-
శ్రేయస్, ఇషాన్ల వేటు పడటానికి కారణం అతడే: జై షా
టీమిండియా స్టార్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్టులు కోల్పోవడానికి తాను కారణం కాదన్నాడు భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా. సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం మాత్రమే తన విధి అని తెలిపాడు.కాగా దక్షిణాఫ్రికా పర్యటన నుంచి మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్.. రంజీల్లో ఆడమని బోర్డు ఆదేశించినా లెక్కచేయలేదు. ఆ తర్వాత వెంటనే ఐపీఎల్-2024 కోసం ముంబై ఇండియన్స్ క్యాంపులో చేరాడు.మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ సైతం రంజీల్లో ముంబై తరఫున బరిలోకి దిగకుండా ఫిట్నెస్ కారణాలు సాకుగా చూపాడు. అయితే, ఎన్సీఏ అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది. ఈ క్రమంలో తాజా సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ఈ ఇద్దరి పేర్లు గల్లంతయ్యాయి.ఆ తర్వాత అయ్యర్ ముంబై తరఫున రంజీ బరిలో దిగినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో వీరిద్దరికి టీ20 వరల్డ్కప్-2024 జట్టులోనూ చోటు దక్కలేదు.అతడి నిర్ణయం ప్రకారమేఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్టులు కోల్పోయిన అంశంపై జై షా తాజాగా స్పందించాడు. ‘‘బీసీసీఐ రాజ్యాంగాన్ని గమనించండి.సెలక్షన్ మీటింగ్లో చర్చించిన విషయాల గురించి మీడియాకు తెలియజేసే కన్వీనర్ను మాత్రమే నేను.ఆ ఇద్దరిని దేశవాళీ క్రికెట్ ఆడాలని నిర్ణయించిందీ.. అదే విధంగా వారు చెప్పినట్లు వినలేదని సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తప్పించిందీ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.అతడు తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడమే నా పని. వాళ్లిద్దరు వెళ్లినా సంజూ శాంసన్ లాంటి వాళ్ల రూపంలో కొత్త ఆటగాళ్లకు చోటు దక్కింది కదా!’’ అని జై షా జాతీయ మీడియాతో వ్యాఖ్యానించాడు.అయ్యర్ అదుర్స్... ఇషాన్ ఫెయిల్కాగా ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్నారు. ముంబై ఇండియన్స్ తరఫున ఓపెనర్గా వస్తున్న ఇషాన్ ఇప్పటి వరకు 12 ఇన్నింగ్స్లో కలిపి 266 పరుగులు మాత్రమే చేశాడు.మరోవైపు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం 11 ఇన్నింగ్స్లో 280 పరుగులు చేయడంతో పాటు.. ఈ సీజన్లో జట్టును ప్లే ఆఫ్స్ చేరిన మొదటి జట్టుగా నిలిపే పనిలో ఉన్నాడు. చదవండి: ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్ -
స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2024లో కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. హార్డ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ తప్ప మిగిలిన వాళ్లలో ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.ముఖ్యంగా టాపార్డర్ దారుణంగా విఫలమైంది. ఓపెనర్లు ఇషాన్ కిషన్(13)- రోహిత్ శర్మ(11) పూర్తిగా నిరాశపరచగా.. వన్డౌన్ బ్యాటర్ నమన్ ధిర్(11) కూడా చేతులెత్తేశాడు.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాలుగో నంబర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 56) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన బ్యాటర్లు తిలక్ వర్మ(4), నేహాల్ వధేరా(6), హార్దిక్ పాండ్యా(1) పెవిలియన్కు క్యూ కట్టారు.సూర్య ఒంటరి పోరాటం వృథాసూర్య ఈ క్రమంలో ఒంటరి పోరాటం చేస్తున్న సూర్యకు తోడైన టిమ్ డేవిడ్(20 బంతుల్లో 24) నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇక టెయిలెండర్లు గెరాల్డ్ కోయెట్జీ(8), పీయూశ్ చావ్లా(0), జస్ప్రీత్ బుమ్రా(1 నాటౌట్) కూడా చేతులెత్తేయడంతో 145 పరుగులకే ముంబై కథ ముగిసిపోయింది.ఫలితంగా కేకేఆర్ విధించిన 170 పరుగుల లక్ష్య ఛేదనలో విఫలమైన ముంబై వాంఖడేలో పన్నెండేళ్ల తర్వాత తొలిసారి కోల్కతా చేతిలో 24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.ఈ పరాజయం ముంబై ఫ్యాన్స్ హృదయాలను ముక్కలు చేస్తే.. పందొమ్మిదో ఓవర్లో మూడు వికెట్లు తీసి పాండ్యా సేన పతనాన్ని శాసించిన మిచెల్ స్టార్క్ను చూసి కేకేఆర్ అభిమానులు మురిసిపోయారు.అద్భుత రీతిలో బౌల్డ్ చేసిముంబైతో మ్యాచ్లో 3.5 ఓవర్లు బౌల్ చేసిన స్టార్క్ 33 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్ను అద్భుత రీతిలో బౌల్డ్ చేయడం హైలైట్గా నిలిచింది. గంటకు 142.3 కిలో మీటర్ల వేగంతో స్టార్క్ విసిరిన బంతి లెగ్ స్టంప్ను ఎగురగొట్టింది.అయినప్పటికీ స్టార్క్ పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు. అయితే.. ఇషాన్ అవుట్ కాగానే ముంబై ఇండియన్స్ కోచ్ మార్క్ బౌచర్తో పాటు చీర్ గర్ల్స్.. ముఖ్యంగా రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ వైరల్గా మారాయి. ఇక ఇషాన్తో పాటు టిమ్ డేవిడ్, కోయెట్జీ, పీయూశ్ చావ్లా వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు స్టార్క్. చదవండి: అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యాStumps dismantled, in vintage Starc style 🔥🫡 #TATAIPL #MIvKKR #IPLonJioCinema #IPLinBhojpuri pic.twitter.com/RcERxhgJps— JioCinema (@JioCinema) May 3, 2024 -
T20 WC: సంజూ బాగా ఆడుతున్నాడు.. అయినా పంత్కే చోటివ్వాలి!
టీ20 ప్రపంచకప్-2024 భారత జట్టులో రిషభ్ పంత్కు చోటు ఇవ్వాలని ఆస్ట్రేలియా దిగ్గజం, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ అన్నాడు. మెగా టోర్నీ ఆడే అర్హత పంత్కు ఉందని.. తన దృష్టిలో అతడే టీమిండియాకు మొదటి వికెట్ కీపర్ ఆప్షన్ అని పేర్కొన్నాడు. ఐపీఎల్-2024లో సత్తా చాటి కచ్చితంగా వరల్డ్కప్ ఆడే జట్టులో పంత్ చోటు దక్కించుకుంటాడని రిక్కీ పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా 2022, డిసెంబరులో కారు ప్రమాదానికి గురై.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ పంత్ కోలుకోవడానికి దాదాపు ఏడాదిన్నర కాలం పట్టింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో సుదీర్ఘకాలం పాటు పునరావాసం పొందిన పంత్.. క్రమక్రమంగా కోలుకుని మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. ఈ క్రమంలో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా తిరిగి పగ్గాలు చేపట్టిన పంత్.. వికెట్ కీపర్ బ్యాటర్గానూ సేవలు అందిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్ ఆడి 194 పరుగులు చేసిన పంత్ ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే.. కెప్టెన్గా మాత్రం పంత్ విఫలమవుతూనే ఉన్నాడు. అతడి సారథ్యంలో ఢిల్లీ ఇప్పటిదాకా ఆరు మ్యాచ్లు ఆడి కేవలం రెండే గెలిచింది. ఇదిలా ఉంటే.. మే 27న ఐపీఎల్-2024 ముగియనుండగా.. జూన్ 1 నుంచి వెస్టిండీస్- అమెరికా వేదికగా పొట్టి ప్రపంచకప్ సమరం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు వికెట్ కీపర్ ఎంపిక గురించి రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంజూ బాగా ఆడుతున్నాడు.. అయినా పంత్కే చోటివ్వాలి! ‘‘వరల్డ్కప్ జట్టులో రిషభ్ పంత్కు చోటు ఇవ్వాలా? అంటే కచ్చితంగా ఇవ్వాలనే చెబుతా. ఐపీఎల్ ముగిసేలోపు అతడు అందుకు అర్హత సాధిస్తాడు. గత ఆరు సీజన్లలో పంత్ మెరుగ్గా ఆడాడు. టీమిండియా తరఫున కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు. భారత జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదని తెలుసు. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ బాగా ఆడుతున్నారు. చాలా ఆప్షన్లు కనిపిస్తున్నాయి. అయితే.. నేను గనుక జట్టును ఎంపిక చేయాల్సి వస్తే రిషభ్ పంత్కే మొదటి ప్రాధాన్యం ఇస్తాను. నన్నెపుడు ఈ ప్రశ్న అడిగినా ఇదే సమాధానం ఇస్తాను’’ అని రిక్కీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. కాగా వరల్డ్కప్-2024 టీమిండియా వికెట్ కీపర్ల రేసులో ప్రస్తుతం సంజూ శాంసన్ ముందుకు దూసుకుపోతున్నాడు. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న అతడు ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్లో కలిపి 264 పరుగులు సాధించాడు. చదవండి: #Pat Cummins: శెభాష్.. ఇది సరైన నిర్ణయం! కమిన్స్ అన్నతో అట్లుంటది మరి.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024 MI VS RCB: సెంచరీ పూర్తి చేసిన ఇషాన్ కిషన్
ఐపీఎల్ 2024లో భాగంగా ఆర్సీబీతో నిన్న (ఏప్రిల్ 11) జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్లో 5 సిక్సర్లు బాదిన ఇషాన్ ఐపీఎల్లో సిక్సర్ల సెంచరీని పూర్తి చేశాడు. తద్వారా ముంబై ఇండియన్స్ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. ఇషాన్కు ముందు రోహిత్ శర్మ, కీరన్ పోలార్డ్, హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ తరఫున 100 సిక్సర్ల మార్కును తాకారు. ఇషాన్ ఖాతాలో ప్రస్తుతం 102 సిక్సర్లు (80 మ్యాచ్లు) ఉన్నాయి. కాగా, ఆర్సీబీతో మ్యాచ్లో ఇషాన్తో పాటు రోహిత్ శర్మ (24 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడటంతో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. డుప్లెసిస్ (40 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రజత్ పాటిదార్ (26 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (53 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శనతో (4-0-21-5) చెలరేగాడు. అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. 15.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
RCB Vs MI Highlights Photos: ఇషాన్, సూర్యకుమార్ల విధ్వంసం ముంబై ఘనవిజయం (ఫొటోలు)
-
RCB Vs MI: ముంబై ఫటాఫట్...
