-
రుణం కోసం ఐఎంఎఫ్ను సంప్రదించిన పాక్!
పొరుగు దేశం పాకిస్తాన్ రుణ సాయం కోసం మరోమారు చేయి చాచింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదివారం అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టాలినా జార్జివాను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నగదు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తమ దేశానికి కొత్త రుణం కోసం అభ్యర్థించారు.పాక్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యుఇఎఫ్) సమావేశంలో పాక్కు మూడు బిలియన్ యూఎస్ డాలర్లు ఎస్బీఏ కింద అందించేందుకు ఐఎంఎఫ్ మద్దతు ఇచ్చినందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వివరాలను పీటీవీ న్యూస్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో తెలిపింది. కాగా స్టాండ్బై అరేంజ్మెంట్ (ఎస్బీఏ) కింద 1.1 బిలియన్ డాలర్ల రుణంపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సోమవారం సమావేశం కానుంది.గత ఏడాది జూన్లో జరిగిన ఐఎంఎఫ్ కార్యక్రమంలో పాకిస్తాన్ మూడు బిలియన్ డాలర్ల రుణం అందుకుంది. తాజాగా జరిగిన డబ్ల్యుఈఎఫ్ ప్రత్యేక సమావేశంలో పాక్ ప్రధాని షరీఫ్ ‘ప్రపంచ ఆరోగ్య అజెండాను పునర్నిర్వచించడం’పై జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య సంరక్షణలో ప్రపంచ అసమానతలను ప్రస్తావించారు. 2003లో సౌదీ అరేబియా వెళ్లినప్పుడు తనకు క్యాన్సర్ సోకిందని షరీఫ్ తెలిపారు. ఆ తర్వాత న్యూయార్క్కు వెళ్లి వేల డాలర్లు వెచ్చించి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇంతటి ఖరీదైన చికిత్సను తమ దేశంలోని ప్రజలు భరించలేరని తెలిపారు.తాను పాకిస్తాన్కు తిరిగి వచ్చినప్పుడు, పంజాబ్ ప్రావిన్స్కు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యానని, తమ ప్రభుత్వం కిడ్నీ, కాలేయ వ్యాధులతో పాటు క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన ప్రత్యేక ఆసుపత్రులను నిర్మించిందని షాబాజ్ చెప్పారు. కరోనా మహమ్మారి ప్రపంచంలోని ఆరోగ్య అసమానతలను, లోపాలను బహిర్గతం చేసిందని షరీఫ్ పేర్కొన్నారు. -
ప్రపంచ ఎకానమీపై ఐఎంఎఫ్ కీలక ప్రకటన
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి 2024 అవుట్లుక్ను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అప్గ్రేడ్ చేసింది. ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అమెరికా వృద్ధి పయనం, ద్రవ్యోల్బణం నెమ్మదించడం దీనికి ప్రధాన కారణాలుగా పేర్కొంది. తాజా అవుట్లుక్లో 2024 వృద్ధి రేటును ఇంతక్రితం 2.9 శాతం అంచనాల నుంచి 3.1 శాతానికి పెంచింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. ద్రవ్యోల్బణం అవుట్లుక్ను తగ్గించింది. 2023లో 6.8 శాతం ద్రవ్యోల్బణం ఉంటే, 2024లో ఇది 5.8 శాతానికి, 2025లో 4.4 శాతానికి తగ్గుతుందని అంచనావేసింది. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి అగ్రదేశాల్లో ద్రవ్యోల్బణం 2024లో 2.6 శాతం ఉంటే 2024లో 2 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. ఇక ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు 2024లో 3.3 శాతంగా ఉంటే, 2025లో 3.6 శాతానికి పెరుగుతుందని తెలిపింది. చరిత్రాత్మాక వాణిజ్య వృద్ధి సగటు 4.9 శాతంగా ఉంది. -
అంతర్జాతీయ సవాళ్లపై సమాలోచనలు...
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొరాకో ఆర్థిక రాజధాని మారకేచ్లో ప్రపంచ ఆర్థిక విధాన నిర్ణేతలతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పలు అంతర్జాతీయ ఆర్థిక అంశాలు, సవాళ్లు, వీటిని ఎదుర్కొనడం.. ఆమె చర్చల్లో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్ఎంసీబీజీ) సమావేశంతో పాటు ప్రపంచ బ్యాంక్–అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి ఆమె ఈ నెల 11న మారకేచ్కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో భాగంగా ఆమె 15వ తేదీ వరకూ మరకేచ్లోనే ఇండోనేషియా, మొరాకో, బ్రెజిల్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్లతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. అంతర్జాతీయ సమస్యలు, సవాళ్లు, ఆర్థిక అనిశి్చతి, బహుళజాతి బ్యాంకుల పటిష్టత, క్రిప్టో కరెన్సీ వంటి అంశాలు ఈ సమావేశాల చర్చల్లో ప్రధాన భాగంగా ఉన్నాయి. సమావేశాల్లో భాగంగా అమెరికా ఆర్థికమంత్రి జనెత్ ఎలన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనడానికి ఐఎంఎఫ్కు నిధుల లభ్యతపై ప్రధానంగా చర్చ జరిగింది. ఐఎంఎఫ్ రుణ విధానాలు, పటిష్టత, కోటా విధానం, పేదరిక నిర్మూలన, ఐఎంఎఫ్ పాలనా నిర్వహణ విషయంలో సంస్కరణలపై ఆర్థికమంత్రి ప్రధానంగా చర్చించినట్లు ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కే జార్జివా నేతృత్వంలోని బృందంతోపాటు, ఇంటర్–అమెరికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఇలాన్ గోల్డ్ఫాజ్్నతో కూడా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. జీ20 ఎజెండాను కొనసాగించేందుకు ఐఎంఎఫ్తో కలిసి పనిచేయాలన్న భారత్ ఆకాంక్షను ఆమె ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్తో జరిగిన సమావేశాల్లో వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
చైనా కన్నా స్పీడ్గా.. అంచనాలను పెంచిన ఐఎంఎఫ్
న్యూఢిల్లీ: భారత్ ఏప్రిల్ 2023తో ప్రారంభమయిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24)లో 6.3% స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిని నమోదుచేసుకుంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) తాజా ‘వరల్డ్ ఎకనమిక్ అవుట్లుక్’ అంచనా వేసింది. తొలి జూలై నెల అంచనా 6.1 శాతాన్ని ఈ మేరకు 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) పెంచింది. తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) అంచనాలకు మించి వినియోగ గణాంకాలు నమోదవడం తాజా అప్గ్రేడ్కు కారణమని అవుట్లుక్ వివరించింది. 2024–25లో కూడా భారత్ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ 6.3%గా పేర్కొంది. వృద్ధి స్పీడ్లో టాప్.. ప్రపంచంలోని రెండవ ఆర్థిక వ్యవస్థ చైనాకన్నా భారత్ వృద్ధి స్పీడ్ వేగంగా ఉండడం మరో అంశం. 2023లో చైనా వృద్ధి రేటు అంచనాలను ఐఎంఎఫ్ 20 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఈ రేటు 5%కి తగ్గింది. 2024లో అంచనాలను 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఫలితంగా ఈ రేటు 4.2%కి దిగింది. చైనాలో ప్రోపర్టీ మార్కెట్ సంక్షోభంలో ఉండటం కూడా వృద్ధి రేటు కోతకు కారణమని ఐఎంఎఫ్ పేర్కొంది. ప్రపంచ వృద్ధి అంచనా డౌన్ కాగా, 2023 ప్రపంచ వృద్ధి అంచనాలను మాత్రం ఐఎంఎఫ్ తగ్గించడం గమనార్హం. ఇంతక్రితం 3.2 శాతంగా ఉన్న గ్లోబల్ వృద్ధి అంచనాలను తాజాగా 3%కి కుదించింది. కొన్ని సంస్థల అంచనా ఇలా.. సంస్థ 2023–24 (వృద్ధి శాతాల్లో) ఆర్బీఐ 6.5 ప్రపంచబ్యాంక్ 6.3 ఎస్అండ్పీ 6.0 ఫిచ్ 6.3 మూడీస్ 6.1 ఏడీబీ 6.3 ఇండియా రేటింగ్స్ 6.2 ఓఈసీడీ 6.3 -
ఐఎంఎఫ్లో రాష్ట్ర విద్యార్థినికి గౌరవం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులుగా ఐక్యరాజ్యసమితి (యూఎన్) సదస్సుకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మంగళవారం వాషింగ్టన్లోని ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ (ఐఎంఎఫ్) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణమూర్తి వి.సుబ్రమణ్యన్ విద్యార్థుల బృందంతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన నంద్యాలకు చెందిన లారీ డ్రైవర్ కుమార్తె చాకలి రాజేశ్వరికి తన చైర్ ఆఫర్ చేసి అందులో కూర్చోబెట్టారు. సుమారు 1.20 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో రాజేశ్వరి అదే చైర్లో కూర్చుంది. ఈ సందర్భంగా సుబ్రమణ్యన్ విద్యార్థులతో మాట్లాడుతూ.. కలలను నిజం చేసుకోవడానికి నిరంతరం కృషి చేయాలని, సమాజంలో మనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడంతో పాటు దేశానికి చేతనైన సాయం చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సుబ్ర మణ్యన్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ‘నేను నా కార్యాలయంలో ఏపీ నుంచి వచ్చిన తెలివైన విద్యార్థులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వారంతా అత్యంత నిరాడంబరమైన నేప థ్యాల నుంచి వచ్చినవారు కావడం వల్ల భార తీయుడిగా గర్వపడుతున్నాను. విద్య ప్రాముఖ్యత ప్రతి భారతీయ కుటుంబం మనసులోకి ప్రవేశించింది’ అంటూ సుబ్రమ ణ్యన్ ట్వీట్ చేశారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ ‘వారిని ప్రోత్స హిస్తున్నందుకు ధన్యవాదాలు సుబ్రమణ్యన్గారూ! మిమ్మల్ని కలవడం, మీతో సంభాషించడం మన పిల్లలకు, ఏపీ పిల్లలందరికీ అపురూపమైన గౌరవం. మన పిల్లలు మన రాష్ట్రాన్ని, మన విద్యా విధానం సారాంశాన్ని ప్రపంచం మొత్తం చాటిచెప్పడాన్ని చూసి నేను గర్వపడుతున్నాను’ అంటూ రీట్వీట్ చేశారు. గీతాగోపీనాథ్కు సీఎం జగన్ ధన్యవాదాలు ఐఎంఎఫ్ ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతాగోపీనాథ్కు కూడా సీఎం ధన్యవాదాలు తెలి పారు. ఐఎంఎఫ్ కార్యాలయంలో విద్యార్థులు గీతాగోపీనాథ్తో సమావేశమైన సందర్భంగా ఆమె ‘ఐఎంఎఫ్కి ఏపీ విద్యార్థులను స్వాగతించ డం నిజంగా ఆనందంగా ఉంది. వారి యూఎన్, యూఎస్ పర్యటనలో భాగంగా ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయానికి రావడం సంతోషిస్తున్నాను’ అంటూ ఏపీ సీఎంను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన సీఎం జగన్.. ‘మా పిల్లలను కలిసినందుకు, వారిని ఇంత ఆప్యాయంగా చూస్తు న్నందుకు ధన్యవాదాలు గీతా గోపీనాథ్ గారూ, వారి చిరునవ్వులు అన్నీ చెబుతున్నాయి! విద్య అనేది వ్యక్తిగత జీవితాలను మా ర్చడమే కాకుండా మొత్తం సమాజాన్ని మార్చడంలో అతిపెద్ద ఉత్ప్రేరకం అని నేను నిజంగా నమ్ముతున్నాను. మన పిల్లలే ఇందుకు నిదర్శనం. అంతర్జాతీయ వేదికపై ఆత్మవిశ్వాసంతో ప్రాతి నిధ్యం వహిస్తున్న మన పిల్లలను చూసినప్పుడు నేను గర్వంతో ఉప్పొంగిపోయాను’ అంటూ రీట్వీట్ చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement