breaking news
Narendra Modi
-
తెలంగాణ బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్
ఢిల్లీ: తెలంగాణ బీజేపీ ఎంపీలు మరింత యాక్టివ్గా ఉండాలంటూ వారికి ప్రధాని నరేంద్ర మోదీ క్లాస్ పీకారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించాలన్నారు. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశం మిస్సయింది. అది నాకు చాలా ఆవేదన కలిగించిందంటూ ఎంపీలతో మోదీ అన్నారు.తెలంగాణలో పార్టీ ఎందుకు వెనుకబడింది. 8 మంది ఎంపీలు ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా ఎందుకు ఎదగలేకపోతున్నారు? అంటూ ప్రధాని మోదీ ప్రశ్నలు గుప్పించారు. ప్రజల్లో పార్టీకి ఆదరణ ఉన్నా నాయకులు పనిచేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. గ్రూపు తగాదాలు వీడి ఐకమత్యంతో పని చేయాలన్నారు. రాష్ట్రంలో పార్టీ బలపడేలా దూకుడుగా పని చేయాలని సూచించారు.ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండండి. నిత్యం ప్రజలతో నిరంతర సంబంధాలు ఉండాలంటూ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్లో ఎంపీలకు ప్రధాని మోదీ హితబోధ చేశారు.కాగా, ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ విందు ఏర్పాటు చేశారు. ప్రధాని అధికారిక నివాసంలో విందు కార్యక్రమం జరగనుంది. విందు ఏర్పాట్లను కేంద్ర మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. ఎంపీలను సమన్వయం చేసే బాధ్యతలు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుకి అప్పగించారు.విందు కార్యక్రమంలో 54 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్కు ఒక కేంద్రమంత్రి కూర్చునే ఏర్పాట్లు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం విందు కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రధాని.. ఎన్డీఏ భాగస్వామి పక్షాల మధ్య మరింత సమన్వయం, ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్లడం తదితర అంశాలపై మోదీ మాట్లాడనున్నారు. -
సీఐసీ ఎంపికపై... రాహుల్ అసమ్మతి
న్యూఢిల్లీ: నూతన ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) ఎంపిక ప్రక్రియ తుది అంకానికి చేరింది. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని త్రిసభ్య కమిటీ బుధవారం ఢిల్లీలో భేటీ అయింది. సీఐసీతో పాటు మరో 8 మంది సమాచార కమిషనర్ల పేర్లను ఖరారు కూడా ఈ భేటీలో చేసినట్టు సమాచారం. అయితే ఈ పేర్లను కమిటీ సభ్యుడైన విపక్ష నేత రాహుల్ గాంధీ వ్యతిరేకించారు. ఈ మేరకు తన అసమ్మతితో లేఖ కూడా సమర్పించారు. అభ్యర్థులకు సంబంధించి రాహుల్ మరిన్ని వివరాలు కోరినట్టు సమాచారం. వారి ఎంపికకు అనుసరించిన ప్రాతిపదికను కూడా ఆయన ప్రశ్నించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భేటీలో కమిటీ సభ్యుడైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు. సమాచార హక్కు చట్ట సంబంధిత వివాదాల పరిష్కారానికి అంటున్న అపెలెట్ విభాగమైన సీఐసీలో ప్రస్తుతమిద్దరే కమిషనర్లున్నారు. సీఐసీతో పాటు 8 ఖాళీలున్నాయి. ఈ విషయమై సుప్రీంకోర్టు పదేపదే కేంద్రానికి తలంటిన నేపథ్యంలో ఖాకీల భర్తీ ప్రక్రియ వేగం పుంజుకుంది. సీఐసీ పదవి కోసం 81 మంది, కమిషనర్ పోస్టులకు 161 మంది దరఖాస్తు చేసుకున్నారు. -
అది అతిపెద్ద దేశద్రోహం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంతో కలిసి మోదీ సర్కార్ ఓట్ల చోరీకి పాల్పడుతూ భారత్లోనే అతిపెద్ద దేశద్రోహానికి ఒడిగట్టిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్గాంధీ తీవ్రస్థాయి విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎన్నికల సంస్కరణలు అంశంపై మంగళవారం లోక్సభలో చర్చ సందర్భంగా విపక్షాల తరఫున కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో విపక్షనేత హోదాలో రాహుల్గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఈసీపై, మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్పై విమర్శల జడి కురిపించారు. అతిపెద్ద నేరమేదంటే.. అది ఇదే‘‘అతిపెద్ద దేశద్రోహ నేరమంటూ ఉందంటే అది ఓట్ల చోరీనే. మీరు చేసిన ‘ఓట్ల చోరీ’ స్థాయి అతిపెద్ద నేరం దేశంలో ఇంతవరకు జరగలేదు. నిజమైన పౌరుల వాస్తవిక ఓటును హరించి దేశ ప్రజాస్వామ్య వస్త్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చేస్తున్నారు. నవభారత్ను విధ్వంసం చేస్తున్నారు. భారత్ అనే భావనను కూలదోస్తున్నారు. లోక్సభలో అటు పక్క అధికార కుర్చీల్లో కూర్చున్న వాళ్లంతా కలిసి దేశ వ్యతిరేక దుశ్చర్యలు తెగిస్తున్నారు’’ అని అన్నారు.ఈవీఎం సంగతేంటి?‘‘ఈవీఎంతో మీరెన్నో గిమ్మిక్కులు చేస్తున్నారు. మాకూ ఈవీఎంను తనిఖీచేసే అవకాశం ఇవ్వండి. మా సాంకేతిక నిపుణులు సైతం ఈవీఎంల పనిపడతారు. అసలు ఈవీఎంలోపల ఏం పెట్టా్టరో తేలుస్తారు. ఇప్పటిదాకా మాకు ఈవీఎంలపై కనీస హక్కు లేదు’’ అని రాహుల్ అన్నారు. ఎలక్షన్ కమిషన్లనుద్దేశిస్తూ రాహుల్ పలు వ్యాఖ్యలుచేశారు. ‘‘వాళ్లకో విషయం చెబుతున్నా. ఇప్పుడున్న సవరణ చట్టాన్ని భవిష్యత్తులో మేం అధికారంలోకి వచ్చాక మళ్లీ మారుస్తాం. అధికారంలో ఉన్నప్పుడు కమిషనర్లు తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు వాళ్లనే బాధ్యులను చేస్తాం. కారకుల భరతం పడతాం’’ అని రాహుల్ పరోక్షంగా హెచ్చరించారు. మళ్లీ బ్రెజిల్ యువతి ప్రస్తావనహరియాణాలో బ్రెజిల్ యువతి పేరు ఓటర్ల జాబితాలో 22 సార్లు వచ్చిందన్న అంశాన్ని రాహుల్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘బ్రెజిల్ యువతి మాత్రమేకాదు ఎంతో మందిపేర్లు ఇలా హరియాణా ఓటర్ల జాబితాలో పలుమార్లు పునరావృతమయ్యాయి. ఒక మహిళ పేరు ఏకంగా 200 సార్లు ఉంది. ఇవన్నీ చూశాక హరియాణా ఎన్నికలు చోరీ అయ్యాయనేది సుస్పష్టం. ఇది ఎలక్షన్ కమిషన్ కనుసన్నల్లోనే జరిగింది’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.‘‘బిహార్లో ప్రతిష్టాత్మకంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే చేపట్టామని ఈసీ ఘనంగా చెప్పుకుంది. మరి అలాంటప్పుడు మళ్లీ 1.2 లక్షల డూప్లికేట్ ఫొటోలు ఎలా తుది జాబితాలో ప్రత్యక్షమయ్యాయి? ఈ ప్రశ్నకు ఈసీ దగ్గర సూటి సమాధానమే లేదు’’ అని రాహుల్ ఎద్దేవాచేశారు.మనది గొప్పదైన ప్రజాస్వామ్యంఅందరూ మనది అతిపెద్ద ప్రజాస్వామ్యం అంటారు. వాస్తవానికి మనది గొప్పదైన ప్రజాస్వామ్యం. అమెరికా తమది పురాతన ప్రజాస్వామ్యం అంటుంది. నిజానికి మనదే గొప్పది. అత్యధిక మంది ఓటర్లు, భిన్న ప్రాంతాలు, మతాలు, భాషలు, రాష్ట్రాల సమ్మేళనంగా భారత ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. ప్రజలందర్నీ ఒక్కతాటి మీదకు తెస్తున్న ఇదే ప్రజాస్వామ్యభావనకే బీజేపీ తూట్లు పొడుస్తోంది. ధ్వంసం చేస్తున్నామని వాళ్లకూ తెలుసు. ఆనాడు గాంధీజీని ఆర్ఎస్ఎస్ వ్యక్తి నాథూరాం గాడ్సే మూడు బుల్లెట్లు ఛాతీలో దింపి మహాత్ముడి ప్రాణాలను బలితీసుకున్నాడు.బీజేపీ వాళ్లు నాటి చేదు నిజాన్ని ఒప్పుకోవాల్సిందే. గాంధీజీ హత్యతో అక్కడితో ఆ ఘోర క్రతువు ఆగిపోలేదని నేడు ఇప్పుడు నాకు అనిపిస్తోంది. ఓటు చోరీతో సాధించిన అధికారంతో రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ ఆర్ఎస్ఎస్ గుప్పిటపట్టే దుస్సాహసానికి తెరతీసింది. నాడు గాంధీజీ హత్యోదంతం తొలి మెట్టు అయితే తర్వాతి మెట్టు ఇప్పటి రాజ్యాంగబద్ధ వ్యవస్థను కబళించడం’’ అని అన్నారు. ‘‘ ఓటు చోరీ అనేది అతిపెద్ద దేశద్రోహం. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసంచేసేందుకు బీజేపీ, ఈసీ మూకుమ్మడిగా బయల్దేరాయి. ప్రజల గొంతుకను తొక్కిపెడుతున్నాయి’’ అని తర్వాత ‘ఎక్స్’లో రాహుల్ ఒక పోస్ట్ పెట్టారు.3 ప్రశ్నలకు సమాధానం చెప్తారా?చర్చ సందర్భంగా మోదీ సర్కార్పై రాహుల్ మూడు సూటి ప్రశ్నలను సంధించారు.1.‘‘ఎలక్షన్ కమిషన్ల నియామక ప్యానెల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు తప్పించారు?. సీజేఐను తొలగించడానికి వెనుక మతలబు ఏంటి? సీజేఐ అంటే మాకు పూర్తి విశ్వాసం ఉంది. అలాంటి సీజేఐకు ఎలక్షన్ కమిషన్ నియామక ప్రక్రియ నుంచి ప్రభుత్వం ఏ కారణంతో పక్కకు తప్పించింది?. ఆనాడు ఎలక్షన్ కమిషన్ల ఎంపిక సంబంధ భేటీకి నేనూ హాజరయ్యా. ఇటు పక్క నేను కూర్చున్నా. అటు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆసీనులయ్యారు. అక్కడ నా వాదనలకు వీసమెత్తయిన విలువ లేకుండా పోయింది. వీళ్లిద్దరు ఏం ఆలోచించారో అది మాత్రమే ఆచరణలోకి వచ్చింది. కేవలం ఫలానా వ్యక్తులు మాత్రమే ఎలక్షన్ కమిషనర్లుగా రావాలని ఎందుకు ప్రధాని, హోం మంత్రి అంతగా దృష్టిసారిస్తున్నారు?2.‘‘దేశ చరిత్రలో గతంలో ఏ ప్రధాని చేయనట్లుగా మోదీ 2023 డిసెంబర్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్లకు నేర విచారణ నుంచి మినహాయింపు కల్పిస్తూ చట్టసవరణ తీసుకొచ్చారు. దీంతో ఎలక్షన్ కమిషనర్లు ఈసీలో విధుల్లో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు పక్షపాతంతో కూడినవి అని తేలినా సరే వాళ్లపై ఎలాంటి విచారణ మొదలుపెట్టలేని దురవస్థ ఏర్పడింది. వాళ్లపై కేసుల ఈగ వాలకుండా మోదీ రక్షణ కల్పించారు. కమిషనర్లకు ఇంతటి రక్షణను ప్రధాని, హోం మంత్రి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది?3.‘‘ఎన్నికలు పూర్తయిన కేవలం 45 రోజులకే సంబంధిత సీసీటీవీ ఫుటేజీని ధ్వంసంచేయాలంటూ మోదీ సర్కార్ చట్టాన్నే మార్చేసింది. అంత అవసరం ఏమొచ్చింది?. ఇది డేటాకు సంబంధించిన అంశమంటూ ప్రభుత్వం తప్పించుకోవాలని చూసింది. ఇది డేటాకు సంబంధించిన అంశం కాదు. దీనికి ఎన్నికల చోరీతో సంబంధముంది. ఎన్నికలకు నెల రోజుల ముందే మెషీన్ చదవగలిగే ఓటర్ల జాబితాను రాజకీయపక్షాలకు అందివ్వాల్సిందే. సీసీటీవీ ఫుటేజీ తొలగింపు చట్టాన్ని సవరించాల్సిందే. అసలు సీసీటీవీ ఫుటేజీ డిలీట్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? -
భారత్లో భారీ పెట్టుబడి!: సత్య నాదెళ్ల కీలక ప్రకటన
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారతదేశంలో భారీ పెట్టుబడి పెట్టనుంది. కృత్రిమ మేధస్సు సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి 17.5 బిలియన్ డాలర్లు (రూ. 1.5 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ తన ఎక్స్ వేదికగా ప్రకటించారు. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సత్య నాదెళ్ల.. ఈ విషయాన్ని వెల్లడించారు.భారతదేశ ఏఐ అవకాశాలపై స్ఫూర్తిదాయకమైన సంభాషణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. దేశ ఆశయాలకు మద్దతుగా, మైక్రోసాఫ్ట్ అతిపెద్ద పెట్టుబడి. ఏఐ ఆధారిత భవిష్యత్తు కోసం.. భారతదేశానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, సార్వభౌమ సామర్థ్యాలను నిర్మించడంలో సహాయపడటానికి నిబద్దతతో ఉందని సత్య నాదెళ్ల తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.''ఏఐ విషయంలో.. ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. సత్య నాదెళ్లతో చర్చలు జరిగాయి. ఆసియాలో ఇప్పటివరకు అతిపెద్ద పెట్టుబడి పెట్టే ప్రదేశం ఇండియా కావడం చాలా ఆనందంగా ఉంది'' అని ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేశారు.When it comes to AI, the world is optimistic about India! Had a very productive discussion with Mr. Satya Nadella. Happy to see India being the place where Microsoft will make its largest-ever investment in Asia. The youth of India will harness this opportunity to innovate… https://t.co/fMFcGQ8ctK— Narendra Modi (@narendramodi) December 9, 2025 -
Winter Session : వందేమాతరం చర్చపై ప్రధాని మోదీ వర్సెస్ ప్రియాంక వాద్రా
-
ఎస్ఐఆర్పై లోక్సభలో వాడీవేడీగా చర్చ
Parliament Session Updates.. లోక్సభలో ఎస్ఐఆర్పై చర్చ.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే..ఎన్నికల సంస్కరణలపై కేంద్రం గొప్పలు చెబుతోంది: రాహుల్ గాంధీక్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదు: రాహుల్ గాంధీఆర్ఎస్ఎస్పై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలుఆర్ఎస్ఎస్ అన్ని వ్యవస్థలనూ తన గప్పిట్లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తోంది: రాహుల్ గాంధీఎన్నికల వ్యవస్థ ఆర్ఎస్ఎస్ చేతుల్లోనే ఉందిరాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీల అభ్యంతరంరాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజురాహుల్ గాంధీ అనవసరంగా పార్లమెంట్లో ఆర్ఎస్ఎస్ టాపిక్ లేవనెత్తుతున్నారు: కిరెణ్ రిజిజురాహుల్ వ్యాఖ్యలతో బీజేపీ-విపక్ష ఎంపీల పోటాపోటీ నినాదాలు.. స్వల్ప ఉద్రిక్తతవిపక్షాల తీరుపై స్పీకర్ ఆగ్రహంస్పీకర్ చెయిర్ను మీరు బెదిరించలేరు: స్పీకర్ ఓం బిర్లానేను ఏదీ తప్పుగా మాట్లాడలేదు: రాహుల్ గాంధీనేను ఆరోపణలు చేయడం లేదు.. అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నా: రాహుల్ గాంధీఎన్నికల వ్యవస్థ, సీబీఐ, ఈడీలను ప్రభుత్వం తన గుప్పిట పెట్టుకుంది: రాహుల్ గాంధీసీబీఐ చీఫ్ను సీజేఐ ఎందుకు ప్రతిపాదించడం లేదు?: రాహుల్ గాంధీవిద్యావ్యవస్థను కూడా ఆర్ఎస్ఎస్ తన గుప్పిట పెట్టుకుంది : రాహుల్ గాంధీఇప్పటికే విద్యా వ్యవస్థను మార్చేశారు: రాహుల్ గాంధీమెరిట్తో సంబంధం లేకుండా యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తున్నారు: రాహుల్ గాంధీప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం ఈసీని అస్త్రంగా ఉపయోగించకుంటున్నారు: రాహుల్ గాంధీఎన్నికల సీసీ ఫుటేజీని ధ్వంసం చేశారు: రాహుల్ గాంధీఉత్తర ప్రదేశ్, హర్యానాలో ఓట్చోరీ జరిగింది: రాహుల్ గాంధీఫేక్ ఓట్లపై ఈసీ క్లారిటీ కూడా ఇవ్వలేదు: రాహుల్ గాంధీఆర్ఎస్ఎస్ వ్యతిరేకులను ప్రభుత్వం టార్గెట్ చేసింది: రాహుల్ గాంధీ లోక్సభలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై చర్చప్రసంగిస్తున్న విపక్ష నేత రాహుల్ గాంధీ సర్ చర్చలో పాల్గొన్న ఎంపీ మిథున్రెడ్డిఎస్ఐఆర్పై లోక్సభలో చర్చచర్చలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డిఏపీలో జరిగిన ఎన్నికల తీరుపై ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయిఅనేక నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్పై ప్రజలకు అనేక డౌట్లు ఉన్నాయిఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని అనేకమంది టెక్నికల్ ఎక్స్పర్ట్లు చెబుతున్నారుపేపర్ బ్యాలెట్ సిస్టంలో ఎన్నికలు నిర్వహించాలిపేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తే అనుమానాలన్నీ తొలగిపోతాయిఅందరికీ సౌకర్యంగా ఉంటే, ఎస్ఐఆర్ తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదుఅన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలివెబ్ కాస్టింగ్ ఫుటేజీ అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో తీసుకురావాలిఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలనేదే మా అభిమతంఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సా.6 గంటల తర్వాత అకస్మాత్తుగా ఓటింగ్ శాతం పెరిగిందిసాయంత్రం 6.. తర్వాత 51 లక్షల ఓట్లు రికార్డయ్యాయి మేము ఇచ్చిన ఫిర్యాదుల పైన ఈసీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదువిజయనగరం పార్లమెంటులో కౌంటింగ్ సమయంలో 99 శాతం, పోలింగ్ సమయంలో 60 శాతం చార్జింగ్ ఉందిఈవీఎంలో చార్జింగ్ ఎలా పెరిగిందని అడిగితే సమాధానం లేదువివి ప్యాట్ స్లిప్పులు అడిగితే అప్పటికే తగలబెట్టామని చెప్పారువెరిఫికేషన్ కోసం ఈవీఎంలు అడిగితే వేరే వాటిని ఇచ్చారుఈసీ అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఫిర్యాదులు చేసిన ఉపయోగం ఉండడం లేదుహిందూపురం పార్లమెంట్ ఎన్నికల్లో ఒక బూత్ లో మా పార్టీ కికు 472 ఓట్లు వస్తే, అక్కడే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ఒక్క ఓటు మాత్రమే వచ్చిందిఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని ఎలన్ మస్క్ సహా అనేక మంది నిపుణులు అంటున్నారుఅభివృద్ధి చెందిన దేశాల్లో సైతం పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తున్నారుపేపర్ బ్యాలెట్ సిస్టంలో ఎన్నికలు నిర్వహించాలిపేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తే అనుమానాలన్నీ తొలగిపోతాయిఅందరికీ సౌకర్యంగా ఉంటే, ఎస్ఐఆర్ తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదుఅన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలివెబ్ కాస్టింగ్ ఫుటేజీ అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో తీసుకురావాలిఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలనేదే మా అభిమతం SIRపై లోక్సభలో ప్రత్యేక చర్చఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) అమలుపై కాంగ్రెస్ అభ్యంతరంఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనే ఎస్ఐఆర్ చేస్తున్నారు: కాంగ్రెస్ఈవీఎంలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి: కాంగ్రెస్ఈసీల నియామక ప్రక్రియ చేపట్టిండి: మనీశ్ తివారీఎన్నికల సంస్కరణలపై లోక్సభలో ప్రత్యేక చర్చ.కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ కామెంట్స్..బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగాలి.అభివృద్ధి చెందిన దేశాల్లో పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయి.ఎన్నికల సంస్కరణల్లో తొలుత జరగాల్సింది ఈసీల నియామక ప్రక్రియ.ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయండి.ప్రస్తుత ముగ్గురు సభ్యులతో పాటు రాజ్యసభలో విపక్ష నేత సీజేఐను చేర్చండి. Congress MP Manish Tewari speaks in Lok Sabha during debate on electoral reforms He says, "...The first reform that should happen is an amendment to the law governing the selection of members of the Election Commission. My suggestion is that LoP Lok Sabha and Chief Justice of… https://t.co/qt6rVkTu4d pic.twitter.com/ZZiLL1DzfN— ANI (@ANI) December 9, 2025ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను వాడాలి: అఖిలేష్ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో ప్రసంగించిన సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్అఖిలేష్ కామెంట్స్..ఎలక్ట్రానిక్ పరికరాల వాడకంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ప్రతిపక్షాలకు అనేక అనుమానాలు ఉన్నాయి.బ్యాలెట్ పేపర్లను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించాలిSpeaking in Lok Sabha on electoral reforms, Samajwadi Party MP Akhilesh Yadav says, "Elections should be conducted using ballot papers because many questions are being raised on the use of electronic devices." pic.twitter.com/QCO063kGIN— ANI (@ANI) December 9, 2025ప్రియాంక గాంధీ వ్యాఖ్యలకు అమిత్ షా కౌంటర్..రాజ్యసభలో వందేమాతరం 150వ వార్షికోత్సవంపై ప్రత్యేక చర్చ.కొందరు బెంగాల్ ఎన్నికల కోసమే వందేమాతరంపై చర్చిస్తున్నారని అంటున్నారు.బెంగాల్ ఎన్నికలకు చూపిస్తూ వందేమాతరాన్ని తక్కువ చేసి మాట్లాడొద్దు.కాలంతో సంబంధం లేకుండా ‘వందేమాతరం’ దేశ ప్రజల్లో ఎప్పటికీ స్ఫూర్తి నింపుతూనే ఉంటుంది.ఆ గేయానికి గతంలోనూ ఎంతో ఔచిత్యం ఉంది.. భవిష్యత్తులోనూ ఉంటుంది. రామ్మోహన్ నాయుడు సమాధానంపై విపక్షాల అసంతృప్తిఇండిగో విమానాల రద్దుపై లోక్సభలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటనరామ్మోహన్ నాయుడు సమాధానంపై విపక్షాల అసంతృప్తితమ ప్రశ్నలకు జవాబు చెప్పాలని డిమాండ్ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో చర్చ..చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ.రాజీవ్ గాంధీ హయాంలో కీలక ఎన్నికల సంస్కరణ జరిగాయి.వన్ నేషన్-వన్ ఎలక్షన్ గురించి చర్చ జరుగుతోంది. #WinterSession2025 लोकसभा में ''ELECTION REFORMS'' पर चर्चा शुरु I#LokSabha @LokSabhaSectt @loksabhaspeaker #ParliamentWinterSession2025 Watch Live : https://t.co/16ABiCqhz5 pic.twitter.com/hICFXNVRot— SansadTV (@sansad_tv) December 9, 2025 ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..ప్రజలను వేధించడానికి నిబంధనలు వాడకూడదువ్యవస్థలను మెరుగుపరిచేందుకే నిబంధనలుఇండిగో సంక్షోభంపై ప్రధాని మాట్లాడారని వెల్లడించిన కేంద్రమంత్రి కిరణ్ రిజిజుఎన్డీయే పక్ష సమావేశ వివరాలను వెల్లడించిన కిరణ్ రిజిజునేడు లోక్సభలో ఎస్ఐఆర్పై చర్చవిపక్షాల తరఫున చర్చను ప్రారంభించనున్న రాహుల్ గాంధీఎస్ఐఆర్ పై చర్చ జరపాలని గత వర్షాకాల సమావేశాల నుంచి డిమాండ్ చేస్తున్న విపక్షాలుఎట్టకేలకు ఎన్నికల సంస్కరణలు అనే అంశం కింద ఎస్ఐఆర్ చర్చకు ఒప్పుకున్న ప్రభుత్వంఎస్ఐఆర్తో ఓటు చోరీ జరుగుతుందని ఆరోపిస్తున్న విపక్ష పార్టీలుఎస్ఐఆర్తో బీఎల్వోలు ఆత్మహత్య చేసుకుంటున్నారని, పని భారం పెరుగుతుందని విపక్షాల ఆరోపణలుపెద్ద ఎత్తున ఓటర్లను తొలగించేందుకే ఎస్ఐఆర్ చేపట్టారని ఆరోపణలుప్రభుత్వం తరఫున జవాబు చెప్పనున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్వైఎస్సార్సీపి తరఫున చర్చలో పాల్గొననున్న ఎంపీ మిథున్ రెడ్డిరాజ్యసభలో వందేమాతరంపై చర్చనేడు రాజ్యసభలో వందేమాతరంపై చర్చవైఎస్సార్సీపీ తరఫున చర్చలో పాల్గొననున్న ఎంపీ వైవీ సుబ్బారెడ్డి.కొనసాగుతున్న ఎన్డీయే సమావేశం..కొనసాగుతున్న ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంసమావేశానికి హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భాగస్వామ్య పక్షాలు ఎంపీలుఎస్ఐఆర్ పై చర్చ నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న సమావేశం#WATCH | Delhi | NDA leaders felicitate PM Narendra Modi during the NDA Parliamentary Party meeting. pic.twitter.com/di7IGDBozP— ANI (@ANI) December 9, 2025 -
బంకిం దా కాదు.. బంకిం బాబు అనండి
న్యూఢిల్లీ: లోక్సభలో సోమవారం వందేమాతరంపై ప్రత్యేక చర్చ సందర్భంగా ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. వందేమాతర గీత రచయిత బంకించంద్ర చటర్జీ పేరును ప్రధాని నరేంద్ర మోదీ ‘బంకిం దా’అని అని పలికారు. దీనిపై బెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సౌగతా రాయ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. బంకిం దా కాదు.. బంకిం బాబు అనండి అంటూ సూచించారు. బంకించంద్ర చటర్జీ పేరు చివర గౌరవ సూచకంగా బాబు అనే మాట చేర్చాలని చెప్పారు. అందుకు మోదీ స్పందింస్తూ... ‘‘బంకిం బాబు అని చెబుతా. మీకు కృతజ్ఞతలు. మీ సెంటిమెంట్ను గౌరవిస్తున్నా’’అని బదులిచ్చారు. మిమ్నల్ని దాదా అని సంబోధించవచ్చా? అందుకు మీకేమైనా అభ్యంతరమా? అంటూ సౌగతా రాయ్ని సరదాగా ప్రశ్నించారు. దా అంటే బెంగాలీ భాషలో అన్న అని అర్థం. మరింత గౌరవంగా బాబు అని అంటుంటారు. బిహార్లో గెలిచాం.. ఇక బెంగాల్ పనిపడతాం వందేమాతరంపై చర్చను ప్రారంభించడానికి ప్రధాని మోదీ లోక్సభలోకి ప్రశిస్తుండగా, అప్పటికే సభలో ఉన్న బీజేపీ ఎంపీలు బిగ్గరగా నినాదాలు చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు. ‘బిహార్లో గెలిచాం.. ఇక బెంగాల్ పని పడతాం’అంటూ నినదించారు. అలాగే వందేమాతరం అంటూ మోదీకి అభివాదం చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరుగబోతున్నాయి. -
నెహ్రూ ప్రతిష్టను ఎవరూ దెబ్బతీయలేరు
న్యూఢిల్లీ: చరిత్రను తిరగరాయడానికి ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని లోక్సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ విమర్శించారు. వందేమాతరంపై చర్చకు రాజకీయ రంగు రుద్దడానికి ఆరాటపడ్డారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఏ అంశంపై చర్చ జరిగినా జవహర్లాల్ నెహ్రూ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారో చెప్పాలని ప్రధాని మోదీని ప్రశ్నించారు. బీజేపీ ఎంతగా ప్రయత్నించినా, ఎంత దు్రష్పచారం చేసినా ఈ దేశానికి నెహ్రూ అందించిన సేవలు, ఆయన సాధించిన ఘనతలపై చిన్న మరక కూడా అంటించలేదని తేల్చిచెప్పారు. నెహ్రూ ప్రతిష్టను ఎవరూ దెబ్బతీయలేరని పేర్కొన్నారు. వందేమాతరం గీతానికి మహోన్నత స్థానాన్ని, జాతీయ గీతం హోదాను కల్పించింది కాంగ్రెస్ పారీ్టయేనని గుర్తుచేశారు. వందేమాతరం 150వ వార్షికోత్సవంపై సోమవారం లోక్సభలో జరిగిన చర్చలో గౌరవ్ గొగోయ్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఎక్కడ ఏం అంశంపై మాట్లాడినా నెహ్రూను, కాంగ్రెస్ను నిందించడం ఒక అలవాటుగా మార్చుకున్నారని మండిపడ్డారు. ఆపరేషన్ సిందూర్పై పార్లమెంట్లో జరిగిన చర్చలో నెహ్రూ పేరును 14 సార్లు, కాంగ్రెస్ పేరును 50 సార్లు ప్రస్తావించారని గుర్తుచేశారు. ఇప్పుడు వందేమాతరంపై చర్చలో నెహ్రూ పేరును 10 సార్లు, కాంగ్రెస్ పేరును 26 సార్లు తీసుకొచ్చారని ఆక్షేపించారు. 2022లో రాష్ట్రపతి ప్రసంగంపై జరిగిన చర్చలో మోదీ నోటివెంట నెహ్రూ ప్రస్తావన 15 సార్లు వచ్చిందన్నారు. 2020లో జరిగిన చర్చలో 20 సార్లు నెహ్రూ ప్రస్తావన తెచ్చారని వెల్లడించారు. మోదీ పాలనలో విభజించు, పాలించు విధానం నిజానికి వందేమాతరం పూర్తి గీతాన్ని ముస్లిం లీగ్ వ్యతిరేకించిందని గౌరవ్ గొగోయ్ వెల్లడించారు. వారి ఒత్తిళ్లను పట్టించుకోకుండా వందేమాతరం గీతాన్ని జాతీయ సభల్లో ఆలపించాలని 1937లో కాంగ్రెస్ నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆ నిర్ణయాన్ని ముస్లిం లీగ్తోపాటు హిందూ మహాసభ కూడా వ్యతిరేకించాయని అన్నారు. బీజేపీ నాయకులు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఎప్పుడు పోరాటం సాగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. స్వాతంత్య్ర పోరాటంతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు వందేమాతరం గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దేశాన్ని అర్థం చేసుకోవడానికి బీజేపీ ఏనాడూ ప్రయత్నించలేదని విమర్శించారు. దేశంలో ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో భాషలు ఉన్నప్పటికీ జాతీయ గ్రంథం మాత్రమే రాజ్యాంగమేనని గొగోయ్ ఉద్ఘాటించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాజ్యాంగాన్ని తాము కాపాడుకుంటున్నామని చెప్పారు. మోదీ ప్రభుత్వం ప్రజల హక్కులను హరిస్తోందని దుయ్యబట్టారు. నేడు దేశంలో బ్రిటిష్ పాలన లేకపోయినా మోదీ పాలనలో విభజించు, పాలించు విధానం అమలవుతోందని ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రజల సమస్యల గురించి మాట్లాడుకుండా ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశ రాజధానిలో బాంబు పేలితే దాని గురించి నోరువిప్పలేదని తప్పుపట్టారు. మోదీ పాలనలో ప్రజలకు భద్రత ఉందా? అని ప్రశ్నించారు. -
నెహ్రూ విశ్వాస ఘాతుకం
న్యూఢిల్లీ: మహోన్నతమైన వందేమాతరం గీతాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కలు చేసిందని, ఈ గీతం విషయంలో జవహర్లాల్ నెహ్రూ విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా ఒత్తిడికి నెహ్రూ లొంగిపోయారని, వందేమాతరం ముస్లింలను రెచ్చగొట్టేలా ఉందంటూ గీతంలో ముఖ్యమైన చరణాలు తొలగించారని మండిపడ్డారు. వందేమాతరం 150 వార్షికోత్సవంపై సోమవారం లోక్సభలో ప్రత్యేక చర్చను ప్రధాని మోదీ ప్రారంభించారు. జాతీయ గీతానికి అన్యాయం చేసిందెవరో భవిష్యత్తు తరాలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్ 1937లో వందేమాతరానికి వ్యతిరేకంగా ఉధృతంగా ప్రచారం చేసిందని వెల్లడించారు. దు్రష్పచారాన్ని అడ్డుకోవాల్సిన కాంగ్రెస్, నెహ్రూ అందుకు వత్తాసు పలికారని, గీతాన్ని ముక్కలు చేశారని ధ్వజమెత్తారు. జిన్నా వ్యతిరేకించిన తర్వాత నేతాజీ సుభాష్చంద్రబోస్కు నెహ్రూ లేఖ రాశారని, వందేమాతర గీతం ముస్లింలను రెచ్చగొట్టేలా, అసహనం కలిగించేలా ఉందంటూ ఆ లేఖలో పేర్కొన్నారని మోదీ గుర్తుచేశారు. 1937లో కోల్కతాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ గీతానికి నిజంగా అంత గొప్పదనం ఉందా? అంటూ సమీక్ష చేశారని తెలిపారు. అప్పట్లో కాంగ్రెస్ తీరు చూసి దేశంమొత్తం ది్రగ్బాంతికి గురైందని, ఆ పార్టీకి వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు జరిగాయని వెల్లడించారు. సామాజిక సామరస్యం ముసుగులో వందేమాతరాన్ని ముక్కలు చేయడం ద్వారా దేశాన్ని బుజ్జగింపు రాజకీయాల దిశగా నడిపించారని, చివరకు దేశం ముక్కలైందని ఆవేదన వ్యక్తంచేశారు. గాందీజీ కోరినా అన్యాయం చేశారు ‘‘బంకిం దా(బంకించంద్ర చటర్జీ) 1875లో వంతేమాతరం గీతం రాశారు. వెంటనే ఇది స్వాతంత్య్ర సమరయోధుల గళాల్లో నినాదంగా మారింది. దేశ స్వాతంత్య్ర పోరాటానికి కొత్త శక్తినిచి్చంది. ప్రజల సంకల్పానికి ఒక ప్రతీకగా మారింది. బ్రిటిష్ సామ్రాజ్యానికి బలమైన సవాలుగా నిలిచింది. వందేమాతరాన్ని నిషేధించడానికి బ్రిటిష్ పాలకులు ఎన్నో కుట్రలు చేశారు. ఈ గీతాన్ని ప్రచురించకుండా, ఆలపించకుండా చట్టాలు తీసుకొచ్చారు. ఎవరు ఎన్ని కుతంత్రాలు సాగించినా బంకించంద్ర చటర్జీ వెనక్కి తగ్గలేదు. ఆత్మస్థైర్యంలో సవాలును ఎదుర్కొన్నారు. వందేమాతరం ఇచి్చన బలంతో కొనసాగుతున్న స్వాతంత్య్ర పోరాటం పట్ల బ్రిటిషర్లు ద్వేషం ప్రదర్శించారు. 1905లో బెంగాల్ను విభజించారు. అయినా సరే వందేమాతరం ఒక శిలలా స్థిరంగా నిలిచే ఉంది. గత శతాబ్దంలో వందేమాతరం చాలా ప్రాచుర్యం పొందింది. దీన్ని జాతీయ గీతం మార్చాలని కోరుతూ మహాత్మాగాంధీ 1905లో లేఖ రాశారు. అయినప్పటికీ గీతానికి అన్యాయం జరిగింది. గాంధీజీ అభిమతాన్ని కూడా లెక్కచేయని శక్తివంతులైన వ్యక్తులెవరో ప్రజలు తెలుసుకోవాలి. ఎలాంటి సవాలునైనా తిప్పికొట్టగలం దేశానికి సవాళ్లు ఎదురైనప్పుడల్లా వందేమాతరం ఇచ్చిన స్ఫూర్తితో దీటుగా ప్రతిస్పందిస్తున్నాం. చరిత్రలో కొన్ని ఘట్టాలను పక్కనపెడితే.. ప్రతికూల పరిస్థితుల్లో దేశం ఒక్కటవుతోంది. ఆహార భద్రత సంక్షోభం ఎదురైనప్పుడు మన రైతులు పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలు పండించి ప్రజల ఆకలి తీర్చారు. ఇందుకు వందేమాతరమే స్ఫూర్తి. ఎమర్జెన్సీ మైండ్సెట్ను కూడా ఈ స్ఫూర్తి ఓడించింది. యుద్ధాలు జరిగినప్పుడు మన సైనికులు శత్రువులను చిత్తు చేశారు. కోవిడ్–19 సంక్షోభాన్ని కలిసికట్టుగా అధిగమించాం. వందేమాతరం మనకు సమైక్యత, బలం, సామర్థ్యాన్ని అందిస్తోంది. ఎలాంటి సవాలునైనా మనం తిప్పికొట్టగలం. వందేమాతరం అంటే కేవలం ఒక గీతం కాదు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు బలమైన స్ఫూర్తి. ‘స్వదేశీ’ నినాదానికి మరింత బలం చేకూర్చాలి. వందేమాతరమే మన మంత్రం. వందేమాతరం నేపథ్యాన్ని పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఇది విలువల ప్రవాహం. వేదాల్లోని సత్యాన్ని చాటిచెబుతోంది. భూమే మన తల్లి, మనం ఈ భూమి బిడ్డలం అని తెలియజేస్తుంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మోదీ ప్రసంగిస్తున్న సమయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అడ్డుతగలడానికి పలుమార్లు ప్రయతి్నంచారు. నినాదాలు చేశారు. మోదీ స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ విధానాలను తృణమూల్ కాంగ్రెస్ ఔట్సోర్సింగ్కు తీసుకున్నట్లుగా కనిపిస్తోందని చురక అంటించారు. ఆనాటి వైభవాన్ని పునరుద్ధరించాలి ‘‘పవిత్రమైన వందేమాతరం మనకు గర్వకారణం. 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ చరిత్రాత్మక ఘట్టానికి సాక్షిగా నిలుస్తున్నందుకు మనమంతా గరి్వంచాలి. వందేమాతరం దశాబ్దాలుగా మనకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంది. గీతానికి 50 ఏళ్లు పూర్తయిన సమయంలో మన దేశం బ్రిటిష్ పాలనలో ఉంది. 100 ఏళ్లు పూర్తయినప్పుడు దేశం ఎమర్జెన్సీ పడగ నీడలో ఉంది. అప్పట్లోదేశభక్తులను జైల్లో పెట్టారు. రాజ్యాంగం గొంతు కోశారు. దురదృష్టవశాత్తూ ఎమర్జెన్సీ సమయంలో చీకటి కాలం నడిచింది. గీతానికి ఇప్పుడు 150 ఏళ్లు పూర్తయ్యాయి. దేశానికి స్వాతంత్య్రం సంపాదించి పెట్టిన వందేమాతరం వైభవాన్ని పునరుద్ధరించడానికి ఇదొక గొప్ప అవకాశం’’ అని మోదీ అన్నారు. భారతీయ విశ్వాసాలకు ప్రతీక ‘‘వందేమాతరం భారతీయ విశ్వాసాలు, విలువలకు ప్రతీక. ఈ గీతం దేశ సామరస్యం, బలాన్ని, సంస్కృతిని, మాతృత్వాన్ని సూచిస్తుంది. నేటికీ ప్రతి భారతీయుల గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. స్వాతంత్య్ర పోరాటంలో లక్షల మందిని ముందుకు నడిపించింది. పరాయి పాలన నుంచి దేశానికి విముక్తి కలి్పంచాలన్న స్ఫూర్తిని రగిలించింది. దేశ సంకల్పానికి గుర్తుగా నిలిచింది.’’ – ఓం బిర్లా, లోక్సభ స్పీకర్ వందేమాతరం ముస్లింలకు వ్యతిరేకం కాదు ‘‘వందేమాతరం గీతం ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నట్లు ఇన్నాళ్లూ తప్పుడు ప్రచారం జరిగింది. అప్పట్లో బెంగాల్ నవాబ్, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయాలనే ఇందులో ప్రస్తావించారు. కరువు కాలంలో పన్నుల పేరిట ప్రజలను పీడించిన పాలకుల గురించి ఆనంద్మఠ్ గ్రంథంలో రాశారు. ఆ గ్రంథంలోనే వందేమాతరం తొలుత ప్రచురితమైంది. దాంతో ఈ గీతం ముస్లింలకు వ్యతిరేకమనే వాదన మొదలుపెట్టారు. వందేమాతరం ముస్లింలకు వ్యతిరేకం అన్న వాదనలు ఏమాత్రం వాస్తవం లేదు. నిజాలు బహిర్గతం చేయడానికి ఇదే సరైన సమయం. దేశానికి స్వాతంత్య్రం వచి్చన తర్వాత వందేమాతరం స్థాయిని తగ్గించే ప్రయత్నం జరిగింది. తొలగించిన చరణాలు భారతీయతను వివరిస్తాయి. పూర్తి గీతం గురించి అందరూ తెలుసుకోవాలి’’ – రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి బీజేపీ నేతలకు వందేమాతరం అర్థం తెలుసా? ‘‘ఒకరి విశ్వాసాలను మరొకరిపై రుద్దడానికి వందేమాతరం గీతాన్ని ఆయుధంగా వాడుకోవాలని చూడడం సరైంది కాదు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఏనాడూ పాల్గొనని బీజేపీ నాయకులు ఇప్పుడు వందేమాతరం విలువల గురించి మాట్లాడుతున్నారు. వందేమాతరం స్ఫూర్తిని యథాతథంగా అలవర్చుకోవాలి. సొంతం ప్రయోజనాల కోసం దాన్ని వాడుకోవడం దారుణం. జాతీయ గీతాన్ని వారే సృష్టించినట్లు అధికార పార్టీ నాయకులు డ్రామాలాడుతున్నారు. ప్రజలను ఏమార్చాలని చూస్తున్నారు. జాతీయ గీతం రాజకీయ ఆయుధం కాకూడదు. బీజేపీ నాయకులకు వందేమాతరం అర్థం తెలుసా? విభజన శక్తులు ప్రజల్లో చిచ్చు పెట్టడానికి వందేమాతరం గీతాన్ని వాడుకుంటున్నాయి’’ – అఖిలేశ్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ ఎంపీ హిందువులకే సొంతమన్నట్లు చిత్రీకరించారు వందేమాతరం గీతం హిందువులకే సొంతం అన్నట్లుగా 20వ శతాబ్దం మొదట్లో చిత్రీకరించారు. దీంతో ముస్లింలకు సంబంధం లేదన్నట్లుగా అసంబద్ధమైన వాదన తీసుకొచ్చారు. వందేమాతరం హిందువులదే అని చెప్పిన వ్యక్తులే అసలు వివాదానికి కారకులు. హిందువులకు ఈ గొడవతో సంబంధం లేదు. వందేమాతరాన్ని ముక్కలు చేయడం వల్లే దేశం ముక్కలైందని ప్రధాని మోదీ ఆరోపించడం గర్హనీయం. వందేమాతరం స్ఫూర్తిని అందరూ అందిపుచ్చుకోవాలి’’ – ఎ.రాజా, డీఎంకే ఎంపీ బెంగాల్ ఎన్నికల కోసమే బీజేపీ ఆరాటం వచ్చే ఏడాది జరిగే పశి్చమ బెంగాల్ ఎన్నికల్లో విజయంపై బీజేపీ దృష్టిపెట్టింది. రాజకీయ లబ్ధి కోసం వందేమాతరాన్ని వాడుకుంటోంది. వందేమాతరం ఆత్మను బీజేపీ హత్య చేస్తోంది. 1937 నాటి కాంగ్రెస్ తీర్మానం కంటే ఇప్పు డే ఎక్కువ అన్యాయం జరుగుతోంది. సరిగ్గా బెంగాల్ ఎన్నికల ముందే వందేమాతరంపై పార్లమెంట్లో చర్చ చేపట్టారంటే బీజేపీ అసలు ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. జాతీయ గీతాన్ని బీజేపీ నాయకులు సరిగ్గా ఆలపించగలరా? స్వాతంత్య్ర పోరాటంతో సంబంధం లేదని వ్యక్తులు నేడు వందేమాతరానికి సంరక్షకులమని చెప్పుకుంటున్నారు. బీజేపీ పాలనలో వందేమాతరం స్ఫూర్తి ఎక్కడా అమలు కావడం లేదు. ప్రభుత్వ నిర్వాకాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే వందేమాతరంపై చర్చ సాగిస్తున్నారు’’. – మహువా మొయిత్రా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ -
వందేమాతరంపై చర్చను ప్రారంభించిన ప్రధాని మోదీ
-
రండి.. ప్రధానితో మాట్లాడండి
రాయవరం: ప్రధానితో నేరుగా మాట్లాడాలనుకుంటున్నారా.. ఇప్పుడు ఆ అవకాశం మీ చేతుల్లోనే ఉంది. మీరు చేయాల్సిందల్లా ప్రధానమంత్రి ‘పరీక్షా పే చర్చ’ యాప్లో ఆన్లైన్లో నమోదు కావాలి. ఏటా పరీక్షల ముందు ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీనిని కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా, ఇప్పుడు 9వ ఎడిషన్కు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో ప్రధాని మోదీ నేరుగా సంభాషించనున్నారు. పరీక్షలను సమర్ధవంతంగా, ఒత్తిడి లేకుండా ఎదుర్కోవడం, చిరునవ్వుతో పరీక్షలకు సమాధానాలు రాయడం ద్వారా విద్యార్థులకు పరీక్షలంటే భయాన్ని తొలగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పరీక్షల సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఆ పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలి.. విద్యార్థులు ఎదుర్కొనే సవాళ్లు ఏంటి? వాటిని ఎలా అధిగమించాలి? విద్యార్థుల ఆకాంక్ష ఏంటి? వాటిని చేరుకోవడానికి అనుసరించాల్సిన మార్గాలు.. పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఎలా ఉండాలి.. తదితర అంశాలపై ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు 6 నుంచి 12 తరగతుల విద్యార్థులు అర్హులు. దీనిద్వారా ప్రధానమంత్రి శక్తివంతమైన యువతతో కనెక్ట్ అవుతారు. యువతతో మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. యువత ఎదుర్కొనే సవాళ్లు, ఆకాంక్షలను మరింతగా అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం కూడా కలుగుతుంది. ‘పరీక్షా పే చర్చ’ మొదటి ఎడిషన్ 2018 ఫిబ్రవరి 16న ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో నిర్వహించారు. ఇప్పుడు కూడా విద్యార్థులు తమ ప్రశ్నను ప్రధానమంత్రిని నేరుగా అడగవచ్చు. ప్రశ్న గరిష్టంగా 500 అక్షరాల లోపు ఉండాలి. ఇందులో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా పాల్గొనవచ్చు. వారి ఎంట్రీలను కూడా ఆన్లైన్లో పంపే అవకాశం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కల్పించింది. వీటిలో మంచి ప్రశ్నలను ఎంపిక చేసి అర్హులను నిర్ణయిస్తారు. విజేతలుగా నిలిస్తే.. పరీక్షా పే చర్చలో విజేతలు నేరుగా ప్రధానమంత్రిని కలుసుకునే అవకాశాన్ని పొందుతారు. ప్రతి విజేతకు ప్రత్యేక కిట్ అందజేస్తారు. విజేతలకు ప్రత్యేకంగా రూపొందించిన ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. విజేతలు ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి ఆటోగ్రాఫ్ను, ఫొటోతో కూడిన డిజిటల్ సావనీర్ను పొందే అవకాశముంది.లాగిన్ అవ్వాలిలా.. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హెచ్టీటీపీఎస్://ఇన్నోవేట్ఇండియా.మైజీవోవీ.ఇన్ అని క్లిక్ చేయాలి. ఎంటర్ కాగానే క్లిక్ ఏజ్ స్టూడెంట్, టీచర్, పేరెంట్స్ అనే లాగిన్స్ కనిపిస్తాయి. వాటిలోకి ఎంటర్ కాగానే మీ మొబైల్ నంబరు లేదా జీమెయిల్ ఖాతాను పూర్తి చేయాలి. ఓటీపీతో లాగిన్ అయి క్లిక్ చేయాలి. ఓటీపీ రాగానే మళ్లీ లాగిన్ చేయాలి. స్టూడెంట్స్కు నేరుగా ఫోన్ నంబరు, జీమెయిల్ లేని సందర్భంలో టీచర్స్ లాగిన్ ద్వారా ఎంటర్ అయ్యే అవకాశం కల్పించారు. విద్యార్థులు/ఉపాధ్యాయులు/తల్లిదండ్రులు ప్రాథమిక సమాచారం వివరాలను పూర్తి చేయాలి. కార్యాచరణ వివరాలను పూర్తి చేసిన తర్వాత థీమ్ను ఎంచుకుని 500 అక్షరాల లోపు వివరించాలి. అధిక సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పరీక్షా పే చర్చలో పాల్గొనేలా ఉప, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలి. పరీక్షా పే చర్చకు ఎంపికైన సుమారు 2,050 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా పీపీసీ కిట్లను బహుమతిగా అందజేయనున్నారు.క్షేత్ర స్థాయిలో ఆదేశాలు ఇచ్చాం పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనేలా క్షేత్ర స్థాయిలో ఆదేశాలు ఇచ్చాం. ముఖ్యంగా విద్యార్థులకు పరీక్షలంటే భయం పోగొట్టడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది. మనం సంధించే ప్రశ్న ద్వారా నేరుగా ప్రధానిని కలుసుకునే అవకాశం చిక్కుతుంది. – జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సద్వినియోగం చేసుకోండి ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. 6–12 తరగతులకు చెందిన విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఇది చక్కని అవకాశం. అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనేలా ఎవరి స్థాయిలో వారు కృషి చేయాలి. జాతీయ స్థాయిలో జిల్లాకు గుర్తింపు తీసుకురావాలి. – డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈఓ, అమలాపురం -
‘ఇదొక మంత్రం’.. ‘వందేమాతరం’చర్చలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: వందేమాతరం, వేదకాలాన్ని గుర్తు చేస్తుందివందేమాతరం గీతం మన స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన పాట...త్యాగం ,తపస్సుకు మార్గాన్ని చూపించిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ పోరాటం ఏదో ఒక భూమి కోసం మాత్రమే కాదని వందేమాతరం మనకు అర్థమయ్యేలా చేసిందన్నారు. వందేమాతరం మన వేద కాలాన్ని గుర్తుకు తెస్తుంది. ఈ భూమి నా తల్లి అని, నేను ఈ భూమికి పుత్రుడిని అని చెబుతుంది. వందేమాతరం మాతృభూమికి సంబంధించిన పాట అని ఆయన కొనియాడారు.వందేమాతరం రుణాన్ని సమిష్టిగా అభినందించేందుకే, ఈ పాట కారణంగానే మనమందరం ఇక్కడ ఉన్నాము. వందేమాతరం రుణాన్ని గుర్తించాల్సిన పవిత్ర సందర్భమిది అన్నారు మోదీ. 2047 నాటికి పూర్తి స్వావలంబన దిశగాదేశాన్ని నలుదిక్కులనుంచి ఏకంచేసింది. మళ్ళీ ఐక్యమై అందరితో కలిసి కదలాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ పాట మన స్వాతంత్ర్య సమరయోధుల కలలను నెరవేర్చడానికి మనకు స్ఫూర్తిని ,శక్తినివ్వాలి. 2047 నాటికి మన దేశాన్ని స్వావలంబనగా మరియు అభివృద్ధి చెందేలా చేయాలనే సంకల్పాన్ని మనం పునరుద్ఘాటించాలి" అని మోదీ పేర్కొన్నారు.జిన్నాకు వత్తాసు పలికారు, వందేమాతర గీతానికి ద్రోహం చేశారుభారత జాతీయ గీతాన్ని 50 సంవత్సరాల క్రితం ప్రతిపక్ష పార్టీ మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితి విధించి రాజ్యాంగాన్ని అణచివేశారు. దేశభక్తులను జైళ్లలో నెట్టిన ఎమర్జెన్సీ మన దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం అన్నారు మోదీ. ఇప్పుడు మనకు వందేమాతరం గొప్పతనాన్ని పునరుద్ధరించే అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని వదులుకోకూడదని తెలిపారు.ముస్లింలకు నచ్చదనే కారణంగా జవహర్లాల్ నెహ్రూ - 'వందేమాతరం'ను వ్యతిరేకించడంలో ముహమ్మద్ అలీ జిన్నాను అనుసరించారని ఆరోపించారు. 1937లో మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్ వందేమాతరం గీతానికి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టిందనీ, అయితే దానిని వ్యతిరేకించాల్సిన కాంగ్రెస్ పార్టీ, నెహ్రూలు వత్తాసు పలికి ఈ గీతం నుంచి కొన్ని పంక్తులను తొలగించారని విమర్శించారు. ‘వందేమాతరం అనేది ఒక మంత్రం.. నినాదం.. ఇది స్వాతంత్ర్య ఉద్యమానికి శక్తిని, ప్రేరణను ఇచ్చింది. త్యాగానికి, తపనకు మార్గాన్ని చూపింది. వందేమాతర గీతం 150 సంవత్సరాల వేడుకకు మనం సాక్షులుగా మారడం గర్వకారణం. ఇది ఒక చారిత్రక క్షణం. పలు చారిత్రక సంఘటనలను మైలురాళ్లుగా జరుపుకుంటున్న కాలం ఇది. ఇటీవలే మనం 75 ఏళ్ల రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నాం. దేశం.. సర్దార్ పటేల్, బిర్సా ముండా 150వ జయంతిని జరుపుకుంటోంది. గురు తేజ్ బహదూర్ 350వ అమరవీరుల దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం. ఇప్పుడు మనం వందేమాతరం 150 సంవత్సరాల వేడుకలను జరుపుకుంటున్నాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో వందేమాతర గీతంపై చర్చను ప్రారంభిస్తూ పేర్కొన్నారు. #WATCH | PM Narendra Modi says, "There is no leadership and opposition here. We are here to appreciate and accept the debt of Vande Mataram collectively. It is because of this song that we are all here together. It is a sacred occasion for all of us to acknowledge the debt of… pic.twitter.com/B4KvoXd5Wn— ANI (@ANI) December 8, 2025వలస పాలనలో బ్రిటిష్ వారు భారతీయులు ‘గాడ్ సేవ్ ది క్వీన్’ను పాడాలని ఆశించారు. కానీ దేశం ‘వందేమాతరం’ ద్వారా తన సొంత గొంతును వినిపించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మన దేశభక్తి గీతం బ్రిటిష్ ఆధిపత్యానికి శక్తివంతమైన ప్రతిస్పందన అని ఆయన అభివర్ణించారు. భవిష్యత్ తరం ఈ చర్చ నుండి ఎంతో నేర్చుకోవచ్చని అన్నారు. బ్రిటిష్ వారు తమ విభజించు-పాలించు విధానాన్ని బెంగాల్ నుండి ప్రారంభించారని, కానీ ‘వందేమాతరం’ స్ఫూర్తి వారి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసిందన్నారు. ‘వందేమాతరం’ బ్రిటిష్ పాలనకు తగిన సమాధానంగా మారింది. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. వందేమాతరం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు దేశం వలస పాలనలో ఉంది. 100వ వార్షికోత్సవంలో దేశం అత్యవసర పరిస్థితిలో ఉంది అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2025లో జాతీయ గీతం 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. వందేమాతర గీతాన్ని 1870లలో బంకిం చంద్ర ఛటర్జీ సంస్కృతీకరించిన బెంగాలీలో రాశారు. ఇది తొలుత 1882లో ఛటర్జీ బెంగాలీ నవల ఆనంద్మఠ్లో భాగంగా ప్రచురితమయ్యింది. లక్షలాది మంది వందేమాతరం జపిస్తూ, స్వాతంత్ర్యం కోసం పోరాడినందునే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని ప్రధాని పేర్కొనన్నారు. ఈరోజు మనం జాతీయ గీతాన్ని గుర్తు చేసుకోవడం ఈ సభలో మనందరికీ గర్వకారణం అని ప్రధాని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలకులు తమ ‘గాడ్ సేవ్ ది క్వీన్’ అనే గీతాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ‘వందేమాతరం’ రాశారని ప్రధాని తెలిపారు.‘వందేమాతరం’ దేశభక్తి నినాదం కంటే మించినదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఇది స్వాతంత్ర్య పోరాట సమయంలో శక్తివంతమైన యుద్ధ నినాదంగా పనిచేసిందని, ఈ నినాదం భారతీయులలో ధైర్యం, ఐక్యత, ధిక్కారాన్ని రేకెత్తించిందని, వలస పాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేసే ర్యాలీలకు పిలుపుగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. ‘వందేమాతరం’ దేశ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. దానిలోని భావోద్వేగ, సాంస్కృతిక ప్రభావానికి ప్రపంచంలో మరొకటి సాటిలేదని ప్రధాని పేర్కొన్నారు. గాంధీజీ ‘వందేమాతరం’ను జాతీయ గీతంతో సమానం చేశారని, నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దీనిని వ్యతిరేకించారని, ముహమ్మద్ అలీ జిన్నా అభిప్రాయాలతో ఏకీభవించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ వందేమాతరంను రాజీ పడటం కింద భావించిందని ఆరోపించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సోమవారం 150 వసంతాల వందేమాతర గీతంపై ప్రత్యేక చర్చను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ చర్చ లోక్సభలో 10 గంటలపాటు సాగనుంది. ఈ పాట మూలాలు, స్వాతంత్ర్య పోరాట సమయంలో దాని ప్రాముఖ్యత, భారతదేశ సాంస్కృతిక, జాతీయ గుర్తింపుపై వందేమాతర గీతం ప్రభావాన్ని మరోమారు పరిశీలించనున్నారు. -
ఎయిర్ పోర్ట్ లో ఇబ్బందులు పడుతుంటే అక్కడ దావత్ లు చేసుకుంటావా..?
-
సాయుధ దళాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు
న్యూఢిల్లీ: అసమాన ధైర్యసాహసాలతో దేశాన్ని రక్షిస్తున్న సాయుధ దళాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం సాయుధ దళాల జెండా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన తన సామాజిక మాద్యమ ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ‘మన దేశాన్ని అచంచల ధైర్యంతో రక్షించే ధైర్యవంతులైన సాయుధబలగాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీ క్రమశిక్షణ, సంకల్పం, స్ఫూర్తి ప్రజలను కాపాడతాయి. మన దేశాన్ని బలోపేతం చేస్తాయి. మీ నిబద్ధత దేశం పట్ల మీకున్న భక్తికి ప్రబల నిదర్శనంగా నిలుస్తుంది’ అని మోదీ ఆ పోస్ట్లో పేర్కొన్నారు. సాయు«ధ దళాల జెండా దినోత్సవ నిధికి ప్రధానమంత్రి విరాళం ఇచ్చారు. ఈ నిధికి విరాళాలు ఇవ్వాలని ప్రజలకు మోదీ విజ్ఞప్తి చేశారు. -
గోవా ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి
-
‘మోదీ జీ.. దయచేసి నాకు న్యాయం చేయండి’
ఇస్లామాబాద్: మోదీ జీ.. ప్లీజ్ నాకు న్యాయం చేయండి.. అంటూ ఓ పాకిస్తానీ మహిళ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. తన భర్త తనను పాకిస్తాన్లో వదిలేసి.. భారత్లో రహస్యంగా మరో పెళ్లికి సిద్దమవుతున్నాడని వీడియోలో పేర్కొంది. ఈ క్రమంలోనే తనకు న్యాయం చేయాలని ప్రధాని మోదీని ఆమె అభ్యర్థించింది. బాధితురాలు నిఖితా నాగ్దేవ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. పాకిస్తాన్ మూలాలున్న విక్రమ్ నాగ్దేవ్ దీర్ఘకాలిక వీసాపై మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నివాసం ఉంటున్నాడు. కాగా, పాక్లోని కరాచీకి చెందిన నిఖితతో విక్రమ్కు 2020 జనవరి 26న హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. అయితే, వివాహం జరిగిన నెల తర్వాత, ఫిబ్రవరి 26న ఆమెను భారత్కు తీసుకొచ్చారు. అనంతరం, కొన్ని నెలలకే వీసాలో సాంకేతిక సమస్య ఉందని చెప్పి, 2020 జూలై 9న అటారీ సరిహద్దు వద్ద నుంచి విక్రమ్.. నిఖితను బలవంతంగా పాకిస్తాన్కు పంపించేశాడు. అప్పటి నుంచి ఆమెను తిరిగి భారత్కు తీసుకువెళ్లలేదని నిఖిత తెలిపారు.అంతేకాకుండా.. అత్తారింటికి వచ్చిన కొద్ది రోజులకే వారి ప్రవర్తనలో మార్పు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకు తన బంధువుల్లో ఒకరితో వివాహేతర సంబంధం ఉందని తెలిసి కన్నీరు పెట్టుకుంది. ఈ విషయం తన మామకు చెబితే.. అబ్బాయిలకు ఇలాంటివి సహజం, ఏమీ చేయలేం అని అన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తాజాగా తన భర్త మరో యువతిని పెళ్లి చేసుకోబోతున్నాడని నిఖిత ఆరోపించారు. ఢిల్లీకి చెందిన మరో మహిళను వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. ఈ విషయం తనకు తెలియడంతో 2025 జనవరి 27న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు నిఖిత చెప్పుకొచ్చారు.ఈ కేసు మధ్యప్రదేశ్ హైకోర్టుచే అధికారం పొందిన సింధీ పంచ్ మధ్యవర్తిత్వ, న్యాయ సలహా కేంద్రం ముందుకు వచ్చింది. విచారణ అనంతరం మధ్యవర్తిత్వం విఫలమైంది. భార్యాభర్తలిద్దరూ భారత పౌరులు కాకపోవడంతో ఈ కేసు పాకిస్తాన్ పరిధిలోకి వస్తుందని పేర్కొంటూ, విక్రమ్ను పాక్కు బహిష్కరించాలని ఆ కేంద్రం 2025 ఏప్రిల్ 30న సిఫార్సు చేసింది. అలాగే, 2025 మే నెలలో ఇండోర్ సోషల్ పంచాయితీ కూడా విక్రమ్ను దేశం విడిచి పంపాలని సిఫార్సు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో, ఇండోర్ కలెక్టర్ ఆశిష్ సింగ్ ఈ విషయంపై విచారణకు ఆదేశించినట్లు ధృవీకరించారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ తనకు న్యాయం చేయాలని నిఖిత వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనకు న్యాయం జరగకపోతే, న్యాయవ్యవస్థపై మహిళలకు నమ్మకం పోతుంది. దయచేసి తనకు అండగా నిలవండి అని ఆమె అభ్యర్థించారు. -
గోవా ప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
గోవాలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానూభూతి తెలియజేశారు. అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిర్స్ నైట్ క్లబ్ లో జరిగిన ప్రమాదం చాలా బాధాకరమన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ తో మాట్లాడినట్లు మోదీ పేర్కొన్నారు. కేంద్రం మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.బిర్స్ నైట్ క్లబ్ లో జరిగిన అగ్నిప్రమాదంపై ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనా స్థలాన్ని సీఎం అధికారులతో కలిసి పరిశీలించారు. బిర్స్ నైట్ క్లబ్ సరైన నిబంధనలు పాటించలేదని ప్రాథమిక విచారణలో తేలిందని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై విచారణ ఉన్నత స్థాయి విచారణ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్తర గోవాలోని అర్పోరాలోని బిర్స్ నైట్ క్లబ్ లో అర్థరాత్రి గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 25 మంది మరణించగా 50 మందికి తీవ్రగాయాయలయ్యాయి. ప్రమాదంలో మృతి చెందిన వారిలో అధికమంది క్లబ్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరిలో ముగ్గురు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోగా మిగితా వారంతా ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పి సహాయక చర్యలు ప్రారంభించాయి. -
అంబేడ్కర్కు ఘనంగా నివాళి
న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదితరులు ఘనంగా నివాళులర్పించారు. ఆయన 69వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ప్రేరణ స్థల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు హాజరై బాబా సాహెబ్ అంబేడ్కర్కు పుష్పాంజలి ఘటించారు. ‘మహా పరినిర్వాణ్ దివస్ సందర్భంగా భారత రత్న, మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేడ్కర్కు సవినయంగా నివాళులరి్పస్తున్నాను’అని ఉపరాష్ట్రపతి ఎక్స్లో పేర్కొన్నారు. ‘డాక్టర్ అంబేడ్కర్ దార్శనికత కలిగిన నేత, న్యాయం, సమానత్వం కోసం ఆయన ఎంతో అంకితభావంతో పనిచేశారు’అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. చైత్యభూమిపై పూలజల్లు మహా పరినిర్వాణ్ దినాన్ని పురస్కరించుకుని ముంబైలోని దాదర్ ప్రాంతంలో ఉన్న డాక్టర్ అంబేడ్కర్ మెమోరియల్ చైత్యభూమి వద్దకు శనివారం వేలాదిగా తరలివచ్చారు. అంబేడ్కర్కు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే, శివసేన(యూబీటీ)చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఎంసీ ఫొటో ఎగ్జిబిషన్ను నిర్వహించింది. చైత్యభూమిపై హెలికాప్టర్ ద్వారా పూలజల్లు కురిపించారు. భారత రాజ్యాంగం ప్రతులను పంచిపెట్టారు. బీఎంసీ ఈ కార్యక్రమం కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. -
జనవరిలో 9వ విడత ‘పరీక్షా పే చర్చ’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’కార్యక్రమం తొమ్మిదో విడత షెడ్యూల్ ఖరారైంది. 2026 జనవరిలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ శనివారం తెలిపింది. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించి, పరీక్షలను ఒక ఉత్సవంలా భావించేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఆసక్తి గల వారి ఎంపిక కోసం ఆన్లైన్ ద్వారా పోటీలను నిర్వహిస్తున్నారు. ఇందుకుగాను ఇన్నోవేట్ ఇండియా వన్ అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 1న ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు 2026 జనవరి 11 వరకు కొనసాగుతాయి. 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు, అలాగే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ పోటీలో పాల్గొనవచ్చు. బహుళ ఐచి్ఛక ప్రశ్నల రూపంలో ఈ ఆన్లైన్ పోటీ ఉంటుంది. పాల్గొన్న వారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందజేస్తారు. రికార్డు స్థాయి భాగస్వామ్యం 2025 ఫిబ్రవరిలో జరిగిన 8వ విడత ‘పరీక్షా పే చర్చ’కు రికార్డు స్థాయిలో 3.56 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారని, ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డుగా నమోదైందని విద్యా శాఖ పేర్కొంది. 2018లో కేవలం 22 వేల మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమం, ప్రస్తుతం కోట్లాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఆకర్షిస్తోందని అధికారులు తెలిపారు. -
బానిస మనస్తత్వం ఇంకెన్నాళ్లు?
న్యూఢిల్లీ: మన మెదళ్లలో ఇంకిపోయిన బానిస మనస్తత్వాన్ని రాబోయే పదేళ్లలో పూర్తిగా వదిలించుకోవాలని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆర్థికాభివృద్ధిలో దేశం పని తీరును ‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’గా అభివరి్ణస్తూ మన భారతీయ నాగరికతకు మచ్చతెచ్చే కుట్రలు చేశారని ఆరోపించారు. ప్రధాని మోదీ శనివారం ఢిల్లీలో హిందుస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాలు, అస్థిర పరిస్థితులు నెలకొన్నప్పటికీ మనదేశం గొప్ప ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తోందని అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ మన ప్రగతి ప్రయాణం ఎక్కడా ఆగడం లేదని హర్షం వ్యక్తంచేశారు. భారత్ కొత్త చరిత్రను లిఖిస్తోందని ఉద్ఘాటించారు. ఆత్మవిశ్వాసం లేకపోతే ఏ దేశం కూడా ముందుకు సాగలేదని తేల్చిచెప్పారు. నేడు అన్ని రంగాల్లో వలసవాద మనస్తత్వాన్ని క్రమంగా వదిలించుకుంటున్నామని వివరించారు. స్వశక్తి, స్వయంకృషితో ఎన్నో ఘనతలు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు స్పష్టంచేశారు. ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే లక్ష్య సాధనకు వలసవాద, బానిస మనస్తత్వం పెద్ద అడ్డంకిగా మారిందన్నారు. అందుకే ఆ మనస్తత్వం నుంచి పూర్తిగా విముక్తి చెందే దిశగా మన దేశం అడుగులు వేస్తున్నట్లు తేల్చిచెప్పారు. ఇండియాను ప్రపంచ దేశాలు ‘గ్లోబల్ గ్రోత్ ఇంజిన్’గా గుర్తిస్తున్నప్పటికీ కొందరు మాత్రం ఆ ఘనతను దేశానికి గర్వకారణంగా భావించడం లేదన్నారు. బానిస మనస్తత్వమే అందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రతి అంశంపైనా మత ముద్ర ‘‘మన దేశం రెండు శాతం, మూడు శాతం ఆర్థిక వృద్ధి కూడా సాధించలేక ఇబ్బందులు పడుతున్న సమయంలో హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనే మాట పుట్టించారు. ఆర్థిక ప్రగతిని ప్రజల విశ్వాసంతో ముడిపెట్టారు. మన సమాజాన్ని పేదరికానికి పర్యాయపదంగా మార్చారు. హిందూ నాగరికతకు సంబంధించిన పరిణామాల వల్లనే ఆర్థిక ప్రగతి జరగడం లేదని నిందించారు. పుస్తకాల్లో, పరిశోధన గ్రంథాల్లో హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ను చేర్చారు. కుహన మేధావులు నేడు ప్రతి అంశాన్నీ మతం దృష్టితో చూస్తున్నారు. మత ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు మాపై నిందలు వేస్తున్న మేధావులు గత ప్రభుత్వాల హయాంలో నమోదైన తక్కువ వృద్ధిరేటు గురించి మాట్లాడడం లేదు. దేశంలో బానిస మనస్తత్వం అనే విత్తనాలు నాటిన మెకాలే విధానానికి 2035 నాటికి 200 ఏళ్లు పూర్తవుతాయి. అంటే మరో పదేళ్లు మిగిలి ఉన్నాయి. ఈ పదేళ్లలో బానిస మనస్తత్వం నుంచి దేశానికి పూర్తిగా విముక్తి కల్పించాలి. మౌలిక మార్పునకు ప్రతీక ఆర్థిక వృద్ధితో మనకు తిరుగులేదు. అధిక వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణం మన బలం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 8.2 శాతం వృద్ధి సాధించాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మనమే గ్రోత్ డ్రైవర్. ప్రపంచ వృద్ధి రేటు 3 శాతమే ఉంది. జీ7 దేశాల సగటు వృద్ధిరేటు 1.5 శాతమే. ఇలాంటి పరిస్థితుల్లో మనం 8.2 శాతం వృద్ధిరేటు సాధించడం సామాన్య విషయం కాదు. ఇది కేవలం అంకెలకు సంబంధించిన సంగతి కాదు. గత పదేళ్లలో మనం తీసుకొచ్చిన మౌలిక మార్పునకు ప్రతీక’’ అని ప్రధాని మోదీ వివరించారు. -
బాధ్యత లేదా..! రామ్మోహన్ నాయుడుపై మోదీ ఆగ్రహం
-
ఇండిగో గందరగోళం.. అసలేం జరుగుతోంది?
దేశంలో విమాన సర్వీసుల్లో దాదాపు 60 శాతం వాటాతో అగ్రగామిగా ఉన్న ఇండిగో సంస్థలో సంక్షోభం నెలకొంది. ఇండిగో సంక్షోభంపై రంగంలోకి దిగిన ప్రధాని మోదీ.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. -
ఇండిగో సంక్షోభంపై రంగంలోకి దిగిన ప్రధాని మోదీ
ఢిల్లీ: ఇండిగో సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడి పనితీరుపై మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. విమానయాన శాఖ అధికారులతో నేరుగా మోదీ సమీక్షించారు. ఇండిగో సంక్షోభంపై మోదీకి అధికారులు బ్రీఫింగ్ ఇచ్చారు. అయితే, సమీక్షకు కేంద్రమంత్రి రామ్మోహన్ను పీఎంవో పిలవలేదని సమాచారం.పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఘోరంగా విఫలమయ్యారంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి చేతకానితనంతో దేశ ఏవియేషన్ రంగంలో పెను సంక్షోభం నెలకొందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇండిగో సంక్షోభాన్ని చివరి వరకు రామ్మోహన్ పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.కాగా, ఇండిగో సంస్థపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానాల ఆకస్మిక రద్దు, ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై సీరియస్ అయ్యింది. ప్రయాణికుల టికెట్ రద్దు రీఫండ్ను ఆలస్యం చెయవద్దని.. రేపు రాత్రి 8లోపు డబ్బులు తిరిగివ్వాలని తీవ్రంగా హెచ్చరించింది. మరోవైపు, ఉద్దేశపూర్వకంగానే విమానాల సంక్షోభం సృష్డించి దానికి డీజీసీఏ నిబంధనలు సాకుగా చూపుతుందని ఆరోపించింది. రద్దైన విమానాల సమాచారం కోసం వెంటనే ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని ఇండిగోకు ఆదేశాలు జారీ చేసింది. -
బలీయ బంధమే ధ్యేయం
-
ఉన్నత శిఖరాలకు మన బంధం. ఇండియా-రష్యా సదస్సులో సంయుక్త ప్రకటన చేసిన మోదీ, పుతిన్
-
మురుకులు,ములక్కాయ చారుతో మొదలై..
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యంత ఇష్టంగా లాగించే ములక్కాయ చారును పుతిన్ రుచిచూశారు. పుతిన్కు గౌరవార్థం రాష్ట్రపతి ముర్ము శుక్రవారం రాత్రి రాష్ట్రపతిభవన్లో ఇచి్చన విందులో పలు భారతీయ వంటకాలను ఆయనకు వడ్డించారు. సూప్ల కేటగిరీలో మెనూ కార్డులో మొట్టమొదట ములక్కాయ చారు పేరును చేర్చారు. ఆకలిని పెంచే అపిటైజర్ల జాబితాలో కశీ్మరీ స్టైల్లో వాల్నట్లను కలిపిన గుచ్చీ డూన్ చెటిన్, మినప వడలను, కూరగాయలతో నింపిన జోల్ మోమోలును పుతిన్కు వడ్డించారు. ఇక మెయిన్ కోర్స్లో జాఫ్రానీ పనీర్, పాలకూర మెంతికూర పచి్చబఠానీల కూరలతోపాటు పెరుగు, మసాలా దట్టించిన తందూరీ భార్వాన్ ఆలూ, చిన్న వంకాయలతో చేసిన ఆఛారీ బైగన్లనూ పుతిన్కు వడ్డించారు.టమాట, ఉల్లిగడ్డ కలబోతగా వండిన కందిపప్పు కూర సైతం వడ్డించారు. గోంగూర పచ్చడి, మామిడి పచ్చళ్లను సైతం పుతిన్ రుచిచూశారు. డ్రై ఫ్రూట్స్ వేసిన సాఫ్రాన్ పులావ్ను పుతిన్ రుచిచూశారు. లచ్ఛా పరంఠా, మగజ్ నాన్, సతనాజ్ రోటీ, మిస్సీ రోటీ, బిస్కటీ రోటీలను ప్రత్యేకంగా వడ్డించారు. బాదం హల్వా, కేసర్ పిస్తా కులీ్ఫలనూ విడిగా అందించారు.తొలుత అగ్రనేతలతో పిచ్ఛాపాటీగా మాట్లాడేటప్పుడు తెలుగు ప్రజలు ఇష్టంగా తినే మురుకులతోపాటు బెంగాళీ గురు సందేశ్ మిఠాయిని పుతిన్కు ఇచ్చారు. దానిమ్మ, బత్తాయి, క్యారెట్ జ్యూస్లను సిద్ధంగా ఉంచారు. బీట్రూట్, ఖామన్ ఖాక్డీ, కామ్రాక్ బూందీ రైతా కలిపిన షర్కార్కండీ పాపడీ చాట్, అరటి చిప్స్ను అందించారు. సమీపంలో భారతీయ, రష్యన్ వాద్య పరికరాలతో సంగీత విభావరి నిర్వహించారు. సరోద్, సారంగి, తబ్లాలతో రాష్ట్రపతిభవన్ నేవీ వాద్య బృందం అద్బుత ప్రదర్శన ఇచ్చింది. పుతిన్ను పొగిడిన ముర్ము భారత్–రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యానికి పాతికేళ్లు పూర్తవుతున్న వేళ పుతిన్ భారత్లో పర్యటించడం సంతోషదాయకమని రాష్ట్రపతి ముర్ము అన్నారు. విందు సందర్భంగా ముర్ము కొద్దిసేపు మాట్లాడారు. ‘‘శాంతి, సుస్థిరత, సామాజిక, ఆర్థిక, సాంకేతిక పురోగతే లక్ష్యంగా ఇరుదేశాల భాగస్వామ్యం ముందుకు సాగుతోంది. ఇరుదేశాల బహుముఖ భాగస్వామ్య వాణిజ్యం, ఆర్థిక, రక్షణ, పౌర అణు సహకారం, అంతరిక్షం, శా్రస్తాసాంకేతిక, విద్య, సాంస్కృతి సంబంధాల్లో మరింత ఫలవంతమవుతోంది’’అని ముర్ము అన్నారు. రష్యాకు బయల్దేరిన పుతిన్ రాష్ట్రపతిభవన్లో విందు తర్వాత పుతిన్ తన రెండ్రోజుల భారత పర్యటనను ముగించుకుని రష్యాకు బయల్దేరి వెళ్లారు. రాష్ట్రపతిభవన్ నుంచి నేరుగా ఢిల్లీ లోని పాలం ఎయిర్పోర్ట్కు చేరుకుని సొంత విమానంలో రష్యాకు పయనమయ్యారు. మంత్రి ఎస్.జైశంకర్ పుతిన్కు ఎయిర్పోర్ట్లో వీడ్కోలు పలికారు. -
బలీయ బంధమే ధ్యేయం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 23వ ఇండియా–రష్యా సదస్సులో శుక్రవారం కీలక అంశాలపై చర్చించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్తోపాటు ఇరుదేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. భారత్, రష్యా మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని మోదీ, పుతిన్ నిర్ణయానికొచ్చారు. రెండు దేశాల నడుమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రకటించి ఈ ఏడాది అక్టోబర్ నాటికి 25 ఏళ్లు పూర్తికావడం విశేషం. సదస్సు అనంతరం మోదీ, పుతిన్ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.భారత్, రష్యా సంబంధాలకు పరస్పర విశ్వాసం, జాతీయ ప్రయోజనాల పట్ల పరస్పర గౌరవమే పునాది అని ఉద్ఘాటించారు. ప్రపంచ శాంతి, స్థిరత్వానికి రెండు దేశాల భాగస్వామ్యం దోహదపడుతున్నట్లు వివరించారు. ప్రస్తుత ప్రపంచ భౌగోళిక రాజకీయాలు, కొన్ని ప్రాంతాల్లో ఘర్షణల నేపథ్యంలో ఇరుదేశాల బంధానికి మరింత ప్రాధాన్యం పెరిగిందని పేర్కొన్నారు. రష్యాలోని యెకటెరిన్బర్గ్, కజన్ నగరాల్లో భారత కాన్సులేట్లు ప్రారంభం కావడాన్ని మోదీ, పుతిన్ స్వాగతించారు. ఉమ్మడి ప్రకటనలోని ముఖ్యాంశాలివీ.. ⇒ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సమతుల్యంగా, సుస్థిరమైన రీతిలో పెంపొందించుకోవాలి. భారత్ నుంచి రష్యాకు ఎగమతులు భారీగా పెంచాలి. పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేసుకోవాలి. కొత్తగా సాంకేతికత, పెట్టుబడుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాలి. ఆధునిక రంగాల్లో కలిసి పని చేయడానికి నూతన అవకాశాలను అన్వేíÙంచాలి. 2030 నాటికి ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చాలి. ⇒ భారత్, రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇంధన రంగమే మూలస్తంభం. అందుకే ఈ రంగంలో సహకారాన్ని విస్తరింపజేసుకోవాలి. ఇంధన రంగంలో పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. కొత్త పెట్టుబడులను ప్రోత్సహించాలి. ⇒ రెండు దేశాల నడుమ స్థిరమైన, ప్రభావవంతమైన రవాణా కారిడార్ల నిర్మాణానికి సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. సరుకు రవాణా వ్యవస్థను, ఇరుదేశాల అనుసంధానాన్ని మెరుగుపర్చాలి. మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని ఇంకా పెంచాలి. ⇒ రష్యన్ ఫెడరేషన్లోని దూర ప్రాచ్యం, ఆర్కిటిక్ జోన్లలో వాణిజ్యం, పెట్టుబడుల సహకారాన్ని పెంచుకోవాలి. ఆర్కిటిక్ ప్రాంతానికి సంబంధించి తరచుగా ద్వైపాక్షిక సంప్రదింపులు జరపాలి. ఆర్కిటిక్ కౌన్సిల్లో పరిశీలక దేశం హోదా పాత్ర పోషించడానికి భారత్ సంసిద్ధత. ⇒ అణు ఇంధన రంగంలో సహకారం బలోపేతం కావాలి. న్యూక్లియర్ ఎనర్జీని శాంతియుత ప్రయోజనాల కోసమే వాడుకోవాలి. రెండు దేశాలు అందుకు మద్దతివ్వాలి. అణు విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు సహకరించుకోవాలి. అలాగే అంతరిక్ష రంగంలోనూ సహకారం బలపడాలి. మానవ సహిత అంతరిక్ష కార్యక్రమాలు, శాటిలైట్ నావిగేషన్, ప్లానెటరీ ప్రయోగాల్లో పరిజ్ఞానాన్ని పంచుకోవాలి. రాకెట్ ఇంజన్ల అభివృద్ధి, ఉత్పత్తిలో పరస్పరం ప్రయోజనం పొందేలా కలిసి పనిచేయాలి. ⇒ సైనిక, సైనిక సాంకేతిక సహకారాన్ని కూడా పెంపొందించుకోవాలి. సైనిక సామగ్రి విడిభాగాలను భారత్లో తయారు చేయాలి. ఇందుకు రష్యా సహకరిస్తుంది. రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి రష్యా తోడ్పాటు లభిస్తుంది. భారత సైనిక దళాల అవసరాలు తీర్చేలా ఉమ్మడి వెంచర్లు ఏర్పాటు చేయాలి. మిత్రదేశాలకు భారత్ నుంచి సైనిక సామగ్రి, ఆయుధాలను ఎగుమతి చేయాలి. ⇒ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత దృఢంగా మార్చుకోవాలి. ఇరుదేశాల ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు కలిసి పనిచేసేలా ప్రోత్సహించాలి. అరుదైన ఖనిజాల అన్వేషణ, వెలికితీత, శుద్ధి, రీసైక్లింగ్కు ఉమ్మడి కృషి అవసరం. సైన్స్, టెక్నాలజీ, నూతన ఆవిష్కరణల్లో ఉమ్మడి పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలి. డిజిటల్ టెక్నాలజీలో సహకారాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇరుదేశాల విద్యాసంస్థలు, శాస్త్రీయ సంస్థల మధ్య భాగస్వామ్యం బలపడాలి. ⇒ భారత్, రష్యా స్నేహ సంబంధాలకు సంస్కృతుల అనుసంధానం, ప్రజల అనుసంధానం అత్యంత కీలకం. మరింత లోతైన సంబంధాల కోసం రెండు దేశాల్లో సాంస్కృతిక వేడుకలు, పుస్తక ప్రదర్శనలు, పండుగలు, కళాత్మక పోటీలు నిర్వహించాలి. ఇందులో ప్రజలను భాగస్వాములను చేయాలి. ఒక దేశం సంస్కృతి సంప్రదాయాల గురించి మరో దేశంలోని ప్రజలు తెలుసుకోవాలి. దీంతో వారి మధ్య అనుబంధం మరింత పెరుగుతుంది. సినీ పరిశ్రమ విషయంలోనూ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఉమ్మడి ఫిలిం ప్రొడక్షన్ను అభివృద్ధి చేయాలి. అలాగే పర్యటనలను ప్రోత్సహించాలి. ఇందుకోసం వీసా నిబంధనలు సరళతరం చేయాలి. రెండు దేశాలు ఈ–వీసా విధానం తీసుకురావాలి. అలాగే భారత్, రష్యాలకు చెందిన యూనివర్సిటీలు, విద్యా సంస్థల మధ్య భాగస్వామ్యం బలోపేతమయ్యేలా చర్యలు చేపట్టాలి.⇒ ఐక్యరాజ్యసమితిలో కీలక అంశాలపై ఉన్నతస్థాయి రాజకీయ దౌత్యం, సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలి. యూఎన్ చార్టర్ను గౌరవించాలి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సమగ్ర సంస్కరణలు చేపట్టేలా ఉమ్మడిగా కృషి చేయాలి. అంతర్జాతీయ శాంతి, భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేలా మండలిని ప్రభావవంతంగా తీర్చిదిద్దాలి. భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించాలి. ఇందుకు రష్యా సహకరిస్తుంది. జీ20 కూటమిలోనూ భారత్, రష్యా కలిసి పనిచేయాలి. అంతేకాకుండా ‘బ్రిక్స్’లో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలి. అణు సరఫరాదారుల గ్రూప్లో భారత్కు సభ్యత్వం కలి్పంచడానికి రష్యా సహకారం అందజేస్తుంది. ⇒ ఉగ్రవాదం పెను ముప్పుగా మారింది. ఇదొక ఉమ్మడి సవాలు. ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాటం చేయాల్సిందే. తీవ్రవాదం, సంస్థాగత నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక వనరులు సమకూర్చే ముఠాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తదితర అంశాలపై పోరాటం కొనసాగించాలి. ఉగ్రవాదం ఎక్కడ ఏ రూపంలో ఉన్నా సరే అంతం చేయాలి. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ సంస్థల్లో తీర్మానం చేసేలా ఒత్తిడి పెంచాలి. -
ఉన్నత శిఖరాలకు మన బంధం
న్యూఢిల్లీ: భారత్, రష్యా ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత శిఖరాలకు చేర్చాలని ఇరుదేశాల అధినేతలు నిర్ణయించారు. ఎనిమిది దశాబ్దాల స్నేహ సంబంధాలకు నూతన శక్తి, వేగాన్ని జోడించాలని తీర్మానించారు. అమెరికా టారిఫ్లు, ఆంక్షల నేపథ్యంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయానికొచ్చారు. ఇందులో భాగంగా ఆర్థిక–వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారానికి ఐదేళ్ల ప్రణాళికను ప్రకటించారు.ఉక్రెయిన్లో ఘర్షణకు సాధ్యమైనంత త్వరగా తెరపడాలని తాము కోరుకుంటున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధినేత పుతిన్కు స్పష్టంచేశారు. శాంతియుత మార్గాల్లో సమస్య పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. ఉక్రెయిన్–రష్యా విషయంలో భారత్ తటస్థంగా లేదని.. శాంతిపక్షం వైపే ఉందని స్పష్టంచేశారు. ఆ రెండు దేశాల మధ్య శాశ్వత శాంతికి తమ వంతు సహకారం కచ్చితంగా అందిస్తామన్నారు. మోదీ, పుతిన్ శుక్రవారం ఢిల్లీలో 23వ భారత్–రష్యా సదస్సులో పాల్గొన్నారు. ఇరుదేశాల సంబంధాల్లో పురోగతితోపాటు ముఖ్యమైన అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా ఆరోగ్యం, రవాణా, వలసలు, ఆహార భద్రత, షిప్పింగ్, ప్రజల మధ్య అనుసంధానం తదితర అంశాల్లో పరస్పర సహకారానికి సంబంధించి ఇరుపక్షాలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రక్షణ రంగంలో ఆయుధాలు, మిలటరీ హార్డ్వేర్ తయారీలో సహకారానికి ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య వార్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా ‘ఆర్థిక సహకార కార్యక్రమం’పై భారత్, రష్యా అంగీకారానికి వచ్చాయి. సదస్సు అనంతరం మోదీ, పుతిన్ ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు.ధ్రువ నక్షత్రంలా మన స్నేహం ప్రపంచం గత ఎనిమిది దశాబ్దాలుగా ఎన్నో ఒడిదొడుకులకు, సమస్యలకు సాక్షిగా నిలుస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. మానవాళికి సవాళ్లు, సంక్షోభాలు ఎదురవుతూనే ఉన్నాయని తెలిపారు. ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో ఎలాంటి ప్రతికూల పరిణామాలు సంభవించినా భారత్–రష్యా స్నేహం మాత్రం ధ్రువ నక్షత్రంలా స్థిరంగా నిలిచే ఉంటోందని స్పష్టంచేశారు. పరస్పర గౌరవం, లోతైన విశ్వాసం ఆధారంగా ఈ బంధం నిర్మితమైందని, కాల పరీక్షకు నిలిచిందని అన్నారు. ఈ పునాదిని ఇంకా పటిష్టంగా మార్చుకొనే దిశగా పరస్పర సహకారమే లక్ష్యంగా అన్ని అంశాలపై చర్చించామని చెప్పారు. ఆర్థిక సహకారాన్ని కొత్త శిఖరాలకు చేర్చడం ఉమ్మడి ప్రాధాన్యత కలిగిన అంశమని వివరించారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను వైవిధ్యంగా, సమతుల్యంగా, సుస్థిరంగా మార్చబోతున్నట్లు వివరించారు. రష్యా పౌరుల కోసం 30 రోజుల ఉచిత ఈ–టూరిసుŠట్ వీసా, 30 రోజుల ఉచిత గ్రూప్ టూరిస్ట్ వీసాను మోదీ ప్రకటించారు. త్వరలోనే ఇవి అమల్లోకి వస్తాయన్నారు.ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేయాలిభారత్–రష్యా భాగస్వామ్యానికి ఇంధన భద్రత, పౌర అణు ఇంధన రంగాల్లో సహకారం చాలా కీలకమని ప్రధాని గుర్తుచేశారు. ఇరుదేశాల నడుము ‘గెలుపు–గెలుపు సహకారాన్ని’ ఇలాగే కొనసాగిస్తామన్నారు. ప్రపంచమంతటా సప్లై చైన్స్ భద్రంగా, వైవిధ్యంగా ఉండాలంటే భారత్, రష్యా మధ్య అరుదైన ఖనిజాల విషయంలో సహకారం చాలా ముఖ్యమ న్నారు. ఉగ్రవాదంపై పోరాటంపై రెండు దేశాలు భుజం భుజం కలిపి పనిచేస్తున్నాయని గుర్తుచేశారు. భారత్లోని పహల్గాం ఉగ్రదాడి, రష్యాలోని క్రోకస్ సిటీ హాల్పై ఉగ్రదాడి మూలాలు ఒక్కలేనని చెప్పారు. ఉగ్రవాదం అనేది మానవీయ విలువలపై ప్రత్యక్ష దాడిగా మోదీ అభివరి్ణంచారు. ఉగ్రవాద రక్కసిని ఖతం చేయడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. రహస్య అజెండాలు, ద్వంద్వ ప్రమాణాలు పక్కనపెట్టి ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేయాలని ప్రపంచ దేశాలకు స్పష్టంచేశారు.‘మేక్ ఇన్ ఇండియా’కు చోదక శక్తి భారత్, రష్యా ప్రజల మధ్య అనుసంధానం మరింత పెరగాలని నరేంద్ర మోదీ చెప్పారు. ఇందుకోసం ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, నార్తన్ సీ రూట్, చెన్నై–వ్లాడివోస్తోక్ కారిడార్కు శ్రీకారం చుట్టినట్లు తెలియజేశారు. రష్యా సహకారంతో ధ్రువపు ప్రాంతాల్లో భారత నావికులకు శిక్షణ ఇవ్వపోతున్నట్లు ప్రకటించారు. దీనివల్ల భారతీయ యువతకు నూతన ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. నౌకల నిర్మాణంలో సహకారాన్ని మెరుగుపర్చుకుంటున్నామని, ‘మేక్ ఇన్ ఇండియా’కు ఇదొక చోదక శక్తి అవుతుందన్నారు. భారత్–రష్యా సంబంధాలను బలోపేతం చేయడానికి తిరుగులేని అంకితభావం ప్రదర్శిస్తున్నారంటూ పుతిన్పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. మానవ వనరులను ఇచ్చి పుచ్చుకోవడానికి రష్యాతో రెండు ఒప్పందాలు చేసుకున్నామని వెల్లడించారు.భారత ఇంధన అవసరాలు తీరుస్తాంభారత్, రష్యా మధ్య ప్రస్తుతం ఏటా 64 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోందని, దీన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచబోతున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తేల్చి చెప్పారు. తమపై ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా, ఆంక్షలు విధించినా భారత ఇంధన అవసరాలను తీరుస్తామని హామీ ఇచ్చారు. చమురు, గ్యాస్, బొగ్గు సరఫరా విషయంలో తాము విశ్వసనీయమైన సరఫరాదారులమని తేలి్చచెప్పారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయిన భారత్కు నిరంతరాయంగా ఇంధనం సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు. భారత ఉత్పత్తుల కోసం రష్యా మార్కెట్లను మరింతగా అందుబాటులోకి తీసుకొస్తామని పుతిన్ సంకేతాలిచ్చారు. అలాగే చిన్న, మధ్య తరహా అణు రియాక్టర్లు, ఫ్లోటింగ్ అణు విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్మాణానికి సహకరించుకోవడానికి భారత్, రష్యా ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు.వ్యవసాయం, ఔషధాల వంటి రంగాల్లో అణు టెక్నాలజీని వాడుకోవడానికి భారత్కు సహకరిస్తామన్నారు. భద్రత, ఆర్థికం, వాణిజ్యం, సంస్కృతి వంటి రంగాల్లో సహకారానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వ్యాఖ్యానించారు. భారత్, రష్యాలు ఒకేరకమైన ఆలోచనా ధోరణితో బహుళ ధ్రువపు ప్రపంచ దిశగా పని చేస్తున్నాయని పుతిన్ పేర్కొన్నారు. మరోవైపు ఉక్రెయిన్ విషయంలో శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని వివరించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని పుతిన్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాద భూతాన్ని భూస్థాపితం చేయాల్సిందేనని పేర్కొన్నారు.11 ఒప్పందాలపై సంతకాలు 23వ ఇండియా–రష్యా సదస్సు సందర్భంగా మొత్తం 11 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. నైపుణ్యం కలిగిన కారి్మకుల వలసలు, ఆహార భద్రత, షిప్పింగ్, ఎరువులు, ఆరోగ్య సంరక్షణ, శాస్త్రీయ పరిశోధనలు, విద్య తదితర రంగాల్లో పరస్పర సహకారానికి ఈ ఒప్పందాలు కుదిరాయి. ప్రతిభావంతులైన భారతీయ కార్మికులను తమ దేశంలో నియమించుకోవడానికి వీలుగా రష్యా ప్రభుత్వం భారత్తో ఒప్పందం కుదుర్చుకుంది. -
శిఖరాగ్ర బంధం!.. రష్యాతో అనుబంధం
సంక్లిష్ట సమయాల్లో సైతం నమ్మకమైన నేస్తంగా నిరూపించుకున్న రష్యాతో అనుబంధం మరింత దృఢతరమైంది. గురువారం భారత పర్యటన కోసం వచ్చిన రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జరిపిన శిఖరాగ్ర సమావేశమైనా, ఆపై ఇరు దేశాల మధ్యా కుదిరిన ఒప్పందాలైనా ఈ సంగతిని నిరూపిస్తున్నాయి. వర్తమాన ప్రపంచ స్థితిగతులు సజావుగా ఏమీ లేవు. ఉక్రెయిన్తో రష్యా నాలుగేళ్లుగా యుద్ధంలో తలమునకలైంది.గడియకో మాట మాట్లాడే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంగతెలా ఉన్నా యూరప్ దేశాలు ఈ విషయంలో రష్యాపై కత్తులు నూరుతున్నాయి. ఉక్రెయిన్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించటానికి మధ్యమధ్యలో ట్రంప్ ప్రయత్నిస్తున్నా యూరప్ దేశాలు... ప్రధానంగా జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ ఎట్లాగైనా రష్యా మెడలు వంచాలని చూస్తున్నాయి. పుతిన్ భారత పర్యటనకు ముందు ‘మా భద్రతను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించండి’ అంటూ భారత్లో యూరోపియన్ యూనియన్ (ఈయూ) రాయబారి హెర్వ్ డెల్ఫిన్ మనకు చెప్పటం గమనించదగ్గది.రష్యా చమురు కొంటున్నందకు ఇప్పటికే అమెరికా ఆగ్రహించి, మనపై 25 శాతం అదనపు సుంకాలు విధించింది. ఇతరత్రా వాణిజ్య ఒప్పందాలకు బ్రేక్ వేయాలంటూ ఒత్తిళ్లు తెస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం పర్యవసానంగా నాలుగేళ్ల నుంచి రష్యాకు పాశ్చాత్య బ్యాంకింగ్ వ్యవస్థతో లింక్ తెగిపోయింది. వాణిజ్య సంబంధాలూ అంతే. ఇదే సమయంలో మనతో రష్యా ఆర్థిక సంబంధాలు మెరుగయ్యాయి. మన దేశం నిరుడు 5,600 కోట్ల డాలర్ల విలువైన ముడిచమురు కొనుగోలు చేసింది. అమెరికా ఒత్తిడి పర్యవసానంగా ఇటీవల ఆ కొనుగోళ్లు తగ్గినా ఇరు దేశాల వార్షిక వాణిజ్యం 6,870 కోట్ల డాలర్లకు చేరుకుంది. దీన్ని 10,000 కోట్ల డాలర్లకు చేర్చాలని ఇరుదేశాల లక్ష్యం. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక పుతిన్ ఒక దేశంలో అధికారిక పర్యటనకు రావటం ఇదే తొలిసారి.ఈసారి సైనిక సామగ్రి, ఆయుధాలకు సంబంధించికాక ఆర్థిక, వాణిజ్య ఒప్పందాలపైనే ఇరు దేశాలూ కేంద్రీకరించాయి. ఇరు దేశాధినేతల సమక్షంలో సంతకాలైన ఆర్థిక సహకార ఒప్పందం 2030 వరకూ షిప్పింగ్, కెమికల్స్, ఆరోగ్యం వగైరారంగాల్లో పరస్పర సహకారానికి మార్గం సుగమం చేస్తుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దిశగా కలిసి పనిచేయాలని కూడా ఇరు దేశాలూ నిర్ణయించాయి. అయిదో తరం సుఖోయ్ ఎస్యూ–57 యుద్ధ విమానాల అమ్మకానికి రష్యా సుముఖత చూపడమేకాక, వాటిని భారత్లోనే ఉత్పత్తి చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే రష్యా రియాక్టర్లతో రెండో అణువిద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పే అవకాశాన్ని పరిశీలించాలని రెండు దేశాలూ నిర్ణయించాయి. ఈ సమావేశం కోసం మోదీ, పుతిన్లిద్దరూ ఈ ఏడాది అయిదుసార్లు ఫోన్లలో సంభాషించుకోవటంతోపాటు చైనాలోని తియాన్జిన్లో మొన్న సెప్టెంబర్లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్రం సందర్భంగా కలుసుకున్నారు. ఈ పర్యటనలో కుదరబోయే ఒప్పందాలపైనా, ప్రస్తావనకు రాబోయే భిన్న అంశాలపైనా గత ఆర్నెల్లుగా రెండు దేశాలమధ్యా ఉన్నత స్థాయి సమావేశాలు జరిగాయి. మొన్న ఆగస్టులో విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యాను సందర్శించి పుతిన్ను కలిశారు. అంత క్రితం మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా వెళ్లారు. ఇవన్నీ శిఖరాగ్ర సమావేశం విజయవంతం కావటానికి దోహద పడ్డాయి.ఎవరితోనైనా తాము కుదుర్చుకునే ద్వైపాక్షిక ఒప్పందాలు మూడో దేశానికి వ్యతిరేకం కాదని మన దేశం మొదటినుంచీ చెబుతోంది. రష్యాతో సంబంధాల విషయంలో అమెరికా, యూరప్ దేశాల ఒత్తిళ్లు పనిచేయబోవని ఈ శిఖరాగ్ర సమావేశం నిరూపించింది. చైనా–రష్యా సంబంధాలు ప్రస్తుతానికి బాగున్నా, ఆసియాలో తన ప్రయోజనాలను విడనాడుకోవటానికి రష్యా సిద్ధంగా లేదు. అలాగే అమెరికా–చైనా సన్నిహితమవుతున్న తీరును కూడా రష్యా గమనించకపోలేదు. ఎవరెవరితో కలుస్తారో, ఏ కూటములు ఎన్నాళ్లు మనుగడలో ఉంటాయో తెలియని అయోమయ స్థితిలో స్వతంత్ర విదేశాంగ విధానమే సర్వవిధాలా మేలైనదని మన దేశం చాటిచెప్పింది. -
రష్యాలో భారతీయ కార్మికులకు గుడ్ న్యూస్
-
టిట్ ఫర్ టాట్ పడిందా?
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన దగ్గర్నుంచీ అన్ని వివాదాస్పద నిర్ణయాలే తీసుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్.. ప్రధానంగా ప్రతీదేశం తమ అదీనంలో ఉండాలని ఆకాంక్ష ట్రంప్లో బలంగా నాటుకుపోయినట్లుంది. అందుకే ఆ దేశం, ఈ దేశం అని లేదు.. అన్ని దేశాలను తన చర్యలతో భయపెడుతున్నారు. తమది అగ్రరాజ్యమనే అహంకార భావనలో ఉన్న ట్రంప్ చేస్తున్న చేష్టలు కొన్ని దేశాలకు విసుగుతెప్పిస్తూనే ఉంది.అలా ట్రంప్ చర్యలతో ఎక్కువగా విసుగుపోయిన దేశాలలో రష్యా ఒకటి, భారత్ మరొకటి. ముఖ్యంగా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని ట్రంప్ తీవ్రంగా ఆక్షేపించారు. అదే సమయంలో భారత్కు ఆంక్షలు కూడా విధించారు. ‘ మీరు రష్యా ఆయిల్ కొనడానికి వీల్లేదనే హుకుం జారీ చేశారు. ఇది రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని ఆపడానికని శాంతి ప్రవచనాలు కూడా చేశారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయడాన్ని ఎంతవరకూ నియంత్రించారో తెలీదు కానీ, రష్యా మాత్రం మళ్లీ భారత్కు చమురు సరఫరా కొనసాగిస్తామని స్పష్టం చేసింది. భారత్కు చమురు కొనసాగిస్తాం.. : పుతిన్ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. మీడియా సాక్షిగా భారత్కు అన్ని రకాల చమురు కొనసాగిస్తామని పేర్కొన్నారు. అమెరికా భయపెడితే భయపడిపోవడానికి తామేమీ చిన్న పిల్లలం(చిన్న దేశం) కాదనే సంకేతం ఇచ్చారు పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్న పుతిన్.. ఇరు దేశాల మధ్య ఒప్పందాల గురించి వివరించే క్రమంలో చమురును భారత్కు యథావిధిగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.అసలే పుతిన్ భారత్ పర్యటనపై ఫుల్ ఫోకస్ పెట్టిన ట్రంప్.. ఈ మాట అనేసరికి నోట్లో వెలక్కాయపడినట్లు అవ్వడం ఖాయం. పుతిన్-మోదీలు ఏం చెబుతారా అనే ఆసక్తిగా గమనిస్తున్న అగ్రరాజ్యం అమెరికా.. పుతిన్ మాటలకు చిర్రెత్తుకొచ్చినట్లు అయ్యి ఉంటుంది. గతంలో వైట్హౌస్ వేదికగా పుతిన్-ట్రంప్ల మధ్య భేటీ జరిగింది. ఆ భేటీ కూడా సజావుగా సాగలేదు. తమ ఆంక్షలకు కట్టుబడి ఉండాలనే ఒత్తిడితో ఆ భేటీ సఫలం కాలేదు. ‘శాంతి’ చర్యలు అంటూ పలు దేశాలకు తలనొప్పివేరే దేశాన్ని నియంత్రించాలని అనుకోవడం ఎంతవరకూ సబబు అనేదే ఇక్కడ ప్రశ్న. ఎంతటి అగ్రజుడు అయినా తమ అధీనంలో అంతా ఉండాలని అనుకోవడం అవివేకం. వీటికి ఎన్నో కథలు, ఉదాహారణలు, సామెతలు కూడా ఉన్నాయి. అవన్నీ మనకు తెలిసినవే. ఇప్పటి వరకూ ట్రంప్ చేసింది ఏదైనా ఉందంటే అది తన ‘శాంతి’ చర్యలతో మిగతా దేశాలని నొప్పించడమే జరుగుతుంది. ఇక్కడ తమ మాట వింటే ఒక రకంగా, మాట వినకపోతే మరో రకంగా ట్రంప్ ప్రవర్తిస్తున్నారు. గతంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత ‘కశ్మీర్’ అంశాన్ని తాను పరిష్కరిస్తానని ట్రంప్ చెప్పిన మాటలు ఇప్పటికీ మనకు గుర్తే. ఆ మాటలకు భారత ప్రధాని మోదీ కూడా స్ట్రాంగ్గానే సమాధానం ఇచ్చారు. తమ సమస్యను పరిష్కరించడానికి ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని తేల్చిచెప్పారు. తమ సమస్యను పరిష్కరించుకునే సత్తా తమకు ఉందని ట్రంప్ను పరోక్షంగా హెచ్చరించారు. అంటే పుతిన్-మోదీలిద్దరూ ట్రంప్ను అంతగా పట్టించుకోలేదు. లైట్ తీసుకున్నారు. స్నేహ ధర్మంలో హద్దులు దాటి ‘సరిహద్దులు’ వరకూ వస్తే ఊరుకోమని సంకేతాలు పంపుతూనే ఉన్నారు. అందుకే మోదీ-పుతిన్ల భేటీపై ట్రంప్ సీరియస్ లుక్ వేసి ఉంచారు. ప్రస్తుతం పుతిన్ చేసిన వ్యాఖ్యలు ట్రంప్కు వినబడ్డాయా.. లేదా అనే రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఇదీ చదవండి:పాక్తో ఇంకా సంబంధాలెందుకు?: అమెరికా ఎంపీల డిమాండ్ -
భారత్ - రష్యా మధ్య కీలక ఒప్పందాలు
-
భారత్కు రష్యా నిజమైన స్నేహితుడు
-
భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందాలు
ఢిల్లీ: భారత్-రష్యాలమధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనలో భాగంగా పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. వివిద రంగాల్లో పరస్పర సహకారానికి ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఇరు దేశాల మధ్య సహకారం వలస విధానంపై ఒప్పందంతో పాటు, ఆహార భద్రత, వైద్య, ఆరోగ్య రంగాలపై ఒప్పందం, కెమికల్ ఫెర్టిలైజర్స్ సరఫరాపై ఇరు దేశాల మధ్య ఒప్పందం, సముద్ర ఆహార ఉత్పత్తులపైనా ఒప్పందాలు జరిగాయి.దీనిలో భాగంగా భారత్ ప్రధాని నరేంద్ర మోదీ-రష్యా అధ్యక్షడు పుతిన్ల సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా భారత ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్-రష్యాల మధ్య కీలక ఒప్పందాలపై కీలక సంతకాలు జరిగాయన్నారు. ‘పుతిన్ నేతృత్వంలో భారత్-రష్యాల సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయి. గత ఎనిమిది దశాబ్దాలలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాం.భారత్-రష్యాల మధ్య స్నేహం శాశ్వతంగా ఉంటుంది. రష్యా ఎప్పట్నుంచో మనకు మిత్రదేశం. 2030 వరకూ ఇరు దేశాల మధ్య అనేక ఆర్థిక సహకార ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు శిఖరాగ్రానికి చేరతాయి’ అని స్పష్టం చేశారు.అనంతరం పుతిన్ మాట్లాడుతూ.. ‘ నాకు అపూర్వ స్వాగతం పలికిన భారతీయులందరికీ కృతజ్ఞతలు. భారత ఆతిథ్యం సంతోషాన్ని ఇచ్చింది. భారత్-రష్యాల మధ్య సహృద్భావ వాతావరణం. నేను మోదీతో అంతర్జాతీయ అంశాలను షేర్ చేసుకున్నా. ఆర్థిక, భద్రత తదితర అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నాం. అనేక అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి.. మోదీతో నిర్మాణాత్మక చర్చలు జరిగాయి. భారత్, రష్యాల మధ్య రవాణా అనుసంధానం పెంచడం మా లక్ష్యం. మేకిన్ ఇండియాకు మా మద్యతు ఉంటుంది. భారత్కు చముర సరఫరాను కొనసాగిస్తాం’ అని తేల్చి చెప్పారు పుతిన్. -
భారత్కు అండగా రష్యా.. పుతిన్పై ట్రంప్ ఫుల్ ఫోకస్?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనలో ఉన్నారు. 2021 తర్వాత భారత పర్యటనకు పుతిన్ రావడం ఇదే తొలిసారి. అలాగే, 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత భారత పర్యటనకు పుతిన్ వచ్చిన నేపథ్యంలో మరింత ప్రాధాన్యత చోటుచేసుకుంది. కాగా, పుతిన్ పర్యటనలో భాగంగా భారత్, రష్యా మధ్య వాణిజ్య, రక్షణ రంగానికి సంబంధించి కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. అయితే, పుతిన్ భారత పర్యటనలో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇందుకు కారణంగా భారత్కు రష్యా మిత్ర దేశం కావడమే.రష్యా అధ్యక్షుడిగా పుతిన్ పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పలు దేశాల్లో అనేకమంది పాలకులు మారారు. దాదాపు పాతికేళ్లుగా పుతిన్ అధికారంలో కొనసాగుతున్నారు. ఈ కాలంలో అమెరికాలో ఐదుగురు అధ్యక్షులు మారారు. భారత్ ముగ్గురు ప్రధానులను చూసింది. పుతిన్ తప్ప మరో అధ్యక్షుడి పేరు తెలియని యువ ఓటర్లు రష్యాలో చాలా మందే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. పుతిన్ హయాంలో భారత్, రష్యా మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. రష్యా నేతలు భారత్ ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేశారని గతంలో ఒకసారి పుతిన్ వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా పుతిన్ తొలి భారత పర్యటన అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో జరిగింది. ఆ పర్యటన ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి బాటలు వేసింది. ఇప్పుడు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి.ఆయుధాలు రష్యావే.. భారత్ రష్యా రక్షణ పరిశ్రమకు పెద్ద మార్కెట్గా ఉంది. భారత సాయుధ దళాలు వినియోగించే ఆయుధాల్లో 36 శాతం రష్యావే. రక్షణ సహకారం, లాజిస్టిక్స్ ఒప్పందాల్లో భాగంగా మరిన్ని S-400 గగనతల రక్షణ వ్యవస్థలతో పాటు ఐదోతరం సుఖోయ్-57 యుద్ధ విమానాల కొనుగోలుపై చర్చలు, ఒప్పందాలు ఎజెండాలో ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్లో పాక్ దాడుల నుంచి భారత్కు రక్షణ కవచంలా నిలిచిన S-400కు అప్డేటెడ్ వర్షనైన S-500 గగనతల రక్షణ వ్యవస్థ అమ్మకాలపై ఇరుదేశాలు ఓ అవగాహనకు రానున్నట్లు తెలుస్తోంది. ఇక, మిగ్–29, బ్రహ్మోస్ క్షిపణులు, అణు జలాంతర్గాములు వంటి కీలక వ్యవస్థలు రష్యా సహకారంతోనే నడిచాయి. మరోవైపు.. చైనా సైతం భారత్-రష్యా సంబంధాలు అత్యంత వ్యూహాత్మకమైనవి, ప్రపంచ రాజకీయ ఒత్తిళ్లకు లోబడనిది అని పేర్కొంది.కీలక ఒప్పందాలు ఇలా.. 1. RELOS ఒప్పందం (Reciprocal Exchange of Logistic Support)- రష్యా పార్లమెంట్ 2025లో ఆమోదించిన కీలక ఒప్పందం.- రెండు దేశాల సైన్యాలు ఒకరి నౌకాదళ, వైమానిక స్థావరాలు, లాజిస్టిక్ సదుపాయాలు ఉపయోగించుకోవచ్చు.2. 2021–2031 సైనిక-సాంకేతిక సహకార కార్యక్రమం- 2021లో 2+2లో సంతకం.- పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి, ఆఫ్టర్-సేల్స్ సపోర్ట్ వంటి విభాగాల్లో దీర్ఘకాలిక సహకారం.3. సుఖోయ్–30 MKI ఒప్పందం- 1996లో మొదటి ఒప్పందం.- 50 విమానాల కొనుగోలు, 140 విమానాల HALలో లైసెన్స్ ఉత్పత్తి.4. బ్రహ్మోస్ క్షిపణి సంయుక్త ప్రాజెక్ట్- భారత్-రష్యా సంయుక్త సంస్థ (BrahMos Aerospace).- ప్రపంచంలోనే వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ వ్యవస్థ.5. మిగ్–29 అప్గ్రేడ్, కొనుగోలు ఒప్పందాలు- పలు దశల్లో మిగ్–29 విమానాల కొనుగోలు, అప్గ్రేడ్.6. అణు జలాంతర్గామి (INS Chakra) లీజ్ ఒప్పందాలు- రష్యా నుండి అణు శక్తితో నడిచే జలాంతర్గాముల లీజ్.7. S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒప్పందం- 2018లో సంతకం.- ఐదు రెజిమెంట్ల కొనుగోలు.8. కా-226T హెలికాప్టర్ సంయుక్త ఉత్పత్తి ఒప్పందం- భారత్లో తయారీకి ఒప్పందం (Make in India).9. AK-203 అసాల్ట్ రైఫిల్ ఉత్పత్తి ఒప్పందం- ఉత్తరప్రదేశ్లో సంయుక్త ఉత్పత్తి.10. పది అంతర్ ప్రభుత్వ ఒప్పందాలు, 15 వాణిజ్య ఒప్పందాలు (2025)- పుతిన్ పర్యటనలో సంతకం చేయడానికి సిద్ధం చేసిన ప్యాకేజ్.11. సంయుక్త సైనిక విన్యాసాలు- ఇండ్రా (INDRA)- అవియాడ్రిల్- నౌకాదళ, వైమానిక, భూసేనల సంయుక్త వ్యాయామాలు.12. అంతరిక్ష–రక్షణ సహకారం- గగనయాన్ వ్యోమగాముల శిక్షణలో రష్యా పాత్ర.- అంతరిక్ష–రక్షణ రంగంలో కొత్త ఒప్పందాలు పుతిన్ పర్యటనలో చర్చించబడ్డాయి.రష్యా-ఉక్రెయిన్ అంశం.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి భారత్ ఎంతో సంయమనం పాటించింది. రెండు దేశాల శాంతి కోసమే ప్రయత్నాలు చేసింది. ఓవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరుపుతూనే.. రష్యా దూరం కాకుండా ముందుకు సాగింది. రష్యా నుంచి చమురు విషయంలోనూ భారత్ ప్లాన్ ప్రకారం నడుచుకుంది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి మరోలా ఉంది. 50 శాతం దిగుమతి సుంకాలతో భారత్ను లొంగదీసుకోవచ్చని ఆయన భావించారు. కానీ అది జరగలేదు. అమెరికాకు అనుకూలమా? వ్యతిరేకమా? ఏదో ఒకటి చెప్పేయండి అంటూ భారత్కు ట్రంప్ అల్టిమేటం ఇచ్చారు. అయినా రష్యాతో స్నేహ బంధాన్ని భారత్ తెంచుకోలేదు. దేశ ప్రజల ప్రయోజనాలే తమకు ఎక్కువని గతంలో భారత్ పలుమార్లు స్పష్టం చేసింది. పుతిన్ పర్యటన వేళ కూడా ఇదే దిశగా ఒప్పందాలు, నిర్ణయాలు ఉంటాయని విదేశాంగ వ్యవహారాల పరిశీలకులు అంచనా వేస్తున్నారు.రష్యాతో వాణిజ్యం.. 2024-25లో భారత్ రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం 68.7 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత్ 4.9 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను రష్యాకు ఎగుమతి చేయగా.. రష్యా నుంచి ఏకంగా 64 బిలియన్ డాలర్ల దిగుమతులను చేసుకుంది. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యాన్ని ఇరుపక్షాలు ప్రకటించాయి. పుతిన్ పర్యటనలో ఇంధనం ప్రముఖంగా ప్రస్తావనకు రానుంది. భారత్కు తక్కువ ధరకే రష్యా ముడి చమురును సరఫరా చేస్తోంది. ఇది రెండు దేశాలకూ ప్రయోజనకరంగా ఉన్న వేళ ఇంధన కొనుగోళ్లపై మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. భారత అణు పరిశ్రమలో రష్యా సహకారం మరవలేనిది. పుతిన్ పర్యటన వేళ.. పౌర అణు సహకారంలో భాగంగా అణుశక్తిపై ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. చిన్న రియాక్టర్లను ఉత్పత్తి చేయడంలో అపార అనుభవనం ఉన్న రష్యా.. వాటిని భారత్కు ఆఫర్ చేయనున్నట్లు తెలిసింది. కుడంకుళంలో అణుశక్తి ప్రాజెక్టు కొనసాగింపుపై చర్చించనున్నట్లు రష్యా అధికారులు తెలిపారు.ట్రంప్ రియాక్షన్? ఒకవేళ రష్యాతో చమురు అనుబంధాన్ని, రక్షణ రంగ సహకారాన్ని బలోపేతం చేసుకునే దిశగా భారత్ ఒప్పందాలు కుదుర్చుకుంటే, అమెరికా సీరియస్గా స్పందించే ఛాన్స్ ఉంది. ట్రంప్ మరోసారి భారత్పై సుంకాలు విధించినా ఆశ్చర్యపోనక్కర్లేదని పలువురు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాకు కోపాన్ని తెప్పించే నిర్ణయాలు, ఒప్పందాల దిశగా భారత్ ప్రస్తుతానికి అడుగులు వేయకపోవచ్చని వారు అంటున్నారు. అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన అమెరికాతో స్నేహాన్ని కాపాడుకుంటూనే, ఆపద కాలంలో ఆదుకునే రష్యాతో చెలిమిని నిలుపుకునే దిశగా లౌక్యంగా భారత్ ముందుకు సాగుతుందని విశ్లేషిస్తున్నారు.డాలర్కు చెక్ పెట్టే ప్లాన్భారత్, రష్యాలు ప్రస్తుతం అమెరికా డాలరుతో పాటు తమ తమ దేశాల కరెన్సీలలో వాణిజ్య లావాదేవీలు జరుపుతున్నాయి. రానున్న రోజుల్లో పూర్తిగా సొంత కరెన్సీల్లో వాణిజ్యం జరిపేలా వ్యవస్థలను ఏర్పాటు చేసుకునే అంశంపై పుతిన్, మోదీ చర్చించనున్నారు. అందుకే పుతిన్ వెంట రష్యాకు చెందిన స్పర్ బ్యాంక్ సీఈఓ ఇవాన్ నోసోవ్ కూడా వచ్చారు. వాణిజ్య లావాదేవీల ద్వారా రష్యాకు పెద్దమొత్తంలో భారత రూపాయలు చేరాయి. వాటితో భారత్లోని మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టాలని స్పర్ బ్యాంక్ యోచిస్తోంది. భారత్తో వాణిజ్య లావాదేవీలు జరిపే క్రమంలో రష్యా వ్యాపారులకు రూపాయి విలువ కలిగిన లెటర్ ఆఫ్ క్రెడిట్ను జారీ చేసే ప్రక్రియను ఇప్పటికే ఈ బ్యాంకు ప్రారంభించింది. ఒకవేళ దీనిపై భారత్-రష్యాలు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రష్యా, భారత్పై ట్రంప్ మరోసారి కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. -
భారత్కు రష్యా నిజమైన స్నేహితుడు: మోదీ
ఢిల్లీ: భారత్లో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. హైదరాబాద్ హౌస్లో 23వ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో మోదీ-పుతిన్ మధ్య కీలక చర్చలు జరిగాయి. ఇరుదేశాల సంబంధాలు, అంతర్జాతీయ అంశాలపై చర్చ జరిగింది.పుతిన్కు ప్రధాని మోదీ శాంతి సందేశం ఇచ్చారు. ఇది శాంతియుగం.. భారత్ శాంతిపక్షమేనన్నారు. భారత్-రష్యా మధ్య 25 ఒప్పందాలు జరగనున్నాయని మోదీ అన్నారు. భారత్కు రష్యా నిజమైన స్నేహితుడన్న ప్రధాని మోదీ.. పుతిన్ విజన్ను అభినందించారు.వరుస భేటీతో పుతిన్ షెడ్యూల్ ఇవాళ (శుక్రవారం) బిజీబిజీగా సాగుతోంది. పుతిన్కు ఉదయం రాష్ట్రపతి భవన్ వద్ద భారత త్రివిధ దళాలు లాంఛనంగా స్వాగతం పలికాయి. పుతిన్ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం హైదరాబాద్ హౌస్లో సదస్సులో పాల్గొన్నారు. ఇదే భవనంలో పుతిన్కు, ఆయన ప్రతినిధి బృందానికి మోదీ విందు ఏర్పాటు చేశారు.సదస్సు తర్వాత ఇద్దరు నేతలు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేయనున్నారు. అలాగే రష్యా ప్రభుత్వం ఆధ్వర్యంలోని న్యూ ఇండియా చానల్ను పుతిన్ ప్రారంభిస్తారు. భారత్ మండపంలో ఫిక్కి, రాస్కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే వ్యాపార సదస్సులో మోదీ, పుతిన్ పాల్గొంటారు. అనంతరం పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇచ్చే విందులో పాల్గొంటారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో పుతిన్ ఢిల్లీ నుంచి స్వదేశానికి బయలుదేరి వెళ్తారు. -
రాష్ట్రపతి భవన్ లో పుతిన్ కు ఘన స్వాగతం
-
మోదీ-పుతిన్ వరుస భేటీలు.. కీలక ఒప్పందాలు సిద్ధం..!
-
పుతిన్తో మోదీ సమావేశం..
Putin India Tour Updates..పుతిన్తో మోదీ సమావేశం..భారత్ శాంతి వైపే ఉందన్న ప్రధాని మోదీ భారత్ తటస్థంగా లేదని శాంతి పక్షాన ఉందని మోదీ వెల్లడిహైదరాబాద్ హౌస్లో ఇరుదేశాల 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని స్పష్టీకరణనమ్మకం ఆధారంగా భారత్-రష్యా సంబంధాలు కొనసాగుతున్నాయని పుతిన్ వెల్లడి.#WATCH | In his meeting with PM Narendra Modi, Russian President Vladimir Putin says, "Over the past years, you have done a great deal of work to develop our relationship...We open additional areas for cooperation, including hi-tech aircraft, space exploration and artificial… pic.twitter.com/OH5WuWVgP2— ANI (@ANI) December 5, 2025#WATCH | Delhi | PM Narendra Modi and Russian President Vladimir Putin held bilateral talks at the Hyderabad House. EAM Dr S Jaishankar, NSA Ajit Doval, Principal Secretary to the Prime Minister, Shaktikanta Das, and other top officials were present.Source: DD pic.twitter.com/AqQYHAjsjF— ANI (@ANI) December 5, 2025రాజ్ఘాట్లో పుతిన్ నివాళులు.. రాజ్ఘాట్లో గాంధీజీ సమాధి వద్ద నివాళులర్పించిన రష్యా అధినేత పుతిన్అంతకు ముందు రాజ్ భవన్ వద్ద త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన పుతిన్#WATCH | Delhi | Russian President Vladimir Putin lays a wreath at the Rajghat and pays tribute to Mahatma Gandhi.(Video: DD) pic.twitter.com/BsAyDTlKRr— ANI (@ANI) December 5, 2025👉విజిటర్స్ బుక్లో పుతిన్ సంతకం..#WATCH | Delhi | Russian President Vladimir Putin signs the visitors' book at the Rajghat, where he paid tribute to Mahatma Gandhi. pic.twitter.com/x6q74a6P6T— ANI (@ANI) December 5, 2025రాష్ట్రపతి భవన్కు పుతిన్రష్యా అధ్యక్షుడు పుతిన్ రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు.పుతిన్కు స్వాగతం పలికిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ.త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన పుతిన్. #WATCH | Delhi | Russian President Vladimir Putin and President Droupadi Murmu shake hands at the forecourt of Rashtrapati Bhavan. The Russian President and PM Narendra Modi also shake hands. pic.twitter.com/Uuv9d3dCuq— ANI (@ANI) December 5, 2025 #WATCH | Russian President Vladimir Putin receives a Guard of Honour at the Rashtrapati Bhawan.Source: DD pic.twitter.com/ZcHc5EMI6y— ANI (@ANI) December 5, 2025 👉 రాష్ట్రపతి భవన్కు చేరుకున్న ప్రధాని మోదీరాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన మోదీ. కాసేపట్లో రాష్ట్రపతి భవన్కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ #WATCH | Delhi | PM Narendra Modi arrives at the Rashtrapati Bhawan ahead of the ceremonial welcome that is to be accorded to Russian President Vladimir Putin. EAM Dr S Jaishankar welcomes him. pic.twitter.com/SPjlY4YIyE— ANI (@ANI) December 5, 2025 #WATCH | PM Narendra Modi welcomes President Droupadi Murmu to the Rashtrapati Bhawan forecourt ahead of the ceremonial welcome that is to be accorded to Russian President Vladimir Putin. pic.twitter.com/EYAVYcatVR— ANI (@ANI) December 5, 2025👉భారత్ చిరకాల మిత్రదేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాలుగేళ్ల తర్వాత రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా నేడు పుతిన్తో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా ముడి చమురు దిగుమతులపై మరింత సబ్సిడీని రష్యా ఆఫర్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.షెడ్యూల్ ఇలా..ఉదయం 11 గంటలకు పుతిన్కు రాష్ట్రపతి భవన్లో అధికారిక స్వాగతం11:30 గంటలకు రాజ్ఘాట్లో మహాత్మా గాంధీ సమాధికి నివాళి అర్పించనున్న పుతిన్ఉదయం 11:50 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో హైదరాబాద్ హౌస్లో పుతిన్ సమావేశంమధ్యాహ్నం 1.50 గంటలకు మోదీ, పుతిన్ మీడియా సమావేశంమధ్యాహ్నం 3:40కి భారత రష్యా శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్న పుతిన్రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్లో పుతిన్కు విందు ఇవ్వనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాత్రి 9:30 గంటలకు తిరిగి మాస్కో వెళ్లిపోనున్న పుతిన్#WATCH | Delhi: All preparations in place at Rajghat where Russian President Vladimir Putin will arrive this morning, to pay tribute to Mahatma Gandhi. pic.twitter.com/jyhRaoP3bE— ANI (@ANI) December 5, 2025కీలక చర్చలు..రక్షణ, వాణిజ్య, పౌర అణు ఇంధనం, ముడిచమురు తదితర రంగాలలో కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్న దేశాధినేతలుఎస్-400, 5 జనరేషన్ ఫైటర్ జెట్స్, సబ్మెరైన్స్, ఆయుధాల తయారీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంశాలపై ఒప్పందాలు కుదిరే అవకాశం ముడి చమురు దిగుమతులపై మరింత సబ్సిడీని రష్యా ఆఫర్ చేసే అవకాశంఅమెరికా ఆంక్షలు నేపథ్యంలో రష్యా ముడిచమురు దిగుమతిని కొంతమేర తగ్గించిన భారత్ -
ప్రోటోకాల్ పక్కనపెట్టి పుతిన్ కి స్వయంగా స్వాగతం పలికిన మోదీ
-
మోదీ ప్రభుత్వంలో అభద్రతాభావం
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వంలో అభద్రతాభావం పెరిగిపోయిందని, అందుకే విదేశాల అధినేతలు, ప్రముఖులు మన దేశానికి వచి్చనప్పుడు ప్రతిపక్ష నాయకుడితో మాట్లాడొద్దంటూ వేడుకుంటోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. విదేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు భారత్లో పర్యటిస్తున్న సమయంలో ప్రతిపక్ష నాయకుడిని కలవడం ఒక సంప్రదాయమని గుర్తుచేశారు. ప్రధాని మోదీ గానీ, విదేశాంగ శాఖ గానీ ఈ సంప్రదాయాన్ని పాటించడం లేదని విమర్శించారు. రాహుల్ గాంధీ గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలో విదేశీ అతిథులు ప్రతిపక్ష నాయకుడిని కలిసి మాట్లాడే సంప్రదాయం చక్కగా కొనసాగిందని గుర్తుచేశారు. మోదీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి మారిపోయిందని ఆక్షేపించారు. -
భారత్లో పుతిన్ (ఫోటోలు)
-
పుతిన్కు ఘన స్వాగతం
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో అధికారిక పర్యటనకు శ్రీకారం చుట్టారు. రష్యా నుంచి గురువారం సాయంత్రం ఢిల్లీలోని పాలం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకున్న పుతిన్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ సాదర స్వాగతం పలికారు. భారత్, రష్యా మధ్య దశాబ్దాల స్నేహ సంబంధాలకు ప్రతీకగా ఇరువురు నేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత భారత పర్యటనకు వచి్చన పుతిన్ను చిన్నారులు సంప్రదాయనృత్యాలతో స్వాగతించారు. పుతిన్, మోదీ చప్పట్లతో వారిని అభినందించారు. అనంతరం ఇరువురూ ఒకే కారులో మోదీ అధికారిక నివాసానికి చేరుకున్నారు. అక్కడ పుతిన్కు ప్రధానమంత్రి ప్రైవేట్ విందు ఇచ్చారు. పుతిన్, మోదీ ఒకే కారులో ప్రయాణించడం మూడు నెలల్లో ఇది రెండోసారి. చైనాలోని తియాంజిన్ సిటీలో జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సు సందర్భంగా వారిద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తూ మాట్లాడుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలో సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయాలు, వివిధ దేశాల మధ్య ఘర్షణలు, రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు కొనసాగుతున్న సమయంలో పుతిన్ చిరకాల మిత్రదేశమైన ఇండియాలో పర్యటిస్తుండడం విశేషమైన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాన్ని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ప్రధాని మోదీ ప్రోటోకాల్ను పక్కనపెట్టి మరీ పుతిన్ కోసం ఎయిర్పోర్టుకు స్వయంగా రావడం విశేషం. తన మిత్రుడు పుతిన్కు స్వాగతం పలకడం ఆనందంగా ఉందంటూ ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆయనతో చర్చల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. భారత్–రష్యా బంధం ఇరుదేశాల ప్రజలకు ప్రయోజనం కలిగిస్తూ కాల పరీక్షకు నిలిచిందని ఉద్ఘాటించారు. మోదీ నివాసంలో విందు సమావేశం దాదాపు మూడు గంటలపాటు జరిగింది. అనంతరం పుతిన్ ఐటీసీ మౌర్య హోటల్కు చేరుకున్నారు. రాత్రి ఆయన అక్కడే బస చేశారు. నేడు వరుస భేటీలు వరుస భేటీతో పుతిన్ షెడ్యూల్ శుక్రవారం బిజీబిజీగా సాగిపోనుంది. పుతిన్కు ఉదయం రాష్ట్రపతి భవన్ వద్ద భారత త్రివిధ దళాలు లాంఛనంగా స్వాగతం పలుకుతాయి. అనంతరం ఆయన రాజ్ఘాట్ను సందర్శించి, మహాత్మాగాం«దీకి నివాళులరి్పంచబోతున్నట్లు సమాచారం. ఆ తర్వాత హైదరాబాద్ హౌస్లో జరిగే 23వ ఇండియా–రష్యా సదస్సులో పాల్గొంటారు. ఇదే భవనంలో పుతిన్కు, ఆయన ప్రతినిధి బృందానికి మోదీ విందు ఇవ్వబోతున్నారు. సదస్సు తర్వాత ఇద్దరు నేతలు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేయనున్నారు. అలాగే రష్యా ప్రభుత్వం ఆధ్వర్యంలోని న్యూ ఇండియా చానల్ను పుతిన్ ప్రారంభిస్తారు. భారత్ మండపంలో ఫిక్కి, రాస్కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే వ్యాపార సదస్సులో మోదీ, పుతిన్ పాల్గొంటారు. అనంతరం పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇచ్చే విందులో పాల్గొంటారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో పుతిన్ ఢిల్లీ నుంచి స్వదేశానికి బయలుదేరి వెళ్తారు. కీలక ఒప్పందాలు? ఇండియా–రష్యా సదస్సులో ముఖ్యమైన అంశాలపై చర్చించబోతున్నారు. ఈ సందర్భంగా వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ, రక్షణ రంగానికి సంబంధించి రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకొనే దిశగా చర్చలు జరుగనున్నాయి. #WATCH | Russian President Vladimir Putin lands in Delhi; Prime Minister Narendra Modi receives him at the airportPresident Putin is on a two-day State visit to India. He will hold the 23rd India-Russia Annual Summit with PM Narendra Modi in Delhi on December 5(Source: DD) pic.twitter.com/wFcL9of7Eg— ANI (@ANI) December 4, 2025 TWITTER HAS UPDATED THE ❤️ LIKE BUTTONTO CELEBRATE PRESIDENT VLADIMIR PUTIN’S VISIT TO INDIA!Heartfelt thanks for the grand welcome of President Putin in India.#PutinInIndia #VladimirPutin #IndiaRussia #ModiPutinSummit 🇮🇳🇷🇺 pic.twitter.com/lVVkXTkDWI— LOKESH YOGI (@YKumar_Lokesh) December 4, 2025కారు పూలింగ్ ఆలోచన నాదే: పుతిన్ చైనాలోని తియాంజిన్లో సెపె్టంబర్ 1న భారత ప్రధాని మోదీతో కలిసి ఒకే కారులో ప్రయాణించాలన్న ఆలోచన తనదేనని పుతిన్ తెలిపారు. ఇది తమ స్నేహానికి గుర్తు అని వివరించారు. ఇండియా టుడే వార్తా సంస్థకు ఇచి్చన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం ప్రత్యేకంగా ప్రస్తావించారు. అది ముందస్తు ప్రణాళికతో జరిగిన ఘటన కాదని అన్నారు. సదస్సు వేదిక నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ తన కారు సిద్ధంగా ఉందని, కలిసి వెళ్దామని తాను కోరడంతో మోదీ అంగీకరించారని చెప్పారు. షాంఘై సహకార సదస్సు ఎజెండాతోపాటు ఇతర అంశాలపై మాట్లాడుకున్నామని వెల్లడించారు. పుతిన్కు భగవద్గీత బహూకరణ ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్కు రష్యన్ భాషలోకి అనువదించిన భగవద్గీత ప్రతిని బహూకరించారు. భగవద్గీత బోధనలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ గురువారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
రష్యా అధ్యక్షుడు పుతిన్ రాక.. ఢిల్లీలో హై అలర్ట్..
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా గురువారం రాజధాని ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేశారు. వీవీఐపీ పర్యటనను దృష్టిలో ఉంచుకుని నగరమంతా హై-అలర్ట్లో ఉంచారు. స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (స్వాట్)బృందాలు, ఉగ్రవాద నిరోధక విభాగాలు, స్నిపర్లు, త్వరిత-ప్రతిచర్య బృందాలతో కూడిన బహుళ-స్థాయి భద్రతా గ్రిడ్ ఏర్పాటు చేశారు. 5,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు.పుతిన్ రాక మొదలుకొని వెళ్లే వరకూ ఆయన కదలికలన్నింటినీ బహుళ భద్రతా ఏజెన్సీలు ట్రాక్ చేయనున్నాయి. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు అమలులో ఉండగా, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు సలహాలు జారీ చేయనున్నారు. రాజధాని నగరంలో మోదీ-పుతిన్ చిత్రాలతో కూడిన భారీ హోర్డింగ్లు దర్శనమిస్తున్నాయి. పుతిన్ గురువారం సాయంత్రం ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో రష్యా అధ్యక్షుడు భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి 23వ భారత్-రష్యా వార్షిక వ్యూహాత్మక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు.ఈ సమావేశం కేవలం దౌత్యపరమైన అంశాలకు మాత్రమే పరిమితం కాకుండా, దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇరు దేశాల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడానికి దోహపడనుంది. ఈ అధికారిక చర్చలకు ముందు, ప్రధాని మోదీ తన నివాసంలో పుతిన్కు ప్రైవేట్ విందు ఇవ్వనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా పుతిన్ సమావేశం కానున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం అజెండా విభిన్న రంగాలలో సహకారాన్ని విస్తరించడంపై దృష్టి సారించింది. ముఖ్యంగా వాణిజ్యం, ఆర్థిక సహకారం, పారిశ్రామిక సహకారం, వినూత్న సాంకేతికతల బదిలీ వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. శాంతియుత అంతరిక్ష అన్వేషణ, మైనింగ్, ఆరోగ్య సంరక్షణ, కార్మిక వలస కార్యక్రమాలలో కొత్త 'ఆశాజనక ప్రాజెక్టులు' కూడా చర్చల జాబితాలో ఉన్నాయి. రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య బలమైన బంధం ఉన్నప్పటికీ, ఈ పర్యటన ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని పెంచడానికి ఒక వేదికగా ఉపయోగపడనుంది.ఇది కూడా చదవండి: స్మార్ట్ఫోన్ ముట్టని పుతిన్.. షాకిచ్చే కారణం -
బెంగాల్లో విజయమే లక్ష్యంగా పనిచేయండి
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై పోరాటం కొనసాగించాలని, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని తేల్చిచెప్పారు. బెంగాల్లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ పారదర్శకంగా, సరళంగా జరిగేలా జాగ్రత్త వహించాలని సూచించారు. బెంగాల్ బీజేపీ ఎంపీలు బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఎన్నికల వ్యూహాలపై వారు చర్చించినట్లు సమాచారం. బెంగాల్లో కచ్చితంగా అధికారం దక్కించుకోవాలని, అందుకోసం కష్టపడి పని చేయాలంటూ ప్రధానమంత్రి తమకు దిశానిర్దేశం చేశారని బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ చెప్పారు. బీజేపీ కార్యకర్తల అంకితభావాన్ని మోదీ ప్రశంసించారని డార్జీలింగ్ ఎంపీ రాజు బిస్తా తెలిపారు. ప్రజలకు మరింత చేరువ కావడానికి కృషి చేయాలంటూ ఆదేశించారని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని మాల్డాకు చెందిన లోక్సభ సభ్యుడు ఖగేన్ ముర్ము కూడా మోదీని కలిశారు. అక్టోబర్లో ముర్ముపై అల్లరిమూక దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముర్ము ఆరోగ్య పరిస్థితిపై ప్రధానమంత్రి ఆరా తీశారు. -
పుతిన్ పర్యటనకు ఫుల్ సెక్యూరిటీ
న్యూఢిల్లీ: స్నైపర్లు, డాగ్ స్క్వాడ్, డ్రోన్లు, జామర్లు, ఏఐ ఆధారిత ఐదంచెల భద్రతా వ్యవస్థ. ఇవన్నీ ఏమిటో తెలుసా? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా చేస్తున్న అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు! రష్యా నుంచి పుతిన్తో పాటు వెంట వచ్చే ప్రెసిడెంట్ బాడీగార్డులు, ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్విస్కు చెందిన అత్యంత సుశిక్షితులైన సిబ్బంది ఈ ఏర్పాట్లకు అదనం. వీరంతా కాకుండా భారత నేషనల్ సెక్యూరిటీ గార్డ్ విభాగానికి చెందిన టాప్ కమెండోలు ఎటూ రంగంలోకి దిగుతారు. ఇలా మొత్తమ్మీద పుతిన్ భారత పర్యటనకు భద్రతా ఏర్పాట్లు ఏకంగా అమెరికా అధ్యక్షుని పర్యటనను కూడా మించే స్థాయిలో సాగుతున్నాయి! ముందే రంగంలోకి 40 మంది ఉన్నతాధికారులు → పుతిన్ పర్యటన తాలూకు భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం రష్యా నుంచి ఏకంగా 40 మందికి పైగా రక్షణ శాఖ ఉన్నతాధికారులు ముందే రంగంలోకి దిగారు. → వారు ఢిల్లీ చేరుకుని తమ అధ్యక్షుని భద్రతకు సంబంధించిన ప్రతి సూక్ష్మ అంశాన్నీ భూతద్దంలో మరీ పరిశీలిస్తున్నారు. → పుతిన్ కాన్వాయ్ వెళ్ళే ప్రతి మార్గాన్నీ ఢిల్లీ పోలీసులు, ఎన్ఎస్జీ సిబ్బందితో కలిసి జల్లెడ పడుతున్నారు. → అంతేగాక కాన్వాయ్ పై నిరంతర నిఘా కోసం రష్యా అధికారులు ఏకంగా ఒక డ్రోన్ కార్యాలయమే తెరిచారు! → పుతిన్ వెళ్లే మార్గాలన్నింటినీ ప్రత్యేక శిక్షణ పొందిన రష్యా స్నైపర్లు డేగ కళ్లతో పరిశీలిస్తూ ఉంటారు. → ఇక సాంకేతిక పరిజ్ఞానాన్ని అయితే అత్యున్నత స్థాయిలో ఉపయోగిస్తున్నారు. → కృత్రిమ మేధ(ఏఐ), ఫేషియల్ రికగి్నషన్ కెమెరాలు అంగుళం అంగుళాన్నీ వారికి అతి స్పష్టంగా పట్టి చూపనున్నాయి. → మొత్తం సెక్యూరిటీ ఛత్రంలో ఎన్ఎస్జీ కమెండోలు, ఢిల్లీ పోలీసులు బయటి అంచెలకే పరిమితం అవుతారు. → మిగతా నాలుగు లోపలి అంచెలనూ రష్యా భద్రతా వర్గాలే చూసుకుంటాయి. → పుతిన్, మోదీ కలిసి ఉన్నప్పుడు మాత్రం ప్రధాని భద్రతా ఏర్పాట్లు చూసే ఎన్ఎస్జీ, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమెండోలు రష్యా స్పెషల్ ఫోర్సెస్ సిబ్బందితో పాటుగా లోపలి వలయంలోకి వస్తారు. → పుతిన్ బస చేసే హోటల్ను రష్యా వేగులు ఇప్పటికే జల్లెడ పట్టేశారు. → ఆయన వెళ్లే ఇతర ప్రాంతాలన్నింటినీ వారు తరచూ పరీక్షిస్తున్నారు. బిజీ బిజీ! ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత్, రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పుతిన్ గురువారం మన దేశానికి రానున్నారు. సాయంత్రం కల్లా ఆయన ఢిల్లీలో భేటీ అవకాశముంది. రాత్రి మోదీ ఆయనకు విందు ఇస్తారని సమాచారం. శుక్రవారం రాష్ట్రపతి భవన్లో పుతిన్కు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం రాజ్ ఘాట్లో మహాత్ముని సమాధిని సందర్శించి నివాళులు అర్పిస్తారు. సాయంత్రం హైదరాబాద్ హౌస్లో శిఖరాగ్రంలో పాల్గొంటారు. రాత్రి భారత్ మండపంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలను పుతిన్ తిలకిస్తారు. తర్వాత రాష్ట్రపతి భవన్ చేరుకుంటారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇచ్చే ప్రభుత్వ విందులో పాల్గొంటారు. అసలు హైలెట్ ఆ కారే! ఆరస్ సెనట్. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన లగ్జరీ కార్లలో ఒకటి. పుతిన్ కాన్వాయ్ మొత్తంలోకెల్లా అసలు హైలెట్ అదే. ఎలాంటి పెను దాడినైనా తట్టుకుని నిలిచే సామర్థ్యం ఈ కారుకు ఉంది. వెనువెంటనే ప్రతిదాడి చేసేందుకు అనువుగా ఇందులో అనేక అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. ఇది అన్ని విధాలా శత్రు దుర్భేద్యం. అందుకే దీన్ని ముద్దుగా ‘నడిచే దుర్గం’ అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ లిమోజిన్ను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలిస్తున్నారు. ఇటీవల చైనాలో షాంఘై సహకార శిఖరాగ్రం సందర్భంగా మోదీ ఈ కారులోనే పుతిన్తో కలిసి విహరించడం విశేషం. → ఆరస్ సెనట్ కారును 2018లో పుతిన్ కాన్వాయ్లో చేర్చారు. → నాటినుంచి అది ఆయన అధికారిక ప్రభుత్వ వాహనంగా ఉంటోంది. → ప్రభుత్వ అవసరాల నిమిత్తం తయారు చేసే సాయుధ వాహనాల కోసం ఉద్దేశించిన కోర్టెజ్ ప్రాజెక్టులో భాగంగా ఈ లిమోజిన్ను తయారు చేశారు.రక్షణ మంత్రుల భేటీ నేడు భారత, రష్యా రక్షణ మంత్రులు రాజ్ నాథ్ సింగ్, ఆండ్రే బెలెసోవ్ గురువారం ఢిల్లీలో భేటీ కానున్నారు. మరిన్ని ఎస్–400 గగనతల రక్షణ వ్యవస్థల కొనుగోలు, సుఖోయ్–30 యుద్ధ విమానాల ఆధునీకరణలతో పాటు రష్యా నుంచి కీలక సైనిక సామగ్రి కొనుగోలు ప్రధాన ఎజెండా కానుంది. పుతిన్ బృందంలో భాగంగా బెలోసోవ్ భారత్ వస్తున్నారు. పుతిన్, మోదీ శిఖరాగ్రానికి ఒక రోజు ముందు రక్షణ మంత్రుల కీలక భేటీ జరుగుతోంది. అత్యంత అధునాతనమైన ఎస్–500 డిఫెన్స్ వ్యవస్థల కొనుగోలు ప్రతిపాదనలను కూడా రాజ్నాథ్ ఈ సందర్భంగా బెలోసోవ్ ముందు ఉంచవచ్చని సమాచారం. సుఖోయ్–57 యుద్ధ విమానాలను భారత్కు సరఫరా చేసే యోచన ఉందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ మంగళవారమే తెలిపారు. ఐదో తరం యుద్ధ విమానాల కోసం భారత్ ప్రయతి్నస్తున్న నేపథ్యంలో ఈ అంశమూ చర్చకు వచ్చే అవకాశం ఉంది. -
అస్థిర ప్రపంచంలో సుస్థిర బంధం
ప్రధాని నరేంద్ర మోదీతో వార్షిక శిఖరాగ్ర సదస్సు నిమిత్తం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీ రాక ఒక పాత సంగతిని గుర్తుకు తెస్తోంది. దాదాపు ఐదు న్నర దశాబ్దాల క్రితం భారతదేశంతో ‘స్నేహ ఒడంబడిక’ కోసం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీతో చేతులు కలిపేందుకు అప్పటి సోవియట్ యూనియన్ నాయకులు ఇలాగే ఢిల్లీ వచ్చారు. తూర్పు పాకిస్తాన్లో మారణ హోమాన్ని అంత మొందించే ప్రత్యక్ష ప్రమేయానికి ముందు అది జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచం రెండు అగ్ర రాజ్యాల మధ్యన చీలిపోయింది. కానీ, ఇపుడు అంతర్జాతీయ వ్యవస్థ ఏ దిశగా సాగుతోందో తెలియని ఒక కొత్త స్థితిలోకి జారు కుంది. అమెరికా శక్తిమంతమైనదిగానే కొనసాగుతోంది కానీ, దాన్ని అంతగా నమ్మడానికి లేదనే అభిప్రాయం పాదుకుంది. చైనా శిఖరా రోహణ ఇతర ప్రవర్ధమాన దేశాలలో ఆందోళనను పెంచుతోంది. ఐరోపా మరింత స్వయం ప్రతిపత్తిని చాటుకునేందుకు తారట్లాడు తోంది. గాలివాటుగా ఉన్న భారత–రష్యాలు అవసరార్థమే అయిన ప్పటికీ, వ్యూహాత్మక పొందికను పునరుద్ధరించుకుంటున్నాయి. ఒకరికొకరు నిలబడి...అమెరికా నిలకడలేనితనంతో దానిపై చాలా దేశాలకు నమ్మకం కొరవడింది. దానికి తోడు అది ఎక్కడెక్కడో సుదీర్ఘ కాలం యుద్ధా లను కొనసాగించి, చివరకు అక్కడ పరిస్థితులు కుదుటపడక పోయినా నిష్క్రమిస్తూ వచ్చింది. అమెరికా లోపల కూడా పరి స్థితులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. తాజాగా, సుంకాల విష యంలో అది అనుసరిస్తున్న తలతిక్క ధోరణి అందుకు ఉదాహరణ. ఇదంతా ప్రపంచంలో ఒక అస్థిర వాతావర ణానికి దారితీసింది. చైనా తన వంతు ఆకర్షణలను, భయాలను రెండింటినీ సృష్టించు కుంది. క్రమేపీ అది దృఢ వైఖరిని చాటడం పెరగడంతో, దాని ప్రత్య ర్థులు, మిత్రులు కూడా దానిపై చిరకాల అభిప్రాయాలను పునరా లోచించుకోవడం ప్రారంభించాయి. ఉక్రెయిన్పై యుద్ధం మొదలెట్టిన తర్వాత, చైనాతో రష్యా వ్యూహాత్మక ఏకీకరణ బలపడిందికానీ, సంబంధాలు అసమంగానే ఉన్నాయి. మాస్కో వ్యూహాత్మక ఆలోచనల ప్రకారం, దీర్ఘకాలంలో తనకు బెడదగా పరిణమించగల శక్తి అమెరికా కన్నా చైనాకే ఉంది. మధ్య ఆసియాలో తన ప్రభావాన్ని కనబరచేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు, సైబీరియాకు సంబంధించి రష్యా పడుతున్న ఆందోళన, చైనాకు తాను జూనియర్ భాగస్వామిగా మారవలసి వస్తుందే మోననే భయం క్రెమ్లిన్ను మరోసారి భారతదేశానికి సన్నిహితం చేస్తున్నాయి. అయితే, చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ నిలుస్తుందని కాదు. చైనాపై తాను ఎక్కువ ఆధారపడకుండా భారత్ తనకొక రక్షణ కవచంగా ఉపయోగపడుతుందని రష్యా ఆలోచన. స్నేహమే కాదు, వ్యూహాత్మకం కూడా!సోవియట్ యూనియన్ చీలికలు పీలికలైన తర్వాత కూడా భారత్తో రష్యా స్నేహ సంబంధాలు నిలదొక్కుకుంటూ వచ్చాయి. కశ్మీర్పై భారత్ ఇరకాటంలో పడకుండా ఐరాసలో రష్యా తన వీటో గొడుగు పడుతోంది. దానికి తగ్గట్లుగానే, ఉక్రెయిన్పై యుద్ధం పర్యవసానంగా రష్యాపై ఆంక్షలు విధించాలని పశ్చిమ దేశాలు పదేపదే కోరినా భారత్ తలొగ్గలేదు. ఈ విషయమై అమెరికా విధిస్తానన్న సుంకాల బెదిరింపును కూడా భారత్ ఖాతరు చేయలేదు. దీనికి రెండు దేశాల మధ్య పరస్పర నమ్మకంతో కూడిన స్నేహ సంబంధం ఒక్కటే కారణం కాదు. ఈ బంధాన్ని నిలబెట్టుకునేందుకు రెండు దేశాలకు తమవైన వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయి.దానికి తోడు, కొన్నేళ్ళుగా ఎన్నడూ చూడనంత అస్థిర పరిస్థి తులు ప్రపంచంలో తాండవిస్తున్నాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఏ ఒక్క దేశమూ పరిస్థితులను శాసించగలిగిన స్థితిలో లేదు. అగ్ర రాజ్యంగా నిలవాలని కలలు కంటున్న దేశపు అడుగులకు మడుగు లొత్తడానికి ఆఫ్రికా, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికాలలో చాలా మధ్య స్థాయి దేశాలు సిద్ధంగా లేవు. తమ వ్యూహాత్మక స్వయం ప్రతి పత్తిని కాపాడుకోవాలని గాఢంగా కోరుకుంటున్న భారత – రష్యాలకు ఆ సెంటిమెంట్లో ఒక ఉమ్మడి ప్రయోజనం కనిపిస్తోంది. పరస్పర రక్షణభారత్–రష్యాల మధ్య స్నేహ సంబంధాలకు రక్షణ అంశమే ఇప్పటికీ వెన్నెముకగా ఉంది. లాజిస్టిక్స్ విషయంలో పరస్పర సహ కారానికి సంబంధించిన ఒప్పందం కుదరబోతోంది. అది కార్య రూపం ధరిస్తే ఇరు దేశాలు సైనిక స్థావరాలను, రేవులను, వైమానిక క్షేత్రాలను పరస్పరం వినియోగించుకోవచ్చు. దీంతో ఇండో–పసిఫిక్ నుంచి ఆర్కిటిక్ వరకు కార్యకలాపాలు నిర్వహించగలిగినదిగా భారత్ తయారవుతుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో రష్యా భౌతికంగా కాలు మోపేందుకు వీలు చిక్కుతుంది. ప్రపంచంలో సగం వాణిజ్య నౌకల రాకపోకలకు ఈ ప్రాంతమే జీవనాడి. భారత–రష్యా అధికారులు అత్యంత ఆశావహమైన సైనిక– సాంకేతిక ప్యాకేజీకి రూపుదిద్దుతున్నారు. దీనివల్ల ఎస్–400 గగన రక్షణ వ్యవస్థలను మరిన్ని చోట్ల ఏర్పాట్లు చేయవచ్చు. సు–30 ఎంకెఐ యుద్ధ విమానాలను భారత్ చాలా ఎక్కువగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మరింత దూరం వెళ్ళగలిగినవిగా బ్రహ్మోస్ క్షిపణు లను ఉన్నతీకరించుకునే అవకాశాలు మెరుగుపడతాయి. సు–57ఇ స్టెల్త్ యుద్ధ విమాన టెక్నాలజీ బదిలీకి సంబంధించి తాత్కాలిక చర్చలైనా మొదలయ్యేందుకు వెసులుబాటు కలుగుతుంది. ఇక భారత్–రష్యా స్నేహంలో అణు సహకారం మరో అంశం. బృహత్తర వీవీఈఆర్–1200 రియాక్టర్ల నిర్మాణ ప్రణాళికలతో రోసాటమ్, భారత అణు శక్తి సంస్థలు ముందుకు ఉరకాలని చూస్తున్నాయి. అలాగే, కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్ల అన్వేషణ రెండు దేశాల మధ్య సంబంధాలను గుణాత్మకంగా మార్చివేయవచ్చు. వీటి అంత ర్జాతీయ సరఫరాలో చైనాదే పైచేయిగా ఉంది. ఖనిజాలు సుసంపన్నంగా ఉన్న రష్యా తూర్పు దూర ప్రాంతాలలో సంయుక్త రంగంలో పనులు సాగించాలని భారత్ ఎదురు చూస్తోంది. భారత వైజ్ఞానిక సంస్థలు, రష్యా పరిశోధన కేంద్రాల మధ్య భాగస్వామ్యాలు ఏర్పడితే దేశీయంగా రేర్–ఎర్త్ ప్రాసెసింగ్కు, పర్మనెంట్ మ్యాగ్నెట్ తయారీకి రంగం సిద్ధమవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, అత్యున్నత ఎలక్ట్రానిక్స్, అధునాతన ఆయుధ వ్యవస్థల వాల్యూ చైన్ను నియంత్రించగల పరిశ్రమలు రెండు దేశాలకు సొంతమవుతాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం సుమారు 65–66 బిలియన్ డాలర్లుంది. 2030 నాటికి దీన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చే లక్ష్యంతో ఉన్నాయి. ఈ శిఖరాగ్ర సదస్సులో వ్యక్తమయ్యేది కేవలం పొత్తు కాదు. స్నేహ సంబంధాలు ఏవీ దెబ్బతిని లేవు కనుక ఇండో–సోవియట్ మైత్రి పునరుద్ధరణ అనడానికి కూడా లేదు. ఇది మరింత ఆచితూచి వేస్తున్న అడుగు కాబోతోంది. మరింత ఆచరణాత్మక దృక్పథం కన పడబోతోంది. అధికార కేంద్రాలు మసకబారి, సమీకరణాలు అను క్షణం మారిపోతున్న వర్తమాన ప్రపంచంలో అంతకన్నా ఇంకేం కావాలి!జయంత రాయ్ చౌధురీవ్యాసకర్త పీటీఐ వార్తా సంస్థ తూర్పు ప్రాంత మాజీ అధిపతి -
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు మోదీని ఆహ్వానించిన సీఎం
-
ప్రధానికి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు ఆహ్వానం
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రావాల్సిందిగా ప్రధానికి ఆయన ఆహ్వానం అందించారు. పార్లమెంట్ భవనంలో జరిగిన ఈ భేటీలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రేవంత్ వెంట ఉన్నారు.సుమారు అరగంటపాటు ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. డిసెంబర్ 8,9వ తేదీల్లో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రావాల్సిందిగా ఆహ్వానించారు. అలాగే.. రీజినల్ రింగ్ రోడ్డు, బెంగళూరు చెన్నై హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్, మెట్రో విస్తరణకు నిధులు ఇవ్వాలని సీఎం ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది. అంతకు ముందు తెలంగాణ ఎంపీలతో కలిసి సీఎం రేవంత్ బృందం.. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అశ్వినీ వైష్ణవ్లను కలిసింది. సదస్సుకు రావాల్సిందిగా కేంద్ర మంత్రులకు ఆహ్వానం అందించింది. ప్రధానితో భేటీ అనంతరం కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, ఎంపీల బృందం కలిసింది. రాష్ట్ర రాజకీయాలతో పాటు సదస్సు గురించి వీళ్ల మధ్య చర్చ జరిగినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. -
పార్లమెంట్ సమావేశాలు డే-3: రేణుకా చౌదరిపై ఫిర్యాదు
Parliament winter session 2025 Updates..రేణుకా చౌదరిపై చర్యలు తీసుకోవాల్సిందే!రాజ్యసభలో ఎంపీ రేణుకా చౌదరిపై ఫిర్యాదుఓ కుక్కను రక్షించి తన కారులో పార్లమెంట్లో తీసుకొచ్చిన కాంగ్రెస్ ఎంపీదీనిపై అధికార పార్టీ నుంచి అభ్యంతరాలు అరిచేవారు.. కరిచేవారు పార్లమెంట్ లోపేల ఉన్నారంటూ వ్యాఖ్య‘మొరుగుడు’ వ్యాఖ్యలపై చైర్మన్కు ఫిర్యాదు చేసిన బీజేపీ ఎంపీలుఆమె వ్యాఖ్యలు పెద్దల సభ గౌరవానికి విరుద్ధంగా ఉన్నాయంటూ ఫిర్యాదు ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలుమూడోరోజు ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలుసెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లుఢిల్లీ కాలుష్యంపై కాంగ్రెస్ ఎంపీల నిరసన..ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీల నిరసనఆక్సిజన్ మాస్కులు ధరించి నిరసన వ్యక్తం చేసిన ఎంపీలు దీపేందర్ సింగ్ హుడా సహా పలువురు విపక్ష ఎంపీలువాయు కాలుష్యం పైన చర్చించాలని వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చిన ఎంపీ దీపేందర్ హుడావిపక్షాల ధర్నా..పార్లమెంట్లో లేబర్ కోడ్కు వ్యతిరేకంగా విపక్షాల ధర్నాధర్నాలో పాల్గొన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కనిమోలి సహా విపక్ష పార్టీ ఎంపీలు కార్పొరేట్లకు అనుకూలంగా లేబర్ కోడ్ చట్టాలను తీసుకొచ్చారని విపక్షాల ఆరోపణలేబర్ కోడ్ను ఉపసంహరించుకోవాలని నినాదాలు#WATCH | Delhi | Opposition leaders protest against Labour laws in Parliament premises pic.twitter.com/K8wtZdJtAH— ANI (@ANI) December 3, 2025కాసేపట్లో సమావేశాలు ప్రారంభం..నేడు మూడో రోజు పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. లోక్సభలో ది సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఎస్ఐఆర్పై చర్చకు కేంద్రం అంగీకరించడంతో సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరిస్తామన్న విపక్షాలు .అఖిలపక్ష సమావేశంలో ఎస్ఐఆర్పై చర్చకు అంగీకరించిన ప్రభుత్వండిసెంబర్ 9న ఎన్నికల సంస్కరణలపై చర్చచర్చకు సమాధానం ఇవ్వనున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ఎన్నికల సంస్కరణల చర్చలో భాగంగా ఎస్ఐఆర్పై కొనసాగనున్న చర్చచర్చకు 10 గంటల సమయం కేటాయింపుడిసెంబర్ 8వ తేదీన వందేమాతరంపై చర్చవందేమాతరంపై చర్చను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ#WATCH | Delhi | Congress MPs Sonia Gandhi and Priyanka Gandhi Vadra arrive at the Parliament for the third day of the #WinterSession2025 Congress MP Priyanka Gandhi Vadra says, "We should also discuss other things like pollution. We should discuss many other issues which are… pic.twitter.com/idFERZh21O— ANI (@ANI) December 3, 2025 -
అపూర్వ ఘట్టం, అరుదైన ఘనత : ప్రధాని మోదీ ప్రశంసలు
వారణాసి, సాక్షి : మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల వేదమూర్తి దేవవ్రత్ మహేష్ రేఖీ (Devavrat Mahesh Rekhe) అరుదైన ఘనతను సాధించారు. శుక్ల యజుర్వేదం (మధ్యందిన శాఖ) నుండి దాదాపు 2,000 మంత్రాల అత్యంత సంక్లిష్టమైన పారాయణం ‘దండక్రమ పారాయణాన్ని’ పూర్తి చేయడం విశేషంగా నిలిచింది. అద్భుతమైన ఆ వారణాసి అసాధారణమైన ఆధ్యాత్మిక క్షణాలకు వారణాసి వేదికగా నిలిచింది. వేద సంప్రదాయంలో అత్యంత క్లిష్టమైన వాటిల్లో ఒకటిగా ఈ పారాయణాన్ని భావించారు. దాదాపు 200 ఏళ్ల తర్వాత తొలిసారిగా శాస్త్రీయంగా ఈ కార్యక్రమం జరిగింది.19 year old Chi. Devavrat Mahesh Rekhe reciting Danda krama Parayana infront of elderly vidwans in kashi 😍🙏 https://t.co/Z7Tx2tTqWV pic.twitter.com/DIbPa6w8UI— Adarsh Hegde (@adarshahgd) December 2, 2025 ఈ పవిత్ర కార్యానికి గౌరవసూచకంగా, దేవవ్రతకు రూ.5 లక్షల విలువైన బంగారు కంకణం, రూ.1,11,116 విలువైన బంగారు కంకణాన్ని బహుకరించారు. దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదా పీఠం , జగద్గురు శంకరాచార్యుల ఆశీస్సులతో ఈ గుర్తింపు లభించింది. 500 మందికి పైగా వేద విద్యార్థులు, సాంప్రదాయ సంగీతకారులు , శంఖ రావాల ప్రతిధ్వనుల మధ్య వారణాసి పులకించిపోయింది. భక్తులు వీధుల్లో బారులు తీరి, జల్లులు కురిపించారు ఈ వేడుకలో, శృంగేరి జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ భారతి తీర్థ మహాసన్నిధానం నుండి ఆస్థాన విద్వాన్ డాక్టర్ తంగిరాల శివకుమార్ శర్మ ప్రత్యేక ఆశీర్వాద సందేశాన్ని అందించారు. సంక్లిష్టమైన స్వర-నమూనాలు మరియు శబ్ద ఖచ్చితత్వానికి వేద పారాయణ కిరీటంగా గౌరవించబడే దండక్రమ పారాయణం చరిత్రలో మూడు సార్లు మాత్రమే నిర్వహించబడిందని, దేవవ్రత పారాయణం దోషరహితంగా అతి తక్కువ సమయంలో పూర్తయిందని శృంగేరి మఠం అధికారిక ఎక్స్లో పోస్ట్ చేసింది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు 19 ఏళ్ల దేవవ్రత మహేష్ రేఖే అద్భుతమైన విజయాన్ని తెలుసుకున్న తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేవవ్రతుడి విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందని ట్వీట్ చేశారు. భారతీయ సంస్కృతిని అనుసరించే ప్రతి ఒక్కరూ ఆ యువ పండితుడు శుక్ల యజుర్వేదంలోని 2,000 మంత్రాలతో కూడిన దండక్రమ పారాయణాన్ని 50 రోజుల పాటు నిరంతరాయంగా పూర్తి చేశాడని తెలుసుకుని సంతోషిస్తారని ఆయన అన్నారు. ఇంతటి అసాధారణ ఆధ్యాత్మిక క్రమశిక్షణను కాశీ పవిత్ర నేలపై జరగడం గర్వంగా ఉందన్నారు. ఈ సందర్బంగా దేవవ్రతుడి కుటుంబం, సాధువులు, పండితులు, అతని కఠినమైన వేద అభ్యాసానికి దేశవ్యాప్తంగా అతనికి మద్దతు ఇచ్చిన సంస్థల పట్ల గౌరవాన్ని ప్రకటించారు. వల్లభరం శాలిగ్రామ్ సంగ్వేద్ విద్యాలయంలో అక్టోబర్ 2 నుండి నవంబర్ 30 వరకు పారాయణం నిర్వహించారు. శృంగేరి పీఠం వేదపోషక సభ ఆధ్వర్యంలో శుక్ల యజుర్వేద మధ్యందిన శాఖ పరీక్షల ప్రధాన పరిశీలకుడు వేదబ్రహ్మశ్రీ మహేష్ చంద్రకాంత్ రేఖే యువ పండితుడు మరియు అతని తండ్రి-గురువు వేదబ్రహ్మశ్రీ మహేష్ చంద్రకాంత్ రేఖే ఇద్దరినీ సాధువులు , వేద పండితులు ప్రశంసించారు.19 वर्ष के देवव्रत महेश रेखे जी ने जो उपलब्धि हासिल की है, वो जानकर मन प्रफुल्लित हो गया है। उनकी ये सफलता हमारी आने वाली पीढ़ियों की प्रेरणा बनने वाली है। भारतीय संस्कृति में आस्था रखने वाले हर एक व्यक्ति को ये जानकर अच्छा लगेगा कि श्री देवव्रत ने शुक्ल यजुर्वेद की माध्यन्दिन… pic.twitter.com/YL9bVwK36o— Narendra Modi (@narendramodi) December 2, 2025 -
మోదీ.. పాత కేసులతో వేధించే ప్రయత్నం: ఖర్గే ఆగ్రహం
ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కార్పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ఖర్గే పలు విమర్శలు చేశారు. ఇది బీజేపీ, మోదీ రాజకీయ ప్రతీకారం అని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం, ఈడీ కలిసి కొత్త ఆరోపణలు లేక ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని పాత కేసులను తిరిగి తెరపైకి తీసుకువస్తున్నాయని అన్నారు.నేషనల్ హెరాల్డ్ కేసు విషయమై మల్లికార్జున ఖర్గే ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘12 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా గాంధీ కుటుంబంపై కొత్త ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎందుకంటే మోదీ ప్రభుత్వం, ఈడీ వద్ద కొత్త ఆరోపణలు లేవు. వాస్తవాలు తక్కువగా ఉన్నప్పుడు నాటకీయ అంశాలు రంగంలోకి దిగాయి. రాజకీయ ప్రతీకార చర్య, పాత ఆరోపణలు తీసుకురావడం అన్నీ ప్రత్యర్థులను వేధించే ప్రయత్నం. ఇది రాజకీయ ప్రతీకార చర్య. దీనిని న్యాయవ్యవస్థ కచ్చితంగా గుర్తిస్తుందని మేం విశ్వసిస్తున్నాం’ అని పోస్టులో పేర్కొన్నారు.కేసు వివరాలు ఇలా.. దివంగత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1938లో వార్తాపత్రిక నేషనల్ హెరాల్డ్ స్థాపించారు. ఈ పత్రికలో అవకతవకలు జరిగాయంటూ 2012లో బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఈ నేషనల్ హెరాల్డ్ పత్రిక, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) సంస్థలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీ ఏజెఎల్ సంస్థకు చెందిన రూ.2000 విలువైన స్థలాలను కేవలం రూ.50 లక్షలకే దక్కించుకున్నట్లు అభిమోగాలు మోపింది. వాటిలో రాహుల్కు 38శాతం, సోనియాకు 38శాతం షేర్లు ఉన్నాయి. ఏజేఎల్కు చెందిన 99 శాతం షేర్లను యంగ్ ఇండియన్ లిమిటెడ్కు బదిలీ చేశారు. ఈ లావాదేవీ మనీలాండరింగ్లో భాగమన్నది ఈడీ ప్రధాన ఆరోపణ. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ 2021 నుంచి అధికారికంగా దర్యాప్తును ప్రారంభించింది.ఇదిలా ఉండగా.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీటును పరిగణనలోకి తీసుకునే విషయంపై ఢిల్లీ కోర్టు తన నిర్ణయాన్ని డిసెంబర్ 16కు వాయిదా వేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురిస్తున్న అసోసియేటెడ్ జర్నలిస్ట్స్ లిమిటెడ్(AJL)కు చెందిన సుమారు రూ.2 వేల కోట్ల విలువ చేసే ఆస్తుల్ని నిందితులు తమ హస్తగతం చేసుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, శ్యామ్ పిట్రోడాలతోపాటు యంగ్ ఇండియన్ అనే ఒక ప్రైవేటు కంపెనీ కుట్రకు, మనీలాండరింగ్కు పాల్పడినట్టు ఈడీ ఆరోపిస్తోంది. -
హలో ఇండియా... ఓసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి.
-
సమావేశాల్లో డ్రామాలు ఎవరు చేస్తున్నారు : ప్రియాంక వాద్రా
-
నిలదీస్తే డ్రామాలంటారా?
న్యూఢిల్లీ: డ్రామాలు ఆడొద్దంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రియాంకగాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో ఆమె మాట్లాడారు. ‘‘ ప్రజాస్వామ్యానికి దేవాలయమైన పార్లమెంట్ అంటే ఏంటో మాకూ తెలుసు. ఇది డ్రామాలాడే స్థలం కాదు. పట్టిపీడిస్తున్న ప్రజాసమస్యలను పార్లమెంట్ వేదికగా ఎత్తిచూపితే డ్రామా ఎలా అవుతుంది?. పౌరసమస్యలపై చర్చకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడమే అసలైన డ్రామా. ప్రజాస్వామ్యయుత చర్చలకు తావివ్వకపోవడమే నిజమైన డ్రామా. ప్రజలకు సంబంధించిన అంశాలపై సమా లోచనలు, సంప్రదింపులు జరక్కుండా అడ్డుకోవడమే అసలైన డ్రామా. పెను సమస్యగా మారిన వాయు కాలుష్యంపై మాట్లాడాం. ఆ అంశాన్ని మేం ప్రస్తావించకూడదా?. ఇలాంటి విషయాలపై విస్తృతస్థాయి చర్చ అక్కర్లేదా? దేశరాజధాని వాయుకాలుష్య కోరల్లో చిక్కుకోవడం సిగ్గుచేటు. ఢిల్లీలోని వృద్ధు్దలు కాలుష్యంతో ఇబ్బందిపడుతున్నారు. ఆస్తమాతో బాధపడేవాళ్లు, ఇతర శ్వాససంబంధ సమస్యలు ఉన్న వాళ్లతో ఢిల్లీ ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా చర్చించకుండా కూర్చోవాలా?’’ అని ప్రియాంక నిలదీశారు. ‘వెదర్’ వ్యాఖ్యలపై మండిపాటు శీతాకాలపు ప్రకృతి సోయగాలను ఆస్వాదించండి అంటూ మీడియా ప్రతినిధులతో మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రియాంకాగాంధీ మండిపడ్డారు. ‘‘ వెదర్ను చూసి ఎంజాయ్ చేయండి అని మోదీ ఉచిత సలహాను పడేశారు. కాలుష్యంతో పొగచూరిన ఈ వాతావరణాన్ని ఢిల్లీవాసులు ఆస్వాదించాలా? ఢిల్లీలో జనసమ్మర్థ ప్రాంతాల్లోకి ప్రధాని వస్తేనే అసలెంత కాలుష్యముందో ఆయనకు బోధపడుతుంది’’ అని ప్రియాంక హితబోధ చేశారు. ఆయనదంతా కపటనాటకం: ఖర్గే‘‘రక్తికట్టించేలా నాటకాలు వేసేది ప్రధాని మోదీయే. ఆయన కపటనాటక సూత్రధారి. పార్లమెంట్లో విపక్షాలు డ్రామాలు ఆడుతాయనడం ఆయనకే చెల్లింది. ప్రజాసమస్యలపై మాట్లాడాల్సిందిపోయి ప్రధాని నిజమైన డ్రామాలేస్తున్నారు. ఇకనైనా దృష్టిమరల్చే డ్రామాలకు తెరదింపి బీజేపీ వాస్తవిక సమస్యలపై దృష్టిపెట్టాలి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమానతలు, దేశ వనరుల లూటీతో జనం అవస్థలు పడుతుంటే అధికారంలో ఉన్న నేతలు మాత్రం దురహంకారంతో డ్రామాలాడుతున్నారు’’ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. ‘‘ ప్రజావశ్యక సమస్యలను విపక్షాలు పార్లమెంట్లో ప్రస్తావించడం ప్రధాని మోదీకి అస్సలు గిట్టదు. పార్లమెంట్ సజావుగా సాగకపోవడానికి మోదీ ధోరణే అసలు కారణం’’ అని జైరాం రమేశ్ అన్నారు.ఇది కూడా చదవండి: షాకిస్తున్న కేరళ ‘హెచ్ఐవీ’.. నెలకు 100 కొత్త కేసులు -
పరాజయాన్ని ఒప్పుకోలేరు.. ప్రతిపక్షాలకు మోదీ చురకలు
-
డ్రామాలొద్దు..!
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు కొద్దిసేపటిముందు పార్లమెంట్ ప్రాంగణంలో విపక్షసభ్యులకు హితబోధచేస్తూ ప్రధాని మోదీ పలు విమర్శనాత్మక, వ్యంగ్య వ్యాఖ్యలుచేశారు. ‘‘ పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు కసరత్తు చేసే వ్యాయామశాలగా పార్లమెంట్ను మార్చొద్దు. ఇటీవల ముగిసిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన విపక్షపార్టీలు ఆ నైరాశ్యాన్ని పార్లమెంట్లో ప్రదర్శించాలనుకుంటున్నాయి. పార్లమెంట్ పవిత్రమైంది. ఇది నాటకాలు వేసే రంగస్థలం కాదు. పార్లమెంట్ అనేది నిర్మాణాత్మకమైన, ఫలవంతమైన చర్చలు, సద్విమర్శలకు పట్టుగొమ్మ. బలమైన ఆధారాలతో ప్రభుత్వంపై విమర్శలకు విపక్షాలు దిగుతాయంటే నేను సైతం వారికి కొన్ని చిట్కాలు చెబుతా’’ అని మోదీ చురకలంటించారు.డ్రామాలకు వేరే స్థలాలున్నాయ్..‘‘నాటకాలు ప్రదర్శించడానికి పార్లమెంట్ వేదిక కాదు. వాటికి వేరే వేదికలున్నాయి. అక్కడ వేసుకోండి మీ డ్రామాలు. ఇది ప్రజాసంక్షేమాన్ని కాంక్షిస్తూ చట్టాలుచేసే పవిత్ర స్థలి. డ్రామాలొద్దు.. పనిచూడండి. అయినాసరే నినాదాలు చేస్తామంటే మీరు దేశంలో ఎక్కడైనా చేసుకోండి. గతంలో ఓడిపోయిన రాష్ట్రాల్లోనూ పెద్దపెద్ద ప్రసంగాలిచ్చారు. భవిష్యత్తులో ఓటమిని చవిచూడబోయే నియోజకవర్గాలకు వెళ్లి ప్రసంగాలివ్వండి. పార్లమెంట్ విషయానికొచ్చేసరికి మీ దృష్టంతా కేవలం విధానపర నిర్ణయాలపై జరపాల్సిన విస్తృతస్థాయి చర్చల మీదనే ఉండాలి. నినాదాల మీద కాదు. బిహార్లో మా అద్వితీయమైన విజయాన్ని చూశాకైనా విపక్ష సభ్యులు బాధ్యతతో వారి నియోజకవర్గాల్లో పనులు నిర్వర్తించాలని తెలుసుకోవాలి. అంతేగానీ రాబోయే ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు కసరత్తు క్రీడాస్థలిగా పార్లమెంట్ను దుర్వినియోగం చేయొద్దు’’ అని మోదీ వ్యాఖ్యానించారు.ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు‘‘బిహార్లో ఎదురైన ఘోర పరాభవాన్ని విపక్షపార్టీలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ ఓటమి నుంచి పుట్టుకొచ్చిన ఆక్రోశంతో పార్లమెంట్ వంటి వేదికలపై గందరగోళం సృష్టించకూడదు. మా విజయం కూడా దురహంకారంగా ఏమీ మార బోదు. సమాచారాత్మక సద్విమర్శను మేం కోరుకుంటున్నాం. సభ్యులందరూ నిర్మాణాత్మక, కచ్చితత్వంతో కూడిన సద్విమర్శలకే పెద్దపీట వేయాలి. అప్పుడే పౌరులకు సైతం మన నుంచి సరైన సందేశం వెళ్తుంది. ఇలాంటి సంస్కృతినే పార్లమెంట్ సమావేశాల నుంచి పౌరులు కోరుకుంటున్నారు. దేశానికి ఇదే అత్యావశ్యకం’’ అని మోదీ అన్నారు. ‘‘పార్లమెంట్ కార్యకలాపాలపై విపక్షాల ఓటమి నీడ పడకుండా చూసుకోవాలి. ఈసారి శీతాకాల సమావేశాల్లో అన్ని పార్టీల సభ్యుల నుంచి బాధ్యత, సమతుల్యత, సమగౌరవాన్ని ఆశిస్తున్నా. బిహార్ ఎన్నికల్లో నమోదైన అత్యధిక పోలింగ్ శాతం అనేది ప్రజాస్వామ్యంలోని గొప్పతనాన్ని చాటుతోంది. ఈ ఎన్నికల ఓటమి నుంచి విపక్షాలు వెనువెంటనే తేరుకొని తమ విపక్షపాత్రను సమర్థవంతంగా పోషిస్తాయని ఆశిస్తున్నా’’అని అన్నారు.వాళ్ల పదేళ్ల ఆటను జనం మెచ్చలేదు‘‘విపక్ష పార్టీలు గత దశాబ్దాకాలంగా ఆడుతున్న రాజకీయ క్రీడలను ఇప్పటికీ పౌరులు మెచ్చట్లేరు. ఇకనైనా ఆట తీరును విపక్షాలు మార్చుకోవాలి. ఈ విషయంలో ఏమైనా సలహాలు ఇచ్చేందుకు నేను సిద్ధం. కావాలంటే కొన్ని చిట్కాలు చెప్తా’’ అని మోదీ వెటకారంగా మాట్లాడారు. ‘‘ఇప్పటికైనా పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు నెరవేర్చాల్సిన విధ్యుక్తధర్మాన్ని గుర్తెరగాలి. ఓటమి నుంచి వాళ్లింకా తేరుకోలేదని నిన్న వాళ్ల నేతలు చేసిన ప్రసంగాలు వింటే అర్థమవుతోంది. ఓటమి అనేది వాళ్లను ఎంతగా చిత్రవధ చేస్తోందో తెలుస్తోంది’’ అని అన్నారు. ‘‘సభలో చర్చల వేళ కొత్త తరం సభ్యులకు మాట్లాడే అవకాశం కల్పించాలి. అనుభవజ్ఞుల అనుభవసారాన్ని పార్లమెంట్ గ్రహిస్తూనే భావినేతల తాజా ఆలోచనలకూ పార్లమెంట్ తగు ప్రాతినిధ్యం కల్పిస్తుంది’’ అని మోదీ అన్నారు. Speaking at the start of the Winter Session of Parliament. May the session witness productive discussions. https://t.co/7e6UuclIoz— Narendra Modi (@narendramodi) December 1, 2025 ఇదీ చదవండి: పార్లమెంట్లో ఏపీ గళం వినిపించండి -
సున్నితత్వం పెంచుకోండి
రాయ్పూర్: పోలీసులంటే ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఉన్న భావనను ఎంతగానో మెరగుపరచాల్సిన అవసరముందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘అది జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలీసులదే. అందుకోసం వారే సున్నితత్వం, జవాబుదారీతనం పెంచుకోవాలి’’అని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఆ శాఖలో ప్రొఫెషనలిజం మరింత మెరుగవాలని ఆకాంక్షించారు. రాయ్పూర్లో మూడు రోజుల పాటు జరిగిన డీజీపీలు, ఐజీల 60వ అఖిల భారత సదస్సును ఉద్దేశించి ఆదివారం ఆయన ప్రసంగించారు. విచ్చిన్న కార్యకలాపాలకు పాల్పడేందుకు పొంచి ఉన్న నిషేధిత శక్తులపై నిత్యం డేగ కన్నుంచడం కూడా అత్యవసరమని ఉద్బోధించారు. వామపక్ష తీవ్రవాదం నుంచి విముక్తమైన ప్రాంతాల సమగ్రాభివృద్ధిలో పోలీసులు కూడా తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. అప్పుడే ప్రజల్లో వారిపట్ల మరింత సదభిప్రాయం కలుగుతుందని గుర్తు చేశారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో సువిశాలమైన భారత తీర రక్షణను మరింత బలోపేతం చేసేందుకు వినూత్న చర్యలు చేపట్టాల్సిన అవసరం కూడా ఎంతో ఉందని చెప్పారు. ‘వికసిత భారతం: భద్రతా కోణాలు’ ప్ర«దానాంశంగా ఈ సదస్సు జరిగింది. డ్రగ్స్ భూతం కట్టడి మొదలుకుని తీర రక్షణ దాకా విభిన్నాంశాలపై మూడు రోజుల పాటు లోతైన చర్చ జరిగింది. విజన్ 2047 సాకారానికి పోలీసులపరంగా తీసుకోవాల్సిన పలు చర్యలు ప్రస్తావనకు వచ్చాయి. హిడ్మా తదితర మావోయిస్టు అగ్రనేతలను పోలీసులు ఇటీవలే ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో ఛత్తీతగఢ్ రాజధాని రాయ్పూర్లో సదస్సు జరగడం గమనార్హం. అర్బన్ పోలీసింగ్ను మరింత బలోపేతం చేయడం, పర్యాటక పోలీసింగ్ను మరింత స్నేహశీలంగా మార్చడం, కొత్తగా వచ్చిన భారత న్యాయ చట్టాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేయడం తదితరాలపై పోలీసులు బాగా దృష్టి సారించాలని మోదీ హితవు పలికారు. ప్రాకృతిక విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకునే విషయంలోనూ పోలీసులు ముందు వరుసలో నిలవాలన్నారు. పోలీసు విచారణల్లో ఫోరెన్సిక్ వాడకంపై కేస్ స్టడీలు రూపొందించాల్సిందిగా యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలకు పలుపునిచ్చారు. ఇంటలిజెన్స్ బ్యూరోకు చెందిన అధికారులకు రాష్ట్రపతి పోలీసు మెడల్స్ను మోదీ ఈ సందర్భంగా ప్రదానం చేశారు. అర్బన్ పోలీసింగ్లో అత్యుత్తమంగా నిలిచిన నగరాలకు తొలిసారిగా ప్రవేశపెట్టిన అవార్డులను అందజేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలు, ఐజీలు, కేంద్ర పోలీసు బలగాల సారథులు తదితరులు సదస్సులో పాల్గొన్నారు. మరో 700 మందికి పైగా పోలీసు ఉన్నతాధికారులు వర్చువల్గా ఈ కీలక సదస్సులో భాగం పంచుకోవడం విశేషం. -
Mann Ki Baat: ‘వికసిత్ భారత్’కు యువత అంకితభావమే బలం
న్యూఢిల్లీ: యువతలోని అంకితభావమే ‘వికసిత్ భారత్’కు అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివరి్ణంచారు. అంతరిక్ష నుంచి వ్యవసాయం దాకా ఎన్నో కీలక రంగాల్లో మన యువత అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారని ప్రశంసించారు. ‘మన్ కీ బాత్’128వ ఎపిసోడ్లో భాగంగా ఆయన ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగించారు. పరిశోధన రంగంలో భారత్ వేగంగా ముందుకు దూసుకెళ్తోందని హర్షం వ్యక్తంచేశారు. ప్రపంచంలో ఏదైనా సాధించే శక్తి సామర్థ్యాలు భారత్కు ఉన్నాయని తేల్చిచెప్పారు. యువతలోని అసమాన శక్తి, బలీయమైన సంకల్పం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాయని ఉద్ఘాటించారు. గత 11 ఏళ్లలో విజ్ఞానం, క్రీడలు, సామాజిక సేవ, సంస్కృతి వంటి కీలక రంగాల్లో యువతీ యువకులు చక్కటి ప్రతిభ కనబరిచారని కొనియాడారు. కష్టతరమైన విజయాలను సైతం అలవోకగా సాధిస్తున్నట్లు చెప్పారు. అంధుల మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ సాధించి, చరిత్ర సృష్టించిందని తెలిపారు. క్రీడల్లో ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నామని చెప్పారు. 2030లో కామన్వెల్త్ క్రీడలను మన దేశంలో నిర్వహించడానికి బిడ్డింగ్లో నెగ్గడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. వైఫల్యం తర్వాత దక్కిన విజయంతో.. ‘‘కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో కనిపించిన ఓ వీడియో నా దృష్టిని ఆకట్టుకుంది. అంగారక గ్రహంపై ఉన్న వాతావరణ పరిస్థితులను కృత్రిమంగా సృష్టించి, అక్కడే డ్రోన్లను ఎగరవేయడానికి పుణేకు చెందిన యువకులు ప్రయతి్నంచారు. జీపీఎస్ మద్దతు లేకపోవడంతో డ్రోన్లు నేలకూలుతున్నప్పటికీ నిరాశ చెందకుండా వారు మరింత పట్టుదలతో ప్రయతి్నంచారు. ఎట్టకేలకు డ్రోన్లు కొంతసమయం ఎగిరేలా చేశారు. కెమెరాలు, ఇన్–బిల్ట్ సాఫ్ట్వేర్తోనే వారు ఈ ప్రయోగం నిర్వహించారు. మన యువతలోని ఇలాంటి మహోన్నత సంకల్ప బలమే దేశాన్ని ‘వికసిత్ భారత్’గా మారుస్తుందనడంలో సందేహం లేదు. స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలతో యువత వికసిత్ భారత్ స్వప్నాన్ని కచ్చితంగా సాకారం చేస్తారని నేను విశ్వసిస్తున్నా. ఇస్రో సైంటిస్టులు కూడా చంద్రయాన్–2 వైఫల్యంతో కొంత నిరాశ చెందారు. తర్వాత రెట్టించి ఉత్సాహంతో పనిచేసి చంద్రయాన్–3 ప్రయోగాన్ని విజయవంతం చేశారు. వైఫల్యం తర్వాత దక్కిన విజయం గొప్ప విశ్వాసాన్ని అందిస్తుంది. యువత సంకల్పాన్ని, సైంటిస్టుల అంకితభావాన్ని చూసినప్పుడు నా హృదయం ఉత్సాహంతో నిండిపోతుంది. అంతరిక్ష రంగంలో ప్రయోగాలకు కొత్త శక్తి నవంబర్లో ఎన్నో స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు నిర్వహించుకున్నా. వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయ్యాయి. పార్లమెంట్ పాత భవనం సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవం జరిగింది. అయోధ్య భవ్య రామమందిరంపై ధర్మధ్వజం ఎగరవేశాం. ఐఎన్ఎస్ మాహే నౌక భారత నావికాదళంలో చేరింది. ప్రపంచంలోనే అతిపెద్ద లీప్ ఇంజన్ ఎంఆర్ఓ సంస్థను హైదరాబాద్లో ప్రారంభించాం. అంతరిక్ష రంగంలో ప్రయోగాలకు స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ కొత్త శక్తిని అందించింది. దేశంలో నూతన ఆలోచనా విధానానికి, నవీన ఆవిష్కరణలకు, యువ శక్తికి ఇదొక ప్రతీక. కాశీ–తమిళ సంగమంలో పాల్గొనండి వారణాసిలోని నమో ఘాట్లో డిసెంబర్ 2 నుంచి జరుగబోయే కాశీ–తమిళ సంగమం నాలుగో ఎడిషన్లో పాల్గొనాలని ప్రజలను కోరుతున్నా. తమిళ భాష నేర్చుకొనే అవకాశం వదులుకోవద్దు. ప్రపంచంలో అత్యంత ప్రాచీన భాషను, అత్యంత ప్రాచీన నగరాన్ని అనుంధానించే గొప్ప కార్యక్రమం ఇది. తమిళ భాషతో అనుబంధం ఉన్నవారికి కాశీ–తమిళ సంగమం ఒక ముఖ్యమైన వేదికగా మారుతోంది. తమిళ సోదరులు, సోదరీమణులను ఆహ్వానించడానికి కాశీ ప్రజలు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి ఇతర కార్యక్రమాల్లోనూ ప్రజలు భాగస్వాములుగా మారాలి. ఏక్ భారత్–శ్రేష్ట భారత్ స్ఫూర్తిని బలోపేతం చేయాలి.‘వోకల్ ఫర్ లోకల్’ సెంటిమెంట్ నేను ఇటీవలే దక్షిణాఫ్రికాలో జీ20 సదస్సుకు హాజరయ్యాను. అక్కడ ప్రపంచ దేశాల నేతలకు అందజేసిన బహుమతుల్లో ‘వోకల్ ఫర్ లోకల్’సెంటిమెంట్ కనిపించింది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి కంచు నటరాజ స్వామి విగ్రహం బహూకరించా. తమళినాడులో చోళుల కాలం నాటి హస్తకళా నిపుణ్యానికి ఇది నిదర్శనం. తెలంగాణలోని కరీంనగర్ కళాకారులు రూపొందించిన వెండి అద్దాన్ని ఇటలీ ప్రధానమంత్రికి అందజేశా. సంప్రదాయ లోహ కళాకృతులకు ఇదొక ఉదాహరణ. భారతీయ కళలు, సంప్రదాయాలు, కళాకృతులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలన్నదే నా లక్ష్యం. దీనివల్ల మన కళాకారులకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. వారి నైపుణ్యానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు లభిస్తుంది’’అని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. -
భద్రతా వ్యవస్థపై విస్తృత చర్చ
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో శనివారం అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీపీల వార్షిక సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహించారు. దేశ భద్రతా వ్యవస్థపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సదస్సు గోప్యంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. దేశ భద్రత విషయంలో అత్యుత్తమ విధానాలు, నూతన పద్ధతులను పంచుకోవడానికి పోలీసు అధికారుల సదస్సు ఒక ఉత్తమమైన వేదిక అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి రాయ్పూర్కి చేరుకున్నారు. శనివారం ఉదయం సదస్సుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఐబీ చీఫ్ తపన్కుమార్ డేకా, సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ తదితరులు పాల్గొన్నారు. మూడు రోజులపాటు జరిగే డీజీపీలు, ఐజీపీల సదస్సును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశంలో నక్సలిజం, తీవ్రవాదం, ఉగ్రవాదం వంటి సమస్యలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోందని ఆయన అన్నారు. ఆదివారం సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. -
దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం
పణజి: దేశ ప్రజలంతా ఐక్యంగా ఉంటేనే వికసిత్ భారత్ స్వప్నం సాకారం అవుతుందని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. సమాజమంతా ఒక్కటిగా, అన్ని రంగాలూ భుజంభుజం కలిపి పనిచేస్తే దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని ఆయన అన్నారు. దేశంలో నేడు సాంస్కృతిక పునరుజ్జీవనం కొనసాగుతోందని మోదీ చెప్పారు. అయోధ్యలో రామమందిరం పునర్నిర్మాణం, కాశీలో విశ్వనాథ్ ధామ్ అభివృద్ధి, ఉజ్జయినిలో మహాకాళ్ మహాలోక్ ఆలయ విస్తరణ వంటి చర్యలు జాతి మేల్కొల్పునకు ప్రతీకలు అని ఆయన వివరించారు. మన సాంస్కృతిక వారసత్వం నూతన శక్తితో ముందుకు పరుగులు తీస్తోందని అన్నారు. భవిష్యత్తు తరాల ప్రజలు వారి మూలాల నుంచి దూరం కాకుండా ఈ పునరుజ్జీవనం స్ఫూర్తినిస్తుందని తెలిపారు. మోదీ శుక్రవారం గోవాలో పర్యటించారు. దక్షిణ గోవాలోని పార్తాగలీలో శ్రీసంస్థాన్ గోకర్ణ జీవోత్తం మఠం 550వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 77 అడుగుల ఎత్తయిన శ్రీరాముడి కంచు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శ్రీరాముడి విగ్రహం కావడం విశేషం. గుజరాత్లో నర్మదా నది తీరాన నెలకొల్పిన సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ విగ్రహాన్ని రూపొందించిన శిల్పి రామ్ సుతార్ ఈ విగ్రహాన్ని తయారుచేశారు. -
భారత్–రష్యా బంధానికి కొత్త శక్తి!
న్యూఢిల్లీ: రష్యా అధినేత పుతిన్ వచ్చేనెల 4, 5వ తేదీల్లో భారత్లో పర్యటించబోతున్నారు. 23వ ఇండియా–రష్యా వార్షిక సదస్సుకు ఆయన హాజరవుతారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై, ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. మోదీ ఆహ్వానం మేరకు పుతిన్ రాబోతున్నారని భారత విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. పుతిన్ అధికారిక పర్యటన పట్ల సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ప్రస్తుత ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాల మరింత బలపడడానికి ఈ పర్యటన దోహదపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ తదితర రంగాల్లో కీలకమైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. పుతిన్–మోదీ భేటీ తర్వాత ఉమ్మడి ప్రకటన విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అలాగే కొన్ని ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతకాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పుతిన్ రాకతో భారత్–రష్యా బంధానికి నూతన శక్తి లభించడం తథ్యమని అంటున్నారు. ముడి చమురుపై అదనపు డిస్కౌంట్లు? స్థానిక కరెన్సీల్లో వాణిజ్య లావాదేవీలను మరింత ముందుకు తీసుకెళ్లడం, ఇంధన రంగంలో సహకారం, రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవడం వంటి అంశాలపై పుతిన్, మోదీ చర్చించబోతున్నారు. పౌర అణు ఇంధన రంగంలో సహకారంపైనా సంప్రదింపులు జరుగనున్నాయి. అంతేకాకుండా రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాల్లో పురోగతిని వారు సమీక్షిస్తారు. ఇరుదేశాల ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకుంటారు. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రష్యా అధ్యక్షుడి గౌరవార్థం ప్రత్యేక విందు ఇవ్వబోతున్నారు. మరోవైపు రష్యా నుంచి అత్యాధునిక ఆయుధాల కొనుగోలుపై భారత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే ఎస్–400 మిస్సైల్ వ్యవస్థలను అదనంగా కొనుగోలు చేయడంపై పుతిన్పై చర్చించనున్నట్లు సమాచారం. భారత్కు పుతిన్ శుభవార్త చెప్పే అవకాశాలు కూడా లేకపోలేదు. ముడి చమురుపై అదనపు డిస్కౌంట్లను ఆయన ప్రకటించే వీలుందని అంచనా వేస్తున్నారు. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇటీవలి కాలంలో రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు కొంత తగ్గుముఖం పట్టాయి. చమురు ఎగుమతులను భారీగా పెంచాలని పుతిన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. పుతిన్ చివరిసారిగా 2021లో ఇండియాలో పర్యటించారు. గత ఏడాది జూలైలో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించి, పుతిన్తో భేటీ అయ్యారు. భారత్–అమెరికా సంబంధాలు గత రెండు దశాబ్దాల్లో ఏనాడూ లేనంతగా బలహీనపడిన సమయంలో పుతిన్ భారత్ పర్యటనకు వస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
సుదర్శన చక్రతో శత్రు నాశనం
ఉడుపి/యశవంతపుర: దేశ రక్షణ పట్ల ప్రభుత్వ సంకల్పాన్ని ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రజలంతా ప్రత్యక్షంగా చూశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఎర్రకోట నుంచి శ్రీకృష్ణుడి సందేశాన్ని వినిపించామని తెలిపారు. శత్రువులను నాశనం చేయడానికి ‘మిషన్ సుదర్శన చక్ర’ను ప్రకటించామని గుర్తుచేశారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా కీలకమైన ప్రాంతాలు, పారిశ్రామికవాడలకు బలమైన రక్షణ కవచం ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు.ప్రధాని మోదీ శుక్రవారం కర్ణాటకలోని ఉడుపి పట్టణంలో పర్యటించారు. ఉడుపి శ్రీకృష్ణ మఠం ఆధ్వర్యంలో ‘లక్ష కంఠ గీతా పారాయణం’లో పాల్గొన్నారు. లక్ష మందికిపైగా భక్తులతో కలిసి భగవద్గీత పారాయణం చేశారు. 18 శ్లోకాలను పఠించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మన దేశంలో గతంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వాలు నిశ్శబ్దంగా ఉండిపోయాయని, ప్రతిదాడులు చేయడానికి సంకోచించాయని ఆక్షేపించారు. కానీ, ఇప్పటి నవ భారతదేశం ఒత్తిళ్లు, బెదిరింపులు, దాడులకు ఎంతమాత్రం లొంగబోదని తేల్చిచెప్పారు. ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం ఎంతదూరమైనా వెళ్తుందని ఉద్ఘాటించారు. దేశ భద్రతే తమకు ముఖ్యమని పేర్కొన్నారు. ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు వ్యాఖ్యానించారు. పథకాలకు భగవద్గీత బోధనలే పునాది ‘‘శాంతి, సత్యం కోసం ఎల్లప్పుడూ కృషి చేయాలని భగవద్గీత బోధిస్తోంది. అదేసమయంలో దుషు్టలు, దుర్మార్గులను అంతం చేయాలని చెబుతోంది. వసుధైక కుటుంబం అనే సూత్రాన్ని విశ్వసిస్తున్నాం. ధర్మో రక్షిత రక్షితః అని పఠిస్తున్నాం. పహల్గాంలో మన పర్యాటకులను పొట్టనపెట్టుకున్న ముష్కరులపై యుద్ధం చేశాం. వారికి తగిన గుణపాఠం నేర్పించాం. మన నిత్య జీవితంలో భగవద్గీత పాత్ర ఎంతో ఉంది. గీత బోధనలు ప్రతి తరానికీ వర్తిస్తాయి. దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం జాతీయ విధానాల రూపకల్పనలో భగవద్గీత దిశానిర్దేశం చేస్తూనే ఉంది. జనం బాగు కోసం పనిచేయాలని గీతలో శ్రీకృష్ణుడు పిలుపునిచ్చాడు. సబ్కా సాత్, సబ్కా వికాస్.. సర్వజన హితాయ నినాదాలకు భగవద్గీత శ్లోకాలే స్ఫూర్తి. ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్ యోజన వంటి ప్రజా సంక్షేమ పథకాలకు పునాది భగవద్గీత బోధనలే. భగవద్గీత చూపిన మార్గంలో నడుస్తూ మహిళల భద్రత, సాధికారత కోసం నారీశక్తి వందన్ అధినియం తీసుకొచ్చాం’’ అని ప్రధాని మోదీ వివరించారు. శ్రీకృష్ణుడి ఆలయంలో ప్రత్యేక పూజలు ఉడుపి పట్టణంలో ప్రధాని మోదీ తొలుత రోడ్డుషోలో పాల్గొన్నారు. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలకు అభివాదం చేశారు. తనపై చల్లిన పూలను తిరిగి జనంపై చల్లారు. అనంతరం శ్రీకృష్ణుడి ఆలయానికి చేరుకున్నారు. పర్యాయ పుత్తిగె మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ ఆధ్వర్యంలో మోదీకి అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. తర్వాత ఆలయ ఆచారం ప్రకారం కిటికీ(కనకన కిండీ) నుంచి శ్రీకృష్ణుడి మూలమూర్తిని ప్రధానమంత్రి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మోదీకి వెండి దారంతో కూడిన తులసి జపమాల, శంకు, చక్ర, గద, పద్మం ముద్రలను బహూకరించారు. మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామి ప్రధాని మోదీకి ‘భారత భాగ్య విధాత’ బిరుదునిచ్చి సన్మానించారు. కాశీ కారిడార్ తరహాలో ఉడుపి కారిడార్ను అభివృద్ధి చేయాలని మోదీని కోరారు. కనకదాసకు నివాళులు ఉడుపిలోని చరిత్రాత్మక కనక మండపాన్ని మోదీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 14వ శతాబ్దానికి చెందిన తత్వవేత్త, కీర్తనకారుడు కనకదాసకు ఘనంగా నివాళులరి్పంచారు. ఉడుపిలో శ్రీకృష్ణుడు పశి్చమ ముఖంగా కొలువుదీరడం వెనుక కనకదాస పాత్ర ఉందని భక్తులు విశ్వసిస్తారు. మోదీ ఉడుపి ఆలయాన్ని సందర్శించడం ఇది రెండోసారి. 2008 ఏడాదిలో గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో ఈ ఆలయానికి వచ్చారు. తొమ్మిది ప్రతిజ్ఞలు వికసిత్ భారత్, నవ్య భారత్ కోసం తొమ్మిది ప్రతిజ్ఞలు చేయాలని ప్రధాని మోదీ ఉడుపి శ్రీకృష్ణుడి ఆలయం నుంచి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అవి ఏమిటంటే.. → మాతృమూర్తి పేరిట ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి. → నదులు, చెరువులు, ఇతర జల వనరులను కాపాడుకోవాలి. జల సంరక్షణే మన ధ్యేయం కావాలి. → కనీసం ఒక నిరుపేద జీవితాన్ని మెరుగుపర్చడానికి కృషి చేయాలి. → బాధ్యత కలిగిన దేశ పౌరులుగా స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేసి, ఉపయోగించుకోవాలి. ‘వోకల్ ఫర్ లోకల్’ అనేది మన నినాదం కావాలి. ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధనకు తోడ్పాటునందించాలి. -
పుతిన్-మోదీ దోస్తీ.. టెన్షన్లో ట్రంప్!
ఉక్రెయిన్ సంక్షోభ విషయంలో రష్యాపై గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశ చమురు విషయంలో భారత్పై సుంకాల యుద్ధమే చేశారు. రెండు దఫాలుగా 50 శాతం అన్యాయంగా పన్నులు విధించారు. అయితే ఏకపక్ష నిర్ణయాలకు తాము తలొగ్గబోమని.. జాతి ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు ఉంటాయని భారత్ కుండబద్ధలు కొట్టింది. ఈ క్రమంలో ట్రంప్ చేసిన పలు ప్రకటనలనూ (పాక్-భారత్ ఉద్రిక్తతలను ఆపానంటూ చేసినవి కూడా) ఖండించింది కూడా. ఈలోపు.. షాంగై సదస్సులో పుతిన్-మోదీ ఒకే కారులో ప్రయాణించడం, ప్రత్యేకంగా భేటీ కావడంలాంటివి ట్రంప్కు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ఆ రెండు దేశాలవి డెడ్ ఎకానమీలని.. అవి ఎలా పోయినా తనకు సంబంధం లేదంటూ ఆ సమయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారాయన. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఆయన స్వరం మారింది. భారత్ రష్యా నుంచి చమురు దిగుమతిని తగ్గించబోతోందని.. ప్రధాని మోదీ మాట మీద తనకు నమ్మకం ఉందని.. భారత్తో అమెరికా అనుబంధం కొనసాగుతుందంటూ స్వరం మార్చారు. అఫ్కోర్స్ భారత్ వాటిని ఖండించింది కూడా. ఇలాంటి పరిస్థితుల్లో.. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ భారత్కు రానున్నారు. మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. వాస్తవంగా ఈ ఇద్దరు శక్తివంతమైన నేతల భేటీపై గత ఆరు నెలలుగా ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. వీళ్ల కలయిక అంటే ఏమాత్రం మిండుగు పడని ట్రంప్ ఎలా స్పందిస్తారో ? అనేదే అందుకు ప్రధాన కారణం. వాస్తవానికి రష్యా చమురును భారత్కు దూరం చేయాలని ట్రంప్ చేయని ప్రయత్నమంటూ లేదు. అయితే ఆ పాచికలేవీ పారలేదు. సరికదా ట్రంప్ నుంచి రష్యా చమురు సరఫరాదారులైన ఆంక్షల ప్రకటన వెలువడగానే భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ మాస్కోకు వెళ్లి పుతిన్తో సమావేశం అయ్యారు. అటుపై పుతిన్ సన్నిహితుడైన నికోలాయ్ పెత్రుషెవ్తో ఈ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఇప్పుడేమో డిసెంబరు 4, 5 తేదీల్లో పుతిన్ భారత్లో పర్యటిస్తారనే ప్రకటన వెలువడింది. పుతిన్ ఢిల్లీలో జరగబోయే 23వ రష్యా-భారత్ ద్వైపాక్షిక సదస్సులో పాల్గొంటారు. అయితే భారత్తో భారీ ఎత్తున ఒప్పందాల ఎజెండాతోనే రష్యా అధ్యక్షుడు భారత్కు వస్తున్నారా?.. ఉక్రెయిన్ సంక్షోభం ముగించేందుకు మోదీ మధ్యవర్తిత్వాన్ని పుతిన్ కోరనున్నారా? రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో ట్రంప్ మాటల్ని పట్టించుకోకూడదని చెబుతారా? అసలు ఇవేవీ కావు.. సైనికపరమైన సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నారా?.. పుతిన్ భారత్కు ఎందుకొస్తున్నారనే ప్రశ్నలపై చర్చ నడుస్తోంది ఇప్పుడు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంతో పాక్ క్షిపణులను తుక్కు చేసి ప్రపంచానికి సత్తా చాటిన భారత్ ఇప్పుడు రష్యా ఆయుధ సంపత్తిపై ఆసక్తి ప్రదర్శిస్తుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పైగా మేక్ ఇన్ ఇండియానికి కట్టుబడి ఉండాల్సిన పరిస్థితుల్లో అది కష్టతరమేనన్న అభిప్రాయమూ రక్షణ నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. అయితే అమెరికా ఆంక్షలను లెక్కచేయని తరుణంలో పుతిన్ భారత్తో మరో కోణంలోనూ ఒప్పందాలు చేసుకునే అవకాశం లేకపోలేదు. అందులో.. తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్తు ప్లాంట్లో కొత్త మాడ్యులర్ రియాక్టర్ల నిర్మాణంలో రష్యా భాగస్వామిగా మారే అవకాశం బలంగానే కనిపిస్తోంది. ఎస్సీవో శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో సుదీర్ఘంగా భేటీ అయిన పుతిన్.. ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు రావడం ట్రంప్ను ఒత్తిడికి గురిచేసే అంశమే. అందుకే వీళ్ల దోస్తీపై ఆయన పగబట్టారు. అదీగాక అమెరికా, యూరప్ దేశాలకు వ్యతిరేకంగా పుతిన్ ఆసియా దేశాలతో ఓ బలమైన కూటమిగా ఎదిగేతే గనుక.. అందులో భారత్ ప్రధాన భూమిక అవకాశాలను తోసిపుచ్చలేం. అందుకే భారత్తో మరింత దగ్గరైతే రష్యా మళ్లీ సూపర్ పవర్గా ఎదుగుతుందనే భయం ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.:::వెబ్డెస్క్ స్పెషల్ -
ప్రపంచంలోనే ఎత్తైన రాముడి విగ్రహం ఆవిష్కరణ
ప్రపంచంలోనే ఎత్తైన రామ విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమం దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగింది. శుక్రవారం గోవాలో పర్యటించిన ఆయన.. సౌత్ గోవా కానాకోనలోని గోకర్ణ జీవోత్తం మఠంలో ఏర్పాటు చేసిన 77 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మఠం 550 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వేడుక కార్యక్రమం జరగడం గమనార్హం. ఈ సందర్భంగా ప్రధాని మఠాన్ని సందర్శించి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.VIDEO | Canacona, Goa: PM Modi (@narendramodi) unveils 77-feet-tall bronze statue of Lord Ram at Shree Samsthan Gokarn Jeevottam Mutt in South Goa.(Source: Third Party)(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/3sDm0qngb1— Press Trust of India (@PTI_News) November 28, 2025 -
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన తేదీలు ఖరారు
-
ఇంత జరుగుతున్నా ప్రధాని మౌనంగా ఉన్నారేం?: రాహుల్ గాంధీ
సాక్షి, ఢిల్లీ: దేశరాజధాని వాయు కాలుష్యంపై కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు ఊపిరి తీసుకోలేని పరస్థితుల్లో అవస్థతలు పడుతున్నారని.. ఇంత జరుగుతున్న ప్రధాని మోదీ ఏం పట్టనట్లు వ్యవహరించడం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు. శుక్రవారం వాయు కాలుష్యంపై కొందరు పర్యావరణవేత్తలతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో వాయు కాలుష్య సంక్షోభం తీవ్రతరమవుతోంది. పేద, ధనిక అన్నివర్గాల వాళ్లు కాలుష్యం బారిన పడుతున్నారు. నేనూ ఢిల్లీ వాయి కాలుష్యం బాధితుడినే. విషపూరిత వాయువులతో పిల్లలు ఊపిరి ఆడక అవస్థలు పడుతున్నారు అని అన్నారాయన. ‘‘మోదీగారూ.. భారతదేశపు పిల్లలు మన కళ్ల ముందే ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారు. ఇంత జరుగుతున్నా మీరు ఎలా మౌనంగా ఉండగలరు? ఈ అంశంపై అత్యవసరంగా స్పందించాల్సిన అవసరం మీ ప్రభుత్వానికి లేదా? ఒక ప్రణాళిక లేదు, బాధ్యతంటూ లేదా?’’ అంటూ ప్రధానిని ఉద్దేశించి ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారాయన. ఇప్పటికైనా ప్రభుత్వాలు కలుగజేసుకోవాలి. కాలుష్యాన్ని కారకాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. ఢిల్లీ వాయు కాలుష్య సమస్యపై పార్లమెంటులో చర్చ జరగాలి అని డిమాండ్ చేశారాయన. ఈ సందర్భంగా కొందరు చిన్నారుల తల్లులు ఆందోళన వ్యక్తం చేసిన వీడియోలను రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.మరోవైపు.. వాయు కాలుష్యం సోర్స్ నుంచే అరికట్టాలన్న పర్యావరణవేత్తలు.. చిన్నారులు ఇబ్బంది పడకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. గత రెండు వారాలుగా ఢిల్లీ వాయు నాణ్యత దారుణంగా క్షీణిస్తూ వస్తోంది. ఈ పరిణామాలపై దేశసర్వోన్నత న్యాయస్థానం కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో పిల్లలను పరిస్థితులు చక్కబడేదాకా స్పోర్ట్స్ ఈవెంట్స్కు దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది కూడా. -
లక్ష గళ గీతా పారాయణం : ప్రధానికి ఘన స్వాగతం
ఉడుపి, సాక్షి, : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం కర్ణాటకలోని ఉడిపిలో లక్ష కంఠ గీత పారాయణ కార్యక్రమానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉడుపిలోని శ్రీ కృష్ణ మఠాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.అంతకుముందు ప్రధాని మోదీ రోడ్షో నిర్వహించారు.కృష్ణుడి గర్భగుడి ముందు ఉన్న సువర్ణ తీర్థ మంటపాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా పవిత్ర కనక కవచం (బంగారు కవచం )ను అందించారు. ఇది పవిత్ర కనకదాసు శ్రీ కృష్ణుడి దర్శనం పొందిన పవిత్ర ప్రదేశంగా భావిస్తారు. ఉడిపిలోని శ్రీకృష్ణ మఠంలో, విద్యార్థులు, సన్యాసులు, పండితులు, వివిధ రంగాలకు చెందిన పౌరులు సహా దాదాపు 1,00,000 మంది పాల్గొనే ఈ పవిత్ర భగవద్గీత లక్ష కంఠ పారాయణ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.ఉడుపిలోని శ్రీ కృష్ణ మఠాన్ని 800 సంవత్సరాల క్రితం ద్వైత వేదాంత తత్వశాస్త్ర స్థాపకుడు శ్రీ మధ్వాచార్యులు స్థాపించారు. త్రివర్ణ పతాకాలతో ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరైనారు.ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ గోవాకు వెళతారు. అక్కడ శ్రీ సంస్థాన్ గోకర్ణ్ పార్తగలి జీవోత్తం మఠం 550వ వార్షికోత్సవాల్లో పాల్గొంటారు. ఈ మధ్యాహ్నం దక్షిణ గోవాలోని పత్రాగౌలిలో 77 అడుగుల రాముడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రామాయణ థీమ్ పార్క్ను కూడా ఆయన ప్రారంభిస్తారు. అలాగే స్మారక పోస్టల్ స్టాంపు , నాణెంను విడుదల చేయనున్నారు. #WATCH | Udupi, Karnataka | Prime Minister Narendra Modi visits Sri Krishna Matha in Udupi and participates in the Laksha Kantha Gita Parayana programme. The Prime Minister also inaugurated the Suvarna Teertha Mantapa, located in front of the Krishna sanctum, and dedicated the… pic.twitter.com/vEzbeasjUS— ANI (@ANI) November 28, 2025 -
గోవాలో 77 అడుగుల శ్రీరాముని విగ్రహం
పణాజి: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన 77 అడుగుల ఎత్తయిన శ్రీరాముడి కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ శుక్రవారం గోవాలో ఆవిష్కరించనున్నారు. దక్షిణ గోవా జిల్లాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠ్ ప్రాంగణంలో దీనిని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరిస్తారని మఠం కమిటీ చైర్మన్ శ్రీనివాస్ డెంపో చెప్పారు. గుజరాత్లో స్టాట్యూ ఆఫ్ యూనిటీ రూపశిల్పి రామ్ సుతార్ ఈ విగ్రహాన్ని మలిచారని తెలిపారు. మఠం ఏర్పాటై 550 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభిస్తారన్నారు. -
ఎంపీలు సమష్టిగా పోరాడాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సమస్యలు, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. ‘బీసీలకు సంబంధించిన 42 శాతం రిజర్వేషన్లను షెడ్యూల్ 9లో చేర్చే విధంగా కేంద్రాన్ని డిమాండ్ చేయాలి. అందుకోసం నిర్దేశిత ఫార్మాట్లలో వాయిదా తీర్మానాలు, ప్రశ్నోత్తరాల ద్వారా పార్లమెంట్ దృష్టికి తీసుకుని రావాలి. ఎంపీలంతా కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఒక వినతిపత్రాన్ని ఇవ్వాలి..’అని విజ్ఞప్తి చేశారు. ప్రజాభవన్లో గురువారం రాజకీయ పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్రం నుంచి సహకారం అందాల్సిన 12 శాఖలకు సంబంధించి 47 అంశాలపై డిప్యూటీ సీఎం ఎంపీలకు వివరించారు. పార్లమెంటులో గళమెత్తాలి ‘రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై పార్లమెంటులో గళం ఎత్తాలి. ప్రధాని సమయం ఇస్తే.. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న విషయాన్ని వివరించాలి. అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్ బిల్లును పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్ని, అక్కడి నుంచి గవర్నర్కు, ఆ తర్వాత కేంద్రానికి బిల్లు వెళ్లాక పెండింగ్లో ఉన్న విషయాన్ని వివరించాలి. ఎంపీలకు ఎలాంటి సమాచారం కావాలన్నా నిమిషాల్లో అందించడానికి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంటుంది..’అని భట్టి తెలిపారు. నిధులపై ఫాలోఅప్ చేయాలి ‘కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులు, పథకాలకు సంబంధించి గతంలో లేఖలు రాశాం. ఆ లేఖలు ఢిల్లీలోని ప్రత్యేక విభాగంలో ఎంపీలకు అందుబాటులో ఉంటాయి. వాటి ఆధారంగా ఎంపీలు ఫాలోఅప్ చేయవచ్చు. డిసెంబర్ 9 నాటికి ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. ‘2047 విజన్ డాక్యుమెంట్’ఆవిష్కరించనున్నాం. దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులను, దిగ్గజ కంపెనీలను ఆహ్వానిస్తున్నాం. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను, ఎంపీలందరినీ ఆహ్వానించాలని భావిస్తున్నాం. ఆసక్తి ఉన్న ఎంపీలు పేర్లు ఇస్తే ప్రభుత్వం వేయబోయే కమిటీల్లో సభ్యులుగా నమోదు చేస్తాం. దేశంలో, ప్రపంచంలో ప్రముఖ వ్యక్తులు, సంస్థలతో ఎంపీలకు పరిచయం ఉంటే వారి వివరాలు ఇవ్వాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం వారిని కూడా గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానిస్తాం..’అని భట్టి తెలిపారు. సీఎస్ కె.రామకృష్ణారావు, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలు పలు అంశాలను ప్రస్తావించారు.700 ఎకరాలు అదనమా? ‘ఆదిలాబాద్ విమానాశ్రయం నిర్మాణం కోసం 700 ఎకరాలు అవసరం అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్కు లేఖ రాసింది. ఇప్పటికే అక్కడ 369 ఎకరాలు ఉన్నాయి. ప్రభుత్వం పేర్కొన్న 700 ఎకరాల్లో ఈ 369 ఎకరాలు అంతర్భాగమేనా..? లేక 700 ఎకరాలు అదనంగా సేకరిస్తున్నారా..?’అని ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ ప్రశ్నించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. ఎయిర్పోర్టు నిర్మాణానికి వెయ్యి ఎకరాలు అవసరమని ఏఏఐ లేఖ రాసిందని, అందువల్ల ఇప్పటికే ఉన్న 369 ఎకరాలకు అదనంగా మరో 700 ఎకరాల భూ సేకరణ చేయాలని చెప్పారు. వరంగల్ నగరంలో భూగర్భ డ్రైనేజీ కోసం కేంద్రానికి లేఖ రాస్తామని ఎంపీ కడియం కావ్య చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీలు చామల కిరణ్కుమార్రెడ్డి, రామసహాయం రఘురామరెడ్డి, గడ్డం వంశీ, అనిల్కుమార్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ప్రధానిని కలుద్దాం రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం. ట్రిపుల్ ఆర్, రేడియల్ రోడ్లు, ఇతర సమస్యలపై ప్రధానమంత్రి సమయం తీసుకుని సమష్టిగా కలుద్దాం. రాష్ట్రానికి ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ అలాట్మెంట్ గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తే.. సంబంధిత మంత్రిని పార్టీలకు అతీతంగా కలసి లేఖ ఇద్దాం. అలాగే బొగ్గు అవసరాలకు సంబంధించి బొగ్గు శాఖ మంత్రిని కూడా కలుద్దాం. – మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రధానికి లేఖ ఇద్దాం రఘునందన్ రావు చెప్పినట్టుగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై అఖిలపక్ష సభ్యులందరం కలిసి ప్రధానమంత్రికి లేఖ ఇద్దాం. మహబూబ్నగర్ ఎయిర్పోర్టుపై పూర్తి సమాచారం కోసం కేంద్రానికి లేఖ రాయాలి. గద్వాల–డోర్నకల్ రైల్వే లైన్ సర్వేపై సమాచారం ఇవ్వండి. – నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి పోలవరం బ్యాక్ వాటర్తో నష్టం పోలవరం ప్రాజెక్టు పూర్తయితే బ్యాక్ వాటర్ వల్ల నా నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా నష్టపో తారు. ప్రాజెక్టులో నీరు నింపితే లక్ష మందికి పైగా ముంపు బారిన పడే అవకాశం ఉంది. ఈ సమస్యకు పరిష్కారం కావాలి. ములుగు – ఏటూరు నాగారం రహదారి నిర్మాణం..అటవీ, పర్యావరణ అనుమతులు రాకపోవడం వల్ల అలస్యం అవుతోంది. దీనిని పార్లమెంటులో ప్రస్తావిస్తాం. – మహబూబాబాద్ ఎంపీ బలరామ్నాయక్ పేదలకు ఉపాధి కరువురాష్ట్రంలో ఉపాధి హామీ కార్యక్రమంలో పని దినాలు బాగా తగ్గుతున్నాయి. దీనివల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. పేదలకు ఉపాధి కరువవుతోంది. జహీరాబాద్–బీదర్ రహదారి అత్యంత కీలకమైంది. దీనిపై కేంద్రానికి లేఖ రాస్తాం. – జహీరాబాద్ ఎంపీ సురేశ్షెట్కార్ -
అంధుల మహిళల ప్రపంచకప్ విజేతలకు ప్రధాని మోదీ ప్రశంస
న్యూఢిల్లీ: అంధుల టి20 ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టు సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఫైనల్ గెలిచిన రోజు ‘ఎక్స్’ వేదికగా అభినందించిన మోదీ... గురువారం విజేత జట్టు సభ్యుల్ని ఆతీ్మయంగా పలకరించారు. ‘చరిత్ర సృష్టించిన భారత అంధుల జట్టుకు అభినందనలు. ఆరంభ మెగా ఈవెంట్లో టోర్నీ మొత్తం అజేయంగా నిలిచారు. మీ కఠోర శ్రమకు, జట్టు సమష్టి కష్టానికి ఈ ట్రోఫీ ఓ నిదర్శనం. ప్రతీ ఒక్కరు అంకితభావంతో ఆడారు. మైదానంలో నిబద్ధతను చూపారు’ అని మోదీ ఈ సందర్భంగా క్రికెటర్ల ప్రతిభను కొనియాడారు. యువతరానికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అది్వతీయ విజయాలెన్నో సాధించాలని ఆకాంక్షించారు. ఇటీవల కొలంబో వేదికగా ఆరు జట్లతో జరిగిన ఈ మెగా ఈవెంట్ ఫైనల్లో భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో నేపాల్పై గెలిచింది. -
అంతరిక్ష రంగంలో స్టార్టప్లు అద్భుతాలు సృష్టిస్తున్నాయి
సాక్షి, హైదరాబాద్: సృజనాత్మక ఆవిష్కరణలతో దూసుకెళుతున్న భారత దేశ యువత ఇతర దేశాల జెన్జీ తరానికి కూడా ఆదర్శంగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. దేశం ఈ రోజు అంతరిక్ష రంగంలో ఒక అపూర్వ ఘట్టానికి సాక్ష్యంగా నిలిచిందని, విప్లవాత్మక విధానపరమైన మార్పుల ప్రభావంతో ప్రైవేట్ సంస్థలు ఈ రంగంలో దూసుకెళుతున్నాయని చెప్పారు. ఉపగ్రహ ప్రయోగాల విషయంలో దేశం అంతర్జాతీయ స్థాయిలో అగ్రస్థానానికి చేరుకుంటుందని, ఈ శతాబ్దం జెన్జీదేనని అన్నారు. దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ తయారీ సంస్థ ‘స్కై రూట్’శంషాబాద్లో నిర్మించిన భారీ కార్యాలయం ‘ఇన్ఫినిటీ క్యాంపస్’ను ప్రధాని గురువారం వర్చువల్గా ప్రారంభించారు. సుమారు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కార్యాలయంలోనే స్కైరూట్ తన మొట్టమొదటి ఆర్బిటల్ వెహికల్ ‘విక్రమ్–1’ను తయారు చేసింది. ఢిల్లీలోని తన కార్యాలయం నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా విక్రమ్–1ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. దేశ ప్రయోజనాలకు యువత పెద్దపీట ‘సై్కరూట్ కంపెనీ కార్యాలయం ‘ఇన్ఫినిటీ క్యాంపస్’దేశ యువశక్తికి, కొత్త ఆలోచనలకు, సృజనాత్మకతకు ప్రతీకగా నిలుస్తోంది. యువతరం రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. సృజనాత్మకంగా ఆలోచిస్తోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది. దేశ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాణిస్తోంది. అంతరిక్ష రంగమూ దీనికి భిన్నమేమీ కాదు. ఇద్దరు, ముగ్గురు జెన్–జీలతో మొదలైన స్టార్టప్లు చాలా తక్కువ వనరులతోనే అద్భుతాలు సృష్టిస్తున్నాయి. స్కైరూట్ సంస్థ వ్యవస్థాపకులు పవన్కుమార్ చందన, నాగ భరత్ డాకాలు దేశ యువతకు స్ఫూర్తినిస్తున్నారు. జెన్–జీ ఇంజినీర్లు, డిజైనర్లు, కోడర్లు, సైంటిస్ట్లు రాకెట్ల చోదక వ్యవస్థలు మొదలుకొని కాంపోజిట్ మెటీరియల్స్, ఉపగ్రహ వ్యవస్థలు, రాకెట్లకు సంబంధించిన కొత్త కొత్త టెక్నాలజీలను ఆవిష్కరిస్తున్నారు. ఐదేళ్ల క్రితం ఇలాంటివి కనీసం ఊహకు కూడా అందేవి కాదు. అందుకే 21వ శతాబ్దం దేశ జెన్–జీదేనని విశ్వసిస్తున్నా..’అని ప్రధాని చెప్పారు. అణుశక్తి రంగమూ ప్రైవేటీకరణ.. ‘భారత అంతరిక్ష రంగ ప్రస్థానం చాలా చిన్న స్థాయిలో మొదలైంది. సైకిళ్లపై రాకెట్ విడిభాగాలను మోసుకెళ్లే స్థితి నుంచి ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన లాంచ్ వెహికల్ను తయారు చేయగల స్థాయికి చేరగలిగాం. ఈ ప్రస్థానం పరిమితమైన వనరులతోనే మొదలైనప్పటికీ వృద్ధి మాత్రం దేశ శాస్త్రవేత్తల సంకల్ప బలానికి నిదర్శనంగా నిలిచింది. గడచిన దశాబ్ద కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణల కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా అంతరిక్ష రంగంలోనే 300కు పైగా స్టార్టప్లు వెలిశాయి. సమాచార, వాతావరణ అంచనాలు, వ్యవసాయం, అర్బన్ ప్లానింగ్లతో పాటు దేశ భద్రతలోనూ అంతరిక్ష రంగం విస్తృత వినియోగంలోకి వచ్చింది. దేశీ అంతరిక్ష రంగంపై పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతోంది. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ కంపెనీలను అనుమతించడం ద్వారా సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని సమీప భవిష్యత్తులో అణుశక్తి రంగాన్ని కూడా ప్రైవెటీకరణ చేసే దిశగా అడుగులేస్తున్నాం..’అని మోదీ వెల్లడించారు. గ్లోబల్ స్పేస్ పవర్గా భారత్: కిషన్రెడ్డి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశం గ్లోబల్ స్పేస్ పవర్గా ఎదిగిందని, 400కు పైగా ప్రైవేటు స్టార్టప్స్, 2 వేలకు పైగా ఎంఎస్ఎంఈలు, 50 పరిశోధనా కేంద్రాలు స్పేస్ రంగానికి ఊతమిస్తున్నాయని చెప్పారు. ఇవాళ రూ.70 వేల కోట్ల విలువైన భారత స్పేస్ ఎకానమీ.. 2033 నాటికి రూ.4 లక్షల కోట్లకు చేరుకుంటుందని పేర్కొన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఏరో స్పేస్ తయారీ రంగంలో పెట్టుబడులకు భారీగా ముందుకు వస్తున్నారని, 2020లో ప్రధాని మోదీ సంస్కరణలు తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ,4500 కోట్ల మేర ప్రైవేటు పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. రెండు నెలల్లో విక్రమ్–1 ప్రయోగం స్కైరూట్ సొంతంగా తయారు చేసిన ఆర్బిటల్ వెహికల్ ‘విక్రమ్–1’ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సాయంతో రెండు నెలల్లో ప్రయోగించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన పవన్కుమార్ చందన తెలిపారు. 2018లో దేశంలోనే మొట్టమొదటి సబ్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్–ఎస్’ప్రయోగం విజయవంతం కావడాన్ని ప్రస్తావిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష రంగంలో ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యానికి ఓకే చెప్పడం వల్లనే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు నాగ భరత్ డాకా, వ్యోమగామి శుభాంశు శుక్లా, ఇన్స్పేస్ చైర్మన్ పవన్ గోయెంకా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అతి తక్కువ వనరులతోనే అద్భుతాలు: ప్రధాని మోదీ
సాక్షి, హైదరాబాద్: అంతరిక్ష రంగంలో దేశం ఈ రోజు ఒక అపూర్వ ఘట్టానికి సాక్ష్యంగా నిలిచిందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శంషాబాద్లో నిర్మించిన భారీ కార్యాలయం ‘ఇన్ఫినిటీ క్యాంపస్’ను గురువారం వర్చువల్గా ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘..విప్లవాత్మక విధానపరమైన మార్పుల ప్రభావంతో ప్రైవేట్ సంస్థలు ఈ రంగంలో దూసుకెళుతున్నాయి. హైదరాబాద్లో నేడు ఆవిష్కృతమైన స్కైరూట్ కంపెనీ కార్యాలయం ‘ఇన్ఫినిటీ క్యాంపస్’ దేశ యువశక్తికి, కొత్త ఆలోచనలకు, సృజనాత్మకతకు ప్రతీకగా నిలుస్తోంది. సృజనాత్మక ఆవిష్కరణలతో దూసుకెళుతున్న భారత దేశ యువత ఇతర దేశాల జెన్జీ తరానికి కూడా ఆదర్శంగా నిలుస్తోంది.... యువతరం రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉందని, సృజనాత్మకంగా ఆలోచిస్తోందని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది. ఉపగ్రహ ప్రయోగాల విషయంలో దేశం అంతర్జాతీయ స్థాయిలో అగ్రస్థానానికి చేరుకుంటుంది’’ అనే ధీమా వ్యక్తం చేశారాయన. ఈ సందర్భంగా స్కైరూట్ సంస్థ వ్యవస్థాకులు పవన్ కుమార్ చందన, నాగభరత్ డాకాలు దేశ యువతకు స్ఫూర్తినిస్తున్నారని ప్రశంసించారు.యువత దేశ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోందని, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాణిస్తోందని దేశ ప్రధాని కొనియాడారు. అంతరిక్ష రంగమూ దీనికి భిన్నమేమీ కాదని.. ఇద్దరు, ముగ్గురు జెన్-జీలతో మొదలైన స్టార్టప్లు చాలా తక్కువ వనరులతోనే అద్భుతాలు సృష్టిస్తున్నారని, అలాంటి వారిని కలిసే అవకాశం తనకు దక్కిందని వివరించారు. జెన్-జీ ఇంజినీర్లు, డిజైనర్లు, కోడర్లు, సైంటిస్ట్లు రాకెట్ల చోదక వ్యవస్థలు మొదలుకొని కాంపోజిట్ మెటీరియల్స్, ఉపగ్రహ వ్యవస్థలు, రాకెట్లకు సంబంధించిన కొత్త కొత్త టెక్నాలజీలను ఆవిష్కరిస్తున్నారని చెప్పారు. ఐదేళ్ల క్రితం ఇలాంటివి కనీసం ఊహకు కూడా అందేవి కావని.. అందుకే 21వ శతాబ్ధం దేశ జెన్-జీదేనని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటీకరణ దిశగా భారత అణుశక్తి రంగంఅంతరిక్ష రంగంలో ప్రైవేట్ కంపెనీలను అనుమతించడం ద్వారా సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని సమీప భవిష్యత్తులో అణుశక్తి రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత అంతరిక్ష రంగ ప్రస్థానం చాలా చిన్న స్థాయిలో మొదలైందని, సైకిళ్లపై రాకెట్ విడిభాగాలను మోసుకెళ్లే స్థితినుంచి ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన లాంచ్ వెహికల్ను తయారు చేయగల స్థాయికి చేరగలిగామని ప్రధాని గుర్తు చేశారు. ఈ ప్రస్థానం పరిమితమైన వనరులతోనే మొదలైనప్పటికీ వృద్ధిమ ఆత్రం దేశ శాస్త్రవేత్తల సంకల్పబలానికి నిదర్శనంగా నిలిచిందన్నారు. గడచిన దశాబ్ధ కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణల కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా అంతరిక్ష రంగంలోనే 300కుపైగా స్టార్టప్లు వెలిశాయి అని సమాచార, వాతావరణ అంచనాలు, వ్యవసాయం, అర్బన్ ప్లానింగ్లతోపాటు దేశ భద్రతకూ అంతరిక్ష రంగం విస్తృత వినియోగంలోకి వచ్చిందని వివరించారు. దేశీ అంతరిక్ష రంగంపై పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతోందని చిన్న ఉపగ్రహాలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతోందని వివరించారు.ప్రయోగం ఎప్పుడంటే.. సుమారు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కార్యలయంలోనే స్కైరూట్ తన మొట్టమొదటి ఆర్బిటల్ వెహికల్ ‘విక్రమ్-1’ను తయారు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని తన కార్యాలయం నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా విక్రమ్-1ను ఆవిష్కరించారు. స్కైరూట్ సొంతంగా తయారు చేసిన ఆర్బిటల్ వెహికల్ ‘విక్రమ్-1’ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సాయంతో రెండు నెలల్లో ప్రయోగించనున్నట్లు సంస్థ వ్యవస్థపకుల్లో ఒకరైన పవన్ కుమార్ చందన తెలిపారు. 2018లో దేశంలోనే మొట్టమొదటి సబ్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-ఎస్’ ప్రయోగాన్ని విజయవంతం కావడం గురించి ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష రంగాన్ని ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యానికి ఓకే చెప్పడం వల్లనే సాధ్యమైందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా వికసిత్ భారత్ 2047 కంటే ఎంతో ముందుగానే ఆవిష్కృతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు నాగ భరత్ డాకా మాట్లాడుతూ 2030 నాటికి దేశం ఏడాదికి యాభై అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించగల స్థితికి చేరుకుంటుందని, స్కైరూట్లో డిమాండ్కు తగ్గట్టుగా నెలకు ఒక విక్రమ్-1ను తయారు చేసే సామర్థ్యాన్ని అందిపుచ్చుకుంటామని అన్నారు. కేంద్ర బొగ్గు, పర్యావరణ శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డితోపాటు, వ్యోమగామి శుభాంశు శుక్లా, ఇన్స్పేస్ ఛైర్మన్ పవన్ గోయాంక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కీలక ఖనిజాల పథకానికి ఆమోదం
న్యూఢిల్లీ: కీలక రంగాల్లో అత్యావశ్యకంగా మారిన అరుదైన భూఅయస్కాంత ఖనిజాల సేకరణపై కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టిసారించింది. వీటి దిగుమతుల కోసం చైనాపై ఆధారపడడటం మానేసి అరుదైన ఖనిజాల రంగంలో స్వావలంబన దిశగా ముందడుగు వేయాలని కేంద్రం కంకణం కట్టుకుంది. ఇందులోభాగంగా భూఅయస్కాంతాల గనుల తవ్వకం, శుద్ధి, స్వచ్ఛమైన ఖనిజాల తయారీకి సంబంధించి రూ.7,280 కోట్లతో నూతన పథకాన్ని ప్రారంభించాలన్న ప్రతిపాదనకు ప్రధాని మోదీ సారథ్యంలోని కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఈ పథకానికి రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్(ఆర్ఈపీఎంఎస్) అని పేరు పెట్టింది. విద్యుత్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్స్, వైమానిక రంగం, రక్షణ పరికరాల్లోని కీలక భాగాలను ఈ భూఅయస్కాంత ఖనిజాలతోనే తయారుచేస్తారు. దీంతో వీటికి విపరీతమైన కొరత ఏర్పడింది. డిమాండ్ తగ్గ సరఫరా సాధించడంతోపాటు స్వావలంబనే లక్ష్యంగా ఈ పథకాన్ని మొదలుపెట్టనున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. కేబినెట్ భేటీ నిర్ణయాలను ఆయన తర్వాత మీడియాకు వెల్లడించారు.ఔత్సాహిక కంపెనీల కోసం అంతర్జాతీయ బిడ్డింగ్ అంతర్జాతీయ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఔత్సాహిక కంపెనీలను ఆహ్వానిస్తారు. వీటి నుంచి చివరకు ఐదు సంస్థలను ఎంపికచేస్తారు. ఒక్కో కంపెనీకి 1,200 మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని లక్ష్యంగా నిర్దేశిస్తారు. ఏడేళ్ల కాలానికి కాంట్రాక్ట్ అప్పగిస్తారు. కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థలు తొలి రెండేళ్లలోపు పూర్తిస్థాయిలో తయారీయూనిట్ను స్థాపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐదేళ్లలోపు భూఅయస్కాంతాల తయారీ, విక్రయం, ఎగుమతి మొదలెట్టాలి. రూ.7,280 కోట్ల పథకంలో రూ.6,450 కోట్లను విక్రయాల ప్రోత్సాహకాల కింద కేటాయించారు. 6,000 మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్య సాధన కోసం మరో రూ. 750 కోట్లను మూలధన సబ్సిడీగా కేటాయించారు. భారత్లో ఏటా విద్యుత్ వాహనాలు, సౌర విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన రంగం, పారిశ్రామిక ఉపకరణాలు, ఎల్రక్టానిక్స్ గృహోపకరణాల్లో భూఅయస్కాంతాల వినియోగం పెరుగుతోంది. దీంతో వీటి డిమాండ్ వచ్చే ఐదేళ్లలో రెట్టింపు కావొచ్చని ప్రభుత్వం అంచనావేస్తోంది. అంతర్జాతీయంగా భూఅయాస్కాంత ఖనిజాల తవ్వకం, శుద్ధి, స్వచ్ఛ లోహాల తయారీ రంగంలో చైనా గుత్తాధిపత్యం కొనసాగుతోంది. భారత్కు ఏటా 5,000 మెట్రిక్ టన్నుల భూఅయస్కాంతాల అవసరం ఉంది. అయితే ఏడు కీలక భూఅయస్కాంతాలు, వాటి ఉపఉత్పత్తుల ఎగుమతి కోసం ప్రత్యేక లైసెన్సులు తప్పనిసరి అంటూ ఏప్రిల్ 4న చైనా కఠిన నిబంధనలు అమల్లోకి తేవడంతో భారత్సహా ప్రపంచదేశాలకు వీటి కొరత విపరీతంగా ఏర్పడింది. దీంతో భారత్ ఇలా భూఅయస్కాంతాల్లో ఆత్మనిర్భరత దిశగా అడుగులేస్తోంది.ఏమిటీ భూఅయస్కాంతాలు? తక్కువ ఉద్గారాలు, తక్కువ ఇంధన వినియోగం, మెరుగైన సామర్థ్యం, వేగం, దృఢత్వం, వేడిని తట్టుకోవటం వంటి గుణాలతో కూడిన పరిజ్ఞానంతో తయారైన ఉపకరణాల్లో భూఅయస్కాంతాలనే వాడతారు. అందుకే వీటికి అంతటి డిమాండ్. విద్యుత్, కాంతి సంబంధ, అయస్కాంత, ఉత్ప్రేరక అప్లికేషన్లలో వీటిన ఉపయోగిస్తారు. ఇవి శుద్ధ లోహాల రూపంలో లభించవు. ముఖ్యంగా యురేనియం, థోరియం వంటి రేడియోధారి్మక పదార్థాలతో కలిసి మిశ్రమాలుగా లభిస్తాయి. వీటిని వేరు చేసి, శుద్ధి చేయటం చాలా కష్టమైన పని. భారత్లోనూ దాదాపు 72 లక్షల టన్నుల భూఅయస్కాంత నిల్వలున్నాయి. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి తీరప్రాంత రాష్ట్రాల్లోని మోనోజైట్ ఇసుకలో ఈ నిల్వలు అధికంగా ఉన్నాయి. పశి్చమబెంగాల్, జార్ఖండ్, గుజరాత్, రాజస్తాన్, మహారాష్ట్రలోనూ ఇవి ఉన్నాయి. కొత్తరకం ఎల్రక్టానిక్ వస్తువులు, మోటార్లు, ఎనర్జీ టెక్నాలజీ వస్తువులు, స్పీకర్లు, హెడ్ఫోన్లు, ప్రింటర్లు, సీడీ/డీవీడీ డ్రైవ్లు, సెన్సార్లు, రాకెట్లు, పవర్స్టీరింగ్, విండో లిఫ్ట్, సీట్ మోటార్లలోనూ వీటిని వాడతారు. -
రాజ్యాంగ విధులతో బలమైన ప్రజాస్వామ్యం
న్యూఢిల్లీ: దేశ పౌరులంతా రాజ్యాంగం నిర్దేశించిన విధులను నిర్వర్తించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బలమైన ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విధులే పునాది అని ఉద్ఘాటించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన బుధవారం దేశ ప్రజలకు ఈ మేరకు లేఖ రాశారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ఇందుకోసం ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. ఇకపై ప్రతిఏటా పాఠశాలలు, కళాశాలల్లో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవాలని, 18 ఏళ్లకు తొలిసారి ఓటు హక్కు పొందినవారిని సత్కరించుకోవాలని కోరారు. విధులు నిర్వర్తిస్తేనే హక్కులు లభిస్తాయని జాతిపిత మహాత్మాగాంధీ బోధించినట్లు ప్రధాని మోదీ గుర్తుచేశారు. సామాజిక, ఆర్థిక ప్రగతికి విధుల నిర్వహణ అత్యావశ్యకమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ రచనలో బాబూ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్తోపాటు మరికొందరు మహనీయులు పోషించిన పాత్రను గుర్తుచేశారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో వల్లభ్భాయ్ పటేల్, బిర్సా ముండా, మహాత్మాగాం«దీల నాయకత్వాన్ని, త్యాగాలను శ్లాఘించారు. దేశానికి కృతజ్ఞత చూపాల్సిందే.. ‘‘రాజ్యాంగ విధులను అందరూ సక్రమంగా నిర్వర్తిస్తేనే మన ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏలో ఈ అంశాన్ని పొందుపర్చారు. ఉమ్మడిగా సామాజిక, ఆర్థిక ప్రగతిని సాధించడానికి రాజ్యాంగ విధులే మనకు దారి చూపుతాయి. ‘వికసిత్ భారత్’ దిశగా మన ప్రయాణం సఫలం కావాలంటే రాజ్యాంగ విధులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఈరోజు మనం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన విధానాలే రాబోయే తరాల జీవితాలను ప్రభావితం చేస్తాయి. మన దేశం మనకు ఎంతో ఇచ్చింది. కృతజ్ఞతలు చూపాలన్న భావన మనసులో నాటుకోవాలి. అప్పుడు రాజ్యాంగ విధుల నిర్వహణ మన జీవితంలో భాగమవుతుంది. ప్రతి పని పూర్తిసామర్థ్యం, అంకితభావంతో పూర్తిచేయాలి. మనం చేసే ప్రతి పని దేశానికి సంబంధించిన లక్ష్యాలను, ప్రయోజనాలను నెరవేర్చేలా ఉండాలి. మహోన్నతమైన భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుల స్వప్నాలను సాకారం చేయడం మనందరి బాధ్యత. జమ్మూకశ్మీర్ ప్రజలకు రాజ్యాంగ హక్కులుసర్దార్ పటేల్ దార్శనికత, నాయకత్వ పటిమతో దేశం ఐక్యంగా మారింది. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35(ఎ)ను రద్దు చేయడానికి ఆయన స్ఫూర్తిగా నిలిచారు. ఇప్పుడు జమ్మూకశ్మీర్లో రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమలవుతుండడం సంతోషంగా ఉంది. జమ్మూకశ్మీర్ ప్రజలకు రాజ్యాంగ హక్కులు లభిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, అణగారిన వర్గాల ప్రజలకు మేలు జరుగుతోంది. గిరిజనులకు న్యాయం, గౌరవం, సాధికారత చేకూర్చడంలో భగవాన్ బిర్సా ముండా జీవితం మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. రాజ్యాంగం దేశ ప్రజలకు ఓటు హక్కును ఇచ్చింది. స్థానిక, రాష్ట్ర జాతీయ ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేయాలి. రాజ్యాంగం కట్టబెట్టిన హక్కును వాడుకోవడం పౌరులుగా మన బాధ్యత. అది ముమ్మాటికీ రాజ్యాంగం ఘనతే రాజ్యాంగం గొప్పతనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆర్థికంగా వెనకబడిన కుటుంబంలో జన్మించిన నేను ప్రధానమంత్రిగా ఉన్నత స్థానానికి చేరుకున్నానంటే అది ముమ్మాటికీ రాజ్యాంగం ఘనతే. రాజ్యాంగం కల్పించిన అవకాశంతోనే గత 24 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజాజీవితంలో కొనసాగుతున్నా. 2014లో ప్రధానమంత్రిగా తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టినప్పుడు అక్కడి మెట్లకు తలవంచి నమస్కరించడం, మెట్లను చేతితో తాకడం ఇప్పటికీ గుర్తుంది. 2019లో ఎన్నికల ఫలితాల తర్వాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాజ్యాంగానికి నమస్కరించి, తలపై మోశాను. మన రాజ్యాంగం నాలాంటి ఎంతోమంది నాయకులను ఈ దేశానికి ఇచ్చింది. రాజ్యాంగాన్ని బలోపేతం చేసే అవకాశాన్ని రాజ్యాంగమే కల్పించింది’’ అని మోదీ లేఖలో పేర్కొన్నారు. -
విమానయాన రంగానికి కొత్త రెక్కలు
సాక్షి, హైదరాబాద్: భారత్ ప్రస్తుతం సంస్కరణల ఆధారిత దేశంగా మారి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఫ్రాన్స్కు చెందిన దిగ్గజ ఏరోస్పేస్, రక్షణరంగ సంస్థ సఫ్రాన్ రూ. 1,300 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లోని జీఎంఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండ్రస్టియల్ పార్క్ సెజ్లో ఏర్పాటు చేసిన ‘లీప్’ఇంజిన్ల నిర్వహణ, మరమ్మతు, ఓవర్హాల్ (ఎంఆర్ఓ) కేంద్రాన్ని (సఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా) ప్రధాని బుధవారం వర్చువల్గా ప్రారంభించారు.వచ్చే ఏడాది నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్న ఈ కేంద్రంలో ఏటా 300 వాణిజ్య విమానాలకు చెందిన ‘లీప్’ఇంజిన్ల సరీ్వసింగ్ వీలవనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘నేటి నుంచి భారత విమానయాన రంగం కొత్త పుంతలు తొక్కనుంది. సఫ్రాన్ కంపెనీకి చెందిన ఈ కొత్త కేంద్రం భారత్ను ఒక గ్లోబల్ ఎంఆర్ఓగా మార్చేందుకు సహాయపడుతుంది’అని చెప్పారు.ఈ కేంద్రం విమానాయన రంగంలో దేశ యువతకు ప్రత్యేకించి దక్షిణాది ప్రాంత యువతీయువకులకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందన్నారు. సఫ్రాన్ బోర్డు, అధికారుల బృందంతో జరిగిన చర్చల్లో భారత్పట్ల వారికి ఉన్న విశ్వాసం, ఆశాభావాన్ని గమనించినట్లు పేర్కొన్నారు. దేశంలో సఫ్రాన్ పెట్టుబడులు ఇదే వేగంతో కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా సఫ్రాన్ బృందానికి ప్రధాని అభినందనలు తెలియజేశారు. సఫ్రాన్ సంస్థ ఏర్పాటు చేసిన విమాన ఇంజిన్ సర్వీస్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న సీఎం రేవంత్రెడ్డి, చిత్రంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, సంస్థ ప్రతినిధులు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి... భారత విమానయాన రంగం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో ఒకటని ప్రధాని మోదీ చెప్పారు. దేశీయ విమానయాన మార్కెట్ ఇప్పుడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మార్కెట్గా ఉందని వివరించారు. దేశ ప్రజల ఆకాంక్షలు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయన్న ఆయన.. వాటి ఫలితంగా దేశంలో విమాన ప్రయాణానికి డిమాండ్ పెరుగుతోందన్నారు. డిమాండ్ను తీర్చడానికి విమానయాన సంస్థలు విమానాల సంఖ్యను పెంచుకుంటున్నాయని తెలిపారు. భారతీయ విమానయాన కంపెనీలు 1,500 కంటే ఎక్కువ కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చినట్లు మోదీ పేర్కొన్నారు. పెరిగిన ఎంఆర్ఓ అవసరం... విమానయాన రంగం వేగంగా విస్తరిస్తున్నందున ఎంఆర్ఓ కేంద్రాల అవసరం కూడా పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం మరమ్మతుల కోసం దేశంలో 85 శాతం విమానాలు విదేశాలకు వెళ్తున్నాయని.. ఈ పరిణామం విమానయాన సంస్థల ఖర్చుల పెరుగుదల, సరీ్వసుల్లో జాప్యానికి కారణమవుతోందని మోదీ పేర్కొన్నారు. ఇది దేశ విమానయాన రంగానికి ఏమాత్రం మంచిది కాదని.. అందుకే ప్రపంచంలోని ప్రధాన ఎంఆర్ఓ కేంద్రాల్లో ఒకటిగా భారత్ను నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.తొలిసారిగా ఒక అంతర్జాతీయ సంస్థ భారత్లో డీప్ లెవెల్ సరీ్వసింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తోందని మోదీ తెలియజేశారు. సఫ్రాన్ అందించే అంతర్జాతీయ స్థాయి శిక్షణ, విజ్ఞాన బదిలీ, భారతీయ సంస్థలతో భాగస్వామ్యం రాబోయే ఏళ్లలో మొత్తం ఎంఆర్ఓ వ్యవస్థకు కొత్త ఊపు, దిశను ఇచ్చే శ్రామిక శక్తిని తయారు చేసేందుకు సహాయపడుతుందని ప్రధాని చెప్పారు. డిజైన్ ఇన్ ఇండియా.. ‘డిజైన్ ఇన్ ఇండియా’ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని.. ఈ నేపథ్యంలో భారత్లో విమాన ఇంజిన్, విడిభాగాల తయారీ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ప్రధాని మోదీ సఫ్రాన్ బృందాన్ని కోరారు. ఏరోస్పేస్ ప్రొపల్షన్ సిస్టమ్స్లో సఫ్రాన్ కంపెనీ విస్తృతంగా పనిచేస్తోందన్న ప్రధాని.. ప్రొపల్షన్ వ్యవస్థల డిజైన్, తయారీ కోసం కూడా భారత నైపుణ్యాలు, అవకాశాలను ఉపయోగించుకోవాలని కంపెనీని కోరారు. ‘మేం పెద్ద కలలు కంటున్నాం. అంతకంటే పెద్ద పనులు చేస్తున్నాం. ఉత్తమ ఫలితాలను అందిస్తున్నాం’అని ప్రధాని పేర్కొన్నారు. సులభతర వ్యాపారానికి భారత్ ప్రాధాన్యం ఇస్తోందని మోదీ చెప్పారు. రక్షణ రంగంలోనూ 74 శాతం ఎఫ్డీఐ.. ప్రైవేటు రంగానికి అవకాశంలేని రక్షణ వంటి రంగాల్లోనూ ఇప్పుడు 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)కు అనుమతిచి్చనట్లు ప్రధాని మోదీ తెలిపారు. అంతరిక్ష రంగంలోనూ కీలక విధానాన్ని అవలంబించినట్లు వెల్లడించారు. ఈ చర్యలు ప్రపంచానికి ‘భారత్ పెట్టుబడులను స్వాగతిస్తుంది.. ఆవిష్కరణలను స్వాగతిస్తుంది’అనే స్పష్టమైన సందేశాన్ని పంపాయన్నారు.ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాలు అంతర్జాతీయ తయారీదారులను భారత్లో తయారీ వైపు ఆకర్షించాయని ప్రధాని చెప్పారు. తమ పాలనలో 40 వేలకుపైగా నిబంధనలను తగ్గించి జాతీయ ఏకగవాక్ష విధానం ద్వారా అనుమతులను మంజూరు చేస్తున్నట్లు వివరించారు. జీఎస్టీ సంస్కరణలు, ఫేస్లెస్ ట్యాక్స్ అసెస్మెంట్, కొత్త కారి్మక కోడ్లు, దివాలా కోడ్ వంటి చర్యల ఫలితంగా భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు చెందిన పెట్టుబడిదారులకు ఒక విశ్వసనీయ భాగస్వామిగా, ఒక ప్రధాన మార్కెట్గా, వేగంగా దూసుకుపోతున్న తయారీ కేంద్రంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వృద్ధికి ‘సఫ్రాన్’మైలురాయి: సీఎం రేవంత్రెడ్డి సఫ్రాన్ సంస్థ తమ కార్యకలాపాల విస్తరణకు తెలంగాణను ఎంచుకోవడం రాష్ట్ర వృద్ధికి ఒక మైలురాయి అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశంలో ‘లీప్’ఇంజిన్ల తొలి ఎంఆర్వో కేంద్రం ఇదేనన్నారు. ఈ కేంద్రంలో వెయ్యి మంది సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి లభిస్తుందన్నారు. ఇది రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలకు ఊతమిస్తుందని చెప్పారు. రఫేల్ యుద్ధ విమానాల్లో వినియోగించే ఎం88 సైనిక ఇంజిన్ల నిర్వహణ, మరమ్మతుల కోసం సఫ్రాన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న మరో ఎంఆర్ఓకు శంకుస్థాపన చేసుకున్నామని సీఎం రేవంత్ వెల్లడించారు.భారత వైమానిక దళం, భారత నావికాదళానికి ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. భారత్లోని ప్రధాన ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్గా హైదరాబాద్ మారిందన్నారు. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతిశీల పారిశ్రామిక విధానం, ఎంఎస్ఎంఈ విధానం దేశంలోనే అత్యుత్తమని చెప్పారు. సఫ్రాన్, బోయింగ్, ఎయిర్ బస్, టాటా, భారత్ ఫోర్జ్ వంటి సంస్థలు హైదరాబాద్ను తయారీ, పరిశోధన, అభివృద్ధి కోసం ఎంచుకున్నాయని సీఎం తెలిపారు. ఏరోస్పేస్, రక్షణ రంగంలో ఎగుమతులు గత ఏడాది రెట్టింపు అయ్యాయని వ్యాఖ్యానించారు.9 నెలల్లో రూ.30,742 కోట్లకు చేరుకున్నట్లు చెప్పారు, మొదటిసారిగా మన ఫార్మా ఎగుమతులను ఈ రంగం అధిగమించిందన్నారు. 100 ఐటీఐలను ఏటీఎస్లుగా మార్చామని, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ విమానాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెడుతుందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. 30 వేల ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రాష్ట్ర విజన్ను డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్కు అందర్నీ ఆహ్వనిస్తున్నట్లు సీఎం తెలిపారు.బెంగళూరు–హైదరాబాద్ను డిఫెన్స్, ఏరోస్పేస్ కారిడార్గా ప్రకటించాలని ఈ సందర్భంగా రేవంత్రెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంతి రామ్మోహన్నాయుడు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, సఫ్రాన్ గ్రూప్ చైర్మన్ రాస్ మెకలెన్స్, సీఈవో, డైరెక్టర్ ఒలివర్ అండ్రీస్, ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్ సీఈవో స్టీఫెన్ క్యూయల్, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్లో అంతర్జాతీయ విమానాల రిపేరీ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలి అంతర్జాతీయ విమానాల మరమ్మతు కేంద్రం హైదరాబాద్లో ఏర్పాటవుతోంది. శంషాబాద్ సమీపంలోని జీఎంఆర్ ఏరోపార్క్ (SEZ)లో ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ సంస్థ సఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా (SAESI) నెలకొల్పుతున్న లీప్ ఇంజిన్ ఎంఆర్వో (మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ - MRO) సెంటర్ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు.రఫేల్ విమానాల్లో ఉపయోగించే M88 ఇంజిన్ కోసం ఏర్పాటు చేస్తున్న కొత్త ఎంఆర్వో యూనిట్కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు.ఈ కొత్త సదుపాయం ఏరోస్పేస్, రక్షణ రంగంలో తెలంగాణ వృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఇది భారతదేశంలో లీప్ ఇంజిన్ ల మొట్టమొదటి మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్ (MRO) సెంటర్. రూ.1,300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సదుపాయంతో 1,000 మందికి పైగా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి లభిస్తుంది.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణపై నమ్మకంతో హైదరాబాద్ ను ఎంచుకున్న సఫ్రాన్ కు అభినందనలు తెలిపారు. ఇది మన స్థానిక ఎంఎస్ఎంఈలకు, ఇంజనీరింగ్ కంపెనీలకు కొత్త వ్యాపార అవకాశాలను కల్పిస్తుందన్నారు.ఈ విమానాల మరమ్మతు కేంద్రం భారత వైమానిక, నావికాదళానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్ దేశంలోని ప్రధాన ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్ నిలిచిందన్నారు. తెలంగాణలో 25 కంటే ఎక్కువ ప్రధాన ప్రపంచ కంపెనీలు, 1,500 కి పైగా ఎంఎస్ఎంఈలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.తమ ప్రగతిశీల పారిశ్రామిక విధానం, ఎంఎస్ఎంఈ విధానం దేశంలోనే అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా నిలిచిందన్నారు. తమ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఏరోస్పేస్ పార్కులు, SEZలు ప్రముఖ ప్రపంచ కంపెనీల నుండి అనేక భారీ పెట్టుబడులను ఆకర్షించాయన్నారు.సఫ్రాన్, బోయింగ్, ఎయిర్ బస్, టాటా, భారత్ ఫోర్జ్ వంటి సంస్థలు హైదరాబాద్ ను తయారీ, పరిశోధన, అభివృద్ధి కోసం ఎంచుకున్నాయని, హైదరాబాద్ భారతదేశంలోని ప్రముఖ ఎంఆర్వో, ఏరో ఇంజిన్ హబ్ లలో ఒకటిగా నిలిచిందన్నారు.ఏరోస్పేస్, రక్షణ రంగంలో మన ఎగుమతులు గత ఏడాది రెట్టింపు అయ్యాయని, 9 నెలల్లో రూ.30,742 కోట్లకు చేరుకున్నాయని, మొదటిసారిగా మన ఫార్మా ఎగుమతులను అధిగమించాయని వివరించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి తెలంగాణ ఏరోస్పేస్ అవార్డును పొందిందన్నారు. ఏరోస్పేస్ పెట్టుబడులను ఆకర్షించడానికి నైపుణ్యం చాలా ముఖ్యమైన ప్రమాణమన్న రేవంత్ రెడ్డి టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో తెలంగాణ 100 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లను (ఐటీఐఎస్) అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేసిందన్నారు.తమ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ విమానాల నిర్వహణ కోసం ప్రత్యేక శిక్షణపై దృష్టి పెడుతుందన్నారు.30 వేల ఎకరాల విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి, తమ విజన్ ను ఆవిష్కరించడానికి డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే తెలంగాణ రైజింగ్ 2047 – గ్లోబల్ సమ్మిట్ కు అందరినీ ఆహ్వానిస్తున్నానన్నారు. 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలని తాము ప్రయత్నిస్తున్నామని, బెంగళూరు-హైదరాబాద్ ను డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కారిడార్ గా ప్రకటించాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నానని వెల్లడించారు. -
వికసిత్ భారత్ లక్ష్యంగా.. ప్రధాని మోదీ లేఖ
ఢిల్లీ: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు (బుధవారం) దేశ పౌరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. వికసిత్ భారత్ సాధనకు ప్రజలందరూ తమ విధులను నిబద్దతతో ఆచరించాలని పిలుపునిచ్చారు. ఓటుహక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకొని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలన్నారు. 18 ఏళ్లు దాటిన విద్యార్థులను సన్మానిస్తూ కాలేజీలు, పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించాలని కోరారు.బలమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి పౌరులందరూ తమ రాజ్యాంగ విధులను తప్పక నిర్వర్తించాలని ప్రధాని మోదీ ఆ లేఖలో పేర్కొన్నారు. ఓటు హక్కును సక్రమంగా వినియోగించడం ద్వారా భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యతను ఆయన గుర్తు చేశారు. ఈ పవిత్రమైన రోజున, 18 ఏళ్లు నిండి, మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న యువతను పాఠశాలలు, కళాశాలలలో ప్రత్యేకంగా గౌరవించాలని ప్రధాని మోదీ సూచించారు. తద్వారా యువతలో రాజ్యాంగం పట్ల అవగాహన పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ బోధించిన ‘కర్తవ్యాల నిర్వహణ నుంచే హక్కులు ప్రవహిస్తాయి’ అనే సూత్రాన్ని ప్రధాని గుర్తుచేస్తూ, విధులను నెరవేర్చడమే సామాజిక, ఆర్థిక పురోగతికి అసలైన పునాది అని అన్నారు.మనం తీసుకునే ప్రతి నిర్ణయం రాబోయే తరాల జీవితాలను రూపుదిద్దుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారతదేశం వికసిత్ భారత్ దార్శనికత వైపు దూసుకుపోతున్న ఈ సమయంలో, పౌరులంతా రాజ్యాంగ విధులను అత్యంత ప్రధానమైనవిగా భావించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతీ మనిషికి గౌరవం, సమానత్వం, స్వేచ్ఛ అందించేందుకు రాజ్యాంగం అత్యంత ప్రాముఖ్యతనిస్తుందని అన్నారు. రాజ్యాంగం మనకు హక్కులతో సాధికారత కల్పిస్తున్నప్పటికీ, పౌరులుగా మన విధులను కూడా గుర్తు చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని రూపొందించిన నిర్మాతలకు ఘన నివాళులర్పించారు. వారు అందించిన దార్శనికత, దూరదృష్టి వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రేరణగా నిలుస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
ఉగ్రవాదానికి భారత్ తలవంచదని ఆపరేషన్ సిందూర్ చాటింది
కురుక్షేత్ర: భారత్ ఎల్లప్పుడూ శాంతి మంత్రం జపిస్తుందని, ఎట్టిపరిస్థితుల్లోనూ భద్రత విషయంలో రాజీపడబోదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్తో ఇదే విషయాన్ని ప్రపంచదేశాలకు భారత్ మరోసాటి చాటిచెప్పిందని మోదీ అన్నారు. మంగళవారం హరియాణాలోని కురుక్షేత్ర పట్టణంలో సిక్కుల తొమ్మిదవ మత గురువు గురు తేగ్ బహదూర్ 350వ బలిదాన దినం వార్షిక కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. బహదూర్ స్మారక నాణెం, తపాలా బిళ్లలను ఆవిష్కరించాక మోదీ మాట్లాడారు. ‘‘భారత వారసత్వ సంగమాన్ని నేను ఈరోజు ఒకేసారి చూశా. ఉదయం అయోధ్యలో రామాయణకాలంనాటి నగరాన్ని దర్శించా. ఇప్పుడు శ్రీకృష్ణకాలంనాటి కురుక్షేత్రను సందర్శించా. 2019 నవంబర్ 9న పంజాబ్లో సరిహద్దుల్లోని డేరాబాబా నానక్ను దర్శించా. కోట్ల మంది రామభక్తుల ఆకాంక్షలను నెరవేరాలని వేడుకున్నా. అదేరోజు రామమందిరానికి అనుకూలగా సుప్రీంకోర్టులో చరిత్రాత్మక తీర్పు వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈరోజు సిక్కు సంగత్లో ఆశీస్సులుపొందే అవకాశం దక్కింది. అందరి సంక్షేమం కోరేవారికి తేగ్ బహదూర్ జీవితమే ఒక చక్కటి ఉదాహరణ. కష్టాలకు ఎదురొడ్డి నిలబడడమే అసలైన విద్య. అదే స్ఫూర్తితో మనం ఎన్ని సవాళ్లు ఎదురైనా దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్గా మార్చుదాం. ఈ క్రమంలో ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. భయపడుతూ బతకాల్సిన అవసరం లేదు. ఇదే సూత్రాన్ని భారత్ ఆచరిస్తోంది. స్నేహపూర్వకంగా ఉంటూనే సరిహద్దులను కాపాడుకోవడంఎలాగో ప్రపంచానికి భారత్ నేరి్పస్తోంది’’అని అన్నారు. -
అద్భుత ఘట్టం
అయోధ్య: ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముని ఆలయ నిర్మాణ క్రతువు సంపూర్ణమైనందుకు చిహ్నంగా గర్భగుడి ప్రధాన గోపుర శిఖరంపై ధర్మధ్వజ జెండాను ప్రతిష్టించారు. ఈ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రధాని మోదీ స్వయంగా పూర్తిచేశారు. 161 అడుగుల ఎత్తయిన ప్రధాన గోపురం మీద 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో లంబకోణ త్రిభుజాకృతిలో జెండాను ఎగరేశారు. తొలుత మోదీ శ్రీ రామజన్మభూమి ఆలయ కాంప్లెక్స్లో నూతనంగా నిర్మించిన సప్త మందిర్ ఆలయాన్ని దర్శించుకున్నారు. వశిష్ట, విశ్వామిత్ర, అగస్త్య, వాల్మికి ప్రతిమలతోపాటు అహల్య, నిషాద్రాజ్ గుహ, మాతా శబరిలను మోదీ దర్శించుకున్నారు. తర్వాత శేషావతార్ మందిర్ను దర్శించుకుని ప్రత్యేక పూజ చేశారు.ఆ తర్వాత గర్భాలయంలో బాలరాముడిని దర్శించుకున్నారు. తర్వాత ఆలయ పైభాగానికి చేరుకున్నారు. జెండా ఆరోహణకు ముందు కింద ఉన్న జెండాకు ప్రధాని మోదీ నమస్కరించి పుష్పాలను వెదజల్లారు. తర్వాత బటన్ను నొక్కడానికి బదులు ప్రత్యేకంగా తయారుచేసిన ముఖిలిత హస్తాల ఆకృతిలో ఉన్న ఒక మీటను సవ్యదిశలో తిప్పారు. మోదీతోపాటు రాష్ట్రయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఆర్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ సైతం మోదీతోపాటే మీటను తిప్పారు. దీంతో ధ్వజారోహణ పూర్తయింది. తాడు సాయంతో కాషాయరంగు జెండాను పైకి లాగి శిఖరాగ్రాన నిలిపారు.అత్యంత ఎత్తులో వీచే పెనుగాలులను సైతం తట్టుకుంటూ ఏమాత్రం చిరగకుండా ఉండేలా ప్యారాచూట్ నాణ్యత ఉండే వస్త్రంతో ఈ జెండాను తయారుచేశారు. కాషాయరంగు జెండాపై శ్రీరాముని వంశవృక్షాన్ని తెలిపే సూర్యభగవానుడి చిహ్నం, మధ్యలో ఓంకారం, పక్కన కోవిదార చెట్టు ప్రతిమలను బంగారు దారంతో చేతితో కుట్టారు. ఇందుకు మూడు వారాల సమయం పట్టింది. కోదండరాముడు సూర్యవంశానికి చెందిన రాజు. రుషి కశ్యపుడు మందార, పారిజాత వృక్షాలను అంటుకట్టి కోవిదార వృక్షాన్ని సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి.మొక్కలకు అంటుకట్టి కొత్త రకం మొక్కలను సృష్టించే శాస్త్రసాంకేతికత వేల సంవత్సరాల క్రితమే ఉందనేందుకు కోవిదార చెట్టే సజీవ సాక్ష్యమని పలువురు చెబుతున్నారు. లింఫ్ గ్రంథులు, థైరాయిడ్ సహా పలురకాల వ్యాధుల చికిత్సలో ఆయుర్వేదంలో ఇప్పటికీ కోవిదార చెట్టు బెరడు, ఆకులు, పువ్వులు, మొగ్గలు, వేర్లను ఉపయోగిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మొక్కను దేవకాంచనం అని కూడా పిలుస్తారు. నాలుగు రోజులుగా యజ్ఞం అభిజిత్ ముహూర్తం కలిసిరావడంతో అత్యంత శుభప్రదమైన దినంగా భావించి మంగళవారం ధ్వజారోహణకార్యక్రమం పూర్తిచేశారు. ఇప్పటికే గత మూడ్రోజులుగా ఆలయ ప్రాంగణంలో యజ్ఞం నిరాటంకంగా కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్, ఒడిశా, అస్సాం, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ల నుంచి వచ్చిన పండితులు ఈ యజ్ఞంచేశారు. భారత పురాణాల ప్రకారం వివాహపంచమికి సంబంధించిన అభిజిత్ ముహూర్తంలోని శ్రీరాముడు, సీతల వివాహం జరిగింది. అందుకే ఇదే రోజున ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. -
శతాబ్దాల నాటి గాయాలు మానాయి
అయోధ్య: ఐదు వందల సంవత్సరాల రామమందిర సాధనా సమరంలో భారతీయులకు తగిలిన గాయాలు నేడు ఆలయ నిర్మాణంతో మానిపోయాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మంగళవారం భవ్యరామ మందిర ప్రధాన శిఖరంపై ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించిన సందర్భంగా శ్రీరామ జన్మభూమి ఆలయ కాంప్లెక్స్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో వేలాది మంది భక్తులనుద్దేశిస్తూ ప్రధాని ప్రసంగించారు. జైశ్రీరాం నినాదంతో తన ప్రసంగాన్ని ఆరంభించారు ‘‘ నేడు భారత్సహా యావత్ ప్రపంచం రామస్మరణ చేస్తోంది. ఆలయ నిర్మాణం సంపూర్ణమవడంతో భారతీయుల శతాబ్దాల నాటి గాయాలు నేటితో మానిపోయాయి. భక్తుల వందల ఏళ్ల బాధాగ్ని చల్లారింది. ఇప్పుడు ప్రతి ఒక్క రామభక్తుడి మదిలో అనిర్వచనీయ ఆనందం ఉప్పొంగుతోంది.ధ్వజారోహణం నిజంగా అపూర్వం, అనిర్వచనీయ ఆధ్యాత్మిక ఘటన. కాషాయ జెండాలో సూర్యవంశ కీర్తి దాగిఉంది. కోవిద వృక్షం రామరాజ్య వైభవాన్ని చాటుతోంది. ఇది కేవలం మతసంబంధ జెండా కాదు. భారతీయ నాగరికతా జెండా. ఇది భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమ జెండా అసత్యాలపై సత్యం విజయం శాశ్వతమని సగర్వంగా అంతెత్తున నిలిచి చాటిచెప్పే జెండా ఇది. ఆలయ నిర్మాణానికి అవిశ్రాంత కృషిచేసి తమ వంతు సాయమందించిన ప్రతి ఒక్క రామభక్తునికి నా మనస్ఫూరక కృతజ్ఞతలు. ఆనాడు శ్రీరాముడు అయోధ్యను యువరాజుగా వదిలివెళ్లాడు. తిరిగొచ్చేటప్పుడు మర్యాద పురుషోత్తమునిగా ఎదిగి వచ్చాడు.వశిష్టుడు వంటి రుషుల జ్ఞానసంపద, గురువుల మార్గనిర్దేశనం, నిశదరాజు వంటి స్నేహితుల సాంగత్యం, శబరి అవ్యాజమైన భక్తి, హనుమంతుని అచంచల భక్తి ఇలా అందరూ ఆ దశరథ తనయుడిని సర్వగుణసంపన్నుడిగా తీర్చిదిద్దారు. భారత్ అభివృద్ధి చెందిన భారత్గా ఎదగాలంటే సమాజంలోనూ ఇలాంటి సమష్టి కృషి అవసరం. ప్రస్తుత తరాలకే కాదు భావితరాల అవసరాలు తీర్చేలా భారత్ పునర్నిర్మాణం జరగాలి. ఈరోజు గురించి మాత్రమే ఆలోచిస్తే భవిష్యత్ తరాలకు అన్యాయం చేసినట్లే. 2047నాటికి అభివృద్ధి చెందిన భారత్గా ఎదిగే క్రమంలో రాముడు సైతం మనకు అండగా నిలబడ్డాడని అనిపిస్తోంది. రాముడు కేవలం ఒక వ్యక్తి కాదు. క్రమశిక్షణ, దార్శనికత, విలువలు మూర్తీభవించిన శక్తి’’ అని మోదీ అన్నారు.మార్పు తరుణం ఆసన్నమైంది...‘‘ఆధునిక నాగరిక సమాజంలో భారత్ ఇకపై తనదైన గుర్తింపును సాధించాల్సిన తరుణం ఆసన్నమైంది. బానస మనస్తత్వాన్ని భారత్ వదిలించుకోవాలి. 190 ఏళ్ల క్రితం మనలో మెకాలే ఒక బానిస మనస్తత్వ విషబీజాలను విజయవంతంగా నాటి విస్తృతపరిచాడు. భారతీయ సమాజ విలువల్ని కూకటివేళ్లతో పెకలించే కుట్ర అది. మనం బ్రిటిషర్ల నుంచి స్వాతంత్య్రమైతే సాధించాంగానీ బానిసత్వపు ఆలోచనల నుంచి స్వాతంత్య్రం సాధించలేకపోయాం. ఇకనైనా వచ్చే పదేళ్లలోపు ఈ మానసిక బానిసత్వపు బంధనాలను తెంచుకుందాం.విదేశాల తరహాలో ప్రజాస్వామ్యం కోసం భారత్ పోరాడిందన్న వలసపాలకుల వాదనల్లో నిజం లేదు. ప్రజాస్వామ్యం అనేది వేల సంవత్సరాల క్రితమే భారతీయ డీఎన్ఏలో నిక్షిప్తమై ఉంది. తమిళనాడులోని 1,000 సంవత్సరాల క్రితంనాటి ఉత్తర మేరూర్ గ్రామ శాసనంలో ప్రజాస్వామ్య ప్రస్తావన ఉంది. వలసపాలకులు మన జాతీయ గుర్తులను సైతం ప్రభావితంచేశారు. పరాయి పాలనకు చరమగీతం పాడుతూ ఇటీవలే నేవీ చిహ్నాన్ని సైతం రీడిజైన్ చేశాం. ఇది డిజైన్ మార్పు మాత్రమేకాదు ఆలోచనా మార్పు’’ అని మోదీ అన్నారు.అభివృద్ధి ధర్మాన్ని ప్రబోధిస్తోంది...‘‘త్రేతాయుగంలోనే అయోధ్య మానవాళికి నైతిక విలువల్ని ప్రసాదించింది. ఇప్పుడు 21వ శతాబ్దంలో అంతర్జాతీయ విమానాశ్రయం, అధునాతన రైల్వేస్టేషన్, అనుసంధానతతో అదే అయోధ్య మనకు అభివృద్ధి ధర్మాన్ని ప్రబోధిస్తోంది. నేడు అయోధ్య ప్రాచీనత, ఆధునికతల కలబోతగా కొత్త కళను సంతరించుకుంది. భవిష్యత్తులోనూ పురాతన, నూతనత్వాల సంగమ స్థిలిగా భాసిల్లుతుంది. ఇక్కడి సరయూ జలాల్లో అమృతంతోపాటు అభివృద్ది కలిసి ప్రవహిస్తాయి. ప్రాణప్రతిష్ట పనులు ఆరంభమైన నాటి నుంచి ఇప్పటిదాకా అయోధ్యను 45 కోట్లమంది దేశ, విదేశీ భక్తులు సందర్శించారు. ఇది ఆర్థిక రూపాంతరీకరణకు నిదర్శనం’’ అని మోదీ అన్నారు.వాళ్ల ఆత్మలకు శాంతి: భాగవత్అయోధ్య రామాలయం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన వాళ్ల ఆత్మలు ఇప్పుడు శాంతిస్తాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. ‘‘అవిశ్రాంత పోరాటం, అలుపెరగని కృషి, లెక్కలేని త్యాగాలకు నేడు సార్థకత చేకూరింది. ఈ రోజు మనకెంతో ప్రత్యేకం. అశోక్ సింఘాల్, మహంత్ రామచంద్ర దాస్, దాల్మియా, వేలాది మంది రుషులు, లక్షలాది కుటుంబాలు, విద్యార్థులు, ఎంతో మంది భక్తుల త్యాగాలకు ఫలితం లభించింది. ఈ మధుర ఘట్టాన్ని చూడాలని పరితపించిన వాళ్ల కల నెరవేరింది. జెండాను మాత్రమే కాదు మరెన్నో ప్రాథమిక విలువలను మరింత ఎత్తులో నిలబెట్టాం. వ్యక్తులు, కుటుంబం మొదలు దేశం, ప్రపంచం దాకా ఈ విలువలే అందరికీ దిశానిర్దేశంచేస్తాయి. అందరి సంక్షేమాన్ని కాంక్షించడమే ధర్మం. కాషాయ రంగు ధర్మానికి గుర్తు. అందుకే ఇది ధర్మధ్వజం అయింది’’ అని అన్నారు.కొత్త అధ్యాయానికి ఆరంభం: యోగి‘‘ధర్మధ్వజారోహణతో ధర్మమనేది కాంతి ఇకపై నేల నలుచెరుగులా వ్యాపించనుంది. ఇది కొత్తఅధ్యాయానికి అంకురార్పణ’’ అని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి అన్నారు. -
మోదీ స్పీచ్ తో దద్దరిల్లిన అయోధ్య
-
ప్రపంచకప్ విజేతలకు ప్రధాని అభినందన
న్యూఢిల్లీ: తొలిసారి నిర్వహించిన అంధుల మహిళల టి20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత జట్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయం సమష్టితత్వం, అంకితభావానికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన అంధుల మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఆదివారం టీమిండియా 7 వికెట్ల తేడాతో నేపాల్పై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. ‘మొదటిసారి జరిగిన అంధుల మహిళల టి20 ప్రపంచకప్లో చాంపియన్గా నిలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టుకు అభినందనలు. ఓటమి ఎరగకుండా ట్రోఫీ నెగ్గడం మరింత గొప్పవిషయం. ఇది నిజంగా చారిత్రాత్మక విజయం. జట్టు సమష్టి కృషి, పట్టుదలకు ఇది నిదర్శనం. ప్రతీ క్రీడాకారిణీ ఒక చాంపియన్. ఈ ఘనత రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది’ అని ప్రధాని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సెమీస్లో ఆ్రస్టేలియాపై విజయం సాధించిన భారత్ అంతకుముందు లీగ్ దశలో శ్రీలంక, ఆ్రస్టేలియా, నేపాల్, అమెరికా, పాకిస్తాన్పై నెగ్గింది. అదే విధంగా.. మహిళల కబడ్డీ ప్రపంచకప్ టోర్నీలోనూ భారత ఆటగాళ్లు సత్తా చాటారు. ఫైనల్లో చైనీస్ తైపీని ఓడించి వరుసగా రెండోసారి చాంపియన్లుగా నిలిచారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ భారత మహిళా కబడ్డీ జట్టును కూడా అభినందించారు. -
PM Modi : అయోధ్య రామమందిరంలో ధ్వజారోహణ ఉత్సవం
-
500 ఏళ్ల సంకల్పం నెరవేరింది: ధ్వజారోహణలో ప్రధాని మోదీ
అయోధ్య: అయోధ్య రామాలయంపై కాషాయ వర్ణపు సూర్యవంశీ జెండాను ఎగురవేసిన ప్రధాని నరేంద్రమోదీ.. రామాలయం నిర్మాణం పూర్తయినట్లు ప్రకటించారు. ధ్వజారోహణం కార్యక్రమంతో 500 ఏళ్ల నాటి సంకల్పం నెరవేరిందన్నారు. భారతీయులు తమ వారసత్వ సంపదపై గర్వపడాలని, బానిసత్వ మనస్తత్వం నుండి బయటపడాలని అన్నారు. దేశం పురోగతి సాధించాలంటే రాబోయే పదేళ్లలో భారతదేశాన్ని ఈ మనస్తత్వం నుండి విముక్తి చేయడమే తమ లక్ష్యమన్నారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో గల నూతన రామాలయంలో ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. మంగళవారం ఉదయం 11:55 గంటలకు శుభ అభిజిత్ ముహూర్తం సందర్భంగా ప్రారంభమై, 10 నిమిషాల పాటు సాగింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంయుక్తంగా ఆలయ శిఖరంపై కాషాయ జెండాను ఎగురవేశారు. #WATCH | Ayodhya Dhwajarohan | Uttar Pradesh CM Yogi Adityanath presents miniature models of the Saffron Flag ceremonially hoisted on the 'shikhar' of Shri Ram Janmbhoomi Mandir and Ram Lalla idol at the temple, to PM Narendra Modi and RSS Sarsanghchalak Mohan Bhagwat. (Video:… pic.twitter.com/dYljcoBpts— ANI (@ANI) November 25, 2025ఈ చారిత్రాత్మక ఘట్టం వేద మంత్రాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య జరిగింది. దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకున్నారు. తరువాత ఆయన నగరంలో రోడ్షో నిర్వహిస్తూ, రామమందిరం వైపు తరలి వెళ్లారు. దారిలో ప్రజలు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. మార్గంమధ్యలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రిని స్వాగతించారు.ధ్వజారోహణ వేడుకల సందర్భంగా జరిగిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ‘ఈ రోజు అయోధ్యకు ఒక సాంస్కృతిక మేల్కొలుపు. ఒక చారిత్రాత్మక క్షణానికి సాక్ష్యం. ప్రపంచమంతా శ్రీరాముని భక్తిలో మునిగిపోయింది. శతాబ్దాల నాటి గాయాలు మానిపోతున్నందున ప్రతి రామభక్తుడి హృదయం ఆనందంతో నిండిపోయింది’ అని అన్నారు. ఆలయంలో తాను ఎగురవేసిన కాషాయ జెండా సంకల్పానికి ప్రతీక అని, ఇది మనల్ని మేల్కొల్పుతుంది. అంకితభావం వైపు నడిపిస్తుందని అన్నారు. పతాకం అనేది బ్రహ్మ స్వరూపాన్ని సూచిస్తుంది. ఇక్కడ సత్యం, ధర్మం స్థాపితమయ్యాయి. వీటి విజయాన్ని ఇది సూచిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. నేడు భారతదేశం అంతా రామమయం అయ్యింది. ప్రతి రామ భక్తుడి హృదయంలో అసాధారణ సంతృప్తి నిండింది. అపరిమితమైన కృతజ్ఞత వ్యక్తమవుతోంది. శతాబ్దాల సంకల్పం నేడు నెరవేరిందని ప్రధాని మోదీ అన్నారు. #WATCH | Ayodhya Dhwajarohan | PM Modi says, "... This Dharma Dhwaja is not just a flag. It is the flag of the rejuvenation of Indian civilisation. The Saffron colour, Suryavansh's signia, the 'Om' word, and the Kovidara tree impersonate Ram Rajya's glory. This flag is a… pic.twitter.com/sGgCPEJbLu— ANI (@ANI) November 25, 2025ఒక వ్యక్తి ఉన్నతునిగా.. విలువలు, సంస్కృతి ద్వారా ఎలా రూపుదిద్దుకుంటాడో రాముడు ప్రపంచానికి చూపించిన నగరం అయోధ్య అని ప్రధాని మోదీ అన్నారు. రాముడు అయోధ్య నుండి వనవాసానికి వెళ్ళినప్పుడు, అతను ఒక యువరాజు, కానీ అతను తిరిగి వచ్చినప్పుడు, ధర్మానికి ప్రతిరూపంగా, మర్యాద పురుషోత్తమ రామునిగా తిరిగి వచ్చాడు అని అన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ ‘ఈ రోజు అందరి ఆశలు నెరవేరిన దినం. రామజన్మభూమి లక్ష్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారి ఆత్మలు ఈ రోజు సంతృప్తి చెందుతాయి’ అని అన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ‘ఈ పవిత్ర దినం.. రామజన్మభూమి ఉద్యమంలో ప్రాణాలను త్యాగం చేసిన యోధులకు అంకితం అని అన్నారుకాగా రామమందిరంపై 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు గల కాషాయ జెండాను ఒక బటన్ నొక్కడం ద్వారా ప్రధాని మోదీ ఎగురవేశారు. జెండాపై రాముని పరాక్రమాన్ని సూచించే ప్రకాశవంతమైన సూర్యుని చిత్రం, ‘ఓం’, 'శిఖరం మొదలైనవి ఉన్నాయి. #WATCH | Ayodhya Dhwajarohan | Devotees rejoice as the saffron flag rises atop Shri Ram Janmabhoomi Temple Shikhar, constructed in the traditional North Indian Nagara architectural style. The right-angled triangular flag, measuring ten feet in height and twenty feet in length,… pic.twitter.com/585WR9gtAw— ANI (@ANI) November 25, 2025#WATCH | Ayodhya Dhwajarohan | Prime Minister Narendra Modi offers prayers at the Sheshavtar Mandir ahead of the historic flag hoisting at Shri Ram Janmabhoomi Temple(Source: DD) pic.twitter.com/o2hcuBMF7g— ANI (@ANI) November 25, 2025రామ జన్మభూమిలో ధ్వజారోహణకు ముందు ప్రధాని నర్రేంద మోదీ వేద మంత్ర మంత్రోచ్ఛారణల నడుమ బాలక్ రామ్ను దర్శనం చేసుకున్నారు. ఈ సమయంలో ఆయన వెంట ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్నారు. అలాగే వీరిరువురూ శేషావతార మందిర్లో ప్రార్థనలు చేశారు. మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, మహర్షి వాల్మీకి, దేవి అహల్య, నిషాదరాజ్ గుహ, మాతా శబరిలను దర్శించారు. सप्तपुरियों में श्रेष्ठ श्री अयोध्या धाम में प्रभु श्री राम जन्मभूमि मंदिर के शिखर पर आज आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के कर-कमलों से भव्य भगवा ध्वज का आरोहण होने जा रहा है।सनातन संस्कृति के पुनर्जागरण का यह दिव्य संदेश पूरे भारतवर्ष में अदम्य आध्यात्मिक आत्मिक… pic.twitter.com/pYVxzOdAug— Yogi Adityanath (@myogiadityanath) November 25, 2025 -
అయోధ్య: ప్రాణప్రతిష్ఠ నుంచి నేటి ధ్వజారోహణ వరకూ..
అయోధ్య: కోట్లాది రామ భక్తుల కల నేటి(మంగళవారం)తో సంపూర్ణమయ్యింది. భారత నాగరికత, ధర్మానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య రామాలయ నిర్మాణం చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఈ చారిత్రక ప్రయాణంలోని కీలక ఘట్టాలు, వాటి వివరాలు ఇలా..రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠాపన తేదీ: జనవరి 22, 2024, సోమవారంరామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠాపన ఘట్టం కోసం జనవరి 16, 2024 నుండే పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. బాలాజీ తాంబట్ నేతృత్వంలోని వేద పండితులు ఏడు రోజుల పాటు జరిపిన అధివాస క్రతువులు (తీర్థ పూజ, జలయాత్ర, ధాన్యాధివాసం, ఘృతాధివాసం) తర్వాత ప్రధాన ఘట్టం ప్రారంభమైంది.ప్రధాని మోదీ దీక్ష ప్రాణ ప్రతిష్ఠాపనకు ముందు, ప్రధాని మోదీ 11 రోజుల పాటు కఠినమైన అనుష్ఠానం (నియమ నిష్ఠలు, ఉపవాసం) పాటించారు.ముహూర్తం అత్యంత శుభప్రదమైన అభిజిత్ ముహూర్తంలో (మధ్యాహ్నం 12:15 నుండి 12:45 వరకు), ప్రధాని మోదీ కర్తగా గర్భగుడిలో ఐదేళ్ల బాల రాముడి (రామ్లల్లా) విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అరుణ్ యోగిరాజ్ చెక్కిన ఈ 51 అంగుళాల శ్యామల వర్ణ విగ్రహంపై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దశావతారాలు కూడా ఉన్నాయి.దేశమంతా పండుగఅయోధ్యలో జరిగిన బాలరాముని ప్రాణప్రతిష్ఠాపనను దేశమంతా ఒక పండుగలా జరుపుకుంది. యావత్ ప్రపంచం ఈ ఘట్టాన్ని వీక్షించింది. హిందూ ధర్మంలో కొత్త శకం ప్రారంభమయ్యిందని పండితులు అభివర్ణించారు.రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠాపన (రాజా రాముడి ప్రతిష్ఠ)తేదీ: జూన్ 5, 2025, గురువారంరామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం నాటికి ఆలయ సముదాయంలోని మొదటి అంతస్తు నిర్మాణం పూర్తయింది. గర్భగుడిలో బాల రాముని దర్శనం తర్వాత, భక్తులకు శ్రీరామ దర్బార్ దర్శనం లభించింది.ప్రతిష్ఠాపన ఈ దర్బార్లో రాముడిని యువరాజు రూపంలో కొలువుదీర్చారు. భార్య సీతా దేవి, తమ్ముడు లక్ష్మణుడు, పరమ భక్తుడు హనుమంతుని విగ్రహాలను కూడా ప్రతిష్టించారు. ఈ సమయానికే ఆలయ నిర్మాణానికి సంబంధించిన పలు నిర్మాణాలు పూర్తిచేసుకుని భక్తులకు అందుబాటులోకి వచ్చాయి.ధ్వజారోహణం (ధర్మ ధ్వజం ప్రతిష్ఠ)తేదీ: నవంబర్ 25, 2025, మంగళవారంధ్వజారోహణం అనేది ఆలయ నిర్మాణం, ధార్మిక సంస్థాపనలో చివరి, అత్యంత ముఖ్యమైన వేడుక. ఈ రోజున ఆలయ శిఖరంపై ధర్మ ధ్వజాన్ని (కాషాయ జెండాను) ఎగురవేస్తారు. ధ్వజారోహణం అనేది ఆలయ ధార్మిక శక్తిని, ధర్మ సంస్థాపన విజయాన్ని సూచిస్తుంది. ఇది దేవాలయ నిర్మాణం పూర్తయిందని తెలియజేస్తుంది. నేడు జరిగే ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ , ట్రస్ట్ సభ్యులు తదితరులు హాజరు కానున్నారు.ఇది కూడా చదవండి: నేడు అయోధ్యలో మహా ఘట్టం -
ధ్వజారోహణం..దివ్య కాంతులతో వెలిగిపోతున్న అయోధ్య (ఫొటోలు)
-
నేడు అయోధ్యలో మహా ఘట్టం
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని పవిత్ర క్షేత్రం అయోధ్యలో మరో మహా ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అయోధ్యను సందర్శించనున్నారు. భవ్య రామమందిర నిర్మాణం పరిపూర్తికి గుర్తుగా ఆలయ శిఖరంపై కాషాయం పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. లంబకోణ త్రిభుజ ఆకారంలో ఉండే ఈ జెండా ఎత్తు 10 అడుగులు, వెడల్పు 20 అడుగులు. జెండాపై శ్రీరాముడి శౌర్యం, తేజస్సును సూచించేలా సూర్యుడి గుర్తు, ఓం అనే మంత్రం, దేవకాంచన వృక్షం బొమ్మ ఉంటాయి. ఈ పవిత్ర పతాకం రామరాజ్య ఆదర్శాలను ప్రతిబింబించేలా గౌరవం, ఐక్యత, సాంస్కృతిక వికాస సందేశాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. అయోధ్యలోని సప్తమందిరాన్ని సైతం మోదీ దర్శించుకుంటారు. శేషావతార ఆలయం, మాత అన్నపూర్ణ అలయాల్లోనూ ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. రామలల్లా గర్భాలయంలో మూలమూర్తిని దర్శించుకుంటారు. అయోధ్యలో ధ్వజారోహణం సందర్భంగా నిర్వహించే సభలో ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. -
జీ20 సరికొత్త మార్గం
దేశాల మధ్య సహకారం పెంపొందించటం ద్వారా అంతర్జాతీయ ఆర్థిక సుస్థిరత సాధించాలన్న సంకల్పంతో పదిహేడేళ్ల క్రితం ఏర్పడిన జీ20 తొలిసారి అమెరికాను ధిక్కరించింది. దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్బర్గ్లో వరసగా రెండు రోజులు కొనసాగి ఆదివారం ముగిసిన సంస్థ శిఖరాగ్ర సదస్సుకు అమెరికా ముఖం చాటేయగా, దాన్ని బతిమాలటా నికీ, నచ్చజెప్పి ఒప్పించటానికీ ఒక్కరంటే ఒక్కరు ప్రయత్నించిన దాఖలా లేదు. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక తన విపరీత పోకడలతో ఇంటా బయటా వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు.శ్వేతజాతి అమెరికన్లకు ఏదో ఒరగబెడుతున్నట్టు కనబడటం కోసం ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటున్నారు. పర్యావరణ క్షీణత పెద్ద బోగస్ అని వాదించటమేగాక, బొగ్గు, ఇతర శిలాజ ఇంధనాలను వినియోగించే పరిశ్రమలకు రాయితీలిస్తున్నారు. వేరే దేశాలు కూడా తన బాటలోనే నడవాలంటూ ప్రోత్సహి స్తున్నారు. మానవ కార్యకలాపాల పర్యవసానంగా భూగోళం వేడెక్కుతున్నదని, ఇది ధరిత్రి మనుగడకే పెను ముప్పని శాస్త్రవేత్తలంతా ముక్తకంఠంతో చెబుతున్నా మొండిగా వ్యవహరిస్తున్నారు.అంతర్జాతీయంగానూ అదే బాణీ అందుకున్నారు. జొహాన్నెస్బర్గ్ సదస్సు ప్రధాన ధ్యేయమే వాతావరణ మార్పులపై చర్చించి తగు చర్యల కోసం ప్రపంచ దేశాలకు పిలుపునివ్వటం గనుక ట్రంప్ గుర్రుగా ఉన్నారు. సదస్సు ఎజెండాను మార్చమంటూ గత కొన్ని వారాలుగా ఒత్తిడి తెచ్చారు. అది సాధ్యపడక పోవడంతో శ్వేత జాతి మైనారిటీల పట్ల దక్షిణాఫ్రికా ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తున్నదని, అందుకు నిరసనగానే సదస్సుకు గైర్హాజరు కాదల్చుకున్నట్టు ప్రచారం లంకించు కున్నారు. ట్రంప్కు వంతపాడే అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలీ కూడా సదస్సుకు రాలేదు.కావడానికి జీ20 సంపన్న రాజ్యాల సంస్థే అయినా దక్షిణాఫ్రికా వంటి వెనకబడిన దేశంలో సదస్సు జరిగింది. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలపై ఉమ్మడి అవగాహ నకు రావాలన్న ధ్యేయంతో ఈ సంస్థ ఏర్పాటైంది. ఇందులో వర్ధమాన దేశాలకు సైతం భాగస్వామ్యం కల్పించారు. ప్రపంచంలో మూడింట రెండొంతుల జనాభా గల దేశా లకూ, ప్రపంచ స్థూల ఉత్పత్తిలో దాదాపు 85 శాతం వాటా ఉన్న ఆర్థిక వ్యవస్థలకూ ఇది ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ సదస్సు నుంచి దూరం జరిగితే ప్రపంచంలో ఏకాకిగా మిగులుతామన్న స్పృహ ట్రంప్కు లేకపోయింది.‘నేను లేకుండా శిఖరాగ్ర సదస్సు డిక్లరేషన్ను విడుదల చేయొద్దని ట్రంప్ తీవ్రంగా ఒత్తిడి తెచ్చినా సదస్సు బేఖాతరు చేసింది. అంతేగాక సంప్రదాయానికి భిన్నంగా తొలి రోజునే డిక్లరేషన్ను ఆమోదించింది. తన గైర్హాజర్ అయోమయాన్ని సృష్టించి, డిక్లరేషన్ ఆమోదానికి అధినేతలు తటపటా యిస్తారని ట్రంప్ అనుకున్నారు. కానీ ‘అయ్య వచ్చేదాకా అమావాస్య ఆగద’ని జీ20 తేల్చిచెప్పింది. వాస్తవానికి సంస్థ అధ్యక్ష పదవి అమెరికాకు రావాలి. కానీ సదస్సుకుట్రంప్ గైర్హాజరు కావటం, కనీసం ఉన్నతాధికారులనైనా పంపక, జూనియర్ అధికారితో సరిపుచ్చటానికి నిరసనగా అధ్యక్ష పదవి బదిలీకి దక్షిణాఫ్రికా నిరాకరించింది.అది ఎప్పుడుంటుందో, అసలు జీ20లో అమెరికా కొనసాగుతుందో లేదో చెప్పలేని స్థితి ఏర్పడింది. అమెరికాలోని మియామిలో వచ్చే ఏడాది జరగాల్సిన తదుపరి సదస్సుపైనా అనిశ్చితి అలుముకుంది. భారత, చైనా, రష్యాలేకాక అమెరికా శిబిరంలో ఉండాల్సిన జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, కెనడాలు సైతం ఈ సదస్సులో పాల్గొని వాతావరణ సమస్యలపైనా, ప్రపంచ అసమానతలపైనా దృష్టిపెట్టిన డిక్లరేషన్ను ముక్తకంఠంతో ఆమోదించాయి.పునరుత్పాదక ఇంధన వనరులపై, నిరుపేద దేశాల రుణవిమోచనపై కూడా అవగాహన కుదిరింది. భారత్ సూచించిన విధంగా ఉగ్రవాదంపైనా, మాదకద్రవ్యాలపైనా సమష్టిగా తలపడటానికి ఆమోదం తెలిపాయి. వాతావరణ సమస్యలపై శిఖరాగ్ర సదస్సు అంగీ కారానికి రావటం ట్రంప్ జీర్ణించుకోలేనిది. సదస్సు ఆమోదించిన అంశాల్లో మెజా రిటీ పేద దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించినవే. తనది ఇక గత వైభవమేనని, ఇటువంటి సదస్సులకు దూరంగా ఉంటే అంతిమంగా తన ప్రతిష్ఠ మరింత మసకబారుతుందని అమెరికా గ్రహించాలి. -
మీరు మాకు చెప్పాల్సింది: ప్రధాని మోదీతో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు
జోహెన్నెస్బర్గ్: జీ 20 సదస్సు దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్ వేదికగా జరిగింది. నవంబర్ 22, 23 తేదీల్లో ఈ సదస్సు నిర్వహించారు. ఐకమత్యం, సమానత్వం, సుస్థిరత తదితర అంశాల థీమ్ ఆధారంగా ఈ సదస్సును నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఆఫ్రికా ఖండంలో జరిగిన జీ 20 సదస్సు ఇదే మొదటిది. దీని గురించి ఆఫ్రికా ఖండంలోని నేతలకు పెద్దగా అనుభవం లేదు. ఇదే విషయాన్ని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకొచ్చారు. జీ 20 సదస్సును నిర్వహించడం అనేది తమకు అసలు అనుభవం లేదన్నారు. ఇది అత్యంత కష్టంతో కూడుకున్నదిగా నిర్వహించాక తెలిసిందన్నారు. ‘ జీ 20 సదస్సు నిర్వహణ కష్టమని మాకు చెప్పాల్సింది. మీరు చెప్పి ఉంటే దానికి దూరంగా ఉండేవాళ్లం.’ అని నవ్వుతూ అన్నారు రామఫోసా. ఇక జీ 20 సదస్సు కోసం భారత్ ఇచ్చిన సహకారం మరువలేనిదని ప్రధాని మోదీతో మాటామంతీ సందర్భంగా సిరిల్ రామఫోసా పేర్కొన్నారు. జోహన్నెస్బర్గ్లో ఆదివారం జీ20 దేశాల అధినేతల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. పలు అంశాలపై జరిగిన చర్చా కార్యక్రమాల్లో మోదీ మాట్లాడుతూ.. ‘ టెక్నాలజీ అప్లికేషన్లు ఏ ఒక్క దేశానికో ఉపయోగపడేలా కాకుండా ప్రపంచమంతా వినియోగించుకొనేలా రూపొందించాలి. సామాన్య ప్రజల జీవితాలను మార్చే టెక్నాలజీని ప్రోత్సహించాలి. ఇండియాలో ‘అందరికోసం సాంకేతికత’అనే విధానం అమలు చేస్తున్నాం. స్పేస్ అప్లికేషన్లు, ఏఐ, డిజిటల్ చెల్లింపుల్లో తమ దేశం ముందంజలో ఉంది.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇండియాలో ఏఐ ఇంపాక్ట్ సదస్సు నిర్వహించబోతున్నామం. జీ20 దేశాలను ఆహ్వానిస్తున్నాం’ అని స్పష్టం చేశారు. -
ఏఐ దుర్వినియోగాన్ని అడ్డుకోవాల్సిందే
జోహన్నెస్బర్గ్: ఆధునిక యుగంలో అవసరాల సృష్టించుకున్న కృత్రిమ మేధ(ఏఐ) దుర్వినియోగమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ప్రపంచదేశాలన్నీ కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏదైనా సరే మానవ కేంద్రీకృతగా ఉండాలి తప్ప ఆర్థిక కేంద్రీకృతంగా ఉండరాదని చెప్పారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో ఆదివారం జీ20 దేశాల అధినేతల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వేర్వేరు అంశాలపై జరిగిన చర్చా కార్యక్రమాల్లో మాట్లాడారు. టెక్నాలజీ అప్లికేషన్లు ఏ ఒక్క దేశానికో ఉపయోగపడేలా కాకుండా ప్రపంచమంతా వినియోగించుకొనేలా రూపొందించాలని సూచించారు. సామాన్య ప్రజల జీవితాలను మార్చే టెక్నాలజీని ప్రోత్సహించాలని తెలిపారు. ఇండియాలో ‘అందరికోసం సాంకేతికత’అనే విధానం అమలు చేస్తున్నామని వివరించారు. స్పేస్ అప్లికేషన్లు, ఏఐ, డిజిటల్ చెల్లింపుల్లో తమ దేశం ముందంజలో ఉందన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇండియాలో ఐఏ ఇంపాక్ట్ సదస్సు నిర్వహించబోతున్నామని ప్రకటించారు. జీ20 దేశాలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఏఐ వాడకంలో జవాబుదారీతనం కృత్రిమ మేధ అనేది ప్రపంచ అభివృద్ధి, మానవాళి బాగుకోసం ఉపయోగపడాలని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. దుర్వినియోగం చేస్తే భారీ నష్టం జరుగుతుందన్నారు. దీన్ని అడ్డుకోవడానికి కఠినమైన నిబంధనలు తీసుకురావాలని చెప్పారు. డీప్ఫేక్, నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాల్లో ఏఐని విచ్చలవిడిగా వాడుకోవడానికి వీల్లేకుండా పారదర్శకత కోసం పటిష్టమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని అన్నారు. ఏఐ డిజైన్లోని భద్రతాపరమైన ప్రమాణాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. ఏఐ వ్యవస్థలు మానవ జీవితాన్ని, భద్రతను, ప్రజా విశ్వాసాన్ని ప్రభావితం చేస్తుంటాయని గుర్తుచేశారు. అందుకే బాధ్యతాయుతమైన ఏఐ వాడకానికి పెద్దపీట వేయాలన్నారు. ఇందులో జవాబుదారీతనం ఉండాలన్నారు. కృత్రిమ మేధ మానవ శక్తి సామర్థ్యాలను పెంచే మాట వాస్తవమే అయినప్పటికీ అంతిమ నిర్ణయం తీసుకొనే బాధ్యత మనుషులపైనే ఉండాలని తేలి్చచెప్పారు. ఓపెన్ శాటిలైట్ డేటా భాగస్వామ్యం ప్రపంచ దేశాలు శిలాజ ఇంధనాల వాడకం నుంచి క్లీన్ ఎనర్జీ దిశగా ప్రయాణం ఆరంభించాలని, శిలాజేతర ఇంధనాల వినియోగం పెరగాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. క్లీన్ ఎనర్జీ కోసం రీసైక్లింగ్ను మరింత వేగవంతం చేయాలని, సప్లై చైన్పై ఒత్తిడి తగ్గించాలని, అరుదైన ఖనిజాల గుర్తింపు, వెలికితీత, శుదీ్ధకరణ, వినియోగం విషయంలో ఉమ్మడిగా పరిశోధనలు చేయాలని చెప్పారు. క్లీన్ ఎనర్జీ సహా కీలక రంగాల్లో సహకారం కోసం జీ20 దేశాల శాటిలైట్ డేటాను అందరూ సులువుగా ఉపయోగించుకొనేలా భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఇందుకోసం ‘జీ20 ఓపెన్ శాటిలైట్ డేటా భాగస్వామ్యాన్ని’మోదీ ప్రతిపాదించారు. వ్యవసాయం, మత్స్య సంపద, విపత్తుల నిర్వహణకు జీ20 దేశాలు తమ ఉపగ్రహ సమాచారాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవాలని కోరారు. ఆధుని కాలంలో ప్రకృతి విపత్తులు మానవాళికి పెనుముప్పుగా పరిణమిస్తున్నాయని గుర్తుచేశారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులు విరుచుకుపడ్డాయని, కోట్లాది మంది ప్రభావితమయ్యారని తెలిపారు. అందుకే విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి ప్రపంచదేశాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని తేలిచెప్పారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడం ఏ ఒక్కరి వల్లనో అయ్యే పని కాదని, అందుకోసం ఉమ్మడి కృషి అవసరమని ఉద్ఘాటించారు. విపత్తుల సన్నద్ధత, సుస్థిర వ్యవసాయం, ప్రజారోగ్యం, పౌష్టికాహారం వంటి అంశాలను అనుసంధానించాలని, దీనిపై సమగ్ర వ్యూహాలు రూపొందించాలని జీ20 దేశాలకు నరేంద్రమోదీ సూచించారు. ఇండియాలో డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే రీసైక్లింగ్, అర్బన్ మైనింగ్, సెకండ్–లైఫ్ బ్యాటరీస్తోపాటు సంబంధిత రంగాల్లో నూతన ఆవిష్కరణల కోసం ‘జీ20 క్రిటికల్ మినరల్స్ సర్క్యులేటరీ కార్యక్రమం’ప్రారంభించాలని ప్రతిపాదించారు. ప్రమాదంలో ఆహార భద్రత ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు వ్యవసాయ రంగంపై పెను ప్రభావం చూపుతున్నాయని, ఫలితంగా ఆహార భద్రత ప్రమాదంలో పడుతోందని, ప్రజలకు పోషకాహారం అందడం లేదని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే వాతావరణ మార్పుల నియంత్రణపై తక్షణమే దృష్టి పెట్టాలని ప్రపంచ దేశాలను కోరారు. వాతావరణ మార్పులు విసురుతున్న సవాళ్లను అధిగమించడానికి ఇండియాలో అతిపెద్ద ఆహార భద్రత, పోషకాహార కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా, పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చామని వివరించారు. ప్రజలకు పౌష్టికాహారం అందించడానికి తృణ ధాన్యాల సాగు, విక్రయాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. -
భద్రతా మండలిలో సంస్కరణలు అత్యవసరం
జోహన్నెస్బర్గ్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టడం ఇకపై ఎంతమా త్రం ఐచ్ఛికం కాదని.. అత్యవసరమని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. అంతర్జాతీయ సంస్థల్లో మార్పులు తీసుకురావాల్సిందేనని అన్నారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో ఆదివారం ఇండియా–బ్రెజిల్–దక్షిణాఫ్రికా అధినేతల సదస్సులో ఆయన మాట్లాడారు. నేడు ప్రపంచ దేశాల మధ్య విభజనలు, అడ్డుగోడలు కనిపిస్తున్న తరుణంలో తమ కూటమి ఐక్యత, సహకారం, మానవతా సందేశాన్ని ఇస్తోందని తెలిపారు. మూడు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఐబీఎస్ఏ జాతీయ భద్రతా సలహాదారుల సదస్సు నిర్వహించాలని మోదీ ప్రతిపాదించారు. ఉగ్రవా దంపై పోరాటంలో సహకారం పెంచుకోవాలని కోరారు. ఉగ్రవాదం వంటి కీలకమైన అంశాలపై ద్వంద్వ ప్రమాణాలకు తావులేదని తేల్చిచెప్పారు. ఐబీఎస్ఏ సదస్సులో మోదీతోపాటు దక్షిణాఫ్రికా అధినేత సిరిల్ రమఫోసా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా పాల్గొన్నా రు. మానవ కేంద్రిత అభివృద్ధిలో టెక్నాలజీ పాత్ర అత్యంత కీలకమని మోదీ ఉద్ఘాటించారు. యూపీఐ, కోవిన్ లాంటి ఆరోగ్య వేదికలు, సైబర్ సెక్యూరిటీ నిబంధనలు, మహిళల సారథ్యంలోని టెక్నాలజీ కార్యక్రమాలను పంచుకోవడానికి ‘ఐబీఎస్ఏ డిజిటల్ ఇన్నోవేషన్ అలయెన్స్’ ఏర్పాటు చేసుకుందామని మోదీ ప్రతిపాదించారు. 40 దేశాల్లో విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, సోలార్ విద్యుత్ వంటి కార్యక్రమాల కోసం ఐబీఎస్ఏ నిధులు అందజేస్తున్నందుకు ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. వాతావరణ మార్పులను తట్టుకొని పంటల దిగుబడి సాధించే విధానాల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసుకుందామని చెప్పారు. తృణధా న్యాలు, ప్రకృతి వ్యవసాయం, విపత్తుల నిర్వహణ, గ్రీన్ ఎనర్జీ, సంప్రదాయ ఔషధాలు, ఆరోగ్య భద్రత వంటి విషయాల్లో మూడు దేశాల మధ్య పరస్పర సహకారానికి మరిన్ని అవకాశాలు ఉన్నాయని ప్రధానమంత్రి స్పష్టంచేశారు.వివిధ దేశాల అధినేతలతో సమావేశం ప్రధాని మోదీ ఆదివారం జోహన్నెస్బర్గ్లో బిజిబిజీగా గడిపారు. వరుసగా సమావేశాల్లో పాల్గొన్నారు. కెనడా ప్రధాని కార్నీ, జపాన్ ప్రధాని తకాయిచీ, ఇటలీ జార్జియో మెలోనీ, జమైకా ప్రధాని హోల్నెస్, నెదర్లాండ్స్ ప్రధాని డిక్ స్కూఫ్తో మోదీ సమావేశమయ్యారు. వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, కీలక రంగాల్లో పరస్పర సహకారంపై వారితో చర్చించారు. ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలీనా జార్జివాతోనూ మోదీ భేటీ అయ్యారు. మోదీ ఆదివారం దక్షిణాఫ్రికా పర్యటన పూర్తిచేసుకొని స్వదేశానికి బయలుదేరారు. రమఫోసాతో మోదీ భేటీ జీ20 సదస్సు సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వ్యాపారం, వాణిజ్యం, మైనింగ్, అరుదైన ఖనిజాలు, కృత్రిమ మేధ, ఆహార భద్రత వంటి రంగాల్లో పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు. భారత్–దక్షిణాఫ్రికా సంబంధాల్లో పురోగతిని సమీక్షించారు. జీ20 కూటమికి విజయవంతంగా సారథ్యం వహిస్తున్నందుకు రమఫొసాకు మోదీ అభినందనలు తెలియజేశారు. మరోవైపు ఇండియా–దక్షిణాఫ్రికా మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. జీ20 సదస్సు నిర్వహించడానికి మద్దతు ఇచ్చినందుకు మోదీకి రమఫోసా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తమకు కష్టమైన పని అప్పగించారని చెప్పారు. ఈ పని చేయలేక బహుశా పారిపోయి ఉండేవాళ్లం కావొచ్చు అని రమఫోసా వ్యాఖ్యానించడంతో సమావేశంలో నవ్వులు విరిశాయి. జీ20 సదస్సుకు ఎలా ఆతిథ్యం ఇవ్వాలో భారత్ను చూసి నేర్చుకున్నామని ఆయన చెప్పారు. ఆరు దేశాల అతిథులు వీరే.. 1. భూటాన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లియోన్పో నార్బు త్షెరింగ్, ఆయన భార్య ల్హాదెన్ లోటే.2. కెన్యా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మార్తా కూమ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుసాన్ నజోకి ఎన్డుంగు.3. మలేషియా ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ టాన్ శ్రీ దాతుక్ నళిని పద్మనాథన్, ఆయన భార్య పసుపతి శివప్రకాశం.4. మారిషస్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీబీ రెహనా ముంగ్లి, ఆయన కుమార్తె రిబెక్కా హన్నా బీబీ గుల్బుల్. 5. నేపాల్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ మాన్ సింగ్ రౌత్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సప్నాప్రధాన్ మల్లా, ఆయన భార్య అశోక్ బహదూర్ మల్లా. నేపాల్ న్యాయ శాఖ మంత్రి అనిల్ కుమార్ సిన్హా. భార్య ఉర్సిలా సిన్హా. 6. శ్రీలంక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.పద్మన్ సురసేన, భార్య సెపాలికా సురసేన. న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎస్. తురైరాజా, భార్య శశికళ తురైరాజా. మరో న్యాయమూర్తి జస్టిస్ ఏహెచ్ ఎండీ నవాజ్ దంపతులు. -
చండీగఢ్పై సవరణ బిల్లు.. కేంద్రానికి సీఎం హెచ్చరిక
చండీగఢ్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంజాబ్ రాజధాని చండీగఢ్ను లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంచలన ఆరోపణలు చేశారు. పంజాబ్, హర్యానా ఉమ్మడి రాజధాని చండీగఢ్ (Chandigarh)లో చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతి పరిధిలోకి తీసుకొచ్చేలా రాజ్యాంగ అధికరణం 131 సవరణ బిల్లును కేంద్రం తేవడం చర్చకు దారి తీసింది. ఇక, ఈ బిల్లును పంజాబ్లోని అన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పంజాబ్, హర్యానా ఉమ్మడి రాజధాని చండీగఢ్పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించే ఆదేశాలు, చట్టాలను నేరుగా చేసే అధికారాలను రాష్ట్రపతికి కల్పించిన రాజ్యాంగ అధికరణం 240 పరిధిలోకి చండీగఢ్ను కూడా తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదించింది. ఇందుకు గానూ రాజ్యాంగంలోని అధికరణం 131ను సవరిస్తూ బిల్లు తీసుకురానుంది. త్వరలో ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లు పార్లమెంటు ముందుకు రానుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే చండీగఢ్ ఆర్టికల్ 240 పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయంపై పంజాబ్లోని పార్టీలు మండిపడుతున్నాయి. ఈ బిల్లును ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), కాంగ్రెస్ (Congress), అకాలీదళ్ (Akali Dal) తీవ్రంగా వ్యతిరేకించాయి.భగవంత్ మాన్ ఆగ్రహం.. ఈ బిల్లుపై తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ..‘చండీగఢ్తో పంజాబ్కు విడదీయరాని బంధం ఉంది. పంజాబ్కు దానిపై హక్కు కూడా ఉంది. చండీగఢ్ నగరాన్ని నిర్మించేందుకు పంజాబ్లోని పలు గ్రామాలను నాశనం చేశారు. అభివృద్ధి కోసం ఎంతో చేశారు. చండీగఢ్ నగరాన్ని ఏ మాత్రం వదులుకునే ప్రసక్తే లేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంజాబ్ రాజధానిని లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకొంటాం’ అని హెచ్చరించారు.240 పరిధిలోనే మిగతా ప్రాంతాలు.. మరోవైపు.. ఆప్ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ కూడా పంజాబ్ గుర్తింపుపై కేంద్రం దాడి చేస్తోందని అభివర్ణించారు. నియంతృత్వం ఎదుట పంజాబ్ ఏనాడు తలవంచలేదని చరిత్ర చెబుతోందని పేర్కొన్నారు. మరోవైపు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా స్పందిస్తూ.. చండీగఢ్ పంజాబ్కు చెందినదేనని.. దానిని లాక్కోవడానికి చేసే ప్రయత్నాలకు తీవ్ర ప్రతికూల పరిణామాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇక, చట్టసభల్లేని కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్-నికోబార్ దీవులు, దాద్రా-నగర్ హవేలీ, లక్షద్వీప్, డామున్-డయ్యూ ప్రస్తుతం అధికరణం 240 పరిధిలోనే ఉన్నాయి. -
జీ20 సౌభాగ్యానికి నాలుగు సూత్రాలు
జోహన్నెస్బర్గ్: ప్రపంచ అభివృద్ధి ప్రాధాన్యతలపై పునరాలోచన చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రాధాన్యతల్లో మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. సమగ్ర, సుస్థిరాభివృద్ధి నమూనాలను ఆచరించాలని పేర్కొన్నారు. నాగరికత అందించిన విజ్ఞానం నుంచి అభివృద్ధి నమూనాను స్వీకరించాలని అన్నారు. జీ20 సభ్యదేశాల సౌభాగ్యమే లక్ష్యంగా నాలుగు కీలక సూత్రాలను ప్రతిపాదించారు. ప్రపంచ సంప్రదాయ విజ్ఞానాన్ని ఒకచోట భద్రపర్చి, భవిష్యత్ తరాలకు అందించేలా చర్యలు చేపట్టాలని స్పష్టంచేశారు. ఆఫ్రికా యువతలో నైపుణ్యాలు పెంచాలన్నారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో సహకరించుకోవడానికి సభ్యదేశాలన్నీ కలిసి ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. అలాగే మాదక ద్రవ్యాలు– ఉగ్రవాదుల భాగస్వామ్యాన్ని అంతం చేయడానికి సభ్యదేశాలు కలిసికట్టుగా పనిచేయాలని ఉద్ఘాటించారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో శనివారం జీ20 దేశాల అధినేతల సదస్సు ప్రారంభౌత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రధానంగా నాలుగు అంశాలను ప్రస్తావించారు. ప్రపంచ అభివృద్ధి విధానాలపై పునరాలోచన చేయాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. సరైన వనరులు, పర్యావరణ సమతుల్యత లేని ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకంజలోనే ఉండిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితిలో తప్పనిసరిగా మార్పు రావాలన్నారు. భారతీయ నాగరికత విలువల్లో అంతర్భాగమైన ‘సమీకృత మానవతావాదం’ ప్రపంచమంతటా అభివృద్ధి, పర్యావరణానికి మధ్య సమతూకం సాధించడానికి దోహదపడుతుందని వివరించారు. భవిష్యత్ తరాలకు సంప్రదాయ విజ్ఞానం ‘‘కాల పరీక్షకు నిలిచిన సుస్థిర జీవన విధానాలను పరిరక్షించుకోవాలి. ఇందుకోసం జీ20 ఆధ్వర్యంలో ప్రపంచ సంప్రదాయ విజ్ఞానాన్ని భద్రపర్చుకోవాలి. ఆరోగ్యం, పర్యావరణం, సామాజిక సంబంధాలు వంటి అంశాలపై ప్రాచీన విజ్ఞానాన్ని రికార్డు చేసి, భవిష్యత్ తరాలకు అందించాలి. వాతావరణంపై ప్రతికూల ప్రభావాలు పెరగడంతోపాటు ప్రజల జీవన విధానాలు అనూహ్యంగా మారిపోతున్న నేటి తరుణంలో ఇది చాలా అవసరం. సర్టిఫైడ్ ట్రైనర్లను తయారు చేద్దాం ప్రపంచ ప్రగతికి ఆఫ్రికా ప్రగతి అత్యంత కీలకం. ఆఫ్రికా యువత అభివృద్ధి, సాధికారత కోసం వారికి నైపుణ్యాలు నేరి్పంచాలి. ఇందులో భాగంగా జీ20 నేతృత్వంలో ఆఫ్రికా స్కిల్స్ మల్టిప్లయర్ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. దీనికి జీ20 దేశాలన్నీ సహకరించాలి. తొలుత శిక్షకులకు శిక్షణ ఇవ్వాలి. వచ్చే పదేళ్లలో కనీసం 10 లక్షల మంది సర్టిఫైడ్ ట్రైనర్లను తయారు చేద్దాం. ఈ ట్రైనర్లు ఆఫ్రికా యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తారు. తద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సంక్షోభ సమయాల్లో సహకారానికి.. ఆరోగ్య సేవల కోసం జీ20 గ్లోబల్ హెల్త్కేర్ రెస్పాన్స్ టీమ్ను ఏర్పాటు చేద్దాం. జీ20 సభ్యదేశాల నుంచి సుశిక్షితులైన వైద్య నిపుణులు ఈ బృందంలో చేరాలి. సభ్యదేశాల్లో ఎక్కడైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు, ప్రకృతి విపత్తులు విరుచుకుపడినప్పుడు ఈ నిపుణులు తక్షణమే రంగంలోకి సేవలందిస్తారు. మాదక ద్రవ్యాలతో పెనుముప్పు ఫెంటానిల్ వంటి సింథటిక్ డ్రగ్స్ మానవాళికి పెనుముప్పుగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యాన్ని, సామాజిక స్థిరత్వాన్ని, భద్రతను దెబ్బతీస్తున్నాయి. ఉగ్రవాద ముఠాలు డ్రగ్స్ వ్యాపారంలోనూ ఆరితేరిపోతున్నాయి. డ్రగ్స్–టెర్రర్ బంధాన్ని దీటుగా ఎదుర్కోవాల్సిందే. మాదక ద్రవ్యాల వ్వవస్థలను నాశనం చేయాలి. అక్రమ నగదు ప్రవాహాన్ని అడ్డుకోవాలి. ఉగ్రవాదులకు నిధులందించే వనరులను బలహీనపర్చాలి. ఇవన్నీ జరగాలంటే ప్రపంచదేశాల ఐక్య కార్యాచరణ కావాలి. మాదక ద్రవ్యాలు–ఉగ్రవాదుల బంధాన్ని కూకటివేళ్లతో పెకిలించడానికి ‘డెడికేటెడ్ జీ20 కార్యక్రమం’ ప్రారంభిద్దాం’’ అని మోదీ అన్నారు. అరుదైన మూలకాలపై దృష్టిపెడదాం ‘అరుదైన మూలకాలు, సహజ భూఅయస్కాంత పదార్థాలపై దృష్టిపెట్టాలి. కొత్త బ్యాటరీలపైనే ఆధారపడకుండా రీసైక్లింగ్, పట్టణప్రాంతాల్లో వాడేసిన డిజిటల్ వస్తువులు, ఉపకరణాల నుంచి అరుదైన మూలకాల సేకరణతో అర్బన్ మైనింగ్ చేద్దాం. వాడేసిన బ్యాటరీలను గ్రిడ్ స్టెబిలైజర్, బ్యాకప్ పవర్ వంటి రంగాల్లో సది్వనియోగం చేయడంతోపాటు సంబంధిత రంగానికి అనువైన ఆవిష్కరణలపై దృష్టిసారిద్దాం’ అని మోదీ అన్నారు.భారత్, ఆ్రస్టేలియా, కెనడా త్రైపాక్షిక భాగస్వామ్యం సాంకేతిక పరిజ్ఞానంతోపాటు నూతన ఆవిష్కరణల విషయంలో పరస్పరం సహకరించుకోవడానికి భారత్, ఆ్రస్టేలియా, కెనడా జట్టుకట్టబోతున్నాయి. ఈ త్రైపాక్షిక భాగస్వామ్యాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. ఆయన శనివారం జోహన్నెస్బర్గ్లో ఆ్రస్టేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్, కెనడా ప్రధాని కారీ్నతో సమావేశమయ్యారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్లో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామన్నారు. -
ఇదే సరైన సమయం: జీ20 సమ్మిట్లో ప్రధాని మోదీ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో జరిగిన G20 సమ్మిట్ మొదటి సెషన్లో ప్రసంగించారు. ప్రారంభ సమావేశంలో ప్రసంగించిన మోదీ పర్యావరణ సమతుల్యత, సాంస్కృతికంగా, సామాజికంగా సమ్మిళిత జీవన విధానాలను పరిరక్షించడానికి G20 కింద గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపోజిటరీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సర్వతోముఖ వృద్ధి అనే కలను సాకారం చేసుకోవడానికి కొన్ని కార్యాచరణలను ప్రతిపాదించారు. ప్రపంచ అభివృద్ధి పారామితులను లోతుగా పునరాలోచించాలని పిలుపునిచ్చారు అలాగే మాదక ద్రవ్య-ఉగ్రవాద సంబంధాన్ని ఎదుర్కోవడానికి G20 ఇనీషియేటివ్ను, ప్రపంచ ఆరోగ్య సంరక్షణ ప్రతిస్పందన బృందాన్ని ఏర్పాటు చేయాలని మోదీ ప్రతిపాదించారు.Spoke at the first session of the G20 Summit in Johannesburg, South Africa, which focussed on inclusive and sustainable growth. With Africa hosting the G20 Summit for the first time, NOW is the right moment for us to revisit our development parameters and focus on growth that is… pic.twitter.com/AxHki7WegR— Narendra Modi (@narendramodi) November 22, 2025దేశ అతిపెద్ద ఆర్థిక కేంద్రం జోహన్నెస్బర్గ్లో మూడు రోజుల పాటు జరిగే 20వ జీ20 నాయకుల శిఖరాగ్ర సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. తొలిరోజున సమ్మిళిత, స్థిరమైన వృద్ధిపై దృష్టి సారించింది. ఆఫ్రికా మొదటిసారిగా G20 సమ్మిట్ను నిర్వహిస్తున్నందున, మన అభివృద్ధి పారామితులను పునఃసమీక్షించడానికి, సమ్మిళిత స్థిరమైన వృద్ధిపై దృష్టి పెట్టడానికి ఇదే సరైన సమయమని మోదీ పేర్కొన్నారు. భారతదేశ నాగరికత విలువలు, ముఖ్యంగా సమగ్ర మానవతావాదం సూత్రం ముందుకు సాగడానికి ఒక మార్గాన్ని అందిస్తుందని తెలిపారు. చదవండి: 17 ఏళ్ల తరువాత ఇండియాకు ఎన్ఆర్ఐ జంట, వీడియో వైరల్ప్రధాని మోదీ ప్రతిపాదించిన వాటిల్లో మొదటిది G20 గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపోజిటరీని సృష్టించడం. ఈ విషయంలో భారతదేశానికి గొప్ప చరిత్ర ఉందనీ, ఇది మంచి ఆరోగ్యం, శ్రేయస్సును మరింతగా పెంచడానికి మన సమిష్టి జ్ఞానాన్ని అందించడానికి దోహదపడుతుందని మోదీ చెప్పారు. ఇందుకోసం G20 గ్లోబల్ హెల్త్కేర్ రెస్పాన్స్ టీమ్ను ఏర్పాటు చేయాలని భారత్ ప్రతిపాదిస్తోందన్నారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితులు మరియు ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో కలిసి పనిచేస్తే బలంగా ఉంటుందని, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వేగంగా మోహరించడానికి సిద్ధంగా ఉన్న తోటి G20 దేశాల నుండి శిక్షణ పొందిన వైద్య నిపుణుల బృందాలను తయారు చేసుకోవడం కీలకమన్నారు.భారతదేశం మాదకద్రవ్య-ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా సవాళ్లను అధిగమించడానికి, ముఖ్యంగా ఫెంటానిల్ వంటి అత్యంత ప్రమాదకరమైన పదార్థాల వ్యాప్తిని అధిగమించడానికి గాను G20 ఇనీషియేటివ్ను ప్రతిపాదించారు. మాదకద్రవ్య-ఉగ్రవాద ఆర్థిక వ్యవస్థను బలహీనపరుద్దామని మోదీ పిలుపునిచ్చారు. భారతదేశం ఎల్లప్పుడూ ఆఫ్రికాతో సంఘీభావంగా నిలిచిందనీ, ఆఫ్రికన్ యూనియన్ శాశ్వత G20 సభ్యునిగా మారడం తమకు గర్వకారణమన్నారు. రాబోయే దశాబ్దంలో ఆఫ్రికాలో పది లక్షల సర్టిఫైడ్ శిక్షకులను సృష్టించడం తమ సమిష్టి లక్ష్యం అని మోదీ పేర్కొన్నారు. చదవండి: దాదాపు రెండు దశాబ్దాల జ్ఞాపకం : అసలా విమానం ఉన్నట్టే తెలియదు! -
దక్షిణాఫ్రికా చేరుకున్న మోదీ
జోహన్నెస్బర్గ్: ప్రపంచ దేశాల అధినేతలతో ఫలవంతమైన చర్చల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన కీలక అంశాలపై వారితో చర్చించబోతున్నానని తెలిపారు. జీ20 దేశాల అధినేతల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శుక్రవారం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. దక్షిణాఫ్రికా వైమానిక దళం మోదీకి రెడ్కార్పెట్ స్వాగతం పలికింది. ఎయిర్పోర్టులో సంప్రదాయ నృత్యాలు చేసిన కళాకారులకు మోదీ అభివాదం చేశారు. జీ20 సదస్సు కోసం జోహన్నెస్బర్గ్కు చేరుకున్నట్లు ప్రధానమంత్రి ‘ఎక్స్’లో పోస్టుచేశారు. దక్షిణాఫ్రికా ప్రభుత్వం జీ20 సదస్సుకు ఆతిథ్యం ఇస్తుండడం ఇదే మొదటిసారి. 2023లో జీ20కి భారత్ సారథ్యం వహించిన సమయంలోనే దక్షిణాఫ్రికా ఈ కూటమిలో భాగస్వామిగా చేరింది. కూటమిలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడం, అభివృద్ధి ప్రాధాన్యతలను మరింత ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని మోదీ ఉద్ఘాటించారు. అందరికీ ఉజ్వలమైన భవిష్యత్తులను అందించాలన్నదే ఆశయమని పేర్కొన్నారు. నగరంలోని ఓ హోటల్లో బస చేసేందుకు వచ్చిన మోదీకి ప్రవాస భారతీయ చిన్నారులు స్వాగతం పలికారు. గణపతి ప్రార్థన, శాంతి మంత్రంతోపాటు వేద మంత్రాలు పఠించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, తమిళనాడు, కేరళ, బెంగాల్, రాజస్తాన్, గుజరాత్ తదితర రాష్ట్రాల సంప్రదాయ నృత్యాలను, కళారూపాలను ప్రదర్శించారు. సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పారు. చిన్నారులను మోదీ అభినందించారు. భారత్–దక్షిణాఫ్రికా మధ్య సంబంధాలకు ప్రవాస భారతీయులే వారధులు అని ప్రశంసించారు. ఆయన ఈనెల 23వ తేదీ దాకా దక్షిణాఫ్రికాలో పర్యటించబోతున్నారు. జీ20 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. వివిధ దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ఇండియా–బ్రెజిల్–దక్షిణాఫ్రికా(ఐబీఎస్ఏ) ఆరో సదస్సుకు సైతం హాజరవుతారు. దక్షిణాఫ్రికాలోని ప్రవాస భారతీయులతోనూ భేటీ అవుతారు. అయితే, ఈసారి 20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత షీ జిన్పింగ్ హాజరు కావడం లేదు. -
కొత్తగా నాలుగు లేబర్ కోడ్లు: తక్షణమే అమల్లోకి
భారతదేశంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కార్మిక చట్టాలకు కేంద్రం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. 29 కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా నాలుగు లేబర్ కోడ్లు.. తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు కార్మిక శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ అధికారికంగా పేర్కొన్నారు.కొత్త చట్టాలువేతనాల కోడ్ (2019)పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020)సామాజిక భద్రత కోడ్ (2020)వృత్తి భద్రత, ఆరోగ్యం & పని పరిస్థితుల కోడ్ (OSHWC) (2020)కనీస వేతనానికి గ్యారెంటీ, గ్రాట్యూటీ, సామాజిక భద్రతకు పెద్దపీట వేయడంలో భాగంగానే ఈ కొత్త చట్టాలను తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు ఇప్పటికే ఉన్న 29 కేంద్ర కార్మిక చట్టాల స్థానంలో ఉంటాయి.వేతనాల కోడ్ (2019): కనీస వేతనాలను నోటిఫైడ్ 'షెడ్యూల్డ్ ఉద్యోగాల'కు అనుసంధానించే మునుపటి వ్యవస్థను భర్తీ చేస్తూ, అన్ని రంగాలలో కనీస వేతనాలు & సకాలంలో వేతనాల చెల్లింపు హక్కును ఈ కోడ్ వివరిస్తుంది.పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020): ట్రేడ్ యూనియన్లపై నియమాలు, వివాద పరిష్కారం, తొలగింపులు/మూసివేతలకు సంబంధించిన షరతులను ఒకే చట్టంగా చేయడం, కొన్ని ప్రక్రియల ద్వారా పారిశ్రామిక సమ్మతిని క్రమబద్ధీకరించడం ఈ కోడ్ లక్ష్యం.సామాజిక భద్రత కోడ్ (2020): సామాజిక భద్రత, పీఎఫ్, ఈఎస్ఐసీ, ఇతర సంక్షేమ చర్యలకు చట్టపరమైన నిర్మాణాన్ని విస్తరిస్తుంది. అంతే కాకుండా మొదటిసారిగా గిగ్ & ప్లాట్ఫామ్ కార్మికులను సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి తీసుకురావడానికి స్పష్టమైన ఎనేబుల్ ఫ్రేమ్వర్క్ను సృష్టిస్తుంది.OSHWC కోడ్ (2020): ఈ కోడ్ కార్యాలయ భద్రత & పని పరిస్థితులపై బహుళ చట్టాలను ఒకే ప్రమాణాల సమితిలో విలీనం చేస్తుంది.ప్రయోజనాలుకొత్త కార్మిక కోడ్ల ద్వారా కార్మికులకు అనేక ప్రయోజనాలు లభించనున్నాయి. ఇందులో 40 ఏళ్లు పైబడిన కార్మికులకు ఉచిత వార్షిక ఆరోగ్య తనిఖీలు, కార్మికులందరికీ కనీస వేతనం గ్యారెంటీ, అపాయింట్మెంటు లెటర్ గ్యారెంటీ, సమాన పనికి సమాన వేతనం, మహిళల ఆమోదం, భద్రత చర్యలకు లోబడి రాత్రి వేళలో స్త్రీలు పని చేయడానికి అనుమతి, 40 కోట్ల మంది కార్మికులకు సోషల్ సెక్యూరిటీ, ఏడాది తర్వాత ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిస్కు గ్రాట్యూటీ, ఓవర్ టైంకు రెట్టింపు వేతనం, ప్రమాదకర రంగాల్లో పనిచేసే వారికి 100% ఆరోగ్య రక్షణ, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కార్మికులకు సామాజిక న్యాయం వంటివి ఉన్నాయి.నరేంద్ర మోదీ ట్వీట్''శ్రమేవ్ జయతే! నేడు, మన ప్రభుత్వం నాలుగు కార్మిక కోడ్లను అమలులోకి తెచ్చింది. ఇది స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అత్యంత సమగ్రమైన, ప్రగతిశీల కార్మిక ఆధారిత సంస్కరణలలో ఒకటి'' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ .. తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.Shramev Jayate!Today, our Government has given effect to the Four Labour Codes. It is one of the most comprehensive and progressive labour-oriented reforms since Independence. It greatly empowers our workers. It also significantly simplifies compliance and promotes ‘Ease of…— Narendra Modi (@narendramodi) November 21, 2025 -
యుద్ధం ఆపేస్తానన్నారు!
వాషింగ్టన్: పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. కానీ, ఈసారి ఒక కొత్త విషయం చెప్పారు. దాడులు ప్రతిదాడులు వెంటనే నిలిపివేయకపోతే ఏకంగా 350 శాతం సుంకాలు విధిస్తానని బెదిరించడంతో ఆ రెండు దేశాలు మరో గత్యంతరం లేక దారికొచ్చాయని అన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనతో వ్యక్తిగతంగా ఫోన్లో మాట్లాడారని, పాకిస్తాన్పై యుద్ధం చేయబోమని చెప్పారని స్పష్టంచేశారు. అణ్వస్త్ర దేశాలైన భారత్–పాక్ మధ్య భీకర యుద్ధాన్ని తానే చొరవ తీసుకొని ఆపేశానంటూ ట్రంప్ నోటివెంట వచ్చిన ప్రకటనల సంఖ్య 60 దాటడం గమనార్హం. రెండు దేశాల నడుమ ఘర్షణ ఆగడం వెనుక మూడో వ్యక్తి ప్రమేయం, పాకిస్తాన్ ప్రాధేయపడడం వల్లనే కాల్పుల విరమణకు అంగీకరించామని భారత్ పదేపదే చెబుతున్నా ట్రంప్ తన వైఖరి మార్చుకోవడం లేదు. ఆయన తాజాగా యూఎస్–సౌదీ అరేబియా పెట్టుబడుల సదస్సులో ప్రసంగించారు. ‘‘భారత్–పాక్ మధ్య దాడులు ఆరంభం కాగానే ఆ రెండు దేశాల అధినేతలతో మాట్లాడా. దాడులు తక్షణమే ఆపాలని, లేకపోతే 350 శాతం సుంకాలు భరించడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించా. అంత పని చేయొద్దని భారత్, పాక్ వేడుకున్నాయి. అణ్వాయుధాలతో పరస్పరం యుద్ధం సాగిస్తే లక్షలాది మంది మరణిస్తారని చెప్పా. లాస్ ఏంజెలెస్ సిటీపై అణుధూళి పేరుకుపోతుందని వెల్లడించా. 350 శాతం సుంకాలు అనగానే రెండు దేశాలు బెదిరిపోయి నా మాట విన్నాయి. ఒక్క మాటతో అంతా సెట్ అయిపోయింది. మొదట నాకు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నుంచి ఫోన్ వచ్చింది. యుద్ధాన్ని నిలిపివేసి లక్షలాది మంది ప్రాణాలు కాపాడినందుకు ఆయన నాకు కృతజ్ఞతలు తెలియజేశారు. తర్వాత నరేంద్ర మోదీ ఫోన్చేసి మాట్లాడారు. మేము చేయాల్సింది చేశాం మీరేం చేస్తారో చెప్పాలని ప్రశ్నించా. పాక్పై యుద్ధం చేయబోమని మోదీ బదులిచ్చారు. దాంతో మోదీకి కృతజ్ఞతలు తెలియజేశా’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సదస్సులో సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ పాల్గొన్నారు. పదేపదే అదే మాట 350 శాతం టారిఫ్లు విధిస్తానని భారత్, పాక్లను హెచ్చరించానంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వాస్తవానికి ఆయన గతంలో మాట్లాడుతూ 200 శాతం టారిఫ్లు విధిస్తానని బెదిరించానని చెప్పారు. ఆ సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు అది 350 శాతానికి చేరింది. ఇంకా ఎంత పెరుగుతుందో తెలియదు. ఇదిలా ఉండగా, గురువారం వైట్హౌస్ ఓవల్ ఆఫీసులో డొనాల్డ్ ట్రంప్, సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఈ భేటీలోనూ ట్రంప్ తన నోటికి పనిచెప్పారు. భారత్–పాక్ యుద్ధానికి తానే ఫుల్స్టాప్ పెట్టేశానని పునరుద్ఘాటించారు. -
పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు (ఫొటోలు)
-
మనమంతా సాయి మార్గంలో నడుద్దాం... శ్రీసత్యసాయి శత జయంత్యుత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
-
సేంద్రియ వ్యవసాయంలో గ్లోబల్ హబ్గా భారత్
సాక్షి, చెన్నై/కోయంబత్తూరు: సేంద్రియ వ్యవసాయ రంగంలో మన దేశం గ్లోబల్ హబ్గా మారడం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. సేంద్రియ సాగు మన సంప్రదాయమేనని గుర్తుచేశారు. ప్రకృతి హిత సేద్యానికి భారత్ పుట్టినిట్లు అని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రపంచానికి కేంద్రంగా మారే దిశగా వేగంగా దూసుకెళ్తోందని వెల్లడించారు. నేటి యువత వ్యవసాయ రంగంపై మక్కువ చూపుతున్నారని, ఆధునిక, లాభదాయక ఉపాధి అవకాశంగా భావిస్తున్నారని తెలిపారు. వ్యవసాయంలోకి యువత ఎక్కువగా ప్రవేశిస్తే గ్రామీణ ఆర్థిక రంగానికి ఎంతగానో మేలు జరుగుతుందని ఉద్ఘాటించారు. బుధవారం తమిళనాడులోని కోయంబత్తూరులో ‘దక్షిణభారత సహజ సాగు సదస్సు–2025’ను, ప్రదర్శనను ప్రధాని మోదీ ప్రారంభించారు. సేంద్రియ వ్యవసాయ రంగంలో ఉత్తమ సేవలను అందిస్తున్న వారికి అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి 21వ విడత సొమ్మును ప్రధానమంత్రి విడుదల చేశారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 9 కోట్ల మందికిపైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.18 వేల కోట్లకుపైగా నిధులు జమ చేశారు. పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇప్పటిదాకా రూ.4 లక్షల కోట్లకుపైగా సొమ్మును రైతులకు అందజేసినట్లు వెల్లడించారు. భూమాతను కాపాడుకుందాం.. గత 11 ఏళ్లలో మన సాగు రంగం ఎన్నో మార్పులకు లోనైందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. మన దేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు రెండు రెట్లు పెరిగాయని చెప్పారు. వ్యవసాయ ఆధునీకరణకు ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతాంగానికి అన్ని విధాలుగా సహకరిస్తోందని అన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ) పథకం ద్వారా ఈ ఏడాది రైతులకు రూ.10 లక్షల కోట్ల సాయం అందినట్లు పేర్కొన్నారు. జీవ ఎరువులపై జీఎస్టీ తగ్గింపుతో అన్నదాతలకు లబ్ధి చేకూరుతోందని హర్షం వ్యక్తంచేశారు. సేంద్రీయ సాగు దిశగా రైతులను మళ్లించడానికి ఏడాది క్రితం ‘నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫామింగ్’ను ప్రారంభించామని గుర్తుచేశారు. లక్షలాది మంది రైతులు దీనితో అనుసంధానమయ్యారని చెప్పారు. దక్షిణ భారతదేశ రైతులు పంచగవ్య, జీవామృతం, బీజామృతంతో పంటలు సాగు చేస్తున్నారని ప్రశంసించారు. భూమాతను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు.ఒక ఉద్యమంగా మారాలి ప్రకృతి వ్యవసాయం తన హృదయానికి దగ్గరైందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దంలో ఈ తరహా సేద్యాన్ని భారీగా విస్తరింపజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆహారానికి డిమాండ్ పెరుగుతుండడంతో పంటల సాగులో రసాయనాల వాడకం మితి మీరుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల భూసారం దెబ్బతింటోందని, పంటల సాగు వ్యయం కూడా విపరీతంగా పెరుగుతోందని పేర్కొన్నారు. అందుకే పంటల వైవిధ్యం, ప్రకృతి వ్యవసాయంపై రైతన్నలు దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రకృతి వ్యవసాయం మనకు కొత్తేమీ కాదని, ఇది మన సంప్రదాయాల మూలాల్లోనే ఉందని వివరించారు. మన దేశ వాతావరణానికి ఇది చక్కగా సరిపోతుందన్నారు. ప్రకృతి సేద్యం ఒక ఉద్యమంగా మారాలని ఆకాంక్షించారు. -
దక్షిణాఫ్రికా పర్యటనకు ప్రధాని మోదీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాలో పర్యటించనన్నారు. ఈ నెల 22, 23(శని, ఆది) తేదీల్లో దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న జీ20 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నట్లు విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. జోహాన్స్బర్గ్లో జరగనున్న జీ20 లీడర్స్ సమ్మిట్లోనూ పాల్గొంటారని పేర్కొంది. ఈ సదస్సులోని మూడు సెషన్లలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ సమావేశంలో గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి సహకారం, వాతావరణ మార్పు, ఆహారం, ఇంధన భద్రత వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. భారత్ తాజాగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, గ్లోబల్ సౌత్ దేశాల సమస్యలతో పాటు అంతర్జాతీయ సహకార బలోపేతంపై ప్రధానిగా మోదీ అభిప్రాయాలను ప్రపంచ నేతలకు వివరించనున్నారు. అలాగే, జీ20 సభ్య దేశాలతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా జరగనున్నాయని విదేశాంగ శాఖ తెలిపింది. -
మీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఎప్పుడూ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేద్సార్!
మీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఎప్పుడూ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేద్సార్! -
రూపాయి నాణెంతో కూడిన ప్రధాని మోదీ వాచ్..! ధర ఎంత ఉంటుందంటే..
ప్రధాని నరేంద్ర మోదీని శక్తిమంతమైన నాయకుడిగా అభివర్ణించొచ్చు. ఆయన ఎలాంటి కార్యక్రమాల్లోనైనా భారతీయత ఉట్టిపడే ఫ్యాషన్ శైలిలో కనిపిస్తుంటారు. అందుకు నిదర్శనం ప్రతీ ఏడాది స్వాతంత్ర్య వేడుకల్లో కనిపించే మోదీ లుక్. ఆయన మన భారతీయ సంప్రదాయ ఫ్యాషన్కు చిహ్నమైన తలపాగ, టైలర్డ్ జాకెట్తో ఐకానిక్ హాఫ్ స్లీవ్ కుర్తాలలో దర్శనమిస్తుంటారు. ప్రతిష్టాత్మకంగా లేదా సాధారణంగా జరిగే వేడుకలకైనా అందుకు అనుగుణమైన స్లైల్ స్టేట్మెంట్తో కనపించడం ఆయన ప్రత్యేకత. ముఖ్యంగా ఆయన ఫ్యాషన్ శైలి భారతీయ సారాంశాన్ని ప్రదర్శిస్తుంది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. తాజాగా ఆయన చేతికి ధరించే వాచ్ అందర్నీ ఆశ్చర్యచకితులను చేసింది. ఆఖరికి దీని విషయంలో కూడా మెదీ తన భారతీయతను వదులుకోలేదంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. మరి ఆ వాచ్ స్పెషాలిటీ, దాని ధర తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.అరుదైన రూపాయి నాణెం..ఈ వాచ్లో 1947 నాటి అరుదైన రూపాయి నాణేన్ని స్పష్టంగా చూడొచ్చు. జైపూర్కి చెందిన వాచ్కంపెనీ తయారు చేసిన ఈ 43ఎంఎం స్టెయిన్లెస్ స్టీల్ వాచ్ని 'రోమన్బాగ్' అనిపిలుస్తారు. ఇది జపనీస్ మియోటా ఉద్యమం ఆధారితమట. ఇందులో నడిచే పులి ఇమేజ్ భారత్ స్వాతంత్ర్య ప్రయాణాన్ని, మేక్ ఇన్ ఇండియా చొరవను సూచిస్తుంది. ఇక ఈ రూపాయి నాణెంల బ్రిటిష్ పాలనలో ముద్రించిన చివరి నాణెం కావడంతో ఈ వాచ్ మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది 1946-47లలో ముంద్రించిన నాణెం అని వాచ్ని చూడగానే క్లియర్గా తెలుస్తుందట. ఇది నాలుగు వేరియంట్లలో లభిస్తుందట. ఇందులో బంగారం లేదా వెండి రంగులతో రోమన్, దేవనాగరి లిపి సంఖ్యలు ఉంటాయట. లోపల నుంచి యాంటీ-రిఫ్లెక్టివ్ పూత ఉండి, సీ-త్రూ బ్యాక్ నీలమణి క్రిస్టల్ను ఉంటుంది. ఈ వాచ్కి వాటర్ ప్రూవ్ ఫిచర్ కూడా ఉంది. మోదీ ఈ వాచ్ని ఈ ఏడాది సెప్టెంబర్, నవంబర్ మధ్య పలు కార్యక్రమాల్లో ధరించి కనిపించారు. దీని ధర దగ్గర దగ్గర రూ. రూ. 55 వేలు నుంచి రూ. 60 వేలు వరకు పలుకుతుందట.అందువల్లే హాట్టాపిక్గా..జైపూర్ వాచ్ కంపెనీ వ్యవస్థాపకుడు గౌరవ్ మెహతా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఈ స్వదేశీ టైమ్పీస్ను ధరించడంతో ఈ ప్రొడక్ట్కి నెట్టింట అమితంగా క్రేజ్ ఏర్పడిందన్నారు. నిజానికి సాదాసీదాగా చూస్తే ఈ భారతీయ లగ్జరీ ..ఇవాళ ఆసక్తికరమైన ఆంశంగా మారిపోయిందన్నారు. గతంలో అమితాబ్ బచ్చన్, ఎడ్ షీరాన్, రఫ్తార్ వంటి వారు కూడా జైపూర్కు చెందిన మెహతా కంపెనీ తయారు చేసిన టైమ్పీస్లను ధరించి కనిపించేవారు.(చదవండి: పెళ్లి చేసుకోండి, 20 ఏళ్లలోపు పిల్లలను కనండి.. ఉపాసనకు స్ట్రాంగ్ కౌంటర్) -
బాబా బోధనలు ఎంతో మందిని ప్రభావితం చేశాయి
-
పుట్టపర్తిలో PM నరేంద్ర మోదీ
-
పుట్టపర్తి ఆధ్యాత్మిక భూమి: ప్రధాని మోదీ
సాక్షి, శ్రీసత్యసాయి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో జరిగే సత్యసాయి శతాబ్ది ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ క్రమంలో మోదీ.. సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం, నివాళి అర్పించారు. అంతకుముందు.. ఎయిర్పోర్ట్లో ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్, లోకేష్ స్వాగతం పలికారు. రోడ్డు మార్గం ద్వారా మోదీ ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు.బాబా జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన రూ.100 నాణెం, నాలుగు తపాలా బిళ్లను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అనంతర ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నా. బాబా బోధనలు దేశమంతా ప్రభావం చూపాయి. బాబా జీవితం.. వసుధైక కుటుంబం అన్న భావనతో సాగింది. సత్యసాయి బాబా ఎంతో మందికి సేవ చేశారు. పుట్టపర్తి ఆధ్యాత్మిక భూమి. బాబా బోధనలు చాలా మంది జీవితాలను మార్చేశాయి. సత్యసాయి భౌతికంగా మనతో లేకున్నా.. ఆయన ప్రేమ మనతోనే ఉంది. ఎన్నో కోట్ల మందికి బాబా మార్గదర్శనం చేశారు.భక్తి, జ్ఞానం, కర్మ అనేవి సేవతోనే ముడిపడి ఉంటాయి. కోట్లాది మంది బాబా భక్తులు మానవ సేవ చేస్తున్నారు. సత్యసాయి భక్తులను ఎంతో ప్రేమతో చూసుకునేవారు. గతంలో రాయలసీమలో తాగునీటి కష్టాలు ఉండేవి. సత్యసాయి ట్రస్ట్ ద్వారా పేదలకు సురక్షిత నీరు అందించారు. ప్రేమ, సేవకు సత్యసాయి ప్రతిరూపంగా నిలిచారు. సేవే మరమావధిగా బాబా భావించారు. మానవసేవే.. మాధవసేవ అని బాబా భావించారు అని చెప్పుకొచ్చారు. ఇక, కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడుకు వెళ్లనున్నారు. కోయంబత్తూరులో మధ్యాహ్నం 1.30 గంటలకు దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయంపై ఏర్పాటు చేసిన సదస్సును ప్రారంభిస్తారు. #WATCH | Prime Minister Narendra Modi offers prayers at the holy shrine and Mahasamadhi of Sri Sathya Sai Baba in Puttaparthi, Andhra Pradesh(Video source: DD News) pic.twitter.com/g6x3F1CFhN— ANI (@ANI) November 19, 2025 -
ఇవాళ ఏపీలో ప్రధాని మోదీ పర్యటన
-
నేడు పుట్టపర్తికి ప్రధాని మోదీ రాక
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో జరిగే సత్యసాయి శతాబ్ది ఉత్సవాలకు హాజరుకానున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉదయం 10 గంటలకు ప్రధాని.. పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి బాబా మహా సమాధిని సందర్శించి.. నివాళి అర్పిస్తారు. 10.30 గంటలకు సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా సత్యసాయి జీవనం, ప్రబోధాలు, చిరకాల వారసత్వానికి గుర్తింపుగా స్టాంపు, నాణేన్ని విడుదల చేస్తారు. అనంతరం సత్యసాయి భక్తులు, అభిమానులనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం తమిళనాడుకు వెళ్తారు. కోయంబత్తూరులో మధ్యాహ్నం 1.30 గంటలకు దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయంపై ఏర్పాటు చేసిన సదస్సును ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. దేశ వ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులకు ‘పీఎం కిసాన్’ 21వ విడత కింద రూ.18,000 కోట్లకు పైగా నిధుల్ని విడుదల చేస్తారు. ఈ సదస్సును తమిళనాడు నేచురల్ ఫార్మింగ్ స్టేక్ హోల్డర్స్ ఫోరమ్ ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు నిర్వహిస్తోంది. ఈ సదస్సులో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లకు చెందిన రైతులు, ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్న వారు, శాస్త్రవేత్తలు, సేంద్రీయ ఉత్పత్తులను సరఫరా చేసే సంస్థల ప్రతినిధులు, అమ్మకందారులతో పాటు 50 వేలకు పైగా ఆసక్తిదారులు పాల్గొంటారని ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది. -
‘మిషన్ బెంగాల్’: బూత్ స్థాయి నుంచే ‘మమత’పై బీజేపీ దాడి?
న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఎ) ఘన విజయం సాధించిన తర్వాత, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇప్పుడు పశ్చిమ బెంగాల్పై దృష్టి కేంద్రీకరించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కోటను బద్దలు కొట్టడానికి ఒక సమగ్ర వ్యూహాన్ని రూపొందిస్తున్నదని ‘ఎన్డీటీవీ’ తన కథనంలో పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ తన అభినందన ప్రసంగంలో బిహార్ నుండి పారే గంగా నది మాదిరిగానే, బీజేపీ విజయం బెంగాల్కు కూడా విస్తరిస్తుందని అన్నారు. పార్టీ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షా బెంగాల్తో సహా మరికొన్ని రాష్ట్రాలలో సొంత ముఖ్యమంత్రిని ఎన్నుకున్నప్పుడే బీజేపీ ఎదుగుదల పరిపూర్ణమవుతుందని గతంలోనే పేర్కొన్నారు.సంస్థాగత బలోపేతంపశ్చిమ బెంగాల్లో బీజేపీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తోంది. బెంగాల్లోని మొత్తం 91,000 బూత్లలో, బీజేపీ ఇప్పటికే సుమారు 70,000 బూత్లలో బూత్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఇది బూత్-స్థాయి ప్రచారాన్ని ముమ్మరం చేయడానికి పునాదిగా పనిచేస్తుంది. ఈ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లాబ్ కుమార్ దేబ్, ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియాలకు అప్పగించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ గత మూడేళ్లుగా రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు.‘రివిజన్’ పూర్తయ్యాక..బెంగాల్లో ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కసరత్తు పూర్తయ్యే వరకు వేచివుండాలని బీజేపీ యోచిస్తోంది. బీహార్లో మాదిరిగానే పశ్చిమ బెంగాల్లో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియలో మరణించిన ఓటర్ల తొలగింపు జరుగుతుందని బీజేపీ భావిస్తోంది. గతంలో వామపక్షాలు శాస్త్రీయ రిగ్గింగ్ ద్వారా జాబితాలోని ఉన్న చనిపోయిన ఓటర్ల తరపున తమ కార్యకర్తలతో ఓటు వేయించి ఎన్నికలను గెలిచేవారని, అయితే ఎస్ఐఆర్ తర్వాత ఇది గణనీయంగా తగ్గుతుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక బీజేపీ నేతలు బూత్ స్థాయి ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనున్నారు.తృణమూల్ ఉచ్చులో పడకుండా..రాష్ట్రంలోని బీజేపీ నేతల మధ్య విభేదాలను పరిష్కరించడం, రాష్ట్ర యూనిట్లో క్రమశిక్షణను కాపాడటం ప్రధాన లక్ష్యాలుగా బీజేపీ ముందుకు సాగుతోంది. రాష్ట్ర నేతలను అనవసరమైన వాక్చాతుర్యాన్ని మానుకోవాలని, ప్రజలను ఆక్టటుకునేందుకు సొంత కథనాలను సృష్టించే తృణమూల్ ఉచ్చులో పార్టీ కీలక నేతలు చెబుతున్నారు. సీనియర్ నేతలు మాత్రమే నాయకత్వం వహించేలా ప్రచారాన్ని సాగించి, ఐక్యతా సందేశాన్ని పంపాలని పార్టీ యోచిస్తోంది. సమిష్టి నాయకత్వం, ప్రధాని మోదీ పనితీరుపై మాత్రమే ఆధారపడి ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించిందని సమాచారం.క్షీణిస్తున్న శాంతిభద్రతలను హైలెట్ చేస్తూ..రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లేవనెత్తాలనుకుంటున్న అతిపెద్ద సమస్య మహిళల భద్రత. మహిళా ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ, మహిళలపై రోజూ దారుణాలు జరుగుతున్నాయని, ఆర్జీ కర్ ఘటన, దుర్గాపూర్లో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిని ప్రధాన సమస్యలుగా బీజేపీ నేతలు హైలైట్ చేయనున్నారు. పరిశ్రమలు లేకపోవడం వల్ల ఉపాధి లేమి, వలసలు పేదరికం, ఆర్థిక అస్థిరత మొదలైనవాటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ యోచిస్తోంది. టీఎంసీ అందిస్తున్న ‘లక్ష్మీ భండార్’ పథకానికి బదులుగా పశ్చిమ బెంగాల్లోని 1.5 కోట్ల మహిళలకు మహిళల ఉపాధికి రూ. 10,000 అందించాలని ఎన్డీఏ నిర్ణయించిందని తెలుస్తోంది.టార్గెట్ ‘160’పశ్చిమ బెంగాల్లో బీజేపీ తన ప్రచారాన్ని ఉధృతం చేసేందుకు ఇక్కడి వంశవాద రాజకీయాలు, అవినీతిని లక్ష్యంగా చేసుకోనుంది. ముస్లింలను సంతృప్తి పరచడం లాంటి ఆరోపణలతో టీఎంసీని ఇరుకున పెట్టడం బీజేపీ దగ్గరున్న మరొక వ్యూహంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఏదో ఒక సమయంలో బీజేపీ నేతలు గెలిచిన 120 అసెంబ్లీ సీట్లు ఇప్పటికే ఉన్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సీట్లతో పాటు అదనంగా మరో 40 నుంచి 50 సీట్లపై కేంద్రీకరించి 160 సీట్ల లక్ష్యాన్ని సాధించడానికి బీజేపీ కృషి చేస్తోందని సమాచారం. ఇది కూడా చదవండి: ‘చనిపోలేదు.. ఇప్పుడే పుట్టింది’.. ‘జన్ సురాజ్’పై పోస్ట్మార్టం -
25న అయోధ్యలో ధ్వజారోహణం
అయోధ్య: అయోధ్య రామాలయంలో ఈ నెల 25వ తేదీన చేపట్టే ధ్వజా రోహణ కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సుమారు 60 చార్టెర్డ్ విమానాల్లో తరలిరానున్నారు. వీరికోసం అయోధ్య విమానాశ్రయంలో అదనంగా 100 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లను నియమిస్తామని ఎయిర్పోర్టు డైరెక్టర్ ధీరేంద్ర సింగ్ వెల్లడించారు. సుమారు 60 చార్టర్డ్ విమానాలు వచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ విమానాల కోసం సమీప ఎయిర్పోర్టుల్లో పార్కింగ్ వసతులను కల్పించామన్నారు. విమానాశ్రయంలో ప్రధాని మోదీ కోసం స్పెషల్ లాంజ్ ఉంటుందని, సీఎం, గవర్నర్ తదితరుల కోసం మరో ఆరు వీఐపీ లాంజ్లను సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రముఖులందరినీ ఈ నెల 24వ తేదీనే రావాల్సిందిగా ఆహ్వానాలు పంపామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. 25వ తేదీ ఉదయం 7.30 గంటల నుంచి 9 గంటల వరకే వీరిని లోపలికి అనుమతిస్తామన్నారు. వీరి కోసం అయోధ్యలోని హోటళ్లలో 1,600 గదులను బుక్ చేశారు. -
ఆశలు నెరవేర్చే పార్టీలనే నమ్ముతారు
న్యూఢిల్లీ: సదుద్దేశంతో ముందడుగు వేసి, తమ ఆశయాలను నెరవేర్చే రాజకీయ పార్టీలనే ప్రజలు విశ్వసిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సోమవారం ఢిల్లీలో ఆరో రామ్నాథ్ గోయంకా స్మారకోపన్యాస కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘‘ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వామపక్ష పార్టీనా, మితవాద పార్టీనా అనేది ముఖ్యంకాదు. అభివృద్ధి విధానాలతో ఏ పార్టీ అయితే ముందుకెళ్తుందో ఆ పార్టీలకు మాత్రమే భవిష్యత్తు ఉంటుందని బిహార్లో తాజా శాసనసభ ఎన్నికల ఫలితాలు రుజువుచేశాయి. ప్రాంతీయ పార్టీల సారథ్యంలో కేంద్రంలో లేదా రాష్ట్రంలో ఏర్పడే ప్రభుత్వాల దృష్టి మొత్తం అభివృద్ధి మీదనే ఉండాలి. భారతదేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు పెద్దగానే ఉంటాయని బిహార్ ఎన్నికలు నిరూపించాయి. అధికారం చేపట్టి సదుద్దేశంతో సత్కార్యాలు చేసే రాజకీయ పక్షాల వెంటే ప్రజలు నడుస్తారు. మళ్లీ వాళ్లకే ఓటేస్తారు. అద్భుతమైన మెజారిటీతో గెలిపించుకుంటారు. విదేశాల నుంచి తమ రాష్ట్రానికే భారీ పెట్టుబడులు వచ్చేలా బడా కంపెనీలను ఆకర్షిస్తూ, రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే రాష్ట్ర ప్రభుత్వా లను ఎప్పుడూ నా పూర్తి మద్దతు ఉంటుంది’’ అని అన్నారు. ఎలక్షన్ మోడ్ కాదు ఎమోషనల్ మోడ్‘‘బీజేపీ ఎప్పుడూ ఎన్నికల మీదే దృష్టిపెడుతుందని కొందరు అ భాండాలు వేస్తున్నారు. నిజానికి మేం ఎలక్షన్ మోడ్లో ఉండబోం. ఎన్నికల ప్రచారంవేళ ప్రజలతో మమేకమయ్యే ఎమోషనల్ మోడ్లో ఉంటాం. రోజూ 24 గంటలూ అభివృద్ధి, ప్రజల భావోద్వేగాల గురించే పట్టించుకుంటాం. అందుకే ప్రతిసారి మాకు విజయం దక్కుతోంది’’ అని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ విమర్శలు గుప్పించారు. ‘‘ నక్సలిజం, మావోయిస్ట్ టెర్రరిజంకు కొమ్ముకాస్తున్న కాంగ్రెస్ దేశంలో ఉనికిని కోల్పోతోంది. కేవలం విపక్షపార్టీగా మాత్రమే మిగిలిపోతోంది. గత ఐదు దశాబ్దాల్లో దేశంలో ప్రతి రాష్ట్రం మావోయిస్టుల దురాగతాలను చవిచూసింది. దేశ రాజ్యాంగాన్ని నమ్మని అలాంటి వాళ్లను కాంగ్రెస్ ప్రోత్సహిస్తోంది’’ అని మోదీ ఆరోపించారు. -
మీ అనుభవాలు నమోదు చేయండి
న్యూఢిల్లీ: ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై పని చేస్తున్న ఇంజనీర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ పనిలో ఎదురవుతున్న అనుభవాలను నమోదు చేయాలని సూచించారు. తద్వారా భవిష్యత్తులో చేపట్టే ఇలాంటి ప్రాజెక్టులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఇంజనీర్ల అనుభవాలు మున్ముందు ప్రాజెక్టుల ప్రణాళిక, అమలుకు ఎంతగానో తోడ్పడుతాయని చెప్పారు. ప్రధాని మోదీ శనివారం సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటించారు. సూరత్లో ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్వే(ఎంఏహెచ్ఎస్ఆర్) ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజనీర్లతో మాట్లాడారు. ‘బ్లూ బుక్’ తరహాలో అనుభవాలను రికార్డు చేయాలని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు సాకారం కావాలంటే ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టుపై పనిచేస్తున్న ఇంజనీర్ల సహకారం అవసరమని ఉద్ఘాటించారు. -
బిహార్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం ఏ రోజంటే?
బిహార్ లో గ్రాండ్ విక్టరీ సాధించిన ఎన్డీఏ కూటమి ఈ నెల 19 లేదా 20 తేదీలలో కొలువుదీరే అవకాశం ఉంది. ప్రధాన మంత్రి మోదీ షెడ్యూల్ అనుగుణంగా తేదీని నిర్ణయించనున్నారు. ఇటీవలే వచ్చిన బిహార్ 18వ అసెంబ్లీ ఫలితాలను ఎన్నికల కమిషన్ ఈ రోజు రాష్ట్ర గవర్నర్ కు సమర్పించనుంది. దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మెుదలుకానుంది.బిహార్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ పనులు శరవేగంగా సాగనున్నాయి. ఈరోజు ఎలక్షన్ కమిషన్ గవర్నర్ కు ఫలితాల నివేదికను అందించనుంది. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధ్యక్షతన క్యాబినేట్ భేటీ జరగనుంది. అనంతరంనితీష్ తన రాజీనామాను గవర్నర్ కు అందించే అవకాశాలున్నాయి. తరువాత ఎన్డీఏ కూటమి నేతలంతా ప్రత్యేక సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎన్డీఏ కూటమి నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ ప్రమాణ స్వీకార వేడుకకు బిహార్ పాట్నాలోని గాంధీ మైదాన్ వేదిక కానుంది. ఇటీవలే జరిగిన బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 202 స్థానాలు సాధించి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
‘ముస్లింలీగ్–మావోయిస్టు కాంగ్రెస్’ను తిరస్కరించారు
సూరత్: ముస్లింలీగ్–మావోయిస్టు కాంగ్రెస్ గా మారిన కాంగ్రెస్ పార్టీని బిహార్ ప్రజలు పూర్తిగా తిరస్కరించారని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పారని అన్నా రు. కులవాదం అనే విషాన్ని చిమ్మిన ప్రతిపక్షా నికి కర్రుకాల్చి వాత పెట్టారని వ్యాఖ్యానించారు. గుజరాత్లోని సూరత్లో శనివారం బిహారీలు నిర్వహించిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. బిహార్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్డీయే విజయం సాధించినందుకు బిహారీలు మోదీని ఘనంగా సత్కరించారు. కాంగ్రెస్ యువరాజు (రాహుల్ గాంధీ) చర్యలను చూసి ఆ పార్టీలోని సీనియర్ నాయకులు బాధపడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్కు దశాబ్దకాలంగా ఎన్నికల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయని, ఇకనైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆ పార్టీ నాయకత్వానికి సూచించారు. కాంగ్రెస్ను కాపాడుకోవడం ఇక కష్టమేనని పార్టీ నాయకులే అంటున్నారని గుర్తుచేశారు. దాదాపు 60 ఏళ్లు దేశాన్ని పాలించిన పార్టీకి ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించాలని చెప్పారు. అక్రమాలను అడ్డుకోవడానికే వక్ఫ్ చట్టం బిహార్లో ఎన్డీయే ఘన విజయానికి ఎం.వై.(మహిళలు, యువత) అంశమే కారణమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. నేరాలు చేసి, జైలుకు వెళ్లి బయటకు వచ్చిన కొందరు నేతలు కుల రాజకీయాలతో ఎన్నికల్లో నెగ్గాలని ఆరాటపడ్డారని విమర్శించారు. వారి ఆటలు సాగలేదని, జనం వారి కుట్రలను తిప్పికొట్టారని ప్రశంసించారు. దేశానికి ఇదొక శుభసూచకమని పేర్కొన్నారు. బిహార్లో అన్ని వర్గాల ప్రజలూ ఎన్డీయేకు అండగా నిలిచారని తెలిపారు. అధికార, విపక్ష కూటముల మధ్య 10 శాతం ఓట్ల తేడా ఉందన్నారు. బిహార్లో 38 నియెజకవర్గాల్లో దళితుల ప్రాబల్యం అధికంగా ఉండగా, అందులో 34 స్థానాలు ఎన్డీయే గెల్చుకుందని వివరించారు. దళితులు విపక్షాన్ని తిరస్కరించారని చెప్పారు. బిహార్లో భూములను, ఇళ్లను చట్టవిరుద్ధంగా ఆక్రమించి అవి వక్ఫ్ ఆస్తులు అంటున్నారని ప్రధానమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. తమిళనాడులో వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రామాలు వక్ఫ్ ఆస్తులు ఎలా అవుతాయో చెప్పాలని ప్రశ్నించారు. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికే వక్ఫ్ చట్టం తీసుకొచ్చామని వివరించారు. అధికారంలోకి వస్తే వక్ఫ్ చట్టాన్ని అమలు కానివ్వబోమని ప్రతిపక్షాలు ప్రకటించాయని, అయినా బిహార్ ఓటర్లు పట్టించుకోలేదని అన్నారు. బిహార్లో ఓటమికి కారణాలు చెప్పలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలపై, ఎన్నికల సంఘంపై నిందలు వేస్తోందని ధ్వజమెత్తారు. ఇలాంటి నిందలతో ఎక్కువ రోజులు కార్యకర్తలను మభ్యపెట్టలేరని హితవు పలికారు. -
గిరిజన యోధులను విస్మరించారు
గాందీనగర్: దేశ స్వాతంత్య్ర పోరాటంలో గిరిజనులు చిరస్మరణీయమైన పాత్ర పోషించారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. కానీ, 60 ఏళ్లపాటు అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ మన గిరిజన యోధులను ఏనాడూ పట్టించుకోలేదని, పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. గిరిజనుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిందని తప్పుపట్టారు. స్వాతంత్య్ర పోరాట ఘనత ‘కొన్ని కుటుంబాలకే’ దక్కాలన్నదే కాంగ్రెస్ అసలు ఉద్దేశమని విమర్శించారు. గిరిజన వీరుడు భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా శనివారం గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలోని దెడియాపాద పట్టణంలో నిర్వహించిన ‘జనజాతీయ గౌరవ్ దివస్’లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రూ.9,700 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఇందులో రూ.2,320 కోట్లతో నిర్మించే 50 ఎకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా ఉన్నాయి. అలాగే ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ధర్తీ–ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్‡్ష అభియాన్ కింద నిర్మించిన లక్ష ఇళ్ల గృహ ప్రవేశాన్ని వర్చువల్గా నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... దేశ ప్రతిష్ట, ఆత్మగౌరవం, స్వాతం్రత్యాన్ని కాపాడే విషయంలో ఎల్లప్పుడూ గిరిజన బిడ్డలే ముందంజలో ఉంటున్నారని ప్రశంసించారు. అడవి బిడ్డల నుంచి ఎంతోమంది స్వాతంత్య్ర పోరాట యోధులు ఉద్భవించారని గుర్తుచేశారు. గుజరాత్లో గోవింద్ గురు, రూప్సింగ్ నాయక్, మోతీలాల్ తేజావత్ వంటి గిరిజనులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు. ఈ ఉద్యమంలో లెక్కలేనన్ని అధ్యాయాలు గిరిపుత్రుల ధైర్యసాహసాలతో నిండిపోయాయని అన్నారు. న్యాయం చేయాలని సంకల్పించాం ‘‘దేశ స్వేచ్ఛ కోసం రక్తం చిందించిన గిరిజనులకు తగిన గుర్తింపు దక్కలేదు. కొందరి కుట్రల కారణంగా వారు తెరవెనుకే ఉండిపోయారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పాలకులు గిరిజనుల త్యాగాలను, అంకితభావాన్ని పూర్తిగా విస్మరించారు. 2014 కంటే ముందు భగవాన్ బిర్సా ముండాను ఎవరూ స్మరించుకోలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆయనకు గౌరవం దక్కింది. జార్ఖండ్లో బిర్సా ముండా ఇంటిని సందర్శించిన మొట్టమొదటి ప్రధానమంత్రిని నేనే. జనజాతీయ గౌరవ్ దివస్ అనేది గిరిపుత్రులకు జరిగిన అన్యాయాన్ని గుర్తుచేసుకోవడానికి దక్కిన అవకాశం. అడవి బిడ్డల పట్ల కాంగ్రెస్ నిర్వాకాలు ఏమిటో ప్రజలు తెలుసుకోవాలి. గిరిజనులకు శ్రీరాముడితో అనుబంధం ఉంది. వారు శ్రీరాముడి కాలానికి చెందినవారు. అయినా ఆ సంగతి కాంగ్రెస్ ప్రభుత్వాలకు పట్టలేదు. వారి జీవితాలను మెరుగుపర్చాలని ఏనాడూ ఆలోచించలేదు. మేయు గిరిజనుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. వారికి న్యాయం చేకూర్చాలని సంకల్పించాం. గిరిజనుల కోసం కేంద్రంలో ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన ఘనత అటల్ బిహారీ వాజ్పేయిదే. నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహిస్తున్నాం మేరీ కోమ్, దుతీ చంద్, బైచుంగ్ భూటియా వంటి గిరిజన యువతీ యువకులు అంతర్జాతీయ వేదికపై మన దేశ కీర్తి ప్రతిష్టలను పెంచారు. గిరిజన ప్రాంతాల నుంచి ఎంతోమంది క్రీడాకారులు వస్తుండడం సంతోషంగా ఉంది. పోటీల్లో పాల్గొంటూ పతకాలు సాధిస్తున్నారు. ఇటీవల మహిళల క్రికెట్ ప్రపంచ్ కప్ సాధించిన మన క్రీడాకారుల బృందంలో ఒక గిరిజన బిడ్డ కూడా ఉండడం గర్వకారణం. మన ప్రభుత్వం గిరిజనుల్లో నైపుణ్యాలను గుర్తించి, ప్రోత్సహిస్తోంది. అణగారిన వర్గాలకు సైతం అందరితోపాటు సమాన అవకాశాలు దక్కాలి. అందుకోసం నిరంతరం శ్రమిస్తున్నాం. గత ఐదేళ్లలో మోడల్ గిరిజన పాఠశాలల నిర్మాణానికి రూ.18,000 కోట్లకుపైగా నిధులు ఖర్చు చేశాం. విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఫలితంగా గిరిజన పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య ప్రతిఏటా భారీగా పెరుగుతోంది’’ అని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. పండోరి మాత ఆలయంలో పూజలు నర్మదా జిల్లాలోని దేవమోగ్రా గ్రామంలో గిరిజనుల ఆరాధ్య దైవం పండోరి మాత ఆలయాన్ని ప్రధానమంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు సూరత్ నగరంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ పురోగతిని మోదీ సమీక్షించారు. బిర్సా ముండాకు నివాళులు స్వాతంత్య్ర సమరయోధుడు, గిరిజన విప్లవకారుడు భగవాన్ బిర్సా ముండా 150 జయంతి సందర్భంగా ప్రధాని మోదీ శనివారం ఘనంగా నివాళులరి్పంచారు. పరాయి పాలకుల దౌర్జన్యాలపై ఆయన సాగించిన పోరాటాలు, చేసిన త్యాగాలు ప్రతి తరానికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఉద్ఘాటించారు. బిర్సా ముండా జయంతిని ‘జనజాతీయ గౌరవ్ దివస్’గా దేశమంతటా నిర్వహించారు. -
బుల్లెట్ ట్రైన్ స్టేషన్ను పరిశీలించిన ప్రధాని మోదీ
సూరత్: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ(నవంబర్ 15, శనివారం) గుజరాత్లో పర్యటించారు. నర్మాదా దేవ్మోగ్రా ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బిర్సా ముండా జయంతి వేడుకలకు ప్రధాని హాజరయ్యారు. రూ.9,700 కోట్ల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఉదయం సూరత్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని.. నిర్మాణంలో ఉన్న బుల్లెట్ ట్రైన్ స్టేషన్ను సందర్శించి.. ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు కారిడార్ (MAHSR) పురోగతిని సమీక్షించారు. ఎంఏహెచ్ఎస్ఆర్ భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక మౌలిక వసతుల ప్రాజెక్టులలో ఒకటి. ఇది సుమారు 508 కి.మీ. పొడవు.అందులో 352 కి.మీ. గుజరాత్, దాద్రా-నగర్ హవేలీలో, 156 కి.మీ. మహారాష్ట్రలో ఉంది. ఈ కారిడార్ సబర్మతి, అహ్మదాబాద్, ఆనంద్, వడోదరా, భరూచ్, సూరత్, బిలిమోరా, వాపి, బోయిసర్, విరార్, థానే, ముంబై వంటి ప్రధాన నగరాలను కలుపుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక ఇంజనీరింగ్ సాంకేతికతతో నిర్మాణం జరుగుతోంది. -
2026లో దీదీకి షాక్ తప్పదు! బెంగాల్ లో బీహార్ సీన్ రిపీట్ చేస్తాం..
-
బెంగాల్లోనూ ‘జంగిల్రాజ్’ను అంతం చేస్తాం
న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. కార్యకర్తల కష్టంతోనే గెలుపు దక్కిందని అన్నారు. బిహార్లో సుపరిపాలన కొనసాగిస్తామని, ఇకపై ప శ్చిమ బెంగాల్లో ‘జంగిల్రాజ్’ను అంతం చేస్తామని ప్రతినబూనారు. పరోక్షంగా ఎన్నికల శంఖారావం పూరించారు. మమతా బెనర్జీ ప్రభుత్వంపై సమర భేరీ మోగించారు. బిహార్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో ప్రధాని మోదీ శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవంలో పాల్గొన్నారు. నేతలకు, కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గంగా నది బిహార్ గుండా బెంగాల్లోకి ప్రవహిస్తోందని చెప్పారు. బిహార్ విజయం ఇక బెంగాల్లో విజయానికి దారిని ఏర్పర్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అది ముస్లింలీగీ మావోవాదీ కాంగ్రెస్(ఎంఎంసీ)గా మారిందని ధ్వజమెత్తారు. ఆ పార్టీ త్వరలో ముక్కలుచెక్కలు కావడం తథ్యమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పెద్దలు వారు మునిగిపోవడంతోపాటు నమ్ముకున్నవారిని కూడా ముంచేస్తారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ మెడలో మిథిలా పెయింటింగ్లతో కూడిన గమ్చా(కండువా) ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తద్వారా బిహార్ ప్రజలతో తనకున్న అనుబంధాన్ని చాటిచెప్పారు. కొత్తగా ఎం.వై. ఫార్ములా బిహార్ విజయం కొత్తగా ఎం.వై.(మహిళలు, యువత) అనే ఫార్ములాను ఇచ్చిందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. జంగిల్రాజ్ మనుషుల మతపరమైన ఎం.వై.(ముస్లిం–యాదవ్) ఫార్ములాను ఈ విజయం మట్టిలో కలిపేసిందని అన్నారు. ‘ప్రజాస్వామ్యానికి తల్లి’ అనే గొప్ప గౌరవాన్ని భారత్కు ఇచి్చన గడ్డ బిహార్ అని కొనియాడారు. ప్రజాస్వామ్యంపై దాడి చేస్తే మట్టికరిపిస్తామన్న సందేశాన్ని ఇదే గడ్డ ఇచి్చందన్నారు. బిహార్లో ఎన్డీయే విజయం ప్రజాస్వామ్యానికి దక్కిన మహోన్నత విజయమని అభివరి్ణంచారు. అసత్యాలు ఓడిపోతాయని, ప్రజల విశ్వాసమే గెలుస్తుందని బిహార్ నిరూపించినట్లు చెప్పారు. కాంగ్రెస్ పారీ్టకి మన దేశం పట్ల సానుకూల దృక్పథం గానీ, దార్శనికత గానీ లేవని మండిపడ్డారు. అదొక పరాన్నజీవి, మోయలేని భారం, నష్టదాయకం అంటూ కాంగ్రెస్ మిత్రపక్షాలను హెచ్చరించారు. ఈసీ పట్ల ప్రజల విశ్వాసం బలోపేతం ఎన్డీయే ప్రభంజనంతో బిహార్లో నూతన శకం ఆరంభమైందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. రాబోయే ఐదేళ్లలో మరింత వేగంగా అభివృద్ధి కొనసాగుతుందని తేల్చిచెప్పారు. కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. బిహార్ శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలుస్తాయని వ్యాఖ్యానించారు. బిహార్ ఎన్నికల ఫలితాలతో ఎన్నికల సంఘం పట్ల ప్రజల విశ్వాసం మరింత బలోపేతమైందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం కృషితో ఈ ఎన్నికల్లో అత్యధిక శాతం ఓటింగ్ నమోదైనట్లు గుర్తుచేశారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నాయకత్వ ప్రతిభను నరేంద్ర మోదీ శ్లాఘించారు. ఎన్డీయే పక్షాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్ఐఆర్ను యువత స్వాగతించారు నేడు దేశంలో అత్యధికంగా యువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో బిహార్ కూడా ఉందని మోదీ వెల్లడించారు. ఇక్కడి యువతలో అన్ని కులాలు, మతాలకు చెందినవారు ఉన్నారని చెప్పారు. వారి ఆశలు, ఆకాంక్షలు, కలలు జంగిల్రాజ్ మనుషుల కమ్యూనల్ ఎం.వై.ఫార్ములాను సర్వనాశనం చేశాయని వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనను యువత స్వాగతించారని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)కు వారు మద్దతిచి్చనట్లు ఈ ఫలితాల ద్వారా స్పష్టమవుతోందని పేర్కొన్నారు. జంగిల్రాజ్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో విచ్చలవిడిగా హింసాకాండ జరిగేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ప్రధానమంత్రి సంతోషం వ్యక్తంచేశారు. ఎన్నికల సంఘం కృషి వల్ల అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని కొనియాడారు. బిహార్ విజయం పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో బీజేపీ కార్యకర్తలకు కొత్త శక్తిని ఇచి్చందని స్పష్టంచేశారు. -
ఎదురులేని ఎన్డీయే
పట్నా: బిహార్ శాసనసభ ఎన్నికల్లో అధికార ఎన్డీయే సీట్ల సునామీ సృష్టించింది. మొత్తం 243 స్థానాలకు గాను ఏకంగా 202 స్థానాలు దక్కించుకొని డబుల్ సెంచరీ కొట్టేసింది. తమకు ఎదురే లేదని నిరూపించుకుంది. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. శుక్రవారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో మొదటి నుంచీ చివరిదాకా బీజేపీ–జేడీ(యూ) కూటమి ప్రభంజనమే కనిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాకర్షణ శక్తి, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అందించిన సుపరిపాలన కూటమి విజయానికి బాటలు వేశాయి. 89 సీట్లలో జయకేతనం ఎగురవేసిన బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. మిత్రపక్షమైన జేడీ(యూ)ను వెనక్కి నెట్టి, కూటమి పెద్దన్నగా మారింది. కాంగ్రెస్, ఆర్జేడీలతో కూడిన మహాగఠ్బంధన్ పూర్తిగా కుదేలయ్యింది. కేవలం 35 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన సురాజ్ పార్టీ గుండుసున్నా చుట్టేసింది. ఘోర పరాజయం పాలయ్యింది. కనీస ప్రభావాన్ని కూడా చూపలేకపోయింది. సీట్లు సాధించడంలో విఫలమైన జన సురాజ్ పార్టీ చాలా స్థానాల్లో మహాగఠ్బంధన్ విజయావకాశాలను దెబ్బకొట్టింది. బిహార్ విజయంతో ఊపుమీదున్న బీజేపీ ఇక బెంగాల్ కోటపై కాషాయ జెండా పాతడానికి రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతోంది. బిహార్ విజయాన్ని ప్రజాస్వామ్య విజయంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. జంగిల్రాజ్ ఇక అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. సుపరిపాలన, వికాసానిదే విజయంబిహార్ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ సాక్షి, న్యూఢిల్లీ: బిహార్లో సుపరిపాలన, వికాసం, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయానిదే విజయం అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే ఘన సాధించడంపై శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘సుపరిపాలన గెలిచింది. అభివృద్ధి గెలిచింది. ప్రజా సంక్షేమ స్ఫూర్తి గెలిచింది. సామాజిక న్యాయం గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేను చరిత్రాత్మకమైన, అపూర్వమైన విజయంతో ఆశీర్వదించినందుకు బిహార్లోని నా కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఫలితాల అనంతరం ప్రధాని మోదీని సన్మానిస్తున్న రాజ్నాథ్ సింగ్, నడ్డా, అమిత్ షా ఈ అఖండ తీర్పు బిహార్ కోసం ప్రజలకు సేవ చేయడానికి నూతన సంకల్పంతో పనిచేయడానికి మాకు శక్తినిస్తుంది. అవిశ్రాంతంగా పనిచేసిన ప్రతి ఎన్డీయే కార్యకర్తకు నా కృతజ్ఞతలు. వారు మా అభివృద్ధి ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రతిపక్షాల ప్రతి అబద్ధాన్ని గట్టిగా తిప్పికొట్టారు. రాబోయే కాలంలో, బిహార్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, రాష్ట్ర సంస్కృతికి కొత్త గుర్తింపును తీసుకువచ్చేందుకు మేము అవిశ్రాంతంగా కృషి చేస్తాం. యువ శక్తి, నారీశక్తికి సుసంపన్న జీవితం అందజేస్తాం’’అని పేర్కొన్నారు. బిహార్లో గెలిచిన ప్రముఖులుసాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనేక సంచలనాలకు, ఆసక్తికరమైన గెలుపోటములకు వేదికగా ని లిచాయి. ఎన్డీఏ ప్రభంజనంలో కొందరు అగ్రనాయకులు, సి నీతారలు అనూహ్యంగా గెలిచి తమ పట్టు నిరూపించుకోగా, మరికొందరు అగ్రశ్రేణినేతలు, ముఖ్యంగా ’యాదవ్’ కుటుంబం, భోజ్పురి స్టార్లు తీవ్ర పరాజయాన్ని చవిచూశారు. శివానీ శుక్లా (ఆర్జేడీ): బాహుబలి నేత మున్నా శుక్లా కుమార్తె శివానీ, లాల్గంజ్ నుంచి గెలిచి రాజకీయ అరంగేట్రం చేశారు. మైథిలీ ఠాకూర్ (బీజేపీ – గాయని): ఈ ఎన్నికల్లో అతిపెద్ద సెలబ్రిటీ విన్నర్. రాజకీయ అరంగేట్రంలోనే అలీనగర్ నియోజకవర్గంలో ఆర్జేడీ కంచుకోటను బద్దలుకొట్టి చరిత్రాత్మక విజయం సాధించారు. శ్రేయసి సింగ్ (బీజేపీ – షూటర్): కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్, షూటర్ శ్రేయసి సింగ్ జమూయ్ స్థానం నుంచి 20,000 ఓట్లకు పైగా భారీ మెజారిటీతో రెండోసారి గెలుపొందారు. వినయ్ బిహారీ (బీజేపీ – గాయకుడు/నటుడు): ప్రముఖ భోజ్పురి గాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన వినయ్ బిహారీ లౌరియా స్థానం నుంచి మరోసారి సులభంగా గెలుపొందారు. ప్రభావం చూపని వామపక్షాలు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం ముస్లిం మైనార్టీల ప్రాబల్యం కలిగిన సీమాంచల్లో 29 సీట్లలో పోటీ చేసి, ఐదు సీట్లు సాధించింది. ఆ పార్టీ ఏ కూటమిలోనూ చేరకుండా ఒంటరిగానే బరిలోకి దిగడం విశేషం. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని ఎల్జేపీ(రామ్విలాస్) 19 సీట్లు సొంతం చేసుకుంది. హిందుస్తానీ అవామీ మోర్చా(సెక్యులర్) 5 సీట్లు, రాష్ట్రీయ లోక్ మోర్చా 4 సీట్లు, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ 2 సీట్లు, ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ ఒక స్థానాన్ని తమ ఖాతాలో వేసుకున్నాయి. మరోవైపు ఈ ఎన్నికలు కాంగ్రెస్–ఆర్జేడీ కూటమికి చేదు అనుభవం మిగిల్చాయి. గత ఎన్నికల్లో 75 సీట్లు గెల్చుకున్న ఆర్జేడీ ప్రస్థానం ఇప్పుడు 25 సీట్ల వద్దే ఆగిపోయింది. కాంగ్రెస్ సంఖ్యాబలం 19 నుంచి ఆరుకు పడిపోయింది. గత ఎన్నికలతో పోలిస్తే ఆర్జేడీ, కాంగ్రెస్ బలం భారీగా తగ్గిపోయింది. సీఎం నితీశ్ కుమార్ ప్రజా వ్యతిరేకతను అధిగమించి మళ్లీ గెలుపు బావుటా ఎగురవేశారు. ముస్లింల ప్రభావం అధికంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ బీజేపీ కూటమికి మంచి ఫలితాలు లభించాయి. మైనార్టీ ఓటర్ల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చినట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోంది. విపక్ష కూటమిలో భాగమైన వామపక్షాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. బహుజన సమాజ్ పార్టీ ఒక స్థానం, సీపీఎం ఒక స్థానం గెల్చుకున్నాయి. మరోవైపు బిహార్ విజయంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటినుంచే కష్టపడి పనిచేస్తామని తేల్చిచెప్పాయి. ఇదిలా ఉండగా, బిహార్ నూతన ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. నితీశ్ కుమార్కు మరోసారి అవకాశం దక్కకపోవచ్చని, బీజేపీ నాయకుడే తదుపరి ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం సాగుతోంది. దీనిపై బీజేపీ గానీ, జేడీ(యూ) గానీ ఇంకా స్పందించలేదు. పెరిగిన ఎన్డీయే ఓట్ల శాతం బిహార్ ఎన్నికల్లో బీజేపీ, జేడీ(యూ) తమ ఓట్ల శాతాన్ని పెంచుకున్నాయి. 2020 ఎన్నికల్లో 110 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 19.46 శాతం ఓట్లు సాధించగా, ప్రస్తుతం 101 స్థానాల్లో పోటీకి దిగి 20.08 శాతం ఓట్లు దక్కించుకుంది. జేడీ(యూ) 2020లో 115 సీట్లలో పోటీ చేసి, 15.39 శాతం ఓట్లు కైవసం చేసుకుంది. ఇప్పటి ఎన్నికల్లో 101 సీట్లలో పోటీ చేసి, 19.25 శాతం ఓట్లు పొందింది. ఆర్జేడీ ఓట్ల శాతం 23.11 నుంచి 23 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్ ఓట్లశాతం 9.48 నుంచి 8.71 శాతానికి తగ్గిపోయింది. ఎంఐఎం ఓట్ల శాతం 1.24 నుంచి 1.85 శాతానికి పెరిగింది. ఈ ఎన్నికలతో విపక్ష కూటమి బలహీనతలు బయటపడ్డాయి. ఓట్ల చోరీ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను జనం విశ్వసించలేదని తేటతెల్లమవుతోంది. ‘జంగిల్రాజ్’ వద్దనుకొని, అభివృద్ధి, సుపరిపాలనకు ఓటు వేసినట్లు స్పష్టమవుతోంది. తేజస్వీ అతికష్టం మీద ఎన్నిక మహాగఠ్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ అతికష్టం మీద గట్టెక్కారు. రాఘోపూర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సతీశ్ కుమార్పై 14,532 ఓట్ల తేడాతో గెలిచారు. తొలుత వెనుకంజలో ఉన్న తేజస్వీ చివరి రౌండ్లలో పుంజుకున్నారు. విపక్ష కూటమిలో మొహమ్మద్ షాబుద్దీన్ కుమారుడు ఒసామా సాహెబ్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ అభ్యర్థి సందీప్ గౌరవ్ గెలిచారు. ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, మంత్రులు ప్రేమ్ కుమార్, మహేశ్వర్ హజారీ, సంజయ్ సరోగీ మరోసారి విజయం సొంతం చేసుకున్నారు. బీజేపీ అభ్యరి్థగా తొలిసారి పోటీ చేసిన యువ గాయకురాలు మైథిలీ ఠాకూర్ గెలిచారు. ఆమె అలీనగర్ స్థానం నుంచి ఆర్జేడీ అభ్యర్థి బినోద్ మిశ్రాపై 11,730 ఓట్ల తేడాతో నెగ్గారు. -
ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు (ఫొటోలు)
-
బిహార్ ప్రజలు అన్ని రికార్డులు బద్దలు కొట్టారు: ప్రధాని మోదీ
ఢిల్లీ: బిహార్లో సుపరిపాలన, అభివృద్ధి విజయం సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బిహార్ ప్రజలు అద్భుత విజయం అందించారన్నారని.. ప్రజలు వికసిత్ భారత్కు ఓటేశారన్నారు. బిహార్లో ఇవాళ ప్రతీ ఇంట మఖానా పాయసం వండుకుని సంతోషిస్తారన్న మోదీ.. బిహార్ జంగిల్ రాజ్ అన్నప్పుడు ఆర్జేడీ నుంచి ఎలాంటి వ్యతిరేకతా లేదని.. బిహార్లో ఆ జంగిల్ రాజ్ ఎప్పటికీ తిరిగిరాదన్నారు.మేం ప్రజలకు సేవకులం.. వారి మనసులు గెలుచుకున్నాం. రికార్డు స్థాయిలో ఓటింగ్లో పాల్గొని ఏన్డీఏకు అద్భుత విజయం అందించారు. బిహార్ ప్రజలు అన్ని రికార్డులు బద్దలుకొట్టారు. జంగిల్ రాజ్లో ఏం జరిగిందో అందరికి తెలుసు. జంగిల్రాజ్లో దోపిడీ, అక్రమాలు, హింస ప్రజలు అనుభవమే. ఈ విజయంతో ఎన్నికల సంఘంపై ప్రజలకు విశ్వాసం పెరిగింది. ఒకప్పుడు బిహార్లో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండేది. అరాచక శక్తుల కారణంగా ఎన్నికలు మధ్యాహ్నం 3 గంటలకే ముగిసిపోయేది. కానీ ఇప్పుడు ప్రజలంతా స్వేచ్ఛగా, ధైర్యంగా వచ్చి రికార్డు స్థాయిలో ఓటింగ్లో పాల్గొన్నారు.’’ అని మోదీ పేర్కొన్నారు.సునామీ తరహాలో తీర్పు: జేపీ నడ్డాప్రధాని మోదీ నేతృత్వంలో బిహార్లో ఎన్డీఏ అద్బుత విజయం సాధించింది. బిహార్ ప్రజలు సునామీ తరహాలో తమ తీర్పును వెలువరించారు. ఈ అద్భుత విజయం బీజేపీని మరింత బలోపేతం చేసింది. బాధ్యత పెంచింది. ప్రధాని మోదీపై ప్రజలు మరోసారి తమ ప్రేమను విశ్వాసాన్ని చూపించారు. మహారాష్ట, ఢిల్లీలో కూడా బీజేపీని ప్రజలు అద్భుతంగా ఆదరించారు. రికార్డు స్థాయిలో అత్యధిక స్థానాల్లో బీజేపీని గెలిపించారు. మహాగఠ్ బంధన్ను బీహారీలు తిరస్కరించారు. -
బిహార్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ.. ప్రధాని మోదీ ట్వీట్
ఢిల్లీ: బిహార్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఎన్డీఏ విజయభేరి మోగించింది. బిహార్లో ఎన్డీయే విజయం అపూర్వం, చరిత్రాత్మకం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. విజయంతో ఆశీర్వదించిన బిహార్ ప్రజలకు కృతజ్ఞతలు అంటూ ఎక్స్ వేదికగా తెలిపారు. ‘‘ప్రతిపక్షాల అబద్దాలను మా కార్యకర్తలు తిప్పికొట్టారు. బిహార్ అభివృద్ధి, సాంస్కృతికగుర్తింపునకు కృషి చేస్తాం. బిహార్ తీర్పు నూతన సంకల్పంతో పనిచేయడానికి శక్తినిచ్చింది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.బిహార్లో ఎన్డీఏ సునామీ సృష్టించడంతో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయోత్సవ సంబరాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘‘మేం ప్రజలకు సేవకులం.. వారి మనసులు గెలుచుకున్నాం. రికార్డు స్థాయిలో ఓటింగ్లో పాల్గొని ఏన్డీఏకు అద్భుత విజయం అందించారు. బిహార్ ప్రజలు అన్ని రికార్డులు బద్దలుకొట్టారు. జంగిల్ రాజ్లో ఏం జరిగిందో అందరికి తెలుసు. జంగిల్రాజ్లో దోపిడీ, అక్రమాలు, హింస ప్రజలు అనుభవమే. ఈ విజయంతో ఎన్నికల సంఘంపై ప్రజలకు విశ్వాసం పెరిగింది’’ అని ప్రధాని మోదీ చెప్పారు. Good governance has won. Development has won. Pro-people spirit has won. Social justice has won. Gratitude to each and every person of Bihar for blessing the NDA with a historical and unparalleled victory in the 2025 Vidhan Sabha elections. This mandate gives us renewed…— Narendra Modi (@narendramodi) November 14, 2025 -
భూటాన్ అభివృద్ధికి సహకరిస్తాం
థింపూ: భూటాన్ సర్వతోముఖాభివృద్ధికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. భూటాన్ 13వ పంచవర్ష(2024–2029) ప్రణాళికకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మోదీ భూటాన్ పర్యటన రెండో రోజు బుధవారం కూడా కొనసాగింది. మాజీ రాజు జిగ్మే సింగ్యే వాంగ్చుక్తో ఆయన సమావేశమయ్యారు. భారత్, భూటాన్ సంబంధాలపై వారిద్దరూ చర్చించుకున్నారు. ఇంధనం, వ్యాపారం, వాణిజ్యం, టెక్నాలజీ, అనుసంధానం తదితర కీలక రంగాల్లో పరస్పర సహకారంపై అభిప్రాయాలు పంచుకున్నారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. భారత్–భూటాన్ సంబంధాల బలోపేతానికి జిగ్మే సింగ్యే వాంగ్చుక్ ఎంతగానో కృషి చేశారని ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీ(తూర్పునకు ప్రాధాన్యం)లో భాగంగా భూటాన్లో చేపట్టిన గెలెఫూ మైండ్ఫుల్నెస్ సిటీ ప్రాజెక్టులో ప్రగతి పట్ల మోదీ సంతోషం వ్యక్తంచేశారు. భూటాన్ 13వ పంచవర్ష ప్రణాళిక అమలుకు రూ.10,000 కోట్ల సాయం అందిస్తామని భారత్ ఇప్పటికే హామీ ఇచ్చింది. కాలచక్ర వేడుకలో మోదీ భూటాన్లో జరుగుతున్న అంతర్జాతీయ శాంతి ప్రార్థన పండుగలో భాగంగా కాలచక్ర ఎంపవర్మెంట్ వేడుకను ప్రధాని మోదీ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్తో కలిసి కాలచక్ర ‘వీల్ ఆఫ్ టైమ్ ఎంపవర్మెంట్’ను ప్రారంభించడం ఆనందంగా ఉందని మోదీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులకు ఇదొక గొప్ప వేడుక అని తెలిపారు. కాలచక్రకు బౌద్ధమతంలో అత్యున్నత సాంస్కృతిక ప్రాధాన్యం ఉందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి పండితులు, గురువులు, భక్తులు హాజరయ్యారని వెల్లడించారు. భారత ప్రధాని మోదీ ‘అనుకున్నది సాధించిన ఆధ్యాతి్మక గురువు’ అని భూటాన్ ప్రధానమంత్రి త్సెరింగ్ టాబ్గే అభివరి్ణంచారు. మోదీ బుధవారం భూటాన్ పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్నారు. తన పర్యటనతో భారత్–భూటాన్ మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యంలో వేగం మరింత పెరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. కాలచక్ర అంటే? ఇదొక ఆధ్యాత్మిక వేడుక. బౌద్ధులు పరమ పవిత్రంగా భావిస్తారు. భగవంతుడి ఆశీస్సుల కోసం కాలచక్ర నిర్వహిస్తారు. గౌతమబుద్ధుడి మార్గంలో నడస్తూ జ్ఞానోదయం పొందడానికి ప్రార్థనలు, ధ్యానం నిర్వహిస్తారు. మత గురువుల బోధనలు ఉంటాయి. భూటాన్ ప్రభుత్వం అధికారికంగా కాలచక్ర ఎంపవర్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. -
ముమ్మాటికీ ఉగ్ర దాడే
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వద్ద 12 మందిని బలి తీసుకున్న కారు పేలుడు ఘటన ముమ్మాటికీ ఉగ్రవాద దాడేనని కేంద్ర మంత్రివర్గం తేల్చిచెప్పింది. ఈ పేలుడుపై విచారణ వేగవంతం చేయాలని దర్యాప్తు సంస్థలను ఆదేశించింది. దుశ్చర్యకు కారకులైన దుండగులను, వారి భాగస్వాములను, వారి వెనుక ఉన్న అసలైన కుట్రదారులను సాధ్యమైనంత త్వరగా చట్టం ముందుకు తీసుకురావాలని నిర్దేశించింది. ఉగ్రవాద పోషకులను వదిలిపెట్టబోమని తేల్చిచెప్పింది. విచారణలో ఎలాంటి జాప్యం చేయొద్దని దర్యాప్తు సంస్థలకు సూచించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీ దాడిలో మరణించివారి ఆత్మశాంతి కోసం ప్రధాని, మంత్రులు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. దాడిలో సామాన్యులు మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తంచేస్తూ మంత్రివర్గ సమావేశంలో ఒక తీర్మానం ఆమోదించారు. మొత్తం పరిస్థితిని ఉన్నత స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు కేబినెట్ వెల్లడించింది. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని మంత్రివర్గం తమ తీర్మానంలో స్పష్టంచేసింది. ఉగ్రవాదం ఎక్కడ, ఏ రూపంలో ఉన్నాసరే అంతం చేయాల్సిందేనని పేర్కొంది. దర్యాప్తు జరుగుతున్న తీరు, కుట్రదారులను గుర్తించడానికి చేపట్టిన చర్యలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంత్రివర్గ సహచరులకు తెలియజేశారు. ‘భద్రతపై కేబినెట్ కమిటీ’ సమావేశం ఢిల్లీ పేలుడు ఘటనను మతిలేని ఉగ్రవాద చర్యగా కేబినెట్ అభివర్ణించింది. ఈ పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టంచేసింది. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. బాధితులకు తగిన సాయం, చికిత్స అందించడంలో వైద్య సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, దర్యాప్తు సంస్థల సిబ్బంది, సాధారణ పౌరులు చురుగ్గా వ్యవహరించారని ప్రశంసించింది. వారి అంకితభావం, విధి నిర్వహణలో చిత్తశుద్ధి శ్లాఘనీయమని ఉద్ఘాటించింది. బాధితులకు అండగా ఉంటామని ప్రకటించింది. దేశ పౌరుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు మంత్రివర్గం తేల్చిచెప్పింది. జాతీయ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు మోదీ నేతృత్వంలో ‘భద్రతపై కేబినెట్ కమిటీ’ సమావేశం జరిగింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి శాఖ మంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు. ఢిల్లీ పేలుడు ఘటనతోపాటు తాజా పరిస్థితిపై ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. రూ.25,060 కోట్లతో ఎగమతి ప్రోత్సాహక మిషన్ ఎగమతి ప్రోత్సాహక మిషన్(ఈపీఎం)కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఆరు ఆర్థిక సంవత్సరాల్లో రూ.25,060 కోట్లతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభిస్తారు. భారత ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం భారీగా సుంకాలు విధించిన నేపథ్యంలో దేశీయ ఎగుమతిదారులను ఆదుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో రెండు ఉప పథకాలు ఉన్నాయి. అవి నిర్యాత్ పోత్రాహన్(రూ.10,410 కోట్లు), నిర్యాత్ దిశ(రూ.14,659 కోట్లు). ⇒ అరుదైన ఖనిజాలైన గ్రాఫైట్, సేసియం, రుబీడియం జిర్కోనియంపై రాయల్టీ రేట్ల హేతుబదీ్ధకరణ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. దేశీయంగా ఉత్పత్తిని పెంచడం, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మన దేశంలో ఇంధన భద్రత మరింత బలోపేతం అవుతుందని చెబుతున్నారు. ఆయా ఖనిజాలపై రాయలీ్టని తగ్గించబోతున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ⇒ మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతులను మరింతగా ప్రోత్సహించడానికి వీలుగా క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని ప్రవేశపెట్టడానికి మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ పథకంలో భాగంగా ఎగుమతిదారులకు 100 శాతం క్రెడిట్ గ్యారంటీ కవరేజీని వర్తింపజేస్తారు. అర్హులైన ఎగుమతిదారులకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ) అదనంగా రూ.20,000 కోట్ల మేర రుణ సౌకర్యం కల్పించబోతున్నారు. -
ఢిల్లీ పేలుడు ఘటన ఉగ్రవాదుల చర్యే: కేంద్రం
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ పేలుడు ఘటన ఉగ్రవాదుల చర్యేనని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీ పేలుడు ఘటనను కేంద్ర కేబినెట్ ఖండించింది. రెండు నిమిషాలు మౌనం పాటించిన కేబినెట్.. మృతులకు సంతాపం తెలిపింది. ఉగ్రవాదంపై పోరు కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఉగ్రవాదాన్నిపై జీరో టోలరెన్స్ విధానంతో అణిచివేస్తామని కేబినెట్ వెల్లడించింది. ఘటనకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టి.. శిక్షిస్తామని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.ఢిల్లీ పేలుడు నేపథ్యంలో కేబినెట్ సమావేశంతో పాటు కేంద్ర భద్రతా మండలి సమావేశమైంది. ఈ సమావేశంలో ఎర్రకోట పేలుళ్లు,ఉగ్రవాద నిర్మూలనపై ప్రత్యేక చర్చ జరిగింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కారు పేలుడు ఘటనలో తదుపరి కార్యచరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా దౌత్యపరంగా తీసుకోవాల్సిన చర్యలు, అంతర్గత భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు, కేంద్ర మంత్రివర్గంలో చర్చి జరిగినట్లు తెలుస్తోంది.పలు కీలక నిర్ణయాలు..కాగా, ఎగుమతుల ప్రమోషన్ మిషన్ బలోపేతానికి 25,060 కోట్ల రూపాయల కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తుల ఎగుమతులకు ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఈ మిషన్ కింద రెండు పథకాలను కేంద్రం నిర్వహించనుంది. నిర్యాత్ ప్రోత్సాహన్, నిర్యాత్ దిశ కొత్త పథకాలను కేంద్రం అమలు చేయనుంది. ఎగుమతి దారులకు 100 శాతం క్రెడిట్ గ్యారెంటీ స్కీం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 20,000 కోట్ల రూపాయల వరకు ఎలాంటి హామీ లేకుండా ఎగుమతి దారులకు ప్రభుత్వం.. క్రెడిట్ సపోర్ట్ ఇవ్వనుంది.ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. లాల్ ఖిలా మెట్రోస్టేషన్ ఒకటో నంబర్ గేటు సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో ఆగిన హ్యుందాయ్ ఐ20 కారులో జరిగిన భారీ పేలుడు ధాటికి కారులోని ముగ్గురు సహా మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. పక్కన ఉన్న ఆరు కార్లు, రెండు ఇ–రిక్షాలు, ఆటోలు సైతం తీవ్రస్థాయిలో ధ్వంసమయ్యాయి. దీంతో మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ హుటాహుటిన సమీపంలోని లోక్నాయక్ జయప్రకాశ్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంటుంది. పేలుడు ధాటికి సమీప మార్కెట్లోని ప్రజలు, రోడ్లమీద ఉన్న వ్యక్తులు ప్రాణభయంతో పరుగులుతీశారు. తీవ్రస్థాయి పేలుడు కారణంగా మృతదేహాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో అక్కడ భీతావహవాతావరణం నెలకొంది. మంటలు, హాహాకారా లు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీ సమీప ఫరీదాబాద్లో 2,900 కేజీల పేలుడు పదార్థాలను జమ్మూకశ్మీర్, హరియాణా, యూపీ పోలీసుల బృందం స్వాదీనంచేసుకున్న కొన్ని గంటలకే ఢిల్లీలో భారీ పేలుడు సంభవించడం యాధృచ్ఛికం కాదని దర్యాప్తు వర్గాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం సరిగ్గా సాయంత్రం 6 గంటల 52 నిమిషాలకు లాల్ఖిలా మెట్రోస్టేషన్ ఎదురుగా ఉన్న సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఎర్రలైట్ పడటంతో కొన్ని వాహనాలు ఆగాయి. అదే సమయంలో ఐ20 మోడల్ కారు వెనుకభాగం ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో పక్కనే ఉన్న ఛాందిని చౌక్ మార్కెట్లోని జనం భయంతో పరుగులు తీశారు. పేలుడు ధాటికి సమీప వాహనాలు సైతం మంటల్లో కాలిపోయాయని ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీశ్ గోల్చా మీడియాతో చెప్పారు. ఘటనపై మంత్రి అమిత్ షాతో మాట్లాడారు. ఘటన వివరాలను ప్రధాని మోదీ అమిత్షాను అడిగి తెల్సుకున్నారు. -
New Delhi: పేలుడు ఘటన బాధితులను పరామర్శించిన మోదీ
-
గుడ్ న్యూస్ : ధ్వజారోహణం వేడుకకు సిద్ధమవుతున్న అయోధ్య
లక్నో: ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రామ భక్తులకు గుడ్ న్యూస్. ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో రామ జన్మభూమి ఆలయంలో 'ధ్వజారోహణం' వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ 25న జరగనున్న ధ్వజారోహణం వేడుకకు పవిత్ర నగరం ముస్తాబవుతోంది.అయితే అయోధ్య రామ మందిరంలో నవంబర్ 24వ తేదీ సాయంత్రం నుంచి రెండు రోజుల పాటు భక్తులకు దర్శనం నిలిపి వేస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. వివాహ పంచమి సందర్భంగా నవంబర్ 25న జరిగే ధ్వజారోహణ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. నిర్మాణ పనులు, భద్రతా కారణాల దృష్ట్యా అతిథుల సంఖ్యను పరిమితం చేసినప్పటికీ.. ఉత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా నవంబర్ 24వ తేదీ సాయంత్రం నుంచి రెండు రోజుల పాటు భక్తులకు దర్శనం నిలిపివేస్తున్నామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. నవంబర్ 26న ఉదయం 7 గంటలకు దర్శనాలు పునఃప్రారంభం అవుతాయి.వివాహ పంచమి -ధ్వజారోహణంనవంబర్ 25 సీతారాముల వాహాన్ని జరుపుకునే పండుగ వివాహ పంచమితో సమానమని తెలిపారు. ఈ చారిత్రక ధ్వజారోహణను రాముచంద్రుడు, సీతమ్మల దివ్య వివాహానికి గుర్తుగా ఈ వేడుకను నిర్వహించ నున్నారు. ఈ సందర్భంగా 190 అడుగుల ఎత్తులో త్రిభుజ ఆకారంలోని జెండాను ఎగురవేయనున్నారు. ఈ మహోత్తర కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.ప్రధాని మోదీ ఆలయంలోని ప్రధాన శిఖరంపై కాషాయ జెండాను ఎగురవేస్తారని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారులు మంగళవారం తెలిపారు. ఆలయంలోని ఏడు శిఖరాలను కాషాయ జెండాలతో అలంకరించడం ఇదే తొలిసారి అని ఆయన చెప్పారు. ఈ వేడుకకు దాదాపు 6,000 మంది ఆహ్వానిత అతిథులు హాజరవుతారని ఆలయ ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఆలయ ప్రవేశం ఉదయం 8 గంటలకు తెరిచి 9 గంటలకు ముగుస్తుంది, మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమం ముగుస్తుంది. ఆ రోజు సాధారణ ప్రజలకు సాధారణ దర్శనం నిలిపివేయనున్నారు.కాషాయ జెండా 22 అడుగుల - 11 అడుగుల కొలతలు కలిగిన ప్రత్యేక కాషాయ జెండాను మన్నికైన పారాచూట్ ఫాబ్రిక్ , పట్టు దారాలను ఉపయోగించి తయారు చేశారు. ప్రధాన శిఖరం పైన అమర్చబడిన 42 అడుగుల స్తంభంపై 360 డిగ్రీల భ్రమణ యంత్రాంగం ద్వారా దీనిని అమర్చుతారు. అయోధ్య అంతటా భారీ సన్నాహాలునగరం అంతటా విస్తృత సన్నాహాలు జరుగుతున్నాయి. సీనియర్ రాష్ట్ర అధికారులు , ఆలయ ట్రస్ట్ సభ్యులు అయోధ్యలో ఉండి, ఏర్పాట్లను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం (PMO), ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) కూడా ప్రతి అభివృద్ధిని నిజ సమయంలో పర్యవేక్షిస్తున్నాయి. ఈ కార్యక్రమం ప్రధాన టెలివిజన్ నెట్వర్క్లు , డిజిటల్ ప్లాట్ఫామ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.ఆలయ సముదాయం లోపల భక్తుల కోసం 200 అడుగుల LED స్క్రీన్ను, ప్రజల వీక్షణ కోసం నగరం అంతటా 30కి పైగా పెద్ద స్క్రీన్లు ఉంచబోతున్నారు. పెద్ద సంఖ్యలో అతిథులకు ఆతిథ్యం ఇవ్వడానికి, అయోధ్య , సమీప కరసేవక్పురం, రామసేవక్పురం, తీర్థ క్షేత్రపురంలో 1,600 గదులు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.అయోధ్యను కాషాయ జెండాలు, పూల దండలు, లైటింగ్తో సర్వాగ సుందరంగా ముస్తాబైంది. పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ నవంబర్ 21-25 మధ్య రామకథ పారాయణాలు, భక్తి పాటలు ,ప్రఖ్యాత కళాకారులచే జానపద శాస్త్రీయ ప్రదర్శనలు, ర్యాలీలు లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలుంటాయి. మునిసిపల్ కార్పొరేషన్ రోడ్లను మరమ్మతు చేయడం, ఘాట్లకు తిరిగి రంగులు వేయడం మరియు చెట్లను నాటడం వంటి సుందరీకరణ డ్రైవ్కు నాయకత్వం వహిస్తోంది. ఇంతలో, రాముడి వివాహాన్ని వర్ణించే రంగురంగుల రామ్ బరాత్ ఊరేగింపులు నవంబర్ 25 సాయంత్రం 4 గంటల తర్వాత అనేక ప్రాంతాలలో జరుగుతాయి. -
ముష్కరులకు శిక్ష తప్పదు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఎర్రకోట వద్ద పేలుడుకు పాల్పడి, సామాన్య ప్రజల ప్రాణాలను బలితీసుకున్న ముష్కరులను కచ్చితంగా శిక్షించి తీరుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఈ ఘటన వెనుక ఉన్న కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టడం తథ్యమని తేల్చిచెప్పారు. పేలుడులో గాయపడి ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ప్రధాని మోదీ బుధవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులంతా త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రారి్థస్తున్నట్లు చెప్పారు. ఎవరూ అధైర్య పడొద్దని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. Went to LNJP Hospital and met those injured during the blast in Delhi. Praying for everyone’s quick recovery. Those behind the conspiracy will be brought to justice! pic.twitter.com/HfgKs8yeVp— Narendra Modi (@narendramodi) November 12, 2025భూటాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న మోదీ నేరుగా ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి వచ్చారు. దాదాపు 25 నిమిషాలపాటు ఆసుపత్రిలోనే ఉన్నారు. అధికారులతో, డాక్టర్లతో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కారు బాంబు పేలుడు పట్ల మోదీ ఇప్పటికే దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దర్యాప్తు అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వివరాలు తెలుసుకుంటున్నానని మంగళవారం వెల్లడించారు. -
నేడు కేంద్ర కేబినెట్ భేటీ
సాక్షి, ఢిల్లీ: నేడు(బుధవారం) సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం జరగనుంది. ఎర్రకోట కారు బాంబు పేలుడు ఘటనపై సీసీఎస్ చర్చించనున్నారు. -
ప్రధాని మోదీ బయోపిక్.. తల్లి పాత్రలో స్టార్ హీరోయిన్
భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్బంగా ఆయన జీవిత కథతో ‘మా వందే’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తుంది. మోదీ పాత్రను మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ పోషించనున్నారని ఇప్పటికే ప్రకటించారు. వీర్రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు దర్శకుడు క్రాంతికుమార్ తెరకెక్కిస్తున్నారు. అయితే, ఇందులో మోదీ అమ్మగారి పాత్రలో ఒక స్టార్ హీరోయిన్ నటిస్తున్నారు.ప్రధాని మోదీకి తన అమ్మగారు హీరాబెన్ అంటే చాలా ఇష్టం. రాజకీయంగా, ప్రధానిగా ఆయన ఎంత బిజీగా ఉన్నా సరే తన పుట్టినరోజును మాత్రం అమ్మ వద్దే జరుపుకునే వారు. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న బయోపిక్ కూడా ఎక్కువగా మదర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ స్టోరీతోనే రానుంది. ఈ సినిమాకు ఎంతో కీలకమైన ఆ పాత్ర కోసం బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ నటిస్తున్నారు. కేజీఎఫ్-2 చిత్రంలో ఆమె భారత ప్రధానిగా, శక్తివంతమైన రమికా సేన్ పాత్రలో నటించారు. మోదీ ఎదుగుదల వెనక ఆయన మాతృమూర్తి హీరాబెన్ ఇచ్చిన ప్రేరణ ఏంటి.. తల్లితో మోదీకి ఉన్న అనుబంధం ప్రేక్షకులకు భావోద్వేగాల్ని పంచనుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈ పాత్రకు రవీనా అయితే న్యాయం చేస్తుందని వారు భావించారు. ఈ సినిమాకి కెమెరామెన్గా కె.కె.సెంథిల్కుమార్, సంగీతం రవి బస్రూర్ అందిస్తున్నారు. -
కుట్రదారులను వదిలిపెట్టం
థింపూ: ఢిల్లీ కారు బాంబు పేలుడు వెనుక ఉన్న కుట్రదారులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిని బంధించి, చట్టం ముందు నిలబెట్టి, కఠినంగా శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలు లోతుగా విచారిస్తున్నాయని, త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వస్తాయని అన్నారు. అమాయక ప్రజలను పొట్టనబెట్టుకున్న ముష్కరులకు తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. ప్రధాని మోదీ మంగళవారం భూటాన్లో పర్యటించారు. భూటాన్ మాజీ రాజు జిగ్మే సింగ్యే వాంగ్చుక్ 70వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.రాజధాని థింపూలోని చాంగ్లీమేథాంగ్ స్టేడియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. భారమైన హృదయంతో థింపూ సిటీకి వచ్చానని చెప్పారు. ఢిల్లీ పేలుడు ఘటనలో సాధారణ ప్రజలు మరణించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాల ఆవేదనను అర్థం చేసుకోగలనని అన్నారు. ఆప్తులను కోల్పోయి దుఃఖసాగరంలో మునిగిపోయారని చెప్పారు. దేశం మొత్తం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సోమవారం రాత్రంతా దర్యాప్తు సంస్థల అధికారులతో మాట్లాడుతూనే ఉన్నానని తెలిపారు. పేలుడు సంబంధించి కీలక ఆధారాలు సేకరిస్తున్నారని వివరించారు. సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని వెల్లడించారు. కుట్రదారులను శిక్షించడం తథ్యమని పునరుద్ఘాటించారు. రాజ్యాంగ ప్రజాస్వామిక రాచరికం భారత్, భూటాన్ మధ్య శతాబ్దాలుగా బలమైన ఆధ్యాతి్మక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని ప్రధాని మోదీ గుర్తుచేశారు. జిగ్మే సింగ్యే వాంగ్చుక్ జన్మదినోత్సవంలో పాల్గొనడం తన విధి అని వ్యాఖ్యానించారు. భారతీయుల తరఫున మాజీ రాజుకు, భూటాన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భూటాన్ అత్యాధునిక దేశంగా ఎదుగుతోందని ప్రశంసించారు. ఇక్కడ రాజ్యాంగ ప్రజాస్వామిక రాచరికం ఉందని అన్నారు. దేశంలో గ్రాస్ నేషనల్ హ్యాపినెస్ అనే వినూత్న విధానం ప్రవేశపెట్టారని కొనియాడారు. జ్ఞానం, నిరాడంబరత, ధైర్యం, నిస్వార్థ సేవ అనే లక్షణాల కలబోతే భూటాన్ రాజు అని శ్లాఘించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను నెలకొల్పడంలో, సరిహద్దుల్లో శాంతిని కాపాడడంలో ఆయన నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారని నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీ బాంబు పేలుడు బాధితుల కోసం చాంగ్లీమేథాంగ్ స్టేడియంలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నమ్గేల్ వాంగ్చుక్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వేలాది మంది భూటాన్ ప్రజలు హాజరయ్యారు. బాధిత కుటుంబాలకు భూటాన్ పాలకులు సంతాపం ప్రకటించారు. సానుభూతి వ్యక్తంచేశారు. భూటాన్కు రూ.4,000 కోట్ల రుణం భూటాన్లో విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల కోసం రూ.4,000 కోట్ల రుణం ఇవ్వనున్నట్లు భారత్ ప్రకటించింది. రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలకు ఇంధన సహకారమే మూలస్తంభమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భూటాన్ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి భారత్ అందిస్తున్న సహకారాన్ని రాజు వాంగ్చుక్ ప్రశంసించారు. పునరుత్పాదక ఇంధనం, ఆరోగ్య సంరక్షణ–ఔషధాలు, మానసిక ఆరోగ్య సేవల రంగంలో సహకారానికి భారత్, భూటాన్ మధ్య మూడు ఒప్పందాలు కుదిరాయి.భూటాన్లోని గెలెఫూ, సామ్త్సేలను భారత్తో రైలు నెట్వర్క్ ద్వారా అనుసంధానించబోతున్నామని మోదీ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే భూటాన్ పారిశ్రామికవేత్తలు, రైతులకు భారత మార్కెట్లు సులువుగా అందుబాటులోకి వస్తాయన్నారు. రెండు దేశాలు కేవలం సరిహద్దులతోనే కాకుండా సంస్కృతులతో అనుసంధానం అవుతున్నాయని గుర్తుచేశారు. భూటాన్ రాజుతో మోదీ భేటీ భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నమ్గేల్ వాంగ్చుక్తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. భారత్, భూటాన్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఇంధనం, అనుసంధానం, టెక్నాలజీ, రక్షణ వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారంపై అభిప్రాయాలు పంచుకున్నారు. రెండు దేశాల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు సైతం జరిగాయి. అనంతరం 1,020 మెగావాట్ల పునత్సాంగ్చు–2 హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టును మోదీ, వాంగ్చుక్ ఉమ్మడిగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును భారత్, భూటాన్ ఉమ్మడిగా అభివృద్ధి చేశాయి. ఈ ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ను రెండు దేశాలూ పంచుకుంటాయి. భూటాన్ అభివృద్ధి ప్రయాణంలో తాము భాగస్వామి కావడం ఆనందంగా ఉందని మోదీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. -
అజిత్ దోవల్ తో మోదీ భేటీ.. టెర్రరిస్టులకు బిగ్ వార్నింగ్
-
ఢిల్లీ పేలుడు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
భుటాన్: ఢిల్లీ పేలుళ్లపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. నిన్న ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనపై స్పందించారు. థింపూలో ఆయన మాట్లాడుతూ.. ఉగ్ర కుట్రలను సహించేది లేదని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఢిల్లీ పేలుళ్ల కుట్ర వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తి లేదు. రాత్రంతా అధికారులు, నిఘా సంస్థలతో మాట్లాడుతూనే ఉన్నాం. బాధితుల దుఃఖాన్ని అర్థం చేసుకుంటా.. దేశం మొత్తం ఢిల్లీ పేలుళ్ల బాధితులకు అండగా ఉంది’’ అని మోదీ పేర్కొన్నారు.‘‘ఈ దాడికి సూత్రధారులను వదిలిపెట్టం. ఢిల్లీ పేలుడు ఘటనలో ఉగ్ర కుట్రమూలాలను గుర్తించాం. వాళ్లను న్యాయ స్థానం ముందు నిలబెడతాం. పేలుళ్లపై అర్థరాత్రి వరకు సమీక్షలు చేశాను. వివరాలు తెలుసుకున్నాను. పేలుళ్ల వెనుక ఉన్నది ఎవరైనా వదిలిపెట్టబోం. ఢిల్లీ పేలుడు ఘటన కలిచి వేసింది. చాలా బాధాకరమైన హృదయంతో భూటాన్కు వచ్చాను’’ అని మోదీ చెప్పారు.రాజ్నాథ్ సింగ్ వార్నింగ్..ఢిల్లీలోని ఎర్రకోట పేలుళ్లకు పాల్పడినవారిని కఠినంగా శిక్షిస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని విడిచిపెట్టం అంటూ రాజ్నాథ్ స్పష్టం చేశారు. దేశంలోని ప్రముఖ దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై వేగంగా సమగ్ర విచారణ జరుపుతున్నాయి. దర్యాప్తు వివరాలను త్వరలోనే ప్రజలకు వెల్లడిస్తాం. పేలుళ్ల ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. దర్యాప్తు కొనసాగుతుందని.. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రశాంతంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
పూడ్చలేని లోటు... అందెశ్రీ అస్తమయంపై మోదీ ట్వీట్
తెలంగాణ రాష్ట్ర ఐకానిక్ గీతం "జయ జయ హే తెలంగాణ" రచయిత, ప్రఖ్యాత కవి అందె శ్రీ (Ande Sri )ఆకస్మిక మరణంపై ప్రధానమంత్ర నరేంద్ర మోదీ ( Narendra Modi) సంతాపం వెలిబుచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు.‘‘అందెశ్రీ మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన, ప్రజల పోరాటాలకు , ఆకాంక్షలకు ,అకుంఠిత స్ఫూర్తికి గొంతుకగా నిలిచారు. ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ఏకం చేసే శక్తి,ప్రజల సాంఘిక హృదయస్పందనకి రూపం ఇచ్చే శక్తి ఉన్నాయి. ఆయన సామాజిక స్పృహను, సాహితీ సౌందర్యంతో మిళితం చేసిన విధానం అద్వితీయం. వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి.’ అంటూ ట్వీట్ చేశారు. (Ande Sri: చివరి కోరిక తీరకుండానే.. వెళ్లిపోయావా ఎల్లన్నా!)అందె శ్రీ మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన, ప్రజల పోరాటాలకు , ఆకాంక్షలకు ,అకుంఠిత స్ఫూర్తికి గొంతుకగా నిలిచారు. ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ఏకం చేసే…— Narendra Modi (@narendramodi) November 10, 2025 కాగా సోమవారం ఉదయం హైదరాబాద్లోని నివాసంలో అనారోగ్యానికి గురైన అందెశ్రీని కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. తెలంగాణకు ఇది విచారకరమైన రోజు అంటూ పలువురు సాహిత్య, సంగీత అభిమానులు సంతాపం తెలిపారు. శక్తివంతమైన మాటల ద్వారా తెలంగాణకు ఆత్మీయ స్వరాన్ని అందించిన కవి అందేశ్రీ మరణం పట్లపై పలువురురాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన రచనలు తరతరాలుగా స్ఫూర్తినిస్తాయంటూ అందెశ్రీ కుటుంబానికి, అభిమానులకు హృదయపూర్వక సంతాపం తెలిపారు. -
వందే మాతరం కంపల్సరీ పాడాల్సిందే!
ఇక నుంచి అన్ని విద్యాసంస్థల్లో జాతీయ గేయం వందేమాతరం ఆలాపన తప్పనిసరి చేస్తూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్వయంగా ఈ ప్రకటన చేశారు. ఈ క్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలే చేశారాయన. లక్నో: సోమవారం ఏక్తా యాత్ర పేరిట గోరఖ్పూర్లో జరిగిన సామూహిక వందేమాతర ఆలాపన కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యానాథ్ పాల్గొని మాట్లాడారు. ఐక్యత, దేశభక్తి భావనను విద్యార్థుల్లో నాటేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారాయన. ‘‘వందే మాతరానికి తగినంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది జరగాలంటే.. ప్రతి విద్యాసంస్థలో దీన్ని తప్పనిసరిగా ఆలపించాలి. దేశభక్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది’’ అని అన్నారాయన. ఈ సందర్భంగా.. వందే మాతరం వ్యతిరేకతపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆల్ ఇండియా ముస్లిం లీగ్ నేతలు మహమ్మద్ అలీ జిన్నా, మహమ్మద్ అలీ జౌహర్ ఈ ఇద్దరూ ఆనాడు వందే మాతరాన్ని వ్యతిరేకించారు.. తీవ్రంగా విమర్శలు గుప్పించారు. 1923లో జౌహర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వందే మాతరం ప్రదర్శించిన సమయంలో సభను వదిలి వెళ్లిపోయారు. ఒకరకంగా.. విభజనకు దారితీసిన కారణాల్లో అది కూడా ఒకటి. విభజన భావనలకు తావు లేకుండా, మరో జిన్నా పుట్టకూడదని ప్రజలు బలంగా కోరుకోవాలి. జాతీయ ఐక్యతను సవాల్ చేయాలనే దుస్సాహం ఎవరూ చేయకూడదు. అలాంటి ఆలోచనను కూకటి వేళ్లతో పెకిలించివేయాలి అని అన్నారాయన. ఈ క్రమంలో ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీకి ఆయన చురకలంటించారు. సమాజ్వాదీ పార్టీకి చెందిన ఓ ఎంపీ జాతీయ గేయానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. వాళ్లు భారత ఐక్యతకు శిల్పి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పట్టించుకోరు. కానీ, జిన్నాను గౌరవించే కార్యక్రమాలకు మాత్రం హాజరవుతుంటారు అని అన్నారాయన. యోగి సర్కార్ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో వందే మాతరం పాడటం తప్పనిసరి. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. వందే మాతరానికి 150 ఏళ్లుబంకిమ్ చంద్ర చట్టోపాధ్యాయ రచించిన ఆనంద్మఠ్ నవలలోని బంగదర్శన్లో వందే మాతరం ఉంది. 1875 నవంబర్ 7వ తేదీన అక్షయ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ గేయాన్ని విడుదల చేశారు. ఆ తర్వాత స్వాతంత్ర్య పోరాటానికి ఈ గేయం ప్రేరణగా నిలిచింది. 150 సంవత్సరాలు పూర్తి కావడంతో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వందే మాతరం ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంలో వందే మాతరం భారత ఐక్యతకు ప్రతీక. ఇది దేశ ప్రజలకు కొత్త శక్తిని, ప్రేరణను ఇస్తుంది అని వ్యాఖ్యానించారు. 2026 నవంబర్ 7 వరకు వందే మాతరం ఉత్సవాలు కొనసాగనున్నాయి. -
ఉత్తరాఖండ్ మార్గంలో నడవాలి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రంలో జనాభా స్థితిగతుల్లో మార్పులు రాకుండా ధైర్యంగా చర్యలు చేపట్టిందని, ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తోందని, చట్టవిదరుద్ధమైన మత మార్పిడులను సమర్థంగా అడ్డుకుంటోందని చెప్పారు. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలు సైతం ఉత్తరాఖండ్ మార్గంలో నడవాలని సూచించారు. యూసీసీ అమలుపై ఉత్తరాఖండ్ చర్యలను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. మత మార్పిడుల నియంత్రణ చట్టం, అల్లర్ల నియంత్రణ చట్టాన్ని నిక్కచ్చిగా అమలు చేస్తోందని తెలిపారు.ఉత్తరాఖండ్ రాష్ట్రం అవతరించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం డెహ్రాడూన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రూ.8,260.72 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల భూములు కబ్జా కాకుండా, జనాభాలో అవాంఛనీయ మార్పులు రాకుండా ఇక్కడి బీజేపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. అభివృద్ధి ప్రయాణంలో అడ్డంకులను తొలగించుకుంటూ ఉత్తరాఖండ్ శరవేగంగా ముందుకు సాగుతోందని హర్షం వ్యక్తంచేశారు. రాష్ట్రం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా మారనుందని అన్నారు.రాష్ట్ర ప్రజలే నాకు స్ఫూర్తి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించారు. ఉత్తరాఖండ్తో తనకు గొప్ప అనుబంధం ఉందన్నారు. కొండలపై ప్రతికూల వాతావరణంలో జీవిస్తూ కష్టపడి పనిచేసే ఇక్కడి ప్రజలు తనకు నిత్యం స్ఫూర్తినిస్తుంటారని చెప్పారు. ఈ దశాబ్దం ఉత్తరాఖండ్దేనని తేల్చిచెప్పారు. రాష్ట్రం బలం ఆధ్యాత్మిక శక్తిలోనే ఉందన్నారు. గత 25 ఏళ్లలో అనూహ్యమైన ప్రగతి సాధించిందని కొనియాడారు.విద్య, పర్యాటకం, ఆరోగ్యం, ఇంధనం, గ్రామీణాభివృద్ధి వంటి రంగాల్లో ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తోందని తెలిపారు. 25 ఏళ్ల క్రితం రాష్ట్రం బడ్జెట్ రూ.4,000 కోట్లు మాత్రమేనని, ఇప్పుడు రూ.లక్ష కోట్లకు చేరిందని స్పష్టంచేశారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలని, అందుకోసం ప్రజలంతా ఉమ్మడిగా కృషి చేయాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉత్తరాఖండ్లోని ఆలయాలు, ఆశ్రమాలు, ధ్యాన కేంద్రాలు, యోగా కేంద్రాలను గ్లోబల్ నెట్వర్క్తో అనుసంధానిస్తామని చెప్పారు. -
11న భూటాన్కు ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత్- హిమాలయ దేశం భూటాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 11, 12 తేదీలలో రెండు రోజుల పాటు భూటాన్లో పర్యటించనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గ్యేల్ వాంగ్చుక్ను కలుసుకుంటారు. ఇద్దరు నేతలు సంయుక్తంగా భారత్- భూటాన్ మధ్య నిర్మించిన 1020 ఎండబ్ల్యూ పునత్సంగ్చు -II జలవిద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ తన భూటాన్ పర్యటనలో భాగంగా అక్కడి ప్రస్తుత చక్రవర్తి తండ్రి, నాల్గవ రాజు జిగ్మే సింగే వాంగ్చుక్ 70వ జయంతి కార్యక్రమాలలో పాల్గొంటారు. అలాగే భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేతో చర్చలు జరపనున్నారు. థింఫులోని తాషిచోడ్జోంగ్లోని బుద్ధుని పవిత్ర అవశేషాల వద్ద ప్రధాని మోదీ ప్రార్థనలు చేయనున్నారు. అలాగే భూటాన్ రాయల్ ప్రభుత్వం నిర్వహించే ప్రపంచ శాంతి ప్రార్థన ఉత్సవంలో పాల్గొననున్నారు.ప్రభుత్వ అధికారిక ప్రకటన ప్రకారం ప్రధాని మోదీ పర్యటన ఇరుదేశాల ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపరచడానికి, బలోపేతం చేయడానికి, పరస్పర ప్రాంతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. కాగా భారతదేశానికి చెందిన పలువురు ఆధ్యాత్మిక గురువులు భూటాన్లో పర్యటించి, అక్కడ స్థిరపడ్డారు. కాగా ప్రధాని మోదీ దీనికిముందు 2024, మార్చిలో భూటాన్ను సందర్శించారు. అప్పుడు భూటాన్ అత్యున్నత పౌర గౌరవం అయిన ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్పోను అందుకున్నారు. ఇది కూడా చదవండి: ‘పంజాబ్ సర్వ నాశనం’: సీఎం సంచలన వ్యాఖలు -
సులభతర న్యాయంతో సామాజిక న్యాయం
న్యూఢిల్లీ: అందరికీ అర్థమయ్యేలా న్యాయశాస్త్రం భాషను సులభతరంగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. స్థానిక భాషలోనే న్యాయశాస్త్రం అందుబాటులోకి వస్తే ప్రజలకు ఎనలేని మేలు జరుగుతుందని చెప్పారు. ప్రజలందరికీ న్యాయం సులభంగా అందే సౌలభ్యం ఉండాలని పేర్కొ న్నారు. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా న్యాయం సమానంగా, సులువుగా అందుబాటులోకి రావాలన్నారు.శనివారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో ‘న్యాయ సహాయ వ్యవస్థల బలోపేతం’ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడారు.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్, తదుపరి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్తోపాటు సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో సామాజిక న్యాయ సాధనకు సులభతర న్యాయం అత్యంత కీలకమని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. కోర్టు తీర్పులను, న్యాయ సంబంధిత పత్రాలను స్థానిక భాషల్లో తీసుకురావాలని కోరారు. ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఎంతో కృషి చేస్తోందని ప్రశంసించారు. స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇస్తూ సుప్రీంకోర్టు ప్రారంభించిన చర్యలను ఆయన గుర్తుచేశారు. 80 వేలకుపైగా తీర్పులను 18 భారతీయ భాషల్లోకి అనువదిస్తోందని తెలియజేశారు. ఈ గొప్ప ప్రయత్నం హైకోర్టులు, జిల్లా స్థాయి కోర్టుల్లోనూ జరగాలని ఆకాంక్షించారు. మాతృభాషలో చట్టంతో లబ్ధిన్యాయం అనేది సమాజంలో కొందరికే పరిమితం కాకూడదని, అది అందరికీ అందాలని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. పేదలకు, అణగారిన వర్గాలకు సులభంగా న్యాయం దక్కడంలో ప్రభుత్వ న్యాయ సహాయ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని మోదీ తెలిపారు. న్యాయాన్ని ప్రతి పౌరుడికీ చేర్చడమే మన లక్ష్యం కావాలని సూచించారు. సులభతర న్యాయాన్ని మరింత మెరుగుపర్చడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని, ఇకపై ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయనుందని ఉద్ఘాటించారు. కక్షిదారులకు అర్థమయ్యే భాషలో తీర్పులివ్వాలని, న్యాయాన్ని చేకూర్చాలని చెప్పారు.చట్టాలను రూపొందించే సమయంలో ఈ విషయాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ప్రజలకు వారి మాతృభాషలో చట్టం గురించి తెలిస్తే వివాదాలు చాలావరకు తగ్గిపోతాయని స్పష్టంచేశారు. ప్రతి ఒక్కరికీ న్యాయం అందుబాటులో ఉంటే.. నిర్దిష్ట గడువులోగా న్యాయం సులభంగా అందితే.. సామాజిక న్యాయానికి అదే బలమైన పునాది అవుతుందని తేలి్చచెప్పారు. న్యాయ విభాగంలో టెక్నాలజీ ప్రాధాన్యతను ప్రస్తావించారు. ఈ–కోర్టుల ప్రాజెక్టుతో సత్ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. కాలం చెల్లిన చట్టాలను రద్దుచేశాం సులభతర వాణిజ్యం, సులభతర జీవనాన్ని పెంపొందించడంపై తమ ప్రభుత్వం గత 11 ఏళ్లుగా ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని ప్రధాని మోదీ వివరించారు. అవసరంలేని 40 వేలకుపైగా నియమ నిబంధనలను రద్దు చేశామని తెలిపారు. జన విశ్వాస్ చట్టం ద్వారా 3,400కుపైగా న్యాయ వ్యవహారాలను నేరరహితం(డిక్రిమనలైజ్) చేశామన్నారు. అలాగే కాలం చెల్లిన 1,500 చట్టాలను రద్దు చేశామని గుర్తుచేశారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న చట్టాల్లో మార్పులు చేసి భారతీయ న్యాయ సంహితను తీసుకొచ్చామని వెల్లడించారు. మధ్యవర్తిత్వంతో వివాదాలు సులువుగా పరిష్కారం అవుతాయని సూచించారు. మూడేళ్లలో 8 లక్షల వివాదాలు పరిష్కారం నేషనల్ లీగల్ సరీ్వసెస్ అథారిటీ(నల్సా) ఏర్పాటై 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ సంస్థ ఆధ్వర్యంలో కమ్యూనిటీ మధ్యవర్తిత్వంపై ఏర్పాటు చేసిన నూతన శిక్షణా విధానాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. వివాదాలను పరిష్కరించడానికి, లిటిగేషన్లు తగ్గించడానికి, సమాజంలో శాంతి సామరస్యం నెలకొల్పడానికి అవసరమైన వనరులను ఈ శిక్షణ అందిస్తుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్లు, ప్రి–లిటిగేషన్ సెటిల్మెంట్లతో లక్షలాది వివాదాలు వేగంగా పరిష్కారం అవుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం ప్రారంభించిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్తో కేవలం మూడేళ్లలో 8 లక్షలకుపైగా వివాదాలు పరిష్కారానికి నోచుకున్నాయని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. -
మౌలిక సదుపాయాలతోనే దేశాభివృద్ధి
వారణాసి: ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక ప్రగతికి మౌలిక సదుపాయాలే అత్యధికంగా దోహదం చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మన దేశం ప్రగతి పథంలో అత్యధిక వేగంతో దూసుకెళ్తోందని అన్నారు. ప్రధాని మోదీ శనివారం సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. బనారస్ రైల్వే స్టేషన్లో నాలుగు నూతన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకుంటే దేశం వేగంగా ప్రగతి సాధిస్తుందని స్పష్టంచేశారు. మౌలిక సుదుపాయాలు అంటే కేవలం రోడ్లు, వంతెనలు మాత్రమే కాదన్నారు. ఒక ప్రాంతంలో అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధికి తోడ్పాటునందించే వ్యవస్థనే మౌలిక సదుపాయాలు అంటారని వివరించారు. విదేశీయులు ఆశ్చర్యపోతున్నారు ‘‘వందేభారత్ రైళ్లు దేశమంతటా పరు గులు తీస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి విమానాలు మన దేశానికి రాకపోకలు సాగిస్తున్నాయి. కొత్తతరం భారతీయ రైల్వేకు వందేభారత్, నమోభారత్, అమృత్ భారత్ వంటి రైళ్లు పునాదిగా నిలుస్తున్నాయి. మన అభివృద్ధి ప్రయాణం వేగం పుంజుకుంది. వందేభా రత్ అంటే భారతీయుల కోసం భారతీయు లు రూపొందించుకున్న రైళ్లు. ఇవి ప్రతి ఒక్కరికీ గర్వకారణం. వందేభారత్ రైళ్లను చూసి విదేశీయులు కూడా ఆశ్చర్యపోతు న్నారు. మన వనరులను మెరుగుపర్చు కోవడంలో ఈ రైళ్లు మైలురాయి లాంటివి. దేశమంతటా 160కిపైగా వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తుండడం సంతోషంగా ఉంది. ‘వికసిత్ కాశీ’ నుంచి ‘వికసిత్ భారత్’ ఉత్తరప్రదేశ్లో ఆధ్యాత్మక పర్యాటకం నానాటికీ ఊపందుకుంటోంది. దేశ విదే శాల నుంచి పర్యాటకులు తరలివస్తు న్నారు. దీనివల్ల ప్రభుత్వానికి రూ.వేల కోట్ల ఆదాయం లభిస్తోంది. పుణ్యక్షేత్రాల సందర్శన మన సంస్కృతిలో భాగం. ఆధ్యాత్మిక యాత్రలు దేశ ఆత్మను అనుసంధానిస్తాయి. ప్రయాగ్రాజ్, అయోధ్య, హరిద్వార్, చిత్రకూట్, కురుక్షేత్ర వంటి పుణ్యస్థలాలు మన ఆధ్యాత్మిక విశ్వాసానికి కేంద్ర స్థానాలు. వందేభారత్ రైళ్ల రాకతో మన పుణ్యక్షేత్రాల మధ్య అనుసంధానం ఏర్పడింది. కాశీ విశ్వనాథుడిని గతేడాది 11 కోట్ల మందికిపైగా భక్తులు దర్శించుకు న్నారు.అయోధ్యలో రామమందిర నిర్మా ణం తర్వాత 6 కోట్ల మంది వచ్చారు. శ్రీరా ముడి ఆశీస్సులు స్వీకరించారు. భక్తుల రాకవల్ల ప్రభుత్వానికి ఆదాయంతోపాటు స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రధానంగా యువతకు లబ్ధి చేకూరుతోంది. ‘వికసిత్ కాశీ’ నుంచి ‘వికసిత్ భారత్’ కలను నెరవేర్చడానికి ఇక్కడ మరిన్ని ప్రాజెక్టులు ప్రారంభిస్తాం’’ అని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. వందేభారత్ రైళ్ల ప్రారంభోత్సవంలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కొత్త రైళ్లు బనారస్ –ఖజురహో, లక్నో–శహరాన్పూర్, ఫిరోజ్ పూర్–ఢిల్లీ, ఎర్నాకుళం–బెంగళూరు మధ్య ప్రయాణిస్తాయి. కాశీ పిల్లలు నాకు గర్వకారణంవారణాసిలో వందేభారత్ రైళ్లు ప్రారంభించిన అనంతరం ఓ రైలులో చిన్నారులతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. కొందరు పిల్లలు పద్యాలు, కవితలు చదివి వినిపించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తంచేశారు. ‘వికసిత్ కాశీ, వికసిత్ భారత్, సురక్షిత భారత్’పై కవితల రూపంలో తమ భావాలు పంచుకున్న చిన్నారులను అభినందించారు. నైపుణ్యం కలిగిన కాశీ చిన్నారులను చూసి స్థానిక ఎంపీగా ఎంతగానో గర్విస్తున్నానని చెప్పారు. దేశవ్యాప్తంగా జరిగే కవి సమ్మేళనాలకు ఇక్కడి పిల్లలను తీసుకెళ్లే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. పిల్లలతో కవి సమ్మేళనాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. వందేభారత్ రైళ్లు ప్రారంభించినప్పుడు పిల్లలకు వేర్వేరు అంశాలపై పోటీలు నిర్వహించాలని సూచించారు. దేశ అభివృద్ధి, వందేభారత్ రైళ్లు, అభివృద్ధి చెందిన భారత్కు సంబంధించిన ఊహాచిత్రాలు, పద్యాలపై ఈ పోటీలు ఉండాలన్నారు. -
ట్రంప్ రాడా?.. అయితే మోదీ కచ్చితంగా వెళ్తారు
దక్షిణాఫ్రికాలో జరగబోయే టీ20 సదస్సును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిష్కరించారు. తాను మాత్రమే కాదు.. అమెరికా తరఫున ప్రతినిధులెవరూ ఆ సదస్సుకు హాజరు కాబోరని స్పష్టం చేశారాయన. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను నవంబర్ 22-23 తేదీల్లో సౌతాఫ్రికాలో జరగబోయే జీ20 సదస్సును బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. కాబట్టి తనను తాను విశ్వగురుగా ప్రకటించుకున్న వ్యక్తి కచ్చితంగా ఆ సదస్సుకు వెళ్లి తీరతారు అంటూ మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ శనివారం ఓ ట్వీట్ చేశారు.ఇక.. 2014లో మోదీ ప్రధానిగా తొలిసారి ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటిదాకా జీ20 సదస్సులన్నింటికీ హాజరవుతూ వస్తున్నారు మోదీ. బ్రిస్బేన్, అంటాల్యా, హాంగ్జౌ, హాంబర్గ్, బ్యూనస్ ఎయిర్స్, ఓసాకా, రియాద్ (కరోనా కారణంగా వర్చువల్), రోమ్, బాలి, న్యూఢిల్లీల్లో జరిగిన జీ20 సదస్సుల్లో పాల్గొన్నారు. అయితే.. ట్రంప్ నేపథ్యంతో మోదీని ఇలా జైరాం టార్గెట్ చేయడం తొలిసారేం కాదు. భారత్పై ట్రంప్ సుంకాల మోత మోగించాక.. ఈ ఇరు దేశాధినేతలు ఎదురుపడింది లేదు. మొన్నీమధ్యే కౌలాలంపూర్(మలేషియా)లో జరిగిన ఏషియన్ సదస్సు మోదీ గైర్హాజరు కావడాన్ని తీవ్రంగా తప్పుబట్టారాయన. రష్యా చమురు వాణిజ్యంపై ట్రంప్ అభ్యంతరాలు, అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ట్రంప్కు ఎదురు పడడం ఇష్టం లేకనే మోదీ హాజరు కాలేదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఎద్దేవా చేశారు. అయితే.. అక్టోబర్ 26-28 తేదీల నడుమ కౌలాలంపూర్ వేదికగా ఏషియన్ సదస్సు జరిగింది. దీపావళి పండుగ నేపథ్యంతో ఈ సదస్సుకు మోదీ హాజరు కాలేకపోయారు. వర్చువల్గా హాజరై ప్రసంగించారు. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యక్షంగా హాజరయ్యారు. అయితే.. ఏషియన్ సదస్సుకు అనుబంధంగా జరిగిన ఈస్ట్ ఏషియా సదస్సుకు మాత్రం భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరై ప్రసంగించారు. అంతకు ముందు.. అక్టోబర్ 13వ తేదీన ఈజిప్ట్ నగరం శర్మ ఎల్ షేక్లో జరిగిన గాజా శాంతి సదస్సుకు కూడా మోదీ గైర్హాజరయ్యారు. చివరి నిమిషంలో ఆహ్వానం అందినందువల్ల రాలేకపోతున్నాంటూ వివరణ ఇచ్చారు. అంతేకాదు.. తన తరపున ప్రత్యేక ప్రతినిధిగా విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్దన్ సింగ్తో సందేశాన్ని పంపించారు. ఈ సదస్సు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసీ ఆధ్వర్యంలో జరిగిందన్నది తెలిసే ఉంటుంది. ఇదే వేదికగా ట్రంప్పై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రశంసలు గుప్పిస్తూ.. భారత్-పాక్ యుద్ధాన్ని ఆపారంటూ ప్రకటించారు కూడా. ట్రంప్ ఆరోపణలపై సౌతాఫ్రికా స్పందనఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణాఫ్రికాపై చాలాకాలంగానే సంచలన ఆరోపణలు చేస్తున్నారు. రెండోసారి అధ్యక్షుడైన కొన్నిరోజులకు.. ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోసాను వైట్హౌజ్కు రప్పించుకుని మరీ శ్వేత జాతీయుల్ని ఊచకోత కోస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడేమో.. ఆ దేశంలో ఉన్న తెల్లజాతీయుల్ని నల్లజాతీయుల్ని హత్యలు చేస్తూ.. వాళ్ల భూములు, పొలాలు లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో దక్షిణాఫ్రికాలో జీ20 సదస్సు నిర్వహించడం సిగ్గుచేటు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఈ తరుణంలో 2026లో ఫ్లోరిడాలోని మియామీలో జీ20 సదస్సుకు తాను ఆతిథ్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే.. ట్రంప్ ఆరోపణలను దక్షిణాఫ్రికా ప్రభుత్వం కొట్టిపారేసింది. తమ దేశంలో వర్ణవివక్ష పాలన ముగిసిన తర్వాత కూడా శ్వేత జాతీయులు ఆఫ్రికన్ల కంటే మెరుగైన పరిస్థితుల్లోనే జీవిస్తున్నారంటూ చెబుతోంది. దక్షిణాఫ్రికాలో 1948 నుంచి 1994 వరకు వర్ణవివక్ష విధానం కొనసాగింది. తెల్లవాళ్లకు (white minority) అధిక హక్కులు, అధికారం ఉండేది. నల్లజాతీయులు (Black majority) సొంతగడ్డపైనే వివక్షను ఎదుర్కొనేవారు. 1994లో నెల్సన్ మండేలా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. ఈ వివక్షకు ఫుల్స్టాప్ పడి సమానత్వం మొదలైంది. -
బీహార్ లో గెలిచేశాం.. ఇక తుపాకులు ఉండవు
-
మేం ల్యాప్ టాప్స్ ఇస్తే.. వారు గన్స్ ఇస్తున్నారు: మోదీ
సీతామర్హి: ‘‘మేం ల్యాప్ టాప్స్ ఇస్తే.. వారు గన్స్ ఇస్తున్నారు.. బిహార్కు తుపాకుల ప్రభుత్వం అక్కర్లేదు’’ అంటూ ఆర్జేడీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బిహార్లోని సీతామర్హిలో శనివారం.. ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ.. బీహార్కు స్టార్టప్లు అవసరం.. 'హ్యాండ్స్ అప్' గ్యాంగ్ కాదంటూ విమర్శలు గుప్పించారు.ఆర్జేడీ, ఇతర ప్రతిపక్ష పార్టీల టార్గెట్గా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ప్రధాని మోదీ.. రాష్ట్ర యువతను గూండాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఎన్డీఏ యువతకు కంప్యూటర్లు, క్రీడా సామగ్రి అందిస్తుండగా.. ఆర్జేడీ మాత్రం తుపాకులు ఇవ్వాలనుకుంటోందంటూ మండిపడ్డారు.ఇవాళ్టి నాయకులు తమ పిల్లలను ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెలేలు చేయాలనుకుంటున్నారు. కానీ మీ పిల్లలను మాత్రం గూండాలుగా తయారు చేయాలనుకుంటున్నారు. బీహార్ దీన్ని ఎప్పటికీ అంగీకరించదు. జంగిల్ రాజ్ అంటే ‘తుపాకులు, క్రూరత్వం, అవినీతి, శత్రుత్వం’గా మోదీ అభివర్ణించారు. బిహార్లో నవంబర్ 11న రెండవ దశ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ విమర్శల దాడి మరింత పెంచారు. ఆర్జేడీ ప్రచార గీతాలు, నినాదాలు వినగానే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. ఆ పార్టీ నాయకుల ప్రచారంలో బీహార్ పిల్లల కోసం వారు ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్జేడీ వేదికలపై అమాయక పిల్లలను గ్యాంగ్స్టర్లుగా మారాలనుకుంటున్నట్లు చెప్పిస్తున్నారు’’ అంటూ మోదీ ఆరోపించారు. -
అద్వానీ @ 98.. శుభాకాంక్షల వెల్లువ
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్కె అద్వానీ ఈరోజు (శనివారం) తన 98వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆయన పలువురు రాజకీయ నేతలు, ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు అందుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘అత్యున్నత దృష్టి, తెలివితేటలతో ఆశీర్వాదం పొందిన రాజనీతిజ్ఞుడు’ అని ఆయనను అభివర్ణించారు. Greetings to Shri LK Advani Ji on his birthday. A statesman blessed with towering vision and intellect, Advani Ji’s life has been dedicated to strengthening India’s progress. He has always embodied the spirit of selfless duty and steadfast principles. His contributions have left…— Narendra Modi (@narendramodi) November 8, 2025కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన లక్షలాది పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తిదాయకులని అభివర్ణించారు. ఆయన పార్టీని గ్రామాల నుండి నగరాల వరకు బలోపేతం చేశారని,హోంమంత్రిగా భారతదేశ భద్రతను బలోపేతం చేశారని అమిత్ షా కొనియాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. లాల్ కృష్ణ అద్వానీ తన జీవితాన్ని సమగ్రత, దేశభక్తికి అంకితం చేశారన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. అద్వానీని బీజేపీ కుటుంబానికి మార్గదర్శక శక్తిగా ప్రశంసించారు.రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. ఆయన జీవితం సమగ్రత, దృఢ నిశ్చయం, నిస్వార్థ సేవకు నిజమైన ప్రతిబింబం అని అన్నారు. 1980లో జనతా పార్టీ రద్దు తర్వాత, అద్వానీ మరో నేత అటల్ బిహారీ వాజ్పేయితో కలిసి బీజేపీని స్థాపించారు. 2002 నుండి 2004 వరకు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో అద్వానీ భారత ఉప ప్రధానిగా పనిచేశారు. 1990లో రామ జన్మభూమి ఉద్యమం సందర్భంగా రథయాత్రకు అద్వానీ నాయకత్వం వహించారు.ఇది కూడా చదవండి: 9న ‘బీఎస్ఎఫ్’ సాహస యాత్ర -
నాలుగు ‘వందే భారత్’లకు ప్రధాని మోదీ పచ్చజెండా
వారణాసి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గం అయిన ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుండి శనివారం నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్లలో బనారస్-ఖజురహో, లక్నో-సహరన్పూర్, ఫిరోజ్పూర్-ఢిల్లీ, ఎర్నాకులం-బెంగళూరు ఉన్నాయి. #WATCH | Varanasi, UP | PM Narendra Modi flags off four new Vande Bharat Express trains from Banaras Railway Station The new Vande Bharat Express trains will operate on the Banaras–Khajuraho, Lucknow–Saharanpur, Firozpur–Delhi, and Ernakulam–Bengaluru routes(Source: DD) pic.twitter.com/2GfI45aVGt— ANI (@ANI) November 8, 2025ఈ ప్రారంభోత్సవం తర్వాత జరిగిన ప్రజా ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఈ వందే భారత్ రైళ్లు ప్రజలకు కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తాయని, అధిక సౌకర్యాలను అందిస్తాయని అన్నారు. వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ తదితర రైళ్లు నూతన తరం భారతీయ రైల్వేలకు పునాది వేస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వృద్ధిలో మౌలిక సదుపాయాలనేవి ఒక ప్రధాన అంశమని, భారతదేశం కూడా అభివృద్ధి మార్గంలో వేగంగా పయనిస్తున్నదని ప్రధాని పేర్కొన్నారు.బనారస్-ఖజురహో వందే భారత్ఈ రైలు వారణాసి, ప్రయాగ్రాజ్, చిత్రకూట్, ఖజురహోతో సహా దేశంలోని పలు సాంస్కృతిక గమ్యస్థానాలను కలుపుతుందని రైల్వేశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.లక్నో-సహరన్పూర్ఈ రైలు లక్నో, సీతాపూర్, షాజహాన్పూర్, బరేలీ, మొరాదాబాద్, బిజ్నోర్, సహారన్పూర్ ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చనుంది. పవిత్ర నగరమైన హరిద్వార్కు మెరుగైన ప్రయాణాన్ని అందించనుంది.ఫిరోజ్పూర్-ఢిల్లీ ఈ రైలు ఢిల్లీ, పంజాబ్లోని ఫిరోజ్పూర్, భటిండా, పాటియాలా వంటి కీలక నగరాల మధ్య కనెక్టివిటీని మరింత మెరుగుపరచనుంది.उत्तर प्रदेश के बनारस से मध्य प्रदेश के खजुराहो की यात्रा पर चलने को तैयार #VandeBharatExpress#विकसित_बनारस pic.twitter.com/yCGTwTkLiw— Ministry of Railways (@RailMinIndia) November 8, 2025ఎర్నాకులం-బెంగళూరు ఇది ప్రధాన ఐటీ, వాణిజ్య కేంద్రాలను కలుపుతుంది.నిపుణులు, విద్యార్థులు, పర్యాటకులకు వేగవంతమైన ప్రయాణ ఎంపికను అందిస్తుందని కేంద్రం తెలిపింది.ఇది కూడా చదవండి: శీతాకాలం ఎఫెక్ట్: ‘ఇకపై 10కి ఆఫీసు’ -
రేవంత్ పుట్టినరోజు.. మోదీ, సోనియా, మమత విషెస్
సాక్షి, హైదరాబాద్: నేడు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి (Revanth Reddy) ప్రముఖులు పుట్టినరోజు శుభకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు.తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. ఇక, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా తెలంగాణ సీఎంకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.Birthday greetings to Telangana Chief Minister Revanth Reddy Garu. May he be blessed with a long and healthy life.@revanth_anumula— Narendra Modi (@narendramodi) November 8, 2025కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫోన్ చేసి సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నేతలు రేవంత్కు శుభాకాంక్షలు చెబుతున్నారు. -
వందేమాతరం
న్యూఢిల్లీ: వందేమాతరం ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రజలు జాతీయ గేయం ఆలపించారు. శుక్రవారం దేశమంతటా విద్యాసంస్థల్లో సామూహిక గేయాలాపన చేశారు. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వందేమాతరం స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. గేయంలోని ముఖ్యమైన చరణాలను తొలగించడాన్ని ఆయన తప్పుపట్టారు. వందేమాతరం గేయం దశాబ్దాలుగా ఎలా స్ఫూర్తిగా నిలుస్తోందో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వివరించారు. భరతమాతను సుజలం, సుఫలం, సుఖదాంగా కొనసాగించడానికి మనమంతా బలమైన సంకల్పం తీసుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో రాష్ట్రపతి పోస్టు చేశారు. వందేమాతరం మనకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమేనని ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఈ గేయం జాతీయవాదాన్ని మేల్కొల్పిందని గుర్తుచేశారు. వందేమాతరం ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు. బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగించారు. మన స్వాతంత్య్ర సమరయోధుల ఆకాంక్షలను గత 11 ఏళ్లలో సమ్మిళిత కృషి ద్వారా నెరవేర్చామని తెలిపారు. కాంగ్రెస్ పాపం చేసింది: బీజేపీ కాంగ్రెస్ పార్టీ చారిత్రక తప్పిదం, పాపం చేసిందని బీజేపీ అధికార ప్రతినిధి సి.ఆర్.కేశవన్ ‘ఎక్స్’లో విమర్శించారు. వందేమాతరం గేయాన్ని మతంతో ముడిపెట్టి కొన్ని చరణాలను అప్పటి కాంగ్రెస్ నేత జవహర్లాల్ నెహ్రూ ఉద్దేశపూర్వకంగా తొలగించారని ఆరోపించారు. దుర్గామాతను ఆరాధిస్తున్నట్లుగా ఉన్నాయన్న కారణంతోనే వాటిని తొలగించారని ఆక్షేపించారు. మతపరమైన ఎజెండాకే కాంగ్రెస్ ప్రాధాన్యం ఇచి్చందని ధ్వజమెత్తారు. ఓ వర్గాన్ని సంతృప్తిపర్చాలన్న ఉద్దేశంతోనే జాతీయ గేయాన్ని ముక్కలు చేశారని మండిపడ్డారు. మోదీ క్షమాపణ చెప్పాలి: కాంగ్రెస్ జాతీయ గేయాన్ని 1937లో విభజించారంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. బంకించంద్ర చటర్జీ రాసిన గేయంలో మొదటి రెండు చరణాలను స్వీకరించాలని అప్పట్లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్వయంగా సూచించారని గుర్తుచేసింది. నోబెల్ బçహుమతి గ్రహీతను అవమానించడం సిగ్గుచేటు అంటూ మోదీపై ఆగ్రహం వ్యక్తంచేసింది. మోదీ విభజన సిద్ధాంతాన్ని నమ్ముకుంటున్నారని ఆరోపించింది. ప్రధానమంత్రి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. వందేమాతరాన్ని దశాబ్దాలుగా సగర్వంగా ఆలపిస్తున్నది కాంగ్రెస్ మాత్రమేనని పేర్కొంది. జాతీయవాదానికి సంరక్షకులం అని చెప్పుకొనే బీజేపీ, ఆర్ఎస్ఎస్లు వారి శాఖల్లో జాతీయ గేయం, జాతీయ గీతాన్ని ఏనాడూ ఆలపించలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. -
ఎన్నికల చోరీతోనే మోదీ ప్రధాని అయ్యారు..!
బంకా: ఓట్లనే కాదు, కాషాయ దళం ఏకంగా ఎన్నికలనే చోరీ చేస్తోందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల చోరీతోనే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యారన్నారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్లలో చేసినట్లే బీజేపీ చోరీ చేసిందని, గుజరాత్లో మళ్లీ మళ్లీ ఇదే జరుగుతోందన్నారు. ఈ విషయాన్ని జెన్ జెడ్కు, యువతకు ఆధారాలతో సహా కాంగ్రెస్ చూపిస్తుందని, ఇందులో సందేహమే లేదని తెలిపారు. బీజేపీ నేతలే లక్ష్యంగా ఆయన మరోసారి ఓట్ చోరీ ఆరోపణలు చేశారు. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఓటేసిన బీజేపీ నేతలు కొందరు, బిహార్ అసెంబ్లీ మొదటి విడత పోలింగ్లోనూ పాల్గొని ఓటేశారని విమర్శించారు. సంబంధించిన పేర్లు తదితర వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. బిహార్లోని బంకాలో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. హరియాణాలో చోటుచేసుకున్న ఓట్ చోరీపై కాంగ్రెస్ పార్టీ ఆధారాలను అందజేసినా ఎన్నికల కమిషన్ మాత్రం ఖండించలేదన్నారు. హరియాణా ప్రభుత్వం చోరీతో ఏర్పాటైన ప్రభుత్వమని ధీమాతో చెప్పగలనన్నారు. గతేడాది జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందన్నారు. రాష్ట్ర ఓటరు జాబితాలోని 2 కోట్లకుగాను కనీసం 25 లక్షల నకిలీ పేర్లున్నాయని, బీజేపీని గెలిపించేందుకు ఎన్నికల కమిషన్ ఆ పారీ్టతో కుమ్మక్కయిందని విమర్శించారు. ఈసారి బిహార్లో అలా కానివ్వబోమన్నారు. ఇందుకు ప్రజలు అనుమతించరని తెలిపారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ఎన్డీయే ప్రభుత్వం యువతను సోషల్ మీడియాలో రీల్స్ చేసుకోవాలంటూ ప్రేరేపిస్తోందని రాహుల్ వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దపు వ్యసనమే రీల్స్ అన్నారు. బిహార్ రైతులకు బ్యాంకులు రుణాలి్వడం లేదు, రుణాలను మాఫీ చేయడం లేదని భాగల్పూర్లో జరిగిన ర్యాలీలో ఆయన ఆరోపించారు. కానీ, ఇష్టమైన కార్పొరేట్ సంస్థల రుణాలను మాత్రం రద్దు చేస్తోందన్నారు. బీజేపీ మీడియాను చెప్పుచేతల్లో పెట్టుకుందన్నారు. రోజులో 24గంటలూ ప్రధాని మోదీ మొహం చూపించేందుకు టీవీ చానెళ్లకు బీజేపీ భారీగా చెల్లింపులు చేస్తోందని పేర్కొన్నారు. -
ఒక మంత్రం.. ఒక శక్తి..స్ఫూర్తి
న్యూఢిల్లీ: వందేమాతరం... ఒక మంత్రం, ఒక శక్తి, ఒక స్వప్నం, ఒక సంకల్పం అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వందేమాతరం గేయం తరతరాలుగా మనకు నూతన స్ఫూర్తిని, శక్తిని ఇస్తూనే ఉందని అన్నారు. ప్రఖ్యాత బెంగాలీ సాహితీవేత్త బంకించంద్ర చటర్జీ రచించిన జాతీయ గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాబోయే ఏడాది పాటు దేశవ్యాప్తంగా జరిగే స్మారకోత్సవాలను ప్రధాని మోదీ శుక్రవారం ఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించారు. ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంప్, నాణేన్ని విడుదల చేశారు. సామూహిక గేయాలాపనలో పాల్గొన్నారు. భారత స్వాతంత్య్ర సమరానికి వందేమాతరం బలమైన గళంగా నిలిచిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ప్రతి భారతీయుడి మనసులోని భావాలను వ్యక్తీకరించిందని తెలిపారు. కానీ, దురదృష్టవశాత్తూ 1937లో వందేమాతరం గేయంలోని ముఖ్యమైన చరణాలను తొలగించారని తప్పుపట్టారు. గేయానికి అసలైన ఆత్మలాంటి చరణాలు కనిపించకుండాపోయాయని అన్నారు. వందేమాతరం గేయానికి చేసిన గాయం చివరకు దేశ విభజనకు బీజం వేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. దేశ నిర్మాణానికి చోదకశక్తి అయిన ఈ మహామంత్రానికి అన్యాయం ఎందుకు జరిగిందో ఈనాటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆ విభజన ఆలోచనా విధానం ఈనాటికీ మన దేశానికి సవాలు విసురుతోందని వ్యాఖ్యానించారు. దుర్గామాతగా మారగలం మన జాతీయ గేయం ప్రతి తరానికీ సమకాలీనమేనని ప్రధాని మోదీ వివరించారు. ఆపరేషన్ సిందూర్ను ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశ భద్రత, గౌరవంపై దాడికి దిగిన ముష్కరులకు తిరుగులేని గుణపాఠం నేరి్పంచామని చెప్పారు. నూతన భారతదేశంలో మానవాళికి సేవ చేసే ‘కమల, విమల స్ఫూర్తి’తోపాటు అవసరమైతే దుర్గామాతగా మారడం కూడా మనకు తెలుసని స్పష్టంచేశారు. పది రకాల ఆయుధాలు చేతబూని ఉగ్రవాదులను అంతం చేయగలమని పేర్కొన్నారు. ముష్కరులు మరోసారి మనవైపు కన్నెత్తి చూసే సాహసం చేస్తే ప్రాణాలతో వదిలిపెట్టబోమని పరోక్షంగా హెచ్చరించారు. మళ్లీ స్వర్ణయుగంలోకి.. విజ్ఞానం, సైన్స్ అండ్ టెక్నాలజీ అనే పునాదులపై మన దేశాన్ని గొప్పగా నిర్మించుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. భారతదేశ సౌభాగ్యం గురించి ప్రపంచం కొన్ని శతాబ్దాలుగా వింటోందని అన్నారు. కేవలం కొన్ని శతాబ్దాల క్రితం ప్రపంచ జీడీపీలో మన జీడీపీ నాలుగింట ఒక వంతు ఉండేదని తెలిపారు. బంకించంద్ర చటర్జీ వందేమాతర గేయాన్ని రచిస్తున్న సమయంలో దేశం స్వర్ణయుగాన్ని కోల్పోయిందని అన్నారు. విదేశీ దండయాత్రలు, దోపిడీ, దౌర్జన్యాలు, అరాచకాలు, వలసవాద విధానాలు మనదేశాన్ని పీల్చిపిప్చి చేశాయని, పేదరికం, ఆకలితో దేశం అల్లాడిపోయిందని గుర్తుచేశారు. భారతదేశం ఎప్పటికైనా పునరై్వభవం సాధించాలని బంకించంద్ర చటర్జీ కలలుగన్నారని చెప్పారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా మళ్లీ స్వర్ణయుగంలోకి ప్రవేశించాలంటూ బోధించారని తెలిపారు. ఆ దిశగా వందేమాతరం అనే మహోన్నతమైన పిలుపును ఇచ్చారని ప్రధానమంత్రి శ్లాఘించారు. ఆ స్వప్నాన్ని సాకారం చేసుకోవాలి బ్రిటిష్ వలసవాదులు వారి దుష్ట పాలనను సమర్థించుకోవడానికి భారత్ను వెనుకబడిన దేశంగా, తక్కువ స్థాయి కలిగిన దేశంగా చిత్రీకరించారని ప్రధాని మోదీ ఆక్షేపించారు. వందేమాతరం గేయం ఆ తప్పుడు ప్రచారాన్ని ఫటాపంచలు చేసిందని అన్నారు. దేశం అంటే కేవలం ఒక భౌగోళిక ప్రాంతం అని భావించేవారిని.. ఈ గేయం దేశాన్ని ఒక తల్లిగా అభివరి్ణంచడం చాలా ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. మన దృష్టిలో తల్లి అంటే జన్మనిచి్చ, పోషించడమే కాకుండా బిడ్డ ప్రమాదంలో ఉంటే కాపాడుకొనే గొప్ప వ్యక్తి, దుషు్టలను దునుమాడే శక్తి అని వెల్లడించారు. వందేమాతరం అసలైన స్వప్నాన్ని సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ విజయం సాధిస్తోందన్నారు. ‘2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్’ అనే లక్ష్య సాధన దిశగా దేశం వేగంగా పరుగులు తీస్తోందని పేర్కొన్నారు. మనం ప్రతిసారీ ఒక కొత్త ఘనత సాధించినప్పుడు దేశమంతటా వందేమాతరం ప్రతిధ్వనిస్తోందని హర్షం వ్యక్తంచేశారు. మన ఆడబిడ్డలు కీలక రంగాల్లో విజయాలు సొంతం చేసుకున్నప్పుడు దేశ ప్రజలంతా వందేమాతరం అంటున్నారని తెలియజేశారు. వన్ ర్యాంక్, వన్ పెన్షన్ పథకానికి 11 ఏళ్లు పూర్తయ్యాయని ప్రధానమంత్రి వివరించారు. ఉగ్రవాదం, నక్సలిజం, మావోయిస్టు తీవ్రవాదాన్ని ఓడించినప్పుడల్లా మన సైనిక దళాలు వందేమాతరం అని నినదిస్తున్నాయని చెప్పారు. వందేమాతరం స్మారకోత్సవాలు 2026 నవంబర్ 7వ తేదీదాకా కొనసాగుతాయి. ఈ గేయాన్ని బంకించంద్ర చటర్జీ 1875 నవంబర్ 7న అక్షయ నవమి సందర్భంగా రచించారు. అనంతరం ఆయన రాసిన ఆనంద్మఠ్ నవలలో ఈ గేయాన్ని చేర్చారు. -
‘వందేమాతరం’ ఒక మంత్రం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ‘వందేమాతరం’ గీతం 150 ఏళ్ల స్మారకోత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (శుక్రవారం) న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఒక స్మారక స్టాంపు, నాణేన్ని విడుదల చేశారు. అలాగే దేశ పౌరులు జాతీయ గీతాన్ని ఆలపించి, సంబంధిత వీడియోలను అప్లోడ్ చేసి సర్టిఫికెట్ పొందే అవకాశాన్ని కూడా ప్రకటించారు. వీటితో పాటు ‘vandemataram150.in’ అనే పోర్టల్ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. వందేమాతరం ఒక మంత్రం, ఒక శక్తి, ఒక కల, ఒక సంకల్పం అని అన్నారు. దీనిని భారతమాతకు నివేదించే భక్తి, ఆరాధనగా పేర్కొన్నారు.తన ప్రసంగంలో ప్రధాని మోదీ వందేమాతర గీతం గొప్పదనాన్ని వివరిస్తూ.. ఇది మనకు ఘన చరిత్రను గుర్తు చేస్తుందని, వర్తమానాన్ని ఆత్మవిశ్వాసంతో నింపుతుందని, బంగారు భవిష్యత్తు కోసం ధైర్యాన్ని అందిస్తుందని అన్నారు. వందేమాతరం సామూహికంగా పాడటం అనేది భావ వ్యక్తీకరణకు మించిన అనుభూతి అని, ఇది హృదయాన్ని కదిలిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. బంకిం చంద్ర చటోపాధ్యాయ ఈ పాట ద్వారా స్వతంత్ర, ఐక్య, సంపన్న భారతదేశం కోసం స్పష్టమైన పిలుపునిచ్చారని అన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, కేంద్ర సంస్కృతి, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