ముంబై: ముంబై ఇండియన్స్ ముందున్న కొండంత లక్ష్యాన్ని ఇద్దరే ఇద్దరి విధ్వంసం మంచు ముక్కలా కరిగించేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్స్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్స్లు) సిక్సర్ల సునామీతో ముంబై 197 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.3 ఓవర్లలోనే ఛేదించింది. దాంతో హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై ఘనవిజయం సాధించింది. అంతకుముందు తొలుత ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. డుప్లెసిస్ (40 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించగా, రజత్ పటిదార్ (26 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్స్లు), దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్లు) మెరిపించారు. ముంబై బౌలర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బుమ్రా 21 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. కోహ్లి విఫలం సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి (3) విఫలమవగా, విల్ జాక్స్ (8) నిరాశపరిచాడు. ఈ దశలో బెంగళూరును కెప్టెన్ డుప్లెసిస్ అండతో పటిదార్ ధాటిగా నడిపించాడు. 12వ ఓవర్లో కోయెట్జి బౌలింగ్లో రెండు వరుస సిక్స్లు బాదిన పటిదార్ 25 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకొని తర్వాతి బంతికే వెనుదిరిగాడు. మ్యాక్స్వెల్ (0) ఈ సీజన్లో మూడోసారి డకౌటయ్యాడు. అడపాదడపా షాట్లతో డుప్లెసిస్ 33 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అయితే బుమ్రా వరుస ఓవర్లలో రెండేసి వికెట్లను పడగొట్టాడు. డుప్లెసిస్, హిట్టర్ లామ్రోర్ (0)లతో పాటు, సౌరవ్ (9), వైశాక్ (0)లను బుమ్రా అవుట్ చేసినా... దినేశ్ కార్తీక్ ధనాధన్ ఆటతో బెంగళూరు మంచి స్కోరు చేసింది. ఇషాన్, సూర్యల తుఫాన్తో... భారీ లక్ష్య ఛేదనలో ముంబై బ్యాటర్లు మెరుపు షాట్లతో హోరెత్తించారు. ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో ముంబై పవర్ప్లేలోనే 72/0 స్కోరు చేసింది. ఇషాన్ 23 బంతుల్లో అర్ధసెంచరీని సాధించగా, రోహిత్ నింపాదిగా ఆడాడు. కేవలం 8.3 ఓవర్లలోనే జట్టు స్కోరు 100 చేరింది. అదే ఓవర్లో ఇషాన్ దూకుడు ముగిసింది. అనంతరం సూర్యకుమార్ విధ్వంసం సృష్టించి 17 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్, సూర్యలు అవుటయ్యాక హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్స్లు), తిలక్ వర్మ (10 బంతుల్లో 16 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడి ముంబైను విజయతీరాలకు చేర్చారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) ఇషాన్ (బి) బుమ్రా 3; డుప్లెసిస్ (సి) డేవిడ్ (బి) బుమ్రా 61; జాక్స్ (సి) డేవిడ్ (బి) మధ్వాల్ 8; పటిదార్ (సి) ఇషాన్ (బి) కోయెట్జీ 50; మ్యాక్స్వెల్ (ఎల్బీడబ్ల్యూ) గోపాల్ 0; దినేశ్ కార్తీక్ (నాటౌట్) 53; లామ్రోర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 0; సౌరవ్ (సి) ఆకాశ్ (బి) బుమ్రా 9; వైశాక్ (సి) నబి (బి) బుమ్రా 0; ఆకాశ్దీప్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–14, 2–23, 3–105, 4–108, 5–153, 6–153, 7–170, 8–170. బౌలింగ్: నబీ 1–0–7–0, కోయెట్జీ 4–0–42–1, బుమ్రా 4–0–21–5, ఆకాశ్ 4–0–57–1, శ్రేయస్ గోపాల్ 4–0–32–1, షెఫర్డ్ 2–0–22–0, హార్దిక్ 1–0–13–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) కోహ్లి (బి) ఆకాశ్దీప్ 69; రోహిత్ (సి) టాప్లీ (బి) జాక్స్ 38; సూర్యకుమార్ (సి) మహిపాల్ (బి) వైశాక్ 52; హార్దిక్ (నాటౌట్) 21; తిలక్ వర్మ (నాటౌట్) 16; ఎక్స్ట్రాలు 3; మొత్తం (15.3 ఓవర్లలో 3 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–101, 2–139, 3–176. బౌలింగ్: టాప్లీ 3–0–34–0, సిరాజ్ 3–0–37–0, ఆకాశ్దీప్ 3.3–0–55–1, మ్యాక్స్వెల్ 1–0–17–0, వైశాక్ 3–0–32–1, 2–0–24–1. ఐపీఎల్లో నేడు లక్నో X ఢిల్లీ వేదిక: లక్నో రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
Viral Video: అభిమాని దెబ్బకు ఉలిక్కిపడిన రోహిత్ శర్మ
ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో నిన్న జరిగిన మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని రాజస్థాన్ ఛేజ్ చేస్తుండగా.. ఓ వ్యక్తి సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలో చొరబడి స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మవైపు దూసుకొచ్చాడు. ఊహించని ఈ పరిణామంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ రోహిత్.. ఆతర్వాత ఆ వ్యక్తిని కౌగిలించుకుని గ్రౌండ్లో నుంచి బయటికి వెళ్లాలని సూచించాడు. రోహిత్ను కౌగించుకున్న అనంతరం ఆ వ్యక్తి పక్కనే ఉన్న ఇషాన్ కిషన్తో సైతం కరచాలనం చేసి కౌగిలించుకున్నాడు. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తికి పట్టుకుని బయటకు లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. A fan invaded the pitch and met Rohit Sharma and Ishan Kishan.pic.twitter.com/NusKCxHVJP — CricTracker (@Cricketracker) April 1, 2024 ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్లో ముంబై రాజస్థాన్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ప్రస్తుత సీజన్లో ముంబైకు ఇది వరుసగా మూడో ఓటమి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై చెత్త ప్రదర్శన చేసి నిర్ణీత ఓవర్లలో కేవలం 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై ఇన్నింగ్స్లో రోహిత్ సహా ముగ్గురు (నమన్ ధీర్, డెవాల్డ్ బ్రెవిస్) గోల్డెన్ డకౌట్లయ్యారు. తిలక్ వర్మ (32), హార్దిక్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ముంబై ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. బౌల్ట్ (4-0-22-3), చహల్ (4-0-11-3), బర్గర్ (4-0-32-2), ఆవేశ్ ఖాన్ (4-0-30-1) అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబైని వణికించారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్.. 15.3 ఓవర్లలో ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. రియాన్ పరాగ్ (54 నాటౌట్) మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడి రాజస్థాన్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. యశస్వి (10), బట్లర్ (13) మరోసారి నిరాశపరిచారు. సంజూ శాంసన్ 12, అశ్విన్ 16 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ 3 వికెట్లు పడగొట్టగా.. మఫాక తన మొట్టమొదటి ఐపీఎల్ వికెట్ దక్కించుకున్నాడు. -
ఇషాన్, శ్రేయస్ల కాంట్రాక్ట్ రద్దు: సచిన్ రియాక్షన్ వైరల్
దేశవాళీ క్రికెట్ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి తీసుకున్న నిర్ణయంపై దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ హర్షం వ్యక్తం చేశాడు. అగ్రశ్రేణి ఆటగాళ్లు ఫస్ల్క్లాస్ క్రికెట్ బరిలో దిగడం ద్వారా డొమెస్టిక్ టోర్నీలకు మరింత ఆదరణ పెరుగుతుందన్నాడు. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా ముంబై తరఫున ఆడేందుకు ఎంతో ఆతురతగా ఎదురుచూసే వాడినని సచిన్ టెండుల్కర్ గుర్తు చేసుకున్నాడు. కాగా జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు సెంట్రల్ కాంట్రాక్ట్ క్రికెటర్లు కచ్చితంగా రెడ్ బాల్ క్రికెట్(ఫస్ట్క్లాస్) ఆడాల్సిందేనని బీసీసీఐ ఇటీవల నిబంధన విధించిన విషయం తెలిసిందే. ఫిట్నెస్ కారణాల దృష్ట్యా ఇబ్బందిపడే వారు మినహా ప్రతి ఒక్కరు.. ముఖ్యంగా యువ ఆటగాళ్లు రంజీ బరిలో దిగాల్సిందేనని బోర్డు ఆటగాళ్లకు ఆదేశాలిచ్చింది. హెడ్కోచ్, కెప్టెన్, సెలక్టర్లు చెప్పినపుడు ఏ ఆటగాడైనా సరే దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో 2023-24 ఏడాదికిగానూ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టులలో ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, జార్ఖండ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్లకు మొండిచేయి చూపింది. రంజీ బరిలో దిగాలన్న కోచ్ ఆదేశాలను పెడచెవిన పెట్టారనే కారణంతో వారిద్దరిపై వేటు పడినట్లు తెలిసింది. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్ ఎక్స్ వేదికగా రంజీ ట్రోఫీ ప్రాధాన్యం గురించి వివరిస్తూ.. ‘‘తాజా రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముంబై జట్టు పడిలేచిన కెరటంలా ఫైనల్కు దూసుకువచ్చింది. మరో సెమీస్ మ్యాచ్లో చివరి రోజు వరకు ఆట కొనసాగుతున్న వైనం ముచ్చటగా ఉంది. ఈ మ్యాచ్లో మధ్యప్రదేశ్ విజయానికి 90కి పైగా పరుగులు, విదర్భకు నాలుగు వికెట్లు కావాలి. నిజానికి నా కెరీర్ ఆసాంతం ఎప్పుడు ముంబైకి ఆడే అవకాశం వచ్చినా కచ్చితంగా బరిలో దిగే వాడిని. అక్కడి డ్రెస్సింగ్ రూంలో దాదాపు 7-8 మంది టీమిండియా ఆటగాళ్లు ఉండేవారు. వారితో కలిసి అక్కడ రూం షేర్ చేసుకోవడం మరింత సరదాగా ఉండేది. టీమిండియా తరఫున టాప్ ప్లేయర్లుగా ఉన్నవాళ్లు దేశవాళీ క్రికెట్లో వారి వారి జట్లకు ఆడితే ఆదరణ పెరుగుతుంది. యువ ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కొత్త ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అంతేకాదు ఫామ్లేమితో ఇబ్బంది పడేవాళ్లు తిరిగి బేసిక్స్ నుంచి మొదలుపెట్టి పొరపాట్లను సరిచేసుకునే అవకాశం దొరుకుతుంది. స్టార్ క్రికెటర్లు డొమెస్టిక్ టోర్నీల్లో ఆడితే క్రమక్రమంగా అభిమానులు కూడా దేశవాళీ జట్లకు మద్దతుగా నిలుస్తారు. నిజంగా దేశవాళీ క్రికెట్కు కూడా బీసీసీఐ సమాన ప్రాధాన్యం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది’’ అని సుదీర్ఘ నోట్ షేర్ చేశాడు. కాగా సచిన్ టెండుల్కర్ మంగళవారం ఈ మేరకు పోస్ట్ చేయగా.. బుధవారం నాటి ఆటలో భాగంగా రంజీ సెమీస్లో మధ్యప్రదేశ్పై విదర్భ 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. The Ranji Trophy semi-finals have been riveting! @MumbaiCricAssoc’s march into the finals was aided by a brilliant batting recovery, while the other semi-final hangs in the balance going into the last day - Madhya Pradesh need 90+ runs to win, Vidarbha need 4 wickets.… — Sachin Tendulkar (@sachin_rt) March 5, 2024 -
ఇషాన్ కిషన్కు బీసీసీఐ బంపరాఫర్.. కానీ 'నో' చెప్పేశాడుగా!?
భారత ఆటగాళ్లకు సంబంధించిన 2023-24 సెంట్రల్ కాంట్రాక్ట్లను బీసీసీఐ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కకపోవడం అందరని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఇదే విషయం భారత క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. రంజీల్లో ఆడేందుకు విముఖత చూపడంతో వీరిద్దరిపై బీసీసీఐ వేటు వేసింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్ట్ నుంచి తప్పించేముందు బీసీసీఐ పెద్దలు వారిద్దరితో మాట్లాడి వుంటే బాగుండేదని పలువరు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇంగ్లండ్తో ఆఖరి మూడు టెస్టులకు జట్టును ప్రకటించేముందు ఇషాన్ కిషన్ను బీసీసీఐ సెలక్టర్లు సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైజాగ్ టెస్టు తర్వాత జట్టుతో కలవాలని సెలక్టర్లు ఇషాన్ను ఆదేశించినట్లు సమాచారం. కానీ కిషన్ మాత్రం తన ఇంకా సిద్దంగా లేనని, మరి కొంత సమయం తనకు కావాలని సెలక్టర్లకు చెప్పినట్లు ప్రముఖ క్రీడా వెబ్సైట్ పేర్కొంది. అతడు నో చెప్పడంతోనే ధ్రువ్ జురెల్ను మిగిలిన మూడు టెస్టులకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కొనసాగించినట్లు వినికిడి. అయితే బీసీసీఐ నో చెప్పిన కిషన్.. ఐపీఎల్ ప్రాక్టీస్ కోసం మాత్రం బరోడాకు వెళ్లినట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ అతడిపై వేటు వేసినట్లు తెలుస్తోంది. కాగా వన్డే వరల్డ్ కప్ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన కిషన్.. మానసికంగా అలిసిపోయానని సిరీస్ మధ్యలోనే స్వదేశానికి వచ్చేసిన విషయం విధితమే, చదవండి: IPL 2024: సన్ రైజర్స్ సంచలన నిర్ణయం.. మార్క్రమ్కు బిగ్ షాక్! కొత్త కెప్టెన్ అతడే? -
అతడు తప్పు చేయలేదు.. అలాంటపుడు శిక్ష ఎందుకు?
స్టార్ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లను వార్షిక కాంట్రాక్టు జాబితా నుంచి తొలగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో బీసీసీఐని కొంతమంది సమర్థిస్తుంటే.. మరికొంత మంది మాజీ క్రికెటర్లు మాత్రం తప్పుబడుతున్నారు. కాగా సెంట్రల్ కాంట్రాక్టు కలిగి ఉన్న క్రికెటర్లందరూ బోర్డు ఆదేశాలకు అనుగుణంగా తప్పక దేశవాళీ క్రికెట్లో ఆడాలని బీసీసీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే. కోచ్, కెప్టెన్, సెలక్టర్ల సూచనల మేరకు ఎవరైతే దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందో నిర్ణయిస్తామని తెలిపింది. ముఖ్యంగా ఫిట్గా ఉన్న యువ ఆటగాళ్లు బోర్డు సూచించినపుడు తప్పక డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని ఆటగాళ్లను ఆదేశించింది. అయితే, అయ్యర్, ఇషాన్ ఈ నిబంధనలు ఉల్లంఘించారనే వార్తల నడుమ.. వారిద్దరి సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేయడం ఇందుకు బలాన్నిచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లకు అండగా నిలబడ్డాడు. వారికి మద్దతుగా నిలుస్తూ.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వంటి వాళ్లకు మాత్రం ఈ నిబంధనల నుంచి ఎలా మినహాయింపు ఇస్తారని ప్రశ్నించాడు. ఈ క్రమంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘హార్దిక్ పాండ్యా విషయాన్ని సంక్లిష్టం చేయాల్సిన అవసరం లేదు. అతడు ఎన్నో ఏళ్లుగా రెడ్ బాల్ క్రికెట్కు దూరంగా ఉన్నాడు. కాబట్టి ఈ నిబంధన విషయంలో అతడి గురించిన ప్రస్తావనే అనవసరం. అతడు టెస్టు సిరీస్లకు అందుబాటులోనే ఉండటం లేదు. అలాంటపుడు అతడిని ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడమని చెప్పడంలో అర్థమే లేదు. నాలుగు రోజుల మ్యాచ్కు ఓ ఆటగాడి శరీరం సహకరించనపుడు. గాయాల బారిన పడే ప్రమాదం ఉందనీ తెలిసినపుడు అలాంటి వ్యక్తిని ఎవరూ కూడా ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడమని ఆదేశించరు. ఒకవేళ తను టెస్టు ఆడేందుకు పూర్తి ఫిట్గా ఉంటే.. తను టీమిండియాకు ఆడటం మానేసి.. ప్రమోషన్ షూట్లలో పాల్గొంటే అప్పుడు తనది తప్పని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం అతడు ఇలాంటి తప్పులేమీ చేయలేదు. కాబట్టి బీసీసీఐకి అతడిని శిక్షించాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నాడు. చదవండి: Shreyas Iyer: సెమీస్ తుదిజట్టులో అయ్యర్.. రహానే కీలక వ్యాఖ్యలు -
హార్దిక్కు రూల్స్ వర్తించవా.. పాపం ఇషాన్, శ్రేయస్: మండిపడ్డ ఇర్ఫాన్
వార్షిక క్రాంటాక్టుల విషయంలో భారత క్రికెట్ నియంత్రణ అనుసరించిన తీరుపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విస్మయం వ్యక్తం చేశాడు. ఏ నిబంధనైనా టీమిండియా ఆటగాళ్లందరికీ ఒకేలా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. భారత జట్టు అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు ఇలాంటి పోకడలు నష్టం చేకూరుస్తాయని పఠాన్ ఘాటు విమర్శలు చేశాడు. కాగా 2023-24 ఏడాదికి గానూ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల విషయంలో టీమిండియా మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ పేర్లు గల్లంతైన విషయం తెలిసిందే. రంజీ టోర్నీలో ఆడాలన్న బోర్డు ఆదేశాలు బేఖాతరు చేశారన్న కారణంగానే వీళ్లిద్దరికి మొండిచేయి చూపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ బీసీసీఐ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ‘‘శ్రేయస్, ఇషాన్ ఇద్దరూ ప్రతిభావంతులైన క్రికెటర్లే. తిరిగి పుంజుకుని రెట్టించిన ఉత్సాహంతో వాళ్లిద్దరు కమ్బ్యాక్ ఇస్తారనే అనుకుంటున్నా. హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాళ్లు టెస్టు క్రికెట్ ఆడకూడదు అనుకున్నపుడు.. కనీసం దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్లోనైనా వాళ్లను ఆడించాలి కదా? జాతీయ జట్టుకు దూరమైనపుడు వాళ్లు కూడా దేశవాళీ బరిలో దిగాలి కదా? ఒకవేళ ఈ నిబంధన అందరికీ వర్తింపజేయకుంటే.. భారత క్రికెట్ అనుకున్న లక్ష్యాలను ఎన్నటికీ సాధించలేదు’’ అని ఎక్స్ వేదికగా ఇర్ఫాన్ పఠాన్ మండిపడ్డాడు. కాగా గతేడాది వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా గాయపడ్డ పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. మళ్లీ టీమిండియా తరఫున ఇంతవరకు రీఎంట్రీ ఇవ్వలేదు. అయితే, ఐపీఎల్-2024 బరిలో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బరిలోకి దిగేందుకు జిమ్లో చెమటోడుస్తున్నాడు. మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ రంజీ సెమీస్లో ముంబై తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడుతో ముంబై ఆడబోయే ఈ మ్యాచ్కు ఎంపిక చేసిన జట్టులో అతడికి చోటు దక్కింది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: BCCI Annual Players Contract List: పూర్తి వివరాలు.. విశేషాలు They are talented cricketers, both Shreyas and Ishan. Hoping they bounce back and come back stronger. If players like Hardik don’t want to play red ball cricket, should he and others like him participate in white-ball domestic cricket when they aren’t on national duty? If this… — Irfan Pathan (@IrfanPathan) February 29, 2024 -
అదేనా అయ్యర్ చేసిన తప్పు? శ్రేయస్ మళ్లీ ఎంట్రీ ఇస్తాడా?
