-
మె...గా దోస వరల్డ్ రికార్డు: మనసు దో‘సు’కుంటోంది!
Megadosa: భారతీయులకు, అందులోనూ దక్షిణాది వారికి దోస అంటే ప్రాణం. ఈ దోసను ఎన్ని రకాలుగా తయారు చేసినా ఆహార ప్రియుల మనసు దో‘సు’ కుంటుంది. తాజాగా ఈ దోస ప్రపంచ రికార్డు కొట్టేసింది. దోస ఏంటి రికార్డు ఏంటి అనుకుంటున్నారా? మరి ఈ వివరాలు తెలియాలటే.. ఈ స్టోరీ చదవాల్సిందే..: కర్ణాటకలో 123 అడుగుల పొడవైన దోస లాంగెస్ట్ దోసగా గిన్నిస్ ప్రపంచ రికార్డు కొట్టేసింది. ప్రముఖ ఫుడ్ బ్రాండ్ ఎంటీఆర్ ఫుడ్స్కు చెందిన చెఫ్ల బృందం ఈ మెగా దోసను తయారు చేసింది. సంస్థ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, లోర్మాన్ కిచెన్ ఎక్విప్మెంట్స్ భాగస్వామ్యంతో 123.03 అడుగుల పొడవైన దోసను తయారు చేసి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకుంది. అంతేకాదు తన మునుపటి ప్రపంచ రికార్డు టైటిల్ను తానే బద్దలు కొట్టింది. చెఫ్ రెగి మాథ్యూస్ నేతృత్వంలోని 75 మంది చెఫ్ల బృందం దీనికోసం కష్టపడింది. నెలల పాటు ప్లాన్లు వేసుకొని మరీ విజయవంతంగా ఈ రికార్డు సాధించింది. ఈ దోస తయారీ కోసం రెడ్ రైస్ దోస పిండిని ఉపయోగించారట. 2024 మార్చి 15న బెంగుళూరులోని MTR ఫ్యాక్టరీలో ఈ ఘనతను దక్కించుకున్నామని ఈ చారిత్రాత్మక మైలురాయిని సాధించడం సంతోషంగా ఉంది అని చెఫ్ రెగి మాథ్యూస్ ఇన్స్టాగ్రామ్లో వెల్లడించారు. ఈ విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
మెడి టిప్స్: ఇడ్లీలు, దోసెల వంటి ఆహారంతో.. ఈ సమస్యకు చెక్!
మన జీర్ణవ్యవస్థలోని ఆహారనాళంలో ప్రతి చదరపు మిల్లీమీటరులోనూ కోటానుకోట్ల మంచి బ్యాక్టీరియా ఉంటుంది. జీవక్రియలకు తోడ్పడటంతో పాటు వ్యాధి నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అవసరం. దీనిలో ఏదైనా తేడాలు రావడాన్ని ‘డిస్బయోసిస్’ అంటారు. ఇది మూడు విధాలుగా రావచ్చు. మొదటిది మేలు చేసే బ్యాక్టీరియా బాగా తగ్గిపోవడం, రెండోది హాని చేసే బ్యాక్టీరియా సంఖ్య ప్రమాదకరంగా పెరగడం, జీర్ణవ్యవస్థలోని బ్యాక్టీరియా వైవిధ్యం దెబ్బతినడం. ఇలా జరిగినప్పుడు డాక్టర్లు ్రపో–బయాటిక్స్ సూచిస్తారు. ఇవి కొంత ఖర్చుతో కూడిన వ్యవహారం. కానీ తాజా పెరుగు, మజ్జిగ, పులవడానికి వీలుగా ఉండే పిండితో చేసే ఇడ్లీలు, దోసెల వంటి ఆహారంతోనే ‘డిస్ బయోసిస్’ తేలిగ్గా పరిష్కారమవుతుంది. అప్పటికీ తగ్గకపోతేనే ‘ప్రో–బయాటిక్స్’ వాడాల్సి వస్తుంది. కాబట్టి ‘డిస్ బయోసిస్’ నివారణ కోసం ముందునుంచే పెరుగు, మజ్జిగ వంటివి వాడటం ఆరోగ్యానికే కాదు.. వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టం చేసుకునేందుకు ఎంతగానో ఉపకరిస్తుంది. ఇవి చదవండి: 'ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ ఎందుకు నివారించాలో తెలుసా!? -
'వరల్డ్ దోస డే'!: దోస రెసిపీని మొదటగా ఎవరు చేశారంటే..?
భారతదేశంలోని పలు బ్రేక్ఫాస్ట్ రెసిపీల్లో దోసదే అగ్రస్థానం. దీన్ని దోస లేదా దోసే/ దోసై వంటి పలు రకాల పేర్లతో పిలుస్తారు. దక్షిL భారతదేశ వంటకమైన ఈ దోసని బియ్యం, మినప్పులను నానబెట్టి రుబ్బగా వచ్చిన మిశ్రమంతో తయారు చేస్తారు. ఎలా పాపులర్ అయ్యిందో తెలియదు గానీ. ప్రపంచమంతా ఇష్టంగా తినే వంటకంగా 'దోస' మొదటి స్థానంలో ఉంది. అందువల్లో దీనికంటూ ఓ రోజు ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రతి ఏడాది మార్చి 3ని ఈ వంటకానికి అంకితమిచ్చారు. అందువల్లే ప్రతి ఏడాది ఈ రోజున 'వరల్డ్ దోస డే' గా జరుపుకుంటున్నారు. ఈ వంటకం దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యిన వంటకంగా నిలిచింది. ఒక సర్వే ప్రకారం..ఫుడ్ డెలీవరీ సంస్థ స్విగ్గీ 2023 నుంచి 2024 వరకు దాదాపు 29 మిలియన్ల దోసలను డెలివరీ చేసినట్లు తేలింది. అంతేగాదు ఒక నిమిషానికి 122 దోసలను బ్రేక్ ఫాస్ట్గా డెలీవరి చేస్తున్నట్లు వెల్లడయ్యింది. దోసకు క్యాపిటల్గా బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా, ముంబై వంటి మహా నగరాలు నిలిచాయి. అక్కడ రోజుకి లక్షల్లో దోస ఆర్డర్లు వస్తున్నట్లు నివేదిక పేర్కొంది. అంతలా ఫేమస్ అయిన ఈ దోస వంటకం ఎలా వచ్చింది? దాని చరిత్ర ఏంటన్నది తెలుసుకుందామా!. దోస చరిత్ర.. మొదటగా తమిళనాడులో దోసెను మందంగా మెత్తగా చేసేవారు. ఆ తర్వాత క్రిస్పీగా ఉండే దోసెను కర్ణాటకలో తయారు చేయడం మొదలు పెట్టారు. ఉడిపి అనే రెస్టారెంట్ దోసెను ఇలా క్రిస్పీగా అందించేది. స్వాతంత్య్రానంతరం దోసె క్రేజ్ దేశమంతటా వ్యాపించింది. ఆ తర్వాల ఉత్తర భారతీయులు కూడా ఈ వంటకాన్ని ఇష్టంగా తినడం మొదలు పెట్టారు. ఈ దక్షిణ భారత వంటాకాన్ని ఢిల్లీలో ఓ మద్రాస్ హోటల్ అక్కడి వారికి పరిచయం చేసింది. 1930లలో ఉడిపి హోటల్ మద్రాస్కి విస్తరించడంతో అక్కడ నుంచి ఢిల్లీకి ఇలా పాకింది. ఇక ఆహార ప్రియులు దోసెలను ఇష్టంగా ఆస్వాదించడంతో ఇక చెఫ్లు తమ పాకనైపుణ్యానికి పదును పెట్టి మరీ రకరకాల దోసెలను తీసుకొచ్చారు. ప్రజలు వాటిని కూడా ఆస్వాదించడం విశేషం. అలా దోసెలు కాస్త..మసాలా దోస, పనీర్ దోస, మైసూర్ మసాలా దోస, చీజ్ దోస, స్కీజ్వాన్ దోస వంటి రకరకాల దోస రెసిపీలు మార్కెట్లోకి వచ్చేశాయి. అలాగే వీటిని కొబ్బరి చట్నీ, కొత్తిమీర చట్నీ వంటి వివిధ రకాల చట్నీలతో చెఫ్లు నోరూరించేలా అందించడంతో మరింతగా ప్రజాదరణ పొందింది. దక్షిణ భారతదేశంలో ఈ వంటకం ఎలా వచ్చిందనేదనేందకు కచ్చితమైన ఆధారాలు లేవు కానీ సాహిత్య గ్రంథాల్లో వాటి ప్రస్తావన మాత్రం వచ్చింది. వాటి ఆధారంగా దోస మూలం ఆ రాష్టలేనని భావిస్తున్నారు చరిత్రకారులు. దక్షిణ భారతదేశంలోకి ఎలా వచ్చిందంటే.. ఒకటవ శతాబ్దానికి చెందిన సంగం సాహిత్యంలో దోస గురించి ఉంది. ఇక క్రీస్తూ శకం వెయ్యేళ్ల క్రితం ప్రాచీన తమిళంలో ఈ దోసలను తయారు చేసినట్లు ఆహార చరిత్రకారుడు కేటీ అచాయపేర్కొన్నాడు. అంతేగాదు కన్నడ సాహిత్యంలో కూడా దీని ప్రస్తావన ఉన్నట్లు అచాయ వెల్లడించాడు. అందువల్లే ఈ దోస మూలం ఏ రాష్టం అనేది చర్చనీయాంశంగా మిగిలిపోయింది. "ది స్టోరీ ఆఫ్ అవర్ ఫుడ్" అనే పుస్తకంలో కర్ణాటక రాజు సోమేశ్వర III గురించి ఉంది. ఆయన తన ప్రాచీన సాహిత్య రచన మానసోల్లాసలో దోసను 'దోసకా' అని సంబోధించాడు. పైగా ఆ వంటకం ఎలా తయారు చేస్తారో కూడా వివరించాడు. ఇక ప్రసిద్ధ చరిత్రకారుడు పి తంకప్పన్ నాయర్ ప్రకారం ఈ దోస కర్ణాటకలోని ఉడిపి అనే పట్టణంలో ఉద్భవించిందని ఉంది. వీటన్నింటిని పరిగణలోనికి తీసుకుంటే దోస మూలం ఎక్కడ అనేది ఓ మిస్టరీగా మిగిలిపోయింది. ఏదీఏమైన నోరూరించే ఈ రెసిపీని అందరూ ఇష్టంగా ఆస్వాదించడం విశేషమైతే చెఫ్లు వాటి పాకనైపుణ్యంతో వెరైటీ దోసలు పరిచయం చేయంతో ఒక్కసారిగా వరల్డ్ ఫేమస్ అయ్యి, బ్రేక్ఫాస్ట్ రెసిపీలో మంచి క్రేజ్ని దక్కించుకున్న టాప్ వంటకంగా నిలిచిపోయింది. (చదవండి: ప్రపంచంలో అత్యధికంగా ఇష్టపడే మాంసం ఏదో తెలుసా! భారత్లో ఏది ఇష్టపడతారంటే..) -
World Dosa Day: స్విగ్గీలో 29 మిలియన్ దోసెలు ఆర్డర్
సాక్షి, హైదరాబాద్: అల్పాహారంలో దోసెదే అగ్రస్థానం అనేది ప్రపంచ దోస దినోత్సవ నేపథ్యంలో మరోసారి వెల్లడైంది. ప్రముఖ ఫుడ్ డెలివరీ పార్టనర్ స్విగ్గీ ఈ విషయాన్ని వెల్లడింంది. ఏటా మార్చి 3వ తేదీన దోసె దినోత్సవం సందర్భంగా స్విగ్గీ ఓ సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా గత ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ నుండి ఈ ఏడాది ఫిబ్రవరి 25 లోపు ఏకంగా 29 మిలియన్ల దోసెలు డెలివరీ చేసినట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా బ్రేక్ఫాస్ట్ సమయంలో నిమిషానికి సగటున 122 దోసెలు ఆర్డర్ అయ్యా యి. ఇందులో బెంగళూరు టాప్లో ఉండగా.. తర్వాతి స్థానాల్లో హైదరాబాద్, చెన్నై ఉన్నాయి. హైదరాబాద్కు ఇష్టమైన స్నా క్–టైమ్ డిష్గా దోసె మరోసారి స్థానం దక్కించుకుంది. ముఖ్యంగా కోయంబత్తూర్కు చెందిన ఓ వినియోగదారుడు ఏడాదిలో 447 ప్లేట్ల దోసెలు ఆర్డర్ చేసి.. దేశంలోనే ఛాంపియన్గా నిలిచాడు. మరోవైపు పరాఠాలను ఎక్కువ ఇష్టపడే చండీగఢ్ వాసులు సైతం తమ ఇష్టమైన వంటకంగా దోసెను స్వీకరించడం విశేషం. రంజాన్, క్రికెట్ ప్రపంచకప్, ఐపీఎల్ సమయాల్లో అత్యధికంగా ఆర్డర్లు నమోదైన రెండో వంటకంగానూ.. నవరాత్రి సీజన్లో టాప్గా దోసె నిలిచింది. వీటిల్లో క్లాసిక్ మసాల దోసె అగ్రస్థానంలో నిలవగా.. తర్వాతి స్థానాల్లో ప్లె యిన్, సెట్, ఉల్లిపాయ, బటర్ మసాలా ఉన్నాయి. చాక్లెట్, పావ్ బాజీ నూడుల్స్ పాలక్, షెజ్వాన్ చాప్సూయ్ స్పెషల్, దిల్ ఖుష్ దోసెలను ప్రజలు ఆస్వాదించారు. -
మిగిలిపోయిన అన్నంతో చిటికెలో దోసె వేసుకోండి..
అన్నం దోసె తయారీకి కావల్సినవి: అన్నం – 2 కప్పులు పుల్లని పెరుగు, రవ్వ, గోధుమ పిండి– 1 కప్పు చొప్పున ఉప్పు – రుచికి సరిపడా వంట సోడా›– 1 టీ స్పూన్ నీళ్లు – తగినన్ని తయారీ: ముందుగా మిక్సీలో అన్నం, పెరుగు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం అందులో రవ్వ, గోధుమపిండి, వంట సోడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని, కొద్దిగా నీళ్లు పోసుకుని.. ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని దోసెల్లా వేసుకోవాలి. అభిరుచిని బట్టి ఉల్లిపాయముక్కలు, క్యారెట్ తురుము వంటివి వేసుకుని గార్నిష్ చేసుకోవచ్చు. -
‘ఎక్స్’లో హాట్టాపిక్గా దోశ ధర..!
గురుగ్రామ్: ఢిల్లీలోని గురుగ్రామ్లోని ఓ హోటల్లో ఇచ్చిన దోశ బిల్లుపై ట్విట్టర్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గురుగ్రామ్లోని 32 ఎవెన్యూ ఏరియాలో కర్ణాటక కేఫ్లో ఆశిశ్ సింగ్ అనే యువకుడు రెండు దోశలు, ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేశాడు. 30 నిమిషాల తర్వాత ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది. హాయిగా దోశలు తినేసి బిల్లు చూస్తే ఆశిశ్కు ఒక్కసారిగా షాక్ తగిలినంత పనైంది. బిల్లు ఏకంగా వెయ్యి రూపాయలు వచ్చింది. దీంతో ఆశిష్ ఈ విషయాన్ని ఎక్స్లో షేర్ చేశాడు. ఆశిష్ ట్వీట్పై పలువురు ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘తమిళనాడులో అయితే అవే దోశలు చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. మీరు పే చేసింది ఏరియా ప్రీమియమ్’ అని ఒకాయన కామెంట్ చేశాడు. ‘వీధి టిఫిన్ బండి దగ్గర మీరు పే చేసిన ధరలో పదవ వంతుకే ఆ దోశలు వచ్చేవి’ అని మరొకతను రిప్లై ఇచ్చాడు. గురుగ్రామ్ను వదిలి బెంగళూరుకు రండి తక్కువ ధరలో మంచి దోశలు ఉంటాయి’ అని మరో కర్ణాటక అతను కామెంట్ పెట్టాడు. Bc gurgaon is crazy, spent 1K on two Dosa and idli after waiting for 30 min. Suggest good and reasonably priced dosa places. pic.twitter.com/HYPPK6C07U — Ashish Singh (@ashzingh) December 4, 2023 ఇదీచదవండి..రిస్క్ చేయాలేగానీ..మా తర్వాతే ఎవరైనా..! -
ఆటోమేటిక్ దోసె మేకర్.. నిమిషంలో ఆకలి తీరుస్తుంది
దోసె ఇష్టపడని వాళ్లు అరుదు. ఈ చిత్రంలోని మేకర్ ఒకే ఒక్క నిమిషంలో దోసెలేసి ఆకలి తీరుస్తుంది. దీనిలోని 360 డిగ్రీస్ ఫుడ్ గ్రేడ్ కోటెడ్ రోలర్.. దోరగా వేగిన దోసెలను ట్రేలో అందిస్తుంది. అందుకు వీలుగా వెనుకవైపున్న ట్యాంకర్లో దోసెల పిండి వేసి.. పక్కనే ఉండే బటన్ ప్రెస్ చేస్తే చాలు. ఈ డివైస్.. కంపాక్ట్ అండ్ పోర్టబుల్గా, యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తుంది. దీనిలోని ఆటోమేటిక్ సేఫ్టీ కట్ ఆఫ్ ఫీచర్తో.. దోసెకు దోసెకు మధ్య 3 నిమిషాల గ్యాప్ ఇస్తుంది. ఈ మోడల్ మేకర్స్లో చాలా కలర్స్ అందుబాటులో ఉన్నాయి. మరింకెందుకు ఆలస్యం? ఈసారి దోసెలు వేసే పనిని ఈ మేకర్కి అప్పగించేయండి! -
బ్లూ దోస వీడియో వైరల్: నెటిజన్లు మాత్రం..!
Blue Pea Dosa దక్షిణ భారత వంటకాలు అందులోనూ దోస అంటే నోరు ఊరనిది ఎవరికి. పళ్లు లేని వారుకూడా నమల గలిగేలా మెత్తగా దూదపింజ లాంటి దోస మొదలు కర కరలాడే దోస, మసాలా దోస, ఉల్లి దోస, చీజ్ కార్న్ దోస అబ్బో ఈ లిస్ట్ పెద్దదే. ఇక దీనికి సాంబారు తోడైతే ఇక చెప్పేదేముంది. అంత క్రేజ్ దోస అంటే. తాజాగా కొత్త రకం దోసం ఒకటి వైరల్గా మారింది. శంఖు పుష్పాలు, లేదా అపరాజిత పూలతో ఇలాంటి ప్రయోగాలు సోషల్ మీడియాలో చాలానే చూశాం. గతంలో బ్లూ రైస్ వీడియోకూడా వార్తల్లో నిలిచింది. ఇపుడు బ్లూ పీ దోస అన్నమాట. జ్యోతీస్ కిచెన్ అనే ఇన్స్టాగ్రామ్ రీల్లో బ్లూ పీ దోస ఇపుడు నట్టింట వైరల్గా మారింది. నీలి రంగు అపరాజిత పూలను ఉడికించిన నీళ్లలో దోస పిండి కలిపి దోస తయారీ అవుతోంది. ముఖ్యంగా చక్కటి నీలి రంగులో నోరూరించే దోస రడీ కావడం విశేషంగా నిలిచింది. ఇప్పటి 10 లక్షల వ్యూస్ను సొంతం చేసుకున్న ఈ దోస వీడియోపై Instagram యూజర్లు మిశ్రమంగా స్పందించారు. వావ్ చాలా అద్భుతంగా ఉంది.. బ్యూటిఫుల్ కలర్ అని కొంతమంది కమెంట్ చేశారు. అవును.. శంఖు పూలు ఎడిబుల్.. ఈ పూలతో చేసిన టీ చాలా బావుంటుంది అంటూ ఒక యూజర్ కమెంట్ చేశారు. మరికొంతమంది మాత్రం అరే ఎందుకురా..అందమైన దోసను ఇలా పాడు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి కొంతమందయితే విచిత్రమైన దోసలతో పాపులరైన మరోఫుడ్ బ్లాగర్కి ట్యాగ్ చేశారు. రివ్యూ చే బ్రో... ఎక్కడున్నావ్..లాంటి ఫన్నీ కామెంట్లు కూడా ఉన్నాయి. View this post on Instagram A post shared by jyotiz kitchen (@jyotiz_kitchen) -
వెరైటీగా బీరకాయ దోసెలు ట్రై చేయండి! టేస్ట్ అదుర్స్!
బీరకాయ దోసెలకు కావలసినవి: బియ్యం – అర కప్పు (4 గంటల ముందు నానబెట్టుకోవాలి) పెసలు –అర కప్పు (4 గంటల ముందు నానబెట్టుకోవాలి) బీరకాయ – అర కప్పు (తొక్క తీసేసి, చిన్నగా కట్ చేసుకోవాలి) ఉప్పు – తగినంత, జీలకర్ర – 1 టీ స్పూన్ అల్లం ముక్క – చిన్నది పచ్చిమిర్చి – 3 లేదా 4 నీళ్లు – కొద్దిగా\ పెరుగు – 2 టేబుల్ స్పూన్లు నూనె – కావాల్సినంత ఉల్లిపాయ ముక్కలు – సరిపడా తయారీ విధానం: ముందుగా బీరకాయ ముక్కలను మిక్సీ పట్టుకుని, మెత్తగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెసలు, బియ్యం వేసుకుని.. కొద్దిగా నీళ్లు పోసుకుని.. మిక్సీ పట్టుకోవాలి. అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్క, సరిపడేంత ఉప్పు వేసుకుని మరోసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పెరుగు, బీరకాయ పేస్ట్ వేసుకుని మరోసారి కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పెనంపై కొద్ది కొద్దిగా నూనె వేసుకుని, దోసెలు వేసుకోవాలి. తర్వాత అభిరుచిని బట్టి.. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. (చదవండి: వెరైటీగా ఫిష్ కేక్ ట్రై చేయండిలా!) -
ఇడ్లీ హై జపానీ... టేస్ట్ హై హిందుస్థానీ
‘దేశం కాని దేశంలో మన దేశ వంటకాలను చూస్తే ప్రాణం లేచి రావడమే కాదు బ్రహ్మాండంగా భరతనాట్యం కూడా చేస్తుంది’ అంటున్నాడు ప్రసన్న కార్తిక్. ఈ ట్విట్టర్ ఖాతాదారుడు ఏదో పని మీద జపాన్లోని క్యోటో నగరానికి వెళ్లాడు. అక్కడ కనిపించిన ‘తడ్క’ అనే రెస్టారెంట్ను చూసి ‘కలయా? నిజమా? అనుకున్నాడు. ఈ రెస్టారెంట్ దక్షిణ భారతీయ వంటకాలకు ప్రసిద్ధి. దోశ, ఇడ్లీలకు ఇక్కడ మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ రెస్టారెంట్ నిర్వాహకులు భారతీయులు మాత్రం కాదు... జపానీయులే. వీరు ప్రతి ఆరునెలలకు ఒకసారి చెన్నైకి వచ్చి కొత్త వంటకాలు నేర్చుకొని వెళుతుంటారు. ‘దోశ అండ్ ఇడ్లీ అన్బిలీవబుల్ అథెంటిక్. రెస్టారెంట్లో భారతీయుల కంటే జపాన్ వాళ్లే ఎక్కువమంది కనిపించారు. జపాన్లో తినడానికి చాప్–స్టిక్స్ ఉపయోగిస్తారు. అయితే ఈ రెస్టారెంట్ వాళ్లు మాత్రం చేతితో తినడంలోని మజాను బాగానే ప్రమోట్ చేసినట్లు ఉన్నారు. ఎవరూ చాప్–స్టిక్స్ను ఉపయోగించడం లేదు’ అని ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు కార్తిక్. -
దోసెలు వేసిన రాహుల్
-
కొత్తిమీరతో గ్రీన్ దోశ.. టేస్ట్తో పాటు హెల్తీ కూడా
గ్రీన్ దోశ తయారీకి కావల్సినవి: బియ్యం – కప్పు; మినప పప్పు – కప్పు: మెంతులు – టీస్పూను; కొత్తిమీర – కప్పు; పుదీనా – కప్పు; కరివేపాకు – అరకప్పు; జీలకర్ర – అరటీస్పూను; వాము – చిటికెడు; ఉల్లిపాయ – ఒకటి; పచ్చిమిర్చి – నాలుగు; ఉప్పు – టీస్పూను; నూనె –పావు కప్పు. తయారీ విధానమిలా: ∙బియ్యం, మినపపప్పు, మెంతులను శుభ్రంగా కడిగి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి ∙నానాక వీటన్నింటినీ గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలి ∙సగం మెదిగిన తరువాత అందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను వేయాలి ∙అవసరాన్ని బట్టి నీళ్లు చల్లుకుంటూ పిండిని మెత్తగా రుబ్బుకోవాలి ∙చక్కగా మెదిగిన పిండిని గిన్నెలో తీసుకుని అందులో ఉప్పు, జీలకర్ర, వాము కలపాలి ∙కాలిన పెనంపైన పిండిని దోశలా పోసుకుని కొద్దిగా నూనె వేయాలి ∙రెండువైపులా చక్కగా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన గ్రీన్ దోశ రెడీ. -
ఆసక్తికరం : చంద్రయాన్ - 3 విజయంలో.. మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ పాత్ర?
భారత్.. అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. చంద్రునిపై అన్వేషణ కోసం ఇస్రో పంపిన చంద్రయాన్-3 మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ ద్వారా..ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలకు సాధ్యం కాని ఘనతను భారత్ సాధించింది. ఈ ప్రయోగం విజయ వంతం కావడం పట్ల ప్రపంచ దేశాలు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నాయి. ఈ తరుణంలో ఇస్రో చంద్రయాన్ - 3 విజయం వెనుక మసలా దోశ, ఫిల్టర్ కాఫీ ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇది వినడానికి విచిత్రంగా, నమ్మశక్యంగా లేకపోయినా చంద్రయాన్ - 3 విజయంలో మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ ప్రముఖ పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై ఇస్రో సైంటిస్ట్ల నుంచి సేకరించిన సమాచారంతో వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది సీనియర్ పాత్రికేయురాలు బర్కాదత్. దీంతో మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ నివేదికలు నిజమేనని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. చంద్రయాన్ -3 సక్సెస్లో ‘మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ పాత్ర’ పై ఆ ప్రాజెక్ట్ సైంటిస్ట్ వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ.. చంద్రయాన్-3 వంటి అసాధ్యమైన పనిని నిర్విరామంగా పనిచేసేందుకు ఒపిక, శక్తి కావాలి. అయితే, ‘ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మసాలా దోస, ఫిల్టర్ కాఫీని అందించడం ద్వారా అలసట అనే విషయాన్ని పక్కన పెట్టాం. ప్రతి ఒక్కరూ ఇష్టపూర్వకంగా అదనపు గంటలు పనిచేశారు. ఎక్కువ సేపు విధులు నిర్వహించేలా సంతోషంగా ముందుకు వచ్చారని గుర్తు చేశారు. ఇస్రో సైంటిస్ట్ల పనితీరు అమోఘం ఇస్రో మాజీ డైరెక్టర్ సురేంద్ర పాల్ కేవలం రూ.150 రూపాయల ఖర్చుతో ఒక సాధారణ ఎద్దుల బండిపై కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని రవాణా చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు భారత్తో పాటు ఇతర దేశాల్లోని సైంటిస్ట్ల కంటే ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఎక్కువగా ఉంటుందని ఇస్రో మాజీ చైర్మన్ జీ మాధవన్ నాయర్ చెప్పారు. బాలీవుడ్ సినిమా నిర్మించేందుకు అయ్యే ఖర్చుతో ఏది ఏమైనప్పటికీ, భారత్ చంద్రయాన్ -3పై చేసిన ఖర్చు, సాధించిన విజయాలు నభూతో నభవిష్యత్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే? ఒక బాలీవుడ్ సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చుతో ఇస్రో అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త చరిత్ర లిఖించింది. ఇప్పటివరకు ఏ దేశమూ చేరని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి అందరి మన్ననలు అందుకుంది. చంద్రయాన్-3 మిషన్ను కేవలం రూ. 615 కోట్ల రూపాయలతోనే ఇస్రో చేపట్టింది. అంతరిక్ష రంగంలో అద్భుత విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చంద్రయాన్ 3 విజయంపై ఈ ఆసక్తికర కథనాలు వెలుగులోకి వచ్చాయి. చదవండి👉 ‘యాంకర్ గూబ గుయ్యిమనేలా కౌంటరిచ్చిన ఆనంద్ మహీంద్రా’ -
టిఫిన్లో ఇడ్లీ, దోశలు తింటున్నారా? అయితే ఆ వ్యాధి బారినపడ్డట్లే!
సౌత్ ఇండియాలో ఎక్కువగా తినే బ్రేక్ఫాస్ట్ ఏంటి అని అడిగితే ఎవరైనా ఠక్కున ఇడ్లీ, దోశ అని అనేస్తారు. ఇంతకుముందు అయితే పెరుగులో సద్దన్నం, జొన్న గటక, రాగి సంకటి వంటివి ఎన్నో పోషక విలువలున్న ఆహారాన్ని అల్పాహారంగా తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఎక్కువగా ఇడ్లీ, దోశలను తెగ లాగించేస్తున్నాం. దీనికి తోడు అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, నెయ్యి లాంటివి కాంబినేషన్గా తినేస్తున్నాం. దీనివల్ల రుచి సంగతేమో కానీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం. రోజులు మారాయి, పద్ధతులు మారాయి, ఆహారపు అలవాట్లూ మారాయి. టిఫిన్స్లో ప్రతిరోజూ ఇడ్లీ, దోశ, వడలను తెగ తినేస్తున్నారు. దీనికి తోడు ఒకేసారి పిండి గ్రైండ్ చేసి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని మూడు, నాలుగు రోజులు ఆరంగించేస్తున్నారు. మధ్యాహ్నం అన్నం తప్పితే, ఉదయం, రాత్రిళ్లూ టిఫిన్ల మీద తిని బతికేస్తున్నారు చాలామంది. ఇడ్లీ, దోశ, వడ, పూరీ, పరోటా, బోండా లాంటి టిఫిన్లను ధీర్ఘకాలంగా తింటే అనేక రోగాలు వస్తాయన్న విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే ఉదాహరణకు వడ తీసుకుంటే.. బియ్యంతో పోలిస్తే మినపప్పులోనే ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. 12 ఏళ్ల పాటు వరుసగా ఇడ్లీ దోశ తినేవారికి మధుమేహ సమస్యలు తొందరగా వచ్చే అవకాశం ఉందట.ఎక్కువగా ఈ టిఫిన్స్ తీసుకుంటే జీర్ణవ్యవస్థ దెబ్బతినడంతో పాటు కీళ్లనొప్పులు తొందరగా అటాక్ చేస్తాయి. ఇడ్లీ, దోశల్లో అన్ని క్యాలరీలా? అన్ని టిఫిన్స్తో పోలిస్తే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో చాలామంది ఎంచుకునేది ఇడ్లీనే. ఇది ఆరోగ్యానికి కాస్త మంచిదే అయినా దాంతో తినే సాంబార్, కారంపొడి వంటివి అసిడిటీని పెంచేస్తాయి. రెండు ఇడ్లీలు తింటే 60 కేలరీలు వస్తాయి. అందుకే ఇడ్లీలను రవ్వతో కాకుండా జొన్నలు, రాగులతో చేసుకుంటే బెటర్. ఇక దోశల్లో వాడే నూనె చాలా ముఖ్యమైనది. చాలామంది టిఫిన్స్ బయట హోటళ్లలో తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. కానీ వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడటం, నాణ్యత లేని ఆయిల్ను వాడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒక దోశ తింటే 132 క్యాలరీల శక్తి వస్తుంది. రోజూ దోశ తినే అలవాటు ఉంటే బియ్యానికి బదులుగా ఓట్స్, రాగితో హెల్తీ దోశ చేసుకోవచ్చు. ఇది కొబ్బరి చట్నీతో తింటే ఆ టేస్టే వేరు. బ్రేక్ఫాస్ట్లో వీటిని తీసుకోండి ►చద్దన్నం, మొలకెత్తిన విత్తనాలు, పండ్లు, ఖర్జూరాలు వంటివి బ్రేక్ఫాస్ట్లో భాగం చేసుకుంటే కొద్దిరోజుల్లోనూ మీ శరీరంలో అనూహ్యమైన మార్పును గమనించవచ్చు. ► కొంతమంది రాత్రిళ్లు కూడా టిఫిన్లు తినేస్తుంటారు. వాటిని తగ్గించేసి రాత్రిపూట పండ్లను తీసుకోవడం మంచిది. ► ఓట్స్ పాలు, డ్రైఫ్రూట్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. వీటిని బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు. ► ఎక్కువ టైం లేదనుకుంటే మొలకెత్తిన పెసలతో చేసిన ఫ్రూట్ సలాడ్ను తీసుకోవాలి. ►ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్తో కూడిన ఓట్స్, అటుకులు, ఉప్మాను అల్పాహారంలో తీసుకోవాలి. ► మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం వేరుశనగలు, అవిసెలు వంటివి జతచేర్చుకుంటే శరీరానికి మంచి కొవ్వులు అందుతాయి. -ఇక ఇడ్లీ, వడ, దోశ వంటి టిఫిన్స్ తినకుండా ఉండలేము అనుకునేవాళ్లు వారానికి ఒకటి లేదా రెండుసార్లకు పరిమితం చేస్తే మంచిది. సౌత్ ఇండియన్ ఫుడ్ చాలా హెల్తీ అని లాగించేవాళ్లు కాస్త డైట్ ప్రకారం మితంగా తీసుకుంటే మంచిది. లేదంటే అనారోగ్యం తప్పదంటారు న్యూట్రిషియన్లు. -
సింపుల్ ఫుడ్ ఛాలెంజ్! కానీ అంత ఈజీ కాదు!
మనసు దోచే దోసె గురించి ఎంత చెప్పినా తక్కువే. దోసె ప్రియుల కోసం సరికొత్త ‘ఫుడ్ చాలెంజ్’ ముందుకు వచ్చింది. ‘ఆరడుగుల పొడవు ఉన్న దోసెను ఒక్క సిట్టింగ్లో తినగలరా?’ అనే సవాలు విసురుతుంది ఈ ఫుడ్ చాలెంజ్. విజేత పొట్టశ్రమ వృథా పోదు. పదకొండు వేల రూపాయలను నగదు బహుమతిగా ఇస్తారు. పాపులర్ బ్లాగర్స్ వాణి, సావిలు ‘సమ్వన్ హు కెన్ ఫినిష్ దిస్?’ ట్యాగ్తో పోస్ట్ చేసిన ‘ఫుడ్ చాలెంజ్’ 5.7 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. ఢిల్లీలోని పాపులర్ రెస్టారెంట్ ‘దోసె ఫ్యాక్టరీ’లో ఈ ఆరు అడుగుల దోసెను తయారు చేయడంతోపాటు షూట్ చేశారు. మూడు రకాల మసాలాలు, నెయ్యితో తయారు చేసిన ఈ మెగా దోసెకు సాంబార్, చట్నీ, రవ్వ కేసరి కాంబినేషన్లుగా ఉంటాయి. ‘టైమ్ లిమిట్ లేకపోతే ఈజీగా లాగించవచ్చు’ అని కొందరు నెటిజనులు స్పందించారు. (చదవండి: ఔరా అమ్మకచెల్ల... భాంగ్రా స్టెప్పులు వేయడం ఇల్లా!) -
రెస్టారెంట్కు షాక్.. మసాలా దోసతో సాంబారు ఇవ్వలేదని..
పాట్నా: మసాలా దోసతో పాటు సాంబారు ఇవ్వనందుకు కస్టమర్కు రూ.3,500 జరిమానా చెల్లించాలని బిహార్లో ఓ హోటల్ను వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. రూ.140 పెట్టి కొనుక్కున్న స్పెషల్ మసాలా దోసకు సాంబార్ ఇవ్వలేదంటూ మనీశ్ గుప్తా అనే లాయర్ కమిషన్ను ఆశ్రయించాడు. పుట్టిన రోజు సందర్భంగా బక్సర్లోని నమక్ రెస్టారెంట్కు వెళ్లాడు. స్పెషల్ దోశ పార్సిల్ చేయించుకుని తీసుకెళ్లాడు. ఇంటికెళ్లి చూస్తే సాంబార్ లేదు. హోటల్కు ఇదేమిటని నిలదీస్తే, ‘రూ.140కి హోటల్ మొత్తం రాసిస్తారా?’ అంటూ ఓనర్ వెటకారం చేయడంతో అతనికి మనీశ్ లీగల్ నోటీసు పంపించాడు. స్పందించకపోవడంతో వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాడు. చదవండి: పబ్జీ జంట ప్రేమ కథ: ముంబై పోలీసులకు బెదిరింపు కాల్ -
మురిపముగా..మొరింగ్ దోశ చేసుకోండి ఇలా..!
మొరింగా దోశ తయారీకి కావలసినవి : మునగ ఆకులు – రెండు కప్పులు ఇడ్లీ పిండి – రెండు కప్పులు నూనె – మూడు టీస్పూన్లు జీలకర్ర – అరటీస్పూను మిరియాలు – అరటీస్పూను వెల్లుల్లి రెబ్బలు – నాలుగు; ఇంగువ – చిటికెడు ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానం: ∙బాణలిలో రెండు టీస్పూన్లు నూనె వేసి వేడెక్కనివ్వాలి. ∙కాగిన నూనెలో జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, ఇంగువ వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించాలి. ∙ఇవన్నీ వేగాక కడిగి పెట్టుకున్న మునగ ఆకులు వేయాలి. ఆకుల్లోని నీరంతా ఇగిరిపోయాక దించేయాలి. ∙మునగ ఆకుల మిశ్రమం చల్లారాక ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా రుబ్బుకోవాలి. ∙ఇప్పుడు ఇడ్లీ పిండిలో ఈ పేస్టుని వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి దోశ పిండిలా కలుపుకోవాలి. ∙దోశపెనం వేడెక్కిన తరువాత పిండిని దోశలా పోసుకుని, టీస్పూను నూనె వేసి రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే మొరింగాదోశ రెడీ. సాంబార్, కొబ్బరి చట్నీలు దీనికి మంచి కాంబినేషన్. (చదవండి: విదేశీ భోజనంబు.. వింతైన వంటకంబు..) -
ఓకైకే పాన్ దోశ వాలా!
‘ఎన్ని రకాల పాన్లు ఉన్నాయి?’ అని అడిగితే హైదరాబాద్ నుంచి అలహాబాద్ వరకు ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పవచ్చు. అలాగే దోశలలో కూడా మైసూర్ దోశ నుంచి రవ్వ దోశ వరకు ఎన్నో రకాల దోశలు ఉన్నాయి. దోశ ప్లస్ పాన్ కాంబినేషన్ అనేది ఊహకు అందదు. అయితే ముంబైవాలా ఒకరు దోశకు పాన్ జత చేస్తూ తయారుచేసిన ‘పాన్ దోశ’ను చూసి నెటిజనులు ‘ఔరారా’ అంటున్నారు.వేడి వేడి దోశలో పాన్తో పాటు అంజీర్, డ్రై ఫ్రూట్స్... మొదలైనవి చేర్చాడు. రెండు రోజుల వ్యవధిలోనే ఈ వీడియో 1.5 లక్షల వ్యూస్ను సొంతం చేసుకుంది. -
హోటల్లో దోశలు వేసిన ప్రియాంక గాంధీ
-
Video: కర్ణాటక ఎన్నికలు.. హోటల్లో దోసెలు వేసిన ప్రియాంక
బెంగళూరు: కర్ణాటకలో మే 10 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ మైసూర్లోని ఓ హోటల్లో దోసెలు వేస్తూ వినూత్నంగా ప్రచారం చేశారు. ఈ మేరకు మైసూర్ ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నేతలు డీకే శివ కుమార్, రణదీప్ సింగ్ సూర్జేవాలలతో ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే మైసూర్లోని ప్రముఖమై పురాతన రెస్టారెంట్ అయిన హైలారీ హోటల్ని సందర్శించారు ఆమె. అనంతరం అక్కడ హోటల్ యజమానులతో కలసి ఉత్సాహంగా దోసెలు వేశారు. అంతేగాక వారితో కాసేపు ముచ్చటిస్తూ మీ వ్యాపారం నిజాయితీకి, కృషికి, మంచి ఆతిథ్యానికి మారు పేరు అంటూ ప్రశంసించారు. హోటల్ సిబ్బందితో సెల్ఫీ కూడా దిగారు. ఇక్కడ దోసెలు రుచిగా ఉన్నాయని, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన కూతురిని తీసుకుని అక్కడకు తీసుకువెళ్తానంటూ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా, మైసూరులో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడారు. బీజేపీ కర్ణాటకలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని.. రాష్ట్రంలో మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలో ప్రతిపక్ష నేతల సమాధులు తవ్వాలనుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ప్రజలు ఏ నాయకుడి మాటలు విని ఓటు వేయకూడదని, మనస్సాక్షిని అనుసరించి ఓటు వేయాలని సూచించారు. కాగా, 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10న సింగిల్ ఫేజ్లో ఎన్నికలు జరుగుతుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. Perfect dosas are just the beginning; with such skillful hands, there's no limit to the power they can bring to the world. pic.twitter.com/qsgUw6IBeJ — Congress (@INCIndia) April 26, 2023 (చదవండి: తమిళనాట డీఎంకే ఫైల్స్ కలకలం.. ఆడియో క్లిప్ రిలీజ్ చేసిన అన్నామలై) -
భార్య దోసె వేయలేదనే కోపంతో..
అన్నానగర్: దోసె చేయలేదనే కోపంతో భర్త కత్తితో పొడవడంతో సోమవారం ఉదయం మహిళ మృతి చెందింది. కృష్ణగిరి జిల్లా మాత్తూరు సమీపంలోని ఎన్.మోటూరు గ్రామానికి చెందిన గణేశన్ (60) భార్య మాధమ్మాల్ (50) గత 11వ తేదీ పని ముగించుకుని ఇంటికి వచ్చిన గణేశన్ తనకు దోసె చేయాలని భార్యను అడిగాడు. దీంతో ఆమె మూడు దోసెలు వేసి, ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ అయిపోయింది. ఇంతలో గణేశన్ మరో 3 దోసెలు అడిగాడు. సిలిండర్లో గ్యాస్ అయిపోయిందని చెప్పింది. దీంతో తీవ్ర కోపంతో గణేశన్ కత్తితో మాధమ్మాల్ తల, చేయి నరికాడు. దీన్ని అడ్డుకునేందుకు వెళ్లిన కోడలు విజయలక్ష్మి, చిన్నారి తానీషా(2)కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం కృష్ణగిరి ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న మాత్తూరు పోలీసులు గణేశన్ను అరెస్టు చేశారు. చికిత్స నిమిత్తం ధర్మపురి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాధమ్మాన్ చికిత్స ఫలించక సోమవారం ఉదయం మృతి చెందింది. దీంతో పోలీసులు కేసును హత్య కేసుగా మార్చారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. -
హోటల్లో షాకిచ్చిన వెయిటర్.. కస్టమర్ కూల్గా ఏం చేశాడంటే!
దక్షిణాదిలో ప్రజలు తమ టిఫిన్ సెక్షన్లో ఎక్కువగా తినే వంటకాల జాబితాలలో మసాల దోస ఖచ్చితంగా ఉంటుంది. ఇక ప్రత్యేకంగా చెప్పాలంటే దోసలందు మసాల దోస టేస్ట్ వేరయా అన్నట్లు ..దాని తిని ఆశ్వాదించాల్సిందే తప్ప మాటలతో చెప్పలేము. అంతటి ప్రాముఖ్యమున్న వంటకానికి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తికి ఆకలి వేసి ముంబైలోని కృష్ణ ఛాయా హోటల్కు వెళ్లాడు. తనకు ఇష్టమైన మసాల దోస ఆర్డర్ చేశాడు. కాసేపటి తర్వాత వెయిటర్ తన ఆర్డర్ను తీసుకువచ్చి ఇచ్చాడు. అయితే అది చూసి సదరు వ్యక్తి షాక్ అయ్యాడు. ఎందుకంటే.. తాను ఆర్డర్ చేసిన మసాలా దోశను.. మసాలా విడిగా, దోశను విడిగా సర్వ్ చేశాడు ఆ వెయిటర్. ఆకలి మీద ఉన్న ఆ వ్యక్తి సాంబర్, చట్నీతో దోశ తిని సరిపెట్టుకున్నాడు. మరి మిగిలిన మసాలాను ఏం చేశాడన్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు. తన ట్వీట్లో.. "నేను ఒక ఫుడ్ బ్లాగర్ని. నిన్న కృష్ణ ఛాయా దగ్గర మసాలా దోసె ఆర్డర్ చేసాను. లోపల ఏం జరిగిందో తెలియదు గానీ వాళ్ళు మసాల దోసకు బదులుగా.. దోస విడిగా, మసాలా విడివిడిగా సర్వ్ చేశారు. నేను దోసె తిన్నాను. విడిగా ఇచ్చిన మసాలాను ఇంటికి తీసుకెళ్లి ఫ్రిజ్లో ఉంచాను. ఆ తర్వాత రోజు దాచిన మసాలతో నా ఇంట్లో మసాల దోశ చేసుకుని తిన్నాను. టెస్ట్ ఓహోహో!" అని మసాల దోశ ఫోటోని షేర్ చేశాడు. ఆ వ్యక్తి పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు అతని క్రియేటివికి ఫిదా అయ్యి కామెంట్ల వర్షం కురిపించారు. Main bhi food blogger. I ordered a masala dosa from Krishna Chhaya yesterday. They sent the dosa and masala separately. I ate the dosa. Refrigerated the masala. And made my own masala dosas at home today. Ohoho! pic.twitter.com/Xbxvw4E1Ms — Ramki (@ramkid) March 19, 2023 -
జొన్న దోసె.. బరువు తగ్గాలనుకునే వారి కోసం..
కావలసినవి: మినప్పప్పు– కప్పు; జొన్న పిండి –3 కప్పులు ; అటుకులు– పావు కప్పు; మెంతులు– పావు టీ స్పూన్ ; ఉప్పు – అర టీ స్పూన్; నూనె లేదా నెయ్యి – 4 టీ స్పూన్లు. తయారీ: మినప్పప్పు, మెంతులను కడిగి మంచినీటిలో ఐదారు గంటల సేపు నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని వంపేసి మిక్సీలో వేసి, ఉప్పు కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ పిండిని ఒక పెద్ద పాత్రలోకి తీసుకుని, అదే జార్లో జొన్న పిండి, నీరు వేసి బాగా కలవడం కోసం కొద్దిసేపు గ్రైండ్ చేయాలి. దీనిని మినప్పప్పు మిశ్రమంలో వేసి బాగా కలిపి గట్టిగా మూత పెట్టి రాత్రంతా ఉంచాలి. ఉదయం పిండిని గరిటెతో కలిపి చూసుకుని తగినంత నీరు, ఉప్పు కలిపి దోసెలు వేసుకోవడమే. ఈ దోసెలు వేరుశనగపప్పు చట్నీ లేదా కొబ్బరి– పచ్చి శనగపప్పు చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇవి బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ పేషెంట్లకు మంచి ఆహారం. (క్లిక్ చేయండి: మష్రూమ్స్ ఆమ్లెట్.. వేయడం చాలా ఈజీ!) -
Recipe: రొటీన్గా కాకుండా.. ఇలా ఓట్స్ మసాలా దోసెలు ట్రై చేయండి!
ఓట్స్ మసాలా దోసెలు తయారు చేసుకోండిలా! కావలసినవి: ►మసాలా కర్రీ – 2 లేదా ఒకటిన్నర కప్పులు (దోసెలు పోసుకునే కాసేపు ముందు, వండి పెట్టుకోవాలి) ►బియ్యం – 4 కప్పులు ►ఓట్స్ – 2 కప్పులు ►మినప్పప్పు – 1 కప్పు ►మెంతులు – 1 టీ స్పూన్ (నానబెట్టుకున్నవి) ►ఉప్పు – సరిపడా తయారీ: ►బియ్యం, మినపప్పులను విడివిడిగా 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ►ముందుగా మిక్సీలో ఓట్స్, మెంతులు, బియ్యం, మినప్పప్పు.. కలిపి పేస్ట్లా గ్రాండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ►తగినంత ఉప్పు కలుపుకుని.. పెనంపై నెయ్యితో దోసెలు వేసుకోవాలి. ►ప్రతి దోసె మీద ఒక గరిటె మసాలా కర్రీని పెట్టి ఫోల్డ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Apple Egg Rings: ఆపిల్, మొక్కజొన్న పిండి, కోడిగుడ్లతో.. ఆపిల్ ఎగ్ రింగ్స్ తయారీ! Bread Garlic Soup: బ్రెడ్.. వెల్లుల్లి, గుడ్లు, కూరగాయలు... సూప్ చేసుకోండిలా! -
గర్భిణులకు ప్రత్యేక ఆహారం.. ఐరన్, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటేనే! పాలక్ దోసెతో
Recipes In Telugu: గర్భిణి తినే ఆహారం ప్రత్యేకంగా ఉండాలి. మామూలుగా ఎప్పుడూ తినే ఆహారం సరిపోదు. ఆహారంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండాలి. అందుకే బ్రేక్ఫాస్ట్లోనే ఓట్స్, చిరుధాన్యాలు, పాలకూరలతో ఇలా హెల్దీగా ప్రయత్నించి చూడండి. ఓట్స్ పాలక్ ఊతప్పం కావలసినవి ►ఓట్స్ పొడి – కప్పు (కొంచెం రవ్వలా ఉండాలి) ►మినప పిండి – పావు కప్పు ►పచ్చిమిర్చి పేస్ట్ – 2 టీ స్పూన్లు ►పాలకూర పేస్ట్ – అర కప్పు ►ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు ►ఉడికించిన గింజలు – ముప్పావు కప్పు (వేరుశనగ, పెసలు, శనగలు వంటివి) ►నూనె లేదా నెయ్యి– 4 టీ స్పూన్లు ►ఉప్పు – పావు టీ స్పూన్ లేదా రుచికి తగినంత ►చాట్ మసాలా – టీ స్పూన్ (ఇష్టమైతేనే). తయారీ: ►ఓట్స్ పొడి, మినపపిండి, మిర్చి పేస్ట్, పాలకూర పేస్ట్, ఉప్పు వేసి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి బాగా కలిపి 15 నిమిషాలపాటు పక్కన ఉంచాలి. ►మినీ ఊతప్పాల పెనం (మామూలు పెనం మీద కూడా వేసుకోవచ్చు) స్టవ్ మీద పెట్టి ప్రతి గుంతలోనూ రెండు చుక్కల నెయ్యి వేసి గుంత మొత్తానికి అంటేటట్లు మునివేళ్లతో రుద్దాలి. ►పెనం వేడి అయిన తర్వాత చిన్న గరిటెతో పిండి మిశ్రమాన్ని గుంతల్లో పోయాలి. ►పిండి కాలేలోపుగా ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన గింజలను వేసి మూత పెట్టి సన్న మంట మీద కాలనివ్వాలి. ►ఒకవైపు కాలిన తర్వాత స్పూన్తో జాగ్రత్తగా తిరగేసి మూత పెట్టకుండా కాలనివ్వాలి. ►రెండోవైపు కూడా కాలిన తరవాత తీసి చాట్ మసాలా చల్లి వేడిగా ఉండగానే కొబ్బరి చట్నీ లేదా సాంబార్తో వడ్డించాలి. ►మినపపిండి లేకపోతే పావు కప్పు మినప్పప్పు నానబెట్టి రుబ్బి ఓట్స్ పౌడర్ కలుపుకోవాలి. పాలక్ దోసె కావలసినవి : ►పాలకూర పేస్ట్ – అర కప్పు (సుమారు రెండున్నర కప్పుల పాలకూర ఆకులను రుబ్బితే అరకప్పు పేస్టు వస్తుంది) ►మినప్పప్పు – పావు కప్పు ►మెంతులు – అర టీ స్పూన్ ►గోధుమపిండి– కప్పు ►ఉప్పు – పావు టీ స్పూన్ లేదా రుచికి తగనంత ►నూనె – 2 టీ స్పూన్లు. తయారీ: ►మినప్పప్పు, మెంతులను కడిగి నిండుగా నీటిని పోసి మూడు లేదా నాలుగు గంటల సేపు నానబెట్టాలి. ►ఆ తర్వాత తగినంత నీటిని కలుపుకుంటూ మెత్తగా రుబ్బాలి. ►ఈ పిండిలో పాలకూర పేస్ట్, గోధుమపిండి, ఉప్పు వేసి అవసరమైతే మరికొన్ని నీటిని పోసి గరిటె జారుడుగా కలిపి పది నిమిషాల సేపు పక్కన ఉంచాలి. ►ఆ తర్వాత పెనం వేడి చేసి దోసె పోసుకోవాలి. ►దోసె మీద నూనె వేసుకోవడం ఇష్టం లేకపోతే నెయ్యి లేదా వెన్న వేసుకోవచ్చు. ఇవి కూడా ట్రై చేయండి: Makhana Panjiri: పాలిచ్చే తల్లికి తగిన శక్తినిచ్చే ఆహారం.. తామర గింజలతో పాంజిరి Nuvvula Annam: చిన్నా పెద్దా లొట్టలేసుకుంటూ తినేలా నువ్వుల అన్నం తయారీ
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
16, 17 తేదీల్లో జూనియర్ ఇంటర్లో ప్రవేశానికి కౌన్సెలింగ్
రేపు బాస్కెట్బాల్ జిల్లా జట్ల ఎంపిక
వరంగల్ పార్లమెంట్ పరిధిలో 2009 నుంచి 2024 వరకు నమోదైన ఓట్లు, పోలింగ్ శాతం...
పథకాలు పారదర్శకంగా అందించాలి
No Headline
రైతులు ధైర్యంగా ఉండాలి
వరంగల్ స్ట్రాంగ్రూంకు ఈవీఎంలు
వాతావరణం
ఓటుకు దూరంగా..
రేవణ్ణ అరెస్ట్ వెనుక కుట్ర: కుమార
తప్పక చదవండి
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
Advertisement