-
రివాల్వర్ రీటా’గా వస్తోన్న కీర్తి సురేశ్.. అప్డేట్ వచ్చేసింది!
మాలీవుడ్లో బాలనటిగా రంగప్రవేశం చేసి స్టార్ హీరోయిన్గా ఎదిగిన ముద్దుగుమ్మ కీర్తి సురేశ్. మహానటిగా ప్రేక్షకుల గుండెల్లో తనదైన ముద్రవేసుకుంది. కోలీవుడ్లో ఇదు ఎన్న మాయం చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్పుల్ హీరోయిన్గా పేరు తె చ్చుకుంది. హీరోయిన్గా తానేంటో నిరూపించుకున్న కీర్తి సురేశ్ టాలీవుడ్లో దివంగత నటి సావిత్రి జీవిత చరిత్రతో రూపొందిన తెలుగు చిత్రం మహానటి పాత్రకు జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్నారు. అలా ఒక్కో అడుగేస్తూ ఇప్పుడు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ వరుణ్ ధావన్కు జంటగా కోలీవుడ్ దర్శకుడు అట్లీ నిర్మిస్తున్న బేబీజాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇది తమిళంలో హిట్ అయిన తెరి చిత్రానికి రీమేక్గా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే తమిళంలో జయంరవికి జంటగా నటించిన సైరన్ చిత్రం కీర్తిసురేశ్ను నిరాశపరిచింది.ప్రస్తుతం ఈ బ్యూటీ నటిస్తున్న చిత్రాల్లో రివాల్వర్ రీటా ఒకటి. ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రంగా రూపొందిస్తోన్న ఈ చిత్రానికి చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు రెడిన్ కింగ్స్లీ, మైమ్గోపీ, సెండ్రాయిన్, స్టంట్ మాస్టర్ సూపర్సుబ్బరాయన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఫ్యాషన్ స్టూడియోస్, ది రూట్ సంస్థ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని నటి కీర్తిసురేశ్ తన ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్తో చివరి షూటింగ్లో కేక్ కట్ చేసిన వీడియోను విడుదల చేశారు. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. కాగా ఈ చిత్రం ఆడియో, ట్రైలర్లను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. కీర్తిసురేశ్ రఘుతాత అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. -
విజయ్ చివరి చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు..ఎవరంటే?
ఇప్పుడు కోలీవుడ్లో ఆసక్తికరమైన టాక్ హల్చల్ చేస్తోంది. నటుడు విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చి త్రం గోట్(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టై మ్) నటి మీనాక్షి చౌదరి, స్నే హ, లైలా, ప్రభుదేవా, ప్రశాంత్,వైభవ్, ప్రేమ్జీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. వెంకట్ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా తదుపరి విజయ్ తన 69వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇదే ఈయన చివరి చిత్రం అని ప్రచా రం జోరుగా సాగుతోంది. కారణం విజయ్ రాజకీయరంగ ప్రవేశం చేయడమే. కాగా ఆయన చివరి చిత్రానికి హెచ్ వినో ద్ దర్శకత్వం వహించనున్నారన్న ప్రచారం జరుగుతున్నా, అధికారికంగా ప్రకటించలేదు. అదే సమయంలో దీన్ని ఏ నిర్మాణ సంస్థ నిర్మించనుందీ అన్నది కూడా తెలియని పరిస్థితి. అయినప్పటికీ ఇందులో విజయ్తో జత కట్టే కథానాయికల గురించి ప్రచారం జో రుగా సాగుతోంది.అలా ఈ జాబితాలో పలువురు పేర్లు చెక్కర్లు కొడుతున్నా, నటి సమంత, కీర్తీసురేష్ పేర్లు తాజాగా వినిపిస్తున్నాయి. నటి సమంత ఇంతకు ముందు విజయ్ సరసన కత్తి, తెరి, మెర్సల్ చిత్రాల్లో నటించారు. అలాగే నటి కీర్తీసురేష్ కూడా ఇంతకు ముందు భైరవా, సర్కార్ చిత్రాలలో జత కట్టారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి విజయ్తో రొమాన్స్ చేయనున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
బాలీవుడ్ ఎంట్రీ.. రెచ్చిపోతున్న కీర్తిసురేశ్!
ఇదు ఎన్న మాయం చిత్రంతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు కీర్తి సురేశ్. కెరీర్ ప్రారంభం నుంచే పక్కింటి అమ్మాయి ఇమేజ్ను మెయింటెన్ చేస్తూ వచ్చారు. అలా ఇక్కడ రజనీమురుగన్, రెమో, భైరవా, సామి 2 చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్ల లిస్టులో చేరారు. ఈ మధ్య నటించిన మామన్నన్, సైరన్ చిత్రాల వరకూ గ్లామర్కు దూరంగానే ఉంటూ వచ్చారు.బాలీవుడ్లో ఎంట్రీతెలుగులో మహానటి చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించి ఉత్తమ నటిగా జాతీయ అవార్డునే గెలుచుకున్నారు. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో గ్లామర్గా కనిపించినా శ్రుతిమించి పోలేదు. అలాంటిది ఎప్పుడైతే బాలీవుడ్లోకి అడుగు పెట్టారో పూర్తిగా గ్లామర్కు ఓటేస్తున్నారు. హిందీ చిత్రాల్లో నటించడం మొదలెడితే అందాల ఆరబోత తప్పదేమో అనిపిస్తోంది కీర్తీసురేష్ను చూస్తుంటే! తెలుగు, తమిళంలో సక్సెస్లు ఉన్నా, అవకాశాలు తగ్గాయన్నది వాస్తవం.వరుణ్ ధావన్ బర్త్డేబేబీజాన్ చిత్రం ద్వారా కీర్తి బాలీవుడ్లోకి అడుగు పెట్టనున్నారు. ఇది తమిళంలో హిట్ అయిన తేరి చిత్రానికి రీమేక్. ఈ మూవీని తమిళ టాప్ దర్శకుడు అట్లీ నిర్మిస్తున్నారు. బేబీజాన్ షూటింగ్ దశలో ఉంది. బుధవారం (ఏప్రిల్ 24) ఈ మూవీ హీరో వరుణ్ ధావన్ బర్త్డే సెలబ్రేషన్స్ చిత్ర యూనిట్ మధ్య జరిగాయి. ఇందులో కీర్తీసురేష్ డీప్ నెక్ ఉన్న లెహంగాలో కనిపించింది. వరుణ్ ధావన్కు కేక్ తినిపించి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఇంతలా మారిపోయారేమిటి? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. #KeerthySuresh from the sets of #Babyjohn ( Hindi remake of THERI) 🎬⭐️😎#VarunDhawan | #Atleepic.twitter.com/u3IkBELUtW— Tharani ᖇᵗк (@iam_Tharani) April 24, 2024 చదవండి: వీకెండ్ స్పెషల్.. ఈ సినిమాలు మిస్ కావొద్దు -
నేరుగా ఓటీటీలోకి కీర్తి సురేశ్ మూవీ, స్ట్రీమింగ్ అక్కడే!
తమిళ హీరో జయం రవి, హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సైరన్. అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో మెరిసింది. ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదట్లో నేరుగా ఓటీటీలోకి రానుందని ప్రచారం జరిగింది. అయితే తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లో విడుదల చేశాకే ఓటీటీలో రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. అక్కడ రిలీజ్ డిసెంబర్లో రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమాను పలు వాయిదాల తర్వాత తమిళంలో ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తెలుగులోనూ థియేటర్లలో విడుదల చేసేందుకు ప్రయత్నించారు. కానీ తమిళనాట మరీ అంత పాజిటివ్ స్పందన లేకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. ఏప్రిల్ 19 నుంచి హాట్స్టార్లో సైరన్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైరన్ అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు. కథేంటంటే? ఖైదీ పాత్రలో ‘జయం’ రవి, పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో కీర్తి సురేష్ నటించారు. భార్య(అనుపమ పరమేశ్వరన్)ను హత్య చేసిన కేసులో రవి జైలుకెళ్తాడు. పెరోల్పై బయటకు వచ్చిన సమయంలో ఓ లీడర్ను, పోలీస్ను హత్య చేస్తాడు. ఈ కేసు కీర్తి సురేశ్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ప్రేమించి పెళ్లాడిన భార్యను నిజంగానే రవి చంపేశాడా? కీర్తి కేసును ఎలా సాల్వ్ చేసింది? అనేది తెలియాలంటే? ఈ సినిమాను ఓటీటీలో చూసేయండి.. #Siren OTT - Apr 19 - Hotstar. pic.twitter.com/Mr4KPtCHIe — Christopher Kanagaraj (@Chrissuccess) April 10, 2024 చదవండి: అమ్మ అంటే ఎంత ప్రేమో.. తనకోసం ఆలయాన్నే కట్టించిన హీరో -
'40 రోజులు వనవాసం'.. స్టార్ హీరోయిన్ ఆసక్తికర పోస్ట్!
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. గతేడాది దసరా మూవీతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ ప్రారంభంలోనే జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న కీర్తి తన శక్తికి మించిన పాత్రల్లోనూ నటించి మెప్పించింది. మహానటిగా అభిమానుల గుండెల్లో తన పేరును లిఖించుకుంది. తెలుగు, తమిళ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ తాజాగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అంతే కాకుండా ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టారు. తాజాగా అక్కా అనే వెబ్ సిరీస్లో నటి రాధిక ఆప్టేతో కలిసి నటించారు. ధనరాజ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం కేరళలో మకాం పెట్టిన కీర్తి సురేష్ తాజాగా తన ఇన్స్ట్రాగామ్లో పంచుకున్నారు. దాదాపు 40 రోజులు వనవాసం పూర్తి చేసి ఇప్పుడే సోషల్ మీడియాలోకి తిరిగివచ్చానని రాసుకొచ్చారు. అక్కా వెబ్ సిరీస్లో నటించడం చాలా సంతోషంగా ఉన్నారు. ఈ షెడ్యూల్ని ముగించుకుని ఇంటికి తిరిగిరావడం సరి కొత్త అనుభూతిగా ఉందని పేర్కొన్నారు. ఇకపై ఇతర మూవీ షూటింగ్లకు హాజరవుతానని తెలిపారు. కాగా.. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళంలో రఘు తాత, రివాల్వర్ రీటా, కన్నివెడీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ మూడు ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాలు కావడం విశేషం. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
రూ.1000 కోట్ల హీరోతో దసరా భామకు ఛాన్స్.. వేరే లెవెల్ రేంజ్! (ఫొటోలు)
-
ఒకప్పటిలా లేదు.. అందుకే కీర్తిసురేశ్కు నో ఛాన్స్!
అజయ్ దేవ్గణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మైదాన్. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా ఇది.. కానీ అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల అజయ్ నటించిన షైతాన్ మూవీ సూపర్ హిట్గా నిలవడంతో మైదాన్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ఎట్టకేలకు ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్గా నటించింది. ఫస్ట్ చాయిస్ ప్రియమణి కాదు అయితే హీరోయిన్ పాత్రకు ముందుగా ప్రియమణిని అనుకోలేదట! ఈ విషయాన్ని డైరెక్టర్ అమిత్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. రహీం(హీరో పాత్ర పేరు) భార్యగా కీర్తి సురేశ్ను అనుకున్నాను. ఒకప్పుడు బొద్దుగా ఉండే ఆమె చాలా బరువు తగ్గిపోయి సన్నగా అయిపోయింది. అలా సన్నగా ఉంటే తను పాత్రకు సెట్టవదని మిగతావారి దగ్గరకు వెళ్లాను. అలా ఈ పాత్ర ప్రియమణిని వరించింది అని చెప్పుకొచ్చాడు. బాక్సాఫీస్ ఫైట్ మైదాన్ రిలీజ్ రోజే అక్షయ్ కుమార్- టైగర్ ష్రాఫ్ల మల్టీస్టారర్ బడే మియా చోటే మియా రిలీజ్ కానుంది. మరి ఈ బాక్సాఫీస్ ఫైట్లో ఎవరు గెలుస్తారో చూడాలి! ఇదిలా ఉంటే కీర్తి సురేశ్ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. తమిళ హిట్ మూవీ తేరి హిందీ రీమేక్ 'జాన్ బేబీ'లో నటించనుంది. ఈ చిత్రాన్ని అట్లీ నిర్మిస్తుండగా అతడి అసిస్టెంట్ కలీస్ దర్శకత్వం వహిస్తున్నాడు. చదవండి: సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు?.. ఆనంద్ మహీంద్రా ఆన్సరిదే! -
సుహాస్తో కీర్తి సురేశ్ కొత్త మూవీ!
హీరోయిన్ కీర్తీ సురేశ్ మెయిన్ లీడ్ రోల్లో నటించనున్న కొత్త సినిమాకు ‘ఉప్పు కప్పురంబు’ అనే టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ‘కలర్ ఫోటో’ ఫేమ్ సుహాస్ మరో లీడ్ రోల్లో కనిపిస్తారు. అని ఐవీ శశి దర్శకత్వంలో రాధికా లావు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. వసంత్ మురళీ కృష్ణ మరింగంటి కథ అందిస్తున్నారు. ఓ గ్రామంలోని స్మశానం విస్తరణ నేపథ్యంలో ‘ఉప్పు కప్పురంబు’ సినిమా కథనం ఉంటుందనే ప్రచారం ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. కాగా ఈ సినిమాలో కీర్తీ సురేశ్, సుహాస్ జంటగా నటిస్తారా? లేదా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మహానటితో సినిమా అనగానే సుహాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి కీర్తి అతిథి పాత్రలో కనిపించనుందా? ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. చదవండి: ఓటీటీలో సడెన్గా మాయమైన హిట్ సినిమా.. కారణం ఇదేనా -
బ్లాక్ శారీలో కీర్తి సురేశ్ స్టన్నింగ్ లుక్స్.. గ్లామర్తో రెచ్చగొడుతోన్న శ్రద్ధాదాస్!
బ్లాక్ శారీలో కీర్తి సురేశ్ స్టన్నింగ్ లుక్స్.. స్మైలీ లుక్స్తో కవ్విస్తోన్న ఐశ్వర్య లక్ష్మీ.. రెడ్ శారీలో ఆషిక రంగనాథ్ హోయలు.. బోల్డ్ లుక్స్తో రెచ్చిపోతున్న శ్రద్ధాదాస్... వాలెంటైన్స్ మూడ్లో మాళవిక మోహనన్.. ఆరెంజ్ డ్రెస్లో తేజస్విని గౌడ పోజులు.. రెడ్ డ్రెస్లో మరింత బోల్డ్గా యషిక ఆనంద్.. View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) -
స్టార్ హీరో యాక్షన్ థ్రిల్లర్.. టాలీవుడ్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్!
'తని ఒరువన్' 'కొమాలి' 'పొన్నియిన్ సెల్వన్' లాంటి చిత్రాలతో తెలుగులోనూ క్రేజ్ దక్కించుకున్న హీరో జయం రవి. ఆయన తాజాగా 'సైరన్' అనే మాస్ యాక్షన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో దసరా భామ కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. అంథోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి రానుంది. టాలీవుడ్లో ఈ సినిమా 'గంగ ఎంటర్టైన్మెంట్స్' పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే తెలుగు టీజర్ విడుదల కాగా మంచి స్పందన లభించింది. తాజాగా చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. దర్శకుడు ఆంథోని భాగ్యరాజ్ మాట్లాడుతూ.. " ఈ చిత్రం నాకొక కలలా జరిగిపోయింది. ఒక కొత్త దర్శకుడి మొదటి చిత్రం. అదీ పెద్ద హీరోతో చేసినప్పుడు కచ్చితంగా హిట్ కొట్టాలనుకుంటారు. ఆ బాధ్యత జయం రవి తీసుకున్నారు. జీవీ గారి మెలోడీస్ అంటే నాకు చాలా ఇష్టం. చిత్రం అద్భుతంగా వచ్చింది. తెలుగు ప్రేక్షకులకి నచ్చుతుందని ఆశిస్తున్నాం" అని అన్నారు. జయం రవి మాట్లాడుతూ.."ఈ చిత్రంలో ఎమోషన్స్ చాలా ముఖ్య పాత్రలు వహిస్తాయి. వాటికి జీవీ తన సంగీతంతో ప్రాణం పోశారు. అలాగే ఈ చిత్రంలో ముఖ్యమైన లేడి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కీర్తి సురేశ్ మా నమ్మకాన్ని నిలబెట్టింది. ఆంథోనీ భాగ్యరాజ్ లాంటి కొత్త దర్శకులతోనే చేస్తున్నందుకు నన్ను చాలా మంది హెచ్చరిస్తుంటారు. కానీ ప్రతిభ గల దర్శకుడి కష్టంలోనే విజయం కనిపిస్తుంది. ఈ చిత్రంలో నేను రెండు విభిన్నమైన పాత్రలు పోషించాను. మా సైరన్ తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది" అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. ఈ సినిమాలో సముద్రఖని, యోగి బాబు, అజయ్, అలగం పెరుమాళ్, పాండ్యన్ కీలక పాత్రలు పోషించారు. -
వీధి పోకిరి చెంప చెళ్లు మనిపించా: కీర్తి సురేశ్
తక్కువ కాలంలోనే హీరోయిన్గా అనూహ్య స్థాయికి చేరుకుంది కీర్తీ సురేశ్. మహానటి చిత్రంతో జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు మలయాళం, తమిళం, తెలుగు భాషలను దాటి ఉత్తరాది ప్రేక్షకులను అలరించడానికి బాలీవుడ్ వరకు చేరుకుంది. ఇలా చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న కీర్తీ సురేశ్కు ధైర్యం కాస్త ఎక్కువేనట. సినీ రంగప్రవేశం చేయకముందే నిజ జీవితంలో తన మాస్ హీరోయిజాన్ని చూపించారట. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఒక పోకిరికి బుద్ధి చెప్పిన సంఘటన గురించి చెప్పారు. నటిగా పరిచయం కాని సమయంలో ఒక రోజు అర్ధరాత్రి తాను స్నేహితురాళ్లతో కలిసి వెళుతున్నానని, అప్పుడొక మందుబాబు వెనుకగా వచ్చి తనను రాసుకుంటూ వెళ్లాడని చెప్పారు. తనకు కోపం తన్నుకు రావడంతో అతన్ని పట్టుకుని చెంపలు పగలకొట్టినట్లు చెప్పారు. ఆ తరువాత ఆ మందుబాబు తనపై దాడి చేసి తలపై కొట్టాడని, దీంతో అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించినట్లు కీర్తి సురేశ్గుర్తు చేసుకున్నారు. పోలీసులు అతన్ని ఆ రాత్రి అంతా జైలులోనే ఉంచి ఉదయం విడిచి పెట్టారని చెప్పారు. అయితే ఇది నమ్మశక్యంగా లేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా కీర్తీ సురేశ్ తాజాగా జయంరవి చొక్కా కాలర్ పట్టుకుని ఈడ్చుకెళుతున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది సైరన్ చిత్రంలో దృశ్యం అని గమనించవచ్చు. జయంరవి కథానాయకుడిగా నటించిన ఇందులో కీర్తీసురేశ్ పోలీస్ అధికారిగా నటించారు. ఈ చిత్రం కోసం ఈ బ్యూటీ 10 కిలోల బరువు పెరిగారట. సైరన్ చిత్రం ఈనెల 16న థియేటర్లలోకి రానుంది. -
కీర్తి సురేశ్ పవర్ఫుల్ పాత్రలో వస్తోన్న సైరన్.. రిలీజ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ హీరో జయంరవి, కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన తాజా చిత్రం సైరెన్. హోమ్ మూవీ మేకర్స్ పతాకంపై సుజాత విజయకుమార్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా ఆంథోని భాగ్యరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జీవీ ప్రకాష్కుమార్ సంగీతాన్ని అందించిన సైరన్ చిత్రం ఈనెల 16న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చైన్నెలోని పీవీపీ స్టూడియోలో ప్రెస్ మీట్ నిర్వహించారు. హీరో జయంరవి మాట్లాడుతూ.. తాము సమష్టిగా శ్రమించిన సైరన్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోందని చెప్పారు. దర్శకుడు ఆంథోని భాగ్యరాజ్ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించారని.. ఆయనకు మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. కీర్తీసురేశ్ చాలా బలమైన పాత్రను అద్భుతంగా చేశారని అభినందించారు. తాను ఇందులో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించానని.. ఈ చిత్రం పిల్లలు నుంచి పెద్దల వరకు అందరినీ అలరిస్తుందనే నమ్మకాన్ని జయంరవి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సుజాత విజయకుమార్ మాట్లాడుతూ.. అంబులెన్స్ సైరన్కు, పోలీస్ సైరన్కు మధ్య జరిగే పోరాటమే ఈ చిత్రమని అన్నారు. జయంరవి కథానాయకుడిగా సైరన్ చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. ఆయన తన అల్లుడు అని చెప్పడం కాదు కానీ.. చాలా అద్భుతంగా నటించారని అన్నారు. కీర్తీసురేశ్ ఈ చిత్రంలో పోలీసు అధికారిగా పవర్ఫుల్ పాత్రను జయంరవికి ధీటుగా నటించారని ప్రశంసించారు. అనుపమ పరమేశ్వరన్ కూడా చాలా చక్కగా చేశారని చెప్పారు. దర్శకుడు తనకు చెప్పిన కథ వేరు.. జయంరవికి చెప్పి చేసిన సైరన్ చిత్ర కథ వేరని ఆమె అన్నారు. కాగా.. ఈ చిత్రంలో సముద్రఖని, అళగర్ పెరుమాళ్ ముఖ్యపాత్రలు పోషించారు. -
బేబీ జాన్తో బాలీవుడ్కి...
బాలీవుడ్లో హీరోయిన్ కీర్తీ సురేష్ ప్రస్థానం మొదలైంది. కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తున్న తొలి హిందీ చిత్రానికి ‘బేబీ జాన్’ టైటిల్ను ఖరారు చేసి, గ్లింప్స్ను విడుదల చేశారు మేకర్స్. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో వామికా గబ్బా మరో హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళ దర్శకుడు ఎ.కాళీశ్వరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ దర్శకుడు అట్లీ సమర్పణలో జ్యోతిదేశ్ పాండే, మురాద్ ఖేతని, ప్రియా అట్లీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ మొదలైంది. ‘బేబీ జాన్’ని మే 31న థియేటర్స్లో విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. కాగా తమిళ హిట్ విజయ్ ‘తేరీ’ (2016) సినిమాకు హిందీ రీమేక్గా ‘బేబీ జాన్’ రూపొందుతోందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. తమిళంలో ‘తేరీ’ సినిమాకు దర్శకత్వం వహించిన అట్లీ ‘బేబీ జాన్’ సినిమాకు నిర్మాతగా ఉండటం విశేషం. ఇదిలా ఉంటే.. ఓ రాజకీయ నాయకుడి కొడుకు ఓ అమ్మాయిపై హత్యాచారానికి పాల్పడితే, అతన్ని చంపినందుకు గాను ఓ పోలీసాఫీసర్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అన్నదే ‘తేరీ’ కథ అని తెలిసిందే. -
డైహార్ట్ ఫ్యాన్కు క్షమాపణ చెప్పిన కీర్తీసురేష్
అభిమానులు లేనిదే ఏ స్టార్ లేరులే అన్నారో గీత రచయిత. ఇది మాత్రం నగ్న సత్యం. అందుకే నటీనటులు అభిమానులే తమ దేవుళ్లు అంటారు. ఇక అభిమానుల విషయానికొస్తే ఏ నటుడుగానీ, నటి గానీ వారికి నచ్చితే నెత్తినేసుకుని మోసేస్తారు. వారికి గుళ్లు, గోపురాలు కట్టి ఆరాధిస్తారు. సిరాతో కాకుండా రక్తంతో లేఖలు రాసే పిచ్చి అభిమానులు ఉంటారు. మరి కీర్తీసురేష్కు ఇలాంటి ఒక వీరాభిమానే ఉన్నాడు. బాలనటిగా నట జీవితాన్ని ప్రారంభించిన ఈమె, ఆ తరువాత కథానాయకిగా పరిచయం ఆపై తమిళం, తెలుగు, హిందీ అంటూ ప్రముఖ కథానాయకి స్థాయికి ఎదిగిన నటి కీర్తీసురేష్. అతి తక్కువ కాలంలోనే మహానటి చిత్రంలోని నటనకుగాను జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న అరుదైన నటి కీర్తీసురేష్. అదేవిధంగా కథానాయకి ప్రాముఖ్యత కలిగిన కథా చిత్రాల్లో నటించి మెప్పించే స్థాయికి ఎదిగారు. కోలీవుడ్లో పలు చిత్రాలతో బిజీగా వున్న ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళంలో విజయ్, సమంత, ఎమిజాక్సన్ హీరో హీరోయిన్లుగా నటించిన అట్లీ దర్శకత్వం వహించిన తెరి చిత్ర హిందీ రీమేక్లో కీర్తీసురేష్ నటిస్తున్నారు. తమిళంలో సమంత నటించిన పాత్రను హిందీలో పోషిస్తున్నారు. ఈమె కథానాయకిగా నటించిన సైరన్, రఘుతాత, రివాల్వర్ రీటా, కన్నివెడి చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి క్రేజీ నటి ఒక అభిమానికి క్షమాపణ చెప్పడం విశేషం. కృష్ణ అనే ఈమె వీరాభిమాని వరుసగా 233 లేఖలు రాసి ఆమెకు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అప్పటికి అతని లేఖలకు స్పందించని కీర్తీసురేష్ 234వ లేఖకు బదులిచ్చారు. ఆమె ట్విట్టర్ ద్వారా అతని లేఖలకు స్పందిస్తూ 234 తనకు ఫాంటసీ నంబర్ అని పేర్కొన్నారు. ఆలస్యంగా స్పందించినందుకు క్షమించు లాట్సాప్ లవ్ అని పేర్కొంది. ఆమె ఈ ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్అవుతోంది. -
శింబుతో జతకట్టనున్న ఇద్దరు హీరోయిన్స్!
తమిళ హీరో శింబు నటించిన చివరి చిత్రం పత్తుతల. ఈ చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. దీంతో ఈయన తర్వాత చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని ఆయన అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. శింబు కథానాయకుడిగా కమల్ హాసన్ ఒక చిత్రాన్ని నిర్మించనున్నట్లు చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి దేశింగు పెరియసామి దర్శకత్వం వహించనున్నారట. ఈయన చెప్పిన కథ రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖ స్టార్స్ను మెప్పించిందని, ఇందులో రజనీ నటించాల్సిందని ప్రచారం జరిగింది. హీరో, విలన్.. అన్నీ ఒక్కడే అలాంటి కథలో ఇప్పుడు శింబు నటించనున్నారు. ఈ చిత్రం త్వరలో సెట్పైకి వెళ్లనుందని సమాచారం. ఈ చిత్రం కోసం శింబు కరాటే వంటి విద్యల్లో శిక్షణ పొందడం విశేషం. ఇది పీరియాడికల్ కథా చిత్రంగా ఉంటుందని టాక్. ఈ మూవీలో శింబు హీరో, విలన్ పాత్రను తనే పోషించనున్నారని టాక్! ఇకపోతే ఈ చిత్రంలో బాలీవుడ్ మోస్ట్ టాప్ హీరోయిన్గా రాణిస్తున్న దీపికాపదుకొనే, కీర్తీసురేశ్ హీరోయిన్లుగా నటించనున్నట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బాలీవుడ్ క్వీన్తో.. హీరోకు జంటగా కీర్తీసురేశ్, విలన్ సరసన దీపికా పదుకొనే నటించబోతున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే ఇది నిజంగానే భారీ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కే చిత్రమవుతుంది. దీపికా పదుకొనే చాలా గ్యాప్ తరువాత మరోసారి కోలీవుడ్ ప్రేక్షకులను ఈ చిత్రం ద్వారా పలకరించనున్నారన్నమాట. ఈ చిత్ర టైటిల్, ఫస్ట్లుక్ పోస్టర్లను ఫిబ్రవరి మూడో వారంలో విడుదల చేయడానికి యూనిట్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది: మెగాస్టార్ ఎమోషనల్ -
స్టార్ హీరోయిన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఓటీటీలో కాదట!
దసరా బ్యూటీ కీర్తి సురేశ్, జయం రవి ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం 'సైరెన్'. 108 అనేది ఉపశీర్షిక. యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ తేదీని కీర్తి సురేశ్ తన ట్విటర్లో పోస్ట్ చేసింది. అంబులెన్స్ డ్రైవర్గా పనిచేసి క్రిమినల్గా మారిన ఓ వ్యక్తి కథనే సినిమాగా రూపొందిస్తున్నారు. 14 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి జైలు నుంచి బయటికొచ్చి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనే కథాంశంతో తెరకెక్కుతోంది. డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్..! అయితే ఈ సినిమాపై మొదట డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ కానుందని వార్తలొచ్చాయి. ఈ మూవీ రిలీజ్ తేదీపై గతంలో చాలాసార్లు రూమర్స్ వినిపించాయి. దీంతో ఈ సినిమాను ఓటీటీలో కాకుండా నేరుగా థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. తమిళ, తెలుగు భాషల్లో థియేటర్లోనే విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్లను జయం రవి, కీర్తి సురేష్ ట్విటర్లో పంచుకున్నారు. (ఇది చదవండి: డైరెక్ట్గా ఓటీటీకి స్టార్ హీరోయిన్ యాక్షన్ థ్రిల్లర్..!) కాగా.. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ పోలీసు ఆఫీసర్గా కనిపించనున్నారు. డీజే టిల్లు స్క్వేర్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. మరోవైపు కీర్తి సురేశ్ రఘుతాత అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. . @actor_jayamravi coming out on parole this Feb16th ! 🚨#SirenFromFeb16 #Tamil & #Telugu A @gvprakash Musical @antonybhagyaraj @anupamahere @sujataa_HMM @iYogiBabu @IamChandini_12 @AntonyLRuben @brindagopal @dhilipaction @selvakumarskdop @SaktheeArtDir @shiyamjack… pic.twitter.com/Au67K5Vo3F — Keerthy Suresh (@KeerthyOfficial) January 22, 2024 -
Keerthy Suresh Sankranti Photos: కీర్తి సురేశ్ ఇంట సంక్రాంతి సంబురాలు (ఫోటోలు)
-
కీర్తి సురేశ్ లేటెస్ట్ మూవీ.. కాంట్రవర్సీ అయ్యేలా ఉందే?
జాతీయ భాష హిందీ గురించి చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తమిళనాడులో హిందీ భాషపై చాలా వ్యతిరేకత ఉంది. మాతృభాష (తమిళభాష)పై ప్రేమ చూపించే తమిళనాడులో హిందీ భాషను నేర్చుకోవాలి అనే ఒత్తిడిని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడమే ఇందుకు కారణం. హిందీలో మాట్లాడితేనే ప్రభుత్వ ఉద్యోగాలు అనే నిబంధన విధించడం కూడా ముఖ్య కారణం. ఇక ఇదే అంశాన్ని సినిమాగా తీసినట్లు కనిపిస్తోంది. అదే 'రఘుతాత'. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ సాయిపల్లవి చెల్లి.. కుర్రాడు ఎవరంటే?) 'సలార్', 'కేజీఎఫ్' సినిమాలని నిర్మించిన హోంబలే ఫిల్మ్.. కీర్తి సురేశ్ని ప్రధాన పాత్రలో పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. సుమన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. హిందీ భాషకు వ్యతిరేకంగా తీసిన ఈ చిత్రం.. వివాదాల్లేకుండా రిలీజైపోతుందా? లేదా? అనేది కొన్నిరోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే?) -
డైరెక్ట్గా ఓటీటీకి స్టార్ హీరోయిన్ యాక్షన్ థ్రిల్లర్..!
కోలీవుడ్ స్టార్ జయంరవి, కీర్తీసురేష్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం సైరెన్. ఈ చిత్రంలో జయంరవి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. యాక్షన్, థ్రిల్లర్, కుటుంబ కథా చిత్రంగా ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వంలో హోమ్ ఫిలిం మేకర్స్ పతాకంపై సుజాత నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్, టీజర్ ఇటీవల విడుదల కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో జయం రవి జైలర్గా నటిస్తుండగా, నటి కీర్తి సురేష్ పోలీసు అధికారిగానూ, అనుపమ పరమేశ్వరన్ ఆయన ప్రేయసిగా నటిస్తున్నారు. (ఇది చదవండి: నయనతార 'అన్నపూరణి'.. తెలంగాణ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్!) అయితే థియేటర్లలో రిలీజ్ కోసం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. సైరెన్ త్వరలోనే తెరపైకి రానుందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జయంరవి అభిమానులకు షాకి ఇచ్చే విధంగా ఓ న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ సినిమాను థియేటర్లలో కాకుండా డైరెక్ట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా ఈ నెల 26న నేరుగా జీ5లో స్ట్రీమింగ్కు రానున్నట్లు సమాచారం. గతంలో జయంరవి నటించిన భూమి చిత్రం కూడా నేరుగా ఓటీటీలో విడుదల కావడం విశేషం. దీంతో ఈ మూవీ విషయంలోనూ అదే జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే సైరెన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందన్న విషయాన్ని చిత్ర వర్గాలు ఇంకా అధికారికంగా ప్రకటనైతే రాలేదు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా.. ఈ చిత్రంలో యోగిబాబు, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషించగా.. జీవీ ప్రకాష్కుమార్ సంగీతాన్ని అందించారు. -
ఆహా.. బయలుదేరిందయ్యా.. కీర్తి ట్వీట్ చూశారా?
