-
బర్త్డే స్పెషల్.. చిన్నారులతో ఫుట్ బాల్ ఆడిన సచిన్! వీడియో వైరల్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బుధవారం (ఏప్రిల్ 24) తన 51వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా సచిన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అభిమానులు, యువరాజ్ సింగ్, గౌతం గంభీర్, సురేష్ రైనా, ఓజా వంటి మాజీ క్రికెటర్లు సచిన్కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఐసీసీ, బీసీసీఐ కూడా సచిన్కు ఎక్స్ వేదిగా స్పెషల్ విషెస్ తెలియజేసింది. కాగా సచిన్ తన బర్త్డే సెలబ్రేషన్స్ను సతీమణి అంజలితో కలిసి ‘సచిన్ టెండ్కూల్కర్ ఫౌండేషన్’లో జరపునకున్నాడు. చాలా సమయం పాటు అక్కడ ఉన్న చిన్నారులతో సచిన్ ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన బర్త్డే సెలబ్రేషన్స్కు సంబంధించిన విషయాలను సచిన్ అభిమానులతో పంచుకున్నాడు."ఈసారి నా బర్త్డే సెలబ్రేషన్స్ భిన్నంగా చేసుకోవడం చాల సంతోషంగా ఉంది. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ సాయంతో ఎదుగుతున్న చిన్నారుల మధ్య కేక్ కట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. వారితో ఫుట్బాల్ ఆడటం, నా స్టోరీలను పంచుకోవడం ఎంతో అనుభూతిని ఇచ్చింది. నాకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో వీరే ఫస్ట్ అనుకుంటాను. ఈ మూమెంట్ నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని" తన బర్త్డే వేడుకల సంబంధించిన వీడియో క్లిప్ను సచిన్ ఎక్స్లో షేర్ చేశాడు. Happy birthday paaji! 🎉 From smashing bowlers on the field to smashing life goals, you're the reason I learned to aim higher in life (and sometimes on the field too 🤪) Here's wishing you loads of love, good health and happiness always 🤗❤️@sachin_rt #HappyBirthdaySachin pic.twitter.com/t6qFKgKJmZ— Yuvraj Singh (@YUVSTRONG12) April 24, 2024 -
Virat Kohli-Gambhir: కలిసిపోయిన గంభీర్, కోహ్లి.. హగ్ చేసుకుని మరి! వీడియో వైరల్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మధ్య గత కొంత కాలంగా వైరం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు వారిద్దరూ కలిసిపోయారు. అవును మీరు విన్నది నిజమే. ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, కేకేఆర్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ స్ట్రాటజిక్ టైమ్లో గౌతం గంభీర్, కోహ్లి ఇద్దరూ ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకుంటూ హగ్ చేసుకున్నారు. దీంతో వారిద్దరి మధ్య 11 ఏళ్లగా కొనసాగుతున్న వైరానికి తెరపడింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు తమ అభిమాన క్రికెటర్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. క్రికెట్ జెంటిల్మెన్ గేమ్ అని, ఎప్పుడు మీ ఇద్దరూ ఇలానే కలిసి ఉండాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్లో కోహ్లి ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. గౌతం గంభీర్ కేకేఆర్ మెంటార్గా వ్యవహరిస్తున్నాడు. కాగా తొలిసారిగా 2013 ఐపీఎల్ సీజన్లో కేకేఆర్- ఆర్సీబీ మ్యాచ్లో విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత 2015 ఐపీఎల్ సీజన్లో మళ్లీ విరాట్, గౌతీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ మ్యాచ్లో కేకేఆర్పై ఆర్సీబీ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. దీన్ని తట్టుకోలేకపోయిన గౌతమ్ గంభీర్, డగౌట్లో కూర్చీని తన్ని, ఫైన్ కూడా కట్టాడు. అనంతరం 2023 ఐపీఎల్ సీజన్లో మరోసారి విరాట్ , గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నవీన్ ఉల్ హాక్-కోహ్లి మధ్య గొడవ జరగగా.. అందులో గంభీర్ జోస్యం చేసుకోవడంతో ఆ గొడవ మరింత తీవ్రమైంది. అయితే మళ్లీ ఏడాది తర్వాత ఇద్దరూ ఒకే మైదానంలో ఉండడంతో అందరి కళ్లు ఈ మ్యాచ్పైనే ఉన్ను. కానీ అందరి ఊహలను తలకిందులు చేస్తూ ఇద్దరూ మంచి మిత్రులయ్యారు. They hugged 😭😭😭 Gautam gambhir said sorry to king kohli for everything he spoke against him. I think the only controversy which will last this season is Hardik vs Rohit 😂#RCBvsKKR #IPL2024 #ViratKohli #GautamGambhir Maxwell pic.twitter.com/G0pZpGsOOb — RanaJi🏹 (@RanaTells) March 29, 2024 -
అతడొక అద్భుతం.. పాక్ క్రికెట్లో లెజెండ్ అవుతాడు: గంభీర్
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజంపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. బాబర్ ఆజం తన కెరీర్ ముగిసే సమయానికి పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్గా నిలుస్తాడని గంభీర్ కొనియాడాడు. వన్డే ప్రపంచకప్-2023 అనంతరం అన్ని ఫార్మాట్లలో పాకిస్తాన్ కెప్టెన్సీకి బాబర్ గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. బాబర్ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో తలపడుతున్న పాక్ టెస్టు జట్టులో భాగంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ కీడాతో గంభీర్ మాట్లాడుతూ.. "కెప్టెన్సీని విడిచిపెట్టడం లేదా స్వీకరించడమనేది ఆటగాళ్ల వ్యక్తిగతం. నా వరకు అయితే బాబర్ ఆజం అద్భుతమైన ఆటగాడు. అతడి బ్యాటింగ్ స్టైల్ అంటే నాకు ఎంతో ఇష్టం. అతడు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో వర్క్లోడ్ తగ్గింది. పాకిస్తాన్లో మాత్రం ప్రశంసలైనా, విమర్శలైనా కెప్టెన్కే దక్కుతాయి. ఇటువంటిది భారత్లో కూడా కొంత వరకు ఉంది. బాబర్ ఆజం బ్యాటింగ్పై ఎప్పుడూ పెద్దగా విమర్శలు రాలేదు. ప్రతీ సారి అతడి కెప్టెన్సీపైనే ప్రశ్నల వర్షం కురిసేది. ఇప్పుడు అతడు కెప్టెన్సీ విడిచిపెట్టాడు. ఇకపై మనం సరికొత్త బాబర్ను చూడవచ్చు. ఇప్పటికే పాకిస్తాన్ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా బాబర్ నిలిచాడు. అతడికి ఇంకా చాలా వయస్సు ఉంది. బాబర్ మరో 10 ఏళ్ల పాటు క్రికెట్ ఆడుతాడు. కచ్చితంగా అతడు రిటైర్ అయ్యే సమయానికి పాక్ క్రికెట్ చరిత్రలో తన పేరు సువర్ణ అక్షరాలతో లిఖించుకుంటాడని పేర్కొన్నాడు. చదవండి: AUS vs PAK: ఫేర్వెల్ టెస్టు సిరీస్ ... పాక్పై సెంచరీతో చెలరేగిన డేవిడ్ వార్నర్ -
గంభీర్తో గొడవ.. శ్రీశాంత్కు లీగల్ నోటీసులు
లెజెండ్స్ లీగ్లో టీమిండియా మాజీ ఆటగాళ్లు గౌతం గంభీర్- శ్రీశాంత్ మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా వీరిదద్దరి మద్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే మ్యాచ్ అనంతరం గంభీర్ను ఉద్దేశించి శ్రీశాంత్ చేసిన ఓ పోస్ట్.. ఈ గొడవకు మరింత అజ్యం పోసింది. గంభీర్ తనను పదే పదే ఫిక్సర్ అన్నాడని, అసభ్య పదజాలంతో తనను దూషించాడని శ్రీశాంత్ ఓ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశాడు. అయితే.. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ కమిషనర్ శ్రీశాంత్కు లీగల్ నోటీసులు పంపించారు. శ్రీశాంత్ టోర్నమెంట్ కాంట్రాక్ట్ నిబంధనలు ఉల్లఘించాడని కమిషనర్ నోటీస్లో పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియాలో శ్రీశాంత్ పోస్ట్ చేసిన వీడియోలు తొలగించిన తర్వాతనే అతనితో చర్చలు జరుపుతామని తెలిపారు. ఈ వివాదంపై అంపైర్లు ఇచ్చిన నివేదికలో శ్రీశాంత్ను శ్రీశాంత్ను గంభీర్ ఫిక్సర్ అన్నాడని ఎక్కడా పేర్కొనలేదు. కాగా వీరిద్దరూ భారత తరుపన కలిసి 49 మ్యాచ్లు ఆడారు. 2007 టీ20, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో భాగస్వాములుగా ఉన్నారు. చదవండి: IPL 2024: పంజాబ్ కింగ్స్లోకి ఆసీస్ విధ్వంసకర ఆటగాడు..!? -
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా కెప్టెన్గా అతడే ఉండాలి: గంభీర్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ త్వరలోనే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలం నుంచి టీ20లకు దూరంగా ఉంటున్న రోహిత్.. కేవలం వన్డేల్లో, టెస్టుల్లో మాత్రమే కొనసాగున్నట్లు క్రికెట్ వర్గాల్లో తెగ చర్చనడుస్తోంది. రోహిత్తో పాటు భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా గత ఏడాది నుంచి టీ20ల్లో ఆడటం లేదు. రోహిత్ గైర్హజరీలో హార్దిక్ పాండ్యా టీ20ల్లో భారత జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరూ ఆడాలని గంభీర్ అభిప్రాయపడ్డాడు. "టీ20 ప్రపంచకప్-2024కు రోహిత్ శర్మ, కోహ్లి ఇద్దరినీ కచ్చితంగా ఎంపిక చేయాలి. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్లో భారత జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాలి. హార్దిక్ టీ20ల్లో సారథిగా ఉన్నప్పటికీ.. రోహిత్ను నేను కెప్టెన్గా చూడాలనుకుంటున్నాను. ఈ ఏడాది వన్డే వరల్డ్కప్లో రోహిత్ తన బ్యాటింగ్ పవర్ ఎంటో చూపించాడు. రోహిత్ను ఎంపిక చేస్తే విరాట్ కోహ్లి కూడా ఆటోమేటిక్గా జట్టులోకి వస్తాడు. రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్ ఆడాలని నిర్ణయించుకుంటే, అతడిని బ్యాటర్గా కాకుండా కెప్టెన్గా ఎంపిక చేయాలి" అని స్పోర్ట్స్ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు రోహిత్ శర్మ, కోహ్లితో పాటు సీనియర్ ఆటగాళ్లందరికీ విశ్రాంతి ఇచ్చారు. ఈ సిరీస్లో టీమిండియా తాత్కాలిక కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నాడు. చదవండి: IPL 2024-Rashid Khan Injury: గుజరాత్ టైటాన్స్కు బిగ్ షాక్.. రషీద్ ఖాన్కు సర్జరీ!? ఐపీఎల్కు దూరం -
కోహ్లి, రోహిత్, గిల్ కాదు.. అతడే గేమ్ ఛేంజర్: గంభీర్
వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా సిద్దమవుతోంది. నవంబర్ 19న అహ్మదాదాబాద్ వేదికగా జరగనున్న తుదిపోరులో ఆసీస్ను చిత్తు చేసి.. ముచ్చటగా మూడోసారి వన్డే వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడాలని భారత జట్టు భావిస్తోంది. ఇప్పటికే అహ్మదాబాద్కు చేరుకున్న భారత జట్టు తమ ప్రాక్టీస్ను కూడా మొదలు పెట్టింది. ఈ క్రమంలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్పై మాజీ ఓపెనర్, ఎంపీ గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆసీస్తో జరగనున్న ఫైనల్లో శ్రేయస్ అయ్యర్ మరోసారి అదరగొడతాడని గంభీర్ జోస్యం చెప్పాడు. కాగా శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ మెగా టోర్నీలో దుమ్ములేపుతున్నాడు. న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో అయ్యర్ సెంచరీతో చెలరేగాడు. ఓవరాల్గా ఈ టోర్నీలో ఇప్పటివరకు 10 మ్యాచ్ ఆడిన అయ్యర్.. 75.14 సగటుతో 526 పరుగులు చేశాడు. "ఈ ఏడాది వరల్డ్కప్లో నా వరకు అయితే శ్రేయాస్ అయ్యర్ బిగ్గెస్ట్ గేమ్ ఛేంజర్. అతడు ఈ టోర్నీకి ముందు గాయంతో బాధపడ్డాడు. గాయం నుంచి కోలుకున్న వెంటనే ఈ తరహా ప్రదర్శన చేయడం అంత ఈజీకాదు. న్యూజిలాండ్ వంటి జట్టుపై సెమీఫైనల్లో కేవలం 70 బంతుల్లో సెంచరీ చేయడం అయ్యర్కే సాధ్యమైంది. అతడు టీమిండియాకు చాలా కీలకమైన ఆటగాడు. ఆసీస్తో ఫైనల్లో మరోసారి తన మార్క్ను చూపిస్తాడని భావిస్తున్నాను. మిడిల్ ఓవర్లలో జంపా, మాక్స్వెల్ను ధీటుగా అయ్యర్ ఎదుర్కొంటాడని ఓ స్పోర్ట్స్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ పేర్కొన్నాడు. చదవండి: CWC 2023: టీమిండియాతో ఫైనల్.. ఏకపక్షంగా ఉంటుంది: ఆసీస్ కెప్టెన్ కమిన్స్ -
ఇంగ్లండ్ను చూస్తుంటే దేశం కోసం ఆడుతున్నట్లు లేదు.. గంభీర్ సంచలన వ్యాఖ్యలు
వన్డే ప్రపంచకప్-2023లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ తమ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గురువారం బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లీష్ జట్టు ఓటమి చవిచూసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ కేవలం 156 పరుగులకే కుప్పకూలింది. బెన్ స్టోక్స్(46 పరుగులు) మినహా మిగితా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. 157 పరుగుల లక్ష్యాన్ని లంక కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడిన ఇంగ్లండ్.. కేవలం ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో కొనసాగుతోంది. ఈ వరల్డ్కప్లో తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న ఇంగ్లండ్ జట్టుపై మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ చేరాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో పాల్గోన్న గంభీర్కు.. ఇంగ్లండ్ ఓటములకు బ్యాటింగ్ కారణమా? బౌలింగ్ కారణమన్న ప్రశ్న ఎదురైంది. "ఈ టోర్నీలో ఇంగ్లండ్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిల్లోనూ నిరాశపరిచింది. వరల్డ్కప్ తొలి మ్యాచ్ నుంచే ఇంగ్లండ్ జట్టు చాలా నిరూత్సహంగా కన్పిస్తోంది. బ్యాటింగ్ తీరు అయితే మరి దారుణంగా ఉంది. మొత్తం బ్యాటింగ్ యూనిట్లో ఒక్క బ్యాటర్ కూడా బాధ్యతతో ఆడినట్లు కన్పించడం లేదు. జట్టులో చాలా మంది ఆటగాళ్లు తమ పరువు కోసం ఆడుతున్నారు తప్ప దేశం కోసం కాదు. శ్రీలంకపై మొదటి 7 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 350 పరుగులపైగా వస్తుంది అనుకున్నాను. కానీ ఏ ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించలేదు. జో రూట్ అవుట్ అయిన తర్వాత చాలా చెత్త షాట్లు ఆడి వికెట్ను పారేసుకున్నారు. శ్రీలంక మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేసింది. అందుకే వారు విజయం సాధించారు" అని స్టార్ స్పోర్ట్స్ షోలో గంభీర్ పేర్కొన్నాడు. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. టీమిండియా హెడ్ కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్! -
'బాబర్ ఆజం చాలా పిరికివాడు.. ఫిప్టి కొసమే ఆడాడు'