శ్రేయస్ అయ్యర్.. గత కొంత కాలంగా టీమిండియా మిడిలార్డర్లో నిలకడకు పెట్టింది పేరు. మూడు ఫార్మాట్లలో మిడిలార్డర్లో విరాట్ కోహ్లి తర్వాత అంతటి సత్తా ఉన్న ఆటగాడిగా అయ్యర్ పేరొందాడు. వన్డే ప్రపంచకప్లో ఫైనల్కు చేరడంలో అయ్యర్ ది కీలక పాత్ర. వరల్డ్కప్ హిస్టరీలోనే సింగిల్ ఎడిషన్లో 500పైగా పరుగులు చేసిన ఏకైక భారత ఆటగాడు అయ్యరే. 2022 నుంచి మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా ఈ ముంబైకర్ కొనసాగుతున్నాడు. అటువంటి అయ్యర్ ఇప్పుడు ఏకంగా ఎందుకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోవాల్సి వచ్చింది? భారత క్రికెట్ బోర్డు సరైన నిర్ణయం తీసుకుందా? అన్న ప్రశ్నలు సగటు అభిమానిలో రేకెత్తుతున్నాయి. అదేనా అయ్యర్ చేసిన తప్పు? స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో శ్రేయస్ అయ్యర్ భాగమయ్యాడు. అయితే తొలి రెండు టెస్టుల్లోనూ ఈ ముంబైకర్ పెద్దగా అకట్టుకోలేకపోయాడు. అనంతరం ఆఖరి మూడు టెస్టులకు ప్రకటించిన భారత జట్టులో అనూహ్యంగా శ్రేయస్కు చోటు దక్కలేదు. అయితే అతడి వెన్ను గాయం తిరగబెట్టిందని అందుకే సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారని తొలుత వార్తలు వినిపించాయి. అయ్యర్ కూడా వైజాగ్ టెస్టు అనంతరం నేరుగా బెంగళూరులోని ఏన్సీఏకు వెళ్లిపోయాడు. కానీ ఫామ్ లేమి కారణంగానే అయ్యర్ను పక్కన పెట్టారని తర్వాత బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే సరిగ్గా ఇదే సమయంలో సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లందరూ టీండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వాలంటే కచ్చితంగా రంజీలు ఆడాల్సిందేనని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రంజీ ట్రోఫీ 2023-24 క్వార్టర్స్లో ఆడాలని ముంబై క్రికెట్ ఆసోషియేషన్ అతడిని కోరింది. కానీ కానీ అయ్యర్ మాత్రం తన వెన్ను నొప్పితో బాధపడుతున్నాని, అందుబాటులో ఉండనని తేల్చిచేప్పేశాడు. అయితే తన ప్రకటనకు ఒక్క రోజే ముందే అయ్యర్ ఫిట్నెస్గా ఉన్నట్లు ఏన్సీఏ సర్టిఫికెట్ ఇవ్వడం గమనార్హం. దీంతో అయ్యర్ కావాలనే రంజీలు ఆడకుండా తప్పించుకున్నాడని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో బీసీసీఐ అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించేందుకు సిద్దమైందని పలు రిపోర్ట్లు వెల్లడించాయి. ఈ వార్తలు ప్రచారంలో ఉన్న సమయంలోనే అయ్యర్పై బీసీసీఐ వేటు వేయడం గమనార్హం. బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుందా? అయితే బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రేడ్-బిలో ఉన్న ఆటగాడిని ఒక్కసారిగా తప్పించాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దేశవాళీ క్రికెట్ ఆడనంత మాత్రానా గతేడాదిగా భారత జట్టుతో ఉంటూ.. ఎన్నో అద్భుత విజయాలు అందించిన ఆటగాడి పట్ల బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అతడికి పన్మిషెంట్ ఇవ్వాలనకుంటే గ్రేడ్-సి డిమోషన్ చేయవలసిందని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. భారత జట్టు తరపున అయ్యర్ ఆడిన ఇన్నింగ్స్ల వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ సపోర్ట్గా నిలుస్తున్నారు. మరి కొంత మంది అయ్యర్ 100 శాతం ఫిట్నెస్గా లేడని అందుకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని పోస్ట్లు చేస్తున్నారు. కాగా అయ్యర్తో పాటు మరో యువ ఆటగాడు ఇషాన్ కిషన్ కూడా బీసీసీఐ కాంట్రాక్ట్ను కోల్పోయాడు. చదవండి: Babar Azam AFG Captain Photo Viral: అఫ్గానిస్తాన్ కెప్టెన్గా బాబర్ ఆజం..!? -
సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జురెల్లకు జాక్పాట్
టీమిండియా బ్యాటింగ్ సంచలనాలు సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జురెల్లకు జాక్పాట్ కొట్టే ఛాన్స్ వచ్చింది. ఇంగ్లండ్తో జరుగబోయే తదుపరి టెస్ట్లో ఈ ఇద్దరు తుది జట్టులో ఉంటే, వీరికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లు దక్కనున్నాయి. బీసీసీఐ కాంట్రాక్ట్ దక్కాలంటే ఆటగాళ్లు టీమిండియా తరఫున కనీసం 3 టెస్టులు లేదా ఎనిమిది వన్డేలు లేదా పది టీ20లు ఆడాల్సి ఉంటుంది. అయితే వీరిద్దరు ఇప్పటివరకు రెండు టెస్ట్ మ్యాచ్లే ఆడారు. ఈ రెండు మ్యాచ్ల్లో వీరిద్దరి ప్రదర్శనను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ.. మూడు మ్యాచ్ల అనంతరం వీరికి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఇద్దరు ఆటగాళ్ల తాజా ఫామ్ను బట్టి చూస్తే వీరు ఐదో టెస్ట్కు తుది జట్టులో ఉండటం దాదాపుగా ఖాయమేనని చెప్పాలి. దీంతో వీరికి గ్రేడ్ సి కింద బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కడం దాదాపుగా ఖరారైందనే చెప్పాలి. కాగా, 2023-24 సంవత్సరానికి గాను సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ఇవాళ (ఫిబ్రవరి 28) ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 30 మంది ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఏ ప్లస్ కేటగిరిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.. ఏ కేటగిరిలో అశ్విన్, షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా.. బి కేటగిరిలో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్.. సి కేటగిరిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ద్ కృష్ణ, అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్ చోటు దక్కించుకున్నారు. రంజీల్లో ఆడాల్సిందేనన్న బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేసిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కాంట్రాక్ట్లను కోల్పోగా.. రింకూ సింగ్ (సి), తిలక్ వర్మ (సి), ప్రసిద్ద్ కృష్ణ (సి), అవేశ్ ఖాన్ (సి), రజత్ పాటిదార్ (సి), జితేశ్ శర్మ (సి), ముకేశ్ కుమార్ (సి), రవి బిష్ణోయ్కు (సి) కొత్తగా కాంట్రాక్ట్ లభించింది. శ్రేయస్ (బి), ఇషాన్లతో (సి) పాటు యుజ్వేంద్ర చహల్ (సి), చతేశ్వర్ పుజారా (బి), దీపక్ హుడా (సి), ఉమేశ్ యాదవ్ (సి), శిఖర్ ధవన్ (సి) బీసీసీఐ కాంట్రాక్ట్లు కోల్పోయారు. కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, సిరాజ్లకు బి నుంచి ఏ కేటగిరికి ప్రమోషన్ లభించగా.. అక్షర్ పటేల్, రిషబ్ పంత్లకు ఏ నుంచి బి కేటగిరికి డిమోషన్ వచ్చింది. గతేడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో లేని యశస్వి జైస్వాల్.. ప్రస్తుత ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్లో అత్యుత్తమంగా (వరుస డబుల్ సెంచరీలు) రాణించడంతో అతనికి నేరుగా బి గ్రేడ్ కాంట్రాక్ట్ దక్కింది. ఏ ప్లస్ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనం కింద యేటా రూ. 7 కోట్లు దక్కనున్నాయి. ‘ఏ’ కేటగిరీలోని క్రికెటర్లకు రూ. 5 కోట్లు..‘బి’ కేటగిరిలో ఉన్న వారికి రూ. 3 కోట్లు.. ‘సి’ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం లభించనుంది. -
అనుకున్నదే అయ్యింది.. బీసీసీఐ కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్, శ్రేయస్
భారత క్రికెట్ అభిమానులు ఊహించిందే నిజమైంది. రంజీల్లో ఆడమని ఎంత చెప్పినా వినకుండా విర్రవీగిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయారు. తాజాగా ప్రకటించిన బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో వీరిద్దరి పేర్లు గల్లంతయ్యాయి. ప్రస్తుతం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లభించిన ఆటగాళ్లలో రోహిత్, కోహ్లి, బుమ్రా, జడేజా ఏ ప్లస్ స్థానాలను నిలుపుకోగా.. బి కేటగిరి నుంచి శ్రేయస్, సి కేటగిరి నుంచి ఇషాన్ తొలగించబడ్డారు. గతకొంతకాలంగా జట్టులో లేనప్పటికీ హార్దిక్ పాండ్యా ఏ గ్రేడ్ కాంట్రాక్ట్ను నిలుపుకోగా.. కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, సిరాజ్లకు ప్రమోషన్ (బి నుంచి ఏ కేటగిరి) దక్కింది. యశస్వికి జాక్పాట్.. గతేడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో లేని యశస్వి జైస్వాల్.. ప్రస్తుత ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్లో అత్యుత్తమంగా (వరుస డబుల్ సెంచరీలు) రాణించడంతో అతనికి నేరుగా బి గ్రేడ్ కాంట్రాక్ట్ దక్కింది. కాంట్రాక్ట్ కోల్పోయిన వారు వీరే.. బీసీసీఐ తాజాగా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో చాలా మంది పేర్లు కనపడలేదు. యుజ్వేంద్ర చహల్ (సి), చతేశ్వర్ పుజారా (బి), దీపక్ హుడా (సి), ఉమేశ్ యాదవ్ (సి), శిఖర్ ధవన్ (సి) బీసీసీఐ కాంట్రాక్ట్లు కోల్పోయారు. అక్షర్, పంత్లకు డిమోషన్ (ఏ నుంచి బి) కొత్తగా కాంట్రాక్ట్ దక్కించుకున్న తిలక్ వర్మ, రింకూ సింగ్ కేటగిరి వారీగా ఆటగాళ్లకు దక్కనున్న మొత్తం.. ఏ ప్లస్ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనం కింద యేటా రూ. 7 కోట్లు దక్కనున్నాయి. ‘ఏ’ కేటగిరీలోని క్రికెటర్లకు రూ. 5 కోట్లు..‘బి’ కేటగిరిలో ఉన్న వారికి రూ. 3 కోట్లు.. ‘సి’ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం లభించనుంది. 2023-24 బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న ఆటగాళ్ల వివరాలు.. ఏ ప్లస్ కేటగిరి: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఏ కేటగిరి: అశ్విన్, షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా బి కేటగిరి: సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్ సి కేటగిరి: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ద్ కృష్ణ, అవేష్ ఖాన్, రజత్ పాటిదార్ చదవండి: రంజీల్లో ఆడాల్సిందే.... ఆటగాళ్లకు బీసీసీఐ స్ట్రిక్ట్ వార్నింగ్ -
వారికి జట్టులో చోటు లేదు.. ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎట్లా?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నానని భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అన్నాడు. రోహిత్ చెప్పినట్టు సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లు భారత క్రికెట్ పట్ల కాస్తైనా విశ్వసనీయత ప్రదర్శించాలన్నాడు. కాగా టెస్టు జట్టులోకి తిరిగి రావాలంటే భారత ఆటగాళ్లు కచ్చితంగా రంజీల్లో ఆడాలని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు రంజీ క్రికెట్ ఆడటం పట్ల విముఖంగా ఉన్నారన్న వార్తల నేపథ్యంలో ఈ మేరకు బోర్డు ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో నాలుగో టెస్టు విజయానంతరం కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రశ్న ఎదురైంది. బదలుగా.. ‘‘టెస్టు క్రికెట్ ఆడాలన్న తపన, కసి ఉన్నవారికి మాత్రమే జట్టులో చోటు ఇస్తాం’’ అని రోహిత్ శర్మ ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడాల్సిన ఆవశ్యకతను నొక్కి వక్కాణించాడు. ఈ విషయంపై స్పందించిన సునిల్ గావస్కర్.. ‘‘రోహిత్ చెప్పిన మాటలు సరైనవే. టెస్టు క్రికెట్పై ఇష్టం ఉన్న వాళ్లకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలి. ఎన్నో ఏళ్లుగా నేను ఇదే విషయం చెబుతున్నా. దేశవాళీ క్రికెట్లో రాణించడం వల్లే చాలా మంది ఉన్నత స్థాయికి చేరుకున్నారు. కనీసం వాళ్లైనా డొమెస్టిక్ క్రికెట్ పట్ల విశ్వాసం ప్రదర్శించాలి కదా’’ అంటూ రంజీల్లో ఆడేందుకు ఇష్టపడని టీమిండియా క్రికెటర్లకు చురకలు అంటించాడు. ఒకవేళ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లు ఎవరైనా టెస్టులు ఆడొద్దని నిర్ణయించుకుంటే.. వారిని నిర్మొహమాటంగా పక్కనపెట్టేయాలంటూ పరక్షంగా బోర్డుకు విజ్ఞప్తి చేశాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్ను ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా కైవసం చేసుకుంది. సీనియర్ల గైర్హాజరీలో దేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్ ఈ సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. రజత్ మినహా మిగతా ముగ్గురు సత్తా చాటి తమ ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నారు. చదవండి: #Dhruv Jurel: ఈ కుర్రాడిని నమ్మినందుకు ధన్యవాదాలు.. -
రీఎంట్రీలో పేలని పాకెట్ డైనమైట్
దాదాపు మూడు నెలల విరామానంతరం కాంపిటేటివ్ క్రికెట్లోకి అడుగుపెట్టిన టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్.. రీఎంట్రీలో తుస్సుమనిపించాడు. ముంబై వేదికగా జరుగుతున్న డీవై పాటిల్ టీ20 టోర్నీలో ఊహించినంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ టోర్నీలో ఆర్బీఐ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇషాన్.. రూట్ మొబైల్ లిమిటెడ్ జట్టుతో ఇవాళ (ఫిబ్రవరి 27) జరిగిన మ్యాచ్లో తేలిపోయాడు. ఈ మ్యాచ్లో ఇషాన్కు మెరుపు అరంభమే లభించినప్పటికీ.. ఆతర్వాత నిలదొక్కుకోలేకపోయాడు. 12 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 19 పరుగులు చేసిన అతను.. మ్యాక్స్వెల్ స్వామినాథన్ బౌలింగ్లో ఔటయ్యాడు. బ్యాటింగ్లో ఆశించిన స్థాయి ప్రదర్శన చేయలేకపోయిన ఇషాన్.. వికెట్కీపింగ్లో పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్లో అతను ఇద్దరిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు. సుమిత్ క్యాచ్ పట్టిన ఇషాన్.. సయన్ మొండల్ను స్టంపౌట్ చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రూట్ మొబైల్ లిమిటెడ్.. నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 193 పరుగల లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఇషాన్ జట్టు ఆర్బీఐ 16.3 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే, ఇషాన్... టీమిండియా తరఫున తన చివరి టీ20ని 2023 నవంబర్లో ఆస్ట్రేలియాపై ఆడాడు. అనంతరం సౌతాఫ్రికా పర్యటనకు ఎంపికైనప్పటికీ వ్యక్తిగత కారణాలను సాకుగా చూపి సిరీస్ మధ్యలోనే ఇంటికి తిరిగొచ్చేశాడు. ఆతర్వాత రంజీల్లో ఆడి ఫామ్ను నిరూపించుకోవాలని బీసీసీఐతో పాటు చాలా మంది మాజీలు సూచించినా పెడచెవిన పెట్టిన ఇషాన్.. తాజాగా బీసీసీఐ కన్నెర్ర చేయడంతో దిగొచ్చి స్థానిక డీవై పాటిల్ టీ20 టోర్నీలో ఆడుతున్నాడు. ఇషాన్ తీరుతో గుర్రుగా ఉన్న బీసీసీఐ అతని కాంట్రాక్ట్ రద్దు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. -
దిగొచ్చిన శ్రేయస్ అయ్యర్..!
వెన్ను నొప్పిని సాకుగా చూపుతూ రంజీల్లో ఆడకుండా (ఐపీఎల్ కోసం) తప్పించుకు తిరుగుతున్న టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ కాంట్రాక్ట్ రద్దు ప్రచారం నేపథ్యంలో అలర్ట్ అయ్యాడు. బీసీసీఐ అల్టిమేటం జారీ చేసిన విధంగా రంజీల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. మార్చి 2 నుంచి ప్రారంభమయ్యే సెమీఫైనల్లో ముంబై తరఫున బరిలోకి దిగేందుకు సంసిద్దత వ్యక్తం చేశాడు. తన విషయంలో బీసీసీఐ పెద్దలు సీరియస్గా ఉన్నారని గ్రహించిన అయ్యర్ ఈ మేరకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా, రంజీల్లో ఆడకుండా తప్పించుకునేందుకు అయ్యర్.. ముంబై క్రికెట్ ఆసోసియేషన్కు తప్పుడు సమాచారం అందించిన విషయం తెలిసిందే. బరోడాతో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్కు ముందు అయ్యర్ వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు ఎంసీఏకి నివేదించాడు. అయితే ఇదంతా వట్టిదేనని ఎన్సీఏ (జాతీయ క్రికెట్ అకాడమీ) కొట్టిపారేయడంతో అయ్యర్ డ్రామా బయటపడింది. తప్పుడు నివేదిక నేపథ్యంలో బీసీసీఐ సీరియస్ కావడంతో అయ్యర్ దిగొచ్చినట్లు తెలుస్తుంది. రంజీ సెమీఫైనల్లో ఆడేందుకు అంగీకరించాడని సమాచారం. ఇదిలా ఉంటే, రంజీల్లో ఆడే విషయంలో శ్రేయస్ అయ్యర్తో పాటు ఇషాన్ కిషన్ కూడా బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేశాడు. అయ్యర్ విషయంలో ఆచితూచి వ్యవహరించిన బీసీసీఐ.. ఇషాన్పై చర్యలు తీసుకునేందుకు సిద్దమైందని సమాచారం. బీసీసీఐ పెద్దలు సహా టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఇషాన్పై గుర్రుగా ఉన్నాడని తెలుస్తుంది. జాతీయ జట్టుకు దూరమైన ఆటగాళ్లు తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాలంటే కచ్చితంగా రంజీల్లో ఆడాల్సిందేనని బీసీసీఐ గత కొద్ది రోజులుగా ఆటగాళ్లను హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. -
శ్రేయస్ అయ్యర్పై బీసీసీఐ సీరియస్.. కాంట్రాక్ట్ రద్దు!?
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ చిక్కుల్లో పడ్డాడు. ఇంగ్లండ్తో ఆఖరి మూడు టెస్టులకు అయ్యర్ దూరమైన సంగతి తెలిసిందే. వెన్నునొప్పి కారణంగా అతడికి విశ్రాంతి ఇచ్చారని తొలుత వార్తలు వినిపించాయి. కానీ ఆ తర్వాత అతడి ఫామ్ లేమి కారణంగానే జట్టు నుంచి తప్పించారని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే వైజాగ్ టెస్టు అనంతరం తన గాయం తిరగబెట్టిందని, వెన్నునొప్పి సాకుతో అయ్యర్ ఏన్సీఏలో చేరాడు. కాగా ఇటీవలే బీసీసీఐ కాంట్రాక్ట్ పొందిన క్రికెటర్లు అందరూ దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని బీసీసీఐ సెక్రటరీ జై షా ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో రంజీ ట్రోఫీ క్వార్టర్స్లో ఆడాలని ముంబై క్రికెట్ ఆసోషియేషన్ అతడిని కోరింది. కానీ కానీ అయ్యర్ మాత్రం తన వెన్ను నొప్పితో బాధపడుతున్నాని, అందుబాటులో ఉండనని తేల్చిచేప్పేశాడు. అయితే తన ప్రకటనకు ఒక్క రోజే ముందే అయ్యర్ ఫిట్నెస్గా ఉన్నట్లు ఏన్సీఏ సర్టిఫికెట్ ఇవ్వడం గమనార్హం. దీంతో అయ్యర్ కావాలనే రంజీలు ఆడకుండా తప్పించుకున్నాడని ప్రచారం జరుగుతోంది. బీసీసీఐ సీరియస్.. ఈ క్రమంలో బోర్డు అదేశాలను బేఖాతరు చేసిన ఆటగాళ్లపై బీసీసీఐ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. మరో యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ సైతం దేశీవాళీ క్రికెట్ ఆడకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. రంజీలు ఆడితానే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఉంటుందని భారత హెడ్కోచ్ హెచ్చిరించినా కిషన్ మాత్రం పెడచెవిన పెట్టాడు. ఈ క్రమంలో అయ్యర్, కిషన్పై చర్యలకు బోర్డు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2024-25 ఏడాదిగాను బీసీసీఐ ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను త్వరలోనే ప్రకటించనుంది. ఈ క్రమంలో వీరిద్దరూ కాంట్రాక్ట్ను రద్దు చేయాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు సమచారం. ప్రస్తుతం గ్రేడ్ 'బి'లో ఉన్న అయ్యర్, గ్రేడ్ 'సి' లో ఉన్న కిషన్ కాంట్రాక్ట్లను పునరుద్దరించే ఆలోచనలో బీసీసీఐ లేనట్లు వినికిడి. "అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ 2023-24 సీజన్కు కూడా సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను దాదాపు ఖరారు చేసింది. ఈ జాబితాను బీసీసీఐ త్వరలోనే ప్రకటించనుంది. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను కాంట్రాక్ట్ను తప్పించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించి దేశవాళీ క్రికెట్ ఆడడం లేదని" బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా 2022-23లో బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో తొలిసారి కిషన్ దక్కించుకోగా.. అయ్యర్ బి గ్రేడ్కు ప్రమోషన్ పొందాడు. -
Virat Kohli: కోహ్లి సెలవులు.. స్పందించిన జై షా! కీలక వ్యాఖ్యలు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా అండగా నిలిచాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా సెలవు తీసుకోవడం అతడి హక్కు అంటూ కోహ్లి నిర్ణయాన్ని సమర్థించాడు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు కోహ్లి దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన బ్యాటర్ లేకుండానే బరిలోకి దిగిన టీమిండియా తొలి మ్యాచ్లో ఓడినా.. రెండో టెస్టులో గెలిచింది. తిరిగి పుంజుకుని సిరీస్ను ప్రస్తుతం 1-1తో సమం చేసి.. రాజ్కోట్లో మూడో టెస్టులో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లి ఈ కీలక సిరీస్కు దూరం కావడానికి గల కారణం ఇంత వరకు వెల్లడి కాలేదు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. కోహ్లి భార్య అనుష్క శర్మ గర్భవతి అని, ప్రెగ్నెన్సీ సమయంలో తలెత్తిన ఇబ్బందుల కారణంగానే విదేశాల్లో చికిత్స తీసుకునేందుకు వెళ్లారని ప్రచారం జరుగుతోంది. అయితే, బీసీసీఐ మాత్రం ఇంగ్లండ్తో ఆఖరి మూడు టెస్టులకు కోహ్లి అందుబాటులో లేడని ప్రకటించిన సమయంలో.. అతడి నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని పేర్కొంది. తాజాగా ఈ విషయం గురించి బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందించాడు. రాజ్కోట్ టెస్టు ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన క్రమంలో ఎదురైన ప్రశ్నలకు బదులిస్తూ.. ‘‘ఒక వ్యక్తి.. తన పదిహేనేళ్ల కెరీర్లో వ్యక్తిగత కారణాలు చూపి సెలవు అడగటం అతడి హక్కు. విరాట్ కారణం లేకుండా సెలవు అడిగే వ్యక్తి కాదు. మా ఆటగాడిపై మాకు నమ్మకం ఉంది. మేము కచ్చితంగా అతడికి అండగా ఉంటాం’’ అని జై షా స్పష్టం చేశాడు. అదే విధంగా.. టీ20 ప్రపంచకప్-2024లో విరాట్ కోహ్లి ఆడతాడా లేదా అన్న అంశం గురించి ప్రస్తావన రాగా.. ఈ విషయం గురించి తర్వాత మాట్లాడదాం అంటూ సమాధానం దాటవేశాడు. అయితే, ఈ ప్రపంచకప్ టోర్నీలో రోహిత్ శర్మనే కెప్టెన్గా వ్యవహరిస్తాడని జై షా స్పష్టం చేశాడు. కాగా ఇషాన్ కిషన్ మానసికంగా అలసిపోయానంటూ సెలవు తీసుకుని.. విదేశాల్లో పర్యటించడం.. కోచ్ రంజీల్లో ఆడమని చెప్పినా ఆడకపోవడం వంటి అంశాలపై బీసీసీఐ పెద్దలు గుర్రుగా ఉన్నారన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. జై షా.. కోహ్లి సెలవుల గురించి ఇలా కామెంట్ చేయడం గమనార్హం. అంతేకాదు.. ఇషాన్ పేరెత్తకుండానే చీఫ్ సెలక్టర్, కోచ్, కెప్టెన్ చెప్పిన మాట వినకపోతే వేటు తప్పదని హెచ్చరికలు జారీ చేశాడు జై షా! చదవండి: BCCI: సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లకు జై షా వార్నింగ్.. ఇకపై -
BCCI: టీమిండియా క్రికెటర్లకు జై షా వార్నింగ్.. ఇకపై
Jay Shah’s Stern Message to Central Contract Players: టీమిండియా సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగి ఉన్న క్రికెటర్లను ఉద్దేశించి బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రధాన ఆటగాళ్లు కచ్చితంగా రంజీల్లో ఆడాల్సిందేనని స్పష్టం చేశాడు. లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. కాగా భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్- బీసీసీఐకి మధ్య విభేదాలంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తనకు విశ్రాంతి కావాలంటూ సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన ఈ జార్ఖండ్ బ్యాటర్ను దేశవాళీ క్రికెట్లో ఆడాల్సిందిగా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆదేశించాడు. అయితే, మేనేజ్మెంట్ ఆదేశాలను బేఖాతరు చేసిన ఇషాన్ కిషన్ ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ సెషన్తో బిజీ అయ్యాడు. ఫలితంగా బోర్డు పెద్దల ఆగ్రహానికి గురైన అతడు.. సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోనున్నాడనే ఊహాగానాలు వినిపించాయి. అంతేగాకుండా.. ఇకపై సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లు కనీసం 3-4 రంజీ మ్యాచ్లు ఆడితేనే బీసీసీఐ.. ఐపీఎల్లో ఆడే అవకాశం ఇస్తుందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ అంశాలపై స్పందించాడు. ‘‘తాము దేశవాళీ క్రికెట్కు అందుబాటులో ఉండటం లేదని కొంతమంది ఫోన్ కాల్ ద్వారా సమాచారం ఇచ్చారు. అయితే, అందుకు బదులుగా నేను వారికి లేఖ రూపంలో జవాబు ఇవ్వదలచుకున్నాను. కచ్చితంగా రెడ్ బాల్ క్రికెట్ ఆడాల్సిందే ఒకవేళ సెలక్షన్ కమిటీ చైర్మన్, కోచ్, కెప్టెన్ చెబితే మాత్రం కచ్చితంగా రెడ్ బాల్ క్రికెట్ ఆడాల్సిందే అని చెప్తాను. ఎవరైనా ఆటగాడు ఫిట్గా ఉన్నాడా లేదా? అతడు పరిమిత ఓవర్లు, టెస్టు క్రికెట్ రెండూ ఆడగలడా లేదా అన్న విషయాల గురించి ఎన్సీఏ నుంచి సలహాలు తీసుకుంటాం. అందరికీ వర్తిస్తుంది అందుకు అనుగుణంగానే మా నిర్ణయాలు ఉంటాయి. అయితే, ఫిట్గా ఉన్న ఆటగాళ్లు.. ముఖ్యంగా యువ క్రికెటర్లకు ఎలాంటి మినహాయింపులు ఉండవు. కచ్చితంగా దేశవాళీ రెడ్ బాల్ క్రికెట్ ఆడాల్సిందే. సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగి ఉన్న అందరు భారత క్రికెటర్లకూ ఇది వర్తిస్తుంది’’ అని జై షా కుండబద్దలు కొట్టాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు ఆరంభానికి ముందు సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియం పేరు మార్చారు. సౌరాష్ట్ర క్రికెట్ పాలనా విభాగంలో సేవలు అందించిన నిరంజన్ షా స్టేడియంగా నామకరణం చేశారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన జై షా ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. చదవండి: #Sarfaraz Khan: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. తండ్రి, భార్య కన్నీటి పర్యంతం -
కొంపముంచిన ఇషాన్ కిషన్.. బీసీసీఐ కీలక నిర్ణయం?
టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ తీరుపై బీసీసీఐ గుర్రుగా ఉందన్న వార్తల నేపథ్యంలో.. ఆసక్తికర అంశాలు తెరమీదకు వచ్చాయి. ఇషాన్ మాదిరి బోర్డు ఆదేశాలు ధిక్కరించే ఆటగాళ్లకు కొత్త నిబంధనలు విధించేందుకు యాజమాన్యం సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా మానసికంగా అలసిపోయానంటూ సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన ఇషాన్ కిషన్.. విశ్రాంతి తీసుకున్న తర్వాత దేశవాళీ క్రికెట్లో ఆడాలని బీసీసీఐ ఆదేశించినట్లు వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో రంజీల్లో ఆడాల్సిందిగా తన సొంతజట్టు జార్ఖండ్ నుంచి ఇషాన్కు ఆహ్వానం కూడా అందింది. అదే విధంగా.. టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం.. ఇషాన్ దేశవాళీ క్రికెట్లో ఆడిన తర్వాతే పునరాగమనం చేయగలడని గట్టిగానే హెచ్చరించాడు. అయినా.. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఇవేమీ పట్టించుకోలేదు. రంజీల్లో ఆడకుండా.. ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ నెట్ సెషన్లో పాల్గొనేందుకు వెళ్లాడు. ముంబై కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి ఇషాన్ బరోడాలో ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తమ ఆదేశాలను బేఖాతరు చేసిన ఈ యువ ఆటగాడి తీరుపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అతడి పేరును తప్పించేందుకు కూడా సిద్ధమైనట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఓ బీసీసీఐ అధికారి పీటీఐతో మాట్లాడుతూ.. ప్రస్తుతానికి తాము సెంట్రల్ క్రాంటాక్టుల విషయం చర్చించలేదని స్పష్టం చేశారు. అయితే, ఇకపై యువ ఆటగాళ్లు కచ్చితంగా రంజీల్లో ఆడేలా బోర్డు చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉందని చూచాయగా చెప్పారు. ఈ మేరకు.. ‘‘కొంతమంది ఆటగాళ్లు రెడ్ బాల్(టెస్టు) క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా లేరని బీసీసీఐ పెద్దలకు తెలిసింది. అలాంటి వాళ్లు టీమిండియాలో చోటు దక్కించుకోలేనపుడు కనీసం ముస్తాక్ అలీ వంటి దేశవాళీ టీ20 ట్రోఫీలోనైనా ఆడాలి. అందుకూ సిద్ధపడని వాళ్లు.. కేవలం ఫ్రాంఛైజీ క్రికెట్కే ప్రాధాన్యం ఇచ్చే వాళ్లకు ముకుతాడు వేయాలని బోర్డు యోచిస్తోంది. తప్పనిసరిగా 3- 4 రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఆడిన వాళ్లకు మాత్రమే ఐపీఎల్ ఆడేందుకు అనుమతినివ్వాలని భావిస్తోంది. రంజీల్లో ఆడేందుకు నిరాకరిస్తే.. ఐపీఎల్ వేలానికి ముందు రిలీజ్ అయిన వాళ్లకు మళ్లీ వేలంలో పాల్గొనే అవకాశం ఇవ్వకూడదనే నిబంధన తెచ్చే యోచనలో ఉంది. కొంతమంది రంజీ ట్రోఫీ ఆడటాన్ని తక్కువ చేసి చూడటం బోర్డు దృష్టికి వచ్చింది. అయితే, హార్దిక్ పాండ్యా వంటి ప్రధాన ఆటగాళ్లకు ఫిట్నెస్ కారణాల దృష్ట్యా ఇలాంటి నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని భావిస్తున్నారు’’ అని సదరు అధికారి పేర్కొనడం విశేషం. చదవండి: Virat Kohli-Anushka Sharma: ఓ బ్యాడ్ న్యూస్.. ఓ ‘గుడ్’ న్యూస్! -
బీసీసీఐ వార్నింగ్.. దిగొచ్చిన ఇషాన్ కిషన్..!
సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన ఆటగాళ్లు జాతీయ జట్టులోకి తిరిగి రావాలంటే దేశవాలీ టోర్నీల్లో తప్పక ఆడాలని బీసీసీఐ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ దిగొచ్చినట్లు కనిపిస్తుంది. వ్యక్తిగత సమస్యల కారణంగా దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలోనే స్వదేశానికి వచ్చేసిన ఇషాన్ ఆతర్వాత ఏ దేశవాలీ టోర్నీలోనూ ఆడకుండా మిన్నకుండిపోయాడు. టెస్ట్ల్లో టీమిండియాను రెగ్యులర్ వికెట్కీపర్ సమస్య వేధిస్తున్న నేపథ్యంలో చాలామంది ఇషాన్ను జట్టులోకి తీసుకోవాలని సూచించారు. అయితే రెండు నెలలకు పైగా ఎలాంటి క్రికెట్ ఆడని వ్యక్తిని నేరుగా తుది జట్టులో ఎలా తీసుకుంటామని బీసీసీఐ వాదిస్తుంది. ఈ విషయాన్ని టీమిండియా కోచ్ సైతం ఇషాన్ను ఉద్దేశిస్తూ చెప్పకనే చెప్పాడు. అయితే ద్రవిడ్ మాటలను సైతం పెడచెవిన పెట్టిన ఇషాన్.. దేశవాలీ టోర్నీలను కాదని ఐపీఎల్ సన్నాహకాల్లో నిమగ్నమైపోయాడు. ఇషాన్ ప్రవర్తన చూసి చిర్రెతిపోయిన బీసీసీఐ పెద్దలు తాజాగా ఓ అల్టిమేటం జారీ చేశారు. బీసీసీఐతో సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన ఆటగాళ్లు జాతీయ జట్టులోకి తిరిగి రావాలంటే దేశవాలీ టోర్నీల్లో పాల్గొనాలని రూల్ పాస్ చేశారు. జాతీయ జట్టు సభ్యులకు, ఎన్సీఏలో ఉన్న ఆటగాళ్లకు ఇందుకు మినహాయింపు ఉంటుందని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన పరోక్షంగా తనను ఉద్దేశించే అని గ్రహించిన ఇషాన్ ఎట్టకేలకు దిగొచ్చాడు. ఐపీఎల్ ప్రాక్టీస్ను పక్కన పెట్టి త్వరలో ప్రారంభంకానున్న డీవై పాటిల్ టోర్నీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ఇషాన్ స్వయంగా చెప్పనప్పటికీ, అతని సన్నిహితులు లోకల్మీడియాతో చెప్పినట్లు సమాచారం. ఐపీఎల్కు ముందు దేశవాలీ టోర్నీల్లో పాల్గొనకుంటే సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దవుతుందని సోషల్మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టడంతో ఇషాన్ కాస్త తగ్గినట్లు కనిపిస్తుంది. కాగా, వ్యక్తిగత కారణాలను సాకుగా చూపిన ఇషాన్.. కోచ్ ద్రవిడ్ చెప్పినా పట్టించుకోకుండా ఐపీఎల్ సన్నాహకాల్లో పాల్గొనడంపై బీసీసీఐ చాలా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. ఇషాన్ విషయంలో త్వరలోనే బ్యాడ్న్యూస్ వస్తుందన్న ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఇషాన్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో 'గ్రేడ్-సీ'లో ఉన్నాడు. ఏడాదికి అతనికి కోటి రూపాయల వేతనం లభిస్తుంది. -
బీసీసీఐ సీరియస్.. ఇషాన్ కిషన్కు ఊహించని షాక్!?
ఇషాన్ కిషన్.. గత కొన్ని రోజులగా భారత క్రికెట్ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. గతేడాది నవంబర్ నుంచి ఇషాన్ కిషన్ భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఇషాన్ మధ్యలోనే ఉన్నపళంగా స్వదేశానికి వచ్చాడు. అప్పటి నుంచి బీసీసీఐతో కానీ, భారత జట్టు మేనెజ్మెంట్తో కానీ టచ్లో లేడు. అయితే దక్షిణాఫ్రికా టూర్ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు కిషన్ అందుబాటులో ఉంటాడని భావించారు. కానీ తొలి రెండు టెస్టు ప్రకటించిన జట్టులో కిషన్ పేరు కన్పించలేదు. రెండో టెస్టు అనంతరం భారత హెడ్ కోచ్ రాహుల్ మాట్లాడుతూ.. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్కు ఎంపిక కావాలంటే కిషన్ కచ్చితంగా రంజీ ట్రోఫీలో ఆడాల్సిందే అని స్పష్టం చేశాడు. కానీ కిషన్ రాహుల్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోలేదు. రంజీ ట్రోఫీ ఆడకుండా బరోడా వెళ్లి పాండ్యా బ్రదర్స్ తో ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. జార్ఖండ్ తరఫున రంజీ ట్రోఫీ బరిలో దిగే అవకాశం ఉన్నా..కిషన్ విముఖత చూపించాడు. తాజాగా ఇదే విషయంపై బీసీసీఐ కూడా పరోక్షంగా స్పందించినట్లు సమాచారం. సీనియర్ ఆటగాళ్లు రంజీల్లో ఆడకుండా ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తుండటంపై బోర్డు అగ్రహం వ్యక్తం చేసినట్లు పలురిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కిషన్పై వేటు.. అయితే మరోక నివేదిక ప్రకారం.. కిషన్ వ్యవహరంపై బీసీసీఐ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. అతడిపై చర్యలకు బోర్డు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2024-25 ఏడాదిగాను బీసీసీఐ ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను త్వరలోనే ప్రకటించనుంది. ఈ క్రమంలో ఇషాన్ కాంట్రాక్ట్ను రద్దు చేయాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు సమచారం. ప్రస్తుతం గ్రేడ్ 'సి'లో ఉన్న ఇషాన్ కాంట్రాక్ట్ను పునరుద్దరించే ఆలోచనలో బీసీసీఐ లేనట్లు వినికిడి. కాగా 2022-23లో బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో తొలిసారి కిషన్ దక్కించుకున్నాడు. బీసీసీఐ నుంచి రూ. కోటి రూపాయలు వార్షిక వేతనాన్ని అందుకుంటున్నాడు. -
రంజీల్లో ఆడాల్సిందే.... ఆటగాళ్లకు బీసీసీఐ స్ట్రిక్ట్ వార్నింగ్
దేశవాళీ క్రికెట్ను కాదని ఐపీఎల్ సన్నాహకాల్లో నిమగ్నమై ఉన్న ఆటగాళ్లకు బీసీసీఐ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. రంజీల్లో ఆడకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. జాతీయ జట్టు సభ్యులు, గాయాల బారిన ఆటగాళ్లు మినహా అందరూ రంజీల్లో పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఇషాన్ కిషన్ ఎపిసోడ్ నేపథ్యంలో బీసీసీఐ సీరియస్గా ఉందని తెలుస్తుంది. బీసీసీఐ పిలుపును ఖాతరు చేయని వాళ్లకు త్వరలో నోటీసులు అందుతాయని సమాచారం. నోటీసులు అందుకున్న ఆటగాళ్లపై తీవ్ర చర్యలు ఉంటాయని తెలుస్తుంది. కాగా, గత కొద్దికాలంగా జాతీయ జట్టులో లేని ఇషాన్ కిషన్.. దేశవాలీ టీమ్కు అందుబాటులో ఉండకుండా ఐపీఎల్ 2024 సన్నాహకాల్లో బిజీగా ఉన్నాడు. బరోడాలో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాంప్లో ఇషాన్.. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాలీ క్రికెట్ ఆడాలని కోచ్ రాహుల్ ద్రవిడ్ చేసిన సూచనలను సైతం ఇషాన్ లెక్క చేయకుండా ఐపీఎల్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఇషాన్ చర్యల పట్ల బోర్డు చాలా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా బీసీసీఐ-ఇషాన్ కిషన్ మధ్య పరోక్ష యుద్దం నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. జితేశ్ శర్మను జాతీయ జట్టులోకి ఎంపిక చేసినప్పటి నుంచి ఇషాన్-బీసీసీఐ మధ్య వార్ జరుగుతుందని సమాచారం. -
భరత్కే పెద్దపీట.. అంతేగానీ అతడిని ఇప్పట్లో ఆడించరు!
టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ పునరాగమనంపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో వికెట్ కీపర్గా ప్రస్తుతం కేఎస్ భరత్కే మేనేజ్మెంట్ పెద్దపీట వేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఒకవేళ ఏదేని కారణాల చేత భరత్ జట్టుకు దూరమైతే.. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ లేదంటే జగదీశన్ వంటి వాళ్లకు ఛాన్స్ ఇస్తారని అభిప్రాయపడ్డాడు. అంతేగానీ.. ఇషాన్ కిషన్కు మాత్రం రీఎంట్రీ అంత సులువుకాదని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. బ్రేక్ తీసుకున్న ఇషాన్ కాగా మానసికంగా అలసిపోయానంటూ సౌతాఫ్రికా పర్యటన నుంచి ఇషాన్ కిషన్ మధ్యలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబంతో సమయం గడుపుతూనే.. వర్కౌట్లతో బిజీ అయ్యాడు. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్తో ఇషాన్ కిషన్కు విభేదాలు తలెత్తాయన్న వార్తల నడుమ.. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. దేశవాళీ క్రికెట్ ఆడిన తర్వాతే ఇషాన్ తిరిగి జట్టులోకి వస్తాడని పేర్కొన్నాడు. అయితే, రంజీ ట్రోఫీ-2024 రూపంలో అవకాశం ఉన్నా.. ఇషాన్ మాత్రం దానిని పక్కనపెట్టాడు. భరత్కు అవకాశం జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్వాగతం పలికినా జట్టుతో చేరలేదు. ఇదిలా ఉంటే.. ఇషాన్ తిరిగి వచ్చిన తర్వాత సౌతాఫ్రికాతో టెస్టుల్లో అతడి స్థానాన్ని భర్తీ చేసిన ఆంధ్ర క్రికెటర్ కోన శ్రీకర్ భరత్.. స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టుల్లోనూ ఆడుతున్నాడు. అయితే, వికెట్ కీపింగ్ పరంగా అతడికి మంచి మార్కులే పడుతున్నా.. బ్యాటర్గా ఆకట్టుకోలేకపోతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇషాన్ కిషన్ మేనేజ్మెంట్ను అడిగి మరీ విరామం తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంపిటేటివ్ క్రికెట్ ఆడలేదు. తన బ్రేక్ను పొడిగిస్తూనే ఉన్నాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లోనూ కనిపించడం లేదు. మానసికంగా అలసిపోయానంటూ అతడు సెలవు తీసుకున్నాడు. తను బాగుండాలని కోరుకుంటున్నా. అయితే, ఇప్పట్లో అతడు నేరుగా టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చే అవకాశం లేదు. కేఎస్ భరత్ వికెట్ కీపర్గా జట్టులో ఉన్నాడు. అతడి గైర్హాజరీలో ధ్రువ్ జురెల్ లేదంటే.. జగదీశన్ కూడా జట్టులోకి వస్తారేమో కూడా తెలియదు. కానీ.. ఇషాన్ కిషన్కు మాత్రం పిలుపునివ్వరు. అతడు దేశవాళీ క్రికెట్ ఆడిన తర్వాతే మళ్లీ జాతీయ జట్టుకు సెలక్ట్ చేస్తారు’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఆ విషయంలో కోహ్లితో పోల్చవద్దు ఈ సందర్భంగా.. ‘‘విరాట్ కోహ్లి కూడా కాంపిటేటివ్ క్రికెట్ ఆడటం లేదు కదా అంటూ ప్రశ్నలు వేయద్దు. ఎందుకంటే.. కోహ్లి, ఇషాన్ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి.. దయచేసి ఇద్దరినీ పోల్చే ప్రయత్నం చేయొద్దు’’ అంటూ ట్రోల్ చేసే వాళ్లకు చురకలు అంటించాడు ఆకాశ్ చోప్రా. చదవండి: Virat Kohli: అంతా అబద్ధం.. కోహ్లి విషయంలో మాట మార్చిన డివిలియర్స్
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
డిప్యూటీ సీఎంను చేసి పిఠాపురానికి పంపుతా
"గీతమ్మను గెలిపిస్తే.." పిఠాపురం ప్రజలకి బంపర్ ఆఫర్
మీడియాకు థ్యాంక్స్ చెప్పిన కేరళ గవర్నర్.. ఎందుకంటే?
బాలయ్య బాబు కి బలమైన కౌంటర్లు పిఠాపురం సాక్షిగా దత్తపుత్రుడి పరువు..!
గీతమ్మను, సునీల్ ను ఆశీర్వదించండి..
పిఠాపురంలో దత్తపుత్రుడిపై సీఎం జగన్ పవర్ పంచ్..
కుందనపు బొమ్మలా ప్రియాంకా జైన్ ఫొటోలు
పొరపాటున గెలిస్తే పవన్ కుబుసం విడిచి కాట్లు వేస్తాడు..!
పిఠాపురం: సీఎం జగన్ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)
గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
తప్పక చదవండి
- గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
- వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా: సీఎం జగన్
- బీజేపీ గెలిస్తే ‘యోగి’ అవుట్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
- ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్
- మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
- బాబును సీఎం చేసేందుకే ఈ లేనిపోని పెంట వార్తలు: పోసాని
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement