర్మించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఏ పరిస్థితుల్లోనూ ఆ దేశాన్ని అణ్వాయుధాలు సాధించనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సభ్యులకు ఆయన ఒక అల్టిమేటం జారీ చేశారు. తక్షణమే ఆయుధాలను వీడి లొంగిపోతే పూర్తి రక్షణ కల్పిస్తామని, లేనిపక్షంలో ఖచ్చితమైన మరణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ క్షిపణి వ్యవస్థలను, ఆ పరిశ్రమను సమూలంగా నాశనం చేస్తామని, వారి నౌకాదళాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని అన్నారు. ఈ ప్రాంతాన్ని అస్థిరపరుస్తున్న ఉగ్రవాద ప్రాక్సీ ముఠాలను ఇకపై ఉపేక్షించబోమని, వేలాది మంది అమెరికన్ల మరణానికి కారణమైన ఐఈడీ దాడులకు చరమగీతం పాడుతా మన్నారు.మరోవైపు ఇరాన్ నుంచి ఎదురయ్యే ముప్పును ముందస్తుగా అడ్డుకునే క్రమంలో ఇజ్రాయెల్ తన క్షిపణి దాడులను చేపట్టినట్లు టీపీఎస్ వార్తా సంస్థ వెల్లడించింది. దేశ భద్రత దృష్ట్యా ఈ ముందస్తు దాడులు తప్పలేదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రకటించారు. ఇరాన్ నుంచి ప్రతిదాడి వచ్చే అవకాశం ఉన్నందున ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) దేశవ్యాప్తంగా సైరన్లను మోగించి, పౌరులను అప్రమత్తం చేశాయి. ప్రజలందరూ తక్షణమే సురక్షిత ప్రాంతాలకు, బాంబు షెల్టర్లకు వెళ్లాలని ఐడీఎఫ్ సూచించింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో యుద్ధ వాతావరణం తారాస్థాయికి చేరడంతో ప్రపంచ దేశాలు ఉత్కంఠగా పరిస్థితులను గమనిస్తున్నాయి. pic.twitter.com/BZuJDudLej— Donald J. Trump (@realDonaldTrump) February 28, 2026 -
టెక్ ప్రపంచంలో ట్రంప్ చిచ్చు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడి కఠిన నిర్ణయంతో టెక్ ప్రపంచంలో ప్రకంపనలు మొదలయ్యాయి. అగ్రరాజ్యం రక్షణ శాఖ (పెంటగాన్), ప్రముఖ ఏఐ స్టార్టప్ ‘ఆంథ్రోపిక్’ (Anthropic) మధ్య నెలకొన్న వివాదం చినికి చినికి గాలివానలా మారి, చివరకు ఆ సంస్థపై బహిష్కరణ వేటుకు దారితీసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.ప్రముఖ ఏఐ సంస్థ ‘ఆంథ్రోపిక్’ అభివృద్ధి చేసిన సాంకేతికతను వినియోగించవద్దని అన్ని ఫెడరల్ ఏజెన్సీలకు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ‘మాకు ఆ టెక్నాలజీ అవసరం లేదు, అది మాకు వద్దు.. ఇకపై ఆ సంస్థతో ఎటువంటి వ్యాపార సంబంధాలు ఉండవు’ అని ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ఇప్పటికే మిలిటరీ ప్లాట్ఫారమ్లలో అంతర్భాగంగా ఉన్న ‘ఆంథ్రోపిక్’ టెక్నాలజీని తొలగించేందుకు పెంటగాన్కు ఆరు నెలల గడువు ఇచ్చిన అధ్యక్షుడు, మిగిలిన ప్రభుత్వ సంస్థలు తక్షణమే దీని వాడకాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామం సిలికాన్ వ్యాలీలో కలకలం సృస్టిస్తోంది. ఏఐ సాంకేతికతను సైనిక అవసరాల కోసం ఎటువంటి ఆంక్షలు లేకుండా ఉపయోగించుకోవాలంటూ పెంటగాన్ చేసిన డిమాండ్ ఈ వివాదానికి ప్రధాన కారణంగా నిలిచింది. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా తమకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని రక్షణ శాఖ ‘పెంటగాన్’ పట్టుబట్టగా, ‘ఆంథ్రోపిక్’ సీఈఓ డారియో అమోడెయ్ అందుకు నిర్ద్వంద్వంగా నిరాకరించారు. తమ ఏఐ మోడల్ ‘క్లాడ్’ (Claude)ను నిఘా కోసమో లేదా మనుషుల ప్రమేయం లేకుండా పనిచేసే మారణాయుధాల తయారీ కోసమో వినియోగించకూడదని ‘ఆంథ్రోపిక్’ డిమాండ్ చేస్తోంది. అయితే రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ విధించిన తుది గడువు ముగియడానికి కొద్ది గంటల ముందే ట్రంప్ ఈ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. ఒకవేళ ‘ఆంథ్రోపిక్’ సంస్థ ప్రభుత్వానికి సహకరించకపోతే, తీవ్రమైన సివిల్, క్రిమినల్ పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు.ట్రంప్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ఎలాన్ మస్క్కు చెందిన 'గ్రోక్' (Grok) ఏఐకి భారీగా లబ్ధి చేకూర్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. గ్రోక్ను ఇప్పటికే క్లాసిఫైడ్ మిలిటరీ నెట్వర్క్లలోకి అనుమతించేందుకు పెంటగాన్ సిద్ధమవుతోంది. కాగా, ఈ వివాదంలో ‘ఆంథ్రోపిక్’ తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా గూగుల్, ఓపెన్ ఏఐ ఉద్యోగులు బహిరంగ లేఖ రాయడం విశేషం. ప్రత్యర్థి సంస్థ అయినప్పటికీ, ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ సైతం పెంటగాన్ బెదిరింపు ధోరణిని తప్పుపడుతూ ‘ఆంథ్రోపిక్’కు అండగా నిలిచారు.క్లాడ్ వంటి అధునాతన వ్యవస్థలు జాతీయ భద్రతకు అత్యవసరమని ఒకపక్క చెబుతూనే, మరోపక్క ఆ సంస్థను 'సప్లై చైన్ రిస్క్'గా పరిగణించడం విరుద్ధమని ‘ఆంథ్రోపిక్’ సీఈఓ అమోడెయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రరాజ్య రక్షణ అవసరాలు, ఏఐ నైతిక విలువల మధ్య జరుగుతున్న ఈ పోరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచింది.ఇది కూడా చదవండి: కాషాయ దుస్తుల్లో ప్రధాని మోదీ పక్కన.. సారా నెతన్యాహు సంగతులివే.. -
గార్సియా బ్రదర్స్ను పట్టిస్తే కోటి డాలర్లు.. అమెరికా ప్రకటన
శాన్డియాగో: అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం డ్రగ్స్ ముఠాలను తుడిచిపెట్టే చర్యలను మరింత ముమ్మరం చేసింది. అమెరికా తీవ్ర ఒత్తిళ్ల నేపథ్యంలో ఇటీవల మెక్సికో ప్రభుత్వ ఆర్మీ అత్యంత శక్తివంతమైన జలిస్కో న్యూ జనరేషన్ ముఠా నాయకుడు నెమెసియో రుబెన్ ఒసెగువెరా సెర్వాంటెస్ అలియాస్ ఎల్ మెంచోను మట్టుపెట్టడం తెల్సిందే.అదేవిధంగా, మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా, టిజువానా రాష్ట్రాలతో సరిహద్దులున్న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోకి దొంగచాటుగా డ్రగ్స్ తరలించే సినలొవా డ్రగ్ముఠాపై తాజాగా ట్రంప్ సర్కారు దృష్టి సారించింది. జలిస్కో, సినలొవా ముఠాల మధ్య ఆధిపత్యం కోసం తీవ్రంగా పోరు సాగుతోంది. సినలొవా ముఠా నేతలుగా ఉన్న ఇద్దరు సోదరులను పట్టించిన వారికి కోటి డాలర్లను బహుమానంగా ఇస్తామని గురువారం అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. రెనె అర్జాటె గార్సియా(42)అలియాస్ లా రానా, అల్ఫొన్సో అర్జాటే గార్సియా(52) అలియాస్ అక్విలెస్ ఆచూకీ తెలిపిన వారికి 50 లక్షల డాలర్ల చొప్పున అందిస్తామంది. వీరిద్దరిపై ఇప్పటికే శాండియాగోలో డ్రగ్స్కు సంబంధించిన పలు కేసులున్నాయి. -
నియమబద్ధ వాణిజ్యమే శరణ్యం
చీకటిని చూస్తేనే వెలుగు విలువ మరింత తెలుస్తుందంటారు. అదే ప్రకారం, అంత ర్జాతీయ వాణిజ్య సంబంధాల విషయమై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిరుడు ఏప్రిల్లో సృష్టించిన చీకటిని పది నెలల పాటు చూసిన ప్రపంచానికి, నియ మబద్ధమైన వాణిజ్యపు విలువ ఏమిటో గతం కన్నా ఎక్కువగా అర్థమైంది. కానీ ఇప్పటికీ అర్థం కానిది అమెరికా అధ్య క్షునికే! లేని అధికారాలను ఉపయోగించి ఇష్టారీతిన దిగుమతి సుంకాలు విధించటం చెల్లుబాటు కాదని అక్కడి సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పును ఈ నెల 20వ తేదీన చెప్పిన తర్వాత కూడా ఆయన తమ విధానాలు మారబోవని ప్రకటించారు. మరొక రూపంలో అదనపు సుంకాలను అమలుకు తేవటంలోని అవివేకం ప్రపంచానికంతా అర్థమవుతున్నది ఆయనకు తప్ప!అయినా మారడా?ఇక్కడ గమనించదగ్గది మరొకటి ఉంది. అమెరికాను తిరిగి గొప్పదిగా చేసే ప్రణాళికలో సుంకాల హెచ్చింపు ఒక భాగం. దాని కోసం ఈ పది నెలలుగా సాధించిన ఫలితాలలో, సుమారు 120 బిలియన్ డాలర్ల అదనపు ఆదాయాన్ని మినహాయించితే, ఇతర లక్ష్యాలు ఒక్కటైనా సిద్ధిస్తున్న సూచనలు లేవు. నికర బడ్జెట్ లోటు అంతకుమించి పెరుగుతున్నది. ఒక డజను దేశాలపై సైనిక దాడులు జరిపి, మరిన్ని దాడులకు సన్నాహాలు చేస్తున్నందున సైనిక ఖర్చుల రూపంలో జీడీపీ పెరుగుదల 1.4 శాతానికి తగ్గగా, ద్రవ్యోల్బణం మళ్లీ 3 శాతానికి చేరింది. ఉద్యోగాల పెరుగుదల ఇంత తక్కువగా ఉండటం 2013 తర్వాత ఎప్పుడూ లేదని గణాంకాలు చెప్తున్నాయి. డాలర్ విలువ, స్టాక్ మార్కెట్లు, బాండ్ మార్కెట్లు గందరగోళానికి గురవుతున్నాయి. వీటన్నింటి ఫలితాలను అనుభవిస్తున్న అమెరికన్ ప్రజలలో ట్రంప్ ప్రజాదరణ వరుసగా పడిపోతున్నట్లు ప్రజాభిప్రాయ సేకర ణలు చెప్తున్నాయి. అంతకుమించి, స్వయంగా తనకు బలమైన మద్ద తుగా నిలిచి అధికారంలోకి తెచ్చిన ‘మాగా కానిస్టిట్యుయెన్సీ’ అని పిలిచే సామాజిక తరగతులలోనూ బలం తగ్గుతుండగా, ఈ కాలంలోనే జరిగిన మూడు గవర్నర్ ఎన్నికలను రిపబ్లికన్ కంచుకోట లుగా భావించే రాష్ట్రాలలో ఓడిపోయారు. రానున్న నవంబర్ నాటి మధ్యంతర ఎన్నికలలోనూ ఇదే జరిగితే పరిస్థితి ఏమిటన్న భయాలు ట్రంప్ పార్టీలో మొదలయ్యాయి. ‘అయినా ఆయన మార లేదు’ అన్న ఒక తెలుగు కథలోని వాక్యం వలె, ‘అయినా ట్రంప్ మారటం లేదు’.అందరితోనూ అదే ధోరణిఇవి, ఇంకా ఇటువంటివి అమెరికాలో అంతర్గతంగా కనిపి స్తున్న పరిస్థితులు. బయటి మాట చెప్పనక్కర లేదు. ట్రంప్ గత ఏప్రిల్లో ‘విమోచనా దినం’ అంటూ ప్రపంచంలోని సమస్త దేశా లపై సమాంతరమైన ఎదురు సుంకాలు అంటూ ఒక పిడుగును విసిరినప్పటి నుంచి వాణిజ్య ప్రపంచమంతా అల్లకల్లోలంగా మారటం తెలిసిందే. ఆ పరిస్థితి ఇప్పటికీ కుదుట పడలేదు సరికదా సమీప భవిష్యత్తులో కుదుటపడే సూచనలు కూడా లేవు. అందుకు కారణం తిరిగి ఆయన చర్యలే! ఏ దేశంపై సుంకాలను ఎపుడు ఇంకా పెంచుతారో, తగ్గిస్తారో తెలియదు. ఒక దేశానికి తమతో వాణిజ్యం కావాలంటే వారు మరేదో మూడవ దేశంపై సుంకాలు పెంచాలని ఒత్తిడి చేస్తారో తెలి యదు. వాణిజ్యంతో నిమిత్తం లేకుండా రాజకీయాల కోసం చేసేదీ తెలియదు. ఇతర దేశాలలో నడుస్తున్న అమెరికన్ కంపెనీలను వాపస్ రానట్లయితే వంద శాతం సుంకాలంటారో తెలియదు. తమ ఆయుధాలు, బోయింగ్లు, చమురు, వ్యవసాయ ఉత్పత్తులు, పారి శ్రామిక ఉత్పత్తులను చచ్చినట్లు ఖరీదు చేసే వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేయనట్లయితే సుంకాలు వంద శాతమనేదీ, 500 శాతమ నేదీ తెలియదు. ‘మీరు మీకు కావలసిన చమురు వగైరాలను మాకు నచ్చని దేశాల నుంచి ఖరీదు చేయటం ఆపివేసి మేము చెప్పిన చోటు నుంచే కొనుగోలు చేయా’లని ట్యారిఫ్ల కొరడా ఝళిపించేదీ తెలియదు. దీనంతటికి తమ కూటమి దేశాలు సైతం మినహాయింపు కాకపోవటమే కాదు, వారికి చెందిన భూభాగాలను తమకు స్వాధీనం చేయకున్నా ట్యారిఫ్ల ఖడ్గ చాలనం చేస్తారు. కెనడావంటి అతి సన్నిహిత దేశంపై పెంచిన సుంకాలను స్వయంగా తన రిపబ్లికన్ సెనేటర్లు వ్యతిరేకించి ఓడించినా లెక్క చేయరు.అదే శరణ్యంఇన్నిన్ని వివరాలు ఇంత సుదీర్ఘంగా చెప్పుకోవటం ఎందుకంటే, ఏప్రిల్లో ‘విమోచనా దినం’ నాడు అమెరికా అధ్యక్షుడు అడ్వాన్స్ విజయ దరహాసంతో ప్రకటించినట్లు, ట్యారిఫ్లన్నవి ‘మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్ ఇన్ ద డిక్షనరీ’ ఏమీ కాదు. తనవి పూర్తిగా తప్పుడు అంచనాలతో కూడిన లెక్కలని ఈ పది మాసాలలో ఇంటా బయటా కూడా రుజువైంది. అసమర్థుని జీవయాత్ర వలె ఇది ఒక అవివేకపు అధ్యక్షుని ఆర్థిక యాత్ర. ఆ యాత్రలో రెండవ అంకాన్ని ఆయన ఈనెల 20న సుప్రీం కోర్టు తీర్పు కలిగించిన భయం నుంచి మొదలు పెట్టారు. న్యాయమూర్తులను మనం ఊహించలేని భాషలో దూషించి, తమ విధానాలు మారబోవని ప్రకటించారు. తనకు ఇతర మార్గాలు ఉన్నాయని, వాటిని ఉపయోగించి దేశాలను ‘సర్వ నాశనం’ చేయగలనన్నారు. 150 రోజుల కాల పరిమితి గల సెక్ష న్లను, అమెరికా చరిత్రలోనే ఏ అధ్యక్షుడూ ఉపయోగించని వాటిని బయటకు తీసి, ఆ ప్రకారం అన్ని దేశాలపై 10 శాతం అదనపుసుంకమని, అంతలోనే 15 శాతానికి పెంచారు. ఇప్పటికే జరిగిన వాణిజ్య ఒప్పందాల నుంచి ఏ దేశమూ తప్పించుకోరాదని హెచ్చ రించారు. ఈ అదనపు సుంకాలను తాము చెల్లించబోమని యూరో పియన్ యూనియన్ స్పష్టం చేయగా, అసలు తన ఒప్పందంపై తుది చర్చలను ఇండియా వాయిదా వేసింది. ఈ విధమైన రెండవ అంకపు నాటకంలో ఇంకేమి పరిణామాలుండగలవో చూడాలి.మొత్తం మీద తేలుతున్న పాఠం ఏమిటంటే, తనకు ఏ అంత ర్జాతీయ నియమాలు లేవంటూ ట్రంప్ విచ్ఛిన్నం చేయబూనిన నియమాల ప్రకారం వాణిజ్యం, ఆర్థిక, రాజకీయ సంబంధాలే బలో న్మత్త మదపుటేనుగులకైనా అనుసరించదగిన విధానాలవుతాయి. ఈ నియమాలను అమెరికాయే నాయకత్వం వహించి రెండవ ప్రపంచ యుద్ధం దరిమిలా రూపొందించటం గాని, ఇన్ని దశాబ్దాలుగా పాటించటంగాని ఎంతో దూరదృష్టితో జరిగినటువంటిదే! ఆ నియ మాలు పూర్తి న్యాయబద్ధమైనవేమీ కాదు. అవి ధనిక దేశాలకు అను కూలం, వర్తమాన దేశాలకు ప్రతికూలం అయినా కనీసం ఒక పద్ధతిలో సాగుతూ వచ్చాయి. ట్రంప్కు అదే శరణ్యం కావాలి.-వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు-టంకశాల అశోక్ -
ఆహా..ఓహో.. ఆఫ్గాన్పై యుద్ధం వేళ పాకిస్థాన్పై ట్రంప్ ప్రశంసలు
వాషింగ్టన్: పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహ్బాజ్ షరీఫ్, పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (cdf) ఆసిమ్ మునీర్లను డొనాల్డ్ ట్రంప్ పొగడ్తలతో ముంచెత్తారు. పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ యుద్ధం పతాక స్థాయికి చేరుకున్న క్రమంలో ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు చర్చాంశనీయంగా మారాయి. పాకిస్థాన్-ఆఫ్గనిస్థాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. వైట్ హౌస్లోని సౌత్లాన్లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..‘ పాకిస్థాన్తో నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇస్లామాబాద్తో నేను చాలా బాగా కలిసిపోతాను’అని వ్యాఖ్యానించారు. షెహ్బాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్పై ప్రశంసల వర్షం కురిపించారు. వారు గొప్ప నాయకులని అభివర్ణించారు.ఒకవైపు యుద్ధం కొనసాగుతున్నప్పటికీ, ట్రంప్ పాకిస్థాన్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించడం, అమెరికా ఇస్లామాబాద్ వైపు దౌత్యపరమైన మద్దతు చూపుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఆఫ్గనిస్థాన్కి అమెరికా నుంచి ప్రత్యక్ష మద్దతు లభించకపోవచ్చనే సందేహాలను కూడా రేకెత్తిస్తోంది.ఓపెన్ వార్ పాక్-ఆఫ్గనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడు ‘ఓపెన్ వార్’ స్థాయికి చేరుకున్నాయి. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ శుక్రవారం అధికారికంగా యుద్ధాన్ని ప్రకటించారు. ఆఫ్గనిస్థాన్ నుంచి జరిగిన సరిహద్దు దాడులకు ప్రతిగా, పాకిస్థాన్ ‘ఘజబ్ లిల్-హక్’ అనే ఆపరేషన్ ప్రారంభించి కాబూల్తో పాటు మరికొన్ని ప్రావిన్స్లపై వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో వందలాది తాలిబాన్ సైనికులు మృతి చెందారని పాకిస్థాన్ వర్గాలు ప్రకటించాయి. మరోవైపు, ఆఫ్గనిస్థాన్ కూడా పాకిస్థాన్ సైన్యంపై గణనీయమైన నష్టం కలిగించామని చెప్పింది. ఇరువైపులా భారీ ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం.పాకిస్థాన్-ఆఫ్గనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఫిబ్రవరి 26న సరిహద్దు కాల్పుల తర్వాత వేగంగా ‘ఓపెన్ వార్’ స్థాయికి చేరుకున్నాయి. తాలిబాన్ అధికారులు నంగర్హార్, కునార్, ఖోస్ట్ వంటి తూర్పు ప్రావిన్స్లలో రాత్రి ఎనిమిది గంటల సమయంలో దాడులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇస్లామాబాద్ (పాక్ రాజధాని)మాత్రం ఆఫ్గన్ తాలిబాన్ అనవసరంగా కాల్పులు ప్రారంభించిందని ఆరోపించింది. అందుకు ప్రతిస్పందనగా కాల్పులకు దిగినట్లు తెలిపింది.కొన్ని గంటల్లోనే పాకిస్థాన్ వైమానిక దాడులు,ఆర్టిలరీ దాడులు అంటే సరిహద్దు ప్రాంతాల్లో , యుద్ధరంగంలో శత్రు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని జరిపే దాడులను కాబూల్తో పాటు సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. తాలిబాన్ కూడా ప్రతిదాడులు జరిపి పాకిస్థాన్ సైనిక స్థావరాలపై డ్రోన్ దాడులు చేశామని తెలిపింది. ఇరువైపులా ప్రాణనష్టం గణనీయంగా జరిగిందని వర్గాలు చెబుతున్నప్పటికీ, మృతులు,గాయపడిన వారి సంఖ్యలపై స్పష్టత రావాల్సి ఉంది. -
ఇరాన్పై అమెరికా దాడి.. ఫ్రస్ట్రేషన్లో డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అణు కార్యక్రమాన్ని ఆపాలని అమెరికా హెచ్చరిస్తుండగా.. ఆపేది లేదని ఇరాన్ అంటోంది. ఇదే అంశంపై స్విర్జర్లాండ్లోని జెనీవాలో ఇరు దేశాల ప్రతినిధులు చర్చలు జరిపారు. గంటల తరబడి జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో చర్చల నుంచి అమెరికా ప్రతినిధులు నిరాశతో వెనుదిరిగారు. అయితే ఇరాన్ మాత్రం చర్చల్లో పురోగతి సాధించాం’ అని ప్రకటించింది. ఈ విభిన్న అభిప్రాయాలు చర్చల భవిష్యత్తుపై అనిశ్చితిని పెంచిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం చర్చలలో ఇరాన్ వైఖరిపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు కావాల్సినవి ఇచ్చేందుకు ఇరాన్ సిద్ధంగా లేదు. ఇది నన్ను నిరాశకు గురి చేసింది. ‘ మాకు కావలసినది ఇవ్వడానికి వాళ్లు సిద్ధంగా లేరు. అందుకే నేను సంతోషంగా లేను’ అని ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఇరాన్పై అమెరికా సైనిక దాడి చేయాలా లేదా అనే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు ట్రంప్ వ్యాఖ్యలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇస్తాంబుల్ విమానాశ్రయం నుంచి టెహ్రాన్కి వెళ్లే విమానాలను రద్దు చేయడం, అమెరికా సైనిక బలగాలను ఇరాన్ చుట్టుపక్కల మోహరించడం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మార్చింది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల అధికారి వోల్కర్ టర్క్ కూడా ‘ప్రాంతీయ యుద్ధం జరిగే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తం మీద, జెనీవా చర్చలు ఒక కీలక మలుపులో నిలిచాయి. ఇరాన్ తన అణు కార్యక్రమంపై మాత్రమే చర్చలు జరగాలని పట్టుబడుతుండగా, అమెరికా మాత్రం మిసైల్ ప్రోగ్రామ్, ప్రాంతీయ మిలిటెంట్ గ్రూపులకు మద్దతు తగ్గించాలని కోరుతోంది. ఈ విభేదాలు పరిష్కారం కాని పక్షంలో, ట్రంప్ చేసిన హెచ్చరికలు వాస్తవ రూపం దాల్చే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.జెనీవాలో అమెరికా–ఇరాన్ మధ్య జరిగిన తాజా అణు చర్చలు ప్రత్యక్షంగా కాకుండా మధ్యవర్తుల ద్వారా కొనసాగాయి. ఇరాన్ తరఫున విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి పాల్గొనగా, అమెరికా వైపు నుంచి ట్రంప్ సన్నిహితుడు, అమెరికా ప్రత్యేక దౌత్య ప్రతినిధిగా ఉన్న స్టీవ్ విట్కాఫ్, అలాగే ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ప్రతినిధులుగా హాజరయ్యారు. జారెడ్ కుష్నర్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ భర్త. ఈ చర్చలకు ఒమాన్ కీలక మధ్యవర్తిగా వ్యవహరించింది. ఒమాన్ విదేశాంగ మంత్రి బద్ర్ అల్-బుసైదీ చర్చలను సమన్వయం చేస్తూ ‘పురోగతి సాధించాం’ అని తెలిపారు. -
వెంటనే ఇజ్రాయిల్ను వదిలి వెళ్లిపోండి.. యూఎస్ హెచ్చరిక
మధ్య ప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యోచిస్తున్న నేపథ్యంలో జెరూసలేంలోని అమెరికా రాయబార కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఇజ్రాయిల్ను వదిలి వెళ్లాలంటూ అమెరికా రాయబారి మైక్ హకబీ.. రాయబార కార్యాలయ సిబ్బందికి ఆదేశాలిచ్చారు.వీలైనంత త్వరగా..ఇవాళ(శుక్రవారం) ఉదయం.. యూఎస్ రాయబార ఉద్యోగులకు ఒక మెయిల్ పంపించారు. ‘ప్రస్తుతానికి భయపడాల్సిన పనిలేదు.. కానీ వెళ్లాలనుకునే వారు వీలైనంత త్వరగా విమానాలు బుక్ చేసుకోవడం మంచిదంటూ పేర్కొన్నారు. ఇరాన్పై అమెరికా దాడులు చేయకముందే ఇజ్రాయెల్ వీడాలని తెలిపారు. ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధమవుతుందనే వాదనలు క్రమంగా బలపడుతున్నాయి.పశ్చిమాసియా దేశాల ఆందోళనతమతో అణు ఒప్పందం కుదుర్చుకోకపోతే తీవ్ర పరిణామాలను తప్పవంటూ ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో అమెరికా రాయబారి ఇజ్రాయెల్లోని తమ ఎంబసీకి తాజా ఆదేశాలు చేయడం కలకలం రేపుతోంది. ఇరాన్పై అమెరికా దాడులు చేసే అవకాశముందని పశ్చిమాసియా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.టెన్షన్.. టెన్షన్..మరోవైపు, ఒక వేళ ఇరాన్పై దాడి జరిగితే.. అమెరిక స్థావరాలపై కూడా ఇరాన్ ప్రతి చర్య దాడులకు తెగబడే అవకాశం ఉంది. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో యుద్ధవిమానాలు, నౌక దళాలను యూస్ మోహరించింది. పలు సైనిక స్థావరాల్లో దాదాపుగా 10 వేల మంది యూఎస్ సైనికులు మోహరించారు. ఇరాన్పై క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందని సమాచారం. ట్రంప్ తన సలహాదారులతో చర్చిస్తున్నారని వైట్హౌజ్ వర్గాలు ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే.ఇజ్రాయెల్ అప్రమత్తంఇరాన్ అణు కార్యక్రమాలు, అంతర్గత అణచివేతపై ట్రంప్ సీరియస్గా ఉన్నారని.. దీంతో ఇరాన్పై అమెరికా భారీ దాడులకు దిగవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధం కన్నా భారీ స్థాయిలో ఈ సైనిక చర్య ఉండవచ్చని తాజా నివేదికలు కూడా చెబుతున్నాయి. మరో వైపు అమెరికా తమపై దాడి చేస్తే.. ఆ దేశంతో పాటు తాము ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ పలుమార్లు హెచ్చరించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ సైతం అప్రమత్తమైంది.కాగా, అమెరికా తన అతిపెద్ద విమాన వాహక నౌక ‘యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్. ఫోర్డ్’ను ఈ ప్రాంతానికి తరలించడంపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. అమెరికా నౌకాదళాన్ని సముద్ర గర్భంలో ముంచేయగల క్షిపణులు తమ వద్ద ఉన్నాయని, అగ్రరాజ్య సైన్యం కోలుకోలేనంతగా దెబ్బతినడం ఖాయం అంటూ ఆయన ట్రంప్ను హెచ్చరించారు. -
USAలో విద్యార్థిని అక్రమ అరెస్ట్?
అమెరికా ప్రభుత్వం విదేశీ విద్యార్థులపై ఎంత కఠిన వైఖరి అవలంభిస్తోందో తెలిసిన విషయమే. తాజాగా పాలస్తీనాకు మద్ధతుగా నిరసన జరిపిందంటూ ఒక విదేశీ విద్యార్థిని USA సర్కార్ అరెస్టు చేసింది. అయితే దీనిపై న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ జోక్యంతో స్టూడెంట్ను రిలీజ్ చేసింది.గురువారం ఉదయం ( USA)ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఒక అపార్టుమెంటులోకి అకస్మాత్తుగా ప్రవేశించారు. ఒక పాపకోసం వచ్చామంటూ అందులోని అక్కడ ఉన్న నివాసితులకు నమ్మబలికారు. అలా సోదాలు జరిపి కొలంబియా యూనివర్సిటీలో చదువుతున్న ఎల్లీ అఘయేవా అనే విద్యార్థిని అరెస్టు చేశారు. దీంతో ఆమె షాక్కు గురైంది. తనను DHS ప్రతినిధులు అక్రమంగా అరెస్టు చేశారని తనను కాపాడాలని ఇన్స్టాలో మెసేజ్ చేసింది.ఆమె అరెస్టు వార్త విని కొలంబియా వర్సిటీలో నిరనసలు చెలరేగాయి. దీంతో న్యూయార్క్ మేయర్ జోహ్రానీ మామ్దానీ ట్రంప్తో భేటీ జరిపి ఆ విద్యార్థిని విడుదల చేయాలని కోరడంతో ట్రంప్ వెంటనే ఓకే అన్నారు. దీంతో ఆమె రిలీజైంది. అయితే తనను అరెస్టు చేయడం ఎంతో షాక్కు గురిచేసిందని ఆ విద్యార్థిని తెలిపింది. అయితే ఎల్లీ అఘవేయా అజర్బైజాన్ దేశానికి చెందిన విద్యార్థిని. అయితే మామ్దానీ, ట్రంప్ ఒకే పార్టీకి చెందిన నేతలు కాదు. ఎన్నికల సమయంలో పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. అయినప్పటికీ ఆయన నిర్ణయాన్నిగౌరవించడం మేయర్ మాటకు గౌరవమిచ్చి ఆ విద్యార్థిని విడుదల చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. -
నచ్చితే లవ్వు.. లేకుంటే యుద్ధమే
-
దక్షిణ కొరియాను నాశనం చేస్తాం: కిమ్ సంచలన ప్రకటన
సియోల్: అమెరికాతో కలిసి తమ దేశ భద్రతకు ముప్పు కలిగిస్తే అణ్వాయుధాలతో దక్షిణ కొరియాకు పూర్తిగా నాశనం చేస్తామని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించారు. దక్షిణ కొరియాను అత్యంత శత్రుదేశంగా భావిస్తూ, అణ్వాయుధాలతో విరుచుకుపడతామన్నారు. అదే సందర్భంలో అమెరికాతో చర్చలకు తమ తలుపులు తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు.కాగా, పార్టీ కాంగ్రెస్ ముగింపు సమావేశంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడారు. ఈ సందర్భంగా కిమ్.. దేశ అణ్వాయుధ సైన్యాన్ని బలోపేతం చేయడానికి కొత్త ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. సముద్రంలోంచి ప్రయోగించగల బాలిస్టిక్ క్షిపణులు, ఫిరంగులు, స్వల్ప–శ్రేణి క్షిపణుల వంటి వ్యూహాత్మక ఆయుధాలను విస్తృతం చేయాలన్నారు.చాలా కాలంగా నిలిచిపోయిన చర్చలను అమెరికా తిరిగి ప్రారంభించాలంటే ఉత్తర కొరియాను శత్రుదేశంగా చూడటం విస్మరించాలని సూచించారు. అమెరికాతో సత్సంబంధాలు కొనసాగించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చారు. అమెరికా–ఉత్తర కొరియా సంబంధాలు పూర్తిగా అమెరికా వైఖరిపై ఆధారపడి ఉంటాయన్నారు. శాంతియుతంగా కలిసి ఉండటానికి లేదా ఘర్షణ కొనసాగింపునకు.. రెండింటికీ తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు కిమ్ జోంగ్ ఉన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన 13 ఏళ్ల కుమార్తెకు ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పగించారు. ఈ బాధ్యతలో ఉత్తర కొరియా క్షిపణి తయారీ విభాగం డైరెక్టర్ పదవి కూడా ఉంది. ఉత్తర కొరియా భద్రతకు కీలకమైన విభాగంగా పరిగణించే క్షిపణి తయారీ బాధ్యతను కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె కిమ్ జుకు అప్పగించారని దక్షిణ కొరియా నిఘా అధికారులు చెబుతున్నారు. ది చోసున్ డైలీలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. ఉత్తర కొరియా నియంత తన కుమార్తె పేరును కూడా మార్చి, ఆమెను గుర్తించకుండా ఉండటానికి ఆమెను ఆ పదవికి అప్పగించాడు. కిమ్ జు ఏను క్షిపణి తయారీ విభాగంలో కిమ్ జు హే అని పిలుస్తారు. కిమ్ జు-ఏ 2013లో జన్మించారు. ఆమెను మొదటిసారిగా 2022లో కిమ్ జోంగ్-ఉన్ ప్రజలకు పరిచయం చేశారు. ఆమెను ఉత్తర కొరియాలో “గౌరవనీయురాలు” అని పిలుస్తారు. ఆమె తండ్రిలాగే, కిమ్ జు-ఏ సాంప్రదాయ విద్యపై దృష్టి పెడుతుంది. కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా తన కుమార్తెకు దౌత్యం, ఇతర విద్యలను బోధిస్తున్నాడు. -
ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర
వాషింగ్టన్: అమెరికా రాజకీయ వర్గాలను కుదిపేసిన ఈ కేసు ప్రస్తుతం న్యూయార్క్లో విచారణ దశలో ఉంది. పాకిస్తాన్కు చెందిన అసిఫ్ మర్చంట్ అనే వ్యక్తి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు పలువురు ప్రముఖ రాజకీయ నాయకులను హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు తాజాగా కోర్టు విచారణ లో తేలింది. ఆసిఫ్ పాక్ జాతీయుడియే అయినా ఇరాన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. 2024లో అమెరికాలోకి ప్రవేశించిన అసిఫ్, న్యూయార్క్ చేరిన కొద్ది రోజుల్లోనే కాంట్రాక్ట్ కిల్లర్లను సంప్రదించడానికి ప్రయత్నించాడు. కానీ అతను కలిసిన వారు వాస్తవానికి ఎఫ్బీఐ గూఢచారులు కావడంతో మొత్తం కుట్ర బయటపడింది. విచారణలో అసిఫ్ ఇద్దరికి 5వేల డాలర్ల అడ్వాన్స్ చెల్లించినట్లు రుజువైంది.ప్రస్తుతం బ్రూక్లిన్లోని ఫెడరల్ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. నిందితుడు దోషిగా తేలితే అతనికి జీవిత ఖైదు శిక్ష విధించే అవకాశం ఉంది. అమెరికా న్యాయ శాఖ ఈ కేసును ‘మర్డర్-ఫర్-హైర్ కుట్ర’గా పేర్కొంటూ, దేశ రాజకీయ నాయకులపై దాడి ప్రయత్నం అత్యంత తీవ్రమైన నేరమని స్పష్టం చేసింది. -
ఓటరును పడగొట్టే 'సినిమా'..ఇదో కొత్త రాజకీయం!
సాధారణంగా రాజకీయ నాయకులు బయట చూడడానికి కాస్త గంభీరంగా ఉంటారు. వారి ప్రసంగాలు, నిర్ణయాలు అన్నీ సీరియస్గానే ఉంటాయి. నిత్యం జనాల్లో ఉన్నప్పటికీ ‘మనవాడు’ అనే హోదా మాత్రం కొంతమందికే లభిస్తుంది. ఆ కొంతమందిలో తాము కూడా ఉండాలని చాలామంది నేతలు కోరుకుంటారు. అందుకే సామాన్య ప్రజలకు చేరువ కావడానికి 'సినిమా గ్లామర్'ను ఒక శక్తివంతమైన ఆయుధంగా వాడుకుంటున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సూపర్ స్టార్ మోహన్ లాల్ మధ్య జరిగిన తాజా ఇంటర్వ్యూ దీనికి తాజా ఉదాహరణ మాత్రమే. అయితే, ఈ వ్యూహం వెనుక దశాబ్దాల చరిత్ర, అంతర్జాతీయ రాజకీయ తంత్రం దాగి ఉంది.ఎన్నికల సమయంలో రాజకీయనాయకులు చేసే హడావుడి అంతా ఇంత కాదు. ఓటరుకు దగ్గరవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. రోడ్డు మీద బజ్జీలు వేస్తారు? పిల్లలతో కలిసి ఆటలు ఆడతారు, సెల్ఫీలు, ఇంట్లోకి వెళ్లి భోజనాలు.. ఇలా విచిత్రమైన పనులతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అయితే కానీ, ఓటరుకు మరింత దగ్గరవ్వాలంటే 'తమలోనూ ఒక సామాన్యుడు ఉన్నాడు' అని నిరూపించుకోవాలి. ఇందుకోసం సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు నిర్వహించడం ఒక గ్లోబల్ ట్రెండ్గా మారింది.పినరయిలోని మరో కోణంకేరళ రాజకీయాల్లో పినరయి విజయన్ అంటే అత్యంత కఠినమైన నాయకుడనే పేరుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలో పినరయి విజయన్ కు ఉన్న ఆ గంభీరమైన ముద్రను మార్చి, ఆయనలోని నవ్వు ముఖాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ ఛానల్ ఒక ఇంటర్వ్యూను ప్లాన్ చేసింది. మొదట మమ్ముట్టిని అనుకున్నప్పటికీ, ఇద్దరూ గంభీర స్వభావులే కావడంతో ఆ బాధ్యతను శ్రీనివాసన్ కు అప్పగించారు. శ్రీనివాసన్ అయితేనే పినరయిని నవ్వించగలరని భావించి చేసిన ఇంటర్వ్యూ సూపర్ హిట్ అయింది. తన చిన్నప్పటి దెయ్యాల భయం గురించి పినరయి సరదాగా చెప్పడం ప్రజల్లో ఆయనపై ఉన్న భయాన్ని పోగొట్టింది.నటి నవ్య నాయర్ కూడా గతంలో పినరయి కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేసింది. అక్కడ ఆమె పినరయిని ‘విజయన్ అంకుల్’ అని పిలిచారు. గంభీరమైన నాయకుడి వెనుక ఉన్న తండ్రిని, భర్తను ప్రజలకు పరిచయం చేయడమే ఆ కార్యక్రమ ఉద్దేశం.కలిసొచ్చిన మోదీ ‘మామిడి పండ్ల’ ముచ్చట్లు2019 లోక్సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనం సృష్టించింది. ఇది పూర్తిగా రాజకీయేతర సంభాషణ. మోదీకి మామిడి పండ్లు అంటే ఇష్టమా? ఆయన రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతారు? వంటి వ్యక్తిగత విషయాల గురించి ఇందులో చర్చించారు.మమతా బెనర్జీ తనకు కుర్తాలు పంపిస్తారని చెప్పడం ద్వారా, రాజకీయ వైరం ఉన్నా వ్యక్తిగత సంబంధాలు బాగుంటాయని సందేశం ఇచ్చారు. ఇది సామాన్య ఓటర్లలో మోదీ పట్ల సానుకూలతను పెంచింది. ఇది ఎన్నికల గిమ్మిక్కు అని విపక్షాలు విమర్శించినా, ఫలితం మాత్రం మోదీకి అనుకూలంగానే వచ్చింది. ఇదే పంథాలో ప్రపంచ నాయకులుభారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాధినేతలు కూడా ఇదే పంథాను అనుసరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు బరాక్ ఒబామా ‘బిట్వీన్ టూ ఫెర్న్స్’ వంటి హాస్య ప్రధాన్యత ఉన్న షోలలో పాల్గొన్నారు. తన ‘ఒబామా కేర్’ పథకం గురించి యువతకు చేరవేయడానికి సినీ తారల సహాయం తీసుకున్నారు. 2024లో జరిగిన అమెరికా ఎన్నికల సమయంలో డోనాల్డ్ ట్రంప్ జో రోగన్ వంటి పాపులర్ పాడ్కాస్టర్లతో గంటల తరబడి మాట్లాడారు. తన సోదరుడి మరణం గురించి భావోద్వేగంగా మాట్లాడుతూ ఓటర్లకు చేరువయ్యారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వతహాగా నటుడు కావడంతో, ఆయన తన ప్రతిష్టను పెంచుకోవడంలో సినిమా మాధ్యమాన్ని చక్కగా వాడారు. హాలీవుడ్ నటుడు షాన్ పెన్ ఆయనపై ‘సూపర్ పవర్’ అనే డాక్యుమెంటరీ కూడా తీశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తనను ఒక శక్తివంతమైన నాయకుడిగా ప్రపంచానికి చూపించుకోవడానికి హాలీవుడ్ దర్శకుడు ఆలివర్ స్టోన్ తో వరుస ఇంటర్వ్యూలు చేయించుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా అమెరికన్ టాక్ షో హోస్ట్లు స్టీఫెన్ కోల్బెర్ట్, కోనన్ ఓబ్రియన్ వంటి వారితో సరదాగా ముచ్చటిస్తూ తన ‘కూల్ ఇమేజ్’ను ప్రదర్శించారు.కలిసొస్తున్న ‘గ్లామర్’ పాలిటిక్స్రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇవి కేవలం ఎన్నికల గిమ్మిక్కులు మాత్రమే కాదు. డిజిటల్ యుగంలో ప్రజలు నాయకుడిలోని 'మానవీయ కోణాన్ని' చూడాలని కోరుకుంటున్నారు.కఠినమైన విధాన నిర్ణయాల కంటే, ఇలాంటి సరదా సంభాషణలే ప్రజల మెదళ్లలో ఎక్కువ కాలం గుర్తిండిపోతాయి.దీంతో పాటు సెలబ్రిటీల ఫాలోయింగ్ను వాడుకోవడం ద్వారా యువ ఓటర్లను సులువుగా ఆకర్షించవచ్చు. కేరళలో పినరయి-మోహన్ లాల్ ఇంటర్వ్యూ అయినా, ఢిల్లీలో మోదీ-అక్షయ్ ముచ్చట్లయినా.. అంతిమ లక్ష్యం ఒక్కటే: "నేను మీలో ఒకడిని" అని చాటిచెప్పడం. గ్లామర్,పొలిటికల్ పవర్ కలిసినప్పుడు పుట్టే ఈ 'కొత్త రాజకీయం' భవిష్యత్తులో మరిన్ని వింత పోకడలకు దారితీస్తుందనడంలో సందేహం లేదు. -
ట్రంప్ సర్కార్కు మరో భారీ షాక్..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు న్యాయస్థానాల్లో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సుంకాల విషయంలో ఇప్పటికే ట్రంప్నకు వ్యతిరేకంగా తీర్పు రాగా.. తాజాగా ఫెడరల్ కోర్టులో మరో షాక్ తగిలింది. అమెరికా నుంచి అక్రమ వలసదారులను ఇతర దేశాలకు తరలించడాన్ని అక్కడి ఫెడరల్ కోర్టు తప్పుబట్టింది. దీంతో, ట్రంప్ సర్కార్కు ఝలక్ తగిలింది.వివరాల మేరకు.. డొనాల్డ్ ట్రంప్ రెండో సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వలసదారులను యూఎస్ నుంచి గ్వాటమాల, దక్షిణ సూడాన్, కోస్టారికా వంటి ఇతర దేశాలకు తరలించారు. ఈ నేపథ్యంలో తరలింపు ఎదుర్కొంటున్న వలసదారులు.. ట్రంప్ చర్యలపై కోర్టులను ఆశ్రయించారు. పలు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై కోర్టులో దావా వేయగా, తాజాగా న్యాయస్థానంలో విచారణ జరిగింది.ఈ సందర్భంగా ఫెడరల్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా.. అక్రమ వలసదారులకు ముందస్తు నోటీసులు, తగిన సమయం ఇవ్వకుండా వారికి సంబంధం లేని వేరే దేశాలకు తరలించడం చట్టవిరుద్ధమని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ట్రంప్ యంత్రాంగానికి 15 రోజుల పాటు సమయం ఇచ్చింది. ఈ క్రమంలో ట్రంప్ కార్యవర్గం నిర్ణయాన్ని తాత్కాలికంగా సస్పెండ్ చూస్తూ మసాచుసెట్స్లోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి బ్రియాన్ మర్ఫీ ఈ మేరకు తీర్పునిచ్చారు. యూఎస్ సుప్రీంకోర్టు తీర్పుఅమెరికా అధ్యక్షుడు విధించిన సుంకాల (టారిఫ్స్)కు బ్రేక్ పడింది. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు చట్ట విరుద్ధంగా ఉన్నాయని.. ఆ దేశ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అయితే, అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ.. ఎలాగైనా 15 శాతం సుంకాలను అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. టారిఫ్లను విధించే అధికారం అధ్యక్షుడికి కానీ, వైట్హౌస్కు కానీ లేదని అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వాణిజ్యం, పన్నులకు సంబంధించిన అంశాలపై పూర్తి అధికారం అమెరికా కాంగ్రెస్కు మాత్రమే ఉందని వెల్లడించింది. ఇప్పటి వరకూ వసూలు చేసిన వందల బిలియన్ డాలర్ల సుంకాలను.. దిగుమతి దారులకు తిరిగి ఇవ్వాల్సి రావొచ్చని కూడా సుప్రీం తెలిపింది.ట్రంప్ అసంతృప్తి..గ్లోబల్ టారిఫ్ విధానాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం తనను తీవ్ర నిరాశపరిచిందని ఆయన అన్నారు. అదేవిధంగా కొంతమంది న్యాయమూర్తులు విదేశీ శక్తుల ప్రభావానికి లోనయ్యారని ట్రంప్ ఆరోపించారు. -
ఎప్ స్టీన్ కేసులో కొత్త ట్విస్ట్.. ట్రంప్ ఫైళ్లు మాయం?
-
‘ఇన్స్టా’లో ప్రధాని మోదీ రికార్డు.. ట్రంప్ ఎక్కడంటే..
న్యూఢిల్లీ: ప్రపంచ వేదికలపై తిరుగులేని ప్రజాదరణతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల్లో మరో సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రముఖ ఫోటో షేరింగ్ ప్లాట్ఫారమ్ ‘ఇన్స్టాగ్రామ్’లో 100 మిలియన్ల (10 కోట్ల) ఫాలోవర్ల మార్కును దాటిన తొలి ప్రపంచ నేతగా ప్రధాని మోదీ నిలిచారు. అంతర్జాతీయ నేతలతో పోలిస్తే ప్రధానమంత్రి మోదీ ప్రజాదరణ అందనంత ఎత్తులో ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 43.2 మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉన్నారు. 2014లో ఈ ప్లాట్ఫారమ్లో అడుగుపెట్టిన ప్రధాని మోదీ గత దశాబ్ద కాలంలో తన డిజిటల్ ఉనికిని అమితంగా చాటుకున్నారు. కేవలం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ యువతను ఆకర్షించడంలోనూ ఆయన ముందున్నారు. మోదీ సాధించిన ఈ ఘనత ఎంతటిదంటే.. ప్రపంచంలోని తదుపరి ఐదుగురు ప్రముఖ దేశాధినేతల మొత్తం ఫాలోవర్ల సంఖ్యను కలిపినా, అది మోదీ వ్యక్తిగత ఫాలోవర్ల సంఖ్య కంటే తక్కువగా ఉండటం గమనార్హం.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 43.2 మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉండగా, మోదీ ఆయన కంటే రెట్టింపు కంటే ఎక్కువ ఫాలోవర్లను కలిగి ఉన్నారు. వీరి తర్వాత ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో (15 మిలియన్లు), బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా (14.4 మిలియన్లు), టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ (11.6 మిలియన్లు) వరుస స్థానాల్లో నిలిచారు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ 6.4 మిలియన్ల ఫాలోవర్లతో జాబితాలో కొనసాగుతున్నారు.దేశీయ రాజకీయాల్లోనూ ఇతర నేతలతో పోలిస్తే ప్రధానమంత్రికి ఉన్న ఆదరణ అమితంగా ఉంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 16.1 మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉండగా, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సుమారు 12.6 మిలియన్ల ఫాలోవర్లతో మూడో స్థానంలో నిలిచారు. కేవలం సోషల్ మీడియా ఫాలోయింగ్లోనే కాకుండా, ప్రపంచ నేతల ‘అప్రూవల్ రేటింగ్’ (ఆమోదయోగ్యత)లోనూ మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. స్టాటిస్టా నివేదిక ప్రకారం 2025 డిసెంబర్ నాటికి ప్రధాని మోదీ 70 శాతం రేటింగ్తో ప్రథమ స్థానంలో ఉండగా, జపాన్ ప్రధాని సనే తకైచి (63 శాతం), అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ (60 శాతం) తరువాతి స్థానాల్లో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 43 శాతం రేటింగ్తో 11వ స్థానానికి పరిమితమయ్యారు.ప్రముఖ అంతర్జాతీయ బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘మోర్నింగ్ కన్సల్ట్’ విడుదల చేసిన గణాంకాలు సైతం మోదీదే పైచేయి అని చెబుతున్నాయి. 2026 ఫిబ్రవరి 2 నుంచి 8 మధ్య సేకరించిన సమాచారం ప్రకారం 67 శాతం ఆమోదయోగ్యతతో మోదీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా నిలిచారు. చెక్ రిపబ్లిక్ నేత ఆండ్రెజ్ బాబిస్ (59 శాతం) రెండో స్థానంలో నిలవగా, డొనాల్డ్ ట్రంప్ 40 శాతంతో 11వ స్థానంలోనే కొనసాగుతున్నారు. అంతకుముందు 2025 నాటి డేటాలోనూ 75 శాతం రేటింగ్తో మోదీ అగ్రస్థానంలో నిలవగా, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ 59 శాతంతో తర్వాతి స్థానంలో నిలిచారు. -
భారత్, పాక్ యుద్ధం ఆపకుంటే... కోట్ల మంది చనిపోయేవారు!
న్యూయార్క్/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పాత పాటే పాడారు. భారత్, పాకిస్తాన్ నడుమ యుద్ధాన్ని తానే ఆపానని చెప్పుకున్నారు. కాకపోతే ఈసారి దానికి తనదైన శైలిలో మరిన్ని విశేషణాలు జోడించారు. ‘‘నేనే గనక జోక్యం చేసుకోకపోతే ఆ రెండు దేశాల మధ్య ఘర్షణ ఘోర అణుయుద్ధానికి తారి తీసేది. అప్పుడు ఏకంగా 3.5 కోట్ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయేవారు. ఈ మాట పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నాతో స్వయంగా చెప్పారు’’అంటూ గొప్పలకు పోయారు. మంగళవారం ట్రంప్ అమెరికా కాంగ్రెస్ను ఉద్దేశించి వార్షిక ప్రసంగం చేశారు. అధ్యక్షునిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక తొలి 10 నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 8 యుద్ధాలను ఆపానని పునరుద్ఘాటించారు. కంబోడియా–థాయ్లాండ్, కొసావో–సెర్బియా, ఇజ్రాయెల్–ఇరాన్, ఈజిప్్ట–ఇథియోపియా, అర్మనియా–అజర్బైజాన్, కాంగో–రువాండా, గాజా యుద్ధాల గురించి చెబుతూ భారత్, పాక్ ప్రస్తావన కూడా తెచ్చారు. దాయాదుల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని గత ఏడాది కాలంలో ట్రంప్ కనీసం 100 సార్లకు పైగా చెప్పుకోవడం తెలిసిందే. ఆపకపోతే కోటి మంది మరణించి ఉండేవారని ఒకసారి, 2.5 కోట్ల మంది చనిపోయేవారని మరోసారి చెప్పుకొచ్చిన ఆయన.. ఈసారి ఆ సంఖ్యను 3.5 కోట్లకు పెంచేయడం విశేషం! ట్రంప్ ప్రకటనలను భారత్ ఎప్పుడో ఖండించింది. పాక్ దిగొచ్చి స్పష్టంగా విజ్ఞప్తి చేసినందుకే ఆపరేషన్ సిందూర్కు స్వస్తి పలికినట్టు స్పష్టం చేసింది. బాబోయ్, మరీ ఇన్ని విజయాలా! అధ్యక్షునిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక తాను సాధించిన విజయాలు తదితరాలను ఏకరువు పెడుతూ కాంగ్రెస్ను ఉద్దేశించి ట్రంప్ ఏకంగా 100 నిమిషాలకు పైగా మాట్లాడారు! తద్వారా తన గత రికార్డును తానే అధిగమించారు. ఏడాది పాలనలో అమెరికాను తిరిగి అత్యంత శక్తిమంతంగా తీర్చిదిద్దినట్టు చెప్పుకున్నారు. ‘‘ఇంటాబయటా అమెరికన్ల భద్రతను ఎన్నడూ లేనంతగా బలోపేతం చేసుకోగలిగాం. ఉపాధి నుంచి ఉత్పత్తి దాకా అన్ని రంగాల్లోనూ విజయ పరంపరలు కొనసాగిస్తున్నాం. టారిఫ్లతో దేశాలను దారికి తెచ్చి మనమేంటో చూపించాం. దేశం మళ్లీ గెలుపు బాటకు మళ్లింది. ఎన్నెన్ని విజయాలు సాధిస్తున్నామో చెప్పలేను! అందుకే ఏయే అంశాలను ప్రస్తావించాలో కూడా నాకే తెలియడం లేదు. ప్రజలు కూడా అదే అంటున్నారు. ‘బాబోయ్, ఇన్ని విజయాలా!? ప్రెసిడెంట్! మనం మరీ ఎక్కువ విజయాలు సాధిస్తున్నాం. ఇంతకుమించి తట్టుకోవడం మావల్ల కాదు. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్!’అని వేడుకుంటున్నారు’’అని చెప్పుకొచ్చారు. అమెరికాలో నవంబర్లో మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా నానాటికీ పడిపోతున్న తన రేటింగ్స్ను పెంచుకోవడమే లక్ష్యంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు భావిస్తున్నారు. టారిఫ్లు కొనసాగుతాయ్ ప్రపంచ దేశాలపై తన టారిఫ్లను కొట్టేసిన సుప్రీంకోర్టు తీర్పును ట్రంప్ మరోసారి తూర్పారబట్టారు. సుంకాల రూపంలో దేశానికి భారీగా ఆదాయం వచ్చి పడుతూ అంతా బాగా సాగుతున్న వేళ పనికిమాలిన తీర్పు వచ్చి పడిందంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ఆమోదంతో నిమిత్తం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాటిని కొనసాగించి తీరతానని పునరుద్ఘాటించారు. అంతేకాదు, ‘‘ఏదో ఒకనాడు నా టారిఫ్లు ఆధునిక ఆదాయ పన్ను వ్యవస్థ స్థానాన్ని భర్తీ చేస్తాయి. చూస్తుండండి! అప్పుడు అందరూ నన్ను గొప్పగా ప్రస్తుతిస్తారు’’అని చెప్పుకొచ్చారు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించే ప్రసక్తే లేదని ట్రంప్హెచ్చరించారు.ఇది మూడో టర్మ్ కావాల్సింది! కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రసంగం సందర్భంగా ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షునిగా తనకిది నిజానికి మూడో టర్ము కావాల్సిందని చెప్పుకొచ్చారు. ‘‘అనుకోనివి జరుగుతుంటాయి. ఏం చేస్తాం!’’అంటూ నిట్టూర్చారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓటమిని ట్రంప్ అంగీకరించకపోవడం, క్యాపిటల్ హిల్ భవనంపై దాడికి తన మద్దతుదారులను రెచ్చగొట్టడం తెలిసిందే. దాన్ని ఉద్దేశించి తాజాగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యక్తి రెండుసార్లకు మించి అధ్యక్షుడు అయ్యేందుకు అమెరికా రాజ్యాంగం అనుమతించదు. -
ట్రంప్ వ్యాఖ్యలన్నీ అబద్దాలే..ఇరాన్
టెహ్రాన్: "ట్రంప్ ది స్టేట్ ఆఫ్ ది యూనియన్" ప్రసంగంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రంప్ చేసిన వాఖ్యలన్నీ పెద్ద అబద్దాలనీ తెలిపింది. అణుకార్యక్రమంపై అమెరికా చేస్తున్న ఆరోపణల్లో అస్సలు నిజం లేదని వెల్లడించింది. జోసఫ్ గ్లోబల్స్ తరహాలో ట్రంప్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఇరాన్ మండిపడింది. అణుచర్చల పేరుతో ట్రంప్ దాడులకు దిగితే అస్సలు సహించేది లేదని తెలిపింది. ఇటీవల ఇరాన్లో జరిగిన నిరసనల్లో ట్రంప్ చెప్పిన మరణాల సంఖ్య పూర్తిగా కల్పితమే అని తెలిపింది. మధ్యప్రాచ్యంలో అమెరికా తన బలగాలు మోహరించడంపై ఇరాన్ ఆందోళన వ్యక్తం చేసింది. కాగా త్వరలో అమెరికా- ఇరాన్ మధ్య అణు చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల మధ్య చర్చలు విఫలమైతే అమెరికా దాడులు చేసే అవకాశాలే అధికంగా ఉన్నాయి. ఈ నేఫథ్యంలోనే ఇరాన్ మరోసారి అమెరికాపై మండిపడింది. -
భారత్కు అమెరికా కొత్త ‘షాక్’.. 126% టారిఫ్!
భారత్కు అమెరికా కొత్త ‘షాక్’ ఇచ్చింది. ఇండియా నుంచి దిగుమతి అయ్యే సౌర ఉత్పత్తులపై భారీగా సుంకాలను విధిస్తున్నట్లు అమెరికా వాణిజ్య శాఖ ప్రకటించింది. భారత్తోపాటు ఇండోనేషియా, లావోస్ దేశాల సౌర ఉత్పత్తులపైనా టారిఫ్లను విధిస్తున్నట్లు వెల్లడించింది. కొంతమంది విదేశీ తయారీదారులు ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందుతూ, మార్కెట్ ధరల కంటే తక్కువకు సౌర పరికరాలను అమెరికాలో విక్రయిస్తున్నారన్న దర్యాప్తు నివేదికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.భారత్కు 126% సుంకాలుభారతీయ సౌర ఉత్పత్తులపై సుమారు 126 శాతం ప్రాథమిక సుంకం విధించనుంది అమెరికా. ఇక ఇండోనేషియా నుంచి వచ్చే దిగుమతులపై 86 శాతం నుంచి 143 శాతం వరకు, లావోస్ ఉత్పత్తులపై సుమారు 81 శాతం సుంకాలు అమల్లోకి రానున్నాయి. పన్ను రాయితీలు, తక్కువ వడ్డీ రుణాలు, ఇతర ప్రభుత్వ మద్దతు వంటి ప్రయోజనాల వల్ల ఎగుమతిదారులు పొందుతున్న అన్యాయ లాభాలను సమతుల్యం చేయడమే ఈ చర్యల లక్ష్యమని యూఎస్ అధికారులు స్పష్టం చేశారు. ఈ సుంకాలు ప్రస్తుతానికి తాత్కాలికమే అయినా వీటిపై రానున్న నెలల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు.అమెరికా మార్కెట్లో కీలక భాగస్వామ్యంయూఎస్ గణాంకాల ప్రకారం.. 2025 ప్రథమార్ధంలో అమెరికాలోకి దిగుమతి అయిన మొత్తం సోలార్ మాడ్యూల్స్లో భారత్, ఇండోనేషియా, లావోస్.. మూడు దేశాల వాటా 57 శాతం. ఇందులో భారత ఎగుమతుల విలువ సుమారు 790 మిలియన్ డాలర్లుగా అంచనా. దేశీయ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా సౌర మార్కెట్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది.(ఇదీ చదవండి: అఫైర్లు నిజమే.. అంగీకరించిన బిల్గేట్స్)భారత ఎగుమతిదారుల్లో ఆందోళనఅమెరికా ప్రధాన మార్కెట్గా మారిన నేపథ్యంలో భారత సౌర తయారీదారులు ఈ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2023 నుంచి 2025 మధ్య భారత సోలార్ మాడ్యూల్ ఎగుమతుల్లో దాదాపు 97 శాతం యునైటెడ్ స్టేట్స్కే వెళ్లినట్లు అంచనాలు చెబుతున్నాయి. తాజా సుంకాల వల్ల ధరల పోటీ సామర్థ్యం, ఎగుమతి పరిమాణాలపై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
నేను యుద్ధం ఆపకుంటే పాక్ ప్రధాని చనిపోయేవారు: ట్రంప్
-
చావబోయే పాక్ ప్రధానిని కాపాడా: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నిర్వహించిన అత్యంత కీలక ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగంలో .. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రాణాలను తానే కాపాడానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకానొక దశలో షరీఫ్ ప్రాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లిందని, ఒకవేళ తాను జోక్యం చేసుకోకపోయి ఉంటే ఆయన ఖచ్చితంగా మరణించి ఉండేవారని ట్రంప్ పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు పాకిస్తాన్ రాజకీయ వర్గాల్లోనూ, ఇటు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లోనూ పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన ప్రసంగంలో భాగంగా ట్రంప్ విదేశీ సంబంధాలు, భద్రతాపరమైన అంశాలను ప్రస్తావిస్తూ, పాక్ ప్రధాని ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తాను రక్షకుడిగా నిలిచానని అన్నారు. రెండు అణు దేశాల మధ్య పెను విపత్తును తాను నివారించానని ట్రంప్ పేర్కొన్నారు. తన పదవీకాలంలోని మొదటి పది నెలల్లోనే థాయ్లాండ్-కాంబోడియా సహా ఎనిమిది యుద్ధాలను నివారించానని ట్రంప్ పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్-పాక్ మధ్య తలెత్తిన అణు ముప్పును తప్పించడంలో తన పాత్ర నిర్ణాయకమని అన్నారు.ఈ సందర్భంగా ‘ఆపరేషన్ సిందూర్’ అంశాన్ని ట్రంప్ ప్రత్యేకంగా ప్రస్తావించడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఈ ఆపరేషన్ గనుక కొనసాగి ఉంటే పాకిస్తాన్లో దాదాపు 3.5 కోట్ల మంది మరణించే అవకాశం ఉండేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ భారీ మరణాల అంచనాకు గల ప్రాతిపదికను గానీ, ఆపరేషన్ సిందూర్ నేపధ్యాన్ని గానీ ఆయన వెల్లడించలేదు. చారిత్రక శతృత్వం ఉన్న రెండు అణుశక్తి దేశాల మధ్య ఉద్రిక్తతలు అదుపు తప్పి ఉంటే అవి పెను విధ్వంసానికి దారితీసేవని, కానీ తన దౌత్యపరమైన చొరవతో ఆ ప్రమాదాన్ని అడ్డుకున్నానని ఆయన పునరుద్ఘాటించారు.దక్షిణాసియాలో అత్యంత క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్న తరుణంలో తక్షణమే స్పందించడం ద్వారా పెను విషాదాన్ని ఆపగలిగానని ట్రంప్ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. అణు యుద్ధం అంచున ఉన్న ఇరు దేశాలను శాంతి వైపు మళ్లించడంలో అమెరికా అధ్యక్షుడిగా తాను పోషించిన పాత్ర అద్వితీయమని అన్నారు. పాకిస్తాన్ ప్రధాని ప్రాణాలు కాపాడటం వెనుక గల కారణాలను ఆయన ప్రస్తావించనప్పటికీ, అమెరికా జోక్యం వల్లే షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించారు. గతంలోనూ పాకిస్తాన్ పట్ల భిన్నమైన వైఖరిని ప్రదర్శించిన ట్రంప్, ఇప్పుడు నేరుగా ఆ దేశ ప్రధాని ప్రాణాలను కాపాడానని ప్రకటించడం ద్వారా తన ప్రాధాన్యతను చాటుకున్నారు. ఈ పరిణామంపై అటు పాకిస్తాన్ ప్రభుత్వం గానీ, ఇటు షెహబాజ్ షరీఫ్ కార్యాలయం గానీ ఇప్పటివరకు స్పందించలేదు. -
అమెరికా పేరు చెబితేనే వణుకుతున్నారు: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షునిగా రెండో విడత బాధ్యతలు చేపట్టిన అనంతరం ట్రంప్ తొలిసారి కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రసంగించారు. దేశం ప్రస్తుతం ఒక అద్భుతమైన మార్పునకు సాక్ష్యంగా నిలుస్తోందని పేర్కొన్నారు. తన పరిపాలనలో గడిచిన ఏడాది కాలం అమెరికా చరిత్రలోనే ఒక గొప్ప మలుపుగా అభివర్ణించారు. దేశ ఆర్థిక వ్యవస్థ గతంలో ఎన్నడూ లేనంత వేగంగా పుంజుకుంటోందని పేర్కొన్నారు. స్వర్ణయుగం దిశగా అమెరికా పయనిస్తున్నదని వ్యాఖ్యానించారు. తాను అధికారంలోకి వచ్చే నాటికి దేశం తీవ్ర సంక్షోభంలో ఉందని, కుంటుపడిన ఆర్థిక వ్యవస్థ, రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం, అదుపులేని సరిహద్దు సమస్యలు, పెరుగుతున్న నేరాలతో సతమతమవుతున్న అమెరికాను కేవలం ఏడాది కాలంలోనే ప్రపంచం గర్వించే స్థాయికి చేర్చానని ట్రంప్ పేర్కొన్నారు. సభలో ఒకవైపు నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ, ఆయన మద్దతుదారులు ‘యూఎస్ఏ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. US President Donald Trump joked about having a third term during his 2026 State of the Union address pic.twitter.com/wx89Zq7Sqe— NDTV (@ndtv) February 25, 2026దేశ భద్రత, సరిహద్దు రక్షణపై ట్రంప్ తన ప్రసంగంలో ప్రత్యేకంగా చెప్పారు. అమెరికా సరిహద్దులు ప్రస్తుతం అత్యంత సురక్షితంగా ఉన్నాయని, శత్రు దేశాలవారు అమెరికా పేరు చెబితేనే వణుకుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సైనిక, పోలీసు బలగాలను మునుపటి కంటే మరింత శక్తివంతం చేశామని, దీనివల్ల అంతర్జాతీయ వేదికపై అమెరికా కోల్పోయిన గౌరవాన్ని తిరిగి సంపాదించుకుందని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు.ప్రపంచవ్యాప్తంగా అశాంతి నెలకొన్న తరుణంలో కూడా అమెరికా తన బలాన్ని నిరూపించుకున్నదని, రానున్న రోజుల్లో దేశం మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ట్రంప్ తన విజయాలను చాటుకుంటున్న సమయంలోనే, ఆయన విదేశాంగ విధానాలు, సుంకాల విధింపుపై ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొంది. గతంలో ప్రభుత్వం విధించిన సుంకాలను సుప్రీంకోర్టు కొట్టివేయగా, తాజాగా 15 శాతం ప్రపంచవ్యాప్త సుంకాలను విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం.అటు ఇరాన్తో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, దాడుల భయాల మధ్య ఈ ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు దేశీయంగా పెరుగుతున్న జీవన వ్యయం, వలసల నియంత్రణ వంటి అంశాల్లో ట్రంప్ తీరుపై ప్రజల్లో కొంతమేరకు అసంతృప్తి వ్యక్తమవుతోందని ఇటీవలి ప్రజాభిప్రాయ సేకరణలు వెల్లడిస్తున్నాయి. ఈ సవాళ్ల మధ్యే, తన ప్రభుత్వం సాధించిన మార్పు సామాన్యమైనది కాదని, ఇది రాబోయే తరాలకు దిక్సూచిగా నిలుస్తుందని ట్రంప్ పేర్కొనడం గమనార్హం.డొనాల్డ్ ట్రంప్ ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగంలోని ప్రధాన అంశాలుఅమెరికాలో సరికొత్త స్వర్ణయుగం ప్రారంభం.దేశ పునర్నిర్మాణానికి నాందిగా గత ఏడాది కాలం.అమెరికా ఆత్మగౌరవం పునరుద్ధరణ మరియు ఆర్థిక వ్యవస్థ వేగవంతం.ప్రపంచ దేశాల ముందు పెరిగిన అమెరికా గౌరవం.గత తొమ్మిది నెలల్లో అక్రమ వలసలు శూన్యం.చరిత్రలోనే అత్యంత కట్టుదిట్టమైన సరిహద్దు భద్రత.కేవలం 12 నెలల్లోనే ద్రవ్యోల్బణం అదుపులోకి..2025 చివరి త్రైమాసికంలో 1.7 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం..అనేక రాష్ట్రాల్లో గాలన్ పెట్రోల్ ధర 2.30 డాలర్ల కంటే తక్కువకు తగ్గింపు.కొన్ని చోట్ల 1.99 డాలర్లకే లభిస్తున్న పెట్రోల్..పెట్టుబడులు, పరిశ్రమలు మరియు ఉపాధి అవకాశాల వెల్లువ..చమురు అవసరాల కోసం వెనిజులాతో సరికొత్త భాగస్వామ్యం..వెనిజులా నుంచి ఇప్పటికే 80 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి.వెనిజులా ఇంధన రంగంలో అమెరికా సంస్థల 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళిక.ఇరు దేశాల మధ్య చమురు లాభాల పంపకం.'డ్రిల్, బేబీ, డ్రిల్' నినాదంతో ఇంధన స్వయంసమృద్ధి.టారిఫ్లపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల తీవ్ర అసహనం.విదేశీ కంపెనీలు ఒప్పందాలకు కట్టుబడి ఉండేలా కఠిన చర్యలు.ఎన్నికల సంస్కరణల కోసం కాంగ్రెస్కు పిలుపు.ఓటర్లకు గుర్తింపు కార్డు, పౌరసత్వ ధృవీకరణ తప్పనిసరి30 మంది డెమొక్రాట్ ప్రతినిధుల ప్రసంగ బహిష్కరణడెమొక్రాట్ల ఆధ్వర్యంలో 'పీపుల్స్ స్టేట్ ఆఫ్ ది యూనియన్' కార్యక్రమం.సభలో రిపబ్లికన్ల 'USA' నినాదాల హోరునిరసన తెలిపిన కాంగ్రెస్ సభ్యుడు అల్ గ్రీన్ సభ నుంచి బహిష్కరణవాషింగ్టన్, లాస్ ఏంజెల్స్ నగరాల్లో నేరాల అదుపునకు హామీ.అమెరికా ప్రజల భద్రతే ప్రధమ ప్రాధాన్యతసైనిక, పోలీసు బలగాల పటిష్ఠతశత్రువుల గుండెల్లో భయం, సరిహద్దుల రక్షణదేశ ఆర్థిక, రక్షణ రంగాల్లో చారిత్రాత్మక పురోగతి. -
15 కాదు, 10 శాతమే!
వాషింగ్టన్: ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 10 శాతం టారిఫ్లు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి. అత్యవసర ఆర్థికాధికారాల చట్టం (ఐఈఈపీఏ) కింద ఏడాది కాలంగా పలు దేశాలపై ఆయన ఎడాపెడా విధించిన భారీ టారిఫ్లను అమెరికా సుప్రీంకోర్టు గత శుక్రవారం కొట్టేయడం తెలిసిందే. దాంతో చిర్రెత్తుకొచి్చన ట్రంప్ అన్ని దేశాలపైనా కొత్తగా 10 శాతం టారిఫ్లు విధిస్తున్నట్టు అప్పటికప్పుడు ప్రకటించారు.ఆ మర్నాడే దాన్ని 15 శాతానికి పెంచుతున్నట్టు చెప్పుకొచ్చారు. కానీ యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం మాత్రం ప్రపంచ దేశాల నుంచి 10 శాతం టారిఫ్లు వసూలు చేయనున్నట్టు మంగళవారం ప్రకటించింది. సుప్రీంకోర్టు కొట్టేసిన టారిఫ్ల వసూళ్లను మంగళవారం నుంచే నిలిపేస్తున్నట్టు కూడా వెల్లడించింది.1974 నాటి వర్తక చట్టంలోని సెక్షన్ 122 ప్రకారం ట్రంప్ విధించిన తాజా టారిఫ్లు గరిష్టంగా 150 రోజుల పాటు కొనసాగుతాయి. ఆలోపు కాంగ్రెస్ అనుమతి లభించని పక్షంలో అంతటితో వాటికి కాలదోషం పడుతుంది. ఈలోపే వాటిని ట్రంప్ ప్రకటించినట్టుగా 15 శాతానికి పెంచుతారా అన్నదానిపై ప్రస్తుతానికైతే స్పష్టత లేదు. మరోవైపు, ఐఈఈపీఏ కింద వసూలు చేసిన అధిక టారిఫ్లను తిరిగి చెల్లించాలంటూ ఫెడెక్స్తో పాటు పలు అమెరికా కంపెనీలు ఇప్పటికే ట్రంప్ సర్కారుపై కోర్టుకెక్కాయి.ఆ చట్టం కింద అమెరికా ఏకంగా 130 బిలియన్ డాలర్ల దాకా వసూలు చేసినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఆ మొత్తాలను తిరిగివ్వబోమని, అవసరమైతే అందుకోసం న్యాయపోరాటం చేస్తామని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. అంతేగాక వాణిజ్య ఒప్పందాల పేరిట అమెరికాతో ఆటలాడుతున్న పలు దేశాలపై హెచ్చు టారిఫ్లు తప్పవని సోమవారం ఆయన హెచ్చరించారు. ఈ అనిశి్చత పరిస్థితుల నేపథ్యంలో భారత్, అమెరికా వాణిజ్య ఒప్పంద చర్చలు కూడా వాయిదా పడటం తెలిసిందే. -
సుంకాలకు ముకుతాడు పడేనా?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుంకాల విధింపు ఒక ప్రహసనంగా పరిణమించింది. భౌగోళిక రాజకీయ సంబంధాలను, ప్రపంచ ఆర్థిక గతిశీలతలను చిందరవందర చేయడానికి ట్రంప్ చూపించిన మొగ్గుదల వినాశకర పర్యవసానాలకు దారితీసింది. అమెరికా సుప్రీం కోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు దీనికే అద్దం పట్టింది. అనేక దేశాలతో అమెరికా వాణిజ్యంలో భారీ లోటు, అసమతూకం చోటుచేసుకున్నాయి. వాటిని సరిదిద్దాలన్న నిస్పృహే ట్రంప్ సుంకాల బెదిరింపులలో వ్యక్తమవుతూ వచ్చింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో సహా 11 దేశాలతో కూడిన ‘బ్రిక్స్’ కూటమి అమెరికా ప్రయోజనాలకు వ్యతి రేకంగా పనిచేస్తోందని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించారు. కూటమి లోని దేశాలపై అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడి ఆవేశం, మాటల తీవ్రత చూసిన వారికి ఆయన ‘అహంకారం’తో వ్యవహరిస్తున్నారని అనిపించడంలో తప్పు లేదు. ప్రపంచ మార్కెట్లపై అమెరికా ఆధిపత్యాన్ని స్థిరపరచాలన్న ప్రయ త్నాలే ఆయన ధోరణిలో ప్రస్ఫుటమయ్యాయి. అమెరికా ఆధిప త్యాన్ని చాటడమే నిజంగా ట్రంప్ ఉద్దేశమైతే, ఆయన ఆ ప్రయ త్నాన్ని విరమించుకుని, బహుశా ఎవరెస్టు శిఖరారోహణకు యత్నించినా సఫలమై ఉండేవారనిపిస్తుంది. తీరని వాణిజ్య లోటుఅమెరికాకు, దాని భాగస్వామ్య దేశాలు చాలా వాటితో ఉన్న వాణిజ్య లోటు ఈనాటిది కాదు. కొన్నేళ్ళుగా అది పెరిగిపోతూ వచ్చి, దీర్ఘకాలిక వ్యాధిగా పరిణమించింది. అమెరికా వాణిజ్య లోటు 2024 నాటికి ఏకంగా 1.2 ట్రిలియన్ డాలర్ల మేరకు ఉంది. దాని దిగుమతులు దాదాపు 3.5 ట్రిలియన్ డాలర్ల మేరకు ఉండగా, ఎగుమతులు 2 ట్రిలియన్ డాలర్లకు కొద్ది పైచిలుకు మాత్రమే. ఈ విపరీతమైన వ్యత్యాసం సుంకాల పెంచినంత మాత్రాన తగ్గేది కాదు. దిద్దుబాటు చర్యకు ఉపక్రమించడానికి అధ్యక్షుడు ట్రంప్ బుద్ధి కుశలతతో కూడిన విధానాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించి ఉండాల్సింది. వాణిజ్య సమీకరణాలలో సమతూకానికి అది కొంత దోహదపడి ఉండేది. సుంకాల పెంపుదలలు ప్రతికూల ఫలితాలకే దారితీస్తాయి. ప్రతిగా వాణిజ్య సంబంధాలపై ‘అంతకు అంత ప్రభావం–పర్యవసానాలు’ ఉంటాయని ట్రంప్కు తెలియకుండా ఉంటుందని అనుకోలేం. భారత్, చైనాలతో సహా అనేక దేశాలతో అమెరికా వాణిజ్యంలో అసమతూకమే ఉంది. అమెరికా మొత్తం వాణిజ్య లోటులో ఈ రెండు దేశాల వాటాయే దాదాపు 33 శాతం. అమెరికా వాణిజ్య లోటు 2024లో సుమారు 368 బిలియన్ డాలర్లు ఉంటే, అందులో చైనాది సింహ భాగంగా 319 బిలియన్ డాలర్ల మేరకు ఉంది. భారత దేశంతో వాణిజ్య లోటు సుమారుగా 49 బిలియన్ డాలర్లు.డిమాండ్ను బట్టే వ్యాపారంభారత్ ద్వైపాక్షిక వాణిజ్య దృక్పథం నుంచి చూస్తే, అమెరికాకు మన దేశ మొత్తం ఎగుమతులు 2024లో 91 బిలియన్ డాలర్లకు పైగా ఉన్నాయి. అమెరికా నుంచి మన దిగుమతులు దాదాపు 42 బిలియన్ డాలర్ల మేరకు ఉన్నాయి. భారతదేశ మొత్తం దిగుమతుల విలువ 700 బిలియన్ డాలర్లకు కొద్ది పైచిలుకు ఉంటే, దానిలో అమెరికా వాటా దాదాపు 6 శాతంగా ఉంది. అమెరికాకు వెళ్ళే భారత్ ఎగుమతులలో సహజ ముత్యాలు, శాస్త్రీయంగా పెంచిన ముత్యాలు, విలువైన రత్నాలు, పాక్షికంగా విలువైన రత్నాలు ఎక్కువ భాగం ఆక్రమిస్తున్నాయి. వాటి విలువ సుమారు 12 బిలియన్ డాలర్ల మేరకు ఉంటుంది. తర్వాతి వాటా ఔషధాలది (సుమారు 9 బిలియన్ డాలర్లు) కాగా, 6 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఎలక్ట్రికల్ మెషినరీ, పరికరాలు కూడా ఎగుమతి అవుతున్నాయి. అమెరికా నుంచి మనం ఖనిజ ఇంధ నాలు, ఖనిజ నూనెలు (12 బిలియన్ డాలర్లు), న్యూక్లియర్ రియా క్టర్లు, బాయిలర్లు, యంత్ర పరికరాలు (3.2 బిలియన్ డాలర్లు) దిగుమతి చేసుకుంటున్నాం. ప్రపంచ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్న వాటిలో ఖనిజ చమురు (220 బిలియన్ డాలర్లు), శాస్త్రీయంగా పెంచిన ముత్యాలు (83 బిలియన్ డాలర్లు), న్యూక్లియర్ రియాక్టర్లు (61 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. వంట నూనెలకు భారత్ పెద్ద దిగు మతిదారుగా ఉంది. భారత్ దిగుమతి చేసుకుంటున్న పశు, వెజిట బుల్ లేదా మైక్రోబయల్ ఫ్యాట్లు, నూనెల విలువ 17 బిలియన్ డాలర్లుగా ఉంది. అందులో అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నది కేవలం 45 మిలియన్ డాలర్ల విలువైనది మాత్రమే. ఈ ఉత్పత్తికి సంబంధించి అమెరికా మొత్తం ఎగుమతుల విలువ దాదాపు 2 బిలియన్ డాలర్లు. ఈ ఉత్పత్తులలో గణనీయమైన భాగాన్ని మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలని ట్రంప్ ఆశిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కానీ, డిమాండ్, సరఫరా, అవసరాలు, నాణ్యత, ధరలు వంటి ప్రధాన అంశాలు ప్రపంచ మార్కెట్లను నడిపిస్తాయి. ప్రతీకార సుంకాల పెంపు ఎగుమతి చేస్తున్న, దిగుమతి చేసుకుంటున్న రెండు దేశాలకూ పరస్పర వినాశకర ఆయుధంగా పరిణమిస్తుందని ఆయన తెలుసుకుంటే మంచిది. ట్రంప్ అల్టిమేటం (ఒకవేళ సఫలమైతే) అంతిమ ప్రభావం దిగుమతి చేసుకుంటున్న దేశంలోని వినియోగ దారులపైనే ఉంటుంది. ప్రస్తుత సందర్భంలో అది అమెరికన్ వినియోగదారులపైనే ఉంటుందని గ్రహించాలి. అమెరికా సుప్రీంకోర్టు ఈ వాస్తవాన్ని విపులీకరించింది. తదనుగుణంగా, నిరంకుశ సుంకాల పెంపుదలలకు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేసింది. ట్రంప్ స్వయం విధ్వంసకర మీటను నొక్కకుండా అమెరికా సుప్రీం కోర్టు తీర్పు నిరోధిస్తుందేమో చూడాలి. ట్రంప్ మాత్రం రూటు మార్చి కొత్త ట్యారిఫ్లతో ముందుకొచ్చి, తగ్గేదేలే అంటున్నారు.– సత్యపాల్ మీనన్సీనియర్ జర్నలిస్ట్, జర్నలిజం అధ్యాపకులు -
డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
తాను ఎంతకాలం ఉంటానో తెలియదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఫ్లోరిడాలోని ఆయన నివాసం దగ్గర సాయుధ చొరబాటుదారుడిని భద్రతా దళాలు కాల్చివేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుసార్లు ట్రంప్పై హత్యాయత్నాలు జరిగాయి. ఈ క్రమంలో టంప్ ఆందోళన వ్యక్తం చేశారు. "నేను ఎంతకాలం ఇక్కడ ఉంటానో నాకు తెలియదు. నా కోసం చాలా మంది తుపాకులతో కాపు కాస్తున్నారు’’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల ప్రచార సమయంలో తనపై జరిగిన రెండు హత్యాయత్నాల నుంచి ప్రాణాలతో బయటపడిన ట్రంప్, తాజా ఘటనపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.‘‘మీరు ఈ పిచ్చి షూటర్ల గురించి చదివే ఉంటారు.. కానీ వారు ప్రభావశీలురైన అధ్యక్షులను మాత్రమే టార్గెట్ చేస్తారు. తక్కువ ప్రభావం ఉన్న అధ్యక్షుల జోలికి వారు వెళ్లరు’’ అంటూ ట్రంప్ పేర్కొన్నారు. గతంలో హత్యకు గురైన అబ్రహం లింకన్, జాన్ ఎఫ్.కెన్నెడీలను గుర్తుచేస్తూ.. వారు చాలా ప్రభావశీలురన్నారు. ఆ గొప్ప నాయకులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. బహుశా తాను కొంచెం తక్కువ ప్రభావశీలిగా ఉండాలనుకుంటున్నానేమోనన్న ట్రంప్.. కాస్త తగ్గించుకుందామా?.. కొన్నాళ్లపాటు ఒక సాధారణ అధ్యక్షుడిలా ఉంటానంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.గత శనివారం అర్ధరాత్రి.. ఫ్లోరిడాలోని ఆయన నివాసంలోకి ఓ దుండగుడు చొరబడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అప్రమత్తమైన భద్రతా దళాలు అతడిని కాల్చివేశాయి. ఈ ఘటన సమయంలో ట్రంప్ దంపతులు వైట్హౌస్లోనే ఉన్నట్లు సమాచారం. ఫ్లోరిడా పామ్ బీచ్లో ఉన్న ‘మార్ ఎ లాగో’ ఎస్టేట్కు ట్రంప్ వీకెండ్లో వస్తుంటారు. ఎస్టేట్ నార్త్ గేట్ నుంచి ప్రవేశించిన ఓ దుండగుడిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. అతడి చేతిలో ఆయుధంతో పాటు ఇంధనం క్యాన్ ఉన్నట్లు కూడా గుర్తించారు. అడ్డుకున్నభద్రతా దళాలపై నిందితుడు షాట్గన్ను ఎక్కుపెట్టాడు. దీంతో అధికారులు వెంటనే అతడిని మట్టుబెట్టారు. -
‘వేచి చూడండి’.. ఇరానియన్లకు హెచ్చరిక
టెహ్రాన్/వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ మిడిల్ ఈస్ట్(మధ్యప్రాచ్యం)లో ఉత్కంఠభరిత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దూకుడును పెంచడమే కాకుండా, సైనిక చర్యకు సిద్ధమన్నట్లుగా భారీ నౌకాదళాన్ని మొహరించారు. ఈ ఉద్రిక్తతల నడుమ సోమవారం వేలాది మంది ఇరానియన్ల మొబైల్ ఫోన్లకు ఒక అజ్ఞాత సందేశం రావడం కలకలం రేపింది.పర్షియన్ భాషలో ఉన్న ఆ సందేశంలో ‘అమెరికా అధ్యక్షుడు చేతల మనిషి.. ఏం జరుగుతుందో వేచి చూడండి’ అంటూ హెచ్చరికలు ఉన్నాయి. ఇరాన్ ఇంటర్నేషనల్ వార్తా సంస్థ ఈ పరిణామాలను గుర్తించింది. ఇరాన్పై పరిమిత సైనిక దాడికి వెనుకాడబోనని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సూచించారు. అణు ఒప్పందానికి ఇక 15 రోజుల సమయం మాత్రమే ఉందని, తరువాత సైనిక చర్య తప్పదని ట్రంప్ డెడ్ లైన్ విధించారు.ఇదే సమయంలో ఇరాన్ తన అణు ప్రతిపాదనల ముసాయిదాను సిద్ధం చేస్తోంది. అయితే అమెరికా ఈ అణు అంశంపైననే కాకుండా, ఇరాన్ క్షిపణి వ్యవస్థలు, ప్రాంతీయ తీవ్రవాద గ్రూపులకు అందుతున్న మద్దతుపై కూడా చర్చించాలని పట్టుబడుతోంది. ఈ క్రమంలో జెనీవాలో జరగబోయే తదుపరి రౌండ్ చర్చలు అత్యంత కీలకంగా మారాయి. యూరోపియన్ యూనియన్ సైతం ఈ ప్రాంతంలో మరో యుద్ధం వద్దంటూ దౌత్య పరిష్కారాన్ని కోరుతోంది. దేశం వెలుపల యుద్ధ భయాలు ఉండగా, ఇరాన్ లోపల అంతర్గత తిరుగుబాటు జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.ఇజ్రాయెల్తో యుద్ధం, ప్రాంతీయ ప్రాక్సీ గ్రూపులతో ఇక్కట్లు వంటి అంశాలు ఇరాన్ పాలకులకు పెను సవాలుగా మారాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన పలు దేశాలు తమ పౌరులను తక్షణమే ఇరాన్ వదిలి వెళ్లాలని ఆదేశించాయి. ఇప్పటికే స్వీడన్, పోలాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాలు హెచ్చరికలు జారీ చేయగా, తాజాగా భారత్ కూడా తన పౌరులకు అడ్వైజరీ జారీ చేస్తూ అప్రమత్తం చేసింది. లెబనాన్లోని అమెరికా రాయబార కార్యాలయం సైతం ముందు జాగ్రత్తగా సిబ్బందిని ఖాళీ చేయించే ప్రయత్నంలో ఉందని తెలుస్తోంది.ఇది కూడా చదవండి: చెల్లెలి ముందే తండ్రిని తుపాకీతో కాల్చి.. -
‘చుక్కలు చూపిస్తా’: అమెరికా అధ్యక్షుని హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన దూకుడుతనాన్ని ప్రదర్శించారు. దిగుమతి సుంకాల విషయంలో అమెరికా సుప్రీంకోర్టు (SCOTUS) ఇచ్చిన తీర్పును బేఖాతరు చేస్తూ, అంతర్జాతీయ వాణిజ్య వేదికపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాతో ఆటలు సాగించాలని చూసే దేశాలకు చుక్కలు చూపిస్తామని, గతంలో కంటే భారీ స్థాయిలో సుంకాలు విధిస్తామని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు.దశాబ్దాలుగా అమెరికాను దోచుకుంటున్న దేశాలు ఇకపై తీవ్ర పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఆయన హెచ్చరికలు జారీ చేయడం ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ తన అధికార పరిధిని మించి సుంకాలు విధించడం చట్టవిరుద్ధమని, ఇందుకు కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరని చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ నేతృత్వంలోని ధర్మాసనం 6-3 మెజారిటీతో తీర్పునిచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ట్రంప్ ఎదురుదాడికి దిగారు.కోర్టు తీర్పును పక్కనపెట్టి, తక్షణమే 10 శాతం గ్లోబల్ టారిఫ్ విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. అంతటితో ఆగకుండా మరుసటి రోజే ఆ సుంకాన్ని ఏకంగా 15 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించి తన పంతాన్ని చాటుకున్నారు. 1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని (IEEPA) ఆసరాగా చేసుకుని ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు చట్టబద్ధమైన సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు.యూరోపియన్ యూనియన్, బ్రిటన్ వంటి అగ్రరాజ్యాలు అమెరికాతో తమ వాణిజ్య ఒప్పందాలను పునఃసమీక్షించుకుంటున్న తరుణంలో ట్రంప్ వాటిపై స్పందిస్తూ ‘కొనేవాడు జాగ్రత్త’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత్ వంటి వ్యూహాత్మక భాగస్వాముల విషయంలోనూ ఈ సుంకాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో భారత్పై విధించిన 50 శాతం భారీ సుంకం, చర్చల అనంతరం 18 శాతానికి తగ్గినప్పటికీ, తాజా పరిణామాలు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి.ఇది కూడా చదవండి: Venezuela: మిన్నంటిన రాజకీయ ఖైదీల నిరసనలు -
‘నేను ఇంకా ఎంతకాలం బ్రతుకుతానో తెలియదు’
వాషింగ్టన్: తన నివాస ప్రాంతమైన మార్-ఎ-లాగో రిసార్టులోకి ప్రవేశించిన ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఆ ఘటనపై ట్రంప్ స్పందించాడు. తాను ఎంతకాలం నేను ఇక్కడ ఉంటానో తెలియదు. అనేమంది తనని టార్గెట్ చేసుకున్నట్లు వ్యాఖ్యానించారు. ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో రిసార్ట్లో జరిగిన ఘటనపై దుమారం చెలరేగింది. దుండగుడు ట్రంప్ నివాస ప్రాంగణంలో మార్టిన్ అక్రమంగా ప్రవేశించడంతో, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతనిపై కాల్పులు జరిపి హతమార్చారు.పోలీసుల వివరాల ప్రకారం, నార్త్ కరోలినాకు చెందిన 21 ఏళ్ల ఆస్టిన్ టక్కర్ మార్టిన్ ఫిబ్రవరి 23 తెల్లవారుజామున ఉత్తర గేటు వద్ద రైఫిల్తో లోపలికి ప్రవేశించాడు. భద్రతా సిబ్బంది అతన్ని ఆపడానికి ప్రయత్నించినా, ఆయుధాన్ని వదలమని చెప్పినా అతను నిరాకరించడంతో కాల్పులు జరిపారు. ఈ ఘటన సమయంలో ట్రంప్, మెలానియా ట్రంప్ అక్కడ లేరు. ఈ సంఘటనపై ట్రంప్ పైవిధంగా మాట్లాడారు. ప్రస్తుతం ఎఫ్బీఐ, సీక్రెట్ సర్వీస్, స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ట్రంప్పై దాడికి ఎందుకు యత్నించాడు. అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు -
మార్కెట్కు ‘యూఎస్ సుప్రీం’ జోష్
ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలు(టారిఫ్లు) చెల్లవంటూ యూఎస్ సుప్రీం కోర్టు ఇచి్చన తీర్పు ఈక్విటీ మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఫలితంగా సెన్సెక్స్ 480 పాయింట్లు పెరిగి 83,295 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 142 పాయింట్లు బలపడి 25,713 వద్ద నిలిచింది. సూచీలకిది రెండోరోజూ లాభాల ముగింపు. ఉదయమే సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు లాభాలతో ముందుకు కదిలాయి. స్థిరమైన డిమాండ్, ఆర్థిక పునరుద్ధరణపై ఆశావహ అంచనాలతో ప్రభుత్వ బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ డి్రస్కేషనరీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో సెన్సెక్స్ 671 పాయింట్లు పెరిగి 83,486 వద్ద, నిఫ్టీ 200 పాయింట్లు ఎగసి 25,771 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి.బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో ప్రభుత్వ రంగ బ్యాంక్స్ 1.4%, సరీ్వసెస్ 0.97%, హెల్త్కేర్ 0.89%, విద్యుత్ 0.76%, ఆటో 0.71%, ఫైనాన్సియల్ సరీ్వసెస్ 0.65%, ఎఫ్ఎంసీజీ 0.54%, యుటిలిటి 0.52 శాతం పెరిగాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.41% లాభపడగా, మిడ్క్యాప్ సూచీ 1.56% నష్టపోయింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేరు డీలాహరియాణా ప్రభుత్వానికి చెందిన ఖాతాల్లో రూ.590 కోట్ల మోసం జరిగిందంటూ వార్తలు వెలుగులోకి రావడంతో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేరు ఇంట్రాడేలో 20% క్షీణించి రూ.66.85 వద్ద లోయర్ సర్క్యూట్ తాకింది. చివరికి 16% నష్టంతో రూ.70 వద్ద స్థిరపడింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకుతో పాటు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకును ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ నుంచి హరియాణా ప్రభుత్వం తొలగించింది. దీంతో ఏయూ బ్యాంక్ షేరు 5.30% పతనమై రూ.974 వద్ద స్థిరపడింది. -
ట్రంప్ అరాచకానికి బ్రేక్
‘అరాచకం సద్దుమణిగింది... దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడుకు కళ్లెం పడింది’ అని అమెరికా ప్రజలంతా ఊపిరి పీల్చుకుని 24 గంటలు గడవకముందే మళ్లీ సమస్య మొదటికొచ్చింది. 1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం(ఐఈఈపీఏ) కింద నిరుడు ఏప్రిల్ నుంచి సుంకాలు విధిస్తున్న ఆయన చర్యలు చెల్లబోవని అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం 6–3 మెజారిటీతో తీర్పునివ్వగా, దాన్ని వమ్ము చేస్తూ ట్రంప్ కొత్తగా అన్ని దేశాలపైనా 15 శాతం అదనపు సుంకాలు విధించారు. తీర్పునిచ్చిన న్యాయమూర్తుల్ని మూర్ఖులుగా, దేశభక్తి లోపించిన వారిగా నిందించారు. పలు వ్యాపార సంస్థలతోపాటు 12 రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్లపై వెలువడిన ఈ తీర్పువల్ల ధరలు తగ్గి జనం లబ్ధి పొందుతారు. చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు ట్రంప్కు అనుకూలంగా తీర్పులిస్తూ వచ్చింది. ఏడాది కాలంలో అది మొత్తం 26 తీర్పులు వెలువరించగా, అందులో 21 ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించేవే. ఇందులో అత్యధికం అప్పీళ్ల రూపంలో వచ్చినవి. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైనప్పుడు ప్రజల తీర్పును వమ్ముచేయటానికి ప్రయత్నించారన్న ఆరోపణలతో నమోదైన కేసు నుంచి ట్రంప్కు తొలి ఉపశమనం దొరికింది. నిరుడు మార్చిలో వలసదారులను బలవంతంగా వెనక్కి పంపే నిర్ణయాన్ని కింది కోర్టులు కొట్టివేయగా, సుప్రీంకోర్టు సమర్థించింది. మొన్న డిసెంబర్లో మాత్రం ఇల్లినాయీస్ నేషనల్ గార్డును స్వాధీనంలోకి తీసుకోవటం, షికాగో అభీష్టానికి భిన్నంగా అక్కడికి పంపటాన్ని తప్పుబట్టింది. నిజానికి గత వారం ట్రంప్కు ‘అన్నీ మంచి శకునములే...’ అన్నట్టు మొదలైంది. అమెరికాలో 3,600 కోట్ల డాలర్ల పెట్టుబడులకు అనుమతిస్తూ జపాన్ గత మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. అధిక సుంకాలను 35 శాతానికి పరిమితం చేయటానికి అమెరికా అంగీకరించినందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే అధిక సుంకాలను 32 శాతం వద్దే ఆపుతామన్న ట్రంప్ హామీకి కృతజ్ఞతగా గురువారం ఇండొనేసియా అధ్యక్షుడు దేశంలోని కీలక రంగాల్లో అమెరికా సంస్థల ప్రవేశానికి మార్గం సుగమం చేస్తూ ఉత్తర్వు నిచ్చారు. వెంటనే ‘అమెరికా మళ్లీ గెలుస్తోంది’ అంటూ ట్రంప్ ట్రూత్ మాధ్యమం ద్వారా తెగ సంబరపడ్డారు. తీరా సుప్రీంకోర్టు తీర్పుతో ఆ సుంకాలు కాస్తా రద్దయ్యాయి. ఆ తీర్పు అనంతరం ట్రంప్ పెంచిన సుంకాలు కేవలం 15 శాతం కావటంతో ఆ రెండు దేశాలూ తమ నిర్ణయాలకు సహజంగానే పశ్చాత్తాప పడుతున్నాయి. మన దేశం సైతం పునరాలోచనలో పడిందని మీడియా కథనాలు చెబుతున్నాయి. సోమవారం నుంచి వరుసగా మూడు రోజులపాటు మన ప్రతినిధి బృందం అమెరికా అధికారులతో జరపవలసిన చర్చలు వాయిదా పడ్డాయి. వియత్నాం 20 శాతం అదనపు సుంకా లకు అంగీకరించగా, ఇప్పుడది 15 శాతానికి తగ్గింది. ఇంకా దక్షిణ కొరియా, తైవాన్, మలేసియా వంటి దేశాలతోపాటు అమెరికా మిత్రదేశాలు కూడా తలపట్టుకుంటున్నాయి. కాకపోతే ఒప్పందాల్ని రద్దుచేసే సాహసానికి దిగలేదు. నిరుడు 27 దేశాల యూరోపియన్ యూనియన్(ఈయూ) 15 శాతం సుంకాలకు అంగీకరిస్తూ ఒప్పందం కుదుర్చుకోగా, ట్రంప్ వాటిపై సైతం కొత్తగా 15 శాతం అదనపు సుంకాల భారం మోపారు. తన అరాచక నిర్ణయాలను సుప్రీంకోర్టు అంగీకరిస్తుందని ట్రంప్ గట్టిగా నమ్మారు. అందుకే వీలుచిక్కినప్పుడల్లా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పొగుడుతూ వచ్చారు. అమెరికాలో న్యాయమూర్తుల నియామకాల్లో అధికార పక్షం ముద్ర బహిరంగ రహస్యం. ఆ రకంగా చూస్తే మొత్తం 9 మంది న్యాయమూర్తుల్లో ప్రధాన న్యాయమూర్తి, మరో అయిదుగురు రిపబ్లికన్ అనుకూలురు. ముగ్గురు మాత్రమే డెమాక్రాటిక్ పార్టీకి చెందినవారు. ఏదేమైనా ట్రంప్ తాజా సుంకాలు 150 రోజులు మాత్రమే అమల్లో ఉంటాయి. ఈలోగా ప్రతినిధుల సభ ద్వారా తన పంతం నెగ్గించుకోవటం ఆయనకు కష్టమే. ట్రంప్ రేటింగ్ పడిపోయి, వచ్చే నవంబర్ మధ్యంతర ఎన్నికల్లో పార్టీ ఊడ్చిపెట్టుకుపోవటం ఖాయం అన్న సర్వేలు వెలువడుతున్న నేపథ్యంలో రిపబ్లికన్లు ఏం చేస్తారన్నది చూడాలి. మొత్తానికి సుప్రీంకోర్టు చెప్పినా సరే... దేశాన్ని అనిశ్చితిలో పడేసే తన ధోరణి మారబోదని ట్రంప్ తేల్చిచెప్పారు. -
నాలుగేళ్ల నరమేధం... తెర పడేదెప్పుడు?
కీవ్: ఉక్రెయిన్–రష్యా యుద్ధం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో కొనసాగుతున్న సుదీర్ఘ యుద్ధంగా గత నెలలోనే చెత్త రికార్డును మూటగట్టుకున్న పోరు. ప్రపంచమంతటా ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ యుద్ధానికి మంగళవారంతో నాలుగేళ్లు నిండనున్నాయి. ఈ పోరు ఇంకెంతకాలం కొనసాగుతుందోనంటూ ప్రపంచ దేశాలన్నీ నిటూర్పు విడుస్తున్నాయి. ఇరువైపులా లక్షలాది మంది సైనికులు సమరంలో సమిధలుగా నేలకూలినా రష్యా అధ్యక్షుడు పుతిన్ దురాక్రమణ దాహం తీరడం లేదంటూ ప్రపంచ దేశాలు ఆగ్రహిస్తున్నాయి. కానీ ఈ పోరును ఆపలేక చేష్టలుడిగి చూస్తున్నాయి. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి విఫలమై చోద్యం చూస్తోంది. ఉక్రెయిన్ రణక్షేత్రంలో రక్తధారాలు ఆగి శాంతి కపోతం ఎగురుతుందా అనే ప్రశ్నకు ప్రస్తుతానికి ఎవరూ బదులు చెప్పలేని పరిస్థితి! ఉక్రెయిన్పై తక్షణం యుద్ధం ఆపకపోతే రష్యాపై మరిన్ని అత్యంత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే హెచ్చరించారు. అందుకు జూన్ దాకా గడువువిధించారు. ఆలోపు పుతిన్ వైఖరి మారేనా? యుద్ధానికి తెర దించేందుకు అంగీకరిస్తారా? బదులుగా ఉక్రెయిన్లోని కీలక డోన్బాస్ ప్రాంతాన్ని రష్యాకు వదులుకునేందుకు అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరిస్తారా? ఇవి ప్రస్తుతానికి ట్రిలియన్ డాలర్ల ప్రశ్నలుగానే మిగిలాయి. 2022 ఫిబ్రవరి 24న మొదలు... 2014లో ఉక్రెయిన్లోని క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించుకున్నాక కూడా రష్యా దురాక్రమణ దాహం తీరలేదు. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై ఏకపక్షంగా దండెత్తింది. నాటి నుంచీ పోరాడుతున్నా ఉక్రెయిన్ నుంచి 20 శాతం భూభాగాన్ని మాత్రం ఆక్రమించుకోగలిగింది. ఈ క్రమంలో ఇరువైపులా ఏకంగా 20 లక్షల మంది సైనికులు చనిపోయారని వార్తలొచ్చాయి! అయితే 3,25,000 మంది రష్యా సైనికులు చనిపోయారని, మొత్తంగా 12 లక్షల మంది గాయపడ్డారని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ సంస్థ ప్రకటించింది. ఉక్రెయిన్ వైపు 140,000 మంది సైనికులు చనిపోయారని, 6 లక్షల మంది గాయపడ్డారని తెలిపింది. రష్యా ఆక్రమణ వేగం నత్త కన్నా మెల్లగా ఉందని నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే ఎద్దేవా చేశారు. ఐరోపా దేశాల ఆయుధ, ఆర్థికబలంతో రష్యాపై ఉక్రెయిన్ భీకరంగా పోరాడుతోంది. అందుకే నాలుగేళ్లలో డోనెట్స్క్ ప్రాంతంలో రష్యా కేవలం 50 కిలోమీటర్లు మాత్రమే ముందుకు రాగలిగిందని అంతర్జాతీయ కథనాలు వెలువడ్డాయి. ఇటీవల తాము ఆక్రమించిన నాలుగు ప్రాంతాలపై ఉక్రెయిన్ హక్కులు వదలుకోవాలని, ముఖ్యంగా కీలక డోన్బాస్ ప్రాంతాన్ని తమకు అప్పగించాలని రష్యా డిమాండ్ చేస్తోంది. అందుకు జెలెన్స్కీ ససేమిరా అంటున్నారు.డ్రోన్లదే కీలక పాత్ర గతంలో ఏ యుద్ధంలోనూ వాడనంతగా ఈ యుద్ధంలో డ్రోన్లును ఇరుదేశాలూ విచ్చలవిడిగా వాడుతున్నాయి. రష్యా యుద్ధ ట్యాంక్లను ఉక్రెయిన్ డ్రోన్లు విజయవంతంగా పేల్చేశాయి. జామర్లకు దొరక్కుండా రష్యా ఆప్టికల్ ఫైబర్ డ్రోన్లను రంగంలోకి దింపింది. దీంతో ప్రత్యక్ష దాడి పరిధి ఏకంగా 50 కిలోమీటర్లకు పెరిగింది. దీంతో ఇరువైపులా ప్రాణనష్టం అధికంగా ఉంది. డ్రోన్ల సాయంతో ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలను రష్యా ధ్వంసంచేసింది. దీంతో చలికాలంలో గట్టకట్టే చలిలో ఉక్రేనియన్లు హీటింగ్ వ్యవస్థలు విఫలమై తీవ్ర అవస్థలు పడ్డారు. దీనికి ప్రతిగా చమురు నిల్వ కేంద్రాలపై ఉక్రెయిన్ గురిపెట్టి కొంతమేర సఫలమైంది. దీంతో ఆయిల్ రిఫైనరీలు తగలబడి రష్యా ఆదాయానికి భారీగా గండిపడింది. నల్లసముద్రంలో పెద్ద సంఖ్యలో రష్యా యుద్ధనౌకలను ఉక్రెయిన్ సముద్ర డ్రోన్లు పేల్చేసి జలసమాధి చేశాయి. స్పైడర్వెబ్ కోడ్నేమ్తో రష్యా వైమానిక స్థావరాల సమీపానికి డ్రోన్ల దండును పంపి మెరుపుదాడి చేసి యుద్ధ విమానాలను ఉక్రెయిన్ నాశనంచేసింది.ఒత్తిడి పెంచుతున్న ట్రంప్ ఎన్నో యుద్ధాలను ఒంటి చేత్తో ఆపానని గొప్పలు చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఉక్రెయిన్ యుద్ధం కొరకరాని కొయ్యగా తయారైంది. పట్టువదలని విక్రమార్కుడిలా పుతిన్, జెలెన్స్కీల వెంటబడుతూ సయోధ్యకు కృషిచేస్తున్నారు. సరిహద్దు వెంట కాల్పుల విరమణకు జెలెన్స్కీ పట్టుబడుతుండా సమగ్ర శాంతి ఒప్పందం కుదరాలని పుతిన్ వాదిస్తున్నారు. నాటోలో చేరకుండా తటస్థ దేశంగా ఉక్రెయిన్ ఉండిపోవాలని పుతిన్ డిమాండ్చేస్తున్నారు. అలాస్కా సదస్సులో పుతిన్, ట్రంప్ మధ్య శిఖరాగ్ర చర్చలు జరిగినా ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు. మరోవైపు జూన్లోపు యుద్ధాన్ని ఆపి ఆ ఘనతను తన ఖాతాలో వేసుకుని అమెరికాలో మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించాలని ట్రంప్ ఆశపడుతున్నాడు. ట్రంప్ ఆశ ఫలిస్తుందో, పుతిన్ దురాక్రమణ స్వప్నం నెరవేరుతుందో, నాటో కూటమి సాయంతో జెలెన్స్కీ సేనలు విజయం సాధిస్తాయో తెలియాలంటే ఇంకొన్ని నెలలు వేచి ఉండక తప్పదేమో. -
ట్రంప్ నివాసంలోకి చొరబాటుకు యత్నం.. సిబ్బంది కాల్పులు
ఫ్లోరిడాలోని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసం మార్-ఎ-లాగో వెలుపల కాల్పులు జరిగాయి. ఆయుధంతో లోపలికి చొరబడడానికి ఓ దుండగుడు యత్నించగా అతనిపై సీక్రెట్ ఏజెంట్ కాల్పులు జరిపారు. అతనికి గాయాలపై అక్కడే కుప్పకూలారు. కాల్పులకు యత్నించిన సదరు దుండగుడు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు.ఈ ఘటన అనంతరం అధ్యక్షుడి నివాసం ఎదుట భద్రత కట్టుదిట్టం చేశారు. ట్రంప్ నివాస ప్రాంతం మార్-ఎ-లాగో పరిసరాలను FBI అదుపులోకి తీసుకుంది. దాడి నేపథ్యంలో ఫామ్ బీచ్ ప్రాంతంలో రాకపోకలను తాత్కాలికంగా అధికారులు నిలిపివేసారు. అయితే అధ్యక్షుడు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారని తెలిపారు. అయితే ట్రంప్ నివాసంలోకి ఆ దుండగుడు ఎందుకు చొరబడటానికి యత్నించాడనే కారణాలు తెలియాల్సి ఉంది. -
ట్రంప్నకు షాకిచ్చిన అమెరికన్లు?..సర్వేలో ఏముందంటే..
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికా గ్రేట్ ఎగేన్ అంటూ నానా హాడావిడీ చేస్తూ.. అధిక పన్నులు పెంచుతూ ఇలా పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలని ఇబ్బందులకు గురిచేశారు. అయితే తాజాగా ఆయన నిర్ణయాలపై అమెరికాలోనూ తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిపిన సర్వేలలో 60 శాతం అమెరికన్లు ట్రంప్ పాలన పట్ల అసంతృప్తితో ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు దెబ్బమీద దెబ్బ తాకుతుంది. ఇటీవల ఆయన పలు దేశాలపై విధించిన అధిక పన్నులు చెల్లవని అమెరికా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే కోర్టు నిర్ణయంపై ట్రంప్ గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు మరో షాక్ తగిలింది. అక్కడి ప్రముఖ మీడియా సంస్థలైన ఏబీసీ న్యూస్, వాషింగ్టన్ పోస్ట్, ఐపీవోస్ నిర్వహించిన సర్వేలలో ప్రతి ముగ్గురు అమెరికన్లు ఆయన పాలనపై వ్యతిరేకంగా ఉన్నట్లు చెబుతున్నాయి. ద్రవ్యోల్బణం విషయంలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఆయనకు వ్యతిరేకంగా ఉండగా, ఇతర దేశాలతో సంబంధాల విషయంలో 62 శాతం ప్రజలు ఆయన పాలనను నిరాకరిస్తున్నారు. అదే సమయంలో ఇటు పన్నుల విషయంలో పది మందిలో ఆరుగురు ఆయన విధానాలను నిరాకరిస్తున్నట్లు సర్వేలో అవగతమైంది. మెుత్తంగా ట్రంప్ పాలన పట్ల 60 శాతం ప్రజలు వ్యతిరేకతతో ఉండగా.. ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమెరికా పరిస్థితులు మరింత దిగజారాయని దాదాపు 50 శాతం మంది అమెరికన్లు భావిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్నవారి అభిప్రాయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ వ్యవహారంలో ప్రతిపక్ష పార్టీ డెమోక్రట్ల నేతలపై సైతం అక్కడి ప్రజలు విశ్వసనీయతతో లేరు. ఓవరాల్ గా ట్రంప్ కు 33 శాతం, డెమోక్రట్స్ కి 31శాతం, ఇతరులకు 31శాతం మంది మెుగ్గుచూపారు. -
తగ్గేదేలే అంటున్న ట్రంప్.. మరోసారి ప్రపంచ దేశాలకు షాక్
-
తాత్కాలిక సుంకాలు 10 శాతం నుంచి 15 శాతానికి పెంపు... వెంటనే అమల్లోకి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
-
సుంకాలపై మాట మార్చిన ట్రంప్.. 10 కాదు.. 15 శాతం!
వాషింగ్టన్/న్యూఢిల్లీ: విదేశాలపై టారిఫ్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రపంచ దేశాలపై విధించిన తాత్కాలిక టారిఫ్లను 10 శాతం నుంచి 15 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శనివారం ‘ట్రూత్ సోషల్’లో పోస్టుచేశారు. సవరించిన టారిఫ్లు వెంటనే అమల్లోకి వస్తాయని తేల్చిచెప్పారు. టారిఫ్లపై అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం ఇచ్చిన హాస్యాస్పదమైన, పేలవమైన, అసాధారణ అమెరికా వ్యతిరేక తీర్పు తర్వాత అన్ని అంశాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా అమెరికాను దోచుకుంటున్న దేశాలపై తొలుత 10 శాతం టారిఫ్లు ప్రకటించానని తెలిపారు. తాను అధికారంలోకి వచ్చేదాకా ఈ దోపిడీ యథేచ్ఛగా కొనసాగిందని మండిపడ్డారు. 10 శాతం టారిఫ్లను చట్టబద్ధంగా 15 శాతానికి పెంచుతున్నట్లు స్పష్టంచేశారు. అమెరికా ట్రేడ్ చట్టం–1974లోని సెక్షన్ 122 ప్రకారం ఇతర దేశాల ఉత్పత్తులపై 15 శాతం దాకా టారిఫ్లను 150 రోజుల పాటు విధించే అధికారం అధ్యక్షుడికి ఉంది. దీనికి అమెరికా కాంగ్రెస్ అనుమతి అవసరం లేదు. అయితే, ఇది న్యాయ సమీక్షకు అతీతం కాదు. 15 శాతం టారిఫ్లను సవాలు చేస్తూ ఎవరైనా కోర్టుకు వెళ్లొచ్చు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్లు చట్టవిరుద్ధం అంటూ అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై వెంటనే స్పందించిన ట్రంప్ విదేశాలపై 10 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం కూడా చేశారు. ఒక్కరోజులోనే ఆ సుంకాలను 15 శాతానికి పెంచేశారు. తనకు 150 రోజుల గడువు ఉందని, ఈలోగా చట్టబద్ధమైన, నూతన టారిఫ్లను విధించడానికి తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని ట్రంప్ వెల్లడించారు. తాము విజయవంతంగా ప్రారంభించిన ‘అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దే(మాగా)’ ప్రక్రియను కొనసాగించేలా ఈ టారిఫ్లు ఉంటాయన్నారు. భారత్పై సుంకాలు 18.5 శాతం? ప్రపంచ దేశాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు చెల్లుబాటు కావని అమెరికా సుప్రీంకోర్టు తేల్చిచెప్పడం, ఇతర దేశాలపై 15 శాతం సుంకాలు తాత్కాలికంగా విధిస్తున్నట్లు ట్రంప్ వెంటనే ప్రకటించిన నేపథ్యంలో భారత్పై టారిఫ్లు ఎంతశాతం అనేది చర్చనీయాంశంగా మారింది. భారత్పై విధించిన 50 శాతం టారిఫ్లను ఇటీవలే 18 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. భారత్, అమెరికాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత భారత ఉత్పత్తులపై టారిఫ్లు భారీగా తగ్గిపోయాయి. ప్రపంచ దేశాలపై టారిఫ్లను సుప్రీంకోర్టు కొట్టిపారేసిన నేపథ్యంలో ట్రంప్ ప్రకటించినట్లు భారతదేశ ఉత్పత్తులపై 15 శాతం తాత్కాలిక సుంకాలు అమల్లోకి రాబోతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సాంకేతికంగా చూస్తే భారత్పై 3.5 శాతం సుంకాలు అమల్లో ఉన్నాయి. సెక్షన్ 122 కింద ట్రంప్ విధించిన 15 శాతం తాత్కాలిక సుంకాలు కూడా కలిపితే మొత్తం సుంకాలు 18.5 శాతానికి చేరుకుంటాయి. అయితే, దీనిపై అమెరికా వైట్హౌస్ ఇంకా పూర్తి స్పష్టత ఇవ్వలేదు. భారత్పై మొత్తం సుంకాలు ఎంత అనేది అతి త్వరలో తేలిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొన్ని ఉత్పత్తులకు మినహాయింపు విదేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకొనే అన్ని ఉత్పత్తులపైనా 15 శాతం తాత్కాలిక సుంకాలు విధించే అవకాశం లేదు. కొన్నింటికి మినహాయింపు ఇవ్వబోతున్నారు. అరుదైన ఖనిజాలు, కరెన్సీ తయారీలో ఉపయోగించే లోహాలు, ఇంధనం, ఇంధన ఉత్పత్తులు, అమెరికాలోని లేని, తయారు చేసుకోలేని సహజ వనరులు, ఎరువులు, పశువుల మాంసం, టొమాటోలు, నారింజ పండ్లు, కొన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులు, ఫార్మా ఉత్పత్తులు, ఎల్రక్టానిక్స్, ప్యాసింజర్ వాహనాలు, తేలికపాటి రవాణా వాహనాలు, బస్సులు, ప్యాసింజర్ వాహనాల విడిభాగాలపై పన్ను ఉండదు. అధ్యయనం చేస్తున్నాం.. ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్లు చెల్లుబాటు కావంటూ అక్కడి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, అనంతరం ట్రంప్ ప్రకటించిన చర్యలను నిశితంగా పరిశీలిస్తున్నామని భారత ప్రభుత్వం వెల్లడించింది. సుప్రీంకోర్టు తీర్పు, ట్రంప్ చర్యల వల్ల తలెత్తే పరిణామాలను అంచనా వేస్తున్నామని పేర్కొంది. అమెరికా కొత్తగా విధించిన టారిఫ్లు, వాటి ప్రభావాలపై క్షుణ్నంగా అధ్యయనం చేస్తున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ శనివారం ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. అన్ని అంశాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు తెలియజేసింది.ఇండియాతో ట్రేడ్ డీల్లో మార్పు ఉండదు: ట్రంప్ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా భారత్తో వాణిజ్య ఒప్పందం విషయంలో ఎలాంటి మార్పు ఉండదని ట్రంప్ శుక్రవారం మీడియా సమావేశంలో స్పష్టంచేశారు. వారు(భారత్) టారిఫ్లు చెల్లించాల్సిందేనని, తాము మాత్రం చెల్లించబోమని వెల్లడించారు. భారత్తో, భారత ప్రధాని మోదీతో అద్భుతమైన సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పు తమకు తీవ్ర అసంతృప్తి కలిగించిందని అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మూర్ఖులు, పెంపుడు శునకాల్లాంటి వారు అంటూ నిందించారు. అమెరికాకు ఏది అవసరమో అది చేసే ధైర్యం వారికి లేదని విమర్శించారు. కోర్టు తీర్పు అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. గత ఏడాది భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం తానే ఆపేశానని మరోసారి వ్యాఖ్యానించారు. మాట వినకపోతే భారీగా టారిఫ్లు విధిస్తానని బెదిరించడంతో ఆ రెండు దేశాలు దారికొచ్చాయని అన్నారు. భారత్, పాక్ ఘర్షణలు 10 యుద్ధ విమానాలు నేలకూలాయని తెలిపారు. రీఫండ్ సంగతేంటి? ప్రపంచ దేశాలపై టారిఫ్లతో ట్రంప్ ప్రభుత్వం 133 బిలియన్ డాలర్లు ఆర్జించింది. ఈ టారిఫ్లు చట్టప్రకారం చెల్లుబాటు కావని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ సొమ్ము సంగతేమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. సుప్రీంకోర్టు ఎలాంటి సమాధానం చెప్పలేదు. వసూలు చేసిన సొమ్మును ఆయా దేశాలకు వెనక్కి ఇస్తారా? అన్న దానిపై ట్రంప్ ఇంకా స్పందించలేదు. రీఫండ్ కోసం విదేశీ కంపెనీలు ఎదురుచూస్తున్నాయి. అయితే, అది అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. అందుకు చాలా సమయం పడుతుందని అంటున్నారు. రీఫండ్ చేయాలంటే చాలా సంస్థలు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అదొక సుదీర్ఘమైన ప్రక్రియ. చాలాకాలం వేచి చూడక తప్పదు. ఈలోగా ట్రంప్ ప్రభుత్వం గనుక చట్టంలో ఏవైనా మార్పులు చేస్తే సొమ్ము వెనక్కి వచ్చే అవకాశం ఉండదు. -
మరో బాంబు పేల్చిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. అన్ని దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై తాత్కాలిక సుంకాన్ని పది నుంచి పదిహేను శాతంకు పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. కాగా శుక్రవారం ఆయా దేశాలపై ట్రంప్ విధించిన గ్లోబుల్ టారిఫ్లను రద్దు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ధర్మాసనం తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. సెక్షన్ 122 కింద కొత్తగా 10 శాతం గ్లోబల్ టారిఫ్ను విధించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై శుక్రవారమే ట్రంప్ సంతకాలు చేశారు. అయితే ట్రంప్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించి.. గరిష్టంగా 15 శాతం వరకు పెంచుతున్నట్లు శనివారం ప్రకటించారు."ప్రపంచ దేశాలపై విధిస్తున్న 10% సుంకాన్ని 15%కి పెంచాలని నిర్ణయించాను. ఇది తక్షణమే అమల్లోకి రానుంది. దశాబ్దాలుగా అనేక దేశాలు అమెరికాను దోచుకుంటున్నాయి. రాబోయో కొద్ది నెలల్లో చట్టబద్దంగా అనుమతించదగిన టారిఫ్లను అమల్లోకి తీసుకు రానున్నాను" అని ట్రూత్ సోషల్లో ట్రంప్ పేర్కొన్నారు.కాగా సెక్షన్ 122 ప్రకారం.. అమెరికా ప్రెసెడెంట్ గరిష్టంగా 15 శాతం వరకు సుంకాలు విధించవచ్చు. ఈ సుంకాలు 150 రోజుల వరకు అమలులో ఉంటాయి. ఆ తర్వాత పొడిగించాలంటే అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) ఆమోదం తప్పనిసరి -
ట్రంప్ టారిఫ్ల కొట్టివేత అంశం: భారత్ స్పందన
న్యూఢిల్లీ: అధ్యక్ష హోదాలో డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవంటూ అమెరికా సుప్రీంకోర్టు వెలువరించిన నేపథ్యంలో భారత్ స్పందించింది. అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఆ తర్వాత ట్రంప్ ప్రెస్కాన్ఫరెన్స్లో మాట్లాడిన పరిణామాలన్నింటినీ అధ్యయనం చేస్తున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. అమెరికా సుప్రీం కోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పును మేము గమనించాము. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ విషయంపై ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అమెరికా ప్రభుత్వం కొన్ని చర్యలను ప్రకటించింది. ఈ పరిణామాలన్నింటినీ వాటి ప్రభావాలను అర్థం చేసుకోవడానికి మేము అధ్యయనం చేస్తున్నాము. దానిని భారత ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. అవసరమైన ప్రతిస్పందనను వాణిజ్య మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇస్తాయి’అని తెలిపారు.కాగా, పలు దేశాలపై విధించిన సుంకాల అంశానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఆ దేశ సుప్రీంకోర్టు షాకిచ్చిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు ల్రంప్ విధించిన సుంకాలను రద్దు చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అమెరికా అధ్యక్షుడికి కానీ, వైట్హౌస్కు కానీ సుంకాలు విధించే అధికారం లేదని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. వాణిజ్య పరమైన అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధకారం కేవలం అమెరికా కాంగ్రెస్కు మాత్రమే ఉందని పేర్కొంది. దాంతో డొనాల్డ్ ట్రంప్నకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. ఇవీ చదవండిట్రంప్ టారిఫ్లు కొట్టివేత.. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పునిజంగా ఇది సిగ్గు చేటు.. సుప్రీం కోర్టు తీర్పుపై ట్రంప్ ఫైర్ -
అన్ని దేశాలకు 10% గ్లోబల్ టారిఫ్
-
ఖమేనీ, అతడి కుమారుడి హత్యకు అమెరికా ప్లాన్.. సంచలన నివేదిక
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్పై అమెరికా ఏ క్షణమైనా దాడులు చేసే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో అమెరికా దాడులపై సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కాగా, ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ, ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీని టార్గెట్ చేసి హతమార్చేందుకు అమెరికా ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఈ మేరకు తాజాగా ఆక్సియోస్(Axios) నివేదికలో పేర్కొంది. దీంతో, ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.అణు ఒప్పందం అంశంపై ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉదిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు అల్టిమేటం జారీ చేశారు. రాబోయే 10 నుంచి 15 రోజుల్లోగా అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని, లేనిపక్షంలో ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మరోసారి హెచ్చరించారు. ఈ క్రమంలో ఇరాన్ సమీపంలో అమెరికా సైన్యం దాడులు చేసేందుకు రెడీగా కూడా ఉంది. ఇరాన్కు సమీపంలో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అనుమతి కోసం వేచిచూస్తున్నాయి. అత్యాధునిక విమానాలు మిడిల్ ఈస్ట్కు చేరాయి. మరోవైపు, ఇరాన్ రష్యాలు కలిసి హార్మోజ్ జలసంధిలో యుద్ధ విన్యాసాలు ప్రారంభించాయి.🇺🇸🇮🇷 NEW:According to Axios, one option under consideration by President Donald Trump involves a potential targeted strike on Iran’s Supreme Leader Ayatollah Ali Khamenei and his son, described as a limited military option.Source: Axios pic.twitter.com/5GJKpAtNVn— WAR (@warsurv) February 21, 2026ఇలాంటి తరుణంలో ఆక్సియోస్ నివేదిక అమెరికా దాడులు, ఖమేనీ గురించిన సంచలన విషయాలను బయటపెట్టింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీని లక్ష్యంగా చేసుకుని హతమార్చేందుకు అమెరికా ప్లాన్ చేసినట్లు నివేదికలో పేర్కొంది. ఈ సైనిక ఆప్షన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు ఉంచినట్లు తెలిపింది. మొజ్తాబాను సుప్రీం లీడర్ వారసుడిగా అంతా భావిస్తున్నారు. ఇరాన్ అగ్రనేతలతో పాటు కీలకమైన ముల్లాలను అంతమొందించేలా రక్షణ శాఖ పలు ఆప్షన్లను ట్రంప్ ముందు ఉంచింది. అయితే, దీనిపై ట్రంప్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ట్రంప్ నిర్ణయం తీసుకుంటే ఇరాన్పై అమెరికా దాడులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.మరోవైపు.. అధ్యక్షుడు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారనే దానిపై స్పష్టత లేదని పెంటగాన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా వైట్హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ స్పందిస్తూ.. అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆయనకే తెలుసు అని వ్యాఖ్యలు చేశారు. సీనియర్ల సలహాదారులు, అధికారులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. ఇక, ఓ వైపు ఇరాన్తో అణు చర్చలు జరుపుతూనే అమెరికా సైనికంగా ఆ దేశంపై ఒత్తిడి తీసుకువస్తోంది. -
మోదీ నిర్ణయం తప్పే.. టారిఫ్ల రద్దుపై కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు యూఎస్ సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అత్యవసర అధికారాలను ఉపయోగించి ట్రంప్.. పలు దేశాలపై విధించిన అధిక టారిఫ్లను తప్పుబట్టింది. ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. ఈ క్రమంలో ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలను కొట్టివేసింది. ఈ క్రమంలో ఇటీవల భారత్, అమెరికా చేసుక్ను వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో మోదీ సర్కార్పై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. భారత్ మరో 18 రోజులు వేచి చూసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని వ్యాఖ్యలు చేస్తున్నారు.కాగా, అమెరికా విధించిన సుంకాలను సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత భారత్తో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అమెరికాతో ఏకపక్ష, భారత వ్యతిరేక వాణిజ్య ఒప్పందం చేసేందుకు కేంద్రం తొందరపడిందని ఆరోపించింది. ఈ మేరకు పలువురు కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా వేదికగా మోదీ సర్కార్ను టార్గెట్ చేసి పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో సంచలన ఆరోపణలు కూడా చేశారు.మోదీ ప్రభుత్వం ధైర్యం చేస్తుందా?: సుర్జేవాలాఅమెరికాతో కుదిరిన ఏకపక్ష వాణిజ్య ఒప్పందాన్ని మోదీ ప్రభుత్వం పునఃసమీక్షించాలని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాల్ అన్నారు. అమెరికా కొత్తగా ప్రతిపాదించిన సుంకాల స్థిరత్వం, భారత్పై వాటి వర్తింపును ప్రశ్నించారు. 1977లో అమల్లోకి వచ్చిన ఐఈఈపీఏ కింద అధ్యక్షుడికి టారిఫ్లు విధించే అధికారం లేదని అమెరికా సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 122, 1962 ట్రేడ్ ఎక్స్పాన్షన్ యాక్ట్ సెక్షన్ 232, 1974 ట్రేడ్ యాక్ట్ సెక్షన్ 301 కింద ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్లు భారత్కు వర్తించవని కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ సుంకాలు భారత్పై చట్టబద్ధంగా అమలవుతాయా? అమెరికా–భారత్ వాణిజ్య ఒప్పందం నిలబడుతుందా? రైతులు, చిన్న, మధ్యతరహా వ్యాపారులు, ఇంధన, డేటా నిపుణులు, ఆర్థికవేత్తలు వ్యతిరేకిస్తున్న ఈ ఒప్పందం నుంచి బయటకు రావడానికి మోదీ ప్రభుత్వం ధైర్యం చేస్తుందా?' అని ప్రశ్నించారు.Pursuant to the U.S Supreme Court judgment quashing Presidential powers to impose tariffs under IEEPA (International Emergency Economic Powers Act, 1977), President Trump has announced:• Imposition of 10% additional tariffs under Section 122 of the Trade Act, 1974.• Tariffs… https://t.co/UK24YTwdkm— Randeep Singh Surjewala (@rssurjewala) February 20, 2026 సెక్షన్ 122 (ట్రేడ్ యాక్ట్, 1974) ప్రకారం 150 రోజులపాటు మాత్రమే 10శాతం టారిఫ్ విధించవచ్చని సుర్జేవాలా తెలిపారు. తరువాత అమెరికా కాంగ్రెస్ ఆమోదం అవసరమని, ఇది తాత్కాలిక చర్య మాత్రమే అని అన్నారు. ఇక సెక్షన్ 232 (ట్రేడ్ ఎక్స్పాన్షన్ యాక్ట్, 1962) జాతీయ భద్రతా కారణాలతో మాత్రమే టారిఫ్ విధించాలని పేర్కొన్నారు. 270 రోజుల్లో అమెరికా వాణిజ్య శాఖ సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని చెప్పారు. భారత ఎగుమతులు జాతీయ భద్రతకు ముప్పు కాదని వివరించారు. అలాగే సెక్షన్ 301 (ట్రేడ్ యాక్ట్, 1974) సంబంధిత దేశం అన్యాయ వాణిజ్య పద్ధతులు అనుసరించిందని దర్యాప్తు ద్వారా నిరూపించాలని చెప్పారు. భారత్పై అలాంటి దర్యాప్తు జరగలేదని ఆయన వివరించారు. ఇప్పుడు జాతీయ ప్రయోజనాలను రక్షించడానికి ప్రభుత్వం సిద్ధమా? అంటూ ప్రశ్నలు సంధించారు.మోదీ రాజీ పడ్డారు: పవన్ ఖేడామరో కాంగ్రెస్ నేత పవన్ ఖేడా సోషల్ మీడియా వేదికగా..‘అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ గ్లోబల్ టారిఫ్లను రద్దు చేసింది. భారత్ మరో 18 రోజులు వేచి చూసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఫిబ్రవరి 2న వాషింగ్టన్కు అర్థరాత్రి కాల్ ఎందుకు? సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎందుకు ఆగలేదు? జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే ప్రకటనలే కారణమా? జెఫ్రీ ఎఫ్స్టీన్స్ ఫైళ్ల ప్రభావమా? గౌతమ్ అదానీకి సంబంధించిన అమెరికా క్రిమినల్ కేసా? లేక ఇవన్నీ కారణాలా? ఈ రోజు కాంగ్రెస్ వాదన నిజమైంది. ప్రధాని నరేంద్ర మోదీ రాజీ పడ్డారు' అని ఆరోపించారు. -
నాతో పెట్టుకోవద్దు.. టారిఫ్లపై ట్రంప్ కొత్త లాజిక్
వాషింగ్టన్: ప్రపంచ దేశాలపై తాను విధించిన టారిఫ్లు చెల్లవన్న అమెరికా సుప్రీంకోర్టు తీర్పుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిప్పులు చెరిగారు. దాన్ని అత్యంత సిగ్గుచేటైన, తప్పుడు తీర్పుగా అభివర్ణించారు. ఆ తీర్పు ఇచ్చిన జడ్జిలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘వాళ్లు పనికిమాలినవాళ్లు. దేశానికే తలవంపులు తెచ్చారు. దేశానికి ఏది మేలో అర్థం చేసుకుని ఆ దిశగా నిర్ణయం తీసుకునే ధైర్యం ఏ మాత్రమూ లేని ఆ జడ్జిలను చూసి ఎంతగానో సిగ్గుపడుతున్నా’ అంటూ తూర్పారబట్టారు.శుక్రవారం తీర్పు వెలువడ్డ అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఆ తీర్పుపై విదేశీ ప్రయోజనాల ప్రభావముందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో దేశాలన్నీ సంబరపడుతున్నాయంటూ వాపోయారు. ప్రపంచ దేశాలపై 10 శాతం టారిఫ్లు విధిస్తున్నట్టు ఈ సందర్భంగా ట్రంప్ ప్రకటించడం విశేషం. ‘ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. ఈ మేరకు ఉత్తర్వులపై త్వరలో సంతకం చేస్తా’ అని చెప్పారు. తన వాణిజ్య అజెండాకు కోర్టు తీర్పు విఘాతం కలిగించబోదని స్పష్టం చేశారు.ఇదే సమయంలో ‘దేశ ఆదాయాన్ని పెంచేందుకు మరింత శక్తిమంతమైన మార్గాలెన్నో మాకు అందుబాటులో ఉన్నాయి. ఇకపై మరిన్ని టారిఫ్లు విధించగలను’ అని చెప్పుకొచ్చారు. 1977 నాటి ఐఈఈపీఏ చట్టం ప్రకారం ట్రంప్ ఇప్పటిదాకా పలు దేశాలపై విధించిన టారిఫ్లు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రద్దయినందున, వాటి స్థానంలో ఆయన తాజాగా ప్రకటించిన 10 శాతం టారిఫ్లు అమల్లోకి రానున్నాయి. 1974 నాటి వర్తక చట్టంలోని 122వ సెక్షన్ ప్రకారం ట్రంప్ వాటిని విధించారు. ఈ నిర్ణయానికి 150 రోజుల్లోపు కాంగ్రెస్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. లేదంటే ఆ టారిఫ్లు అంతటితో రద్దవుతాయి. "Effective immediately, all National Security TARIFFS, Section 232 and existing Section 301 TARIFFS, remain in place, and in full force and effect. Today I will sign an Order to impose a 10% GLOBAL TARIFF, under Section 122, over and above our normal TARIFFS already being… pic.twitter.com/B3bv5f5KW1— The White House (@WhiteHouse) February 20, 2026వైట్హౌస్ కీలక ప్రకటన.. మరోవైపు.. ప్రపంచ దేశాలపై అమెరికా విధించిన సుంకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మరింత రెచ్చిపోతూ అదనంగా 10 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే భారత్ కూడా ఆ 10శాతం సుంకాలు చెల్లించాల్సిందే అని వైట్హౌస్ పేర్కొంది. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రకారం టారిఫ్ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. విలేకర్ల సమావేశంలో ఈ వైట్హౌస్ అధికారులు ఈ మేరకు మాట్లాడారు.🚨 President Donald J. Trump imposes a 10% global tariff on all countries. pic.twitter.com/42ZGDnMxbR— The White House (@WhiteHouse) February 20, 2026భారత్ 10 శాతం టారిఫ్ చెల్లించాలా? అలాగే ఇది గతంలో ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకానమీక్ పవర్ యాక్ట్(ఐఈఈపీఏ) కింద విధించిన టారిఫ్లను భర్తీ చేస్తారా అని ప్రశ్నకు వైట్హౌస్ అధికారి ఈ మేరకు స్పందించారు. మరో చట్టపరమైన అధికారం అమల్లోకి వచ్చే వరకు 10 శాతం టారిఫ్ కొనసాగుతుందని తెలిపారు. అంతేకాకుండా, అన్ని వాణిజ్య భాగస్వామ్య దేశాలు ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. ఈ 10 శాతం గ్లోబల్ టారిఫ్ అనేది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన రక్షణాత్మక వాణిజ్య విధానంలో భాగమని పేర్కొన్నారు. చెల్లింపుల సమతుల్యత లోటును తగ్గించడం, అన్యాయ వాణిజ్య విధానాలను పరిష్కరించే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.