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఆట తీరుపై టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ మండిపడ్డాడు. బాబర్ ఆజం కేవలం వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడాడని గంభీర్ విమర్శించాడు. "బాబర్ అజం చాలా పిరికివాడు. ఇద్దరు బ్యాటర్లు భాగస్వామ్యం నెలకొల్పే క్రమంలో ఎవరో ఒకరు కొంచెం దూకుడుగా ఆడాలి. రిజ్వాన్ కంటే ముందు బాబర్ బ్యాటింగ్ వచ్చాడు. కాబట్టి ఆజం ఛాన్స్లు తీసుకుని ఆడాల్సింది. ఫిప్టీ కోసమో లేదా మీ వ్యక్తిగత రికార్డుల కోసం ఆడితే ఇటువంటి ఫలితాలే ఎదురవతాయి. అంతర్జాతీయ క్రికెట్లో బాబర్ ఇప్పటికే చాలా పరుగులు సాధించాడు. ఎన్నో రికార్డులు కూడా తన పేరిట లిఖించుకున్నాడు. పాకిస్తాన్ క్రికెట్ గత చరిత్ర చూసుకుంటే షాహిద్ అఫ్రిది, ఇమ్రాన్ నజీర్, తౌఫీక్ ఉమర్ వంటి ఆటగాళ్లు ఆరంభంలో దూకుడుగా ఆడేవారు. క్రీజులో సెటిల్ అయ్యాక ప్రత్యర్ధి బౌలర్లపై ఒత్తడి పెంచేవారు. కానీ ప్రస్తుత పాకిస్తాన్ జట్టు టాపర్డర్లో అటువంటి ఆటగాడు ఒక్కడు కూడా లేడు. భారత్ వంటి క్వాలిటీ బౌలింగ్ ఎటాక్ ఎదుర్కొవలసి వచ్చినప్పుడు ఎటువంటి భయం లేకుండా ఆడాలని ముందే డ్రెస్సింగ్ రూమ్లో చర్చించుకోవాలి. అంతే తప్ప పిరికిగా మాత్రం ఆడకూడదు. అలా అయితే టాప్ 3 బ్యాటర్లు ఔట్ కాగానే మిగితా బ్యాటర్లకు పెవిలియన్కు క్యూ కడతారని స్టార్స్పోర్ట్స్ షోలో గంభీర్ పేర్కొన్నాడు. చదవండి: WC 2023: ఎదుటి వాళ్లను అన్నపుడు నవ్వుకొని.. మనల్ని అంటే ఏడ్చి గగ్గోలు పెట్టడం ఎందుకు? అతడికి స్ట్రాంగ్ కౌంటర్ -
గంభీర్ ఓ యోధుడు.. చాలా మంది అపార్ధం చేసుకున్నారు: అశ్విన్
టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్పై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. గంభీర్ ఓ యోధుడు అని అశ్విన్ కొనియాడాడు. తాజాగా యూట్యూబ్ లైవ్లో ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లేతో అశ్విన్ సంభాషించాడు. ఈ సందర్భంగా గంభీర్ వరల్డ్కప్ ప్రదర్శనల గురించి కూడా అశ్విన్ మాట్లాడాడు. "మన దేశంలో గంభీర్ను చాలా మంది అపార్ధం చేసుకున్నారు. అతడొక గొప్ప టీమ్మ్యాన్. జట్టు కోసం పోరాడటానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటాడు. అతడు ముఖంలో పెద్దగా ఉద్వేగాలు కన్పించకపోయినా ఎల్లప్పుడూ జట్టు గురించి ఆలోచించే నిస్వార్థ వ్యక్తి. వరల్డ్కప్లో ఫైనల్లో మాత్రమే కాదు, అతడు అటువంటి ఇన్నింగ్స్లు భారత జట్టు కోసం ఎన్నో ఆడాడు. వన్డే వరల్డ్కప్ ఫైనల్లో సచిన్ టెండూల్కర్ ,వీరేంద్ర సెహ్వాగ్ వెంటవెంటనే ఔటైనప్పుడు గౌతీ జట్టుపై ఎటువంటి ఒత్తడి కలగకుండా చేశాడు. ఆ కాసేపటికే విరాట్ కోహ్లి కూడా పెవిలియన్కు చేరాడు. కానీ గంభీర్ మాత్రం శ్రీలంక బౌలర్లకు ఎదురు నిలబడి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడు ఈజీగా 120-130 పరుగులు చేసే అవకాశమున్నా నిస్వార్థంగా ఆడాడు" అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. కాగా 2007 టీ20 ప్రపంచకప్,2011 వన్డే ప్రపంచకప్లను సొంతం టీమిండియా సొంతం చేసుకోవడంలో గంభీర్ ది కీలక పాత్ర. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో గెలిచిన రెండు ప్రపంచకప్ ఫైనల్స్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గంభీర్ నిలిచాడు. 2007 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో జోహన్నెస్ బర్గ్ లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 75 పరుగులు చేశాడు గంభీర్. 2011 వరల్డ్కప్లో ముంబైలో శ్రీలంకపై జరిగిన ఫైనల్ మ్యాచ్లో 97 పరుగులు డు. గంభీర్ తన 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడి 4154, 5238, 932 పరుగులు చేశాడు. చదవండి: WC 2023: టీమిండియాతో తొలి మ్యాచ్.. ఆసీస్ తుది జట్టు ఇదే! స్టార్ ఆల్రౌండర్కు నో ఛాన్స్ -
శ్రీవారిని దర్శించుకున్న గౌతం గంభీర్.. ఫోటోలు వైరల్
టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో గంభీర్ పాల్గొన్నాడు. దర్శనం ఆనంతరం.. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు గౌతీని సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ సందర్భంగా గంభీర్ మాట్లాడుతూ.. వన్డే ప్రపంచకప్-2023 టైటిల్ను సొంతం చేసుకునేందుకు భారత జట్టుకు మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. 140 కోట్ల మంది భారతీయుల ప్రార్థనలతో టీమిండియా కచ్చితంగా వరల్డ్ కప్ గెలుస్తుందని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేసారు. కాగా భారత్ వేదికగా ఆక్టోబర్ 5నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్లో ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇక భారత్ తమ తొలి మ్యాచ్లో ఆక్టోబర్8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. చదవండి: IND vs AUS 3rd Odi: ఓటమితో ముగింపు.. సిరీస్ భారత్ సొంతం -
సచిన్, గవాస్కర్, కోహ్లి కాదు.. భారత అత్యుత్తమ బ్యాటర్ అతడే: గంభీర్
భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్ అంటే ఎవరైనా సచిన్ టెండూల్కర్ పేరునే చెబుతారు. లేదంటే ప్రస్తుత తరంలో అయితే స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి వైపు మొగ్గు చూపుతారు. కానీ టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ దృష్టిలో వీరిద్దరిలో ఎవరూ కూడా బెస్ట్ బ్యాటర్ కాదంటా. విషయంలోకి వెళ్తే తాజాగా వివేక్ బింద్రా హోస్ట్గా వ్యవహరిస్తున్న ది బడా భారత్ షోలో గౌతం గంభీర్ పాల్గోనున్నాడు. ఇప్పటివరకు భారత క్రికెట్లో మీ అత్యుత్తమ బ్యాటర్ ఎవరన్న ప్రశ్న గంభీర్కు ఎదురైంది. అందుకు ఆప్షన్స్గా సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ ఆటగాళ్ల పేర్లను వివేక్ బింద్రా ఇచ్చాడు. గంభీర్ మాత్రం బిన్నంగా టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ భారత్ తరఫున బెస్ట్ బ్యాటర్ అని తన సమాధనమిచ్చాడు. అదే విధంగా టీమిండియా బెస్ట్ కెప్టెన్ ఎవరన్న విషయంలోనూ గంభీర్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. భారత బెస్ట్ కెప్టెన్ ఎవరంటూ కపిల్ దేవ్, గంగూలీ, ధోనీ, కోహ్లి పేర్లను ఆప్షన్లుగా ఇవ్వగా.. గంభీర్ మాత్రం అనిల్ కుంబ్లేను ఎంచుకున్నాడు. కాగా గంభీర్ తన చర్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆసియాకప్లో అభిమానులకు మిడిల్ ఫింగర్ చూపించి గంభీర్ తీవ్ర విమర్శల పాలయ్యాడు. చదవండి: BCCI: ‘టీమిండియా హెడ్కోచ్ పదవి వద్దు’.. ఆసక్తి లేదన్న మాజీ పేసర్! కారణమిదేనా? -
అందుకే మిడిల్ ఫింగర్ చూపించా.. నేను అది సహించలేను: గంభీర్
టీమిండియా మూజీ ఓపెనర్ గౌతం గంభీర్ మరోసారి తన చర్యతో వార్తలకెక్కాడు. ఆసియాకప్-2023లో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కామెంటేటర్గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో భారత్-నేపాల్ మ్యాచ్ సందర్భంగా అభిమానులకు గంభీర్ మిడిల్ ఫింగర్ చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో ఫ్యాన్స్ కోహ్లి, కోహ్లి అంటూ గట్టిగా అరుస్తుండగా.. గంభీర్ తన మిడిల్ ఫింగర్ చూపించడం కన్పించింది. తాజాగా ఈ వీడియోపై గంభీర్ స్పందించాడు. భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతోనే తను అలా రియాక్ట్ అయ్యానని గంభీర్ తెలిపాడు. అది నిజం కాదు.. "సోషల్ మీడియలో మీరు చూస్తున్నది నిజం కాదు. ఎందుకంటే నేను ఎవరి ఫ్యాన్స్కి వ్యతిరేకిని కాదు. అక్కడ జరిగింది వేరు.. వీడియోలో ఉన్నది ఒకటి. అక్కడ కొంతమంది పాకిస్తానీలు భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కాశ్మీర్ గురించి మాట్లాడుతున్నారు. దేశం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను ఇలానే రియాక్ట్ అవుతా. అటువంటివి విని నేను నవ్వుతూ వెళ్లిపోలేను" అంటూ గంభీర్ క్లారిటీ ఇచ్చాడు. చదవండి: ఆ సమయంలో చాలా నిరాశ చెందా.. అది క్షమించరానిది: రోహిత్ శర్మ #WATCH | Kandy, Sri Lanka | On his recent viral video during Asia Cup 2023, former cricketer and BJP MP Gautam Gambhir says, "What is shown on social media has no truth in it because people show whatever they want to show. The truth about the video that went viral is that if you… pic.twitter.com/RX4MJVhmyd — ANI (@ANI) September 4, 2023 -
'కోహ్లి, గంభీర్ అలా చేస్తారనుకోలేదు.. చాలా బాధ కలిగించింది'
ఐపీఎల్-2023లో ఆర్సీబీ, లక్నో మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ మధ్య తీవ్ర వాగ్వదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్ల మధ్య కరచాలనం చేసుకునే సమయంలో వీరిద్దరి మధ్య మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో వీరిద్దరికి ఐపీఎల్ నిర్వాహకులు భారీ జరిమానా కూడా విధించారు. అదే విధంగా గౌతీ, విరాట్ ప్రవర్తనపై మాజీ ఆటగాళ్లు విమర్శల వర్షం కురిపించారు. తాజాగా ఇదే విషయంపై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ స్పందించాడు. మైదానంలో కోహ్లి, గంభీర్ ప్రవర్తన తనను చాలా బాధ కలిగించిందని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు. "బీసీసీఐ క్రికెటర్లను మంచి ఆటగాళ్ల గానే కాదు, మంచి పౌరులుగా కూడా తీర్చిదిద్దాలి. మైదానంలో ఎలా ప్రవర్తించుకోవాలో నెర్పించాలి. ఐపీఎల్లో విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ ప్రవర్తన నన్ను చాలా బాధ కలిగించింది. ఇద్దరూ లెజెండరీ క్రికెటర్లు. విరాట్ ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాటర్లలో ఒకడిగా కొనసాగుతుండగా.. గౌతీ చాలా ఏళ్ల పాటు భారత క్రికెట్కు తన సేవలను అందించాడు. అంతేకాకుండా గంభీర్ ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడిగా కూడా ఉన్నాడు. అటువంటిది వీరిద్దరూ బహిరంగంగా అలా ఎలా ప్రవర్తిస్తారు. కానీ క్రీడాకారులు ఎదో ఒక సమయంలో తమ సహనాన్ని కోల్పోతారు. బ్రాడ్మన్, పీలే వంటి దిగ్గజాలు కూడా ఈ కోవకు చెందిన వారే" అని ది వీక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ పేర్కొన్నాడు. చదవండి: Ashes 5th Test: మరో రసవత్తర ముగింపునకు రంగం సిద్ధం.. -
నవీన్ ఉల్ హుక్ కి ఎటకారం ఎక్కువే ..
-
నవీన్ ఉల్ హక్ కి చెంపపెట్టులా కోహ్లి పై LSG ట్వీట్
-
రింకూ సింగ్ పై గౌతమ్ గంభీర్ పోస్టు వైరల్
-
అమ్మో మన ధోని, కోహ్లి, రిషభ్ ఇలా ఉంటారా?
-
కే ఎల్ రాహుల్ అవుట్...ఎల్ఎస్ జీ లోకి కొత్త ప్లేయర్
-
కోచ్ లు డగౌట్ లో ఉండాలి.. గ్రౌండ్ లో ఏం పని
-
కోహ్లీ, గంభీర్ ఫైట్... బీసీసీఐ సీరియస్...!
-
పో నేనేం సారీ చెప్పను.. కోహ్లిపై నవీన్ సీరియస్!? మరీ ఇంత తలపొగరా? వీడియో వైరల్
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, లక్నో సూపర్ జెయింట్స్ మరోసారి గంభీర్ మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా వీరిద్దరూ కొట్టుకున్నంత పనిచేశారు. వీరిద్దరూ మరోసారి జెంటిల్ మేన్ గేమ్ని వీధిపాలు చేశారు. ఏం జరిగిందంటే? ఈ ఏడాది సీజన్లో చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరిగిన ఉత్కంఠపోరులో ఒక్క వికెట్ తేడాతో లక్నో విజయం సాధించింది. అయితే మ్యాచ్ తర్వాత గంభీర్ నోటి మీద వేలు వేసుకొని.. ఇక నోరు మూసుకోండి అన్నట్టుగా సైగ చేశాడు. ఈ క్రమంలో తాజా మ్యాచ్లో కోహ్లి రివేంజ్ మైండ్ సెట్తో బరిలోకి దిగినట్లు సృష్టంగా కన్పించింది. లక్నో వికెట్లు పడినప్పుడు దూకుడుగా సెల్రబేషన్స్ చేయడం, ఆటగాళ్లను స్లెడ్జింగ్ చేయడం లాంటివి చేశాడు. ఈ క్రమంలో లక్నో ఇన్నింగ్స్ 17 ఓవర్లో పేసర్ నవీన్ ఉల్-హక్, కోహ్లి మధ్య చిన్న పాటి మాటల యుద్దం జరిగింది. అంపైర్లు జోక్యం చేసుకోవడంతో గొడువ సద్దుమణిగింది. అయితే అది అక్కడతో ఆగలేదు. మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్స్ ఇచ్చే సమయంలో మళ్లీ నవీన్ ఉల్-హక్, కోహ్లి మధ్య మళ్లీ వివాదం చోటు చేసుకుంది. చేతులు విసిరికొట్టి మరీ ఇద్దరూ విడిపించుకున్నారు. తర్వాత ఇదే విషయంపై లక్నో ఆటగాడు కైల్ మైర్స్ కోహ్లితో మాట్లాడతుండగా.. గంభీర్ అతడితో మాట్లాడవద్దు అంటూ మైర్స్ను తీసుకు వెళ్లిపోయాడు. దీంతో గంభీర్, కోహ్లి మధ్య మాటమాట పెరిగి గొడవకు దారితీసింది. చదవండి: #Kohli, Gambhir Fight: గౌతం గంభీర్, విరాట్ కోహ్లికి బిగ్ షాక్.. భారీ జరిమానా పో నేనేం సారీ చెప్పను.. ఇక గొడవ అంతా సద్దుమణిగాక విరాట్ కోహ్లి, లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌండరీ లైన్ వద్ద నిల్చుని మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన నవీన్ ఉల్-హక్ను కోహ్లికి క్షమాపణ చెప్పమని రాహుల్ అడిగాడు. అయితే నవీన్ మాత్రం నేనేం సారీ చెప్పను పో అన్నట్టుగా వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి ఇంత తలపొగరా? ఇక నవీన్ ఉల్-హక్ ప్రవర్తనపై విరాట్ అభిమానులు మండిపడుతున్నారు. ఆటలో ఇటువంటి సహజం. దాన్ని సీరియస్గా తీసుకుని సారీ చెప్పకపోవడం ఏంటి? మరి ఇంత తలపొగరా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. చదవండి: IPL 2023: గ్రౌండ్లోకి దూసుకొచ్చి కోహ్లి కాళ్లు మొక్కిన ఫ్యాన్.. కింగ్ ఏం చేశాడంటే? Naveen😭😭😭 king ko apne ling pe rakh raha pic.twitter.com/O4Qf0tVZyz — Masum💛 (@chicken_heartz) May 1, 2023 The full fight video #virat #gambhir #fight #rcb #lsg #RCBvsLSG #TataIPL #DARKBLOOD #LabourDay #IPL #Viral #ViralFight #naveen #LSGvsRCB pic.twitter.com/ehymWbIE49 — Vipul Chahal Infinitech (@v7pul) May 1, 2023 -
గౌతం గంభీర్, విరాట్ కోహ్లికి బిగ్ షాక్.. భారీ జరిమానా
లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా మైదానంలోనే గొడవపడ్డ విరాట్ కోహ్లి, గౌతం గంభీర్లకు బిగ్ షాక్ తగిలింది. వీరిద్దరితో పాటు గొడవకు పరోక్షంగా కారణమైన నవీన్-ఉల్-హక్లకు ఐపీఎల్ నిర్వహకులు భారీ జరిమానా విధించారు. కోహ్లి, గంభీర్ మ్యాచ్ ఫీజులో 100 శాతం.. నవీన్-ఉల్-హక్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కొత ఐపీఎల్ నిర్వహకులు విధించారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 2 ఆర్టికల్ 2.21 కింద ఈ ముగ్గిరికి ఈ జరిమానా విధించినట్లు ఐపీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఏం జరిగిందంటే? మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లి, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. షేక్ హ్యండ్ ఇచ్చే సమయంలో కోహ్లి, లక్నో పేసర్ నవీనుల్ హఖ్ మధ్య ఏదో వాదన జరిగింది. తర్వాత ఇదే విషయంపై లక్నో ఆటగాడు కైల్ మైర్స్ కోహ్లితో మాట్లాడతుండగా.. గంభీర్ అతడితో మాట్లాడవద్దు అంటూ మైర్స్ను తీసుకు వెళ్లిపోయాడు. దీంతో గంభీర్, కోహ్లి మధ్య మాటమాట పెరిగి గొడవకు దారితీసింది. ఈ క్రమంలో సహచర ఆటగాళ్లు జోక్యం చేసి గొడవ సద్దుమణిగేలా చేశారు. ఆర్సీబీ సంచలన విజయం ఈ మ్యాచ్లో 18 పరుగుల తేడాతో ఆర్సీబీ సంచలన విజయం సాధించింది. 127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 108 పరుగులకే ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్వుడ్, కరణ్ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా మ్యాక్స్వెల్, హసరంగా, సిరాజ్, హర్షల్ పటేల్ తలా వికెట్ సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో బౌలర్లు చెలరేగడంతో కేవలం 126 పరుగులు మాత్రమే చేసింది. లక్నోబౌలర్లలో నవీనుల్ హఖ్ మూడు వికెట్లు పడగొట్టగా, బిష్ణోయ్, మిశ్రా తలా వికెట్ సాధించారు. ఆర్సీబీ బ్యాటర్లలో డుప్లెసిస్ 44 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. చదవండి: #Kohli Gambhir Fight: మళ్లీ డిష్యూం డిష్యూం.. కోహ్లి, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్ The full fight video #virat #gambhir #fight #rcb #lsg #RCBvsLSG #TataIPL #DARKBLOOD #LabourDay #IPL #Viral #ViralFight #naveen #LSGvsRCB pic.twitter.com/ehymWbIE49 — Vipul Chahal Infinitech (@v7pul) May 1, 2023 -
మళ్లీ డిష్యూం డిష్యూం.. కోహ్లి, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
ఐపీఎల్-2023లో భాగంగా వాజ్పేయి ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 18 పరుగులు తేడాతో ఆర్సీబీ సంచలన విజయం సాధించింది. 127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 108 పరుగులకే ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్వుడ్, కరణ్ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా మ్యాక్స్వెల్, హసరంగా, సిరాజ్, హర్షల్ పటేల్ తలా వికెట్ సాధించారు. గంభీర్, కోహ్లి మధ్య తీవ్ర వాగ్వాదం ఇక ఈ మ్యాచ్ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్, ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గతంలో ఐపీఎల్ మ్యాచ్లో వీరిద్దరి మధ్య జరిగిన గొడవను ఇది గుర్తుకు తెచ్చింది. అయితే ఇందులో నేరుగా గంభీర్ పాత్ర లేకపోయినా...అతని జోక్యంతో పరిస్థితి కాస్త వేడిగా మారింది. బెంగళూరు విజయం తర్వాత షేక్ హ్యాండ్ల సమయంలో కోహ్లి, లక్నో పేసర్ నవీనుల్ హఖ్ (అఫ్గానిస్తాన్) మధ్య ఏదో వాదన జరిగింది. చేతులు విసిరికొట్టి మరీ ఇద్దరూ విడిపించుకున్నారు. అయితే ఆ తర్వాత నవీన్ను పిలిచి కోహ్లి ఏదో చెప్పేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ముందుగా కైల్ మేయర్స్ (వెస్టిండీస్), ఆ తర్వాత గంభీర్ తమ ఆటగాడికి అండగా నిలుస్తూ మధ్యలోకి వచ్చారు. దాంతో కోహ్లి, గంభీర్ తీవ్రంగా వాదించుకున్నారు. చివరకు రాహుల్, మిశ్రా జోక్యం చేసుకొని విడిపించాల్సి వచ్చింది. ఆ తర్వాతా కోహ్లి పదే పదే ఇదే విషయాన్ని రాహుల్కు ఫిర్యాదు చేయడం కనిపించింది. నిజానికి గత మ్యాచ్లో గెలిచిన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో నోరు మూయమంటూ ప్రేక్షకులను ఉద్దేశించి గంభీర్ సైగ చేయగా...ఈసారి గెలుపు బాటలో కోహ్లి అదే తరహాలో సైగ చేస్తూ దానిని గుర్తు చేయడం కూడా ఒక కారణం కావచ్చు! ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి చదవండి: LSG VS RCB: టాప్-3లోకి చేరిన అమిత్ మిశ్రా.. ఒకేసారి ముగ్గురిని అధిగమించి..! The full fight video #virat #gambhir #fight #rcb #lsg #RCBvsLSG #TataIPL #DARKBLOOD #LabourDay #IPL #Viral #ViralFight #naveen #LSGvsRCB pic.twitter.com/ehymWbIE49 — Vipul Chahal Infinitech (@v7pul) May 1, 2023 -
హమ్మయ్య.. ఎట్టకేలకు నవ్వాడు! ఇక చాలు గౌతీ! వీడియో వైరల్
ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ మరో విజయం సాధించింది. మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 56 పరుగుల తేడాతో లక్నో గెలుపొందింది. దీంతో పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్ రెండో స్థానానికి చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 257 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. లక్నో బ్యాటర్లలో మార్కస్ స్టోయినిష్(72), కైల్ మైర్స్(54), పూరన్(45) విధ్వంసం సృష్టించారు. అనంతరం 258 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 19.5 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. ఎట్టకేలకు నవ్విన గౌతం గంభీర్ ఇక ఎప్పుడూ సీరియస్గా కనిపించే లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ ఎట్టకేలకు నవ్వాడు. గౌతీ తన మైదానంలో తన హావభావాలను వ్యక్తం చేయడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ పంజాబ్పై లక్నో విజయం సాధించడంతో గంభీర్ ఖుషీగా ఉన్నాడు. పంజాబ్ వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ ఔటైన వెంటనే గంభీర్ నవ్వుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్ జియో సినిమా సోషల్మీడియాలో పోస్టు చేసింది. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఓ యూజర్ స్పందిస్తూ.. హమ్మయ్య.. ఎట్టకేలకు నవ్వాడు, ఇక చాలు గౌతీ అంటూ కామెంట్ చేశాడు. చదవండి: IPL 2023: అంత మంచి క్యాచ్ పట్టి అలా చేశావు ఏంటి? వీడియో వైరల్ A performance that made Gambhir smile 😏#PBKSvLSG #TATAIPL #IPLonJioCinema #IPL2023 pic.twitter.com/NNKUBdr8Ky — JioCinema (@JioCinema) April 28, 2023 -
డివిలియర్స్ వ్యక్తిగత రికార్డుల కోసం ఆడాడు.. అతడి కంటే రైనా చాలా బెటర్!
దక్షిణాఫ్రికా దిగ్గజం ఎబీ డివిలియర్స్కు భారత్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ ద్వారా ఎంతో మంది అభిమానులను డివిలియర్స్ సంపాందించుకున్నాడు. తన విధ్వంసకర ఆట తీరుతో అభిమానులను మంత్రముగ్ధులను చేసేవాడు. ఫ్యాన్స్ అతడిని ముద్దుగా మిస్టర్ 360 అని పిలుచుకుంటారు. అదే విధంగా తన సొంత దేశం దక్షిణాఫ్రికా తర్వాత ఇష్టమైనది ఇండియానే అని చాలా సందర్భాల్లో ఏబీడీ కూడా తెలిపాడు. అటువంటి డివిలియర్స్పై భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ వివాదాస్పద వాఖ్యలు చేశాడు. డివిలియర్స్ కేవలం వ్యక్తిగత రికార్డుల కోసం మాత్రమే ఆడాడని సంచలన కామెంట్స్ చేశాడు. "చిన్నస్వామి స్టేడియం లాంటి చిన్న మైదానంలో ఎబీ డివిలియర్స్ దాదాపు 8 నుంచి 10 ఏళ్ల పాటు ఆడాడు. అటువంటి ఏ ఆటగాడికైనా స్ట్రైక్ రేటు ఎక్కువగానే ఉంటుంది. ఐపీఎల్లో డివిలియర్స్ కంటే సురేష్ రైనా అద్భుతమైన ఆటగాడు. అతడు వ్యక్తిగత రికార్డులతో పాటు నాలుగు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన జట్టులోనూ భాగంగా ఉన్నాడు. కానీ డివిలియర్స్ మాత్రం కేవలం వ్యక్తిగత రికార్డులు మాత్రమే కలిగి ఉన్నాడు" అని స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ పేర్కొన్నాడు. ఇక వివాదాస్పద వాఖ్యలు చేసిన గంభీర్పై ఏబీడీ అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక తన ఐపీఎల్ కెరీర్లో 184 మ్యాచ్లు ఆడిన ఏబీడీ 5162 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లలో మూడు సెంచరీలతో పాటు 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: WPL 2023 MI VS GG: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. కొత్త రూల్ను ప్రపంచానికి పరిచయం చేసిన హర్మన్
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
Mothers day 2024 మామ్స్తో సెలబ్రిటీలు, రెండు కళ్లూ చాలవు (ఫోటోలు)
లండన్ ట్రిప్ను ఎంజాయ్ చేస్తున్న మీనా
పెళ్లికి రెడీ అయిన హాట్ బ్యూటీ.. అంతకు ముందే 'ఎగ్ ఫ్రీజింగ్'
అందరూ ఓటు వేయండి.. ఓటర్లకు ప్రియాంక గాంధీ విజ్ఞప్తి
నా ప్రాణాలు పోయిన పర్లేదు..రిగ్గింగ్ జరిగితే ఊరుకోను
ఓటు హక్కు వినియోగించుకున్న తండ్రి కొడుకులు
రూ. 400 కోట్ల లాభం వస్తోంది.. చాలదా?: సెహ్వాగ్ కామెంట్స్ వైరల్
పెళ్లికి రెడీ అయిన మరో హీరోయిన్!
ఓటు వేసిన YSRCP నేతలు
ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement