-
రియల్ తలైవికి.. రీల్ తలైవి నివాళి
చెన్నై: రియల్ తలైవికి రీల్ తలైవి నివాళుల ర్పించారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రతో రూపొందుతున్న తలైవిలో టైటిల్ రోల్ను పోషించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈనెల 10న విడుదలకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్లో భాగంగా శనివారం చెన్నైకు చేరుకున్న నటి కంగనా రనౌత్ స్థానిక మెరీనా తీరంలోని జయలలిత సమాధి వద్దకు చేరుకుని నివాళి అర్పించారు. అనంతరం ఎంజీఆర్, కరుణానిధి సమాధులను దర్శించుకున్నారు. -
అమ్మ స్మారకం జాప్యం.. సీఎం అసంతృప్తి
సాక్షి, చెన్నై: మెరీనా తీరంలో చేపట్టిన దివంగత సీఎం జయలలిత స్మారక మందిరం నిర్మాణ పనుల్లో జాప్యం జరగడంపై సీఎం పళనిస్వామి అసంతృప్తి వ్యక్తం చేశారు. సెప్టెంబరులోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చెన్నై మెరీనా తీరంలో ఎంజియార్ సమాధికి కూతవేటు దూరంలో అమ్మ జయలలిత సమాధి ఉంది. ఇక్కడికి ప్రతి రోజూ సందర్శకులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మ సమాధిని సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాంతాన్ని అత్యాధునిక హంగులతో స్మారక మందిరంగా తీర్చిదిద్దాలని సీఎం నిర్ణయించారు. ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లడంతోపాటు కోస్టల్ అనుమతులు అంటూ వివాదం రేగింది. దీంతో పనులకు ఆటంకాలు తప్పలేదు. రాష్ట్రంలో ఉన్నది తమ ప్రభుత్వమే కావడంతో పనుల్ని ముందుకు తీసుకెళ్లేందుకు అన్నాడీఎంకే నాయకులు సిద్ధం అయ్యారు. ఆ మేరకు 2018 మేలో పనులకు శ్రీకారం చుట్టారు. 2019 ఫిబ్రవరిలో జయలలిత తొలి జయంతి సందర్భంగా దీనిని ప్రారంభించాలని తొలుత సంకల్పించినా, ఆటంకాల రూపంలో పనుల్లో జాప్యం తప్పడం లేదు. (రాజుకుంటున్న ఎన్నికల వేడి) సెప్టెంబరు వరకు గడువు.... గత ఏడాది చివర్లో ముగించి, ఈ ఏడాది రెండో జయంతి సందర్భంగా ప్రారంభిద్దామనుకున్నా ఆటంకాలు తప్పలేదు. సమాధి పరిసరాలను సుందరంగా, అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దడం, జయలలిత జీవితం, సినిమా, రాజకీయ ఘనతను చాటేలా ఫొటో, వీడియో ప్రదర్శనను ఆ స్మారక మందిరంలో ఏర్పాటు చేస్తూ నిర్మాణాలు చేపట్టారు. ఆ పరిసరాల్ని ముస్తాబు చేసి నిర్మాణాలకు మెరుగులు దిద్దాల్సి ఉంది. ఫినిక్స్ పక్షి ఆకారంతో సమాధి స్మారకం నిర్మాణంతో అస్సలు సమస్య నెలకొని ఉంది. 15 మీటర్ల ఎత్తుతో, రెండు వైపులా ఆ పక్షి రెక్కలు 21 మీటర్ల ఉండేలా నిర్మాణం సాగుతోంది. ఐఐటీ మద్రాసు, అన్నా వర్సిటీ సాంకేతిక విభాగం సహకారంతో దుబాయ్ నుంచి తీసుకొచ్చిన పరికరాలతో ఈ ఫినిక్స్ పక్షి నిర్మాణాన్ని రూపొందిస్తున్నారు. పలు కారణాల వల్ల ఆగస్టు మొదటి వారానికి దీన్ని ప్రభుత్వానికి అప్పగించలేని పరిస్థితి. సెప్టెంబరు చివరి వరకు గడువు ఇవ్వాలని అధికారులు సీఎం పళనిస్వామి దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా జాప్యం, కరోనా తదితర సమస్యల వల్ల నిర్మాణ పనుల వ్యయం మరో పది కోట్లకు పెరిగినట్టు సమాచారం. వీటిని పరిశీలించిన సీఎం అసంతృప్తిని వ్యక్తం చేశారు. సెప్టెంబరు చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. డిసెంబరులో జయలలిత వర్ధంతి సందర్భంగా ఈ స్మారకం ప్రారంభం లక్ష్యంగా ప్రభుత్వం ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఆగమేఘాల మీద పనులు సాగించేందుకు ప్రజా పనుల శాఖ వర్గాలు ఉరకలు తీస్తున్నాయి. మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు రానున్న నేపథ్యంలో అమ్మ స్మారకం అన్నాడీఎంకే వర్గాలకే కాకుండా ప్రజలందరికీ ప్రత్యేక ఆకర్షణగా నిలవాలన్న కాంక్షతో సీఎం ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. అలాగే పోయెస్ గార్డెన్ వేదా నిలయంకు కొత్త మెరుగులకు తగ్గ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. -
మెరీనా తీరంలో బైక్ రేసింగ్.. ఇద్దరు మృతి
చెన్నై : తమిళనాడులోని చెన్నై మెరీనా తీరంలో బైక్ రేసర్ల హల్చల్ చేశారు. బీచ్ రోడ్డులో అర్ధరాత్ని దాటక పలువురు యువకులు బైక్ రేసులు నిర్వహించారు. ఈ క్రమంలో బైక్పై నుంచి జారిపడ్డ ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. అయితే బైక్ రేస్లకు అనుమతి లేకపోయినప్పటికీ.. నిబంధనలను అతిక్రమిస్తూ మెరీనా తీరంలో దొంగచాటుగా బైక్ రేసుల నిర్వహించటం పరిపాటిగా మారింది. వీటిపై స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికైనా అధికారులు స్పందించి బైక్ రేస్లు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మెరీనాలో మూడు మృతదేహాలు
తిరువొత్తియూరు: చెన్నై మెరీనా తీరంలోని శ్రామికుల విగ్రహం వెనుక ఆదివారం ఉదయం 7.30 గంటలకు గుర్తు తెలియని సుమారు 27 సంవత్సరాలు వయసు కలిగిన యువకుని మృతదేహం ఒడ్డుకు చేరింది. తరువాత ఉదయం 11.15 గంటలకు ఎంజీఆర్ సమాధి వెనుక భాగంలో జేఎన్ఎన్ కళాశాలలో చదువుతున్న కన్నన్ మృతదేహం ఒడ్డుకు చేరింది. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 2.30 సమయంలో స్నేహితుడు జయకుమార్తో స్నానం చేస్తున్న సమయంలో నీటిలో గల్లంతైన జయచంద్రన్ మృతదేహం ఒడ్డుకు చేరింది. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న అన్నాసమాధి పోలీసులు పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 8 గంటల వ్యవధిలో 3 మృతదేహాలు ఒడ్డుకు చేరడం పర్యాటకులను దిగ్భ్రాంతికి గురి చేసింది. సముద్రతీరంలో గస్తీ చేస్తున్న పోలీసులు కొన్ని రోజులుగా రాకపోవడంతో ఈ సంఘటనలు జరుగుతున్నాయని పలువురు వాపోయారు. -
ముద్దు ఎంత పని చేసింది...
చెన్నై : ప్రియురాలు సవాల్ విసిరింది. అలాంటి ఇలాంటి ఛాలెంజ్ కాదు. తాను చెప్పినట్లు వస్తే ముద్దు ఇస్తానంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇంకేముంది... ప్రేయసి ముద్దు కోసం ప్రియుడు సై అన్నాడు. అమ్మడు చెప్పినట్లే సిద్ధమై అతగాడు ఆశగా ముద్దు కోసం వచ్చాడు. తీరా అయ్యగారి వ్యవహారం అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీంతో ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే అన్నట్లు... ఆ యువకుడు పోలీసుల విచారణలో అసలు విషయం బయటపెట్టాడు. ఈ సందర్భంగా చెన్నైలోని రాయపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని పట్టాభిరామ్ తండురై గ్రామం పల్లవీధికి చెందిన శక్తివేల్ (22) అన్నాసాలైలోని ఐటీఐలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఐసీఐసీఐ బ్యాంక్ ట్రస్ట్ తరఫున ఉద్యోగ శిక్షణలో ఉండగా అక్కడే ఉన్న ఓ యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఆమెను ప్రేమికుల రోజున ముద్దు ఇవ్వమని అడగగా అందుకు అంగీకరించలేదు. ముద్దు కావాలంటే బురఖా ధరించి రాయపేట నుంచి మెరీనా బీచ్ వరకు రావాలని పందెం కాసింది. అలా చేస్తే ముద్దు ఇస్తానని చెప్పడంతో శక్తివేల్ బురఖా వేసుకుని ప్రియురాలి ఇంటికి వచ్చిన అతడు.. ఆ తర్వాత ఆమెతో మెరీనా బీచ్కు వెళ్లాడు. అయితే శక్తివేలు నడకతో పాటు, కాళ్లకు మగవాళ్ల ధరించే స్లిప్పర్స్, వీటితో పాటు అయ్యగారు వ్యవహారం తేడాగా ఉండటంతో... అనుమానం వచ్చిన స్థానికులు అతడిని పట్టుకుని చితకబాది, పోలీసులకు అప్పగించారు. పోలీసులు శక్తివేల్ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
వాట్సప్లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Advertisement