కీర్తి సురేశ్.. పేరుకు తగ్గట్టుగానే నటిగా పేరు, పరపతిని పెంచుకుంటూ పోతున్నారు. ఆదిలోనే ఉత్తమ నటిగా జాతీయ ఉత్తమ అవార్డు గెలుచుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. తమిళం, మలయాళం, తెలుగు భాషలను అధిగమించి హిందీ చిత్ర సీమలోనూ మకాం పెట్టారు. ఇటీవల ఈ బ్యూటీ నటించిన తెలుగు చిత్రం దసరా మంచి విజయాన్ని సాధించింది. అదేవిధంగా తమిళంలో ఉదయనిధి స్టాలిన్తో జత కట్టిన మామన్నన్ చిత్రం కూడా మంచి సక్సెస్ సాధించింది. కీర్తి సురేశ్ నాయకిగా నటిస్తున్న తాజా చిత్రాల్లో రఘుతాతా ఒకటి. హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేజీఎఫ్, సలార్ వంటి సంచలన చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. సుమన్కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన తెచ్చుకుంది. త్వరలో రఘుతాతా చిత్రం తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. దీని గురించి కీర్తీసురేశ్ తన ఎక్స్ మీడియాలో పేర్కొన్నారు. 'ఆహా బయలుదేరిందయ్యా.. బయలుదేరింది. వినోదాల విందులతో రఘుతాతా త్వరలో థియేటర్లలోకి రానుంది' అని పేర్కొన్నారు. ఇది పూర్తి కామెడీ ఎంటర్టైనర్ కథా చిత్రం అని హీరోయినే స్వయంగా చెప్తున్నారన్నమాట. కాగా ఇంతకుముందు అభినయంతో ఆ తరువాత అందంతో అలరించిన ఈ భామ తాజాగా వినోదంతో ఆకట్టుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. A whirlwind of comedy is about to hit a cinema near you. Brace for a laughter overload, courtesy #Raghuthatha. ஆத்தி… கிளம்பிட்டாயா கிளம்பிட்டாயா! உங்களை வயிறு குலுங்க சிரிக்க சிரிக்கவைக்க வருகிறது, ரகு தாத்தா. விரைவில் உங்கள் அருகிலுள்ள திரையரங்குகளில்…@hombalefilms… pic.twitter.com/FvXW6yYsqG — Keerthy Suresh (@KeerthyOfficial) January 2, 2024 చదవండి: -
హీరోయిన్ కీర్తి సురేశ్ షాకింగ్ డెసిషన్.. దానికి గ్రీన్ సిగ్నల్
ఒకప్పుడంటే సినిమాల హవా నడిచేది గానీ ఇప్పుడు వెబ్ సిరీస్లు రాజ్యమేలుతున్నాయి. మూవీస్కి దీటుగా వీటిని తీస్తున్నారు. ఇంకా చెప్పాలంటే చాలామంది యాక్టర్స్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతున్నవి వెబ్ సిరీస్లే. అందుకే స్టార్ హీరోహీరోయిన్స్ కూడా ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. హీరోయిన్ కీర్తి సురేశ్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7'లో ఓడిపోతేనేం.. ఇప్పుడు శోభాశెట్టికి ఆ అవార్డ్) 23 ఏళ్ల క్రితమే మలయాళంలో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన కీర్తి సురేశ్.. 2013లో హీరోయిన్ అయిపోయింది. తెలుగు, తమిళ, మలయాళంలో దాదాపు పదేళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు బాలీవుడ్లోనూ పాగా వేయడానికి రెడీ అవుతోంది. 'తెరి' రీమేక్లో హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఇది రిలీజ్ కావడానికి ముందే ఓ వెబ్ సిరీస్తో అలరించనుంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ దీన్ని తీస్తోంది. కీర్తి సురేశ్తో పాటు రాధికా ఆప్టే మరో ముఖ్య పాత్రలో నటిస్తుండగా.. ధర్మరాజ్ శెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్కు 'అక్కా' టైటిల్ను ఖరారు చేశారు. త్వరలో హిందీతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. హీరోయిన్గా ఓ మాదిరి గ్లామర్ చూపిస్తూ వచ్చిన కీర్తి.. సెన్సార్ పరిధులు లేని ఈ సిరీస్లో ఎలా కనిపిస్తుందనేది ఇంట్రెస్టింగ్ విషయం. (ఇదీ చదవండి: మరోసారి ఆస్పత్రిలో చేరిన హీరో విజయ్కాంత్.. అదే కారణం?) -
కీర్తి సురేశ్ లేడీ ఒరియంటెడ్ ఫిలిం.. గ్లింప్స్ చూశారా?
వరుస విజయాలతో మంచి హుషారులో ఉంది హీరోయిన్ కీర్తి సురేశ్. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఈ ఏడాది బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో బోలెడన్ని సినిమాలున్నాయి. అందులో ఒకటి సైరన్.. హీరో జయం రవితో జోడీ కట్టిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఆమె నటించిన మరో చిత్రం రఘుతాత. ఇది లేడీ ఓరియంటెడ్ కథా చిత్రం. దీన్ని ప్రముఖ కన్నడ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ నిర్మించడం విశేషం. ఇది పిరియాడికల్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రంగా తెరకెక్కుతోంది. సుమన్కుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోందని తాజాగా విడుదల చేసిన చిత్ర గ్లింప్స్ను చూస్తే తెలుస్తోంది. ఇంతకు ముందు తోపుడు బండ్లు, రిక్షాలలో చిత్రాలను ప్రచారం చేసేవారు. ఈ చిత్ర గ్లింప్స్లోనూ.. తోపుడు బండిపై కీర్తి సురేశ్ పోస్టర్ అంటించి ప్రచారం చేస్తున్నట్లు చూపించారు. నటుడు ఎంఎస్.భాస్కర్, దేవదర్శిని, రవీంద్ర విజయ్, ఆనందసామి, రాజేశ్ బాలకృష్ణన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శాన్ సంగీతాన్ని, యామిని యజ్ఞమూర్తి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాతో కీర్తి సురేశ్ మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి! చదవండి: పల్లవి ప్రశాంత్కు 14 రోజుల రిమాండ్.. వారిద్దరిపై నమోదైన కేసు ఇదే -
జోస్ అలుక్కాస్ ‘నిత్యారా’ ఆవిష్కరణ
హైదారాబాద్: జోస్ అలుక్కాస్ ‘నిత్యారా’ పేరుతో కొత్త డైమండ్ కలెక్షన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ వజ్రాభరణాల శ్రేణిని సినీ నటి కీర్తీ సురేష్ ఆవిష్కరించారు. ‘‘అత్యుత్తమ వజ్రాలు, రత్నాలతో నిపుణులైన డిజైనర్లు, ప్రావీణ్యం కలిగిన కళాకారుల ‘నిత్యారా’ ఆభరణాలు రూపొందించారు. చీరలతో మాత్రమే కాకుండా ఆధునిక దుస్తులతో సైతం కలిసిపోయేలా అన్ని ఆధునిక హంగులతో ఆభరణాలు తీర్చిదిద్దారు’’ అని కంపెనీ తెలిపింది. ఈ కార్యక్రమంలో జోస్ ఆలుక్కాస్ ఎండీలు వర్ఘీస్ ఆలుక్కా, పాల్ ఆలుక్కా, జాన్ ఆలుక్కా పాల్గొన్నారు. -
ప్రయోగాలు చేసే సమయం ఇది!
‘‘నా కెరీర్లో ఎప్పుడూ విభిన్నమైన సినిమాలు, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించాలనుకుంటాను’’ అని హీరోయిన్ కీర్తీ సురేశ్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు.. ‘దసరా’, ‘మామన్నన్ ’ సినిమాల విజయాల తర్వాత కథ ఎంపికలో మీ ఆలోచనలు ఏవైనా మారాయా? అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు కీర్తీ సురేశ్ బదులిస్తూ.. ‘‘నేను నటించిన సినిమా హిట్టు అయిందనో, ఫ్లాప్ అయిందనో అప్పటికప్పుడు కథల ఎంపికలో నా ఆలోచనా విధానం మారదు. అయితే నేనెప్పుడూ భిన్నంగా చిత్రాలు చేయాలనుకుంటా. ఎందుకంటే నాకిది ప్రయోగాలు చేసే సమయం. అందుకు తగ్గట్టే కథలను ఎంపిక చేసుకుంటున్నా. నా వద్దకు వస్తున్న కథలు, పాత్రలు నా ఊహలకు, కలలకు మించిన విధంగా ఉంటున్నాయి. అలాంటప్పుడు మళ్లీ కథల గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఏముంటుంది? ఆ ప్రయాణాన్ని బాగా ఆస్వాదించాలనే దానిపైనే దృష్టిపెడితే సరిపోతుంది’’ అన్నారు. కాగా కీర్తీ సురేశ్ ప్రస్తుతం ‘సైరెన్ , రఘు తాత, రివాల్వర్ రీటా’ చిత్రాలు, ‘అక్క’ అనే వెబ్సిరీస్లో నటిస్తున్నారు. -
వెబ్ ఎంట్రీ
కీర్తీ సురేష్, రాధికా ఆప్టే ప్రధాన తారాగణంగా పీరియాడికల్ రివేంజ్ థ్రిల్లర్గా ‘అక్క’ వెబ్సిరీస్ రూపొందుతోంది. ధర్మరాజ్ శెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఆదిత్యా చోప్రా ఈ వెబ్సిరీస్ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ మొదలైనట్లు బాలీవుడ్ సమాచారం. ‘‘ఇందులో కీర్తీసురేష్, రాధికా ఆప్టే పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. వీక్షకులను ఆకట్టుకునేలా ఈ సిరీస్ సాగుతుంది’’ అనియూనిట్ పేర్కొంది. కాగా కీర్తీ సురేష్కు తొలి ఓటీటీ ప్రాజెక్ట్ ‘అక్క’. వరుణ్ధావ¯Œ హీరోగా నటిస్తున్న ఓ బాలీవుడ్ సిని మాలో Mీ ర్తి ఓ హీరోయి¯Œ గా నటిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తెలంగాణలో పోలింగ్ శాతం పెరిగింది: సీఈవో వికాస్రాజ్
ఓటు హక్కు వినియోగించుకున్న వల్లభనేని వంశీ ఫ్యామిలీ
ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదు
నార్వే కంపెనీతో హైదరాబాద్ సంస్థ ఒప్పందం
కుటుంబ సభ్యులతో తన ఓటు హక్కు వినియోగించుకున్న కొడాలి నాని
ఈసీ అధికారిక ప్రకటన ఇప్పటి వరకు నమోదైన పోలింగ్ శాతం
పల్నాడు: ఈవీఎంలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు
ఈవీఎంల భద్రతపై సుప్రియా సూలే సంచలన ట్వీట్
ఈ పిల్లాడు.. టీమిండియా నయా సూపర్స్టార్? గుర్తుపట్టారా?
వెల్లడైన సీబీఎస్ఈ ఫలితాలు: విద్యార్థులకు మోదీ సందేశం
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement