breaking news
Narendra Modi
-
దేశంలో గ్యాస్ కొరత లేదు... కేంద్రం కీలక ఆదేశాలు
-
కేరళలో ఈసారి మా ప్రభుత్వమే
కొచ్చి/తిరుచిరాపల్లి: కేరళలో సీసీఎం నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష యూడీఎఫ్ కూటములు అవినీతిలో కూరుకుపోయాయని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు కూటములకు గట్టిగా బుద్ధి చెప్పాలని కేరళ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మార్పునకు పట్టం కట్టాలని కోరారు. ప్రధాని మోదీ బుధవారం కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించారు. తొలుత కేరళలో ‘అఖిల కేరళ ధీవర సభ’ స్వర్ణోత్సవాలకు హాజరయ్యారు. అనంతరం కొచ్చిలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో భాగంగా రూ.11,000 కోట్ల విలువైన అభివృద్ధి, మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులు ప్రారంభించారు, మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, మంత్రులు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించడం గమనార్హం. అనంతరం బీజేపీ ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. రాష్ట్రంలో తమ పార్టీ బలం పెరిగిందని చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. పశ్చిమాసియా పరిణామాలపై రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాందీపై మోదీ మండిపడ్డారు. పశ్చిమాసియా యుద్ధంపై ప్రజలను రెచ్చగొట్టేలా, బాధ్యతారాహిత్యంగా విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మన దేశ అభివృద్ధి గురించి కాంగ్రెస్ యువరాజుకు ఏమాత్రం తెలియదని ఎద్దేవా చేశారు. మన కంపెనీలు, మన యువత సాధిస్తున్న విజయాలు రాహుల్ ఏం తెలుసని ప్రశ్నించారు. శబరిమల బంగారం దొంగతనంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్లకు ప్రమేయం ఉందని ఆరోపించారు. మత రాజకీయాలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి అడ్డుకుంటున్నాయని ధ్వజమెత్తారు. ఆ రెండు కూటములకు బుద్ధి చెప్పాలని, ఈసారి ‘మోదీ గ్యారంటీల’తో ముందుకొస్తున్న బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. తమిళనాడు అభివృద్ధికి ప్రణాళికలున్నాయి తమిళనాడు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఆయన తమిళనాడులోని తిరుచిరాపల్లిలో రూ.5,650 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు, మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. అనంరతం ఎన్డీఏ ఎన్నిక ప్రచార సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో డీఎంకే పాలనలో మహిళలు, చిన్నారులపై నేరాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తంచేశారు. నేరగాళ్లు యథేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే గెలిపిస్తే ప్రజలకు అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. శాంతి భద్రతలు కాపాడుతామన్నారు. నేరగాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తమిళనాడులో అవినీతికి అంతే లేకుండాపోయిందని దుయ్యబట్టారు. నదులన్నీ చివరికి సముద్రంలో కలిసిపోయినట్లు అవినీతి సొమ్ము చివరకు ఒక కుటుంబానికి చేరుతోందని సీఎం స్టాలిన్పై నిప్పులు చెరిగారు. డీఎంకే ‘శాస్త్రీయమైన అవినీతి మోడల్’ను అమలు చేస్తోందన్నారు. తమిళనాడు అభివృద్ధి పట్ల తన వద్ద ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాంతాన్ని రేర్ ఎర్త్ కారిడార్లో ఒక భాగంగా మారుస్తామని ప్రకటించారు. బెంగళూరు–చెన్నై, చెన్నై–హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు నిర్మించాలన్న ప్రతిపాదన ఉందని మోదీ తెలిపారు. ‘అభివృద్ధి చెందిన భారత్కు అభివృద్ధి చెందిన తమిళనాడు’ అత్యంత కీలకమని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే తమ ధ్యేయమని వెల్లడించారు. -
భయపడాల్సిన పనిలేదు.. ఎల్పీజీ కొరతపై మోదీ భరోసా
తిరుచిరాపల్లి/కొచ్చి: పశ్చిమాసియా సంక్షోభ ప్రభావంతో కొత్తగా భారత్లో వెలుగుచూసిన ఎల్పీజీ కొరతపై జనం భయపడాల్సిన పనిలేదని ప్రధాని మోదీ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఎన్నికలు జరగబోతున్న తమిళనాడులో బుధవారం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘‘పశ్చిమాసియా సంక్షోభంపై తమిళనాడు ప్రజలకు ఒక్కటే చెప్పదల్చుకున్నా. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా గొలుసులు దెబ్బతిన్నాయి. ఈ సమయంలోనూ భారత్ మొదట్నుంచీ అవలంభిస్తున్న విధానాన్నే నేను నమ్ముతా. ఎలాంటి సంక్షోభకాలంలోనైనా భారతీయుల స్వప్రయోజనాలకే మా ప్రభుత్వం సదా కట్టుబడి ఉంటుంది. ప్రస్తుత కష్టకాలంలో మన విధానం మారదు. ఇప్పుడు ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు. పుకార్లకు ఎవరూ ప్రాధాన్యత ఇవ్వొద్దు. ప్రజలను ఒక్కటే కోరుతున్నా. కేవలం సరైన, విశ్వసనీయ సమాచారం మాత్రమే అందరితో పంచుకోండి. కోవిడ్ మహావిలయకాలంలోనూ భారత్ ఎంత పరిణతి చెందిన దేశమో 140 కోట్ల మంది భారతీయులు రుజువుచేశారు. అచ్చం అలాగే ఇప్పుడు ఇంధన సంక్షోభాన్ని మ నం విజయవంతంగా ఎదుర్కొని సమస్య నుంచి గట్టెక్కుతాం’’అని మోదీ వ్యాఖ్యా నించారు. గల్ఫ్ దేశాలు ఆదుకుంటున్నాయి: పశ్చిమాసియా యుద్ధవాతారణంలో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్న భారతీయులకు ఎన్డీఏ ప్రభుత్వంతోపాటు గల్ఫ్ దేశాలు అన్ని రకాలుగా ఆదుకుంటున్నాయని మోదీ ప్రకటించారు. బుధవారం కేరళంలోని కొచ్చిలో ఎన్డీఏ ర్యాలీలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘‘ఇరాక్లో చిక్కుకున్న నర్సులను కావొచ్చు, యెమెన్లో ఉగ్రవాదుల చెరలో బందీగా ఉన్న ఫాదర్ టామ్ను కావొచ్చు సంక్షోభంలో ఉన్నప్పుడు భారత్ ఏనాడూ తన పౌరులను గాలికి వదిలేయలేదు’ అన్నారుఆందోళన అనవసరంఅవసరాలకు తగినంత ఎల్పీజీపై సరఫరా ఎప్పట్లా 2.5 రోజుల్లోనే రీఫిల్ డెలివరీ: కేంద్రంన్యూఢిల్లీ: ‘‘దేశంలో అవసరాలకు తగినన్ని ఎల్పీజీ నిల్వలున్నాయి. గృహావసరాల డిమాండ్ను పూర్తిస్థాయిలో తీర్చడంలో ఎలాంటి ఇబ్బందీ లేదు’’అని కేంద్రం బుధవారం పేర్కొంది. ఎల్పీజీ సరఫరాపై ఆందోళన అవసరం లేదని పెట్రోలియం, సహజ వాయు శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ స్పష్టం చేశారు. ‘‘ఆందోళనతో రీఫిల్స్ అధిక బుకింగ్, డీలర్ల అక్రమ నిల్వల వంటివి తప్పుడు సమాచార వ్యాప్తికి దారి తీస్తున్నాయి. వాస్తవానికి గృహ వినియోగదారులకు రీఫిల్ సిలిండర్ పశ్చిమాసియా కల్లోలానికి ముందు మాదిరిగానే సగటున 2 నుంచి 2.5 రోజుల్లోనే అందుతోంది’’అని ఆమె మీడియాకు వెల్లడించారు. ఎల్పీజీ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్పై ఉక్కుపాదం మోపాల్సిందిగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించామన్నారు. గృహేతర ఎల్పీజీ సరఫరాలో ఆస్పత్రులు, విద్యా సంస్థల వంటి అత్యవసర రంగాలకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. ‘‘భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దిగుమతి చేసుకుంటోంది. ఇందులో 90 శాతం హార్మూజ్ జలసంధి గుండానే వస్తోంది’’అని తెలిపారు. ఎల్ఎన్జీ నిల్వలతో కూడిన రెండు నౌకలు త్వరలో భారత్ చేరుకోనున్నట్టు శర్మ వెల్లడించారు. హార్మూజ్ గుండా భారత్కు చమురు, సహజ వాయువు, ఎల్పీజీ రవాణా రెండు వారాలుగా తీవ్రంగా ప్రభావితం కావడం తెలిసిందే. రష్యా తదితర దేశాల నుంచి చమురు సరఫరా అవుతున్నా ఎల్పీజీ, ఎల్ఎన్జీ విషయంలో మాత్రం సమస్య నెలకొంది. దాంతో ప్రత్యమ్నాయ మార్గాల ద్వారా ఎల్పీజీ సరఫరాను పెంచుకోవడంపై కేంద్రం దృష్టి సారించింది. -
'ఆందోళన వద్దు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం'
గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు (బుధవారం) కేరళలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రూ. 10 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులను కాంగ్రెస్ రాజకీయంగా వాడుకుంటుందని దుయ్యబట్టారు.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్ పార్టీ ఈ గడ్డు పరిస్థితులనూ రాజకీయం చేస్తుందన్నారు. వీటిని సైతం రాజకీయంగా వాడుకుంటుందన్నారు. యుద్ధంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని గల్ఫ్లో భారతీయులు చిక్కుకోవాలని కాంక్షిస్తుందని ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ బాధ్యతాయుతంగా మట్లాడుతున్నారని.. దేశ యువతపై రాహుల్ గాంధీకి సరైన అవగాహన లేదని మోదీ ఆరోపించారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్దంతో భారతీయుల భద్రతపై ఆందోళన నెలకొందన్నారు. మోదీ మాట్లాడుతూ " మన దేశ ప్రజలు సమస్యల్లో ఉన్న ప్రతీసారి వారిని కాపాడడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాం. ఇరాక్ సంక్షోభంలో భారతీయ నర్సులను క్షేమంగా తీసుకవచ్చాం. యెమెన్లో ఉగ్రవాదుల చెర నుంచి ఫాదర్ టామ్ను రక్షించాం " అని అన్నారు. ప్రస్తుతం గల్ఫ్లో జరుగుతున్న సంక్షోభం స్వయం సమృద్ధితి అవసరాన్ని మరింత నొక్కిచెబుతుందన్నారు.ఆత్మనిర్భర్ అవసరం కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ ఎంత అవసరమో ఇటీవల కాలంలో జరిగిన సంక్షోభాలు తెలియజేస్తున్నాయన్నారు. కరోనా , ఉక్రెయిన్- రష్యా యుద్దం, ఇరాన్ వార్ దాని అవసరాన్ని తెలియజేశాయన్నారు. ఆత్మనిర్భర్ ప్రారంభ సమయంలో కాంగ్రెస్, లెప్ట్ పార్టీలు దానిని ఎగతాళి చేశాయని ప్రస్తుతం దాని విలువ అందరికీ అర్థమైందని తెలిపారు. దేశం ఇతర దేశాలపై ఆదారపడేలా చేసిందని ఈ రెండు పార్టీలే ఇంతకాలం భారత్ను వేరే దేశాలపై ఆధారపడేలా చేశాయన్నారు. ఇంధన కొరతపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంధన రంగంలో ఆత్మనిర్భర్ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఇంధనం కోసం ఇతర దేశాలపై ఆదారపడడం చాలావరకూ తగ్గించుకున్నామన్నారు. ప్రత్యామ్నయ ఇంధన వనరులపై ఫోకస్ పెట్టామని తెలిపారు. పెట్రోల్, డీజీల్ దిగుమతులు తగ్గించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అందుకే కేంద్రం ఎలక్ట్రిక్ బస్సులకు, వాహనాలకు ప్రోత్సహాకాలు అందిస్తున్నామని మోదీ అన్నారు. ప్రస్తుతం గల్ఫ్లో చిక్కుకున్న భారతీయులకు ఆయా దేశాలు తగిన రక్షణ కల్పిస్తున్నాయని అందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలని తెలిపారు. -
2028 వరకు జల్జీవన్ మిషన్
న్యూఢిల్లీ: జల్ జీవన్ మిషన్(జేజేఎం)ను డిసెంబర్ 2028 వరకు పొడిగించడం సహా కేంద్ర మంత్రివర్గం మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జేజేఎం 2.0 కింద రూ.8.7 లక్షల కోట్లను వెచ్చించి గ్రామీణ ప్రాంతాల్లోని 3.23 కోట్ల గృహాలకు పైపులైన్ల ద్వారా తాగునీటిని అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.దేశంతో భూ సరిహద్దులు కలిగిన చైనా, ఇతర దేశాలకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఉన్న నిబంధనలను సడలించాలని కూడా మంత్రి వర్గం నిర్ణయించిందని మంత్రి చెప్పారు. ఎలాంటి అనుమతుల అవసరం లేకుండానే ఆయా దేశాల వాటాదారులు, 10 శాతం వరకు దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఏర్పడనుందన్నారు. ఈ మేరకు 2020లో జారీ చేసిన నోటీసును సవరించనుందని చెప్పార. మదురై విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించాలన్న ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఢిల్లీ–ముంబై ఎక్స్ప్రెస్వేపైగల మధ్యప్రదేశ్లోని 80 కిలోమీటర్ల బద్నావర్–తిమర్వానీ సెక్షన్ను రూ.3,839 కోట్లతో నాలుగు లేన్లుగా 24 నెలల కాలంలో విస్తరించాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. దీంతోపాటు, బెంగాల్–జార్ఖండ్లను కలిపే రూ.4,474 కోట్ల విలువైన రెండు రైల్వే ప్రాజెక్టులను కేబినెట్ ఆమోదించింది. ఇన్సాల్వెన్సీ లా, కంపెనీ చట్టానికి సవరణలు చేపట్టాలని కూడా కేబినెట్ తీర్మానించిందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. -
వంటగ్యాస్ కొరత.. కేంద్రం కీలక నిర్ణయం
దేశంలో గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. LPG,CNG సంస్థలు పదిశాతం మేర ఉత్పత్తి పెంచాల్సిందిగా కంపెనీలకు ఆదేశించారు. అదేవిధంగా వంటగ్యాస్ను బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలుంటాయని సంస్థలకు హెచ్చరించారు. కాగా చమురు కేంద్రాలు ఇదివరకే ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాయని తెలిపారు. దేశంలో చమరు కొరత లేదని కేంద్రం స్పష్టం చేసింది. గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్తో చర్చలు జరిపారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో ముంబై, బెంగళూరు లాంటి ప్రధాన నగరాల్లో హోటళ్లు మూతపడ్డాయి. దీంతో దేశంలో వంటగ్యాస్ లభ్యతపై సందిగ్ధత ఏర్పడింది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడడంతో ఇప్పటికే పలు ప్రధాన నగరాలైన ముంబై, బెంగళూరుల తదితర నగరాల్లో హోటళ్లు మూసివేశారు. మావద్ద కొద్ది మేరకే ఎల్పీజీ నిల్వలున్నాయని అవి పూర్తయితే తాము సైతం హోటళ్లు మూసివేయాల్సిందేనని పలు హోటళ్ల యజమాన్యాలు కేంద్రం ముందు గోడు వెళ్లగక్కాయి. అయితే త్వరలో ఈ సంక్షోభం మరిన్ని ప్రాంతాలకు చేరే అవకాశం ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఉత్తత్తిని పెంచాలని కీలక ఆదేశాలిచ్చింది. -
భారీగా గ్యాస్ కొరత... మూతపడ్డ హోటళ్లు కేంద్రం కీలక నిర్ణయం
-
ఏఐ, ఆటోమేషన్పై పట్టు పెంచుకోవాలి
న్యూఢిల్లీ: దేశ విద్యా రంగాన్ని వాస్తవిక ప్రపంచ ఆర్థికవ్యవస్థతో అనుసంధానించే ప్రక్రియను మరింత వేగవంతంచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ(ఏఐ), ఆటోమేషన్, డిజిటల్ ఎకానమీ వంటి సబ్జెక్టులపై మరింత దృష్టిపెట్టడం ద్వారా అనుసంధానం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం ఢిల్లీలో జరిగిన పోస్ట్–బడ్జెట్ వెబినార్లో మోదీ మాట్లాడారు. ‘‘విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, పర్యాటకం, క్రీడలు, సాంస్కృతిక రంగాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే మాధ్యమాలు. సంస్థలు, పరిశ్రమల అవసరాలు తీర్చేలా విద్యారంగం మారాలి.అందుకే మార్కెట్ అవసరాలు, వాస్తవిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తగ్గట్లుగా నూతన జాతీయ విద్యావిధానం తీసుకొచ్చాం’’ అని అన్నారు. ‘‘యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) రంగం మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోవాలి. ఆవిష్కరణల ఆధారిత ఆర్థికవ్యవస్థకు అనుగుణంగా పరిశ్రమలు, పరిశోధనశాలలతో విద్యాలయాలు అనుసంధానం కావాలి. పారిశ్రామిక సౌజన్యం, పరిశోధనల ఆధారిత అభ్యసనలకు కేంద్రాలుగా రూపాంతరం చెందాలి.అప్పుడు విద్యార్థులు విద్యాలయాల్లో పారిశ్రామికావసరాలకు తగ్గ పరిశోధనలు చేసి సఫలీకృతులవుతారు’’ అని మోదీ అన్నారు. ‘‘స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమేటిక్స్) కోర్సులపై అమ్మాయిలు ఆసక్తిచూపడం శుభసూచకం. భావి సాంకేతికతల గురించి మాట్లాడుకునే వేళ దేశంలో ఏ అమ్మాయీ అవకాశాల కొరతతో వెనుకబడొద్దు’’ అన్నారు. పలు కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల అధికారులు, నిపుణులు, ప్రైవేట్ రంగ భాగస్వాములతో పాటు పలువురు ప్రముఖులు వెబినార్లో పాల్గొన్నారు. -
చర్చకు రాని అవిశ్వాసం
న్యూఢిల్లీ: పార్లమెంటు మలి విడత బడ్జెట్ సమావేశాల తొలి రోజైన సోమవారం కూడా లోక్సభలో పాత దృశ్యాలే పునరావృతమయ్యాయి. విపక్ష సభ్యులు పదేపదే కార్యకలాపాలకు ఆటంకం కలిగించారు. పశ్చిమాసియాలో పరిస్థితిపై విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రకటన చేయబోతుండగా అడ్డుకున్నారు. ఆ సంక్షోభంపై పూర్తిస్థాయి చర్చకు పట్టుబట్టారు. తొలి విడత బడ్జెట్ సమావేశాల్లో తాము లేవనెత్తిన పలు ఇతర అంశాలకు సంబంధించి ప్లకార్డులు ప్రదర్శించారు. వాటన్నింటికీ ప్రభుత్వం అప్పుడే వివరంగా బదులిచ్చిందని సభాపతి స్థానంలో ఉన్న జగదంబికా పాల్ గుర్తు చేశారు. పశ్చిమాసియాపై చర్చకు వారిచ్చిన వాయిదా తీర్మానాన్ని స్వీకరించేందుకు నిరాకరించారు.‘‘స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలిచ్చిన అవిశ్వాస తీర్మానం ఇప్పటికే ఈ రోజు ఎజెండాలో ఉంది. ఒకే రోజు రెండు అంశాలపై చర్చ ఎలా సాధ్యం? పశ్చిమాసియాపై చర్చ కావాలంటే సభా వ్యవహారాల కమిటీని సంప్రదించండి’’అని సూచించారు. వారు పట్టువీడకపోవడంతో ఆగ్రహించారు. ‘‘విపక్ష సభ్యులు పరిణతి లేకుండా, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. రాజకీయ ఎజెండా ప్రకారం వ్యవహరిస్తున్నారు’’అంటూ మందలించారు. వారు సభా మర్యాద పాటించడం లేదంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఆక్షేపించారు. అయినా సభ్యులు శాంతించకపోవడంతో సభ పదేపదే వాయిదా పడింది. మధ్యాహ్నం మూడింటికి సమావేశమయ్యాక కూడా అవే పరిస్థితులు కొనసాగాయి. బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు చేపడదామని విపక్ష సభ్యులకు పాల్ విజ్ఞప్తి చేసినా లాభం లేకపోయింది. దాంతో ఆ అంశాన్ని చర్చకు చేపట్టకుండానే సభ మంగళవారానికి వాయిదా పడింది. పశ్చిమాసియాపై చర్చ ఉండబోదు: కేంద్రం పశ్చిమాసియా సంక్షోభంపై పార్లమెంటులో పూర్తిస్థాయి చర్చ చేపట్టాలన్న విపక్షాల డిమాండ్లకు కేంద్రం అంగీకరించే అవకాశం లేదని సమాచారం. దీనిపై విదేశాంగ మంత్రి ఉభయ సభల్లో ఇప్పటికే ప్రకటన చేసినందున ఇక చర్చ అనవసరమని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. మోదీ బండారం బయటపడుతుందనే! ⇒ పశ్చిమాసియాపై చర్చకు వెనుకంజ: రాహుల్ ⇒ పార్లమెంటు ఆవరణలో విపక్షాల ధర్నా సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమాసియా కల్లోలంపై పార్లమెంటులో పూర్తిస్థాయి చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. ఉభయ సభల్లో విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటన అనంతరం పార్లమెంట్ మకరద్వారం వద్ద విపక్ష ఎంపీలు ధర్నాకు దిగారు. ఈ సంక్షోభానికి సంబంధించిన కీలకాంశాలపై మోదీ సర్కారు మౌనం పాటిస్తోందని ఆరోపించారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ కేంద్రానికి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.నిరసనలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్గాం«దీ, ఎస్పీ అధినేత అఖిలేశ్ , తృణముల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమాసియా విషయంలో అమెరికా బ్లాక్మెయిలింగ్కు మోదీ లొంగిపోయారని రాహుల్ ఆరోపించారు. ‘‘ఈ అంశంపై పార్లమెంటులో చర్చ చేపడితే అవన్నీ బయటపడతాయని కేంద్రం భయపడుతోంది. అందుకే చర్చకు వెనకాడుతోంది’’అని ఆరోపించారు.‘అవిశ్వాసం’పై నేడు చర్చ? న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని సభ మంగళవారం చర్చకు చేపట్టే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు తదితరులు చర్చలో పాల్గొంటారు. అనంతరం చర్చకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా బదులిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తీర్మానాన్ని వీలైనంత త్వరగా చర్చకు చేపట్టాలని కేంద్రం భావిస్తున్నట్టు వెల్లడించాయి.స్పీకర్ వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ 118 మంది విపక్ష ఎంపీలు తొలి విడత బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయనపై అవిశ్వాస తీర్మానానికి నోటీసివ్వడం తెలిసిందే. నాటినుంచీ లోక్సభ సమావేశాలకు బిర్లా సారథ్యం వహించడం లేదు. అవిశ్వాస తీర్మానంపై సభ నిర్ణయం వెలువడేదాకా స్పీకర్ విధులకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. మంగళవారం ఆయన సాధారణ ఎంపీగా చర్చలో పాల్గొనే అవకాశముందని లోక్సభ వర్గాలు తెలిపాయి. గతంలో మూడుసార్లు స్పీకర్లపై అవిశ్వాస తీర్మానాలిచ్చినా ఒక్కటి కూడా నెగ్గలేదు. -
‘మోదీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం మొత్తం..’
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇజ్రాయెల్-ఇరాన్ ఇష్యూ మొత్తం ముగియవచ్చని భారత్లోని యూఏఈ తొలి రాయబారి హుస్సేన్ హసన్ మిర్జా అన్నారు. ఇవాళ ఓ ఇంటర్వ్యూలో మిర్జా మాట్లాడారు. యూఏఈకి ప్రధాని నరేంద్ర మోదీతో ఉన్న సంబంధాల గురించి ప్రశ్నించగా.. మోదీ అంటే గల్ఫ్ నాయకులకు మాత్రమే కాదని,. ఆయా దేశాల ప్రజలు, వ్యాపార వర్గాల్లో కూడా ఆయనకు చాలా గౌరవం ఉందని మిర్జా చెప్పారు. “ఇరాన్, ఇజ్రాయెల్ అధినేతలకు మోదీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ సమస్య ముగుస్తుంది. ఒక ఫోన్ కాల్ చాలు” అని మిర్జా చెప్పారు. ప్రస్తుతం యుద్ధం చేస్తున్న ఇరాన్- ఇజ్రాయెల్ నాయకులతో మోదీకి ఉన్న సత్సంబంధాలపై ఇది ఆధారపడి ఉందని ఆయన చెప్పారు.‘ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణలో చేరాలన్న ఆసక్తి యూఏఈకి లేదు. మా భూభాగాన్ని దాడుల కోసం వాడుకోవడానికి ఇరు పక్షాలకు అనుమతి ఇవ్వము. నిజంగా చెప్పాలంటే ఇందులో మేమెందుకు చేరుతున్నామో నాకు స్పష్టంగా తెలియదు. ఈ ఘర్షణలో యూఏఈ జోక్యం చేసుకోవాల్సిన కారణం ఏమీ లేదు” అని మిర్జా వ్యాఖ్యానించారు. రెండు పక్షాలతో తాము చర్చలు జరపగలమని అన్నారు.యూఏఈ సున్నితమైన భౌగోళిక-రాజకీయ పరిస్థితుల్లో ఉంది. అది ఇరాన్ పక్కన ఉన్న దేశం. అలాగే అబ్రహామ్ ఒప్పందాల కింద ఇజ్రాయెల్తో యూఏఈ పార్ట్నర్షిప్ కొనసాగిస్తోంది. అబ్రహామ్ ఒప్పందాలు అంటే కొన్ని అరబ్ దేశాలు ఇజ్రాయెల్తో సంబంధాలు సాధారణం చేసుకోవడానికి కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందాలు.“వాళ్లు మా భూభాగంగాపై పరస్పరం యుద్ధం చేస్తున్నారు. దీన్ని మేము అంగీకరించలేం” అని మిర్జా చెప్పారు. ఇప్పటివరకైతే నష్టం తక్కువగానే ఉన్నట్టు తెలుస్తోందని అన్నారు.ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా మోజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్పై మరోసారి దాడులు చేసింది. బీరూట్లో హిజ్బుల్లా మౌలిక సదుపాయాలపై కూడా దాడి చేసింది. ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి చెప్పిన వివరాల ప్రకారం యుద్ధంగా వల్ల ఇప్పటివరకు ఇరాన్లో 1,332 మంది సాధారణ ప్రజలు మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు. -
ట్రంప్కు బానిసలా మోదీ.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు
కలబురిగి (కర్నాటక): పశ్చిమాసియా సంక్షోభం, అమెరికాతో వాణిజ్య ఒప్పందం, టారిఫ్ అంశాల్లో కేంద్రంలోని బీజేపీ వైఖరిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఒక నియంతగాను, ప్రధాని మోదీని ఆయనకు బానిసగాను అభివర్ణించారు. ట్రంప్ ఎప్స్టీన్ ఫైళ్లను అడ్డుపెట్టుకుని మోదీని ఆడిస్తున్నారన్నారు.కర్నాటకలోని కలబురిగి జిల్లా చిత్తాపూర్లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఖర్గే మాట్లాడారు. ‘ఇరాన్ సుప్రీం నేతను అమెరికా చంపేసింది. ఏకంగా దేశ నేతనే చంపేస్తే ఆ దేశం, ఇక ప్రపంచం సురక్షితంగా ఉంటుందా? ఇరాన్ నేత ఖమేనీ లేదా వెనెజువెలా నేత మదురో..ఇలా ఎవరైనా కావచ్చు. దేశాల నేతలను ఇలా బెదిరింపులకు గురిచేస్తే ప్రపంచంలో శాంతి అనేదే ఉండదు. అమెరికా తన అహంకారంతో అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కుతోంది’ అని ఖర్గే మండిపడ్డారు. భారత్ను టారిఫ్ల పేరుతో బెదిరింపులకు గురి చేస్తూ అమెరికా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయించిందన్నారు. మోదీ, ట్రంప్లు మన దేశాన్ని నాశనం చేస్తూ, అమెరికాకు దాసోహమనేలా చేస్తున్నారని ఆరోపించారు. -
తృణమూల్ను ప్రజలు క్షమించరు
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రపతి ముర్మును ఘోరంగా అవమానించిందని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఒక దళితురాలిని అవమానించిన ఆ పార్టీని బెంగాల్ ప్రజలు క్షమించబోరని తేల్చిచెప్పారు. ప్రధాని మోదీ ఆదివారం ఢిల్లీలో పర్యటించారు. ‘వికసిత్ ఢిల్లీ’ నిర్మాణంలో భాగంగా రెండు మెట్రో కారిడార్లు సహా దాదాపు రూ.33,500 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడారు. బెంగాల్లో రాష్ట్రపతి ముర్ము పాల్గొన్న సంతాల్ గిరిజన సదస్సును తృణమూల్ బహిష్కరించిందని ఆరోపించారు.ఇది రాజ్యాంగానికి, దేశ ఆడబిడ్డలకు జరిగిన ఘోర అవమానమన్నారు. తృణమూల్ ను దేశ ప్రజలు, గిరిజన సమాజం, మహిళలు ఏనాటికీ క్షమించరన్నారు. అహంకారపూరిత రాజకీయాలను ప్రజలు కచ్చితంగా తిప్పికొడతారని చెప్పారు. ఢిల్లీ అభివృద్ధి ఒక నగరానికి పరిమితం కాదని, దేశ ప్రతిష్టతో ముడిపడి ఉందని మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ మెట్రో రైలు నెట్వర్క్ను రికార్డు స్థాయిలో 375 కిలోమీటర్లకు విస్తరిస్తున్నామని వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత నారీ శక్తిని ప్రధాని మోదీ ప్రశంసించారు. రాజకీయాలు, సైన్స్, క్రీడలు తదితర రంగాల్లో మహిళలు నూతన శక్తితో ముందుకు సాగుతున్నారని మోదీ కొనియాడారు. -
టీ20 వరల్డ్ కప్ విజయం.. భారత్ జట్టుపై ప్రధాని మోదీ ప్రశంసలు
ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ లో భారత్ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. టోర్నమెంట్ మొత్తం దూకుడుగా ఆడిన టీమిండియా చివరి మ్యాచ్లో కూడా తమ ప్రతిభ చాటుతూ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విజయంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.Champions! Congratulations to the Indian team on winning the ICC Men’s T20 World Cup! This remarkable triumph reflects exceptional skills, determination and teamwork. They have shown outstanding grit through the tournament. This victory has filled every Indian heart with…— Narendra Modi (@narendramodi) March 8, 2026ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత్ జట్టును అభినందించారు. సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఆయన.. “ఈ విజయం ప్రతి భారతీయుడి హృదయాన్ని ఆనందంతో నింపింది. దేశం మొత్తం గర్వపడేలా చేసిన ఈ ఘనతకు టీమ్ ఇండియాకు హృదయపూర్వక అభినందనలు” అని పేర్కొన్నారు.భారత్ జట్టు సాధించిన ఈ విజయం యువతకు ప్రేరణగా నిలుస్తుందని ప్రధాని అన్నారు. క్రీడల పట్ల దేశంలో ఆసక్తిని మరింత పెంచే ఘనత ఇదేనని ఆయన అభిప్రాయపడ్డారు. -
దేశంలోనే తొలి ‘రింగ్ మెట్రో’ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ఢిల్లీ: దేశంలోనే తొలి ‘రింగ్ మెట్రో’ను ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ఢిల్లీ మెట్రోకు సంబంధించి రెండు కొత్త కారిడార్లను ప్రధాని ప్రారంభించారు. 12.3 కిలో మీటర్ల పొడవు కలిగిన మజ్లిస్ పార్క్-మౌజ్పూర్-బాబర్పూర్ (పింక్లైన్), 9.9 కిలోమీటర్ల దూరం విస్తరించిన దీపాలి చౌక్-మజ్లిస్ పార్క్ (మజెంటా లైన్) కారిడార్లను మోదీ ప్రారంభించారు.మజ్లిస్ పార్క్ - మౌజ్పూర్ - బాబర్పూర్ కారిడార్.. ఈ కారిడార్లో ఎనిమిది ఎలివేటెడ్ స్టేషన్లు ఉన్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న మజ్లిస్ పార్క్ - శివ్ విహార్ పింక్ లైన్లో భాగంగా ఉంటుంది. ఈ కొత్త మార్గంతో పింక్ లైన్ మొత్తం పొడవు 71.56 కిలోమీటర్లు. దీంతో ఇది భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్థాయి 'రింగ్ మెట్రో'గా అవతరించింది. మజ్లిస్ పార్క్, బురారీ, జరోడా మజ్రా, జగత్పూర్-వజీరాబాద్, సూర్ఘాట్, నానక్సర్-సోనియా విహార్, ఖజూరీ ఖాస్, భజన్పురా, యమునా విహార్, మౌజ్పూర్-బాబర్పూర్ స్టేషన్లు ఉన్నాయి.ఈ మార్గంలో యమునా నదిపై కొత్త వంతెన, మెట్రో లైన్, రోడ్డు ఫ్లైఓవర్ రెండూ ఉండేలా నిర్మించిన 'డబుల్ డెక్కర్ వయాడక్ట్' ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీపాలి చౌక్ - మజ్లిస్ పార్క్ కారిడార్.. ఇది బొటానికల్ గార్డెన్ - కృష్ణా పార్క్ ఎక్స్టెన్షన్ మెజెంటా లైన్కు ఎలివేటెడ్ పొడిగింపు. ఇందులో ఏడు స్టేషన్లు ఉన్నాయి. ఈ కారిడార్ మొత్తం పొడవు 49 కిలోమీటర్లు.. దీపాలి చౌక్, మధుబన్ చౌక్, ఉత్తర పితాంపుర-ప్రశాంత్ విహార్, హైడర్పూర్ విలేజ్, హైడర్పూర్ బాద్లీ మోర్, భల్స్వా, మజ్లిస్ పార్క్ స్టేషన్లు ఉన్నాయి. దీపాలి చౌక్-మజ్లిస్ పార్క్ కారిడార్ 28.36 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. ఇది ఢిల్లీ మెట్రో స్టేషన్లలోనే అత్యంత ఎత్తైనది. వీటితోపాటు మరో మూడు కొత్త కారిడార్లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. -
రాష్ట్రపతిని అవమానించడం సిగ్గుచేటు
న్యూఢిల్లీ / సిలిగురి / కోల్కతా: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అవమానించడం నిజంగా సిగ్గుచేటు అని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. గతంలో ఇలాంటి పరిణామం ఇప్పుడూ జరగలేదని చెప్పారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హద్దులూ దాటేసిందని ధ్వజమెత్తారు. బెంగాల్లో రాష్ట్రపతి పాల్గొన్న సంథాల్ సదస్సు వేదికను రాష్ట్ర ప్రభుత్వం హఠాత్తుగా మార్చేసింది. ఈ విషయాన్ని ద్రౌపదీ ముర్ము తప్పుపట్టారు. తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. అలాగే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మంత్రివర్గ సభ్యులు కూడా తన పర్యటన సందర్భంగా హాజరు కాకపోవడాన్ని ముర్ము ఆక్షేపించారు. ఈ పరిణామాలపై మోదీ శనివారం ‘ఎక్స్’లో స్పందించారు. రాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతం అని గుర్తుచేశారు.ఆ పదవికి ఉన్న ప్రతిష్టను ఎల్లప్పుడూ గౌరవించాలన్నారు. బెంగాల్ ప్రభుత్వ చర్యతో ప్రజాస్వామ్యవాదులు, గిరిజనుల మనోభావాలు గాయపడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. గిరిజన మహిళ అయిన ద్రౌపదీ ముర్ము ఆవేదన విని దేశ ప్రజల హృదయాలు బాధతో నిండిపోయాయని పేర్కొన్నారు. రాష్ట్రపతిని కించపర్చారని, దీనికి బెంగాల్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని మోదీ తేలి్చచెప్పారు. బెంగాల్ ప్రభుత్వానికి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఇకనైనా సద్భుద్ధి కలుగుతుందని ఆశిస్తున్నట్లు స్పష్టంచేశారు. సంథాల్ సంస్కృతిపై జరిగిన గొప్ప సదస్సును బెంగాల్ సర్కార్ తేలిగ్గా తీసుకోవడం దురదృష్టకరమని ప్రధానమంత్రి వెల్లడించారు. రాష్ట్రపతిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారా?: మమత బీజేపీ సలహా మేరకే రాష్ట్రపతి ముర్ము నడుచుకుంటున్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. మణిపూర్, చత్తీస్గఢ్లో గిరిజనులపై దాడులు జరిగితే ముర్ము ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బెంగాల్లో గిరిజనుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదని రాష్ట్రపతి ఆరోపించడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రపతిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారా? అంటూ బీజేపీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రపతి పట్ల తమకు ఎనలేని గౌరవం ఉందన్నారు. ముర్ము పాల్గొన్న సదస్సు వేదికను మార్చేసిన సంగతి తనకు తెలీదని మమత చెప్పారు.ఆ సదస్సును ఎవరు నిర్వహించారో, ఎవరు నిధులిచ్చారో తెలియదని అన్నారు. రాష్ట్రపతి ఏడాదికి ఒకసారి బెంగాల్కు వస్తే తాను స్వాగతిస్తానని పేర్కొన్నారు. కానీ, తరచుగా వస్తూ ఉంటూ ప్రతిసారీ స్వాగతించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఎల్లప్పుడూ రాష్ట్రపతి వెంట ఉండడమే మా పనా? అని వ్యాఖ్యానించారు. బెంగాల్లో గిరిజనుల ఓట్లు తొలగించిన విషయం ముర్ముకు తెలుసా? అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి రాష్ట్రపతిని బీజేపీ ఉపయోగించుకుంటోందని మమతా బెనర్జీ ఆరోపించారు. మమతా బెనర్జీకి నాపై కోపం ఉండొచ్చు: ముర్ము షెడ్యూల్ ప్రకారం బిదాన్ నగర్లో జరగాల్సిన సంథాల్ సదస్సును బెంగాల్ ప్రభుత్వం బాగ్డోగ్రా ఎయిర్పోర్టు సమీపంలోకి మార్చేసింది. దాంతో శనివారం సదస్సు అక్కడే జరిగింది. సరైన సమాచారం లేకపోవడంతో జనం పెద్దగా హాజరు కాలేదు. దీనిపై రాష్ట్రపతి ముర్ము తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. తనకు స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ రాలేదని పేర్కొన్నారు. బిదాన్నగర్లో సదస్సు జరిగి ఉంటే గొప్పగా విజయవంతం అయ్యేదని అన్నారు.సదస్సు వేదికను ఎందుకు మార్చారో తనకు తెలియదని స్పష్టంచేశారు. గిరిజనుల సంక్షేమాన్ని బెంగాల్ ప్రభుత్వం కోరుకోవడం లేదని తప్పుపట్టారు. తాను బెంగాల్ బిడ్డనని, మమతా బెనర్జీ తన చిన్న చెల్లెలు అని వివరించారు. కానీ, తనను బిదాన్ నగర్కు ఎందుకు అనుమతించలేదో తెలియదన్నారు. మమతా బెనర్జీకి తనపై కోపం ఉండొచ్చని, అందుకే ఇదంతా జరిగినట్లు భావిస్తున్నానని పేర్కొన్నారు. -
"ఆ మూడు పనుల వల్లే అమెరికా-భారత్ దూరం"
డొనాల్ట్ ట్రంప్ ఇంతకాలం పాటు తన విధానాలు చేష్టలతో భారత్ను ఇబ్బంది పెట్టే యత్నం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ.. ట్రంప్ తన మాటలతో భారత్ను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అయితే ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్ తాజాగా ఈ అంశంపై మాట్లాడారు. ట్రంప్ అనాలోచితంగా చేసిన మూడు పనులు అమెరికాకు భారత్ను దూరం చేశాయన్నారు.ట్రంప్ విదేశాంగ విధానానికి తల ఊపే వ్యక్తిని కాదని ఆయన అన్నారు. ఆయన చేసిన పనుల వల్ల అమెరికాకు భారత్ దూరం అయ్యిందన్నారు. "మెుదటగా ఆయన పన్నుల విధానం భారత్తో దూరం పెంచింది. అనంతరం పాకిస్థాన్, భారత్ మధ్య జరిగిన యుద్ధం తన జోక్యంతోనే ముగిసిందని అనడం. తదనంతరం పాక్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్కు వైట్ హౌస్లో అతిథ్యం ఇవ్వడం" భారత్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయన్నారు.పాకిస్థాన్ తరచుగా ఉగ్రవాదాన్నిప్రోత్సహిస్తుందనే భారత్తో ఎన్నో ఏళ్లుగా అనేక వేదికలపై తెలుపుతుందని అయినప్పటికీ ట్రంప్ ఇలా చేయడం భారత్ను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. అయితే ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేదన్నారు. ఇరాన్లో ప్రభుత్వం మారుతుందో లేదో ఖచ్చితంగా చెప్పలేమని తెలిపారు.కాగా ఇప్పటికే ఇరాన్ దాడుల తీవ్రత గణనీయంగా తగ్గిందని అదే సమయంలో ఇజ్రాయెల్ మరియు అమెరికా దాడుల తీవ్రత పెరిగిందన్నారు. అయితే అమెరికా, ఇజ్రాయెల్లు పాలక వ్యవస్థల పైనే దాడి జరుపుతున్నాయని ఇరాన్ ఆర్థిక, సామాజిక మౌలిక వసతులకు హాని కలగకుండా ఆ రెండు దేశాలు జాగ్రత్త పడుతున్నాయని ఆస్ట్రేలియా మాజీ ప్రధాని తెలిపారు. -
ఇరాన్, రష్యా స్నేహం.. యుద్ధం వేళ కీలక ప్రకటన
మాస్కో: ఇజ్రాయెల్, అమెరికాలతో పోరాడుతున్నప్పటికీ ఇరాన్ తమను సైనిక సాయం అడగలేదని రష్యా ప్రకటించింది. మిత్రదేశానికి సాయపడబోతున్నారా? అని మీడియా ప్రశ్నించగా రష్యా అధ్యక్ష కార్యాలయం అధికారిక ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ గురువారం స్పందించారు. ‘‘ఇరాన్ నుంచి ఇంతవరకు ఎలాంటి అభ్యర్థనా రాలేదు. ఇరాన్తో మా మిత్రత్వం ఎప్పటి లాగానే కొనసాగుతుంది. ఇందులో ఎలాంటి మార్పులు లేవు. 2025 జనవరిలో ఇరాన్తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాం. కానీ ఆ ఒప్పందంలో ఆపత్కాలంలో ఇలాంటి సైనిక సాయం అంశం లేదు’’ అని పెస్కోవ్ స్పష్టంచేశారు.చైనా ఆఫర్..గతవారం నుంచి అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకున్న ఉద్రిక్తతలకు దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని చైనా సూచించింది. పోరాటాన్ని ముగించడానికి తాము మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని, సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు. అలాగే, జాతీయ భద్రతను కాపాడుకునే విషయంలో యూఏఈకి చైనా మద్దతు ఇస్తుందని, దౌత్యం ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకునేలా ఇతర గల్ఫ్ దేశాలకు కూడా మద్దతు ఇస్తుందని వాంగ్ యీ అన్నారు. ‘‘యుద్ధం వల్ల ప్రజలు మాత్రమే నష్టపోతారు.. శాంతి కోసం చైనా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తూనే ఉంటుంది’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. శాంతి ప్రక్రియ కోసం ప్రత్యేక రాయబారిని పంపే ప్రణాళికలను ధ్రువీకరించింది.భారత్ కీలక ప్రకటన..మరోవైపు, ఘర్షణలను వీలైనంత త్వరగా ముగించాలని ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్లకు భారత్ పిలుపునిచ్చింది. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్తో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ‘‘భారత్ చట్టాలను గౌరవిస్తుంది.. సైనిక ఘర్షణలతోనే ఏ సమస్య పరిష్కారం కాదు.. అది ఉక్రెయిన్ అయినా.. పశ్చిమాసియా అయినా’’ అని అన్నారు. -
పశ్చిమాసియా సంక్షోభానికి తక్షణం ముగింపు పలకాలి
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం మరింత ముదరకుండా తక్షణమే ముగింపు పలకాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సైనికపరమైన జోక్యం ద్వారా ఏ సమస్యనూ పరిష్కరించలేమని ఆయన చెప్పారు. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్తో గురువారం ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఐక్యరాజ్యసమితిలో ప్రధాన విభాగం భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి ఫిన్లాండ్ గట్టి మద్దతు దారుగా ఉంటుందని ఈ సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు స్టబ్ తెలిపారు. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ, పశ్చిమాసియా సంక్షోభంతో నెలకొన్న ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ చర్చలు జరిపినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం మారిన భౌగోళిక పరిణామాలను ప్రతిఫలించేలా ఐరాసలో సంస్కరణలు చేపట్టాలని స్టబ్ కోరారు. రక్షణ, అంతరిక్షం, సెమీకండక్టర్లు, అరుదైన ఖనిజాలు వంటి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చర్చల సందర్భంగా ఇరు దేశాల నేతలు అంగీకరించారు. ‘చట్టాలు, దౌత్యం, చర్చలపై భారత్, ఫిన్లాండ్లకు విశ్వాసముంది. సైనికపరంగా తలపడటం ద్వారా ఏ సమస్యకూ పరిష్కారం కనుగొనలేమనే విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చాం’అని ప్రధాని మోదీ అనంతరం ఒక ప్రకటనలో తెలిపారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా సంక్షోభాలకు తక్షణమే ముగింపు పలకాలి. శాంతియుత పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించారు. భారత్–యూరప్ దేశాల మధ్య సంబంధాలు ఇటీవలి కాలంలో ఎంతగానో మెరుగుపడ్డాయని తెలిపిన ప్రధాని మోదీ.. ఇది ప్రపంచ స్థిరతకు, అభివృద్ధికి దారితీస్తుందన్నారు. భారత్–ఈయూల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్, ఫిన్లాండ్ల మధ్య సంబంధాలను పెంచేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఫిన్లాండ్కు చెందిన టెలికం దిగ్గజ సంస్థ నోకియా భారత్లో చేపట్టిన వివిధ భారీ ప్రాజెక్టులను ఆయన మెచ్చుకున్నారు. -
నామినేషన్ దాఖలు చేశారు.. నితీశ్ ఇకపై..: అమిత్ షా
న్యూఢిల్లీ: నితీశ్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్న కాలాన్ని ఆ రాష్ట్ర చరిత్రలో “సువర్ణ అధ్యాయం”గా కేంద్ర మంత్రి అమిత్ షా అభివర్ణించారు. నితీశ్ జాతీయ రాజకీయాల్లోకి తిరిగి రావడాన్ని అమిత్ షా స్వాగతించారు. రాజ్యసభ స్థానానికి ఇవాళ నితీశ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో నితీశ్ వెంటే అమిత్ షా ఉన్నారు. దీనిపై అమిత్ షా మాట్లాడుతూ.. ‘ఇవాళ రాజ్యసభ స్థానానికి బిహార్ సీఎం కూడా నామినేషన్ దాఖలు చేశారు. నితీశ్ కుమార్ 2005 నుంచి ఇప్పటి వరకు బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన పదవీకాలం నిజంగా గొప్పది. ఈ కాలం బిహార్ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలుస్తుంది. ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి వంటి పదవుల్లో సుదీర్ఘ రాజకీయ జీవితం కొనసాగించినా ఆయనపై ఏ మచ్చా పడలేదు. ఆయన జీవితం మొత్తం స్వచ్ఛంగా ఉంది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 11 సంవత్సరాల కాలంలో నితీశ్ కుమార్ బిహార్ అభివృద్ధిలో అన్ని విధాలుగా ముఖ్యమైన పాత్ర పోషించారు. మోదీ ప్రారంభించిన ప్రతి కార్యక్రమం బిహార్ ప్రజలకు చేరేలా నితీశ్ నాయకత్వం పనిచేసింది. ఇప్పుడు ఆయన మరోసారి రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీకి తిరిగి వస్తున్నారు. నేను, ఎన్డీఏ మిత్ర పక్షా నేతలు అందరమూ ఆయనకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం’ అని అన్నారు.మేము ముందే చెప్పాం: తేజస్వీ బిహార్లో రాజకీయంగా అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయి. బీజేపీపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. నితీశ్ కుమార్పై బీజేపీ కుయుక్తులు చేసిందని ఆరోపించారు. ‘2025 సే 30 ఫిర్ సే నితీశ్’ అనే ఎన్నికల నినాదానికి విరుద్ధంగా వ్యవహరించిందని అన్నారు.‘బీజేపీ, ఎన్డీఏ మిత్ర పక్షాలు కుయుక్తులు, కుతంత్రాలను వాడి, మొత్తం వ్యవస్థను వాడుకుని ఎన్నికలు ఎలా నిర్వహించాయో తెలుసు. అప్పుడే నితీశ్ కుమార్ను బీజేపీ హైజాక్ చేసిందని చెప్పాం. ఆయనను మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోనివ్వరని తెలిపాం. ఆయన ఆ కుర్చీలో 6 నెలలకంటే ఎక్కువ ఉండరని మేము చెప్పాం’ అని తెలిపారు. -
నేడు ప్రధానితో ఫిన్లాండ్ అధ్యక్షుడి భేటీ
న్యూఢిల్లీ: భారత్లో నాలుగు రోజుల పర్యటనకు గాను ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తృతం చేసుకోవడమే లక్ష్యంగా ఆయన ఈ పర్యటన చేపట్టారు. ఢిల్లీకి చేరుకున్న ఆయనకు విమానా శ్రయంలో విదేశాంగ శాఖ సహాయమంత్రి కృతి వర్థన్సింగ్ స్వాగతం పలికారు. స్టబ్ గురువారం ప్రధాని మోదీతో సమావేశ మవుతారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశాలున్నాయి. గురువారం సాయంత్రం ప్రారంభమయ్యే రైజినా డైలాగ్ సదస్సులో స్టబ్ ముఖ్య అతిథిగా హాజరై కీలక ఉపన్యాసమిస్తారు. స్టబ్ వెంట మంత్రులు, సీనియర్ అధికారులు, వ్యాపార వేత్తలతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం వచ్చింది. అలెగ్జాండర్ స్టబ్ రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్లతోనూ భేటీ అవుతారు. శుక్రవారం ముంబైలో వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. శనివారం తిరిగి స్వదేశానికి పయనమవుతారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ఫిన్లాండ్ ప్రధాని పెట్టెరి ఓర్పో పాల్గొనడం తెల్సిందే. కొన్ని వారాల వ్యవధిలోనే ఆ దేశాధ్యక్షుడు కూడా భారత్ రావడం గమనార్హం. -
BJP చేతికి బీహార్ సీఎం పోస్ట్ నితీష్ కుమార్ గుడ్ బై!
-
పీఎం రాహత్ స్కీమ్... ఆసుపత్రి బిల్లు ప్రభుత్వం కడుతుంది
-
ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధం.. పాకిస్తాన్కు కొత్త భయం!
ఇస్లామాబాద్: ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగిస్తున్న వేళ దాయాది దేశం పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ మిత్ర దేశం ఇరాన్పై అమెరికా దాడులు చేయడాన్ని పరోక్షంగా వ్యతిరేకిస్తూ.. ఇజ్రాయెల్ పట్ల తమకున్న భయాన్ని వెళ్లగక్కారు. ఇదే సమయంలో భారత్ను టార్గెట్ చేసి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చివరగా.. పాక్ను సామంత దేశంగా మార్చేందుకు ఇజ్రాయెల్ కుట్ర చేస్తోందంటూ బాంబు పేల్చారు.ఇరాన్పై దాడుల జరుగుతున్న నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా స్పందించారు. ఈ సందర్బంగా ఆసిఫ్ మాట్లాడుతూ.. ‘అణు ఒప్పందంపై ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ అమెరికా-ఇజ్రాయెల్ టెహ్రాన్పై యుద్ధం చేయడానికే సిద్దమయ్యాయి. వ్యూహత్మకంగా దాడులు చేసి సుప్రీం లీడర్ అలీ ఖమేనీని హత మార్చారు. ఇదంతా ఇజ్రాయెల్ ప్లాన్లో భాగంగానే జరిగింది. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుంచి ఇస్లామిక్ ప్రపంచాన్ని ప్రభావితం చేసే అన్ని సంఘర్షణలలో జియోనిజం (యూదు భావజాలం) ప్రత్యక్ష లేదా పరోక్ష పాత్ర పోషించింది. ప్రతీ యుద్ధం, ప్రతీ ఘర్షణలో ఇజ్రాయెల్ భాగంగానే ఉంటోంది. దశాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను జియోనిస్టులే నిర్ధేశిస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.నెతన్యాహు, మోదీ స్నేహంపై.. ఇదే సమయంలో భారత్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న బంధంపై సరికొత్త కుట్రకు తెరలేపారు. ఇజ్రాయెల్ను టార్గెట్ చేసి.. ఇరాన్పై యుద్ధం వల్ల పాకిస్థాన్ కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ విజయం సాధిస్తే భారత్, ఆప్ఘనిస్తాన్ ఏకమై.. పాక్ను టార్గెట్ చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. తమ సరిహద్దుల వద్ద ప్రమాదకర పరిస్థితులను సృష్టిస్తున్నారని ఆరోపించారు. అన్ని వైపుల నుంచి శత్రువులు తమను చుట్టుముట్టడం వల్ల పాక్ సామంత దేశంగా మారే ప్రమాదం ఉందన్నారు. పాక్ను సామంత దేశంగా మార్చేందుకు ఇజ్రాయెల్ కుట్ర పన్నుతోందని.. ఈ కుట్రలో భారత్ భాగస్వామిగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇరాన్తో పాక్ సరిహద్దు ఇలా.. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్–ఇరాన్ మధ్య సరిహద్దు మొత్తం పొడవు 909 కిలోమీటర్లు (565 మైళ్లు) ఉంటుంది. ఈ సరిహద్దు ఇరాన్లోని సిస్తాన్ అండ్ బలూచిస్తాన్ ప్రావిన్స్, పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్తో కలుస్తుంది. ఇది ఉత్తరాన ఆఫ్ఘానిస్తాన్ త్రైజంక్షన్ వద్ద ప్రారంభమై, దక్షిణాన గల్ఫ్ ఆఫ్ ఒమాన్ వరకు కొనసాగుతుంది. సరిహద్దు భూభాగం ఎక్కువగా ఎడారి, పర్వత ప్రాంతాలతో నిండి ఉంటుంది. అందువల్ల రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధి కష్టతరంగా మారింది. దక్షిణ చివర గల్ఫ్ ఆఫ్ ఒమాన్.. ఇది సముద్ర వాణిజ్యానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. ఇరాన్–పాకిస్తాన్ మధ్య గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టులు, ఇంధన వాణిజ్యం ముఖ్యమైనవిగా ఉన్నాయి. అధికారిక వాణిజ్యంతో పాటు అనధికారిక స్మగ్లింగ్ కూడా విస్తృతంగా జరుగుతుంది. ఇరాన్–పాకిస్తాన్ సంబంధాలు సరిహద్దు భద్రత, వాణిజ్యం, మరియు ప్రాంతీయ రాజకీయాలపై ఆధారపడి ఉంటాయి. మొత్తంగా, ఈ సరిహద్దు ప్రాంతం రెండు దేశాల మధ్య సాంస్కృతిక అనుబంధంను బలపరుస్తూ, వాణిజ్య మార్గంగా పనిచేస్తూ, అదే సమయంలో భద్రతా సవాళ్లును కూడా సృష్టిస్తోంది. -
మోదీ యూట్యూబ్ చానల్కు 3 కోట్ల మంది సబ్స్క్రైబర్లు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ యూట్యూబ్ చానల్ 3 కోట్ల సబ్స్క్రైబర్ల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద సంఖ్యలో సబ్స్క్రైబర్లు ఉన్న ఏకైక రాజకీయ నాయకుడిగా మోదీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.ఇక రెండోస్థానంలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కొనసాగుతున్నారు. ఆయనకు మోదీకున్న ఫాలోవర్లలో నాలుగోవంతు సబ్స్క్రైబర్లున్నారు. ఇక, దేశంలోనూ ఇతర నాయకులతో పోలిస్తే మోదీకి ఎక్కువ సబ్స్క్రైబర్లున్నారు. గత నెలలోనే ఇన్స్టాగ్రామ్లో 10కోట్ల ఫాలోవర్ల చరిత్రాత్మక మైలురాయిని ప్రధాని అధిగమించిన సంగతి తెలిసిందే. -
ఒమన్, కువైట్, ఖతార్ పాలకులకు మోదీ ఫోన్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగుతుండడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన మంగళవారం ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిఖ్, కువైట్ యువరాజు షేక్ సబా అల్–ఖలీద్ అల్–హమద్ అల్–ముబారక్ అల్–సబా, ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితిపై వారితో చర్చించారు. మూడు దేశాలపై దాడులతోపాటు సార్వబౌమత్వం, ప్రాదేశిక సమగ్రతల ఉల్లంఘన జరుగుతుండడాన్ని మోదీ తీవ్రంగా ఖండించారు. ఆయా దేశాల్లో నివసిస్తున్న భారతీయుల సంక్షేమం, భద్రతపై చర్చించారు. భారతీయులకు తగిన రక్షణ కల్పించడానికి చర్యలు చేపట్టాలని కోరారు. ప్రధాని మోదీ గత రెండు దేశాల్లో పశ్చిమాసియాలో ఎనిమిది దేశాల అధినేతలతో మాట్లాడారు. ప్రధానంగా భారతీయుల భద్రతని వారి దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం ఒమన్, కువైట్, ఖతార్ దేశాల పెద్దలతో మాట్లాడినట్లు మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు.పశ్చిమాసియాలో సాధ్యమైనంత త్వరగా శాంతి, స్థిరత్వం నెలకొనాలని తాము కోరుకుంటున్నట్లు వెల్లడించారు. వివాదాలను దౌత్య మార్గాల్లో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని స్పష్టంచేశారు. భారతీయుల రక్షణ విషయంలో మద్దతు ఇస్తున్నందుకు మూడు దేశాల అధినేతలకు కృతజ్ఞతలు తెలియజేసినట్లు పేర్కొన్నారు. -
మోదీజీ.. మీ కోసం వెయిటింగ్ ఇక్కడ..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి త్వరలో కొత్తగా ఒక వందేభారత్, రెండు అమృత్భారత్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వాటిని పట్టాలెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన రైల్వే అధికారులు, ప్రధానమంత్రి మోదీతో ప్రారంభోత్సవం చేయించేందుకు ఎదురు చూస్తున్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఆయన అపాయింట్మెంట్లో స్పష్టత రాకపోవటంతో తాత్కాలికంగా వాటి ప్రారంభోత్సవాన్ని పెండింగులో ఉంచారు. ఈనెల 6న ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని ఓ దఫా రైల్వే శాఖ అధికారులకు సమాచారం అందినా, అది వాయిదా వేస్తున్నట్టు మరో సమాచారం అందింది. దీంతో కార్యక్రమం ఎప్పుడుంటుందో స్పష్టత లేనప్పటికీ, ప్రధానికి సమయం కేటాయించే వీలు లేని పక్షంలో వర్చువల్గానైనా త్వరలో ప్రారంభిస్తారని సమాచారం.సికింద్రాబాద్/చర్లపల్లి–నాందేడ్ వందేభారత్హైదరాబాద్–నాందేడ్ మధ్య వందేభారత్ రైలు ప్రారంభానికి సిద్ధమైంది. రెండు నగరాల మధ్య 280 కి.మీ. దూరం ఉండగా... ప్రస్తుతం నడుస్తున్న సాధారణ రైళ్లు గమ్యం చేరేందుకు 7 గంటల సమయం తీసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ దూరాన్ని మూడు గంటల్లో చేరుకునేలా వందేభారత్ రైలు పట్టాలెక్కబోతోంది. నాందేడ్ మహారాష్ట్రలో ఉన్నప్పటికీ, అక్కడి వ్యాపారులు సరుకుల కోసం హైదరాబాద్కే వస్తుంటారు. సాధారణ ప్రజలు కూడా శుభకార్యాల షాపింగ్కు హైదరాబాద్కే వస్తుంటారు. దీంతో రెండు నగరాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపరిచేందుకు వందేభారత్ రైలు ఉపయోకకరంగా ఉండనుంది. ఈ డిమాండ్ ఆధారంగానే రైల్వే బోర్డు వందేభారత్ ఎక్స్ప్రెస్ను మంజూరు చేసింది. ఇది సికింద్రాబాద్ లేదా చర్లపల్లి నుంచి నడుస్తుంది.అమృత్భారత్ రైళ్లు...ఇటీవలే హైదరాబాద్కు రెండు అమృత్భారత్ రైళ్లను కేటాయించిన రైల్వే బోర్డు తాజాగా మరో రెండింటిని మంజూరు చేసింది. ఇవి చర్లపల్లి నుంచి కోల్కతాలోని షాలిమార్కు, యూపీలోని గోరక్పూర్కు నడుస్తాయి. హైదరాబాద్–కోల్కతా మధ్య ప్రయాణికుల సంఖ్య భారీగానే ఉన్నప్పటికీ, సరిపడా రైళ్లు లేవు. ఇక యూపీలోని గోరక్పూర్కు నడిచే అమృత్భారత్.. కాన్పూర్, నాగ్పూర్, లక్నో, భోపాల్ను అనుసంధానిస్తుంది. గోరక్పూర్కు ప్రస్తుతం హైదరాబాద్ నుంచి రెగ్యులర్ రైళ్లు లేవు. వారానికి ఒక రోజు చొప్పున నడిచే నాలుగు సర్వీసులున్నాయి. ఈ రూట్లోనూ ప్రయాణికుల డిమాండ్ అధికంగా ఉంది. -
ప్రపంచంలో భారత్ స్థాయి తగ్గేలా చేయొద్దు: రాహుల్
న్యూఢిల్లీ: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మౌనంగా ఉంటే ఈ తీరు ప్రపంచంలో భారత స్థాయిని తగ్గిస్తుందని అన్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ఎక్స్లో ట్వీట్ చేశారు. ‘ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు.. అశాంతి నెలకొన్న ఆయా ప్రాంతాలను అతిపెద్ద ఘర్షణ వైపు నడిపిస్తున్నాయి. దాదాపు కోటి మంది భారతీయులు సహా కోట్లాది మంది ప్రజలు అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. భద్రతా పరమైన ఆందోళనలు వాస్తవమే అయినా, సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే దాడులు సంక్షోభాన్ని మరింత పెంచేస్తాయి.ఇరాన్పై జరుగుతున్న ఏకపక్ష దాడులను, అలాగే ఇతర పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడులను ఖండించాలి. హింస హింసనే పుట్టిస్తుంది. చర్చలు, సంయమనం పాటించడమే శాంతికి ఏకైక మార్గం. ఈ పరిస్థితుల్లో భారత్ నైతికంగా స్పష్టమైన రీతితో ఉండాలి. అంతర్జాతీయ చట్టాలు, మనుషుల ప్రాణాలను కాపాడడంలో భారత్కు స్పష్టంగా మాట్లాడే ధైర్యం ఉండాలి.వివాదాలకు శాంతియుత పరిష్కారం చూపడానికి కృషి చేయడం మన విదేశాంగ విధానం, సార్వభౌమత్వంలో ఉంది. అది స్థిరంగా ఉండాలి. ప్రధాని మోదీ మాట్లాడాలి. ప్రపంచ క్రమాన్ని నిర్వచించే మార్గంగా ఒక దేశాధినేతను హత్య చేస్తే ఆయన మద్దతు ఇస్తున్నారా? నిశ్శబ్దం ఇప్పుడు ప్రపంచంలో భారత్ స్థాయిని తగ్గిస్తుంది’ అని రాహుల్ గాంధీ అన్నారు. కాగా, అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ ప్రతీకారదాడులకు దిగడంతో అమెరికా మళ్లీ భీకరదాడులు చేస్తామని హెచ్చరించింది. -
సోషల్ మీడియాలో మోదీ దూకుడు.. సాటెవ్వరు..
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు యూట్యూబ్లో మోదీ మరో ఘనత సాధించారు. 30 మిలియన్ల (3 కోట్ల) సబ్స్క్రైబర్లు ఉన్న ప్రపంచ నేతగా మైలురాయిని చేరుకున్నారు. ప్రపంచంలో ఏ నేతకూ ఇంతమంది సబ్స్క్రైబర్లు లేరు. ఈ జాబితాలో మోదీ తర్వాతి స్థానంలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బొల్సొనారో (6.58 మిలియన్ల సబ్స్క్రైబర్లు ) ఉన్నారు. అయితే, బొల్సొనారోకు ఉన్న ఫాలోవర్లు మోదీకి ఉన్న ఫాలోవర్లలో నాలుగింట ఒకవంతు మాత్రమే.అలాగే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే మోదీకి ఉన్న సబ్స్క్రైబర్లు ఏడు రెట్లు. ఇక భారత్లోని నేతల విషయానికి వస్తే కూడా ఫాలోవర్ల విషయంలో మోదీదే ఆధిపత్యం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కంటే మోదీకి ఉన్న సబ్స్క్రైబర్ల సంఖ్య మూడురెట్లు ఎక్కువ. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కంటే మోదీకి ఉన్న సబ్స్క్రైబర్లు నాలుగేసి రెట్ల చొప్పున అధికం.మోదీకి యూట్యూబ్లో 30 మిలియన్ల (3 కోట్ల) సబ్స్క్రైబర్లతో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లోనూ భారీగా ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో మోదీకి 100 మిలియన్ల (10 కోట్ల) మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ప్రపంచ నేతగా ఆయన నిలిచారు.మోదీ ఇన్స్టాగ్రామ్లో 2014లో జాయిన్ అయ్యారు. డొనాల్డ్ ట్రంప్నకు ఉన్న ఫాలోవర్ల కంటే మోదీకి రెట్టింపు మంది ఫాలోవర్లు ఉన్నారు. ట్రంప్నకు ఇన్స్టాలో 43.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇండొనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు 15 మిలియన్లు, బ్రెజిల్ అధ్యక్షుడు లులాకు 14.4 మిలియన్లు, తుర్కియే అధ్యక్షుడు ఎర్డొగాన్కు 11.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. భారత్లో మోదీ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. యోగికి ఇన్స్టాలో 16.1 మిలియన్ల మంది, రాహుల్ గాంధీకి 12.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. -
ఖమేనీ హత్య: కేంద్రం తీరుపై నిప్పులు చెరిగిన సోనియా
న్యూఢిల్లీ: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యపై కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న మౌనం తటస్థ వైఖరి కాదని, అది బాధ్యత నుండి తప్పుకోవడమేనని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. మంగళవారం ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’లో రాసిన ఒక వ్యాసంలో ఆమె కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.అంతర్జాతీయ నిబంధనలను తుంగలో తొక్కి, ఒక దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తూ జరిగిన ఈ హత్యను ఖండించకపోవడం భారత విదేశాంగ విధానం విశ్వసనీయతపై సందేహాలను కలిగిస్తోందని సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. గత శనివారం అమెరికా, ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో ఖమేనీ మరణించిన సంగతిని ప్రస్తావిస్తూ, ఎటువంటి ముందస్తు యుద్ధ ప్రకటన లేకుండా, దౌత్యపరమైన చర్చలు జరుగుతున్న సమయంలోనే ఒక దేశాధినేతను అంతమొందించడం అంతర్జాతీయ సంబంధాల్లో అలజడులకు దారితీస్తుందని ఆమె హెచ్చరించారు.ప్రధాని నరేంద్ర మోదీ తీరును తప్పుబడుతూ, ఇజ్రాయెల్-అమెరికా జరిపిన భారీ దాడులను విస్మరించి, కేవలం యూఏఈపై ఇరాన్ చేసిన ప్రతిదాడిని మాత్రమే ప్రధాని ఖండించడాన్ని సోనియా గాంధీ తప్పుబట్టారు. ‘చర్చలు, దౌత్యం’ అంటూ ఆయన చెబుతున్న మాటలు అర్థరహితమని, ఎందుకంటే ఈ దాడులకు ముందే అటువంటి దౌత్య ప్రక్రియలు కొనసాగుతున్నాయని ఆమె గుర్తుచేశారు. ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం ఏ దేశంపై కూడా బలప్రయోగానికి పాల్పడకూడదని, అటువంటి ప్రాథమిక సూత్రాల ఉల్లంఘన జరిగినప్పుడు భారత్ అభ్యంతరం తెలపకపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగించుకుని వచ్చిన 48 గంటల్లోనే ఈ హత్య జరగడం, నెతన్యాహు ప్రభుత్వానికి భారత్ మద్దతు ప్రకటించడం గమనార్హమని ఆమె పేర్కొన్నారు.బ్రిక్స్ దేశాలైన రష్యా, చైనాతో పాటు గ్లోబల్ సౌత్ దేశాలన్నీ ఈ వ్యవహారంలో సంయమనం పాటిస్తుంటే, భారత్ ఒక వర్గానికి మద్దతు ఇవ్వడం విదేశాంగ విధానంలో ఆందోళనకరమైన మార్పు అని సోనియా విమర్శించారు. 2001లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఇరాన్తో భారత్కు ఉన్న నాగరిక, చారిత్రక సంబంధాలను బలోపేతం చేశారని, ప్రస్తుత ప్రభుత్వం ఆ వారసత్వాన్ని మరిచిపోయిందని ఆమె విమర్శించారు. ‘వసుధైక కుటుంబం’ అనేది కేవలం ప్రసంగాలకు మాత్రమే పరిమితం కాకూడదని, న్యాయం, శాంతి కోసం గొంతు ఎత్తడమే దాని అసలు అర్థమని సోనియా గాంధీ గుర్తుచేశారు.ఇది కూడా చదవండి: నేడు ఆకాశంలో అద్భుతం.. అంతటా ‘బ్లడ్ మూన్’ సందడి! -
జోర్దాన్ అధినేతకు ప్రధాని మోదీ ఫోన్.. భారతీయుల భద్రతపై ఆరా
ఇరాన్- అమెరికా యుద్ధం వేళ ప్రధాని మోదీ భారతీయుల క్షేమంపై ఆరా తీస్తున్నారు. గల్ఫ్ దేశాల్లోని భారతీయుల సెక్యూరిటీపై జోర్డాన్ అధినేతతో చర్చించారు. ఆయనకు ఫోన్ చేసిన ప్రధాని.. ఆ దేశంలోని భారతీయుల భద్రత గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జోర్డాన్లో పరిస్థితులు తమను ఆందోళనకు గురిచేశాయని ప్రధాని మోదీ అన్నారు. శాంతి, భద్రతకు తమ మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు.కాగా.. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాలపై మిస్సైల్స్ దాడులు జరుగుతున్నాయి. అరబ్ దేశాలే టార్గెట్గా ఇరాన్ మిస్సైల్స్తో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలోనే మన భారత ప్రధాని మోదీ అన్ని దేశాల అధినేతలకు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల భద్రతపై చర్చిస్తున్నారు. -
భారత్కు 2.6 బిలియన్ డాలర్ల యురేనియం
న్యూఢిల్లీ: యురేనియం, అరుదైన ఖనిజాల సరఫరా విషయంలో భారత్, కెనడా మధ్య కీలకమైన అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదిరాయి. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని త్వరలోనే ఖరారు చేసుకోవాలని ఇరుదేశాలు నిర్ణయానికొచ్చాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాల్లో పురోగతిపై విస్తృతంగా చర్చించారు. రాబోయే రోజుల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంతోపాటు ద్వైపాక్షిక వార్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా నూతన ఫ్రేమ్వర్క్ను ఖరారు చేశారు.రక్షణ, క్రిటికల్ టెక్నాలజీ, చిన్న, మధ్య తరహా అణు రియాక్టర్లు, విద్య, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మోదీ, మార్క్ కార్నీ తీర్మానించారు. కెనడా ప్రధానితో భేటీ అనంతరం మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్, కెనడా సంబంధాలు ఇప్పుడు నూతన శక్తి, పరస్పర విశ్వాసం, సానుకూలతను సంతరించుకున్నాయని ఉద్ఘాటించారు. యురేనియం ఒప్పందంలో భాగంగా భారత అణు ఇంధన రంగానికి కెనడా సహకారం అందించబోతోంది. 2.6 బిలియన్ డాలర్ల విలువైన యురేనియం సరఫరా చేయనుంది. సంప్రదింపులు, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలి ఉగ్రవాదం, తీవ్రవాదం, హింసాత్మక భావజాలం కేవలం భారత్, కెనడాలకే కాకుండా భూగోళంపై మొత్తం మానవాళికి ముప్పుగా మారాయని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో రెండు దేశాలదీ ఒక్కటే మాట అని వివరించారు. ఉగ్రవాదం, తీవ్రవాదంతోపాటు రాడికలైజేషన్పై పోరాటంలో భారత్, కెనడా మధ్య సహకారం ప్రపంచ శాంతి, స్థిరత్వానికి అత్యంత కీలకమని అన్నారు. కెనడాపై దాడులు, పశ్చిమాసియాలో తాజా పరిణామాలు, అక్కడి ప్రజల భద్రతకు సవాళ్లు ఎదురవుతుండడంపై మోదీ, మార్క్ కార్నీ చర్చించారు. అభిప్రాయాలు పంచుకున్నారు.వివాదాలు, ఘర్షణలను సంప్రదింపులు, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలని మోదీ సూచించారు. అలాంటి ప్రయత్నాలకు తమ మద్దతు కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. పశ్చిమాసియా పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. అక్కడ భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారి భద్రత కోసం ఆయా దేశాలతో కలిసి పని చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు. అమెరికాతో వాణిజ్య సంబంధాలు బలహీన పడుతున్న నేపథ్యంలో భారత్తో వాణిజ్యానికి కెనడా అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా తమ ఇరుదేశాల వాణిజ్య సంబంధాలను మరింత విస్తృతపర్చుకోవాలని ప్రధాని మోదీ, మార్క్ కార్నీ నిర్ణయించుకున్నారు. భారత్లో కెనడా వర్సిటీ క్యాంపస్లు ద్వైపాక్షిక వార్షిక వాణిజ్యాన్ని మరో నాలుగేళ్లలో 50 బిలియన్ డాలర్లకు చేర్చడమే తమ ధ్యేయమని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేసుకుంటామన్నారు. భారత్, కెనడా మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని త్వరలోనే ఖరారు చేస్తామని, దీనివల్ల రెండు దేశాల్లో నూతన పెట్టుబడులు వస్తాయని, యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. కెనడా పెన్షన్ నిధి నుంచి భారత్లో 100 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టారని, మనదేశ ప్రగతి చరిత్ర పట్ల కెనడాకు ఉన్న బలమైన విశ్వాసానికి ఇదొక నిదర్శనమని స్పష్టం చేశారు. భారత్, కెనడాల మధ్య ప్రస్తుతం వార్షిక వాణిజ్యం 13 బిలియన్ డాలర్లుగా ఉంది. కెనడా నుంచి అరుదైన ఖనిజాలు దిగుమతి చేసుకోవడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు.తద్వారా సప్లై చైన్స్ బలోపేతం అవుతాయన్నారు. ఇంధన రంగంలో ‘తదుపరి తరం భాగస్వామ్యం’ నిరి్మంచుకుంటున్నామని చెప్పారు. హైడ్రోకార్బన్లు సహా పునరుత్పాధక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ స్టోరేజీపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నామని వివరించారు. దీర్ఘకాలంలో యురేనియం కోసం కెనడాలో చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నామని మోదీ హర్షం వ్యక్తం చేశారు.రక్షణ రంగంలో భారత్, కెనడాల మధ్య సహకారం నానాటికీ పెరుగుతుండడం రెండు దేశాల లోతైన మైత్రికి, పరస్పర విశ్వాసానికి ప్రతీక అని వివరించారు. కెనడా యూనివర్సిటీల క్యాంపస్లు మన దేశంలో ఏర్పాటు కాబోతున్నాయని తెలియజేశారు. విద్యా రంగంలో ఇరుదేశాలు పరస్పరం సహకరించుకుంటాయని స్పష్టం చేశారు. కీలక రంగాల్లో భారత్తో సంబంధాలను పటిష్టం చేసుకోవాలన్నదే తమలక్ష్యమని మార్క్ కార్నీ తేలి్చచెప్పారు. ఇరుదేశాలు లబ్ధి పొందేలా కలిసి పని చేస్తామన్నారు. యురేనియం ఒప్పందాన్ని భారత్, కెనడాల స్నేహానికి ప్రతీకగా అభివరి్ణంచారు. సంస్కరణలు, సులభతర వాణిజ్యానికి పెద్దపీట: మోదీ భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. దేశీయంగా వినియోగం పెరుగుతుండడం, భారీగా పెట్టుబడులు వస్తుండడం, డిజిటల్ ఎకానమీ వంటివి ఇందుకు దోహదం చేస్తున్నాయని తెలిపారు. సోమవారం ఇండియా–కెనడా సీఈఓ ఫోరమ్ సదస్సులో ఆయన ప్రసంగించారు. సంస్కరణలతోపాటు సులభతర వాణిజ్యానికి పెద్దపీట వేస్తున్నామని, ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా పరుగులు తీయడం తథ్యమని స్పష్టం చేశారు. కెనడాతో కలిసి త్వరలోనే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సీఏపీఏ) కుదుర్చుకుంటామని వెల్లడించారు. ఈ సదస్సులో భారత్, కెనడా వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. -
గల్ఫ్ దేశాల నేతలతో ప్రధాని మోదీ సంప్రదింపులు
న్యూఢిల్లీ: అమెరికా-ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాల నేతలతో భారత ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరుపుతున్నారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల భద్రతపై ఆందోళన నెలకొన్న తరుణంలో ప్రధాని మోదీ.. ఆ దేశాల నేతలకు ఫోన్లు చేసి చర్చిస్తున్నారు. ఈ యుద్ధం సెగ గల్ఫ్ దేశాలపై తీవ్రంగా ఉంది. ప్రధానంగా ఎనిమిది అరబ్ దేశాలపై పడింది. అమెరికా దళాలకు ఆశ్రయం కల్పించిన అరబ్ దేశాలను టార్గెట చేస్తూ ఇరాన్ దాడులను ఉధృతం చేసింది. ఇది అమెరికాపై ప్రత్యక్ష ప్రభావం కంటే గల్ఫ్ దేశాలు అత్యంత ప్రభావితమవుతున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాను యుద్ధం నుంచి ఉపసంహరించుకోవడానికి ఇరాన్ వేసిన ఎత్తుగడగా ఈ దాడులు జరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.. వారి మాటల్ని బట్టి ఇప్పుడు ప్రభావితమయ్యే గల్ప్ దేశాలన్నీ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మొరపెట్టుకుని యుద్ధం ఆపేలా చేయాలనేది ఇరాన్ వ్యూహంగా కనబడుతోంది. దీనిలో భాగంగా గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసింది ఇరాన్. దాంతో గల్ఫ్ దేశాల్లో విదేశీయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏ ముప్పు పొంచి ఉందో అర్థం కాకండా ఉంది వారి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ.. గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఆయా దేశాధినేతలతో ఫోన్లలో సంప్రదింపులు జరుపుతున్నారు. అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల్ని తిరిగి స్వదేశానికి తీసుకొచ్చే పరిస్థితిపై చర్చిస్తున్నారు. -
ఇరాన్ వార్ టెన్షన్.. మోదీ కీలక వ్యాఖ్యలు
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇరు దేశాల మధ్య యుద్దంతో పరిస్థితులు చాలా ఆందోళనకరంగా మారాయన్నారు. ఈ సమయంలో ఇరువర్గాలు సమన్వయం పాటించాలని చర్చలతోనే సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. భారత్ ఎప్పుడూ శాంతి కోసమే కృషిచేస్తుందని మోదీ తెలిపారు. నిన్న ఆదివారం ఇరాన్ సుప్రీం లీడర్ ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడిలో హతమైన సంగతి తెలిసిందే. ఆయన మృతితో ఇరాన్ రెచ్చిపోతుంది. తన సమీప గల్ఫ్ దేశాలలోని అమెరికా స్థావరాలపై దాడి చేస్తుంది. మరోవైపు ఇజ్రాయెల్ పైనా దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా సైతం ప్రతి దాడులు చేస్తుండడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.అయితే ప్రస్తుతం ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. సోషల్ మీడియాలో విద్వేష ప్రచారాలపై నిఘా పెట్టాలని సూచించింది. మత ప్రచారాలను గుర్తించి ముందస్తు చర్యలను తీసుకోవాలంది. ఉద్రిక్త ప్రసంగాలు చేసే వారిపై నిఘా ఉంచాలని తెలిపింది. అన్ని రాష్ట్రాల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. -
సీసీఎస్ అత్యవసర సమావేశం.. నెతన్యాహుకు మోదీ ఫోన్
ఢిల్లీ: ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో మాట్లాడినట్టు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రస్తుత దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, శాంతి దిశగా చర్యలు తీసుకోవాలని మోదీ.. నెతన్యాహుకు సూచించినట్టు చెప్పుకొచ్చారు.ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా నెతన్యాహు, యూఏఈ అధ్యక్షుడితోనూ మాట్లాడినట్టు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ సందర్బంగా మోదీ.. ఇరాన్తో యుద్ధం, తాజా పరిణామాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. పౌరుల భద్రతే ప్రాధాన్యమని స్పష్టం చేశారు. శాంతి దిశగా చర్యలు చేపట్టాని నెతన్యాహుకు సూచించినట్టు తెలిపారు. అలాగే, యూఏఈపై దాడులను మోదీ తీవ్రంగా ఖండించారు. ఇరాన్ దాడుల్లో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. యూఏఈకి భారత్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉద్రిక్తతలను తగ్గించడం, ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని సమర్థిస్తామని.. శత్రుత్వాలను త్వరగా నిలిపివేయాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటిస్తుందని మోదీ చెప్పుకొచ్చారు.Had a telephone call with PM Benjamin Netanyahu to discuss the current regional situation. Conveyed India's concerns over recent developments and emphasised the safety of civilians as a priority. India reiterates the need for an early cessation of hostilities.@netanyahu— Narendra Modi (@narendramodi) March 1, 2026సీసీఎస్ అత్యవసర సమావేశం.. అయితే.. భద్రత, వ్యూహాత్మక వ్యవహారాలపై భారతదేశ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ భద్రతా కేబినెట్ కమిటీ (CCS) సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించిన కొన్ని గంటల తర్వాత ఈ సమాచారం వచ్చింది. రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, పుదుచ్చేరిలలో రెండు రోజుల పర్యటన నుండి ఆయన న్యూఢిల్లీకి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఈ సమావేశం జరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. భారత చమురు దిగుమతులకు కీలకమైన షిప్పింగ్ మార్గమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం వల్ల కలిగే ప్రభావాన్ని కూడా CCS అంచనా వేసినట్టు తెలుస్తోంది.మధ్యప్రాచ్యంలోని భారతీయ పౌరుల భద్రత, వివాదం మరింత తీవ్రమైతే అత్యవసర ప్రణాళికలపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. దాదాపు 10,000 మంది భారతీయులు ఇరాన్లో, 40,000 మందికి పైగా ఇజ్రాయెల్లో, పశ్చిమాసియా మరియు గల్ఫ్లో సుమారు తొమ్మిది మిలియన్ల మంది భారతీయులు నివసిస్తున్నట్టు సమాచారం. తాజా దాడుల నేపథ్యంలో వారి భద్రతపై ఆందోళన నెలకొంది. -
డీఎంకే సర్కార్ అవినీతిమయం: ప్రధాని మోదీ
సాక్షి, చెన్నై/పుదుచ్చేరి: తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయంగా మారిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. డీఎంకే మంత్రులు అవినీతిలో పరస్పరం పోటీపడుతున్నారని విమర్శించారు. డీఎంకే సర్కారు అవినీతికి పాల్పడడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. పేదలు, రైతులు, యువతను దోచుకుందని ధ్వజమెత్తారు. ఈ అవినీతి ప్రభుత్వానికి ఇకపై అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని తేలి్చచెప్పారు. ప్రధాని మోదీ ఆదివారం తమిళనాడులో పర్యటించారు. రూ.4,400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. అనంతరం మదురైలో బహిరంగ సభలో ప్రసంగించారు. అవినీతి, అసమర్థ పాలనతో తమిళనాడు ప్రజలు విసుగెత్తిపోయారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కచ్చతీవులను శ్రీలంకకు అప్పగించి తమిళనాడుపై కక్ష తీర్చుకుందన్నారు. తమకు అధికారం అప్పగిస్తే తమిళనాడును అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి, ఏఎంఎంకే వ్యవస్థాపకుడు టీటీవీ దినకరన్, పీఎంకే నేత అన్బుమణి రాందాస్ సభలో పాల్గొన్నారు.పుదుచ్చేరిని ఏటీఎంగా మార్చుకున్న కాంగ్రెస్ పుదుచ్చేరిని గతంలో ఢిల్లీలోని ఒక కుటుంబానికి ఏటీఎంగా కాంగ్రెస్ మార్చేసిందని మోదీ నిప్పులు చెరిగారు. ఆదివారం అక్కడ రూ.2,714 కోట్ల ప్రాజెక్టులకు ఆయన ప్రారం¿ోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తర్వాత సభలో మాట్లాడారు. పుదుచ్చేరి అభివృద్ధికి ఆ కాంగ్రెస్, డీఎంకే స్పీడ్ బ్రేకర్గా మారాన్నారు. బీజేపీ, ఎన్ఆర్ కాంగ్రెస్ డబుల్ ఇంజిన్ పాలనలో పుదుచ్చేరి ప్రగతి పథంలో దూసుకెళ్తోందని హర్షం వ్యక్తం చేశారు. మోదీ ఆదివారం తమిళనాడులో తిరుప్పరకుండ్రంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని దర్శంచుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మోదీ దోతీ, కుర్తా ధరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణచేశారు. పూజల్లో పాల్గొన్నారు. -
బీజేపీ పాలనకు కౌంట్డౌన్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ కోర్టు తీర్పుతో మద్యం పాలసీ కేసు నుంచి బయటపడిన 48 గంటలైనా గడవకమునుపే ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలపై విమర్శల దాడి మొదలుపెట్టారు. అధికార పీఠం నుంచి బీజేపీని కిందికి దించేందుకు కౌంట్డౌన్ మొదలైందంటూ విరుచుకుపడ్డారు. ఆదివారం జంతర్మంతర్ వద్ద జరిగిన ఆప్ ర్యాలీలో కేజ్రీవాల్ మాట్లాడారు. మద్యం విధానం కేసులో తనను అక్రమంగా ఇరికించేందుకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా కుట్రపన్నారని ఆరోపించారు. అయితే, కోర్టు ఇచి్చన చారిత్రక తీర్పు తాను కరుడుగట్టిన నిజాయతీపరడన్నది రుజవైందంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీలో భయమొదలైందంటూ ఆయన..నిరంకుశుడు ఇలా భయపడుతున్నాడంటే దానర్థం..అతడి పాలనకు ముగింపు దగ్గరపడున్నట్లేనని పేర్కొన్నారు. చిన్నారుల విద్య కోసం పోరాడిన, శాస్త్రవేత్త సోనమ్ వాంగ్చుక్ను మోదీయే జైలులో పెట్టించారు. మహిళా ఎంపీలు దాడి చేస్తారనే భయంతోనే ఆయన ఒక రోజు పార్లమెంట్కు వెళ్లలేదు. ట్రంప్ అన్నా మోదీకి భయమే’అని కేజ్రీవాల్ దుయ్యబట్టారు. దేశంలో బీజేపీ 12 ఏళ్ల పాలనలో అన్ని రంగాలు నాశనమయ్యాయన్నారు. రహదారులు, ఆరోగ్య రంగం, విద్య, పారిశుధ్యం..ఇలా అన్నీ దారుణంగా మారాయని విమర్శించారు. జీవించగలిగే భారత్ను ప్రజలు కోరుకుంటుండగా వికసిత్ భారత్ అంటూ ప్రధాని మోదీ ప్రచారం చేసుకుంటున్నారన్నారు. పరీక్షా పే చర్చ పేరుతో డ్రామాలు ఆపి, పరీక్ష పత్రాల లీకేజీని అరికట్టాలన్నారు. ఏడాది పాలనలోనే ఢిల్లీని బీజేపీ నాశనం చేసిందని మండిపడ్డారు. దేశానికి మోదీ చేసిందేమీ లేదంటూ కేజ్రీవాల్..కుట్రలు, ఓటర్ల జాబితా అవకతకల ద్వారానే ఆయన అధికారంలో కొనసాగుతున్నారంటూ ఆరోపించారు. -
నితీశ్కు ప్రధాని మోదీ... పుట్టినరోజు శుభాకాంక్షలు
పట్నా/చెన్నై/న్యూఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదివారం 76 ఏట అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు నేతలు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, యూపీ గవర్నర్, ఉప ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు చిరాగ్ పాశ్వాన్, జితన్ రామ్ మాంఝీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అరుణాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం చౌనామెయిన్ తదితరులు నితీశ్కు శుభాకాంక్షలు తెలిపారు. బిహార్ అభివృద్ధి కోసం ఆయన అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. దార్శనికత, అభివృద్థి పథకాలతో లక్షలాది మంది జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేస్తున్న నితీశ్కు దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలని ప్రారి్థంచారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కూడా ఆదివారం పుట్టిన రోజు జరుపుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీ, గవర్నర్ ఆర్.ఎన్.రవి, సినీనటుడు రజనీకాంత్, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సహా పలువురు నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. డీఎంకే ప్రముఖులు అన్నాదురై, ఎం.కరుణానిధి స్మారక చిహ్నాల వద్ద స్టాలిన్ పుష్పగుచ్ఛాలుంచి నివాళులరి్పంచారు. తమిళ భాష, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే తన జీవిత ధ్యేయమని ఎక్స్ వేదికగా ప్రకటించారు. మణిపూర్ ముఖ్యమంత్రి యుమ్నామ్ ఖేమ్చంద్ సింగ్కు కూడా ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మణిపూర్ ప్రజల సేవలో ఆయన దీర్ఘకాలం, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. -
సిక్కులకు న్యాయం కోసం కృషి
నవీ ముంబై: సిక్కులకు గౌరవం, న్యాయం దక్కేలా కృషి చేసేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధాని మోదీ చెప్పారు. అందుకే, 1984లో ఇందిర మరణానంతరం సిక్కులపై జరిగిన దాడులపై ప్రత్యేక విచారణ జరిపేందుకు తమ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిందన్నారు. మూసివేసిన ఎన్నో కేసులను తిరిగి తెరిచి, విచారణ చేపట్టామని తెలిపారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందజేశామన్నారు. జాతీయ మైనారిటీ కమిషన్లో సిక్కులకు మరింత ప్రాముఖ్యతను కల్పించామన్నారు. గురు తేజ్ బహదూర్ అమరత్వం పొంది 350 ఏళ్లయిన సందర్భంగా ముంబైలోని ఖర్గార్లో ఆదివారం జరిగిన ‘హింద్–ది–చదర్’ను ఉద్దేశించి ప్రధాని వర్చువల్గా మాట్లాడారు. అఫ్గానిస్తాన్లో పవిత్ర గురుగ్రంథ్ సాహిబ్ ప్రతులు, సిక్కు కుటుంబాల భద్రత ప్రమాదంలో పడగా ప్రభుత్వం తక్షణమే స్పందించి సురక్షితంగా స్వదేశానికి తరలించిందని గుర్తు చేశారు. అఫ్గాన్లో యాతనలు పడిన సిక్కులకు సీఏఏ ద్వారా పౌరసత్వం కల్పించామని తెలిపారు. జమ్మూకశ్మీర్కు చెందిన సిక్కు కుటుంబాల పునరావాసానికి చర్యలు తీసుకున్నట్లు గుర్తు చేశారు. వేలాది మంది సిక్కుల పేర్లను బ్లాక్ లిస్టు నుంచి తొలగించడంతోపాటు వీసా నిబంధనలను సడలించినట్లు ప్రధాని వివరించారు. భవిష్యత్తుకు బాటలు పరిచేవి..హింద్–ది–చాదర్ వంటి కార్యక్రమాలు కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడానికి కాకుండా భవిష్యత్తుకు దారులు వేస్తాయన్నారు. ‘గురు తేజ్ బహదూర్ కాలంలో ధైర్యం, సత్యసంధతకు ఎంతటి ప్రాముఖ్యం ఉందో, నేటికీ అంతే సందర్భోచితంగా ఉంది. మన కొత్త తరం ఇటువంటి విలువలని అందిపుచ్చుకున్నప్పుడు, సంప్రదాయం అనేది కేవలం ఒక జ్ఞాపకంలా మిగిలిపోదు; అది భవిష్యత్తుకు మార్గదర్శకంగా మారుతుంది. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం కూడా ఇదే. మనం చరిత్రను కేవలం స్మరించుకోవడమే కాదు, దానిని మన జీవితాల్లోకి కూడా తెచ్చుకోవాలి’అని ప్రధాని మోదీ తన వర్చువల్ ప్రసంగంలో పేర్కొన్నారు.మన గురువుల త్యాగాలు..దేశ చరిత్ర పరాక్రమం, సమన్వయం మరియు సహకారంతో నిండి ఉందని ఆయన అన్నారు. గురువుల అత్యున్నత త్యాగం దేశ ఐక్యతను మరింత బలోపేతం చేసిందని ప్రధాని చెప్పారు. సమాజంలోని ప్రతి వర్గం వారి నుంచి స్ఫూర్తిని పొందిందని, అది సమాజం సత్య మార్గంలో ముందుకు స్థిరంగా సాగడానికి సాయపడిందని ప్రధాని తెలిపారు. ‘దేశానికి సామాజిక ఐక్యత ఎంతో అవసరమైన ఈ సమయంలో, మన గురువులు, సాధువుల ఆశీస్సులు మనకు ఉన్నాయనే నమ్మకాన్ని ఈ కార్యక్రమం కలిగిస్తోంది. ఈ ప్రయాణం గత ఏడాది నాగ్పూర్ నుంచి ప్రారంభమైంది, ఆ తర్వాత నాందేడ్ వరకు సాగింది. నేడు నవీ ముంబైలో ఈ ప్రయాణం ఒక ముఖ్యమైన దశకు చేరుకుంది’అని ప్రధాని అన్నారు. -
అది ముస్లిం లీగ్–మావోయిస్టు కాంగ్రెస్
జైపూర్/సనంద్: విపక్ష కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పేసి నిరసన తెలపడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రపంచ దేశాల ఎదుట మనదేశాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఏ ఒక్క అవకాశాన్ని కూడా కాంగ్రెస్ వదులుకోవడం లేదని మండిపడ్డారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(ఐఎన్సీ) నేడు ముస్లింలీగ్–మావోయిస్టు కాంగ్రెస్(ఎంఎంసీ)గా మారిందంటూ ధ్వజమెత్తారు. ముస్లిం లీగ్ వల్ల భారతదేశం ముక్కలైందని చెప్పారు. నేడు కాంగ్రెస్ కూడా అదే తరహాలో వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. మావోయిస్టుల దారిలోనే నడుస్తూ దేశంపై దాడి చేస్తోందని విమర్శించారు. ప్రధాని మోదీ శనివారం రాజస్తాన్లోని అజీ్మర్లో పర్యటించారు. రూ.16,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. దేశవ్యాప్తంగా జరిగే హ్యూమన్ ప్యాపిలో మా వైరస్(హెచ్పీవీ) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. ప్రపంచ దేశాలు మన దేశం గురించి గొప్పగా మాట్లాడినప్పుడు ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగిపోతుందని అన్నారు. కానీ, కాంగ్రెస్ మాత్రం విదేశీయుల ఎదుట భారతదేశాన్ని కించపర్చడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. ఆ పార్టీ ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూనే ఉందన్నారు. అది తట్టుకోలేక దేశ ప్రతిష్టను దెబ్బతీస్తూ ప్రతీకా రం తీర్చుకుంటోందని దుయ్యబట్టారు. దేశాన్ని కించపర్చడం, సైనిక దళాలను బలహీనపర్చడం కాంగ్రెస్కు అలవాటేనని పేర్కొన్నారు. రాజస్తాన్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి, పేపర్ లీక్ వార్తలు నిత్యం వచ్చేవని గుర్తుచేశారు. నేడు రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అద్భుతమైన పాలన అందిస్తోందని, ప్రజలకు ఎనలేని మేలు చేస్తోందని ప్రధాని మోదీ ప్రశంసించారు. నేడు పేపర్ లీక్లు లేవని, అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టంచేశారు. నేడు తిరుప్పరకుండ్రంలో మోదీ పూజలు ప్రధాని మోదీ శనివారం తమిళనాడులోని చెన్నైకి చేరుకున్నారు. ఆయన ఆదివారం మదురై, పుదుచ్చేరిలో పర్యటించనున్నారు. తిరుప్పరకుండ్రంలోని అరుళ్మిగు సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. అలాగే పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. గుజరాత్లో సెమీకండక్టర్ ప్లాంట్ ప్రారంభం గుజరాత్లోని సనంద్లో మైక్రాన్ టెక్నాలజీ కంపెనీ ఆధ్వర్యంలోని సెమీకండక్టర్ ప్లాంట్ను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. సాఫ్ట్వేర్ రంగంలో భారత్ తన సత్తాను ఇప్పటికే నిరూపించుకుందని ఆయన చెప్పారు. అలాగే హార్డ్వేర్ రంగంలోనూ శరవేగంగా దూసుకెళ్తోందని, ప్రత్యేక గుర్తింపును సాధిస్తోందని తెలిపారు. అమెరికా భాగస్వామ్యంలో ఈ ప్లాంట్ను నిర్మించినట్లు వెల్లడించారు. ఇరుదేశాల మధ్య బలమైన మైత్రికి ఇదొక ఉదాహరణ అని వివరించారు. ఇది ఏటీఎంపీ(అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్) ప్లాంట్. భారత్లో ఈ తరహా ప్లాంట్లలో ఇదే మొదటిది కావడం విశేషం. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని గ్లోబల్ ఇన్వెస్టర్లకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. వ్యాపార వృద్ధికి ఇక్కడ చక్కటి అవకాశాలు ఉన్నాయని సూచించారు. దేశంలో సెమీకండక్టర్ల తయారీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు. గత శతాబ్దాన్ని చమురు శాసించిందని, ఇప్పుటి శతాబ్దాన్ని మైక్రోచిప్ శాసించబోతోందని తేలి్చచెప్పారు. -
దేశవ్యాప్తంగా 14 ఏళ్ల బాలికలకు HPV టీకాలు : ప్రధాని మోదీ
రాజస్థాన్లోని అజ్మీర్లో శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV vaccination) టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తోపాటు, నివారించదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత, రాష్ట్రంలో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. NDA ప్రభుత్వం అన్ని స్థాయిలలో అభివృద్ధిని నిర్ధారించాలని నిశ్చయించుకుందని, HPV టీకా ప్రారంభం దానికి నిదర్శనమని పేర్కొన్నారు.అన్ని రాష్ట్రాలు .కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రతీ ఏడాది 14 ఏళ్ల సుమారు 1.15 కోట్ల మంది బాలికలకు ‘గార్డాసిల్’ అనే టీకాను ఉచితంగా అందించాలనేది లక్ష్యం. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందించబడుతుంది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు), కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, ఉప-జిల్లా ,జిల్లా ఆసుపత్రులు, అలాగే ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులలో ఈ టీకాలు అందుబాటులో ఉంటాయి.ఇదీ చదవండి: Liquor Policy: కేజ్రీవాల్కు క్లీన్ చిట్, అన్నా హజారే కీలక వ్యాఖ్యలుభారతదేశంలో 80 కంటే ఎక్కువ గర్భాశయ క్యాన్సర్ కేసులకు కారణమైన హై-రిస్క్ రకాల హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV), గర్భాశయ క్యాన్సర్, (ముఖ్యంగా హెచ్పీవీ టైప్ 16, 18) ప్రముఖ క్యాన్సర్లలో ఒకటిగా ఉంది. ఈ వ్యాక్సిన్ హెచ్పీవీ టైప్ 16, 18తోపాటు టైప్ 6, 11 రకాల నుంచి కూడా రక్షణ కల్పిస్తుందని కేంద్రం తెలిపింది. ఇదీ చదవండి: ప్రియుడి మోసం: ఇదే అదునుగా అగంతకుడి దారుణ హత్యాచారం -
వేట్లపాలెం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి భారీ ప్రాణనష్టం వాటిల్లడంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాన సానుభూతి తెలిపారు మోదీ. మృతుల కుటుంబాలకు రూ. రెండు లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు రూ. 50వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కాగా, వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు చోటు చేసుకుని 23 మంది వరకూ మరణించారు. ఆ ప్రమాద సమయంలో 70 మంది వరకూ ఆ తయారీ కేంద్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. మృతిచెందిన వారి కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకుని కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇవీ చదవండివేట్లపాలెంలో భారీ పేలుడు.. భారీ ప్రాణనష్టంవేట్లపాలెం అగ్ని ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి -
ఆవిష్కరణల స్ఫూర్తికి నీరాజనం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత గడ్డపై విజ్ఞాన శాస్త్ర వైభవాన్ని చాటిచెప్పిన మహోన్నత ఘట్టం ‘రామన్ ఎఫెక్ట్’ ఆవిష్కరణకు గుర్తుగా శనివారం దేశవ్యాప్తంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు, శాస్త్రవేత్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశాన్ని అగ్రగామిగా నిలుపుతున్న పరిశోధన, ఆవిష్కరణల స్ఫూర్తికి ఈ రోజు ఒక నిదర్శనమని ఆయన కొనియాడారు. Today, on National Science Day, we celebrate the spirit of research, innovation and scientific curiosity that drives our nation forward.This day commemorates the groundbreaking discovery of the Raman Effect by Sir CV Raman. This discovery placed Indian research firmly on the… pic.twitter.com/YcjOAdPosr— Narendra Modi (@narendramodi) February 28, 2026సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ప్రధాని మోదీ.. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ అసాధారణ ప్రతిభతో కనుగొన్న ‘రామన్ ఎఫెక్ట్’ భారతీయ శాస్త్రీయ ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచిపోయిందని, ఇది అంతర్జాతీయ స్థాయిలో భారత పరిశోధనా రంగానికి సముచిత గుర్తింపు తీసుకువచ్చిందని ప్రశంసించారు. యువతను సాధికారత వైపు నడిపించడం, పరిశోధనల మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, ప్రపంచ సంక్షేమం కోసం సాంకేతికతను వినియోగించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ కూడా శాస్త్రవేత్తల కృషిని అభినందిస్తూ, కృత్రిమ మేధ (AI) నుండి రక్షణ, ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధన రంగాల వరకు భారతీయ శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి దేశ ఆర్థిక వ్యవస్థను, భద్రతను మరింత బలోపేతం చేస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు చెబుతూ, వారి నిరంతర జ్ఞానాన్వేషణ స్వయంసమృద్ధ భారత్ నిర్మాణానికి బాటలు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 1928 ఫిబ్రవరి 28న సీవీ రామన్ కాంతి పరిక్షేపణంపై చేసిన పరిశోధనకు గానూ 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. విజ్ఞాన శాస్త్ర రంగంలో నోబెల్ అందుకున్న తొలి ఆసియావాసిగా ఆయన చరిత్ర సృష్టించారు.ఇది కూడా చదవండి: బీటీఎస్ స్టార్ ప్రాణహాని వ్యాఖ్యలు.. అభిమానుల ఆందోళన -
కార్నీ పర్యటన ప్రారంభం
న్యూఢిల్లీ: భారత్ ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అని కెనడా ప్రధాని మార్క్ కార్నీ అన్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆయన శుక్రవారం భారత్ చేరుకున్నారు. ఉన్నతాధికారుల బృందంతో కలిసి శుక్రవారం సాయంత్రం ముంబై విమానాశ్రయంలో దిగారు. అనంతరం పలువురు వ్యాపారవేత్తలతో భేటీ అయ్యారు. ఆదివారం కార్నీ ఢిల్లీ చేరుకుంటారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరపనున్నారు. అనంతరం విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్తో కూడా భేటీ అవుతారు. 2023లో కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యానంతరం ఇరుదేశాల సంబంధాలు బాగా దెబ్బ తిన్న విషయం తెలిసిందే. వాటిని తిరిగి బలోపేతం చేసుకోవడంతో పాటు పలు రంగాల్లో నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడమే లక్ష్యంగా కార్నీ భారత్లో పర్యటిస్తున్నారు. భారత్, కెనడా వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా వాణిజ్యం, ఇంధనం, టెక్నాలజీ సహా పలు రంగాలపై ప్రధానులు లోతుగా చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ పేర్కొంది. -
ప్రైవేట్ పెట్టుబడులు వెల్లువెత్తాలి
న్యూఢిల్లీ: దేశంలో మరిన్ని పెట్టుబడులు, నవీన ఆవిష్కరణలకు భారత పారిశ్రామిక వర్గాలు తక్షణమే నడుం బిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధిలో ప్రైవేట్ రంగం సైతం కీలక పాత్ర పోషించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వరుస బడ్జెట్ల ద్వారా పెట్టుబ డులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సైతం పెట్టుబడి వ్యయాన్ని భారీగా పెంచుతోందని గుర్తుచేశారు. శుక్రవారం ‘టెక్నాలజీ, రిఫామ్స్, ఫైనాన్స్ ఫర్ వికసిత్ భారత్’పై మొదటి పోస్ట్–బడ్జెట్ వెబినార్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. 11 ఏళ్ల క్రితం ప్రభుత్వ పెట్టుబడి వ్యయం రూ.2 లక్షల కోట్లుగా ఉండేదని, ఇప్పుడు అది రూ.12 లక్షల కోట్లకు చేరిందని వెల్లడించారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రైవేట్ పెట్టుబడులు వెల్లువెత్తేలా 2026–27 బడ్జెట్లో పలు ప్రకటనలు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు, నైపుణ్యాలు కలిగిన భాగస్వాములు కలిసి కట్టుగా పనిచేస్తే సంస్కరణలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయన్నారు. కాగితంపై ప్రకటించినవి క్షేత్రస్థాయిలో విజయాలుగా నమోదు అవుతాయన్నారు. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వ ప్రాధాన్య రంగాల గురించి ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రహదారులు, రైల్వేలు, ఓడ రేవులు, విమానా శ్రయాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఇంధన వ్యవస్థల్లో ప్రభుత్వం రికార్డు స్థాయిలో పెట్టుబడి వ్యయం చేస్తున్నట్లు తెలియజేశారు. ఆయా రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులకు చక్కటి అవకాశాలు ఉన్నాయన్నారు. ‘2047 నాటికి వికసిత్ భారత్’ ఆశయాన్ని సాకారం చేసుకోవడానికి ‘సంస్కరణల భాగస్వామ్య చార్టర్’ రూపొందించుకుందామని మోదీ ప్రతిపాదించారు. -
Liquor Scam Case మోదీ, అమిత్షా కుట్ర : కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ మాజీ ఎక్సైజ్ (లిక్కర్) విధానానికి సంబంధించిన స్కాంలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా భారీ ఊరట లభించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అవినీతి కేసులో సహా నిందితులందరినీ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆప్నేత కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాం కేసులో నిర్దోషిగా విడుదలైన తర్వాత, కేజ్రీవాల్ బీజేపీపై తన దాడిని ఎక్కుపెట్టారు. తనపై తప్పుడు కేసులు బనాయించి,తనను ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం కుట్ర పన్నిందని ఆరోపించారు. లిక్కర్ స్కామ్లో ఆరోపణలకు స్పందిస్తూ, తనపై, తన పార్టీపై వచ్చిన అన్ని ఆరోపణలు నిరాధారమైనవని తేలిందని కేజ్రీవాల్ అన్నారు. ఈ కేసులో సీబీఐ ,ఈడీ ఛార్జ్ షీట్లు దాఖలు చేసినప్పటికీ, ప్రాసిక్యూట్ చేయడానికి తగిన ఆధారాలు ఉన్నాయా లేదా అనే దానిపై తుది నిర్ణయం కోర్టుదేనని స్పష్టం చేశారు. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, కేసును కొనసాగించ డానికి ఖచ్చితమైన ఆధారాలు లేవని కోర్టు తేల్చిందని కేజ్రీవాల్ అన్నారు. ఇదీ చదవండి: లిక్కర్ కేసులో కేజ్రీవాల్కు క్లీన్ చిట్, మాజీ సీఎం భావోద్వేగంకేజ్రీవాల్కు క్లీన్ చిట్ రావడంతో అటు ఆప్ శ్రేణులు, ఇటు ఆయన భార్య సునీత ఆనందంలో మునిగి తేలారు. భర్తను ఆలించగనం చేసుకొని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. -
పెళ్లి తర్వాత మోదీ, అమిత్ షాలను కలిసిన 'విరోష్' జోడీ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా సరే ‘విరోష్’ జోడీ పేరుతో వారి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నిన్న ఉదయపూర్లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగిన విషయం తెలసిందే. అయితే, మార్చి 4న జరగనున్న తమ రిసెప్షన్కు రావాలని ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రి అమిత్ షాను విజయ్, రష్మిక ఆహ్వానించారు. పెళ్లి కార్యక్రమం పూర్తి అయిన తర్వాత నూతన దంపతులు కలిసి అహ్వానం అందించారు. ఇప్పటికే వారిద్దరికీ శుభాంకాక్షలు చెబుతూ మోదీ ఒక లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి 4న హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో రిసెప్షన్ జరగునుంది. ఈ రిసెప్షన్ కోసం ఇప్పటికే పలువురు రాజకీయ సినీ వ్యాపారవేత్తలను విజయ్, రష్మిక ఆహ్వానించారు.‘గీత గోవిందం’ సినిమాలో హీరో హీరోయిన్లుగా పెళ్లి పీటల మీద కూర్చున్న విజయ్ దేవరకొండ – రష్మికా మందన్నా నిజ జీవితంలో ఏడడుగులు వేశారు. ముందు స్నేహితులై, ఆ తర్వాత ప్రేమికులుగా మారి ఇప్పుడు భార్యాభర్తలయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గల మెమెంటోస్ ప్యాలెస్లో ఉదయం 10 గంటల 10 నిమిషాలకు వైభవంగా, ఆహ్లాదకరంగా జరిగింది. ఉదయం తెలుగు, సాయంత్రం కొడవ (కర్ణాటకకు చెందిన కొడగు జిల్లా రష్మిక సొంతూరు) సంప్రదాయం పరంగా పెళ్లి వేడుకలు జరిగాయి. దండలు మార్చుకున్నప్పుడు వధూవరులిద్దరూ ఆనందబాష్పాలతో ఉద్వేగానికి గురయ్యారు. భావోద్వేగాలు, చిరునవ్వులు మధ్య జరిగిన ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నవారు నూతన వధూవరులిద్దర్నీ ఆశీర్వదించారు. -
ఇండియాతో బంధం ఎంతో ప్రత్యేకం.. నెతన్యాహూ
ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయోల్ పర్యటన ముగిసింది. ఆ దేశంలో ఘనంగా అతిథ్యం స్వీకరించడంతో పాటు రెండు దేశాలు కీలకమైన పలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇదిలా ఉండగా ఆ దేశ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహు ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. భారత్తో తనకు వ్యక్తిగతంగా ఎంతో కనెక్టివీటి ఉందని తెలిపారు. తన వైఫ్ సారా నెతన్యాహుని మెుదటి సారి కలిసింది ఇండియన్ రెస్టారెంట్లోనే అని తెలిపారు.భారత్ -ఇజ్రాయెల్ మైత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ద్వైపాక్షిక సంబంధాల పరంగా కాకుండా వ్యక్తిగతంగానూ భారత్ అంటే ఇజ్రాయెల్కు ఎంతో అభిమానం. ప్రపంచంలో చాలా దేశాలు యూదులపై దాడులు చేస్తున్న సమయంలో ఇండియా వారికి అండగా నిలిచింది. అందుకు భారత్తో ఇజ్రాయిలీలకు ఆత్మీయ అనుబంధం. ఇదిలా ఉండగా ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుకు వ్యక్తిగతంగానూ భారత్ తనకు ఎంతో ప్రత్యేకమని తెలిపారు.ఆయన మాట్లాడుతూ" నాకు వ్యక్తిగతంగా భారత్ ఎంతో ప్రత్యేకం. నా మెదటి,లేదా రెండవ సారి నా వైప్ సారాను ఇండియన్ రెస్టారెంట్లోనూ కలిసాను. ఆఫుడ్ మాత్రమే కాదు. ఆ డేట్ ఎంతో అద్భుతంగా సాగింది." అన్నారు. ఆ రెస్టారెంట్ను రీనా పుష్కర్నా అనే భారతీయురాలు నడిపిస్తుంది. ఆమె కర్రీ క్వీన్గా ఎంతో ఫేమస్ అన్నారు. భారతీయ వంటకాలను ఇజ్రాయెల్కు పరిచయం చేసిన ఘనత తనకే దక్కుతుందన్నారు.భారత్-ఇజ్రాయెల్ మధ్య సాంస్కృతిక రాయభారిగా తను పనిచేస్తుందన్నారు. గతంలో భారత ప్రధాని మోదీ ఇజ్రాయెల్ వచ్చినప్పుడు ఆ రెస్టారెంట్లోనూ విందు ఇచ్చామని భోజనం అద్భుతమని మోదీ ప్రశంసించారని తెలిపారు. ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన మోదీకి ఇజ్రాయెల్లో ఘన స్వాగతం లభించింది. -
నేటి నుంచి కెనడా ప్రధాని పర్యటన
న్యూఢిల్లీ: కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ నాలుగు రోజుల భారత పర్యటన శుక్రవారం మొదలుకానుంది. భారత ప్రధాని మోదీ, కెనడా ప్రధాని కార్నీల మధ్య చర్చలు ఇరుదేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంలో విజయం సాధించనున్నాయని భారత్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. కార్నీ భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. 2023లో కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇరుదేశాల నడుమ సంబంధాలు పూర్తిగా క్షీణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సత్సంబంధాల బలోపేతం కోసం కార్నీ భారత్లో పర్యటిస్తున్నారు. జూన్లో కననాస్కీస్, నవంబర్లో జొహన్నెస్బర్గ్లో ఇరుదేశాల అగ్రనేతల భేటీల తర్వాత రెండుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా పలు రంగాల్లో సహకారంపై మోదీ, కార్నీలు చర్చించనున్నారు. ఇరునేతలు సోమవారం ఇండియా–కెనడా సీఈవో ఫోరమ్లో పాల్గొంటారు. తర్వాత వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, భూఅయస్కాంతాలు, వ్యవసాయం, విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, ఇరుదేశాల ప్రజల మధ్య సత్సంబంధాల వంటి అంశాల్లో సహకారంపై చర్చలు జరపున్నారు. -
బంధం బలోపేతం
జెరూసలేం: భారత్, ఇజ్రాయెల్ దేశాలు కాల పరీక్షకు నిలిచిన తమ అనుబంధాన్ని ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకున్నాయి. త్వరలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని, ఇందుకోసం చర్చలు వేగవంతం చేయాలని నిర్ణయానికొచ్చాయి. గాజా శాంతి ప్రణాళికను భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఘర్షణల వల్ల మానవత్వం బలి కావొద్దని అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం ఇజ్రాయెల్కు చేరుకున్న ప్రధాని మోదీ గురువారం జెరూసలేంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూతో సమావేశమయ్యారు. ఇరుదేశాల సంబంధాలతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై వారిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. భారతదేశ రక్షణ ప్రయోజనాలు మధ్య ఆసియాలో శాంతి, స్థిరత్వంతో ప్రత్యక్షంగా ముడిపడి ఉన్నాయని మోదీ ఉద్ఘాటించారు. కల్లోలిత గాజాలో సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిస్థితులు నెలకొనాలని కోరుకుంటున్నట్లు స్పష్టంచేశారు. మోదీ, నెతన్యాహూ భేటీ సందర్భంగా భారత్, ఇజ్రాయెల్ మధ్య మొత్తం 17 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. కృత్రిమ మేధ(ఏఐ), వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, తయారీ, సంస్కృతి, సముద్ర సంబంధిత వారసత్వ బంధం, వ్యవసాయం తదితర కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పటిష్టం చేసుకోవడమే ధ్యేయంగా ఇరుదేశాలు ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అంతేకాకుండా రక్షణ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని తీర్మానించాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం బదిలీ చేసుకోవడం ద్వారా మిలటరీ హార్డ్వేర్ అభివృద్ధి, ఉత్పత్తి విషయంలో కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించాయి. ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం మోదీ, నెతన్యాహు సమావేశంలో అమెరికా–ఇరాన్ ఘర్షణ అంశంతోపాటు మధ్య ఆసియా పరిణామాలు ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చాయి. సమస్యలు, సంక్షోభాలను సంప్రదింపులు, దౌత్య మార్గాలను పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు చల్లారడానికి శాంతియుత పరిష్కారం కోసం తమవంతు సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భారత్, ఇజ్రాయెల్ దేశాలు తమ సంబంధాన్ని 2017లో వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేర్చాయి. తాజాగా ఆ బంధం ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారింది. ప్రపంచంలో ఉగ్రవాదానికి స్థానం లేదు ఆర్థిక సహకారమే రెండు దేశాలకు గ్రోత్ ఇంజన్ అని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. పరస్పరం పెట్టుబడులను ప్రోత్సహించుకోవడానికి గత ఏడాది ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందంపై సంతకాలు చేశామని వెల్లడించారు. అతి త్వరలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) కుదుర్చుకోబోతున్నామని ప్రకటించారు. ఇరుదేశాలకూ లబ్ధి చేకూర్చేలా ఈ ఒప్పందం ఉంటుందన్నారు. ఉగ్రవాదంపై ఉమ్మడిగా పోరాటం సాగించాలని తాము నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ప్రపంచంలో ఉగ్రవాదానికి స్థానం లేదన్నారు. అత్యాధునిక సాంకేతికతల విషయంలో ఇజ్రాయెల్తో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకుంటామన్నారు. ఏఐ, క్వాంటమ్, క్రిటికల్ మినరల్స్ విషయంలో సహకారాన్ని వేగవంతం చేస్తామని వివరించారు. భారత యూపీఐ సేవలను ఇజ్రాయెల్లో ప్రవేశపెట్టడానికి ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. రక్షణ రంగంతోపాటు పౌర అణు ఇంధనం, అంతరిక్ష రంగాల్లో సహకారాన్ని మరింత పటిష్టం చేసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదనకు సాంకేతిక సాయం అందించడానికి ఇజ్రాయెల్తో కలిసి ‘సెంటర్స్ ఆఫ్ ఎక్స్లెన్స్’ సంఖ్యను పెంచుతామన్నారు. నూతన ఆవిష్కరణలపై దృష్టి పెట్టిన దేశాలకే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ స్పష్టంచేశారు. భారత్, ఇజ్రాయెల్ ఈ రంగంలో కలిసి పని చేస్తాయన్నారు. ఎఫ్టీఏపై మూడు నెలల్లో చర్చలు భారత్, అమెరికా మధ్య ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై తదుపరి దశ చర్చలు మే నెలలో జరుగుతాయని కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. నాలుగు రోజులపాటు జరిగిన మొదటి దశ చర్చలు ఇటీవలే ముగిశాయి. వస్తువులు, సేవల్లో వాణిజ్యం, మేధో సంపత్తి హక్కులు, డిజిటల్ ట్రేడ్ వంటి అంశాలపై ఇరుపక్షాలు సంప్రదింపులు జరిపాయి. భారత్, ఇజ్రాయెల్ మధ్య వాణిజ్యం 3.62 బిలియన్ డాలర్లకు చేరింది. ఆసియాలో ఇజ్రాయెల్కు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి భారత్ కావడం విశేషం. టెక్ కంపెనీలకు ఆహా్వనం భారత్లో పెట్టుబడులకు ముందుకు రావాలని ఇజ్రాయెల్ టెక్నాలజీ కంపెనీలను మోదీ ఆహా్వనించారు. భారత యువతతో కలిసి పనిచేయాలని కోరారు. జెరూసలేంలో ఏఐ, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయానికి సంబంధించిన ప్రదర్శనను బెంజమిన్ నెతన్యాహూతో కలిసి మోదీ తిలకించారు. దీనిపై ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘భారతీయ’ యూదులతో మోదీ భేటీ భారతీయ మూలాలున్న యూదులతో ప్రధాని మోదీ గురువారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారితో ఆతీ్మయంగా సంభాíÙంచారు. ఇజ్రాయెల్లో 85 వేల మందికిపైగా భారతీయ మూలాలున్న యూదులు ఉన్నారు. వీరిలో చాలామంది భారత్ నుంచి వలసవచి్చనవారే. ప్రధాని మోదీ మాటల మనిషి కాదు.. చేతల మనిషి అని యూదు ప్రముఖుడు, అష్కెలాన్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ రికీ షాహా అన్నారు. మోదీతో భేటీ కావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తంచేశారు. ఇదిలా ఉండగా, ప్రధాని మోదీ ఇజ్రాయెల్లో రెండు రోజుల పర్యటన పూర్తిచేసుకొని గురువారం సాయంత్రం స్వదేశానికి బయలుదేరారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడితో మాటామంతి ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఇరుదేశాల స్నేహానికి గుర్తుగా హెర్జోగ్ అధికారిక నివాసం వారిద్దరూ కలిసి తొలుత ‘ఓక్’ మొక్క నాటారు. అనంతరం భేటీలో కీలక అంశాలపై చర్చించుకున్నారు. విద్య, స్టార్టప్లు, నవీన ఆవిష్కరణలు, టెక్నాలజీ, అనుసంధానం తదితర అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్లో పర్యటించాలంటే హెర్జోగ్ను మోదీ ఆహా్వనించారు.యాద్ వశేమ్ స్మారకం వద్ద నివాళులు జెరూసలేంలో యాద్ వశేమ్ స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. మారణహోమంలో బలైపోయిన యూదులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోదీ వెంట బెంజమిన్ నెతన్యాహూ కూడా ఉన్నారు. ‘హాల్ ఆఫ్ నేమ్స్’ను వారు సందర్శించారు. మారణహోమంలో ప్రాణాలు కోల్పోయిన తమ బంధువుల పేర్లను మోదీకి నెతన్యాహూ చూపించారు. -
ఓటరును పడగొట్టే 'సినిమా'..ఇదో కొత్త రాజకీయం!
సాధారణంగా రాజకీయ నాయకులు బయట చూడడానికి కాస్త గంభీరంగా ఉంటారు. వారి ప్రసంగాలు, నిర్ణయాలు అన్నీ సీరియస్గానే ఉంటాయి. నిత్యం జనాల్లో ఉన్నప్పటికీ ‘మనవాడు’ అనే హోదా మాత్రం కొంతమందికే లభిస్తుంది. ఆ కొంతమందిలో తాము కూడా ఉండాలని చాలామంది నేతలు కోరుకుంటారు. అందుకే సామాన్య ప్రజలకు చేరువ కావడానికి 'సినిమా గ్లామర్'ను ఒక శక్తివంతమైన ఆయుధంగా వాడుకుంటున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సూపర్ స్టార్ మోహన్ లాల్ మధ్య జరిగిన తాజా ఇంటర్వ్యూ దీనికి తాజా ఉదాహరణ మాత్రమే. అయితే, ఈ వ్యూహం వెనుక దశాబ్దాల చరిత్ర, అంతర్జాతీయ రాజకీయ తంత్రం దాగి ఉంది.ఎన్నికల సమయంలో రాజకీయనాయకులు చేసే హడావుడి అంతా ఇంత కాదు. ఓటరుకు దగ్గరవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. రోడ్డు మీద బజ్జీలు వేస్తారు? పిల్లలతో కలిసి ఆటలు ఆడతారు, సెల్ఫీలు, ఇంట్లోకి వెళ్లి భోజనాలు.. ఇలా విచిత్రమైన పనులతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అయితే కానీ, ఓటరుకు మరింత దగ్గరవ్వాలంటే 'తమలోనూ ఒక సామాన్యుడు ఉన్నాడు' అని నిరూపించుకోవాలి. ఇందుకోసం సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు నిర్వహించడం ఒక గ్లోబల్ ట్రెండ్గా మారింది.పినరయిలోని మరో కోణంకేరళ రాజకీయాల్లో పినరయి విజయన్ అంటే అత్యంత కఠినమైన నాయకుడనే పేరుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలో పినరయి విజయన్ కు ఉన్న ఆ గంభీరమైన ముద్రను మార్చి, ఆయనలోని నవ్వు ముఖాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ ఛానల్ ఒక ఇంటర్వ్యూను ప్లాన్ చేసింది. మొదట మమ్ముట్టిని అనుకున్నప్పటికీ, ఇద్దరూ గంభీర స్వభావులే కావడంతో ఆ బాధ్యతను శ్రీనివాసన్ కు అప్పగించారు. శ్రీనివాసన్ అయితేనే పినరయిని నవ్వించగలరని భావించి చేసిన ఇంటర్వ్యూ సూపర్ హిట్ అయింది. తన చిన్నప్పటి దెయ్యాల భయం గురించి పినరయి సరదాగా చెప్పడం ప్రజల్లో ఆయనపై ఉన్న భయాన్ని పోగొట్టింది.నటి నవ్య నాయర్ కూడా గతంలో పినరయి కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేసింది. అక్కడ ఆమె పినరయిని ‘విజయన్ అంకుల్’ అని పిలిచారు. గంభీరమైన నాయకుడి వెనుక ఉన్న తండ్రిని, భర్తను ప్రజలకు పరిచయం చేయడమే ఆ కార్యక్రమ ఉద్దేశం.కలిసొచ్చిన మోదీ ‘మామిడి పండ్ల’ ముచ్చట్లు2019 లోక్సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనం సృష్టించింది. ఇది పూర్తిగా రాజకీయేతర సంభాషణ. మోదీకి మామిడి పండ్లు అంటే ఇష్టమా? ఆయన రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతారు? వంటి వ్యక్తిగత విషయాల గురించి ఇందులో చర్చించారు.మమతా బెనర్జీ తనకు కుర్తాలు పంపిస్తారని చెప్పడం ద్వారా, రాజకీయ వైరం ఉన్నా వ్యక్తిగత సంబంధాలు బాగుంటాయని సందేశం ఇచ్చారు. ఇది సామాన్య ఓటర్లలో మోదీ పట్ల సానుకూలతను పెంచింది. ఇది ఎన్నికల గిమ్మిక్కు అని విపక్షాలు విమర్శించినా, ఫలితం మాత్రం మోదీకి అనుకూలంగానే వచ్చింది. ఇదే పంథాలో ప్రపంచ నాయకులుభారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాధినేతలు కూడా ఇదే పంథాను అనుసరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు బరాక్ ఒబామా ‘బిట్వీన్ టూ ఫెర్న్స్’ వంటి హాస్య ప్రధాన్యత ఉన్న షోలలో పాల్గొన్నారు. తన ‘ఒబామా కేర్’ పథకం గురించి యువతకు చేరవేయడానికి సినీ తారల సహాయం తీసుకున్నారు. 2024లో జరిగిన అమెరికా ఎన్నికల సమయంలో డోనాల్డ్ ట్రంప్ జో రోగన్ వంటి పాపులర్ పాడ్కాస్టర్లతో గంటల తరబడి మాట్లాడారు. తన సోదరుడి మరణం గురించి భావోద్వేగంగా మాట్లాడుతూ ఓటర్లకు చేరువయ్యారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వతహాగా నటుడు కావడంతో, ఆయన తన ప్రతిష్టను పెంచుకోవడంలో సినిమా మాధ్యమాన్ని చక్కగా వాడారు. హాలీవుడ్ నటుడు షాన్ పెన్ ఆయనపై ‘సూపర్ పవర్’ అనే డాక్యుమెంటరీ కూడా తీశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తనను ఒక శక్తివంతమైన నాయకుడిగా ప్రపంచానికి చూపించుకోవడానికి హాలీవుడ్ దర్శకుడు ఆలివర్ స్టోన్ తో వరుస ఇంటర్వ్యూలు చేయించుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా అమెరికన్ టాక్ షో హోస్ట్లు స్టీఫెన్ కోల్బెర్ట్, కోనన్ ఓబ్రియన్ వంటి వారితో సరదాగా ముచ్చటిస్తూ తన ‘కూల్ ఇమేజ్’ను ప్రదర్శించారు.కలిసొస్తున్న ‘గ్లామర్’ పాలిటిక్స్రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇవి కేవలం ఎన్నికల గిమ్మిక్కులు మాత్రమే కాదు. డిజిటల్ యుగంలో ప్రజలు నాయకుడిలోని 'మానవీయ కోణాన్ని' చూడాలని కోరుకుంటున్నారు.కఠినమైన విధాన నిర్ణయాల కంటే, ఇలాంటి సరదా సంభాషణలే ప్రజల మెదళ్లలో ఎక్కువ కాలం గుర్తిండిపోతాయి.దీంతో పాటు సెలబ్రిటీల ఫాలోయింగ్ను వాడుకోవడం ద్వారా యువ ఓటర్లను సులువుగా ఆకర్షించవచ్చు. కేరళలో పినరయి-మోహన్ లాల్ ఇంటర్వ్యూ అయినా, ఢిల్లీలో మోదీ-అక్షయ్ ముచ్చట్లయినా.. అంతిమ లక్ష్యం ఒక్కటే: "నేను మీలో ఒకడిని" అని చాటిచెప్పడం. గ్లామర్,పొలిటికల్ పవర్ కలిసినప్పుడు పుట్టే ఈ 'కొత్త రాజకీయం' భవిష్యత్తులో మరిన్ని వింత పోకడలకు దారితీస్తుందనడంలో సందేహం లేదు. -
జెరూసలెంలో మోదీ.. 11 కీలక ప్రకటనలు
-
భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
జెరూసలేం: ఇజ్రాయెల్తో భారత్ పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. పలు ఒప్పందాలపై నరేంద్ర మోదీ-నెతన్యాహు సంతకాలు చేసుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధానితో నరేంద్ర మోదీ కీలక సమావేశం నిర్వహించారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్లో పర్యటించాలని నెతన్యాహును ప్రధాని మోదీ ఆహ్వానించారు. రక్షణ, వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి.విద్య, వ్యవసాయం, వాణిజ్యం, సైబర్ సెక్యూరిటీ, సర్వీస్ సెక్టార్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆవిష్కరణల రంగంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్లో యూపీఐ వాడకంపైనా భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. రక్షణ రంగంలో పరస్పర సహకారానికి భారత్-ఇజ్రాయెల్ నిర్ణయించాయి.#WATCH | Jerusalem | Addressing a joint press briefing with Israel PM Benjamin Netanyahu, PM Modi says," India’s vision is clear that humanity must never become a victim of conflict. The Gaza Peace Plan has opened a route to peace. India has supported such efforts. In future too,… pic.twitter.com/p5iXfkLrzX— ANI (@ANI) February 26, 2026వ్యవసాయం నుంచి ఏఐ వరుకు పలు ఎంవోయూలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. 16 ఎంవోయూలపై భారత్-ఇజ్రాయెల్ సంతకాలు చేసుకున్నాయి. 11 కీలక ప్రకటనలు చేశాయి. టెక్నాలజీ కేంద్రంగా భవిష్యత్ సంబంధాలు ఉంటాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కు త్వరలోనే తుదిరూపు ఇస్తామన్నారు. పశ్చిమమాసియాలో శాంతిస్థాపనకు మోదీ పిలుపునిచ్చారు. సంఘర్షణల్లో మానవత్వం బాధితురాలు కాకూడదన్నారు. -
ఇద్దరు ప్రధానులతో ఇండియన్ బైక్
భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో కలిసి ఇజ్రాయెల్లో అత్యాధునిక ఆవిష్కరణలను హైలైట్ చేసే ఒక టెక్ ఎగ్జిబిషన్ను సందర్శించారు. ఇది మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో ముఖ్యమైన భాగం మాత్రమే కాదు, భారత్–ఇజ్రాయెల్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి కూడా నిదర్శనం.ఈ టెక్ ప్రదర్శనలో.. వ్యవసాయ సాంకేతికత, నీటి నిర్వహణ, వాతావరణ మార్పుల పరిష్కారాలు, బయోటెక్నాలజీ, స్మార్ట్ మొబిలిటీ, కృత్రిమ మేధస్సు (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్, శక్తి వనరులు & అంతరిక్ష వ్యవస్థలు వంటి అనేక కీలక రంగాల్లో ముందంజలో ఉన్న కంపెనీలు, పరిశోధనా సంస్థలు పాల్గొన్నాయి. ప్రపంచ సమస్యలకు సుస్థిర పరిష్కారాలను కనుగొనే దిశగా ఇరు దేశాలు చేస్తున్న సంయుక్త కృషిని ఈ ప్రదర్శన ప్రతిబింబించింది.ఇండియా-ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ బ్రిడ్జి ప్రయత్నాలకు టెక్ ఎగ్జిబిషన్ ఒక నిదర్శనం. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశం & ఇజ్రాయెల్కు చెందిన శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, పరిశ్రమల నాయకులు కలిసి పని చేయడానికి మార్గదర్శం అవుతుంది.వేదిక కల్పించబడుతోంది. దీని ముఖ్య ఉద్దేశ్యం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రపంచవ్యాప్తంగా ఎదురయ్యే సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలను అందించడం.ఈ ప్రదర్శన సందర్భంలో.. మోదీ చాలామంది పరిశోధకులు, కంపెనీల సీఈఓలు & స్టార్టప్ వ్యవస్థాపకులతో నేరుగా మాట్లాడి కొత్త సాంకేతిక పరిజ్ఞానాల ఉపయోగాల గురించి చర్చించారు. ఇజ్రాయెల్ ప్రపంచంలో ప్రముఖ ఆవిష్కరణ కేంద్రాల్లో ఒకటిగా నిలిచిన విషయం మరోసారి స్పష్టమైందిరాయల్ ఎన్ఫీల్డ్ గోవన్ క్లాసిక్ 350ఈ కార్యక్రమంలో 'రాయల్ ఎన్ఫీల్డ్ గోవన్ క్లాసిక్ 350' మోటార్ సైకిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ బైక్ను మోదీ & నెతన్యాహు కలిసి పరిశీలించడం ఒక ముఖ్యమైన సందర్భంగా మారింది. ఇది భారత తయారీ శక్తిని & అంతర్జాతీయ మార్కెట్లో భారత ఉత్పత్తుల ప్రాధాన్యతను సూచించింది. ఇజ్రాయెల్లో కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు మంచి ఆదరణ ఉంది.రాయల్ ఎన్ఫీల్డ్ గోవన్ క్లాసిక్ 350లో 349 సీసీ ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ద్వారా.. 20.2 బిహెచ్పీ పవర్ 27 న్యూటన్ మీటర్ల టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5గేర్ల గేర్బాక్స్తో వస్తుంది. 2026 మోడల్లో అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ వంటి సరికొత్త సౌకర్యాలు చేర్చబడ్డాయి. అదనంగా, యూఎస్బీ టైప్-సీ ఫాస్ట్ చార్జింగ్ పోర్ట్ కూడా అందుబాటులో ఉంది.ఇదీ చదవండి: తలపాగా రంగుకో రోల్స్ రాయిస్ కారు: ఎవరీ రూబెన్ సింగ్!డిజైన్ పరంగా ఈ బైక్ చాలా ప్రత్యేకంగా ఉంది. బాబర్ శైలి ఆకృతి, ఫ్లోటింగ్ సీటు, ఎత్తైన హ్యాండిల్బార్, తెల్లటి సైడ్వాల్ టైర్లు వంటివి కలిగి ఉండటం వల్ల గోవన్ క్లాసిక్ 350 చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కారణంగానే ఈ బైక్ ప్రపంచవ్యాప్తంగా రైడర్ల మనసును గెలుచుకుంటోంది. View this post on Instagram A post shared by NDTV (@ndtv) -
ఇజ్రాయెల్: హోలోకాస్ట్ మృతులకు ప్రధాని మోదీ నివాళులు
జెరూసలేం: ఇజ్రాయెల్లో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. హోలోకాస్ట్ మెమోరియల్ యాద్ వషెమ్ను ప్రధాని సందర్శించారు. హోలో కాస్ట్ మృతులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. 2017లోనూ యాద్ వషెమ్ను మోదీ సందర్శించారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో (1941–1945) హోలోకాస్ట్లో 60 లక్షల మంది యూదులను హిట్లర్ పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. యూదులను సామూహికంగా హత్య చేయడాన్ని 'హోలోకాస్ట్' అని పిలుస్తారు. హీబ్రూ భాషలో దీనిని 'షోవా' అంటారు.. దీని అర్థం 'పెద్ద విపత్తు'నిన్న(బుధవారం) టెల్ అవీవ్లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన భార్యతో కలిసి మోదీకి స్వయంగా స్వాగతం పలికారు. ‘ప్రియమైన మిత్రునికి స్వాగతం’ అంటూ మోదీని ఆయన ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. భారత ప్రధానికి స్వాగతం పలకడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఆయనతో తనకు వ్యక్తిగతంగా కూడా అతి సన్నిహిత బంధముందని అనంతరం ఎక్స్ పోస్టులో నెతన్యాహు గుర్తు చేసుకున్నారు. కాగా, ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం ‘స్పీకర్ ఆఫ్ ద కెనెసెట్ మెడల్’ దక్కింది. ఆ దేశ పార్లమెంటు ‘కెనెసెట్’ అందజేసే ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న తొలి భారత ప్రధాని ఆయనే. కెనెసెట్ స్పీకర్ అమీర్ ఒహానా మోదీకి ఆ మెడల్ను ప్రదానం చేశారు. ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతానికి చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆయనకు ఈ పురస్కారం అందజేసినట్టు పేర్కొన్నారు.2018లో పాలస్తీనా కూడా మోదీకి తమ అత్యున్నత పౌర పురస్కారం ‘గ్రాండ్కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తైన్’ అందజేసింది. ఆ రెండు శత్రు దేశాల నుంచీ అత్యున్నత పురస్కారాలు అందుకుతున్న అరుదైన నాయకునిగా మోదీ నిలిచారు. ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించిన తొలి భారత ప్రధాని కూడా ఆయనే. -
కాషాయ దుస్తుల్లో ప్రధాని మోదీ పక్కన.. సారా నెతన్యాహు సంగతులివే..
టెల్ అవీవ్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్నారు. ఫిబ్రవరి 25న టెల్ అవీవ్ చేరుకున్న మోదీకి ఆ దేశ ప్రధానమంత్రి బెన్జమిన్ నెతన్యాహు, ఆయన భార్య సారా నెతన్యాహు ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఈ సమయంలో సారా నెతన్యాహు కాషాయ వర్ణంపు కోటును ధరించారు. ఆమె భారత్పై తనకున్న మక్కువను చాటుకుంటూ, మరోసారి భారత్ను సందర్శించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.సారా నెతన్యాహు 1958 నవంబర్లో హైఫా సమీపంలోని టివోన్లో జన్మించారు. అక్కడి గ్రీన్బెర్గ్ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. చిన్నతనం నుంచే చురుకుగా ఉండే సారా టీనేజర్గా ఉన్నప్పుడే ‘మారివ్ లానోర్’ అనే వారపత్రికకు కరస్పాండెంట్గా పనిచేశారు. ఆ తర్వాత 1977 నుంచి 1979 వరకు ఇజ్రాయెల్ రక్షణ దళాల (ఐడీఎఫ్) ఇంటెలిజెన్స్ యూనిట్లో సైకోటెక్నికల్ డయాగ్నోస్టిషియన్గా సేవలందించారు. ఈ బాధ్యతల్లో భాగంగా ప్రత్యేక యూనిట్లు, ఇతర భద్రతా సంస్థలకు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియలో ఆమె కీలక పాత్ర పోషించారు.1979లో టెల్ అవీవ్ విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన సారా, అనంతరం హెబ్రూ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీని కూడా అందుకున్నారు. వృత్తి జీవితంలో భాగంగా ఆమె ఎల్ అల్ (El Al) ఎయిర్లైన్స్లో ఫ్లైట్ అటెండెంట్గా కూడా పనిచేశారు. ఆ సమయంలోనే ఆమెకు బెన్జమిన్ నెతన్యాహుతో పరిచయం ఏర్పడి, అది వివాహానికి దారితీసింది. వృత్తిపరంగానే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో కూడా ఆమె ఎంతో యాక్టివ్గా వ్యవహరిస్తుంటారు. ప్రస్తుతం చైల్డ్ సైకాలజిస్ట్గా సేవలందిస్తున్న సారా.. క్యాన్సర్ బాధితులు, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు, గృహహింసకు గురైన మహిళలకు అండగా నిలిచే సంస్థలలో వలంటీర్గా పనిచేస్తున్నారు. బెన్జమిన్ నెతన్యాహు, సారా నెతన్యాహు దంపతులకు యాఇర్, అవ్నేర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.ఇది కూడా చదవండి: నేటి నుంచి రాజ్యసభ నామినేషన్ల స్వీకరణ -
విజయ్-రష్మిక పెళ్లి.. ప్రధాని స్పెషల్ విషెస్
-
అరుదైన నేతగా ప్రధాని మోదీ ఘనత
జెరూసలేం: అంతర్జాతీయ దౌత్య చరిత్రలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన మైలురాయిని అధిగమించారు. ఇజ్రాయెల్, పాలస్తీనా వంటి పరస్పర విరుద్ధ దేశాల నుంచి అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్న అతికొద్ది మంది ప్రపంచ నేతలలో ఒకరిగా ప్రధాని మోదీ నిలిచారు. బుధవారం ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ఆ దేశ పార్లమెంటు(క్నెసెట్)ను ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా భారత్-ఇజ్రాయెల్ వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేయడంలో ఆయన చూపిన అసాధారణ చొరవకు గుర్తింపుగా క్నెసెట్ స్పీకర్ అమీర్ ఓహానా ప్రధానికి ‘స్పీకర్ ఆఫ్ ది క్నెసెట్ మెడల్’ను ప్రదానం చేశారు. ఈ అత్యున్నత గౌరవ పతకాన్ని అందుకున్న తొలి విదేశీ నేత కూడా మోదీయే కావడం విశేషం. ఇది వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదని, ఇరు దేశాల మధ్య ఉన్న దృఢమైన మైత్రికి, పంచుకున్న విలువలకు నిదర్శనమని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. #Jerusalem | PM Modi was awarded the Knesset Speaker's Medal during his address to the Israeli parliament on Wednesday, becoming the first Indian prime minister to receive the honour. The medal recognised his personal role in strengthening strategic ties between India and… pic.twitter.com/uYbPANKBvU— Deccan Chronicle (@DeccanChronicle) February 25, 2026నరేంద్ర మోదీ 2018లో పాలస్తీనా పర్యటన సందర్భంగా ఆ దేశ అత్యున్నత ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా’ పురస్కారాన్ని అందుకున్నారు. తద్వారా పశ్చిమాసియాలోని ఇరు పక్షాల గౌరవాన్ని చూరగొన్న అరుదైన దౌత్యవేత్తగా ఆయన ఘనత సాధించారు. తన తాజా ప్రసంగంలో ప్రధాని మోదీ.. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటాన్ని ప్రకటించారు. ఎక్కడ ఉగ్రవాదం తలెత్తినా అది ప్రపంచ శాంతికే ముప్పు అని హెచ్చరిస్తూ, హమాస్ అక్టోబర్ 7న జరిపిన అనాగరిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉగ్రవాద బాధితుల వేదనను భారత్ అర్థం చేసుకుంటుందని, ముంబై 26/11 దాడులను గుర్తు చేస్తూ ఉగ్రవాదంపై ‘జీరో టాలరెన్స్’ విధానంలో ఇరు దేశాలదీ ఒకే బాట అని పేర్కొన్నారు. మరోవైపు పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదించిన ‘గాజా శాంతి చొరవ’కు భారత్ మద్దతు ప్రకటించింది. ఈ చొరవ పాలస్తీనా సమస్యతో పాటు ఈ ప్రాంతంలోని ప్రజలందరికీ న్యాయమైన, శాశ్వతమైన శాంతిని చేకూరుస్తుందని ప్రధాని నమ్మకం వ్యక్తం చేశారు. సంభాషణలు, చర్చల ద్వారానే స్థిరత్వం సాధ్యమని, భారత్ ఎల్లప్పుడూ శాంతి వైపు నిలుస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. తొమ్మిదేళ్లలో రెండోసారి ఇజ్రాయెల్ సందర్శించిన మోదీకి బెన్ గురియన్ విమానాశ్రయంలో ప్రధాని నెతన్యాహు దంపతులు ఘనస్వాగతం పలికారు. -
మోదీ స్టైల్లో నెతన్యాహు.. అంతటా ఇదే చర్చ!
జరూసలేం: భారత్-ఇజ్రాయెల్ దేశాల మధ్య బంధం కేవలం రక్షణ, వ్యూహాత్మక ఒప్పందాలకు మాత్రమే పరిమితం కాదని, అది అంతకుమించిన ఆత్మీయమైనదని చాటిచెప్పే అరుదైన దృశ్యం జెరూసలేంలో ఆవిష్కృతమైంది. ప్రధాని నరేంద్ర మోదీ గౌరవార్థం ఏర్పాటు చేసిన విందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో హాజరై, అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా పాశ్చాత్య దుస్తుల్లో (సూట్, టై) కనిపించే నెతన్యాహు.. ఈసారి తన మిత్రుడి కోసం ప్రత్యేక శైలిని ఎంచుకోవడం విశేషం. ఇది ప్రపంచ దృష్టిని అమితంగా ఆకర్షించింది.మిత్రుడి కోసం ప్రత్యేక సర్ప్రైజ్ప్రధాని మోదీకి ఎంతో ఇష్టమైన 'మోదీ జాకెట్' (నెహ్రూ జాకెట్), తెల్లటి కుర్తా ధరించి నెతన్యాహు తన మిత్రుడికి సాదర స్వాగతం పలికారు. స్టోన్ కలర్ జాకెట్, వైట్ కుర్తాలో మెరిసిపోయిన నెతన్యాహును చూసి మోదీ ఆశ్చర్యపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ప్రాణ మిత్రుడిని సంతోషపెట్టేందుకు ఈ ప్రత్యేక 'సర్ప్రైజ్' ప్లాన్ చేసినట్లు నెతన్యాహు స్వయంగా పేర్కొనడం వారి మధ్య ఉన్న సాన్నిహిత్యానికి నిదర్శనంగా నిలిచింది. हमारे संयुक्त रात्रिभोज से पहले, मैंने अपने मित्र प्रधानमंत्री मोदी को पारंपरिक भारतीय परिधान पहनकर चौंका दिया। 🇮🇱🇮🇳@narendramodi pic.twitter.com/3ElIQeLY97— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) February 25, 2026సార్టోరియల్ గౌరవంఒక దేశాధినేత మరో దేశ సంస్కృతిని ప్రతిబింబించే దుస్తులు ధరించడం అనేది అంతర్జాతీయ దౌత్య నీతిలో అత్యున్నత గౌరవంగా భావిస్తారు. నెతన్యాహు చేసిన ఈ సార్టోరియల్ సంజ్ఞ (వస్త్రధారణ ద్వారా ఇచ్చే సందేశం) ఇరు దేశాల మధ్య ఉన్న ప్రగాఢ స్నేహానికి నిలువుటద్దంగా నిలిచింది. భాషలు, ఖండాలు వేరైనా భారత్-ఇజ్రాయెల్ దేశాల ఆలోచనా దృక్పథం ఒకటేనని ఈ సందర్భం మరోసారి నిరూపించింది.చరిత్రలో నిలిచిపోయే దృశ్యంఈ విందు కేవలం అధికారిక కార్యక్రమంగా కాకుండా, ఇద్దరు ఆత్మీయ మిత్రుల కలయికలా సాగింది. నెతన్యాహు వస్త్రధారణపై భారతీయులు ప్రశంసలు కురిపిస్తుండగా, ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఈ వినూత్న సందర్భాన్ని ఆసక్తిగా గమనించారు. ప్రధాని మోదీ విషయంలో నెతన్యాహు చూపిన ఈ గౌరవం అంతర్జాతీయ దౌత్య చరిత్రలో ఒక మరపురాని ఘట్టంగా, ఇరు దేశాల చెక్కుచెదరని బంధానికి ప్రతీకగా నిలిచింది. ఇది కూడా చదవండి: ‘ఇన్స్టా’లో ప్రధాని మోదీ రికార్డు.. ట్రంప్ ఎక్కడంటే.. -
‘ఇన్స్టా’లో ప్రధాని మోదీ రికార్డు.. ట్రంప్ ఎక్కడంటే..
న్యూఢిల్లీ: ప్రపంచ వేదికలపై తిరుగులేని ప్రజాదరణతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల్లో మరో సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రముఖ ఫోటో షేరింగ్ ప్లాట్ఫారమ్ ‘ఇన్స్టాగ్రామ్’లో 100 మిలియన్ల (10 కోట్ల) ఫాలోవర్ల మార్కును దాటిన తొలి ప్రపంచ నేతగా ప్రధాని మోదీ నిలిచారు. అంతర్జాతీయ నేతలతో పోలిస్తే ప్రధానమంత్రి మోదీ ప్రజాదరణ అందనంత ఎత్తులో ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 43.2 మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉన్నారు. 2014లో ఈ ప్లాట్ఫారమ్లో అడుగుపెట్టిన ప్రధాని మోదీ గత దశాబ్ద కాలంలో తన డిజిటల్ ఉనికిని అమితంగా చాటుకున్నారు. కేవలం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ యువతను ఆకర్షించడంలోనూ ఆయన ముందున్నారు. మోదీ సాధించిన ఈ ఘనత ఎంతటిదంటే.. ప్రపంచంలోని తదుపరి ఐదుగురు ప్రముఖ దేశాధినేతల మొత్తం ఫాలోవర్ల సంఖ్యను కలిపినా, అది మోదీ వ్యక్తిగత ఫాలోవర్ల సంఖ్య కంటే తక్కువగా ఉండటం గమనార్హం.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 43.2 మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉండగా, మోదీ ఆయన కంటే రెట్టింపు కంటే ఎక్కువ ఫాలోవర్లను కలిగి ఉన్నారు. వీరి తర్వాత ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో (15 మిలియన్లు), బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా (14.4 మిలియన్లు), టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ (11.6 మిలియన్లు) వరుస స్థానాల్లో నిలిచారు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ 6.4 మిలియన్ల ఫాలోవర్లతో జాబితాలో కొనసాగుతున్నారు.దేశీయ రాజకీయాల్లోనూ ఇతర నేతలతో పోలిస్తే ప్రధానమంత్రికి ఉన్న ఆదరణ అమితంగా ఉంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 16.1 మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉండగా, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సుమారు 12.6 మిలియన్ల ఫాలోవర్లతో మూడో స్థానంలో నిలిచారు. కేవలం సోషల్ మీడియా ఫాలోయింగ్లోనే కాకుండా, ప్రపంచ నేతల ‘అప్రూవల్ రేటింగ్’ (ఆమోదయోగ్యత)లోనూ మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. స్టాటిస్టా నివేదిక ప్రకారం 2025 డిసెంబర్ నాటికి ప్రధాని మోదీ 70 శాతం రేటింగ్తో ప్రథమ స్థానంలో ఉండగా, జపాన్ ప్రధాని సనే తకైచి (63 శాతం), అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ (60 శాతం) తరువాతి స్థానాల్లో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 43 శాతం రేటింగ్తో 11వ స్థానానికి పరిమితమయ్యారు.ప్రముఖ అంతర్జాతీయ బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘మోర్నింగ్ కన్సల్ట్’ విడుదల చేసిన గణాంకాలు సైతం మోదీదే పైచేయి అని చెబుతున్నాయి. 2026 ఫిబ్రవరి 2 నుంచి 8 మధ్య సేకరించిన సమాచారం ప్రకారం 67 శాతం ఆమోదయోగ్యతతో మోదీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా నిలిచారు. చెక్ రిపబ్లిక్ నేత ఆండ్రెజ్ బాబిస్ (59 శాతం) రెండో స్థానంలో నిలవగా, డొనాల్డ్ ట్రంప్ 40 శాతంతో 11వ స్థానంలోనే కొనసాగుతున్నారు. అంతకుముందు 2025 నాటి డేటాలోనూ 75 శాతం రేటింగ్తో మోదీ అగ్రస్థానంలో నిలవగా, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ 59 శాతంతో తర్వాతి స్థానంలో నిలిచారు. -
‘ఇజ్రాయెల్ బాధను భారత్ అనుభవిస్తోంది’.. హమాస్ దాడిపై ప్రధాని మోదీ
జెరూసలేం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్యం తర్వాత ఒకే రోజులో జరిగిన అత్యంత ఘోరమైన దాడిగా నిలిచిన హమాస్ దాడిని భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. హమాస్ 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ భూభాగం, సముద్రం, గగనతలం నుంచి సమన్వయ దాడి జరిపింది. ఈ దాడిలో సుమారు 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు.తాజా ఇజ్రాయెల్ పర్యటనలో మోదీ హమాస్ దాడి గురించి ఇజ్రాయెల్ పార్లమెంట్ (క్నెసెట్)లో ప్రసంగించారు. అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడి అమానుషమైనది. 1.4 బిలియన్ భారతీయుల తరఫున నేను సంతాపం తెలియజేస్తున్నాను. ఇజ్రాయెల్ బాధను భారత్ అనుభవిస్తోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో మేము మీతో ఉన్నాం అని హామీ ఇచ్చారు.ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ..‘భారతదేశానికి కూడా ఇలాంటి గాయాలు ఉన్నాయి. ఉగ్రవాదం ఎంతటి విషాదాన్ని మిగులుస్తుందో మాకు తెలుసన్నారు. ఈ ప్రసంగం ద్వారా మోదీ, ఉగ్రవాదం ఒక దేశానికే పరిమితం కాకుండా ప్రపంచానికి ముప్పుగా అభివర్ణించారు. ఉగ్రవాదం ఎక్కడైనా జరిగితే, అది మానవత్వంపై దాడి చేసినట్లేనని స్పష్టం చేశారు. -
ఉగ్రవాదం పెనుముప్పు!
ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లోనూ సమూలంగా అంతం చేయడమే భారత్ లక్ష్యం. ఈ విషయంలో భారత్, ఇజ్రాయెల్ది ఒకే వైఖరి. ఎవరేమన్నా, ఎన్ని చెప్పినా ఉగ్రవాదం ఏవిధంగానూ సమర్థనీయం కాదు. ఈ విషయంలో మరో మాటకు తావు లేదు. ఇజ్రాయెలీలపై హమాస్ పాల్పడ్డ ఆటవిక దాడి తాలూకు బాధను భారతీయులందరమూ అనుభవించాం. ఇజ్రాయెలీ సోదరుల అంతులేని ఆవేదనను మేమంతా పంచుకున్నాం. ఎందుకంటే ఉగ్రవాదం తాలూకు నొప్పిని భారత్ చాలాకాలంగా అనుభవిస్తూ వస్తోంది. రక్షణ, వ్యవసాయ, వాణిజ్య తదితర రంగాల్లో ఇరుదేశాల భాగస్వామ్యం మున్ముందు మరింత బలోపేతం చేసుకుంటాం. అంతేగాక భారత్, ఇజ్రాయెల్, యూఏఈ, అమెరికాలతో కూడిన ‘మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్’, ‘ఐ2యూ2 ఫ్రేమ్వర్క్’ల్లో కూడా మరింత చురుగ్గా భాగస్వాములం అవుతాం. – ప్రధాని నరేంద్ర మోదీజెరూసలెం: ఉగ్రవాదం ఏ మూలన, ఏ రూపంలో ఉన్నా ప్రపంచమంతటికీ అది పెను ముప్పేనని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘‘ఉగ్రవాదంపై పోరులో రాజీ పడే ప్రసక్తే లేదు. దాన్ని అన్ని రూపాల్లోనూ సమూలంగా అంతం చేయడమే భారత లక్ష్యం. ఈ విషయంలో భారత్, ఇజ్రాయెల్లది ఒకే వైఖరి’’ అని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ఆయన బుధవారం ఆ దేశ పార్లమెంటు కెనెసెట్లో ప్రసంగించారు. కెనెసెట్ సభ్యులంతా గౌరవ సూచకంగా లేచి నిలబడి మరీ మోదీని స్వాగతించారు. ‘మోదీ’, ‘మోదీ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ, ‘‘ఉగ్రవాదం సమాజాలనే అస్థిరపరుస్తుంది. అభివృద్ధికి విఘాతంగా మారుతుంది. విశ్వాసాన్ని రూపుమాపుతుంది. అలాంటి ఉన్మాద భూతంపై పోరులో ద్వంద్వ ప్రమాణాలు పనికిరావు. దాన్ని రూపుమాపాలంటే ప్రంపచ స్థాయిలో పూర్తి సమన్వయంతో కూడిన ప్రయత్నాలు తప్పనిసరి’’ అని కుండబద్దలు కొట్టారు. పశి్చమాసియాలో శాంతి సాధనకు ఉద్దేశించిన గాజా శాంతి చర్చలకు సంపూర్ణ మద్దతు పలికారు. చిరకాల మిత్ర దేశమైన ఇజ్రాయెల్కు భారత్ ఈ విషయంలో పూర్తిగా దన్నుగా నిలుస్తుందని ప్రకటించారు. గాజా శాంతి చర్చలు పశి్చమాసియా అంతటా సుస్థిర, చిరకాల శాంతికి బాటలు పరుస్తాయని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు. ఐరాస ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రయత్నాలు పాలస్తీనా సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాయన్న నమ్మకం తనకుందన్నారు. ‘‘శాంతిమార్గం అంత సులువైనది కాదు. అయితే సదుద్దేశంతో కూడిన ప్రయత్నాలకు తెలివిడి, ధైర్యం, మానవత్వం తోడైతే విజయం సునిశి్చతం’’ అని పేర్కొన్నారు. పశి్చమాసియాలో శాంతి కోసం కొన్నేళ్ల క్రితం ఇజ్రాయెల్ ‘అబ్రహం అకార్డ్స్’పై సంతకం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేశారు. ‘‘ఇజ్రాయెల్ చేపట్టిన ఆ చర్య దశాబ్దాల పాటు అట్టుడికిన పశి్చమాసియాలో కొత్త ఆశలకు నాంది పలికింది. నాటినుంచి ఈ ప్రాంతంలో పరిస్థితులు అనూహ్యంగా మెరుగుపడ్డాయి’’ అంటూ హర్షం వెలిబుచ్చారు. ఇజ్రాయెల్ ధైర్యసాహసాలు, దశాబ్దాలుగా ఆ దేశం సాధిస్తున్న ఘన విజయాలంటే భారత్లో అందరికీ గొప్ప ఆరాధనా భావముందని చెప్పారు. ఇరుదేశాల నడుమ 2,000 ఏళ్లకు పైగా సన్నిహిత బంధాలున్నాయని గుర్తు చేశారు. హమాస్ దాడితో మేమూ ఆక్రోశించాం 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్ర సంస్థ జరిపిన పాశవిక దాడిలో భారీ సంఖ్యలో ఇజ్రాయెలీలు ప్రాణాలు కోల్పోవడం భారతీయులందరినీ కలచివేసిందని ప్రధాని అన్నారు. ‘‘వారి కుటుంబీకులకు తనతో పాటు భారతీయులందరి తరఫునా ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఎవరేమన్నా, ఎన్ని చెప్పినా ఉగ్రవాదం ఏ విధంగానూ సమర్థనీయం కాదు. ఈ విషయంలోమరో మాటకు తావు లేదు. ఇజ్రాయెలీలపై హమాస్ పాల్పడ్డ ఆటవిక దాడి తాలూకు బాధను భారతీయులందరమూ అనుభవించాం. ఇజ్రాయెలీ సోదరులు అంతులేని ఆవేదనను మేమంతా పంచుకున్నాం. ఎందుకంటే ఉగ్రవాద తాలూకు నొప్పిని భారత్ చాలాకాలంగా అనుభవిస్తూ వస్తోంది. ముంబై ఉగ్ర దాడుల్లో భారతీయులతో పాటు పలువురు ఇజ్రాయెలీ సోదరులు కూడా నిష్కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ బాధాకర క్షణాల్లోనూ, ఇకముందు కూడా ఇజ్రాయెల్కు భారత్ అన్ని విషయాల్లోనూ పూర్తిస్థాయిలో అండగా, వెన్నుదన్నుగా నిలుస్తుంది’’ అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు సభ్యుల హర్షధ్వానాల నడుమ మోదీ ప్రకటించారు. ‘‘ఆర్థిక, సాంకేతిక రంగాల్లో భారత్ అపార ప్రగతి సాధిస్తోంది. ఇన్నొవేషన్లు, టెక్నాలజీ నాయకత్వ రంగాల్లో ఇజ్రాయెల్కు తిరుగు లేదు. కనుక పలు రంగాల్లో ఇరుదేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం. త్వరలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటాం’’ అని వెల్లడించారు. భారత్, ఇజ్రాయెల్, యూఏఈ, అమెరికాలతో కూడిన ‘‘మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్’, ‘ఐ2యూ2 ఫ్రేమ్వర్క్’ల్లో కూడా మరింత చురుగ్గా భాగస్వాములం అవుతామన్నారు.రెడ్కార్పెట్ స్వాగతం అంతకుముందు ప్రధాని మోదీకి ఇజ్రాయెల్లో రెడ్కార్పెట్తో ఘనస్వాగతం లభించింది. టెల్ అవీవ్లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన భార్యతో కలిసి మోదీకి స్వయంగా స్వాగతం పలకడం విశేషం. ‘ప్రియమైన మిత్రునికి స్వాగతం’ అంటూ మోదీని ఆయన ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. భారత ప్రధానికి స్వాగతం పలకడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఆయనతో తనకు వ్యక్తిగతంగా కూడా అతి సన్నిహిత బంధముందని అనంతరం ఎక్స్ పోస్టులో నెతన్యాహు గుర్తు చేసుకున్నారు. తనకు లభించిన ఘనస్వాగతం పట్ల మోదీ హర్షం వెలిబుచ్చారు. అనంతరం విమానాశ్రయంలోనే నేతలిద్దరూ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పశి్చమాసియాలో తాజా పరిస్థితులు తదితరాలపై లోతుగా చర్చించారు. నెతన్యాహుతో భేటీ అద్భుతంగా సాగిందని మోదీ పేర్కొన్నారు. వ్యవసాయం, టెక్నాలజీ, నీటి నిర్వహణతో పాటు పలు అంశాల్లో పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. గురువారం వారిద్దరూ మరో దఫా భేటీ కానున్నారు. ఆ సందర్భంగా పలు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశముంది. గత తొమ్మిదేళ్లలో ఇజ్రాయెల్లో మోదీకి ఇది రెండో పర్యటన. మోదీకి అత్యున్నత పురస్కారం ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం ‘స్పీకర్ ఆఫ్ ద కెనెసెట్ మెడల్’ దక్కింది. ఆ దేశ పార్లమెంటు ‘కెనెసెట్’ అందజేసే ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న తొలి భారత ప్రధాని ఆయనే. కెనెసెట్ స్పీకర్ అమీర్ ఒహానా మోదీకి ఆ మెడల్ను ప్రదానం చేశారు. ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతానికి చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆయనకు ఈ పురస్కారం అందజేసినట్టు పేర్కొన్నారు. 2018లో పాలస్తీనా కూడా మోదీకి తమ అత్యున్నత పౌర పురస్కారం ‘గ్రాండ్కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తైన్’ అందజేసింది. ఆ రెండు శత్రు దేశాల నుంచీ అత్యున్నత పురస్కారాలు అందుకుతున్న అరుదైన నాయకునిగా మోదీ నిలిచారు. ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించిన తొలి భారత ప్రధాని కూడా ఆయనే.‘మోదీ హగ్’ ప్రపంచ ప్రసిద్ధం!కెనెసెట్లో మోదీని ఆహ్వానిస్తూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్వాగతోపన్యాసం చేశారు. ‘మోదీ నా మిత్రుడు మాత్రమే కాదు, ప్రియమైన సోదరుడు కూడా’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘ప్రపంచ వేదిక లపై మోదీ గొప్ప నేతగా వెలుగుతున్నారన్నారు. ముఖ్యంగా ‘మోదీ కౌగిలి’ చాలా ప్రత్యేకమైనది. అది ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందింది’’ అంటూ చమత్కరించారు! ‘‘ఇజ్రా యెల్లో మోదీ గత పర్యటన సందర్భంగా ఇద్దరమూ మధ్యదరా సముద్ర తీరంలో విహరించాం. చెప్పు లు విడిచి నీళ్లలో నడుద్దామా అని మోదీని అడిగాను. మేమిద్దరం నీళ్లలో నడవలేదు గానీ ద్వైపాక్షిక సంబంధాల విషయంలో అద్భుతాలు చేస్తూ వస్తున్నాం. వర్తకాన్ని రెండింతలు, సహకారాన్ని మూడింతలు, అవగాహ నను నాలుగింతలు పెంచాం’’ అన్నారు.– నెతన్యాహు -
ఇజ్రాయెల్కు చేరుకున్న ప్రధాని మోదీ
-
మోదీ నా సోదరుడు: నెతన్యాహు
టెలీఅవీవ్: ధాని మోదీకి ఇజ్రాయెల్లో అరుదైన గౌరవం లభించింది. ఆ దేశ పార్లమెంటు మోదీకి ఘన స్వాగతం పలికింది. కాగా ఈ రోజు ప్రధాని మోదీ రెండురోజుల పర్యటనకు ఇజ్రాయెల్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు, ఆయన సతీమణి సారా నెతన్యాహుతో కలిసి ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మోదీ ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించారు. ఇజ్రాయెల్ పార్లమెంటులో మోదీ మాట్లాడుతూ "ఇజ్రాయెల్ భారత్కు నిజమైన స్నేహితుడు, కష్టకాలంలో భారత్కు అండగా నిలిచారు. ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్ మాకు భాగస్వామి. ఇక్కడ పర్యటించడం సంతోషంగా ఉంది. ఇజ్రాయెల్- భారత్ ప్రాచీన నాగరికత ఉన్న దేశాలు. రెండు దేశాలు తీవ్రవాదం కారణంగా కష్టాలు పడుతున్నాయి. ఇక్కడి పార్లమెంటులో ప్రసంగించడం గౌరవంగా భావిస్తున్నా", అని అన్నారు. అనంతరం ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు మాట్లాడుతూ "ప్రపంచ దేశాల్లో మోదీ గొప్ప నాయకుడు. మోదీ ఇజ్రాయోల్ పర్యటన ఎంతో సంతోషదాయకం. మోదీ నాకు స్నేహితుడి కంటే ఎక్కువ నా సోదరుడి లాంటి వాడు." అని నెతన్యాహు అన్నారు. భారత్ని మోదీ వేగవంతంగా అభివృద్ధి చేస్తున్నారని ఆయన కాలంలో వాణిజ్య ఒప్పందాలు రెట్టింపు అయ్యాయన్నారు. భారత ప్రధాని 2 రోజుల పాటు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. ఇరు దేశాలు రక్షణకు సంబంధించిన పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నట్లు సమాచారం.ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడమే లక్ష్యంగా భారత ప్రధాని మోదీ బుధవారం నుంచి రెండ్రోజులపాటు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు.‘‘ పరస్పర ప్రజాస్వామ్య దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం, సమష్టి దార్శనికతల సుసాధ్యమే లక్ష్యంగా, ఉమ్మడి సవాళ్ల పరిష్కారమే ధ్యేయంగా, ఇరుదేశాలు సుదృఢ, సుదీర్ఘకాల వ్యూహాత్మక సంబంధాలను సమున్నత స్థాయికి తీసుకుపోయే ఉద్దేశంతో మోదీ, నెతన్యాహూలు చర్చలు జరుపుతారు’’ అని భారత విదేశాంగ శాఖ ఇదివరకే ప్రకటన విడుదల చేసింది. అనంతరం రణక్షేత్రంగా మారిన గాజా అంశం సైతం ఇరు దేశాధినేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. పర్యటనలో భాగంగా మోదీ అక్కడి పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. మరోవైపు ఇరాన్- అమెరికా ఉద్రిక్తల వేళ పశ్చిమాసియాలో మోదీ పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజు (బుధవారం) రాత్రి మోదీకి, నెతన్యాహూ ప్రత్యేక ప్రైవేట్ విందు ఇవ్వనున్నారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇజ్రాయిల్లో పర్యటించడం ఇది రెండోసారి. #WATCH | Tel Aviv: PM Narendra Modi arrives in Israel. Israeli Prime Minister Benjamin Netanyahu, along with his wife Sara Netanyahu, receive him at the airport (Source: Reuters) pic.twitter.com/BStw87lujA— ANI (@ANI) February 25, 2026 -
‘మారణకాండ’పై మాట్లాడండి: ప్రధాని మోదీకి ప్రియాంకా విజ్ఞప్తి
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఇజ్రాయెల్లో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ పార్లమెంటు ‘నెసెట్’లో గాజాలో జరుగుతున్న అమానవీయ ఘటనలపై మాట్లాడాలని వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా విజ్ఞప్తి చేశారు. బుధవారం నుంచి ప్రారంభమైన ప్రధాని రెండు రోజుల అధికారిక పర్యటన నేపథ్యంలో ఆమె సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధానికి ఈ సూచన చేశారు.గాజాలో వేలాది మంది బలైపోతున్న తీరును ‘మారణకాండ’గా అభివర్ణించిన ఆమె ఈ అంశాన్ని ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించి, బాధితులకు న్యాయసాయం అందించాలని కోరారు. స్వతంత్ర భారత చరిత్రలో అనాదిగా మనం అనుసరిస్తున్న సత్యం, శాంతి, న్యాయం వైపు నిలబడే సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటిచెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని ఆమె ఈ సందర్భంగా ప్రధానికి గుర్తు చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ తన ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా బుధవారం అక్కడికి చేరుకున్నారు. 2017లో ఇజ్రాయెల్లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా రికార్డు సృష్టించిన మోదీ, తొమ్మిదేళ్ల అనంతరం మళ్లీ ఆ దేశ గడ్డపై అడుగుపెట్టారు. ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు ఆహ్వానం మేరకు సాగుతున్న ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై సమీక్ష జరగనుంది. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, రక్షణ, భద్రత, వ్యవసాయం, నీటి యాజమాన్యం, వాణిజ్య రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం చేయడంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. I hope that the Hon Prime Minister @narendramodi ji mentions the genocide of thousands of innocent men, women and children in Gaza while addressing the Knesset on his upcoming trip to Israel and demands justice for them. India has stood for what is right throughout our history as…— Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 25, 2026ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్తో భేటీ కావడంతో పాటు, నెతన్యాహుతో కలిసి ప్రత్యేక విందులో పాల్గొంటారు. కాగా గాజా అంశంపై ప్రియాంకా గాంధీ మొదటి నుంచీ స్పష్టమైన వైఖరితో ఉన్నారు. గతంలో పార్లమెంటు సమావేశాలకు హాజరైన సమయంలోనూ ఆమె పాలస్తీనాకు మద్దతుగా తన గళం వినిపించారు. గత ఏడాది అక్టోబర్లో ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన 'సమగ్ర శాంతి ప్రణాళిక' ఒప్పందం తర్వాత యుద్ధం తగ్గుముఖం పట్టినప్పటికీ, గాజాలో మానవతా సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది.ఐక్యరాజ్యసమితి విచారణ కమిషన్ సైతం గాజాలో అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన జరిగిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత్ తన నైతిక బాధ్యతను చాటుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. పాలస్తీనా విషయంలో భారత్ ఎప్పుడూ ‘ద్వి-దేశ పరిష్కారాన్ని’ సమర్థిస్తూనే, అక్టోబర్ 7 నాటి ఉగ్రదాడులను ఖండించింది. అదే సమయంలో పౌరుల మరణాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది.ఇది కూడా చదవండి: విద్వేష వ్యాఖ్యలపై ‘సుప్రీం’ ఆగ్రహం -
విజయ్-రష్మిక పెళ్లి.. శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని
టాలీవుడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి.. గురువారం(ఫిబ్రవరి 26) జరగనుంది. ఇప్పటికే వీళ్లిద్దరి కుటుంబ సభ్యులు.. ఉదయ్పుర్ వెళ్లిపోయారు. పెళ్లి సందడి కూడా మొదలైపోయింది. మంగళవారం నాడు పెళ్లికొడుకు, పెళ్లి కూతురు టీమ్స్గా విడిపోయి క్రికెట్ మ్యాచ్ ఆడారు. అలానే రాత్రి సంగీత్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. నేడు హల్దీ, మెహందీ తదితర సెలబ్రేషన్స్ జరగనున్నాయి. మరోవైపు కాబోయయే వధూవరులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు నోట్ వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: రష్మికకు విజయ్ తల్లిదండ్రులు పెట్టిన కండిషన్ ఏంటి?)విజయ్-రష్మిక వివాహ వేడుకకు ఆహ్వానం అందుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్న మోదీ.. తన తరఫున శుభాకాంక్షలు తెలిపారు. విజయ్-రష్మిక జీవితంలో ఇది ఓ కొత్త, సుందరమైన అధ్యాయానికి నాంది అని పేర్కొన్నారు. సప్తపది అనే పవిత్ర సంప్రదాయంతో ఏడడుగులు కలిసి వేస్తూ జీవితాంతం స్నేహితులు, భాగస్వాములుగా మారుతున్నారని అన్నారు. సినిమాల్లో ఇప్పటికే ఎన్నో పాత్రలు చేసిన విజయ్, రష్మిక.. నిజ జీవితంలో ప్రేమ, అనురాగాలతో నిండిన కొత్త అధ్యాయాన్ని మరింత అందంగా నిర్మించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. పరస్పర గౌరవంతో జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ శుభసందర్భంగా వధూవరులకు, వారి కుటుంబ సభ్యులకు తన ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. ఒకేరోజు 'రెండుసార్లు' పెళ్లి!) -
భారత్ సహా ఆరు దేశాల కొత్త కూటమి.. నెతన్యాహు సంచలన ప్రకటన
భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్తున్నారు. మోదీ ఇజ్రాయెల్ పర్యటన వేళ బెంజమిన్ నెతన్యాహు నుంచి ఒక కొత్త భౌగోళిక రాజకీయ కూటమిపై ప్రకటన వెలువడింది. ప్రపంచ రాజకీయాలను శాసించే ఆరు దేశాల కూటమి ‘హెక్సాగన్’ కూటమిని ప్రకటిస్తూ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భారత్ను ప్రధాన భాగస్వామిగా పేర్కొన్నారు. కూటమిలో భారత్ అత్యంత కీలక పాత్ర పోషించబోతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో హెక్సాగన్ కూటమి వల్ల భారత్కు కలిగే లాభాలేంటి?.. అలాగే భారత్ ముందున్న సవాళ్లు ఏంటనే చర్చ మొదలైంది.ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటీవల భారత్పై ప్రశంసల కురిపించారు. భారత్ను ‘గ్లోబల్ పవర్'గా అభివర్ణించిన ఆయన, రానున్న రోజుల్లో మధ్యప్రాచ్యం, ప్రపంచ రాజకీయాలను శాసించే ఆరు దేశాల కూటమి ‘హెక్సాగన్’ కూటమిలో భారత్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పశ్చిమాసియాలో ‘రాడికల్ పరిస్థితుల’ను ఎదుర్కోవడమే లక్ష్యంగా నెతన్యాహు ఈ కూటమిని ప్రతిపాదించారు. ఇందులో ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్లతో పాటు భారత్ ప్రధాన భాగస్వామిగా పేర్కొన్నారు.‘హెక్సాగన్’ కూటమి ఏంటి?ఈ క్రమంలో నెతన్యాహు కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రాచ్యం చుట్టూ ఆరు శక్తులతో ఒక కూటమిని ప్రతిపాదించారు. దీనిని ఆయన ‘హెక్సాగన్’ (షడ్భుజి)గా అభివర్ణించారు. ఈ కూటమిలోని దేశాలు భారత్, అరబ్ దేశాలు, ఆఫ్రికా దేశాలు, మధ్యధరా దేశాలు, ఆసియాలోని ఇతర దేశాలు, ఇజ్రాయెల్ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయని అన్నారు. ఇది కేవలం ఒక వాణిజ్య కూటమి మాత్రమే కాదు. తీవ్రవాద భావజాలం కలిగిన రాడికల్ షియా, సున్నీ వర్గాల నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఏర్పడిన కూటమిగా ఇజ్రాయెల్ భావిస్తోందని చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఈ కూటమిలో అరబ్, ఆఫ్రికన్, ఆసియా దేశాలు కూడా భాగస్వాములుగా ఉంటాయని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ వెల్లడించింది.భారత్ ఐఎంఈసీకి బలం.. ఇక, అంతకుముందు.. జీ-20 వేదికగా భారత్ ఐఎంఈసీ(ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్)ను ప్రకటించింది. నెతన్యాహు ప్రతిపాదించిన ‘హెక్సాగన్’ వ్యూహం ఐఎంఈసీకు మరింత బలాన్ని చేకూర్చనుంది. కేవలం రైల్వే లైన్లు, ఓడరేవుల అనుసంధానం మాత్రమే కాకుండా, ఈ దేశాల మధ్య బలమైన రాజకీయ, సైనిక బంధాన్ని ఏర్పరచడమే ‘హెక్సాగన్’ ఉద్దేశంగా ఇజ్రాయెల్ వ్యూహరచన చేస్తోంది. గతంలో ఇజ్రాయెల్ కేవలం అమెరికా, ఐరోపా దేశాలపైనే ఆధారపడేది. కానీ మారుతున్న కాలంలో భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తితో జతకట్టడం ద్వారా ఇజ్రాయెల్ తన భద్రత, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది.కాగా, ఈ కూటమి ప్రధానంగా భద్రతా, భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించబడిన ఆరు దేశాల సమూహం. భద్రతా పరంగా ఉగ్రవాదం, ప్రాంతీయ అస్థిరతను ఎదుర్కోవడానికి ఒక సమిష్టి వేదిక కానుంది. ఆర్థిక పరంగా ఇంధన, టెక్నాలజీ, రక్షణ రంగాల్లో సహకారం, రక్షణ ఒప్పందాల కోసం ఉపయోగపడనుంది. రాజకీయ పరంగా భారత్కి మధ్యప్రాచ్యం, యూరప్లో మరింత ప్రభావం పెంచే అవకాశం ఉంది.భారత్కు కలిగే లాభాలు.. భద్రతా సహకారం: ఉగ్రవాదం, సముద్ర భద్రత, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో భాగస్వామ్యం. ఆర్థిక అవకాశాలు: ఇంధన (గ్యాస్, ఆయిల్), రక్షణ టెక్నాలజీ, స్టార్టప్లు, ఇన్నోవేషన్ రంగాల్లో కొత్త పెట్టుబడులు.రాజకీయ ప్రభావం: మధ్యప్రాచ్యం, యూరప్, ఆఫ్రికా ప్రాంతాల్లో భారత్కి మరింత ప్రాధాన్యం.భౌగోళిక సమతుల్యం: మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి వ్యూహాత్మక మిత్రులు.సాంస్కృతిక సంబంధాలు: గ్రీస్, సైప్రస్ వంటి దేశాలతో పర్యాటక, విద్యా రంగాల్లో కొత్త అవకాశాలు.భారత్ ముందున్న సవాళ్లుఇరాన్తో సంబంధాలు: భారత్కి ఇంధన అవసరాల కోసం ఇరాన్తో సంబంధాలు ఉన్నాయి. ఈ కూటమి వల్ల ఆ సంబంధాలు దెబ్బతినే అవకాశం.అరబ్ దేశాల ప్రతిస్పందన: కొన్ని అరబ్ దేశాలు ఈ కూటమిని ఇజ్రాయెల్ ఆధిపత్యంగా చూసే అవకాశం ఉంది.ప్రాంతీయ అస్థిరత: మధ్యప్రాచ్యంలో జరిగే ఘర్షణలు భారత్కి ప్రత్యక్ష ప్రభావం చూపవచ్చుమోదీ రికార్డు.. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కొన్ని చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. ప్రపంచ యుద్ధ కాలంలో యూదుల మారణ హోమానికి గుర్తుగా నిర్మించిన స్మారక చిహ్నాన్ని మోదీ సందర్శిస్తారు. జెరూసలెంలో ప్రధాని మోదీతో కలిసి ఒక భారీ ఇన్నోవేషన్ కార్యక్రమంలో నెతన్యాహు పాల్గొననున్నారు. ఇక, ప్రధాని మోదీని తన వ్యక్తిగత స్నేహితుడుగా నెతన్యాహు అభివర్ణించారు. 2017లో మోదీ పర్యటన సందర్భంగా ఇద్దరు నేతలు సముద్ర తీరంలో చెప్పులు లేకుండా నడిచిన దృశ్యాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ‘మేము నిరంతరం ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటాము. ఒకరి దేశాన్ని మరొకరం సందర్శించుకున్నాం. గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధం మరింత దృఢంగా మారింది’ అని ఆయన అన్నారు. మరోవైపు.. రెండోసారి ఇజ్రాయెల్లో పర్యటిస్తున్న భారత ప్రధానిగా మోదీ.. రికార్డుల్లోకి ఎక్కారు. -
నేటి నుంచి మోదీ ఇజ్రాయెల్ పర్యటన
న్యూఢిల్లీ: ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా భారత ప్రధాని మోదీ బుధవారం నుంచి రెండ్రోజులపాటు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. ద్వైపాక్షిక రక్షణ, వాణిజ్య సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూలు దృష్టిసారించనున్నారు. ఇరాన్పై యుద్ధానికి అమెరికా కాలుదువ్వుతూ పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణాన్ని ఎగదోస్తున్న వేళ ఇజ్రాయెల్లో మోదీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. పర్యటనలో భాగంగా మోదీ అక్కడి పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హోర్జోగ్, ప్రధాని నెతన్యాహూతో విడివిడిగా భేటీకానున్నారు.‘‘ పరస్పర ప్రజాస్వామ్య దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం, సమష్టి దార్శనికతల సుసాధ్యమే లక్ష్యంగా, ఉమ్మడి సవాళ్ల పరిష్కారమే ధ్యేయంగా, ఇరుదేశాలు సుదృఢ, సుదీర్ఘకాల వ్యూహాత్మక సంబంధాలను సమున్నత స్థాయికి తీసుకుపోయే ఉద్దేశంతో మోదీ, నెతన్యాహూలు చర్చలు జరుపుతారు’’ అని భారత విదేశాంగ శాఖ మంగళవారం విడుదలచేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. మొత్తంగా రక్షణ, భద్రత సహకారంలో అంశాలే గురువారం నాటి చర్చల్లో కీలకం కానున్నాయని విదేశాంగ శాఖ వెల్లడించింది. యుద్ధమయ గాజా అంశం సైతం చర్చకు రానుంది.బుధవారం రాత్రి మోదీ కోసం నెతన్యాహూ ప్రత్యేక ప్రైవేట్ విందు ఇవ్వనున్నారు. గత తొమ్మిదేళ్లలో మోదీ ఇజ్రాయెల్లో పర్యటించడం ఇది రెండోసారి. 2017 జూలైలో పర్యటించినప్పుడే ఇరుదేశాల మధ్య బంధాన్ని ‘వ్యూహాత్మక’ స్థాయికి చేర్చారు. ఆ తర్వాతి ఏడాది జనవరిలో నెతన్యాహూ భారత్లో పర్యటించారు. సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణలు, రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, ఇరుదేశాల ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి ఇరుదేశాలు కృషిచేస్తున్నాయి. సైనిక, ఆయుధ వ్యవస్థలను భారత్కు సరఫరా చేస్తూ ఇజ్రాయెల్ కీలక మిత్రదేశంగా మారిన విషయం విదితమే. -
బెంగాల్ దుస్థితి చూసి నా గుండె పగిలింది!: ప్రధాని మోదీ
కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసమర్థ పాలనకు మారుపేరుగా మారారంటూ ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. ‘‘ఆమె పాలనలో బెంగాల్ దుస్థితి చూసి నా గుండె పగిలింది. రాష్ట్ర ప్రజలకు మమత అన్నివిధాలా తీవ్ర అన్యాయం చేస్తున్నారు’’అంటూ మండిపడ్డారు. ‘‘రాష్ట్రానికి జరుగుతున్న ఈ తీరని అన్యాయాన్ని సరిదిద్దుతా. ‘వికసిత పశ్చిమ్ బంగా’గా తీర్చిదిద్దుతా’’అని ప్రతిజ్ఞ చేశారు. బెంగాల్లో అతి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ మార్పు అనివార్యమని ప్రధాని అభిప్రాయపడ్డారు. ‘‘ప్రజలు విజ్ఞతతో కూడిన తీర్పు ఇస్తారు. తద్వారా బెంగాల్ కూడా దేశంలో ఇతర ప్రాంతాలకు దీటుగా ప్రగతి బాటన ’ ్ఛగుతుంది’’అని విశ్వాసం వెలిబుచ్చారు. ఈ మేరకు బెంగాల్ ఓటర్లను ఉద్దేశించి మోదీ సోమవారం బహిరంగ లేఖ రాశారు. బెంగాలీ భాషలో రాసిన ఈ లేఖను ‘జై మా కాళీ’అంటూ ప్రారంభించారు. ‘‘బెంగాల్లో మార్పు తథ్యం. వచ్చే ఎన్నికల్లో బెంగాలీలు విజ్ఞతతో ఓటేస్తారు. ఈ విషయంలో నాకు పూర్తి విశ్వాసముంది’’అని చెప్పారు. అక్రమాలకు అడ్డుకట్ట వేస్తాం స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో బెంగాల్ యావద్దేశానికే చుక్కానిగా ఉండేదని మోదీ అన్నారు. ‘‘స్వామి వివేకానంద మొదలుకుని అరబిందో, సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ టాగూర్, శ్యామాప్రసాద్ ముఖర్జీ దాకా ఎందరో గొప్ప మార్గదర్శులను దేశానికి అందించింది వంగ భూమే. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు నెలకొన్న దుస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది. బెంగాల్లో పాలన మచ్చుకు కూడా కని్పంచడం లేదు’’అంటూ లేఖలో ఆయన మండిపడ్డారు. ‘‘పాలకుల అసమర్థత వల్ల 60 ఏళ్లుగా రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వెనకబాటుకు గురైంది. సరిహద్దుల గుండా అక్రమ చొరబాట్లకు అడ్డాగా మారింది! ముఖ్యంగా మమత సర్కారు అధికారమే పరమావధిగా సంతుïÙ్టకరణ, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోంది. టాగూర్ ఘనంగా కీర్తించిన ‘సోనార్ బంగ్లా’లో నకిలీ ఓటర్లు కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చారు. రాష్ట్రంలో ఎటు చూసినా ఉపాధి లేమి తాండవిస్తోంది. దాంతో యువత పొట్ట చేతబట్టుకుని వలస బాట పడుతోంది. మహిళలకు భద్రత కరువైంది’’అంటూ దుయ్యబట్టారు. నానాటికీ సమస్యల్లో కూరుకుపోతున్న బెంగాల్ను చూసి దేశమంతా ఆందోళన చెందుతోందన్నారు. ‘‘బెంగాల్ ప్రజలు ఈ దుస్థితిని మౌనంగా ఇంకెంతకాలం భరించాలి? మార్పుకు సమయం ఆసన్నమైంది. ఇతర రాష్ట్రాల్లో ప్రజల జీవన ప్రమాణాలు ఎంతో మెరుగయ్యాయి. పేదల ముఖాల్లోకి చిరునవ్వులు వచ్చాయి. ఆయుష్మాన్ భారత్ తదితర పథకాలతో దేశమంతా ప్రగతి చెందుతోంది. ఈ వృద్ధి గాథలో బెంగాల్ కూడా భాగం కావాల్సిన తరుణమిదే’’అన్నారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశం కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్టు మోదీ చెప్పారు. ‘ఎక్కడైతే మనసు నిర్భీతిగా ఉంటుందో, ప్రజలు తలెత్తుకుంటారో...’అన్న టాగూర్ కవితా పంక్తులను ఉదహరించారు. ‘‘బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతిని రూపుమాపుతుంది. అక్రమ చొరబాట్లకు పూర్తిగా అడ్డుకట్ట వేస్తాం. అర్హులైన శరణార్థులకు సీఏఏ ద్వారా పౌరసత్వం కలి్పస్తాం’’అంటూ హామీ ఇచ్చారు. మండిపడ్డ తృణమూల్ బెంగాలీ ఓటర్లకు మోదీ బహిరంగ లేఖపై అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. దాన్ని ఎన్నికల వేళ మోదీ ఆడుతున్న నాటకమంటూ పార్టీ అధికార ప్రతినిధి కుణాల్ ఘోష్ దుయ్యబట్టారు. బెంగాల్ సంక్షేమం పట్ల మొసలికన్నీరు కారుస్తున్న మోదీ, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ ఉపాధి సహా పలు పథకాల నిధులను ఎందుకు నిలిపేశారో బదులివ్వాలన్నారు. కేంద్రం నుంచి బెంగాల్కు ఏకంగా రూ.1.96 లక్షల కోట్ల మేరకు నిధులు బాకీ ఉన్నాయని ఆయన ఆరోపించారు. ముందుగా ఆ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో బెంగాల్ అగ్రస్థానంలో ఉందని కుణాల్ చెప్పుకొచ్చారు. మోదీ లేఖను ఓట్ల కోసం ఆడిన డ్రామాగా కాంగ్రెస్ సీనియర్ నేత అ«దీర్ రంజన్ చౌదరి కొట్టిపారేశారు. -
ఆ సదస్సు టర్నింగ్ పాయింట్
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో భారత్ సాధించిన విజయాలు చూసి ప్రపంచ దేశాల అధినేతలు ఆశ్చర్యపోయారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సును కీలక టర్నింగ్ పాయింట్గా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏఐ శక్తిని ఎలా వినియోగించుకోవాలో దిశా నిర్దేశం చేయడానికి సదస్సు తోడ్పడుతుందని తెలిపారు. ‘మన్ కీ బాత్’లో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి రేడియోలో ప్రసంగించారు. సదస్సుకు ప్రపంచ దేశాల అధినేతలు, పారిశ్రామిక వర్గాలు, సీఈఓలు, ఐఏ స్టార్టప్ రంగం ప్రతినిధులు, నవీన ఆవిష్కర్తలు హాజరయ్యారని గుర్తుచేశారు. ‘‘సదస్సులో ప్రధానంగా రెండు అంశాలు దేశాధినేతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. వారు అమూల్ పాల కేంద్రాన్ని సందర్శించారు. రైతులు తమ పాడి పశువులను ఏఐ టెక్నాలజీతో నిరంతరం గమనించే తీరు పరిశీలించామన్నా రు. మన ప్రాచీన గ్రంథాలు, విజ్ఞానం, రాతప్రతులను ఏఐ టెక్నాలజీతో పరిరక్షిస్తున్న తీరు, వాటిని నేటి తరానికి అందిస్తున్న వైనాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. సదస్సులో మూడు ‘మేడిన్ ఇండియా’ ఏఐ మోడల్స్ విడుదల చేశాం’’ అని వివరించారు. డిజిటల్ మోసాలతో జాగ్రత్త ఆన్లైన్ ఆర్థిక మోసాలు, డిజిటల్ అరెస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు. ‘‘ప్రధానంగా వృద్ధులు ఈ మోసాల బారిన పడుతుండటం ఆందోళనకరం. బ్యాంకుల కేవైసీ ప్రక్రియను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవాలి’’ అన్నారు. టీ20 క్రికెట్ ప్రపంచ కప్లో విదేశాల తరఫున భారతీయ మూలాలున్న ఆటగాళ్లు చాలామంది ఆడుతుండటం పట్ల ప్రధాని హర్షం వెలిబుచ్చారు. ‘‘భారతీయులు ఎక్కడికి వెళ్లినా తమ మూలాలు మర్చిపోరు. భారతీయతకు ఇదొక హాల్మార్క్. తాము నివసిస్తున్న దేశాల అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారు. బానిసత్వ గుర్తులను శరవేగంగా వదిలించుకుంటున్నాం. భారతీయ సంస్కృతిని సూచించే చిహ్నాల విలువను గుర్తించడం మొదలైంది. ఈ దిశగా రాష్ట్రపతి భవన్ ముఖ్యమైన కార్యక్రమం నిర్వహిస్తోంది. సోమవారం రాజాజీ ఉత్సవ్ జరుగనుంది. రాష్ట్రపతి భవన్లో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లూటెన్స్ విగ్రహం స్థానంలో స్వతంత్ర భారత తొలి భారత గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. పరీక్షలంటే భయమొద్దు విద్యార్థులంటే పరీక్షల యోధులని మోదీ అన్నారు. ‘‘మీరు త్వరలో పరీక్షలు రాయనున్నారు. మార్కుల ఆధారంగా సత్తాను లెక్కగట్టలేరని తెలుసుకోండి. మీ ప్రతిభకు అవొక్కటే ఆధారం కాదు. పరీక్షల గురించి ఎన్నో సందేహాలుంటాయి. అలాగని ఆందోళన వద్దు మిమ్మల్ని మీరు విశ్వసించండి. చదివింది మనసుపెట్టి పరీక్షల్లో రాయండి’’ అని వారికి సూచించారు. కేరళ కుంభమేళాగా పిలిచే మామంగం సంప్రదాయాన్ని మోదీ ప్రస్తావించారు. ఈ వేడుక 250 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. పలు రాష్ట్రాల్లో రైతులు సాధించిన విజయాల గురించి కూడా ప్రధాని మాట్లాడారు. -
అంతర్జాతీయ వేడుకలో మురికి రాజకీయాలా?
మీరట్: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ఆ పార్టీ కార్యకర్తలు టీ–షర్టులు విప్పేసి నిరసన తెలపడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం గొప్పగా నిర్వహించిన అంతర్జాతీయ కార్యక్రమాన్ని మురికి రాజకీయాలకు, సిగ్గుమాలిన రాజకీయాలకు కాంగ్రెస్ వేదికగా మార్చుకుందని మండిపడ్డారు. మోదీ ఆదివారం ఉత్తరప్రదేశ్లోని మీరట్లో పర్యటించారు. రూ.12,930 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మీరట్ మెట్రో రైలుకు పచ్చజెండా ఊపారు. నమో భారత్ రైలును ప్రారంభించారు. మెట్రో రైలులో ప్రయాణించారు. రైలులో విద్యార్థులతో, ప్రయాణికులతో ముచ్చటించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ తీరును తప్పుపట్టారు. సిద్ధాంతపరంగా ఆ పార్టీ దారుణంగా పతనమైందని మోదీ విమర్శించారు. ‘‘కాంగ్రెస్ అన్ని హద్దులూ అతిక్రమించింది. ఆ పార్టీ ప్రవర్తనను దేశవ్యాప్తంగా అందరూ ఆక్షేపిస్తున్నారు. చేసిన తప్పుకు సిగ్గుపడాల్సింది పోయి టీ–షర్టులు విప్పేసి దేశాన్ని కించపర్చిన వారిని కాంగ్రెస్ నాయకులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు’’ అంటూ ధ్వజమెత్తారు. ఆ ఘటనను ఖండించిన ఇతర విపక్షాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఆయా పార్టీలు సత్యం పక్షాన, దేశ ప్రతిష్ట పక్షాన నిలిచాయని ప్రశంసించారు. సొంత దేశాన్ని కించపరుస్తారా? ‘‘దేశాన్ని అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా పౌరులు నిరంతరం శ్రమిస్తున్నారు. కానీ మన దేశం విజయాలు సాధిస్తుండడాన్ని కొన్ని పార్టీలు తట్టుకోలేకపోతున్నాయి. 80కిపైగా దేశాల ప్రతినిధులు, 20 దేశాల అధినేతలు పాల్గొన్న సదస్సులో చొక్కాలు విప్పేసి నిరసన తెలపడం సమంజసమేనా? కాంగ్రెస్ నిజస్వరూపం అందరికీ తెలుసు. చొక్కాలు విప్పి నగ్నంగా మరోసారి బహిర్గతం చేసుకోవాల్సిన అవసరమేమిటి? కాంగ్రెస్ దుస్థితిని నేతల చేష్టలను బట్టి అర్థం చేసుకోవచ్చు. సొంతదేశాన్నే కించపర్చే స్థాయికి దిగజారారు. ఒక ఊళ్లో పెళ్లి జరిగితే ఊరి వాళ్లంతా కలిసి దాన్ని వైభవంగా నిర్వహిస్తారు. వచ్చిన అతిథులు సంతృప్తిగా తిరిగివెళ్తారు. మన దేశంలో మనం నిర్వహించుకొనే కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిన అవసరం లేదా? కాంగ్రెస్ నేతలు మోదీని ద్వేషించవచ్చు. నా సమాధిని తవ్వాలని అనుకోవచ్చు. నా తల్లిని దూషించవచ్చు. బీజేపీని, ఎన్డీయేను వ్యతిరేకించవచ్చు. వారి రాజకీయాలకు అది అవసరం కావొచ్చు. దాన్ని అర్థం చేసుకోగలం, సహించగలం. కానీ ఏఐ సదస్సు బీజేపీ కార్యక్రమం కాదని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలి. అక్కడ బీజేపీ నేతలెవరూ లేరు. అది ప్రభుత్వ కార్యక్రమం. దేశ ప్రతిష్టను దెబ్బతీయడం సహించరాని విషయం’’ అన్నారు. మహిళలను ముందు పెట్టి రాజకీయమా? కాంగ్రెస్ తీరుతో పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా జరగడం లేదని మోదీ ఆక్షేపించారు. ‘‘కాంగ్రెస్ సభ్యులు సృష్టిస్తున్న అలజడి కారణంగా ఆ పార్టీ మిత్రపక్షాలకు సభలో మాట్లాడే అవకాశం రావడం లేదు. ఫిబ్రవరి 4న లోక్సభలో ప్రధాని స్థానాన్ని కాంగ్రెస్ సభ్యులు చుట్టుముట్టి నినాదాలు చేయడం, బ్యానర్లు ప్రదర్శించడం సిగ్గుచేటు. వాళ్లు నిజంగా ప్రధాని స్థానంలో కూర్చోవాలనుకుంటే ముందు ప్రజల హృదయాలు గెల్చుకోవాలి. మహిళా ఎంపీలను ప్రధాని స్థానం వద్దకు పంపి నినాదాలు చేయిస్తే ప్రధాని అయిపోతారా? మహిళలను ముందు పెట్టి రాజకీయం చేయడమేమిటి? మీలో చేవ చచ్చిపోయిందా? కాంగ్రెస్ ఈ దేశానికి పెద్ద భారంగా మారింది. నీచ రాజకీయాలు చేయొద్దని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలకు గతంలోనే సూచించా. అభివృద్ధి గురించి మాట్లాడాలని చెప్పా. అయినా బుద్ధి మార్చుకోవడం లేదు’’ అంటూ దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వానికి దేశ అభివృద్ధి, ప్రజల సౌభాగ్యమే ముఖ్యమన్నారు. ‘‘యూపీ ప్రగతికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. దశాబ్దాల క్రితం అరాచకానికి మారుపేరుగా ఉన్న యూపీ ఇప్పుడు అభివృద్ధి బాటలో పరుగులు తీస్తోంది’’ అని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.అత్యంత వేగవంతమైన మీరట్ మెట్రో ఢిల్లీ–మీరట్ నడుమ 82 కిలోమీటర్ల రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఆర్ఆర్టీఎస్)లో మిగతా మార్గాలతోపాటు 23 కిలోమీటర్ల మీరట్ మెట్రోను ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. ఇది దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రోగా చెబుతున్నారు. ఢిల్లోలో సరాయ్ కాలేఖాన్, న్యూ అశోక్నగర్ మధ్య 5 కిలోమీటర్ల మార్గాన్ని, మీరట్ సౌత్ నుంచి మోదీపురం దాకా 21 కిలోమీటర్ల మార్గాన్ని, మీరట్ సౌత్ నుంచి శతాబ్దినగర్ స్టేషన్ దాకా మెట్రో సెక్షన్ను ప్రారంభించారు. దీంతో ఢిల్లీ నుంచి మీరట్ వరకు ప్ర యాణం గంటలోపే పూర్తవు తుంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఈ రైలుమార్గాన్ని అభివృద్ధి చేశారు. అలాగే మీరట్ సౌత్ నుంచి మోదీపురం దాకా మెట్రో రైలును ప్రారంభించారు. ఈ మార్గం పొడవు 23 కిలోమీటర్లు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో మెట్రో రైలు ప్రయాణిస్తుంది. మీరట్ సౌత్ నుంచి మోదీపురానికి 30 నిమిషాల్లోపే చేరుకోవచ్చు. -
ఎలాంటి ఒప్పందాలు మేలు?
ఆర్థిక సార్వభౌమాధికారం, దీర్ఘకాల పోటీతత్వాన్ని పెంపొందించుకోవడానికి కొన్ని ముఖ్య దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకోవాలి. ప్రస్తుతం 13 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ), 6 ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందాలు అమలులో ఉన్నాయి. దశల వారీగా దిగుమతి సుంకాల తగ్గింపు; ఇతర దేశాల ద్వారా భారత్లోకి ప్రవేశి స్తున్న చైనా వస్తు ప్రవాహాన్ని అరికట్టడం; ఆహార ప్రాసెసింగ్, ఐటీ, టెక్స్టైల్స్, ఫార్మా, రసాయనాల విషయంలో భారత్కు ఉన్న పోటీతత్వాన్ని నిలుపుకోవడం; రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు రక్షణ లాంటి అంశాల విషయంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ప్రాధాన్యం సంతరించు కున్నాయి. ఆయా వాణిజ్య ఒప్పందాలు భారత్కు మిశ్రమ ఫలితాలను అందించాయి. భారత్ – ఆసియాన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల భారత్కు వాణిజ్య లోటు అధికమైంది. దక్షిణ కొరియా విషయంలో భారత్ నుండి ఎగుమతుల కన్నా కొరియా నుండి దిగుమతులు అధి కంగా ఉన్నాయి. జపాన్, ఎస్ఏఎఫ్టీఏలో ఒప్పందాలు పరిమిత ప్రయోజనాలనే అందించాయి. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియాలతో ఒప్పందాలు వాణిజ్యపరంగా ప్రయోజ నాన్ని కల్పించాయి.ఎదురయ్యే పరిణామాలుసంబంధిత లెజిస్లేటివ్, న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత యూకేతో జరిగిన వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తుంది. అటు ఈయూ కౌన్సిల్, యూరోపియన్ పార్లమెంట్; ఇటు భారత పార్లమెంటు ఆమోదం తర్వాత యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో జరిగిన ఒప్పందం ఖరారవుతుంది. భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందం కొంత సమయం తీసుకొనే అవకాశం ఉంది. ఒప్పందాలు ఖరారయ్యే సమయంలో కొన్ని వ్యూహాత్మక సవాళ్లను భారత్ ఎదుర్కోవచ్చు. ఆ యా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వలన దిగుమతుల పెరుగుదలతో పాటు, సున్నితమైన రంగాలలో ఉపాధి నష్టాన్ని భారత్ చవిచూడవచ్చు. దిగుమతి సుంకాలు తగ్గించనప్పటికీ ఉత్పత్తుల సర్టిఫికేషన్, పర్యావరణ, శ్రామిక ప్రమాణాలు, శానిటరీ, ఫైటో శానిటరీ అంశాలు భారత్కు సమస్యగా పరిణమించే అవకాశాలు ఉన్నాయి.వ్యవసాయ సబ్సిడీలు ఆ యా దేశాలలో అధికంగా ఉన్నందు వలన భారత రైతులు నష్టపోయే అవకాశం ఉంది. అందుకే ఈయూ, యూకే నుండి డైరీ ఉత్పత్తులు, ప్రాసెస్డ్ ఫుడ్ దిగుమతులను నిరోధించే విధంగా భారత్ ఒప్పందం చేసుకోవాలి. ఈయూ చివరి నిమిషంలో ‘వాతావరణ అనుసంధాన వాణిజ్య నియమాలకు’ పట్టుబట్టే అవకాశం ఉంది. తద్వారా భారత్ నుండి ఎగుమ తయ్యే సిమెంటు, ఉక్కు, అల్యూమినియంపై ‘కార్బన్ ట్యాక్స్’ పడి, ఆయా ఉత్పత్తుల విషయంలో పోటీతత్వం తగ్గుతుంది. అమెరికా కూడా ఒప్పందం సమయంలో డిజిటల్ వాణిజ్య సరళీకరణ, పటిష్ఠమైన మేధా సంబంధిత హక్కులు, వ్యవసాయం, మెడికల్ డివైజెస్కు సంబంధించిన డిమాండ్లు తెచ్చే అవకాశం ఉంది. భారత్ కూడా ఫార్మా రంగం, హెచ్–1 బి వీసాల సరళీకరణ లాంటి అంశాలు లేవనెత్తవచ్చు.చేరకపోవడమే సముచితంచైనా కేంద్ర బిందువుగా ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం’ (ఆర్సీఈపీ) ఏర్పాటయింది. ఆస్ట్రేలియా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆసియాన్ దేశాలు, న్యూజిలాండ్ ఇందులో సభ్య దేశాలు. దీని ఏర్పాటుకు సంబంధించిన చర్చలలో భారత్ పాల్గొన్న ప్పటికీ, ఒప్పందం సమయంలో సభ్యత్వం పొందడాన్ని విరమించు కొంది. ఈ ఒప్పందం వలన రైతులు, ఎంఎస్ఎంఈ సంస్థలకు నష్టం కలుగుతుందనీ, వాణిజ్య లోటు అధికమవుతుందనీ, ప్రాంతీయ వాణిజ్యంలో చైనా ఆధిపత్యం ఉంటుందనీ భారత్ భావించింది. డైరీ, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ప్రపంచ మార్కెట్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో భారత్ పోటీ ఎదుర్కొంటోంది. ఒప్పందం వలన గోధుమ, పామాయిల్, మిల్క్ పౌడర్ లాంటి ఉత్పత్తులు చౌకగా భారత్లోకి దిగుమతి అయినట్లయితే రైతులు నష్టపోయేవారు. ఆ యా దేశాలు అవలంబించే డంపింగ్ను నియంత్రించడానికి సరిపోను రక్షణ వలయం విషయంలో భారత్ వెనుకబడి ఉంది. రసాయనాలు, యంత్రాలు, ఉక్కు, ఎలక్ట్రానిక్స్, ఆట వస్తువులు చైనా నుండి భారత్ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఎక్కువ. చౌక ధరలకు ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమయినప్పుడు ఆయా రంగాలకు సంబంధించిన పరిశ్రమలు తీవ్ర నష్టాన్ని చవిచూస్తాయి. ఈ ఒప్పందంలో భారత్ భాగం కాకపోవడాన్ని సమర్థవంతమైన నిర్ణయంగా చూడాలి.ఏ వ్యూహం అవసరం?పశ్చిమ దేశాల మార్కెట్లతో పాటు చైనాపై అధికంగా ఆధార పడే కన్నా ఫార్మల్ అగ్రిమెంట్స్ లేకపోయినప్పటికీ కొన్ని దేశాలతో భారత్ వాణిజ్య సంబంధాలను మెరుగుపరచుకోవాలి. ఆఫ్రికా ప్రస్తుత జనాభా 1.4 బిలియన్లు కాగా 2050 నాటికి 2.5 బిలియన్లకు చేరుతుందని అంచనా. ఆఫ్రికాలోని కెన్యా, నైజీరియా, ఈజిప్ట్, దక్షిణాఫ్రికాలతో వాణిజ్య ఒప్పందాలకు భారత్ ప్రయత్నించాలి. ఆఫ్రికాతో ఒప్పందం కారణంగా ఆహార భద్రత, శక్తి, ఖనిజాలు, అవస్థాపనా సౌకర్యాల ప్రాజెక్టులు, ఫార్మా రంగంలో భారత్కు వ్యూహాత్మక ప్రయోజనాలు కలుగుతాయి. వాణిజ్యపరమైన అడ్డంకులు తక్కువగా ఉండటంతో పాటు ఆఫ్రికా వృద్ధి రేటు అధికంగా ఉండటాన్ని గమనించవచ్చు. భారత్ ఉత్పత్తులకు స్థిరమైన డిమాండ్ ఉన్న మిడిల్ ఈస్ట్లోని యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్లతో వాణిజ్య సంబంధాలను మెరుగు పరచుకోవడానికి ప్రయత్నించాలి. ఆహారం, వ్యవ సాయ ఉత్పత్తులు, టెక్ట్స్టైల్స్, ఆభరణాలు, ఫార్మా, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, మెషినరీ, హ్యాండీక్రాప్ట్స్, ఆయుర్వేదిక్, హెర్బల్, వెల్నెస్ ఉత్పత్తులకు ఆ యా మార్కెట్లలో డిమాండ్ ఉంది.లాటిన్ అమెరికాలోని బ్రెజిల్, మెక్సికో, చిలీ, పెరూ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు అవసరం. ఇంజినీరింగ్ వస్తువులు, రసాయ నాలు, ఫార్మాస్యూటికల్స్, ఇనుము, ఉక్కు, టెక్స్టైల్స్ ఉత్పత్తులకు బ్రెజిల్లో డిమాండ్ అధికం. మొత్తంగా లాటిన్ అమెరికా మార్కెట్ లోనే వీటికి డిమాండ్ అధికంగా ఉన్నందువలన భారత్కు వాణిజ్య పరంగా లాభదాయకంగా ఉంటుంది. చిలీ, పెరూ, మెక్సికోతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కొరకు చర్చలు జరుగుతున్న సమయంలో భారత్ వేగంగా స్పందించడం ద్వారా ఒప్పందాలను ఖరారు చేసుకోవాలి. తక్కువ దిగుమతి సుంకం, మార్కెట్ లభ్యత కారణంగా భారత్ ఎగుమతులు పెరుగుతాయి.‘స్మార్ట్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని’ అవలంబించడం ద్వారా వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై దృష్టి సారించాలి. అత్యంత సరళీకరణ ఒప్పందాలు వాణిజ్య లోటు పెరుగుదలకు దారి తీస్తాయి. వస్తువులకు సంబంధించిన ఒప్పందాల వలన పరిమిత ప్రయోజనాలే సిద్ధిస్తాయి కనుక తయారీ, సేవలకు సంబంధించిన ఒప్పందాలపై భారత్ భవిష్యత్ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలి. వాణిజ్య ఒప్పందాల ద్వారా అధిక ప్రయోజనాలు పొందాలంటే శ్రామిక మార్కెట్లు, లాజిస్టిక్స్, తయారీ రంగం, సేవల వాణిజ్యం, మౌలిక సౌకర్యాల రంగాలలో సంస్కరణలు అవసరం.డా‘‘ తమ్మా కోటిరెడ్డివ్యాసకర్త వైస్ ఛాన్స్లర్ (ఇన్ఛార్జి),ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ -
మీరట్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీ - మీరట్ రాపిడ్ రైల్ మెట్రోను ప్రారంభించారు. 180 కిలోమీటర్ల వేగంతో ఈ మెట్రో రైల్ ప్రయాణించనుంది. 55 నిమిషాల్లో 82 కిలోమీటర్ల దూరంలోని గమ్యాన్ని చేరుకుంటుంది. మెట్రో రైల్ రాకతో ఘజియాబాద్, మీరట్ రూట్ లో ట్రాఫిక్ సమస్యలు తగ్గనున్నాయి. 30 వేల కోట్ల రూపాయలతో మెట్రో రైలు నిర్మాణం చేపట్టారు. ఘజియాబాద్, మోదీ నగర్, మీరట్ మధ్య ఈ మెట్రో రైలు రాకపోకలు సాగించనుంది.భారత రవాణా ముఖచిత్రంలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమయ్యింది. దేశంలోనే తొలి రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్) ‘నమో భారత్’ రైలు సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక కారిడార్తో పాటు, మీరట్ మెట్రోను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ప్రధాని ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. #WATCH | Meerut, Uttar Pradesh: Prime Minister Narendra Modi flags off Meerut Metro and Namo Bharat Train at Shatabdi Nagar Namo Bharat Station. From here, PM Modi will undertake a Metro Ride till Meerut South Station. Later, the Prime Minister will inaugurate and dedicate to… pic.twitter.com/uYw8pxetwD— ANI (@ANI) February 22, 2026సారాయ్ కాలే ఖాన్ మెట్రో స్టేషన్ వద్ద ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. ఢిల్లీలోని సారాయ్ కాలే ఖాన్ నుంచి న్యూ అశోక్ నగర్ వరకు ఉన్న కీలకమైన 5 కిలోమీటర్ల మేర విస్తరించిన చివరి సెక్షన్ను ప్రధాని ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతతో, గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైళ్లు రాజధాని పరిసర ప్రాంతాల మధ్య సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. ఈ చరిత్రాత్మక ఘట్టం నేపథ్యంలో సారాయ్ కాలే ఖాన్ ప్రాంగణమంతా ఇప్పటికే పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. భద్రతా పరంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన అధికారులు, ప్రారంభోత్సవానికి ముందే స్టేషన్ పరిసరాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా మీరట్- ఢిల్లీ మధ్య రాకపోకలు సాగించే ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్య ప్రజలకు ప్రపంచస్థాయి ప్రయాణ అనుభూతి కలగనుంది. భారతీయ రైల్వే చరిత్రలో ఈ ఆర్ఆర్టీఎస్ వ్యవస్థ ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. -
పాడి రైతులకూ ఏఐ ఫలాలు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 131వ ఎపిసోడ్లో దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అత్యాధునిక సాంకేతికత, సామాజిక స్పృహ, భారతదేశపు సాంస్కృతిక వారసత్వాన్ని మేళవిస్తూ సాగిన ఈ ప్రసంగంలో ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఇటీవల జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమిట్- 2026 విశేషాలను పంచుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నేడు కేవలం పరిశ్రమలకే పరిమితం కాకుండా, పాడి రైతులకు కూడా సహాయకారిగా నిలుస్తూ అద్భుతాలు సృష్టిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.భారతీయ తయారీ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ‘జీరో-డిఫెక్ట్’ నాణ్యతతో కూడిన ఉత్పత్తులను రూపొందించాలని స్టార్టప్లు, పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’లో పిలుపునిచ్చారు. సెమీకండక్టర్లు, అంతరిక్ష పరిశోధనలు, హరిత ఇంధనం తదితర రంగాల్లో యువత చూపుతున్న ప్రతిభే రాబోయే కాలంలో భారత్ను అంతర్జాతీయ ఆవిష్కరణల కేంద్రంగా మారుస్తుందని ఆయన ఆకాంక్షించారు.ఈ క్రమంలో ఒడిశాకు చెందిన యువ రైతు హిరోద్ పటేల్ ఉదాహరణను ప్రస్తావిస్తూ, సంప్రదాయ వ్యవసాయాన్ని విడిచిపెట్టి, నూతన దృక్పథంతో సాగు చేస్తూ యువతకు ఆదర్శంగా నిలిచిన తీరును కొనియాడారు. అవయవ దానం ప్రాముఖ్యతను వివరిస్తూ కేరళకు చెందిన చిన్నారి ఆలిన్ షెరిన్ అబ్రహం త్యాగాన్ని ప్రధాని గుర్తుచేశారు. ఆ చిన్నారి మరణం తర్వాత ఆమె తల్లిదండ్రులు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం మరికొందరికి ప్రాణదానం చేసిందని, ఇలాంటి ఘటనలు సమాజంలో అవయవ దానంపై పెరుగుతున్న అవగాహనకు నిదర్శనమని పేర్కొన్నారు.దేశం బానిసత్వ చిహ్నాల నుంచి విముక్తి పొంది తన స్వంత సాంస్కృతిక అస్తిత్వాన్ని చాటుకోవాలంటూ ప్రధాని ‘పంచ ప్రాణ్’ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 23 నుంచి రాష్ట్రపతి భవన్లో జరగనున్న రాజాజీ ఉత్సవాల గురించి ప్రజలకు తెలియజేస్తూ, మన వారసత్వాన్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కాగా డిజిటల్ యుగంలో పెరుగుతున్న మోసాల పట్ల పౌరులు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ హెచ్చరించారు. కేవైసీ (KYC) ప్రక్రియ విషయంలో జాగ్రత్త వహించాలని, డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించుకోవాలని సూచించారు. తన ప్రసంగం ముగింపులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జె. జయలలిత జయంతిని పురస్కరించుకుని ఆమెకు ఘన నివాళులర్పించారు. జయలలిత వంటి ప్రజానేతలు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారన్నారు. -
మేడిన్ ఇండియా చిప్.. దేశాభివృద్ధికి అత్యంత కీలకం
గ్రేటర్ నోయిడా: దేశీయంగా సెమీకండక్టర్ల తయారీ వంటి స్వయం సమృద్ధి చర్యల ద్వారానే ‘అభివృద్ధి చెందిన భారత్’కు పునాదులు పడతాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఉత్తర ప్రదేశ్లోని జెవార్లో దిగ్గజ సంస్థలు హెచ్సీఎల్ గ్రూప్, ఫాక్స్కాన్లు జాయింట్ వెంచర్ ద్వారా నిర్మించతలపెట్టిన ‘ఇండియా చిప్ ప్రైవేట్ లిమిటెడ్’సెమీకండక్టర్ల తయారీ కర్మాగారానికి ప్రధాని మోదీ శనివారం శంకుస్థాపనచేశారు. ‘‘కోవిడ్ మహాసంక్షోభ కాలంలో సూక్ష్మ చిప్ల సరఫరా గొలుసులు తెగిపోవడంతో పలు ఆర్థిక వ్యవస్థల అభివృద్ధి స్తంభించిపోయింది. పలు ఫ్యాక్టరీల పనులు పూర్తిగా ఆగిపోయాయి. భారత్ ఆత్మనిర్భరత సాధించినప్పుడే మన దేశం అభివృద్ధి చెందిన భారత్గా అవతరిస్తుంది. ఈ యజ్ఞంలో మేడిన ఇండియా చిఫ్ అనేది అత్యంత ముఖ్యం. ఈ దశాబ్దిలో సాంకేతికరంగంలో భారత్ ఏదైనా సాధిస్తుందో అదే 21వ శతాబ్దిలో మన శక్తిసామర్థ్యాలకు పునాదిగా మారుతుంది. చిప్లను దేశీయంగా తయారుచేసుకోవడం మొదలెడితే మన ఆధునిక పరికరాల తయారీ కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అగత్యం తప్పుతుంది. కోవిడ్ వేళ భారత్లోకి చిప్ల సరఫరా దారుణంగా దెబ్బతినడంతో ఇక్కడి కర్మాగారాల్లో ఉత్పత్తి కుంటుబడింది. ఆర్థికంగా సంస్థలు దెబ్బతిన్నాయి. ఈ సంక్షోభం నుంచి భారత్ పాఠాలు నేర్చుకుంది. దీనిని సదవకాశంగా భావించింది. చిప్ తయారీలో స్వావలంభనే మన ధ్యేయం. అందుకే భారత్లో సెమీకండక్టర్ల తయారీరంగాన్ని ప్రోత్సహిస్తున్నాం’’అని మోదీ అన్నారు. ‘‘గ్రేటర్ నోయిడా సమీప జెవార్లో యమునా ఎక్స్ప్రెస్ ఇండిస్ట్రియలడెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఔట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ ఫెసిలిటీని ఏర్పాటుచేస్తున్నాం. ఇది ఉత్తరప్రదేశ్కు సాంకేతిక శక్తిగా కొత్త గుర్తింపును తీసుకొస్తుంది. యూపీ నుంచి ఎంపీగా గెలిచిన నాకు ఇది ఎంతో గర్వకారణం. వచ్చే రెండేళ్లలో ఇండియాచిప్ ఫ్యాక్టరీలో డిస్ప్లే డ్రైవర్ చిప్ల ఉత్పత్తి మొదలవుతుంది. వచ్చే ఐదేళ్లలో రూ.3,700 కోట్ల పెట్టుబడులు ఈ కంపెనీలో పెట్టనున్నారు. కొత్త పెట్టుబడులతో 3,500కుపైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలొస్తాయి’’అని మోదీ అన్నారు. -
ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యం 30 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: రాబోయే ఐదేళ్లలో వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 30 బిలియన్ డాలర్లకు చేర్చాలని భారత్, బ్రెజిల్ లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. అరుదైన ఖనిజాల విషయంలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయానికొచ్చాయి. ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేశాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా శనివారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. రక్షణ, ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు తదితర కీలక రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారత్–బ్రెజిల్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్లపై అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపైనా అభిప్రాయాలు పంచుకున్నారు. ఉగ్రవాదం విషయంలో భారత్, బ్రెజిల్ దేశాలది ఒకేమాట అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదులు, ఉగ్రవాద పోషకులు మానవాళికి అతిపెద్ద శత్రువులు అని తేల్చిచెప్పారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు పరిష్కారం కావాలంటే అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరం అని పునరుద్ఘాటించారు. సంస్కరణలకు భారత్, బ్రెజిల్ మద్దతిస్తున్నాయని తెలిపారు. లూలా డా సిల్వాతో భేటీ అనంతరం మోదీ మీడియాతో మాట్లాడారు. లాటిన్ అమెరికాలో భారత్కు బ్రెజిల్ అతిపెద్ద వ్యాపార భాగస్వామి అని గుర్తుచేశారు. వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 30 బిలియన్ డాలర్లకు చేర్చడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యం అంటే కేవలం అంకెలు కాదని.. విశ్వాసానికి ప్రతిబింబమని వ్యాఖ్యానించారు. భారత్, బ్రెజిల్ మధ్య మొత్తం తొమ్మిది ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇరుపక్షాలూ లాభపడే భాగస్వామ్యం భారత్, బ్రెజిల్ మధ్య దశాబ్దాలుగా వాణిజ్య బంధం కొనసాగుతోంది. 2024–25లో ద్వైపాక్షిక వాణిజ్యం 12 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారత్ నుంచి బ్రెజిల్కు ఎగుమతుల విలువ 6.77 బిలియన్ డాలర్లు కాగా, దిగుమతుల విలువ 5.43 బిలియన్ డాలర్లు. అరుదైన ఖనిజాల విషయంలో సహకారానికి బ్రెజిల్తో ఒప్పందం కుదిరిందని ప్రధాని మోదీ వెల్లడించారు. సుస్థిరమైన సప్లై చైన్స్ నిర్మించడానికి ఇదొక కీలకమైన చర్యగా అభివరి్ణంచారు. డిజిటల్ భాగస్వామ్యంపై భారత్, బ్రెజిల్ ఒక ఉమ్మడి డిక్లరేషన్ను ఆమోదించాయి. మైనింగ్, ఎంఎస్ఎంఈ, ఆరోగ్య సంరక్షణ, సంప్రదాయ విజ్ఞానంపై ఒక అవగాహనా ఒప్పందం(ఎంఓయూ)పై సంతకాలు చేశాయి. రక్షణ రంగంలో భారత్–బ్రెజిల్ భాగస్వామ్యం కొనసాగుతూనే ఉంటుందని ప్రధానమంత్రి తేల్చిచెప్పారు. పరస్పర విశ్వాసం, వ్యూహాత్మక సహకారానికి ఇదొక గొప్ప ప్రతీక అని వెల్లడించారు. ఇరుపక్షాలూ లాభపడే భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. భారత్–బ్రెజిల్ ఒక్కటైతే గ్లోబల్ సౌత్ గొంతుక మరింత బలం పుంజుకుంటుందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య దేశాలుగా కలిసికట్టుగా పనిచేస్తూ గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ఏ సమస్యనైనా సరే చర్చలు, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలన్నదే తమ విధానమని పేర్కొన్నారు. భారత్, బ్రెజిల్కు శాశ్వత సభ్యత్వం కల్పించాలి జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద దాడులను లూలా డా సిల్వా తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని ఏ ఒక్క మతంతో గానీ, జాతితో గానీ ముడిపెట్టొద్దని అన్నారు. ప్రస్తుతం ప్రపంచ పరిణామాలు అందోళన కలిగిస్తున్నాయని, ఈ తరుణంలో భారత్–బ్రెజిల్ మధ్య సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పెరగాలని స్పష్టంచేశారు. గ్లోబల్ సౌత్లో భారత్, బ్రెజిల్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని తెలిపారు. రెండు దేశాలు డిజిటల్ సూపర్ పవర్గా, పునరుత్పాదక ఇంధన రంగంలో సూపర్ పవర్గా మారాయని వెల్లడించారు. సంఘర్షణ కొనసాగుతున్న తరుణంలో సుస్థిరాభివృద్ధి, శాంతి సాధ్యం కాదని తేల్చిచెప్పారు. 20వ శతాబ్దపు టైప్రైటర్లపై 21వ శతాబ్దపు సాఫ్ట్వేర్ను నడిపించలేమంటూ గత ఏడాది బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను సిల్వా గుర్తుచేశారు. ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు చేపట్టాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు అత్యంత కీలకమని చెప్పారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందడానికి భారత్, బ్రెజిల్కు సహజంగానే హక్కు ఉందని స్పష్టంచేశారు. గ్లోబల్ సౌత్ గొంతుకు బలంగా వినిపించాలంటే రెండు దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్నారు. -
మోదీ స్నేహ హస్తం.. బంగ్లాదేశ్ స్పందన
ఢాకా: బంగ్లాదేశ్ లో తారిక్ రెహ్మాన్ ప్రభుత్వం ఏర్పడి వారం రోజులైనా గడవక ముందే భారత్- బంగ్లా సంబంధాల్లో కీలక పురోగతి ఏర్పడింది. ఇరు దేశాల మద్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో గతేడాది డిసెంబర్ లో నిలిపివేసిన వీసా సర్వీసులను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది.భారత్, బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలు గత రెండేళ్లుగా తీవ్రంగా క్షీణించిన సంగతి తెలిసిందే. షేక్ హసీనా ఆ దేశాన్ని విడిచిన నాటి నుంచి బంగ్లాదేశ్ భారత్ పై తీవ్ర అక్కసు వెల్లగక్కింది. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా క్షీణించాయి. అంతేకాకుంగా ఆ దేశంలోనే మైనార్టీలపై ముఖ్యంగా హిందువులపై పెద్దఎత్తున దాడులు జరిగాయి. దీంతో గతేడాది డిసెంబర్ లో భారత్ అదే విధంగా బంగ్లా పరస్పరం వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. అయితే ఇటీవలే అక్కడ ఎన్నికలు జరిగి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారం చేపట్టడం.. భారత ప్రధాని నరేంద్ర మోదీ తారిఖ్ రెహ్మాన్ అభినందనలు చెప్పి భారత్ రావాల్సిందిగా కోరడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొంత చల్లారినట్లయింది.అయితే బంగ్లాదేశ్ సైతం భారత్ తో స్నేహం హస్తం కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల భారతీయులకు నిలిపివేసిన వీసా సర్వీసులను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. నిన్న శుక్రవారం ఆ దేశ హైమిషనరేట్ కార్యాలయం భారత్ కు వీసాల నిలిపివేతను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. పర్యాటక, మెడికల్, బిజినెస్, వర్క్ లతో పాటు ఇతరాత్ర వీసాలకు సంబంధించి విధించిన అన్ని ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. దీంతో భారత్ తో తిరిగి సత్సంబంధాలు నెలకొల్పడానికి తారిఖ్ రెహ్మాన్ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని తెలుస్తోంది.అయితే ఇదివరకే ఈ అంశంలో భారత్ సానుకూలంగా స్పందించింది. సిల్హెట్లోని భారత సీనియర్ కాన్సులెట్ అధికారి అనిరుద్ధ దాస్ మాట్లాడుతూ.. ‘భారత్ త్వరలోనే అన్ని వీసా సేవలను పునరుద్ధరించనుంది. ప్రస్తుతం మెడికల్, డబుల్-ఎంట్రీ వీసాలు ఇస్తున్నారు. త్వరలో ట్రావెల్ వీసాలు సహా అన్నింటిని తిరిగి ప్రారంభించనున్నారు. భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు పరస్పర గౌరవం, సాంస్కృతిక బంధంతో నడుస్తాయి. రెండు దేశాల ప్రజలే ఈ స్థిరమైన, సానుకూల సంబంధాల ప్రధాన భాగస్వాములు’ అని అన్నారు. దీనిపై బంగ్లాదేశ్ సైతం పాజిటివ్ గా స్పందించడంతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
VSR-హెరిటేజ్ లింకులు.. అజిత్ పవార్ మరణం వెనుక టీడీపీ
-
మోదీ నిర్ణయం తప్పే.. టారిఫ్ల రద్దుపై కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు యూఎస్ సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అత్యవసర అధికారాలను ఉపయోగించి ట్రంప్.. పలు దేశాలపై విధించిన అధిక టారిఫ్లను తప్పుబట్టింది. ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. ఈ క్రమంలో ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలను కొట్టివేసింది. ఈ క్రమంలో ఇటీవల భారత్, అమెరికా చేసుక్ను వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో మోదీ సర్కార్పై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. భారత్ మరో 18 రోజులు వేచి చూసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని వ్యాఖ్యలు చేస్తున్నారు.కాగా, అమెరికా విధించిన సుంకాలను సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత భారత్తో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అమెరికాతో ఏకపక్ష, భారత వ్యతిరేక వాణిజ్య ఒప్పందం చేసేందుకు కేంద్రం తొందరపడిందని ఆరోపించింది. ఈ మేరకు పలువురు కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా వేదికగా మోదీ సర్కార్ను టార్గెట్ చేసి పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో సంచలన ఆరోపణలు కూడా చేశారు.మోదీ ప్రభుత్వం ధైర్యం చేస్తుందా?: సుర్జేవాలాఅమెరికాతో కుదిరిన ఏకపక్ష వాణిజ్య ఒప్పందాన్ని మోదీ ప్రభుత్వం పునఃసమీక్షించాలని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాల్ అన్నారు. అమెరికా కొత్తగా ప్రతిపాదించిన సుంకాల స్థిరత్వం, భారత్పై వాటి వర్తింపును ప్రశ్నించారు. 1977లో అమల్లోకి వచ్చిన ఐఈఈపీఏ కింద అధ్యక్షుడికి టారిఫ్లు విధించే అధికారం లేదని అమెరికా సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 122, 1962 ట్రేడ్ ఎక్స్పాన్షన్ యాక్ట్ సెక్షన్ 232, 1974 ట్రేడ్ యాక్ట్ సెక్షన్ 301 కింద ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్లు భారత్కు వర్తించవని కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ సుంకాలు భారత్పై చట్టబద్ధంగా అమలవుతాయా? అమెరికా–భారత్ వాణిజ్య ఒప్పందం నిలబడుతుందా? రైతులు, చిన్న, మధ్యతరహా వ్యాపారులు, ఇంధన, డేటా నిపుణులు, ఆర్థికవేత్తలు వ్యతిరేకిస్తున్న ఈ ఒప్పందం నుంచి బయటకు రావడానికి మోదీ ప్రభుత్వం ధైర్యం చేస్తుందా?' అని ప్రశ్నించారు.Pursuant to the U.S Supreme Court judgment quashing Presidential powers to impose tariffs under IEEPA (International Emergency Economic Powers Act, 1977), President Trump has announced:• Imposition of 10% additional tariffs under Section 122 of the Trade Act, 1974.• Tariffs… https://t.co/UK24YTwdkm— Randeep Singh Surjewala (@rssurjewala) February 20, 2026 సెక్షన్ 122 (ట్రేడ్ యాక్ట్, 1974) ప్రకారం 150 రోజులపాటు మాత్రమే 10శాతం టారిఫ్ విధించవచ్చని సుర్జేవాలా తెలిపారు. తరువాత అమెరికా కాంగ్రెస్ ఆమోదం అవసరమని, ఇది తాత్కాలిక చర్య మాత్రమే అని అన్నారు. ఇక సెక్షన్ 232 (ట్రేడ్ ఎక్స్పాన్షన్ యాక్ట్, 1962) జాతీయ భద్రతా కారణాలతో మాత్రమే టారిఫ్ విధించాలని పేర్కొన్నారు. 270 రోజుల్లో అమెరికా వాణిజ్య శాఖ సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని చెప్పారు. భారత ఎగుమతులు జాతీయ భద్రతకు ముప్పు కాదని వివరించారు. అలాగే సెక్షన్ 301 (ట్రేడ్ యాక్ట్, 1974) సంబంధిత దేశం అన్యాయ వాణిజ్య పద్ధతులు అనుసరించిందని దర్యాప్తు ద్వారా నిరూపించాలని చెప్పారు. భారత్పై అలాంటి దర్యాప్తు జరగలేదని ఆయన వివరించారు. ఇప్పుడు జాతీయ ప్రయోజనాలను రక్షించడానికి ప్రభుత్వం సిద్ధమా? అంటూ ప్రశ్నలు సంధించారు.మోదీ రాజీ పడ్డారు: పవన్ ఖేడామరో కాంగ్రెస్ నేత పవన్ ఖేడా సోషల్ మీడియా వేదికగా..‘అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ గ్లోబల్ టారిఫ్లను రద్దు చేసింది. భారత్ మరో 18 రోజులు వేచి చూసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఫిబ్రవరి 2న వాషింగ్టన్కు అర్థరాత్రి కాల్ ఎందుకు? సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎందుకు ఆగలేదు? జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే ప్రకటనలే కారణమా? జెఫ్రీ ఎఫ్స్టీన్స్ ఫైళ్ల ప్రభావమా? గౌతమ్ అదానీకి సంబంధించిన అమెరికా క్రిమినల్ కేసా? లేక ఇవన్నీ కారణాలా? ఈ రోజు కాంగ్రెస్ వాదన నిజమైంది. ప్రధాని నరేంద్ర మోదీ రాజీ పడ్డారు' అని ఆరోపించారు. -
సీఈఓలతో మోదీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పలు టెక్నాలజీ, ఏఐ కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. 16 ఏఐ, డీప్టెక్ స్టార్టప్ల వ్యవస్థాపకులతో రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. కృత్రిమ మేధ సామర్థ్యాన్ని వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, ఉన్నత విద్య తదితర రంగాల్లో మరింత సమర్థంగా వినియోగించుకునే మార్గాలపై వారితో చర్చించారు. వీటితో పాటు పలు అంశాలపై తమ వ్యూహాలు తదితరాలను సీఈఓలు ప్రధానితో పంచుకున్నారు. వారంతా ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ వచ్చారు. అనంతరం శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకె, స్లొఒవేకియా అధ్యక్షుడు పీటర్ పెలెగ్రిని, మారిషస్ ప్రధాని నవీన్చంద్ర రామ్గులాం, లీచెన్స్టైన్ రాకుమారుడు అలోయిస్తో మోదీ విడిగా సమావేశమయ్యారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలపై వారితో లోతుగా చర్చించారు. దిస్సనాయకెతో భేటీ అద్భుతంగా సాగిందని ప్రధాని పేర్కొన్నారు. ఇంధనం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, కీలక నైపుణ్యాలు, సంస్కృతి, బ్లూ ఎకానమీ, కనెక్టివిటీ వంటి పలు అంశాలపై లోతుగా చర్చించినట్టు తెలిపారు. ఇతర దేశాధినేతలతో భేటీలో కూడా పలు కీలకాంశాలు ప్రస్తావనకు వచి్చనట్టు వెల్లడించారు. గుటెరస్తో సమావేశం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్తో కూడా మోదీ సమావేశమయ్యారు. ఏఐ ప్రస్థానం, దాని ఫలాలు అన్ని దేశాలకు సముచితంగా అందడంలో ఐరాస పాత్ర తదితరాలపై ఆయనతో లోతుగా చర్చించారు. ఏఐ సాంకేతికతను ప్రపంచ ప్రగతి కోసం మరింత సమర్థంగా వినియోగించే విషయంలో భారత్ అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తుందని గుటెరస్కు హామీ ఇచ్చారు. -
ఏఐ సదస్సు.. కలవని చేతులు.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్. ఏఐ రంగంలో ఢీ అంటే ఢీ అంటున్న ప్రత్యర్థులు. వాటి సీఈఓలు శామ్ ఆల్ట్మన్, దరియో అమొదెయ్ గురువారం ఒకే వేదికపైకి వచ్చారు. కానీ చేతులు కలిపేందుకు మాత్రం ససేమిరా అన్నారు! ఈ ఇబ్బందికర క్షణాలకు ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు వేదికైంది.ప్రధాని మోదీ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం టెక్ దిగ్గజాలంతా వేదికపైకి వెళ్లారు. గ్రూప్ ఫొటో సందర్భంగా అందరూ చేతులు కలిపి పైకెత్తారు. యాదృచ్ఛికంగా పక్కపక్కనే నిలబడ్డ ఆల్ట్మన్, అమొదెయ్ మాత్రం అందుకు నిరాకరించారు. ఎవరికి వారు విడిగా పిడికిళ్లు బిగించి పైకెత్తి సరిపెట్టారు. పైగా నిలబడ్డంతసేపూ ఇద్దరూ చాలా అసౌకర్యంగా కూడా కన్పించారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అనంతరం ఈ ఉదంతంపై ఆల్ట్మన్ స్పందించారు. ‘నేను అయోమయానికి గురయ్యా. ఎందుకంటే ఆ సమయంలో ఏం చేయాలో నాకు తెలియలేదు. మోదీ నా చేతిని పట్టుకుని పైకెత్తారు. దాంతో ఏం జరుగుతోందో కాసేపటిదాకా అర్థమే కాలేదు’ అని చెప్పుకొచ్చారు."I didn't know what was happening on stage. I was confused. Modi grabbed my hand and put it up, and I just wasn't sure what we were supposed to be doing." - Sam Altman pic.twitter.com/Hs6nlRuSsP— Mini Nagrare (@MiniforIYC) February 20, 2026మాజీ సహోద్యోగులే..కాగా, ఆల్ట్మన్, అమొదెయ్ ఒకప్పుడు సహోద్యోగులే కావడం విశేషం. ఆల్ట్మన్తో పాటు అమొదెయ్ కూడా ఓపెన్ ఏఐలోనే పని చేశారు. ఆయనతో విభేదాల నేపథ్యంలో 2020లో కంపెనీని వీడారు. ఇక, అంతకుముందు శామ్ ఆల్ట్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కృత్రిమ మేధ ఫలాలు అందరికీ అందాలంటే దాన్ని పూర్తిగా ప్రజాస్వామీకరించడమే ఏకైక మార్గం. అదే సముచితం కూడా అని కుండబద్దలు కొట్టారు. ఏఎస్ఐ ఆగమనానికి ఓపెన్ ఏఐ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంది. ప్రజాస్వామిక ఏఐ అన్నది ఈ విషయంలో మేం విశ్వసించే మౌలిక సూత్రాల్లో మొట్టమొదటిది. మానవాళి సమగ్ర ప్రగతికి అదే అత్యుత్తమ మార్గం. 2028 చివరికల్లా ప్రపంచ మేధోసామర్థ్యమంతా దాదాపుగా డేటా సెంటర్లలోనే నిక్షిప్తమై ఉంటుందని ఆల్ట్మన్ అంచనా వేశారు. ఏఐ సాంకేతికత మున్ముందు సాఫ్ట్వేర్ పరిశ్రమ తీరుతెన్నులనే సమూలంగా మార్చేయనుందని జోస్యం చెప్పారు. -
ఏఐకి మానవ్ విజన్!
న్యూఢిల్లీ: ‘‘మానవాళి చరిత్రలో అతి గొప్ప పరివర్తనశీల అధ్యాయానికి ఏఐ నాంది పలికింది. అందులో భారత్ కేవలం ఒక భాగస్వామిగా మిగిలిపోలేదు. ఏఐ విప్లవానికి సారథ్యం వహించి దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతోంది’’అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కృత్రిమ మేధ వినియోగంలో మానవాళి ఇప్పుడు కీలక కూడలి వద్ద నిలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ఏఐ ప్రస్థానాన్ని నేడు మనం ఏ దిశగా తీసుకెళ్తామన్నది మన రేపటిని, అంటే మానవాళి భవితవ్యాన్ని నిర్దేశిస్తుంది. కృత్రిమ మేధ (ఏఐ) వెల్లువలో అంతిమంగా మనిషి కేవలం ముడిసరుకుగా మిగిలిపోయే పరిస్థితి తలెత్తరాదు. జీపీఎస్ వంటి నావిగేషన్ టూల్స్ మనం ఏయే దారుల్లో వెళ్లొచ్చో సూచిస్తాయి. వాటిలో ఏ దారిని ఎంచుకోవాలన్న నిర్ణయం మాత్రం మనమే తీసుకుంటాం. అలాగే ఏఐ వాడకానికి ఆకాశమే హద్దు కావాలి. కానీ దాని నియంత్రణ మాత్రం నిత్యం మన చేతుల్లోనే ఉండాలి. అది జరగాలంటే ఏఐ వాడకాన్ని ప్రజాస్వామీకరించాలి. మనిషే ప్రధాన కేంద్రంగా దాని వినియోగం ఉండేలా సమగ్ర విధానాలు రూపొందించుకోవాలి’’అని పిలుపునిచ్చారు. గురువారం ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సదస్సును మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాషియో లులా డసిల్వాతో పాటు పలువురు దేశాధినేతలు, పలు దిగ్గజ ఏఐ కంపెనీల సీఈఓలు తదితరులు సదస్సులో పాల్గొన్నారు. వారందరికీ స్వాగతం పలుకుతూ ప్రధాని ప్రారం¿ోపన్యాసం చేశారు. ఏఐని అపారమైన శక్తి సామర్థ్యాలతో కూడిన పెన్నిధిగా ఆయన అభివరి్ణంచారు. ‘‘ఏఐ వాడకం ఆశించిన దిశగా సాగకుండా దారి మళ్లితే లక్ష్యసాధనకు బదులు వినాశనానికే దారితీస్తుంది. సజావుగా వాడినప్పుడు మాత్రమే మానవాళి ఎదుర్కొంటున్న పెను సమస్యలకు పరిష్కారాలు చూపి ప్రగతికి బాటలు పరుస్తుంది. అలా జరగాలంటే టెక్నాలజీ మనపై పెత్తనం చేయకూడదు. మనమే టెక్నాలజీని నియంత్రించాలి. అందుకోసం అన్ని రంగాల్లోనూ నానాటికీ కీలకంగా మారుతున్న అత్యాధునిక ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన రీతిలో వాడుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ సమగ్ర విధానాలను రూపొందించుకోవడం చాలా ముఖ్యం’’అని సూచించారు. ఇందుకోసం ‘మానవ్’విజన్ను ఆవిష్కరిస్తున్నట్టు ప్రధాని ప్రకటించారు. అంటే ‘నైతిక వ్యవస్థలు (మోరల్, ఎథికల్ సిస్టమ్స్–ఎం), జవాబుదారీతనంతో కూడిన పాలన (అకౌంటబుల్ గవర్నెన్స్–ఏ), దేశాల సార్వ¿ౌమత్వం (నేషనల్ సావర్నిటీ–(ఎన్), అందుబాటులో, సమ్మిళిత (యాక్సిసబుల్, ఇంక్లూజివ్–ఏ), ఆమోదయోగ్య, చట్టబద్ధ (వాలీడ్ అండ్ లెజిటిమేట్–వీ)’అని వివరించారు. ఈ విలువలు ఏఐ సమర్థ వాడకానికి దేశాలన్నింటికీ దారి చూపుతాయని ఆశాభావం వెలిబుచ్చారు. సార్వత్రిక సంక్షేమం, అందరికీ ఆనందమే ఏఐ వినియోగం విషయంలో భారత్ నిర్దేశించుకున్న ప్రమాణమని పేర్కొన్నారు. కనుకనే దాన్ని సదస్సు ఇతివృత్తంగా ఎంపిక చేసినట్టు వివరించారు. ‘‘ఏఐ అన్నివిధాలుగా అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. అప్పు డు మాత్రమే అది సర్వ మానవాళికీ మేలు చేస్తుంది. ఇది నా నిశి్చతాభిప్రాయం’’అని స్పష్టం చేశారు. భారత్ సిద్ధం ఏఐ విప్లవాన్ని అందిపుచ్చుకునేందుకు భారత్ ఏ మాత్రమూ వెనకాడటం లేదని మోదీ చెప్పారు. పైగా ఈ టెక్నాలజీని ఒక గొప్ప సంపదగా, బంగారు భవిష్యత్తుకు నమూనాగా పరిగణిస్తోందని దేశాధినేతలతో పాటు సభికులందరి హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఏఐ రంగంలో సూపర్ పవర్గా నిలిచేందుకు అవసరమైన నైపుణ్యం, వనరులు, విధాన స్పష్టత తదితరాలన్నీ భారత్ సొంతమని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుత సదస్సులోనే మూడు భారత కంపెనీలు తమ సరికొత్త ఏఐ మోడళ్లను, యాప్లను ఆవిష్కరించాయి. భారత యువతలో దాగున్న ప్రతిభకు ఇదే నిదర్శనం’’అని వివరించారు. ‘‘ఏఐ మన వ్యవస్థలన్నింటినీ మరింత తెలివైనవిగా, సమర్థంగా, ప్రభావవంతంగా మారుస్తుంది. యువత, వృత్తి నిపుణులు మరింత సృజనాత్మక బాధ్యతలు చేపట్టేందుకు అపారమైన అవకాశాలను అందుబాటులోకి తెస్తుంది. ఇన్నొవేషన్లకు, పారిశ్రామికతకు, కొత్త పరిశ్రమల స్థాపనకు ఒక గొప్ప అవకాశంగా ఏఐ నిలుస్తోంది. ఏఐ టూల్స్ను అతి గోప్యంగా అభివృద్ధి చేయాలని కొన్ని దేశాలు భావిస్తున్నాయి. కానీ భారత్ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఏఐ సాంకేతికతను అందరితోనూ పూర్తిస్థాయిలో పంచుకోవాలన్నది మా విధానం. అప్పుడే కోట్లాది మంది యువతీ యువకులు మరింతగా ఎదుగుతారు. తద్వారా సార్వత్రిక ప్రగతి, ప్రపంచ శ్రేయస్సు సాధ్యమన్నది మా విశ్వాసం’’అని మోదీ వివరించారు. ‘‘మన భావి తరాలకు ఎటువంటి ఏఐ నమూనాను అందిస్తమన్నది చాలా ముఖ్యం. అది సాధికారత, సమ్మిళిత భావనతో కూడుకుని ఉండేలా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత మనందరిపైనా ఉంది’’అంటూ పిలుపునిచ్చారు. స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై పర్మెలిన్, శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకె, భూటాన్ ప్రధాని షెరింగ్ గోబ్గే, మారిషస్ ప్రధాని నవీన్చంద్ర రాంగులామ్, క్రొయేషియా ప్రధాని ఆంద్రెజ్ ప్లెంకోవిక్, సెర్బియా అధ్యక్షుడు అలెక్జాండర్ వుకిక్, సీషెల్స్ ప్రధాని సెబాస్టియన్ పిళ్లై, ఎస్టోనియా అధ్యక్షుడు అలర్ కరిస్, ఫిన్లండ్ ప్రధాని పెటెరీ ఓర్పో తదితర దేశాధినేతలు ఏఐ సదస్సులో పాల్గొన్నారు.ఏఐ.. మేలిమలుపు ‘‘మానవ చరిత్రలో పలు కీలక మైలురాళ్లున్నాయి. శతాబ్దాల పాటు అవి మన చరిత్రను తీర్చిదిద్దాయి. మన నాగరికతలను, అభివృద్ధి వేగాన్ని నిర్దేశించాయి. ఏఐ కూడా అలాంటి కీలక మార్పే’’అని మోదీ అన్నారు. ‘‘ప్రపంచ జనాభాలో ఆరో వంతుకు భారత్ ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో యువత ఇక్కడే ఉంది. టెక్నాలజీపరంగా అతి పెద్ద టాలెంట్ పూల్కు భారత్ నిలయం. కనుక ఏఐ ఇంపాక్ట్ సదస్సు భారత్లో జరుగుతుండటం చాలా సముచితంగా ఉంది’’అని మోదీ అన్నారు.సైగల భాషలో ప్రత్యక్ష తర్జుమా! న్యూఢిల్లీ: ఏఐ ఇండియా ఇంపాక్ట్ సదస్సులో ఆసక్తికరమైన దృశ్యం అందరినీ ఆకర్షించింది. గురువారం సదస్సును ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం ఏఐ ఆధారిత సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రెటేషన్ పరిజ్ఞానం సాయంతో 11 భాషల్లో ప్రత్యక్ష ప్రసారమైంది. అంతేగాక ప్రసంగాన్ని సైగల భాషలోకి కూడా అనువదించి వేదికపై ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డుపై ప్రదర్శించడం విశేషం. -
రఫేల్ విమానాలపై మాక్రాన్ కీలక వ్యాఖ్యలు..
ఢిల్లీ: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. భారత్పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. భారత్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఐ లవ్ యువర్ కంట్రీ అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో భారత్- ఫ్రాన్స్ల మధ్య రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు అంశంలో వస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. ఈ యుద్ధ విమానాలు భారత్ను బలీయమైన సైనిక శక్తిగా మారుస్తాయని తెలిపారు. అదేవిధంగా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయని చెప్పుకొచ్చారు.ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గురువారం ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాక్రాన్ మాట్లాడుతూ.. భారత్-ఫ్రాన్స్ మధ్య ఉన్న బంధం ప్రత్యేకమైనది. వ్యూహాత్మక ప్రయోజనాలున్న అనేక రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. భారత ప్రభుత్వానికి, దసో ఏవియేషన్కు మధ్య జరుగుతున్న చర్చల్లో రఫేల్ కొనుగోళ్లు ఓ భాగం. దీనిపై ఎందుకు విమర్శలు వస్తున్నాయో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ డీల్ భారత్ను సైనికపరంగా మరింత శక్తిమంతం చేస్తుంది. స్థానికంగా మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తుంది.ఇటీవల భారత్- ఫ్రాన్స్ల మధ్య సంబంధాలను ‘ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచాలని నిర్ణయించాం. ఇందులో రఫేల్ ఒప్పందం కీలకపాత్ర పోషిస్తుంది. 114 రఫేల్ యుద్ధ విమానాల కోసం ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం, భారత రక్షణ సన్నద్ధతకు వ్యూహాత్మక బలాన్ని ఇస్తుంది’ అని మాక్రాన్ వ్యాఖ్యానించారు. మరోవైపు.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోరిక మేరకు.. ఈ ఒప్పందంలో ‘మేక్ ఇన్ ఇండియా’ విధానానికే పెద్దపీట వేస్తామని మాక్రాన్ హామీ ఇచ్చారు. గరిష్ట సంఖ్యలో భారతీయ విడిభాగాలు, కీలక పరికరాలను భారత్లోనే తయారు చేయడానికి, నిర్మించడానికి మేం కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చారు. -
ఏఐ సదస్సు లంచ్ మెనూ ఇదే..!
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు ప్రారంభమైన సంగతి తెలిసింది. ఈ ఏఐ సదస్సుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్లు పాల్గొన్నారు. ఉదయం 9:40 గంటలకు ఈ శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఓపెన్ ఐఏ సీఈవో సామ్ ఆల్ట్మాన్ వంటి టాప్ టెక్ సీఈవోలు ప్రసంగిస్తారు. వీళ్లతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీనియర్ పరిశ్రమ నాయకులు, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ తదితరులు కూడా ప్రసగించనున్నారు. మరి ఈ అతిరథమహారథుల కోసం విందు భారత్ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మరి ఆ నాయకుల లంచ్ మెనూలో ఏయే వంటకాలు సిద్ధంగా ఉన్నాయంటే..లంచ్లో అలెర్జీ రహిత వంటకాలను సర్వ్ చేయనున్నారు. ముఖ్యంగా పాలు, గోధుమ, నట్స్ లేకుండా రెసీపీలు సిద్ధం చేశారు. ఈమెనూలో వందగ్రాముల కేలరీలు,పోషక విలువలు ఉండేలా కేర్ తీసుకున్నారు పాకనిపుణులు. ఇంతకీ ఏమేమి వంటకాలు ఉన్నాయంటే..స్టార్టర్స్ నిమోనా కబాబ్జీలకర్ర, ఆసాఫోటిడాతో టెంపర్ చేసిన పాన్-గ్రిల్డ్ గ్రీన్ బఠానీ కబాబ్. ఇవి బీహార్, ఉత్తరప్రదేశ్లలో ప్రసిద్ధి చెందిన తాజా పచ్చి బఠానీల చేసే శీతాకాలపు వంటకం. వంద గ్రాముల కబాబ్లకు 113 కిలో కేలరీలుఖమ్ ఖతైసున్నితమైన ఆకుపచ్చ మూంగ్ పప్పు ప్యాటీలను తీపి మామిడి చట్నీతో నింపి పాన్-గ్రిల్డ్ చేస్తారు. ఈ శాఖాహార కబాబ్లు నోటిలో ఇట్టే కరిగిపోతాయి. ప్రతి వందగ్రాములకు 116 కిలో కేలరీలుకాశ్మీరీ నద్రు కుర్కురిసుగంధ ద్రవ్యాలతో చల్లిన క్రిస్పీ ఫ్రైడ్ లోటస్ స్టెమ్ చిప్స్. ఇది కాశ్మీర్ లోయ నుంచి వచ్చిన ప్రసిద్ధ, క్రంచీ స్నాక్. ఇందులో కూడా ప్రతి వంద గ్రాములకు 143 కిలో కేలరీలుప్రధాన కోర్సుజాఫ్రానీ సబ్జ్ పులావ్కాలానుగుణ కూరగాయలు, కుంకుమపువ్వుతో సువాసనగల బాస్మతి బియ్యం. ఇది కుంకుమపువ్వు (జాఫ్రాన్), నట్స్, నెయ్యితో తయారు చేసిన గొప్ప, సుగంధ పులావ్ వంటకం. దీనిని తరచుగా హైదరాబాద్లో విలాసవంతమైన, వేడుక లేదా "నవాబీ" భోజనంలో భాగంగా వడ్డిస్తారు. వందగ్రాములకు 152 కిలో కేలరీలుతందూరీ సలాడ్టమోటాలు, బెల్ పెప్పర్స్, పైనాపిల్లను తందూర్లో మ్యారినేట్ చేసి గ్రిల్ చేస్తారు.వంద గ్రాములకు 78 కిలో కేలరీలుథెప్లామెంతులతో రుచిగల గ్రామ్ పిండి ఫ్లాట్బ్రెడ్, మామిడి రుచిగల క్రీమ్ చీజ్తో సర్వ్ చేస్తారు. థెప్లా అనేది గుజరాతీ గృహాల్లో ప్రధానమైన, ప్రసిద్ధమైన, మృదువైన సన్నని ఫ్లాట్బ్రెడ్.వంద గ్రాములకు 138 కిలో కేలరీలుడెజర్ట్లుగులాబీ అండ్ కొబ్బరి పుడ్డింగ్ఫింగర్ మిల్లెట్ క్రంబుల్తో గులాబీ, కొబ్బరి పాలు పుడ్డింగ్ (ఖీర్). శక్తివంతమైన గులాబీ రంగును కలిగి ఉన్న క్రీమీ డెజర్ట్.వంద గ్రాములకు 167 కిలో కేలరీలురామదాన అంజీర్ లడూపఫ్డ్ మిల్లెట్, ఎండిన అంజూరతో చేసే లడ్డూ. ప్రతి వంద గ్రాములకు 172 కిలో కేలరీలుకాగా ఈ ఐఏ ఇంపాక్ట్ సదస్సు సుమారు 20కి పైగా రాష్ట్రాల అధిపతులు, దాదాపు వంద మందికి పైగా సీఈవోలు, వ్యవస్థాపకులతో సహా 500 మంది అగ్ర నాయకులను ఒక చోటకు చేర్చింది.ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 20 కంటే ఎక్కువ రాష్ట్రాల అధిపతులను మరియు 100 మంది CEOలు మరియు వ్యవస్థాపకులతో సహా 500 కంటే ఎక్కువ ప్రపంచ AI నాయకులను ఒకచోట చేర్చింది.(చదవండి: ఆ తాతగారి లైఫ్స్టైల్కి ఫిదా అవ్వాల్సిందే..! జిమ్ లేదు, కనీసం..) -
ఏఐ మనల్ని కాదు.. మనం ఏఐని శాసించాలి: ప్రధాని మోదీ
ఢిల్లీ: ఏఐ విజన్తో పాటు, సామాజిక బాధ్యత కూడా చాలా ముఖ్యం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఏఐపై తొలినాళ్లలో అనేక సందేహాలు వచ్చాయని.. నిప్పురవ్వను రాజేసిన యుగం నుంచి ఇప్పుడు ఏఐ యుగం వరకు మనిషి మేథస్సు ఎదిగిందన్నారు.‘‘ప్రపంచం ఆరో వంతుకు భారత్ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఏఐ కేంద్రంగా భారత్ మారుతోంది. ఏఐ కంట్రోల్ మనిషిదే అయి ఉండాలి. ప్రపంచంలోనే అతిపెద్ద, చారిత్రాత్మక ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరుగుతోంది. కొత్త టెక్నాలజీ ఆవిష్కరణకు ఈ వేదిక దోహదం చేస్తుంది. ఏఐ విజన్తో పాటు, సామాజిక బాధ్యత కూడా చాలా ముఖ్యం. ఏఐ సమ్మిట్ నిర్వహణ భారత్కే కాదు.. దక్షిణాసియాకే గర్వ కారణం. యువత ఇప్పుడు ఏఐని ప్రయోజనకంగా ఉపయోగిస్తోంది. ఏఐ కూడా కత్తికి రెండు వైపుల పదునున్న అస్త్రం. భారత్కు యువత.. కొత్త శక్తి, ఆస్తిగా మారారు. ఏఐ టెక్నాలజీ వినియోగం, వాటి ఫలితాలపై తుది నిర్ణయం మనిషిదే అయి ఉండాలి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
ఢిల్లీలో ఇండియా ఏఐ సదస్సు ప్రారంభం
ఢిల్లీ : ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు ప్రారంభమైంది. ఏఐ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్లు పాల్గొన్నారు. నేటి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు ముఖ్య విశేషాలు..ఉ. 11 గంటలకు వివిధ దేశాల స్టాళ్లను పరిశీలించనున్న ప్రధాని మోడీ, దేశాధినేతలుమ.12 నుంచి లీడర్స్ ప్లీనరీ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని మోడీలీడర్స్ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రపంచ దేశాధినేతలు, మంత్రులు , బహుళ జాతి సంస్థల ప్రతినిధులుఏఐ రంగంలో గ్లోబల్ ప్రాధాన్యతలు, పరిపాలన, మౌలిక వసతులు, అంతర్జాతీయ సహకారం పై చర్చలు జరుపనున్న ప్రపంచ దేశాధినేతలుసా5:30 కు సీఈఓ లతో ప్రధాని నరేంద్ర మోడీ రౌండ్ టేబుల్ మీటింగ్ఈ కార్యక్రమంలో పాల్గొననున్న గ్లోబల్ టెక్నాలజీ ,ఇండస్ట్రీ లకు సంబంధించిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు పెట్టుబడులు , పరిశోధన , సప్లై చైన్స్, ఏఐ సిస్టమ్స్ ఏర్పాటు తదితర అంశాలపై చర్చసర్వజన హితాయ సర్వజన సుఖాయ అనే నినాదంతో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్ అనే మూడు స్తంభాల ఆధారంగా 7 వర్కింగ్ గ్రూపుల ఏర్పాటువివిధ రంగాలలో ఏఐ ప్రభావం పై చర్చలు జరుపనున్న వర్కింగ్ గ్రూప్స్ఏఐ వర్కింగ్ గ్రూప్లు..1. ఆర్థిక వృద్ధి, సామాజిక అభివృద్ధి కోసం ఏఐ 2. వనరుల ప్రజాస్వామికరణ 3. సామాజిక సాధికారిత4. సురక్షితమైన విశ్వసనీయ ఏఐ 5. మానవ మూలధనం 6. సైన్స్ 7. స్థితిస్థాపకత ,ఆవిష్కరణ, సామర్థ్యం అంశాలపై వర్కింగ్ గ్రూప్ ల ఏర్పాటు500 మంది గ్లోబల్ ఏఐ లీడర్స్, వందమంది సీఈవోలు , 100 మంది ప్రభుత్వ ప్రతినిధులు, 20 దేశాధినేతలు, 60 మంది మంత్రులను ఒకే వేదిక పైకి తీసుకు వస్తున్న సదస్సు -
ఎఫ్టీఏతో సువర్ణాధ్యాయం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్, ఫిన్లాండ్ ప్రధాని పెటెరీ ఓర్పోతోపాటు సెర్బియా అధ్యక్షుడు అలెక్సాండర్ వుకిక్, ఎస్తోనియా అధ్యక్షుడు అలార్ కరీస్, కజకిస్తాన్ ప్రధానమంత్రి ఒల్జాస్ బెక్తెనోవ్, క్రొయేషియా ప్రధానమంత్రి అండ్రెజ్ ప్లెంకోవిక్తో వేర్వేరుగా సమావేశమయ్యారు. భారత్–యూరోపియన్ యూనియన్(ఈయూ) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ)తో భారత్–ఈయూ సంబంధాల్లో సువర్ణ అధ్యాయం ప్రారంభమైందని, దీంతో ఇరుపక్షాల సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సదస్సు సందర్భంగా ఈ భేటీలు జరిగాయి. ఆయా దేశాల అధినేతలతో సమావేశం అనంతరం మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. స్పెయిన్ అధ్యక్షుడు సాంచెజ్తో ఫలవంతమైన సమావేశం జరిగినట్లు వెల్లడించారు. భారత్–స్పెయిన్ మధ్య ద్వైపాక్షిక అంశాలతోపాటు స్నేహ సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించామని తెలిపారు. వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధన వనరులు, అంతరిక్షం, పర్యాటకం, రక్షణ, టెక్నాలజీ తదితర కీలక రంగాల్లో పరస్పర సహకారంపై అభిప్రాయాలు పంచుకున్నామని ఉద్ఘాటించారు. 2026వ సంవత్సరం భారత్–స్పెయిన్ భాగస్వామ్యానికి సాంస్కృతిక, పర్యాటక, కృత్రిమ మేధ(ఏఐ) సంవత్సరమని వివరించారు. ఇరుదేశాల ప్రజల మధ్య బంధం మరింత బలపడడం తథ్యమని చెప్పారు. స్పెయిన్ యూనివర్సిటీల నుంచి ప్రతినిధి బృందం భారత్కు రావడం సంతోషంగా ఉందన్నారు. భారత్–ఈయూ ఎఫ్టీఏ వల్ల స్పెయిన్తో ఆర్థిక భాగస్వామ్యంపై సానుకూల ప్రభావం కచ్చితంగా ఉంటుందని స్పష్టంచేశారు. ఇరుదేశాల ప్రజలకు నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. భారత్, ఈయూ మధ్య జనవరి 27న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దీన్ని ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా ఇరుపక్షాలు అభివరి్ణస్తున్నాయి. భారత్తో బలమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని స్పెయిన్ అధ్యక్షుడు సాంచెజ్ స్పష్టంచేశారు. ఇంపాక్ట్ ఏఐ సదస్సు విజయవంతంగా నిర్వహించినందుకు ప్రధాని మోదీకి అభినందనలు తెలియజేశారు. -
నేడు ఏఐ కీలక సదస్సు
న్యూఢిల్లీ: ఇండియా ఏఐ ఇంపాక్ట్ కీలక సదస్సు గురువారం ఢిల్లీలో జరగనుంది. రంగాలవారీగా ఏఐ ప్రభావం, దాని సమర్థ వినియోగం, ప్రతికూల ప్రభావాల కట్టడి తదితరాలపై పలువురు దేశాధినేతలు, దిగ్గజ ఏఐ కంపెనీల సారథులు, విద్యావేత్తలు, పరిశోధకులు సదస్సు వేదికగా లోతుగా మేధోమథనం జరపనున్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సు గ్లోబల్ సౌత్లో జరగనుండటం ఇదే తొలిసారి. గురువారం ఉదయం ఢిల్లీలోని భారత్ మండపంలో సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. అనంతరం అందులో పాల్గొంటున్న పలువురు దేశాధినేతలు, ప్రముఖులతో విడిగా సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు. తర్వాత సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. మోదీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కూడా సదస్సులో మాట్లాడతారు. పలు ఏఐ దిగ్గజ సంస్థల సీఈఓలు, పారిశ్రామిక ప్రముఖులు తదితరులు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ‘సర్వజన హితాయ, సర్వజన సుఖాయ’నినాదంతో సదస్సు జరగనుంది. ప్రధానంగా ఏడు వర్కింగ్ గ్రూప్లు ఏర్పాటు చేసి వాటిపై కూలంకషంగా చర్చించనున్నారు. అవి ఆర్థిక ప్రగతి, సామాజిక హితానికి ఏఐ; ఏఐ వనరుల ప్రజాస్వామ్యీకరణ; సామాజిక సాధికారతకు చోటు; సురక్షిత, విశ్వసనీయ ఏఐ; మానవ వనరుల పెట్టుబడి; సైన్స్; పుంజుకునే సత్తా, ఇన్నొవేషన్, సామర్థ్యం. ఈ చర్చలన్నీ ‘ప్రజలు, భూమి, ప్రగతి’ప్ర«దానాంశాలుగా సాగుతాయి. పలువురు దేశాధినేతలతో పాటు 500 మందికి పైగా అంతర్జాతీయ స్థాయి ఏఐ సారథులు, 100 మందికి పైగా సీఈఓలు, 150 మంది విద్యావేత్తలు, పరిశోధకులు, 400 మంది సీటీఓలు, ఉపాధ్యక్షులు, దాతలు సదస్సులో భాగస్వాములు కానున్నారు. ఏఐ రంగంలో భారత్ను సారథ్య స్థానంలో నిలిపే లక్ష్యసాధనలో భాగంగా ఈ సదస్సును కేంద్రం నిర్వహిస్తోంది. బిజీ బిజీగా మోదీ సదస్సును ప్రారంభించి అనంతరం పలువురు దేశాధినేతలు, సీఈఓలు, ప్రముఖులతో కలిసి ఏఐ ఇండియా ఇంపాక్ట్ ఎక్స్పో–2026ను మోదీ సందర్శిస్తారు. సోమవారం భారత్ మండపంలో ప్రారంభమైన ఎక్స్పోకు విశేష ఆదరణ లభిస్తుండటం తెలిసిందే. మధ్యాహ్నం నుంచి అదే వేదిక వద్ద లీడర్ల సదస్సులో ప్రధాని పాల్గొంటారు. దేశాధినేతలు, పలు దేశాల మంత్రులు, ఉన్నతాధికారులు తదితరులు ఇందులో భాగస్వాములు కానున్నారు. పాలన, మౌలిక సదుపాయాలు, సహకారంతో పాటు పలు అంశాలకు సంబంధించి ఏఐలో జాతీయ, అంతర్జాతీయ ప్రాథమ్యాలపై వారంతా మేధోమథనం జరుపుతారు. సాయంత్రం 5:30 నుంచి జాతీయ, అంతర్జాతీయ ఏఐ దిగ్గజ కంపెనీల సారథులు, సీఈఓలతో రౌండ్టేబుల్ సమావేశంలో మోదీ పాల్గొంటారు. ఏఐ, సంబంధిత వ్యవస్థల్లో పెట్టుబడులు, పరిశోధనలు, కొలాబరేషన్, సరఫరా వ్యవస్థలు తదితరాలపై వారితో చర్చిస్తారు.ఎల్లుండి దాకా ఎక్స్పో ఏఐ సదస్సుకు దేశాధినేతలు, సీఈఓలు, వీఐపీల రాక నేపథ్యంలో ఏఐ ఇండియా ఎక్స్పోను గురువారం మూసేయనున్నారు. అయితే ఎక్స్ పోకు లభిస్తు న్న విశేష ఆదరణ నేపథ్యంలో దాన్ని శనివారం దాకా పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం ఎక్స్పో శుక్రవారం ముగియాల్సి ఉంది. అధినేతలకు మోదీ స్వాగతం న్యూఢిల్లీ: ఏఐ ఇండియా ఇంపాక్ట్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన పలువురు దేశాధినేతలు, ప్రముఖులకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఢిల్లీలోని భారత్ మండపం వద్ద స్వయంగా స్వాగతం పలికారు. శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకె, గ్రీస్ ప్రధాని కైరియాకోస్ మిత్సోతకిస్, ఫిన్లండ్ ప్రధాని పెటెరీ ఓప్రో, భూటాన్ ప్రధాని షెరింగ్ గోబ్గే, మారిషస్ ప్రధాని నవీన్చంద్ర రామ్ గులాం, క్రొయేషియా ప్రధాని ఆంద్రెజ్ ప్లెంకోవిక్, సెర్బియా అధ్యక్షుడు అలెక్సాండర్ వుకిక్, సీషెల్స్ ఉపాధ్యక్షుడు సెబాస్టియన్ పిళ్లై, ఎస్టోనియా అధ్యక్షుడు అలర్ కరిస్, గయానా ఉపాధ్యక్షుడు భారత్ జగ్దేవ్ తదితరులు వీరిలో ఉన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జియెవా తదితరులను కూడా ప్రధాని ఆప్యాయంగా స్వాగతించారు. ఆహూతులందరికీ ఈ సందర్భంగా మేళతాళాలు, పూలు, అక్షింతలతో సంప్రదాయబద్ధంగా ఘనస్వాగతం లభించింది. -
పదునెక్కిన బంధం
అంతర్జాతీయంగా అవాంతరాలు ఎదురైన ప్రతి సందర్భంలోనూ మనకు అండగా నిలబడిన ఫ్రాన్స్తో మన అనుబంధం మరింత బలపడింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ భారత పర్యటన సందర్భంగా రక్షణ, ఆరోగ్యం, అత్యంతా ధునాతన సాంకేతికత, సంప్రదాయేతర ఇంధన వనరులు, అరుదైన ఖనిజాలు సహా పలు అంశాల్లో ఇరు దేశాలకూ లబ్ధి చేకూర్చే 21 ఒప్పందాలపై మంగళవారం సంతకాలు కావటంతోపాటు ఇప్పుడున్న ద్వైపాక్షిక బంధాన్ని ప్రత్యేక ప్రపంచ స్థాయి వ్యూహాత్మక భాగస్వామ్యానికి విస్తరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, మెక్రాన్లు నిర్ణయించటం చరిత్రాత్మకం. పరస్పర గౌరవం, ఇచ్చిపుచ్చుకొనే ధోరణి ఉంటే దేశాల మధ్య స్నేహం చిగురించటం, విస్తరించటం కష్టమేమీ కాదు. కానీ చుట్టూ గడ్డు పరిస్థితులున్నా, అనిశ్చితి ఆవరించినా కూడా ఆ బంధం మరింత దృఢపడటం గొప్ప విషయం. మోదీ అన్నట్టు ఇరు దేశాల మధ్యా దశాబ్దాలుగా ఉన్న ‘సరిహద్దులు లేని’ చెలిమి వల్లనే ఇదంతా సాధ్యమైంది. 1988లో పోఖ్రాన్లో అప్పటి వాజ్పేయి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అణుపరీక్ష నిర్వహించినప్పుడు ఏం జరిగిందో అందరికీ గుర్తుంది. అప్పటికే తమ అమ్ములపొదిలో వందల సంఖ్యలో అణుబాంబులు పెట్టుకున్న అమెరికా, బ్రిటన్, చైనా తదితర దేశాలన్నీ మనపై విరుచుకుపడ్డాయి. సుద్దులు చెప్పేందుకు సిద్ధమ య్యాయి. యూరోపియన్ యూనియన్ (ఈయూ) శిఖరాగ్ర సదస్సు ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. అప్పుడు భారత్ను గట్టిగా సమర్థించి, ఆంక్షలు విధించే తీర్మానాన్ని ‘వీటో’ చేస్తామని ఫ్రాన్స్ హెచ్చరించటంతో అది కాస్తా సద్దుమణిగింది. ఆ తర్వాత కూడా అణు రియాక్టర్ల సాంకేతికత మొదలు అధునాతన ఆయుధాలు అందించటం వరకూ ఆ దేశం మనకెంతో తోడ్పాటునందించింది. ప్రపంచ దేశాలను బతిమాలి, ఒత్తిడి తెచ్చి మూడు దశాబ్దాల క్రితం తానే తీసు కొచ్చిన ప్రపంచీకరణ విధానాలకు హఠాత్తుగా తిలోదకాలిచ్చిన అమెరికా... ఇప్పుడు ఒంటెత్తు పోకడలతో, బెదిరింపులతో, దబాయింపులతో అందరినీ పాదాక్రాంతం చేసుకోవాలని చూస్తోంది. అంతర్జాతీయ దౌత్య సంప్రదాయాలకూ, మర్యాదలకూ ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెల్లుచీటీ ఇచ్చారు. ఈ కల్లోల స్థితిలో భారత్–ఫ్రాన్స్ల మధ్య ఇప్పుడు కుదిరిన ఒప్పందాలు ఏదోమేర సుస్థిరత ఏర్పడటానికి దోహద పడతాయి. వర్తమాన ప్రపంచ పరిణామాలపై ఇరు దేశాల వైఖరులూ ఒకటే. అన్ని దేశాలూ నిబంధనలకు కట్టుబడి ఉన్నప్పుడే అందరూ సమానంగా అభివృద్ధి సాధించగల మెరుగైన ప్రపంచం ఏర్పడుతుందని రెండు దేశాలూ విశ్వసిస్తాయి. ఇలాంటి సారూప్యతల కారణంగానే ప్రగాఢమైన సాన్నిహిత్యం సాధ్యమైంది. మన రక్షణ కొనుగోళ్లలో రష్యా తర్వాత ఫ్రాన్స్దే రెండో స్థానం. ఆ రంగంలో మనం స్వావలంబన సాధించాలనీ, విదేశాలపై ఆధారపడటం తగ్గాలనీ అందరూ కోరుకుంటున్నదే. కానీ ఈలోగా మన భద్రతకూ, రక్షణకూ విశ్వసించదగ్గ భాగస్వాములు ఎంతో అవసరం. రష్యాతోపాటు ఫ్రాన్స్ దాన్ని నెరవేర్చగలుగుతోంది. మన వైమానిక దళానికీ, నావికాదళానికీ మరిన్ని రఫేల్ యుద్ధ విమానాల కోసం మనం ఒప్పందం కుదుర్చుకోగా, వాటిలో కొన్నిటిని ఇక్కడే ఉత్పత్తి చేసేందుకు ఫ్రాన్స్ అంగీకరించింది. అలాగే ఎవరెస్టు శిఖరం కన్నా ఎత్తులో ఎగిరే ఎయిర్బస్ హెచ్ 125 హెలికాప్టర్ల తయారీ సైతం మొదలైంది. వాటిని ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేస్తామని మోదీ ప్రకటించారు. ప్రపంచం తూర్పు, పడమరలుగా... ఉత్తర, దక్షిణాలుగా విడివడి ఉంది. మనం పాశ్చాత్య దేశాలుగా పిలుచుకునే వాటిలో సైతం భిన్న ధోరణులు కనబడుతున్నాయి. ఇలాంటి ప్రపంచంలో పరస్పర సహకారం, గౌరవం, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటే ఏ రెండు పక్షాల మధ్యనైనా అవగాహన కష్టం కాదని ఇప్పుడు ఫ్రాన్స్తో కుదిరిన ఒప్పందాలైనా, ఇంత క్రితం బ్రిటన్, ఈయూలతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలైనా రుజువు చేశాయి. ఎప్పటికీ ఏకధ్రువ ప్రపంచమే కొనసాగాలనీ, తమ ఆధిపత్యమే శాశ్వతంగా వర్ధిల్లాలనీ, అన్యులెవరూ ఎదగరాదనీ భావిస్తున్న అమెరికా... బహుళ ధ్రువ ప్రపంచం తన కళ్లముందే నిర్మాణమవుతున్న వైనాన్ని ఇకనైనా గ్రహించటం మంచిది. -
‘బంగ్లా’కు సహకరిస్తాం.. భారత్కు రండి’
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తారిఖ్ రెహ్మాన్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోదీ ఆయనను భారత్కు ఆహ్వానించారు. మంగళవారం ఢాకాలో తారిఖ్ రెహ్మాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. భారత ప్రభుత్వ ప్రతినిధిగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యయుతంగా కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సందర్భంగా ఓం బిర్లా నూతన ప్రధానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిన వ్యక్తిగత లేఖను ఆయనకు స్వయంగా అందజేశారు.పొరుగు దేశంతో సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా భారత్ ఈ కీలక అడుగు వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ తన లేఖ ద్వారా తారిఖ్ రెహ్మాన్ భారతదేశ పర్యటనకు రావాలని సాదరంగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని ఓం బిర్లా తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొంటూ ‘ప్రధాని మోదీ పంపిన లేఖను రెహ్మాన్కు అందజేశాను. బంగ్లాదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇరు దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని పునరుద్ఘాటించాను’ అని తెలిపారు. కాగా ఫిబ్రవరి 13నే మోదీ ఫోన్ ద్వారా రెహ్మాన్ను అభినందించారు. తాజా లేఖలో బంగ్లాదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో భారత్ పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నట్లు సమాచారం. Just concluded a constructive meeting with Prime Minister of Bangladesh @trahmanbnpI handed over a personal letter from Prime Minister @narendramodi conveying his wishes to PM Rahman and inviting him to visit India at the earliest convenience.I extended warm congratulations… pic.twitter.com/gFNqLmnxsT— Om Birla (@ombirlakota) February 17, 2026ఫిబ్రవరి 12న జరిగిన సాధారణ ఎన్నికల్లో తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) మూడింట రెండొంతుల మెజారిటీతో ఘనవిజయం సాధించింది. సుమారు 17 ఏళ్ల పాటు లండన్లో ప్రవాస జీవితం గడిపిన రెహమాన్, ఎన్నికలకు ముందు స్వదేశానికి తిరిగి వచ్చి తన పార్టీని విజయపథంలో నడిపారు. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఏర్పడిన ఆందోళనకర పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంలో ఈ ఎన్నికల విజయం కీలకంగా నిలిచింది. ప్రస్తుతం షేక్ హసీనా భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు.భారత్తో సంబంధాల విషయంలో తారిఖ్ రెహ్మాన్ స్పందించారు. తమ విదేశాంగ విధానం పూర్తిగా ‘బంగ్లాదేశ్ ఫస్ట్’ ఎజెండాపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలే తమకు అత్యున్నతమని, దాని ప్రకారమే పొరుగు దేశాలతో సంబంధాలు ఉంటాయని పేర్కొన్నారు. కాగా చారిత్రక, సాంస్కృతిక బంధాలు కలిగిన రెండు దేశాలు కలిసి పనిచేస్తే, ప్రాంతీయ సుస్థిరత సాధ్యమవుతుందని భారత్ ఆశిస్తోంది.ఇది కూడా చదవండి: కమల్ హాసన్కు ‘టార్చ్ లైట్’.. ‘ఎంఎన్ఎం’లో ఉత్సాహం ఉరకలు -
ద్వైపాక్షిక బంధం... గ్లోబల్ స్థాయికి!
ముంబై: భారత్, ఫ్రాన్స్ సంబంధాల్లో నూతన శకానికి తెర లేచింది. అంతర్జాతీయంగా తీవ్ర అస్థిర పరిస్థితుల నేపథ్యంలో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. వాటిని ‘ప్రత్యేక ప్రపంచ స్థాయి వ్యూహత్మక భాగస్వామ్యం’గా తీర్చిదిద్దుకోవాలని నిశ్చయించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, ప్రధాని నరేంద్ర మోదీ నడుమ జరిగిన చర్చల్లో ఈ మేరకు కీలక ఒప్పందం కుదిరింది. రక్షణ, వర్తకం మొదలుకుని అరుదైన ఖనిజాల దాకా అన్ని రంగాల్లోనూ పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని నేతలు నిర్ణయించారు.ఈ దిశగా రక్షణ, అత్యంత అధునాతన టెక్నాలజీ, సంప్రదాయేతర ఇంధన వనరులు, ఆరోగ్యం తదితరాలకు సంబంధించి ఇరు దేశాల నడుమ 21 కీలక ఒప్పందాలు కుదిరాయి. భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్, ఫ్రెంచి రక్షణరంగ దిగ్గజం సఫ్రాన్ సంయుక్తంగా భారత్లో హమ్మర్ క్షిపణుల తయారీ, భారత, ఇరుదేశాల సైన్యంలో పరస్పరం అధికారుల నియామకం తదితరాలు వీటిలో ఉన్నాయి. మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచి్చన మాక్రాన్తో మంగళవారం సాయంత్రం మోదీ ముంబైలో సమావేశమయ్యారు. పలు అంశాలపై ఇరువురూ లోతుగా చర్చించారు. భారత్–ఫ్రాన్స్ ద్వైపాక్షిక బంధాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని తీర్మానించారు. అనంతరం మోదీ, మాక్రాన్ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కీలక భాగస్వామ్యం: మోదీ ప్రపంచం ప్రస్తుతం అత్యంత అస్థిర దశ గుండా సాగుతోందని మోదీ అభిప్రాయపడ్డారు.ఈ పరిస్థితుల్లో స్థిరత్వ స్థాపనలో భారత్, ఫ్రాన్స్ భాగస్వామ్యం కీలకపాత్ర పోషించగలదని విశ్వాసం వెలిబుచ్చారు. ఫ్రాన్స్ నైపుణ్యం, భారత వనరులు ఒక్కతాటిపైకి వస్తే అద్భుతాలు జరుగుతాయన్నారు. ఇరుదేశాలదీ ఎలాంటి హద్దులూ లేని ఆదర్శ భాగస్వామ్యం. ఇరు దేశాల మధ్య మొదటినుంచీ ప్రత్యేక సంబంధాలు కొనసాగుతూ వస్తున్నాయి’’అని చెప్పారు.భారత్కు అత్యంత పురాతన వ్యూహాత్మక భాగస్వాముల్లో ఫ్రాన్స్ ఒకటని ఆయన గుర్తు చేశారు. ‘‘మాక్రాన్తో తాజా భేటీ ద్వారా ఈ బంధాన్ని ఎన్నడూ లేనంతగా ముందుకు తీసుకెళ్లాం. ఇరు దేశాలు పరస్పర విశ్వాసం, ఉమ్మడి విజన్తో కలసి సాగనున్నాయి. ఇది కేవలం వ్యూహాత్మక బంధం మాత్రమే కాదు. ప్రపంచ ప్రగతికి బాటలు పరిచే కీలక బంధం’’అని ప్రకటించారు. ఉగ్రవాదం కూడా మాక్రాన్తో చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచి్చనట్టు ప్రధాని తెలిపారు. దాన్ని అన్ని రూపాల్లోనూ తుదముట్టించేందుకు ఇరు దేశాలూ కృతనిశ్చయంతో ఉన్నట్టు చెప్పారు. సంస్కరణలతోనే సమాధానం ఉక్రెయిన్, పశి్చమాసియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు ఇతర చోట్ల యుద్ధ మేఘాలు ఇంకా తొలగలేదని మోదీ గుర్తు చేశారు. ‘‘ఈ కల్లోల పరిస్థితుల నుంచి గట్టెక్కించగలిగేది ప్రజాస్వామిక విలువలే అన్నదే భారత్, ఫ్రాన్స్ వైఖరి. ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థలను సమూలంగా సంస్కరించినప్పుడే ఈ అంతర్జాతీయ సవాళ్లకు సజావైన పరిష్కారాలు లభిస్తాయి ఆ ప్రయత్నాలకు భారత్, ఫ్రాన్స్ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాయి. ఎందుకంటే రెండు దేశాలూ బహుళ ధ్రువ ప్రపంచాన్నే కోరుతున్నాయి’’అని వివరించారు.యూరోపియన్ యూనియన్తో భారత్ ఇటీవలే తన చరిత్రలోనే అతి పెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుందని మోదీ గుర్తు చేశారు. అది భారత్, ఫ్రాన్స్ సంబంధాలకు కూడా ఎంతగానో ఊపునిచ్చే పరిణామమేనని ఆయన చెప్పారు. ‘‘ఇరు దేశాల ప్రజలు, కంపెనీలు ఇకపై రెండు పన్నులు కట్టాల్సిన దురవస్థ తప్పింది. పరస్పర వర్తకం, పెట్టుబడులు తదితరాలను నూతన శిఖరాలకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలకు ఈ ఒప్పందాలు సరికొత్త రోడ్మ్యాప్గా నిలిచాయి’’అన్నారు. హెలికాప్టర్ నిర్మాణ కేంద్రం ప్రారంభం కర్నాటకలోని వెమగల్లో ఎయిర్బస్ హెచ్125 హెలికాప్టర్ల నిర్మాణ కేంద్రాన్ని ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వర్చువల్గా ప్రారంభించారు. ఇరుదేశాల మధ్య పరస్పరం నెలకొన్న లోతైన విశ్వాసానికి ఈ ప్లాంట్ ప్రారంభమే తాజా నిదర్శనమని మోదీ ఈ సందర్భంగా అన్నారు. ‘‘మౌంట్ ఎవరెస్టును మించిన ఎత్తుల్లో ఎగరగల సామర్థ్యమున్న ఏకైక హెలికాప్టర్ను ఇరుదేశాలూ కలిసి భారత్లో సంయుక్తంగా తయారు చేయనుండటం నిజంగా గర్వకారణం. వాటిని ప్రపంచమంతటికీ ఎగుమతి చేయనున్నాం’’అని ప్రకటించారు. ఈ హెలికాప్టర్ల తయారీ ప్లాంటు ఫ్రాన్స్కు చెందిన ఎయిర్బస్, భారత్కు చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ జాయింట్ వెంచర్భారత్ అత్యంత విశ్వసనీయ భాగస్వామి: మాక్రాన్ఫ్రాన్స్కు భారత్ అత్యంత విశ్వసనీయ భాగస్వామి అని మాక్రాన్ పేర్కొన్నారు. రఫేల్యుద్ధ విమానాలు మొదలుకుని జలాంతర్గాముల దాకా రక్షణ రంగంలో ఇరు దేశాల నడుమ పరస్పర సహకారం నానాటికీ పెంపొందుతోందని హర్షం వెలిబుచ్చారు. ఉగ్రవాదంపై పోరాటంలో కూడా భారత్, ఫ్రాన్స్ పరస్పరం మరింతగా సహకరించుకుంటాయని ప్రకటించారు. భారత్లో తనకు లభించిన అపూర్వ స్వాగతానికి కృతజ్ఞతలు తెలిపారు. మాక్రాన్కు భారత్లో ఇది నాలుగో అధికారిక పర్యటన.ఇన్నొవేషన్ల సారథి భారత్: మాక్రాన్ ‘‘గ్లోబల్ ఇన్నొవేషన్లో భారత్ కేవలం భాగస్వామి కాదు. సిలికాన్ వ్యాలీ మొదలుకుని టెక్నాలజీ, సంస్కృతి దాకా అన్ని రంగాల్లోనూ సారథి స్థానంలో రాణిస్తోంది’’ అంటూ మాక్రాన్ ప్రశంసించారు. ద్వైపాక్షిక చర్చల సందర్భంగా మోదీతో కలిసి ‘ఇండియా–ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నొవేషన్’ను ఆయన ఆవిష్కరించారు. ఇరుదేశాల భాగస్వామ్యాన్ని ప్రజల భాగస్వామ్యంగా తీర్చిదిద్దడమే దీని లక్ష్యమని నేతలు వివరించారు. ఇందులో భాగంగా పరిశ్రమలు, స్టార్టప్లు, చిన్న–మధ్య తరహా పరిశ్రమలు, విద్యార్థులు, రక్షణ రంగంలో పరిశోధనలు, స్వచ్ఛ ఇంధనం, అంతరిక్షం, నూతన టెక్నాలజీలు తదితర రంగాల్లో పరిశోధనలకు మరింత ఊపు లభిస్తుందని మోదీ అన్నారు. ఇన్నొవేషన్ ఇయర్లో భాగంగా ఆరోగ్యం, డిజిటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ఇండో–ఫ్రెంచ్ ఏఐ సెంటర్లను స్థాపించనున్నారు. ఫ్రాన్స్లో భారత్ త్వరలో స్వామి వివేకానంద కల్చరల్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది.మెరీన్ డ్రైవ్లో మాక్రాన్ జాగింగ్!ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మా క్రాన్ మంగళవారం ఉదయం బాంబేలోని మెరీన్ డ్రైవ్లో జాగింగ్ చేశారు. నీలిరంగు టీ షర్టు, నలుపు షార్ట్స్, రన్నింగ్ షూస్ ధరించిన ఆయన జాగింగ్ చేస్తున్న వారితో కలిసి పోటాపోటీగా పరుగు తీశారు. భద్రతా సిబ్బంది మారువేషాల్లో కాస్త వెనకగా ఆయనను అనుసరించారు. ఈ సందర్భంగా ముంబై పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మాక్రాన్ను గుర్తు పట్టిన పలువురు ఆయన్ను తమ స్మార్ట్ ఫోన్లలో బంధించారు. అవన్నీ వైరల్గా మారాయి. మాక్రాన్ విదేశీ పర్యటనల్లో కూడా జాగింగ్ కొనసాగిస్తుంటారు.బాలీవుడ్ తారలతో మాక్రాన్ దంపతుల భేటీఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత పర్యటనలో తారల తళుకులు చోటుచేసుకున్నాయి. పలువురు బాలీవుడ్ తారలతో మాక్రాన్, బ్రిగెటీ దంపతులు మంగళవారం భేటీ అయ్యారు. సినీ పరిశ్రమపరంగా భారత్, ఫ్రాన్స్ సంబంధాల బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలు తదితరాలపై వారితో రెండు గంటలకు పైగా చర్చించారు. తాజ్మహల్ ప్యాలెస్ హోటల్లో జరిగిన ఈ సమావేశంలో జోయా అక్తర్, షబానా అజ్మీ, మనోజ్ బాజ్పాయ్, అనిల్ కపూర్, కబీర్ ఖాన్, రిచా ఛద్దా తదితరులు పాల్గొన్నారు. 2008లో ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న స్లమ్డాగ్ మిలియనీర్ చిత్రమంటే తనకెంతో ఇష్టమని బ్రిగెటీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. -
AI Summit 2026: ప్రపంచానికి దిక్సూచిగా భారత్
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఏఐ సదస్సు రెండో రోజు(మంగళవారం) అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనేది కేవలం సాంకేతికత మాత్రమే కాదని, అది సామాన్యుడి సంక్షేమానికి ఉపయోగపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.అందుబాటులోకి ఏఐ కళ్లద్దాలుఈ సందర్భంగా భారత్ సొంతంగా అభివృద్ధి చేసిన ‘సర్వం కాజే’ (Sarvam Kaze) అనే ఏఐ వేరబుల్ పరికరాన్ని ధరించి ఆయన స్వయంగా పరీక్షించారు. ఇది చూడడానికి సాధారణ కళ్లద్దాల మాదిరిగా ఉన్నప్పటికీ, అత్యాధునిక ఏఐ సాంకేతికతను కలిగి ఉంది. రాబోయే మే నెల నుంచి ఈ స్వదేశీ పరికరాలు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయని సదస్సులో ప్రతినిధులు వెల్లడించారు.#WATCH | Delhi | Union Minister Rajiv Ranjan, Bihar Deputy CM Samrat Choudhary, JD(U) MP Sanjay Kumar Jha and Bihar Minister Dilip Jaiswal visit the Bihar pavilion at #IndiaAIImpactSummit2026 pic.twitter.com/XX8lBiQmyO— ANI (@ANI) February 17, 2026విద్యా రంగంలో సరికొత్త విప్లవంభారతదేశాన్ని గ్లోబల్ ఏఐ హబ్గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. రాబోయే కాలంలో డేటా సెంటర్ల రంగంలో సుమారు 200 బిలియన్ డాలర్ల(రూ.18.15 లక్షల కోట్లు) పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ కార్యక్రమంలో వెల్లడించారు. మరోవైపు, విద్యా రంగంలో ఏఐ పాత్రపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగిస్తూ, రాబోయే తరానికి ఏఐ ఆధారిత విద్యను అందించడం తమ ప్రధాన ప్రాధాన్యత అని పేర్కొన్నారు.#WATCH | Delhi: India AI Impact Summit 2026 | Dr Ramanand, Founder-Director, Centre of Policy Research and Governance (CPRG) says, "The AI Summit is being held in India. The first Summit was held in France. After Europe, it is being held in India, and India is being looked at… pic.twitter.com/2IGiJgtryp— ANI (@ANI) February 17, 2026చాట్ జీపీటీతో భారత్కు అత్యధిక ప్రయోజనంజోహో (ZOHO) వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబూ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఏఐ ఒక అద్భుతమైన ‘లెర్నింగ్ బూస్టర్’లా పనిచేస్తుందని, ముఖ్యంగా ఉపాధ్యాయులకు ఇది గొప్ప సాధనంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఏఐ అభివృద్ధిలో సమానత్వం ఉండాలని, లేకపోతే ప్రపంచ సమాజంలో తీవ్ర అసమానతలు తలెత్తే ప్రమాదం ఉందని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ హెచ్చరించారు. చాట్ జీపీటీ (ChatGPT) వంటి సంస్థలకు అమెరికా కంటే భారత్ 33 శాతం ఎక్కువ డేటాను అందిస్తోందని ఆయన గుర్తు చేశారు. ఏఐతో మరిన్ని ఉపాధి అవకాశాలుగ్లోబల్ సౌత్ దేశాలు కేవలం డేటాను అందించే వనరులుగా మాత్రమే మిగిలిపోకూడదని, ఈ సాంకేతికత వల్ల కలిగే లాభాల్లో వీరికి సమాన వాటా దక్కాలని ప్యానెల్ చర్చల్లో అభిప్రాయపడ్డారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనలను ఆయన తోసిపుచ్చుతూ, ఈ సాంకేతికత కొత్త తరహాలో మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని అమితాబ్ కాంత్ అన్నారు. India AI Impact Expo 2026 was a powerful convergence of ideas, innovation and intent.It showcased the extraordinary potential of Indian talent in shaping the future of Artificial Intelligence for global good.Above all, it reaffirmed our commitment to harnessing AI… pic.twitter.com/jfVWCP4BHh— Narendra Modi (@narendramodi) February 17, 2026చిన్నారుల భద్రతపై కీలక చర్చలుఈ మెగా సమిట్కు ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. బిల్ గేట్స్ ఈ సదస్సులో పాల్గొంటారని గేట్స్ ఫౌండేషన్ స్పష్టం చేయగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా హాజరుకానున్నారు. సుమారు 20 దేశాల అధినేతలు, 60 మందికి పైగా మంత్రులు ఈ చర్చల్లో భాగస్వాములవుతున్నారు. సదస్సులో భాగంగా చిన్నారుల భద్రతపై కీలక చర్చలు జరిగాయి. వారి భద్రత కోసం ప్రత్యేక చట్టాలు అవసరమని నిపుణులు సూచించారు. ఆరోగ్య రంగంలో ఏఐ విప్లవాత్మక మార్పులు తెస్తుందని, అయితే డిజిటల్ వ్యసనంపై అప్రమత్తంగా ఉండాలని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ హెచ్చరించారు.ఇది కూడా చదవండి: అందరికీ ఏఐ ఫలాలు: ప్రధాని మోదీ -
అందరికీ ఏఐ ఫలాలు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ నేటికి(మంగళవారం) రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ‘కృత్రిమ మేధ (ఏఐ)ప్రయోజనాలు ప్రతి పౌరుడికీ అందాలన్నదే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని అన్నారు. తెలివితేటలు, హేతుబద్ధత, నిర్ణయాత్మక సామర్థ్యం మొదలైనవాటిని ఏఐ సామాన్యులకు చేరువయ్యేలా చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ‘గ్లోబల్ సౌత్’లో జరుగుతున్న మొట్టమొదటి అంతర్జాతీయ స్థాయి ఏఐ సదస్సుగా ఇది చరిత్ర సృష్టిస్తోందని ప్రధాని పేర్కొన్నారు.ఈ ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొనేందుకు 20కి పైగా దేశాల అధినేతలు, 60 మంది మంత్రులు, 500 మందికి పైగా ఏఐ నిపుణులు ఢిల్లీకి చేరుకున్నారు. ఎస్టోనియా అధ్యక్షుడు అలార్ కారిస్ ఇప్పటికే ఢిల్లీ చేరుకోగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దంపతులు కూడా ఈ సదస్సులో భాగస్వామ్యం కానున్నారు. అమెరికా-భారత్ వాణిజ్య మండలి (యూఎస్ఐబీసీ) ఒక ప్రకటనలో ఈ సదస్సు ఇరు దేశాల ఆర్థిక బంధాలను బలోపేతం చేసే కీలక వేదికగా అభివర్ణించింది. बुद्धिमत्ता, तर्कशीलता और निर्णय-क्षमता विज्ञान और टेक्नोलॉजी को जन-जन के लिए उपयोगी बनाती हैं। India AI Impact Summit का उद्देश्य भी यही है कि कैसे एआई का इस्तेमाल सर्वजन के हित में हो।शुश्रूषा श्रवणं चैव ग्रहणं धारणां तथा।ऊहापोहोऽर्थविज्ञानं तत्त्वज्ञानं च धीगुणाः॥ pic.twitter.com/qytLZxv1uh— Narendra Modi (@narendramodi) February 17, 2026సదస్సు రెండో రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చోటు చేసుకునే కలిగే సామాజిక మార్పులపై చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలపై ఏఐ ప్రభావం, ప్రజారోగ్యం, పిల్లల భద్రత తదితర అంశాలపై ఐక్యరాజ్యసమితి ప్రతినిధి అమన్దీప్ సింగ్ గిల్, నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ వంటి ప్రముఖులు ప్రసంగించనున్నారు. అలాగే, విద్యా రంగంలో ఏఐ వినియోగంపై కేంద్ర విద్యాశాఖ ప్రత్యేక రోడ్ మ్యాప్ను సిద్ధం చేస్తోంది. సదస్సుతో పాటు నిర్వహిస్తున్న భారీ ప్రదర్శనలో 600కు పైగా స్టార్టప్లు తమ సాంకేతికతను ప్రదర్శిస్తున్నాయి. ఈ ప్రదర్శనను సందర్శించేందుకు సుమారు 2.5 లక్షల మంది సందర్శకులు వస్తారనే అంచనాలున్నాయి.ఇది కూడా చదవండి: ‘తప్పులేదు.. దాచలేదు..’ అదే పాటలో ట్రంప్ -
‘వచ్చే వారం ఇక్కడికి ఎవరొస్తున్నారో తెలుసా?’
జెరూసలేం: ప్రధాని మోదీ ఫిబ్రవరి 25 నుంచి రెండ్రోజులపాటు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. ఆదివారం అమెరికన్ యూదు సంస్థల అధ్యక్షులతో భేటీ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రధాని మోదీ పర్యటన వివరాలను తొలిసారిగా మీడియాకు బహిర్గతం చేశారు. ‘‘మన నెసెట్(పార్లమెంట్)నుద్దేశించి ఒక ముఖ్యనేత ప్రసంగించబోతున్నారు. వచ్చే వారం ఇక్కడికి ఎవరొస్తున్నారో తెలుసా? నరేంద్ర మోదీ’’అంటూ మోదీ పర్యటనను నెతన్యాహూ ప్రకటించారు.‘‘భారత్తో మన బంధం గొప్పది. అన్ని రంగాల్లో సహకారంపై విస్తృతస్థాయిలో మోదీతో చర్చించబోతున్నా. మీరిప్పుడొకటి తెల్సుకోవాలి. భారత్ ఏరకంగానూ చిన్న దేశం కాదు. వాళ్ల జనాభా ఏకంగా 140 కోట్లు. భారత్ ఇప్పుడు శక్తివంతమైన, పరపతి గల దేశంగా ఎదుగుతోంది’’అని అన్నారు. 2017 జూలైలో మోదీ ఇజ్రాయెల్లో పర్యటించి యూదు దేశంలో అడుగుపెట్టిన తొలి భారతీయ ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత ఇజ్రాయెల్లో మోదీ పర్యటించబోతున్నారు. -
ఘనంగా ప్రారంభమైన ఇండియా ఏఐ ఎక్స్పో!
న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూసిన ప్రపంచ స్థాయి కృత్రిమ మేధ సదస్సు ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో’ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఢిల్లీలోని భారత మండపంలో సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ సదస్సును లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పలు కంపెనీలు, స్టార్టప్లు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన కలియదిరిగారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తదితరులతో మాటలు కలిపారు. వారి పరిశోధనలు తదితరాలను గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఫిబ్రవరి 20వ తేదీ దాకా జరిగే ఈ ఐదు రోజుల సదస్సులో 600కు పైగా భారీ స్థాయి స్టార్టప్లు పాలుపంచుకోనున్నాయి. వాటితో పాటు 13 దేశాలకు చెందిన ఏఐ పెవీలియన్లు తమ ప్రత్యేకతను చాటేందుకు సిద్ధమయ్యాయి. గ్లోబల్ సౌత్లో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సులో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వాతో పాటు 20 మందికి పైగా దేశాధినేతలు, 60కి పైగా దేశాల నుంచి మంత్రులు పాల్గొంటున్నారు. అంతేగాక గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో పాటు పలు ఏఐ దిగ్గజ కంపెనీలకు చెందిన 40 మందికి పైగా సీఈఓలు కూడా హాజరై ఈ రంగంలో విస్తరణకు అమలు చేయదలచిన ప్రణాళికలు తదితరాలను ఆహూతులతో పంచుకోనున్నారు. 19వ తేదీన సదస్సును ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. అదే తేదీన మాక్రాన్ కూడా సదస్సులో పాల్గొంటున్నారు. భారత్కే గాక ప్రపంచమంతటికీ పలు రంగాలకు సంబంధించిన కీలక సవాళ్లకు ఈ సదస్సు సమర్థమైన పరిష్కారాలు చూపగలదని ప్రధాని విశ్వాసం వెలిబుచ్చారు. ఇన్నొవేటర్లు, పరిశోధకులు, టెక్ ఔత్సాహికుల నడుమ గడపడం ఎనలేని ఆనందాన్ని ఇచి్చనట్టు ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ‘‘ఇండియా ఏఐ ఎక్స్పోను ప్రారంభించా. ఇంతటి కీలకమైన సదస్సుకు భారత్ ఆతిథ్యమిస్తుండటం హర్షణీయం’’అన్నారు. ‘గ్లోబల్ ఏఐ గవర్నెన్స్’కు ఈ సదస్సు స్పష్టమైన రోడ్మ్యాప్ను అందజేస్తుందని ఆయన విశ్వాసం వెలిబుచ్చారు. అంతకుముందు వేదిక వద్ద జియో ఏఐ ఎకో సిస్టమ్స్ స్టాల్ను ప్రధాని ఆసక్తిగా పరిశీలించారు. తొలి రోజు విస్తృత చర్చలు ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పోకు కేంద్రం భారీస్థాయిలో ఏర్పాట్లు చేసింది. భారత్ మండపంలో 10 వేదికల్లో 70 వేల చదరపు మీటర్లకు పైగా విస్తరించిన ప్రాంతంలో స్టాళ్లు, స్టార్టప్లు, ఏఐ వేదికలు కనువిందు చేస్తున్నాయి. సోమవారం ఉదయానికే భారీ సంఖ్యలో తరలివచి్చన పలు ప్రఖ్యాత ఏఐ సంస్థల సీఈఓలు, పారిశ్రామికవేత్తలు, విధాన నిర్ణేతలు తదితరులతో వేదికతో పాటు పరిసరాల్లోని హాల్లన్నీ నిండిపోయాయి. వారంతా బృందాలుగా ఏర్పడి పలు రంగాల్లో ఏఐ ప్రభావం, దాని మంచిచెడులను గురించి చర్చోపచర్చల్లో మునిగితేలారు. మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు ప్రపంచ స్థాయి దిగ్గజ ఏఐ సంస్థలు, స్టార్టప్లు, విద్యా సంస్థలు, పరిశోధన సంస్థలు, పలు దేశాలకు చెందిన ప్రఖ్యాత ప్రభుత్వ రంగ సంస్థలు ఒకే వేదికపైకి వచ్చి పరస్పరం అనుభవాలు, అభిప్రాయాలను పంచుకోనున్నాయి. ఏఐ దెబ్బకు పలు రంగాల్లో భారీగా కొనసాగుతున్న కొలువుల కోత మొదలుకుని బాలల భద్రత దాకా భిన్నమైన అంశాలు, సమస్యలపై చర్చలు, పరిష్కార మార్గాల అన్వేషణకు సదస్సు వేదిక కానుంది. 13కు పైగా దేశాలు ఇప్పటికే మండపంలో ప్రత్యేక పెవీలియన్లు ఏర్పాటు చేశాయి. ఆ్రస్టేలియా, జపాన్, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, సెర్బియా, ఎస్టోనియా, తజకిస్తాన్ వంటివి వీటిలో ఉన్నాయి. 300కు పైగా క్యూరేటెడ్ ఎగ్జిబిషన్ పెవీలియన్లు ఆకట్టుకోనున్నాయి. ‘పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్’ థీమ్తో కూడిన లైవ్ డెమాన్్రస్టేషన్లు కంపెనీల ఏఐ ప్రణాళికలను కళ్లకు కట్టనున్నాయి. రెండున్నర లక్షల మందికి పైగా ఏఐ సదస్సును సందర్శిస్తారని భావిస్తున్నారు. -
నేడు ముంబైలో మోదీ, మేక్రాన్ భేటీ
న్యూఢిల్లీ: నేడు భారత పర్యటనకు విచ్చేస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ వెనువెంటనే భారత ప్రధాని మోదీతో భేటీకానున్నారు. ముంబై ఇందుకు వేదికకానుంది. భారత్–ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతితో పాటు ఇరుదేశాల ద్వైపాక్షిక బంధంపై అగ్రనేతలు సమీక్ష జరపనున్నారు. వ్యూహాత్మక బంధం బలోపేతం చేయడంతోపాటు నూతన, కొత్తగా ఉద్భవిస్తున్న రంగాల్లోనూ సహకారాన్ని విస్తృత పర్చుకోవడంపై ఇరునేతలు ప్రధానంగా దృష్టిసారించనున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యాంశాల పైనా నేతలు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ప్రధాని మోదీ ఫిబ్రవరి 17వ తేదీన ఢిల్లీ నుంచి ముంబైకి చేరుకున్నాక మేక్రాన్తో చర్చిస్తారని కేంద్రం ఒక అధికారిక ప్రకటన వెలువర్చింది. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొనాలంటూ ప్రధాని మోదీ ఆహా్వనించడంతో మేక్రాన్ భారత్లో పర్యటిస్తున్నారని ఆ ప్రకటన పేర్కొంది. మేక్రాన్ ఢిల్లీకి రావడం ఇది నాలుగోసారి కాగా ముంబైలో పర్యటించడం ఇదే తొలిసారి. మంగళవారం ముంబైలోని లోక్భవన్లో మోదీ, మేక్రాన్ చర్చలు మధ్యాహ్నం 3.15 గంటలకు మొదలుకానున్నాయి. సాయంత్రం 5.15 గంటలకు ఇండియా–ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ 2026ను ఆవిష్కరిస్తారు. తర్వాత ఇరుదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలు, పరిశోధకులు, ఇతర ఆవిష్కర్తలనుద్దేశించి మోదీ, మేక్రాన్ ప్రసంగిస్తారు. -
జియో ఏఐ పెవిలియన్ సందర్శించిన మోదీ
ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026) అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ జియో ఇంటెలిజెన్స్ పెవిలియన్ను సందర్శించారు. ఇక్కడ జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్యం ఏఐ, జియో శిక్షా, జియో ఏఐ హోమ్ వంటి వివిధ ఏఐ మోడల్స్ వీక్షించారు.జియో ఏఐ మోడల్స్ అన్నీ కూడా ఎంటర్ప్రైజ్ ఇంటెలిజెన్స్ను నడిపించడానికి, భారతీయ భాషలు & సాంస్కృతిక కంటెంట్ను ప్రోత్సహించడానికి, ఆరోగ్య సంరక్షణ డెలివరీని మెరుగుపరచడానికి, విద్యా వ్యవస్థలను బలోపేతం చేయడానికి & ఏఐ బేస్డ్ స్మార్ట్ లివింగ్ను ప్రారంభించడానికి ప్రత్యేకంగా రూపొందించారు.ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026) అట్టహాసంగా ప్రారంభమైంది.ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ జియో ఇంటెలిజెన్స్ పెవిలియన్ను సందర్శించారు.ఇక్కడ జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్యం ఏఐ, జియో శిక్షా, జియో ఏఐ హోమ్ వంటి వివిధ ఏఐ… pic.twitter.com/oDzwTW4SUg— Sakshi (@SakshiNews) February 16, 2026ఏఐ ఎకోసిస్టమ్ & వివిధ రంగాల్లో డిజిటల్ మార్పును వేగవంతం చేయడంలో ఏఐ పాత్ర గురించి జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ.. ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు. సంస్థ 'ఏఐ ఫర్ ఆల్' (అందరికి ఏఐ) అనే దృక్పథాన్ని ప్రతిపాదిస్తూ, ఆధునిక సాంకేతికతలను అందరికీ చేరువయ్యేలా చూస్తోందని అన్నారు. -
ఇజ్రాయెల్కు మోదీ.. షెడ్యూల్ ఫిక్స్..!
భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండురోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్ వెళ్లనున్నారు. ఆయన పర్యటన వివరాలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ స్వయంగా వెల్లడించారు. ప్రధాని మోదీ పర్యటనతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు.ఇజ్రాయెల్ ప్రధాని ఆ దేశ పార్లమెంటులో ప్రసంగిస్తూ.. "భారత ప్రధాని వచ్చేవారం ఇజ్రాయెల్ పర్యటనకు రానున్నారు. రెండు దేశాల మధ్య ప్రస్తుతం అద్భుతమైన సంబంధాలున్నాయి. ఇప్పుడు మరిన్ని అంశాలపై చర్చించబోతున్నాం. మనందరికి తెలుసు ఇండియా చిన్న దేశం కాదు. 140 కోట్ల జనాభా ఉన్న దేశం. చాలా శక్తివంతమైనది. చాలా పాపులరైంది" అని అన్నారు.ఇజ్రాయెల్-గాజా యుద్ధంలో రెండు దేశాల సిద్ధాంతం ప్రతిపాదిస్తూనే టెల్ అవీవ్తో సత్సంబంధాలు కొనసాగిస్తుందని తెలిపారు. అయితే దీనిపై ప్రధాని మోదీ స్పందించారు.. "నా మిత్రుడు ప్రధాని నెతన్యూహుతో ఇదివరకే ఫోన్లో సంభాషించాను. ఇజ్రాయెల్-ఇండియా వ్యూహాత్మక సంబంధాలపై చర్చించాము. రెండుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం దిశగా చర్చలు జరుపుతున్నాము. అదేవిధంగా టెర్రరిజాన్ని మాత్రం ఎట్టిపరిస్థితిలో సహించేది లేదు. ఆ ప్రాంతంలో శాంతి, సుస్థిరత సాధించేందుకు భారత్ తన పూర్తి సహాకారాన్ని అందిస్తుంది." అని మోదీ అన్నారు. భారత ప్రధాని ఫిబ్రవరి 25న ఇజ్రాయెల్ వెళ్లనున్నారు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని భారత్లో పర్యటించాల్సి ఉండగా పలు కారణాలతో ఆయన పర్యటన రద్దైంది. -
వాహనదారులకు గుడ్ న్యూస్ ఒక్క ఫొటో.. ఫ్రీగా 1000 ఫాస్టాగ్ రీఛార్జ్
-
శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ముందడుగు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత్ ఆతిథ్యమిస్తున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ దేశ యువతలోని ప్రతిభను, నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో ప్రపంచ దేశాలన్నీ భాగస్వాములు కావాలంటూ సోమవారం ఆయన పిలుపునిచ్చారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ ఎంత వేగంగా పురోగమిస్తోందో చెప్పడానికి ఈ సదస్సే నిదర్శనమని, ఈ రంగంలో దేశం సాధిస్తున్న వృద్ధిని ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు భారత్కు రావడం మనందరికీ గర్వకారణం. ఇది మన దేశ యువత శక్తిసామర్థ్యాలను ప్రతిబింబిస్తోంది’ అని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ అగ్రగామిగా ఎదుగుతూ, ప్రపంచ అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తోందనడానికి ఈ సందర్భమే ఒక గొప్ప నిదర్శనమని ఆయన కొనియాడారు. यह हमारे लिए अत्यंत गर्व की बात है कि India AI Impact Summit के लिए दुनियाभर से लोग भारत आ रहे हैं। इससे हमारे देश के युवाओं के सामर्थ्य का भी पता चलता है। यह अवसर इस बात का भी प्रमाण है कि हमारा देश विज्ञान और टेक्नोलॉजी के क्षेत्र में तेजी से प्रगति कर रहा है और वैश्विक विकास… pic.twitter.com/7gxXJEtpOz— Narendra Modi (@narendramodi) February 16, 2026న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఫిబ్రవరి 16 నుండి 19 వరకు ఈ సదస్సు జరగనుంది. ప్రధాని మోదీ దీనిని ప్రారంభించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో సుమారు 600 స్టార్టప్లు, వివిధ సంస్థలు పాల్గొంటున్నాయి. ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాంwestడ్, సెర్బియా, ఎస్టోనియా, తజికిస్తాన్, ఆఫ్రికా తదితర 13 దేశాలు ఈ ప్రదర్శనలో తమ ప్రత్యేక పెవిలియన్లను ఏర్పాటు చేయడం విశేషం.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ప్రపంచ దేశాల నేతలు తమ అభిప్రాయాలను పంచుకునేందుకు ఇది ఒక వేదికగా నిలవనుంది. సుమారు 300 పైగా ఎగ్జిబిషన్ పెవిలియన్లు, 500 పైగా సెషన్లు నిర్వహించనుండగా, దాదాపు 2.5 లక్షల మంది సందర్శకులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా, యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తదితర ప్రపంచ నేతలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.ఇది కూడా చదవండి: ‘SIR’ విధుల్లో అక్రమాలు.. ఏడుగురిపై ఈసీ వేటు! -
అమెరికాతో ఒప్పందం మాటున ద్రోహం
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందం పేరుతో రైతులకు మోదీ సర్కారు తీవ్ర ద్రోహం తలపెడుతోందని ఆదివారం ఆరోపించారు. ఈ విషయమై ప్రధాని మోదీకి ఆయన పలు ప్రశ్నలు సంధించారు. ‘‘ఇంపోర్ట్ డ్రైడ్ డిస్టిలర్స్ గ్రెయిన్ (డీడీజీ) అంటే ఏమిటి? అమెరికాలో మద్యం తయారీ తర్వాత మిగిలే జన్యుపరివర్తిత (జీఎం) మొక్కజొన్న వ్యర్థాలను మన పశువులకు దాణాగా వేస్తారని దాని అర్థమా? అదే జరిగితే మన పాల ఉత్పత్తులు పూర్తిగా అమెరికా వ్యవసాయ రంగంపై ఆధారపడవా? జీఎం సోయా నూనె దిగుమతులకు అనుమతిస్తే ఆ ప్రభావం మన సోయా రైతులపై పడదా? సోయా ఉత్పత్తుల ధరలు మరింతగా తగ్గితే వారు తట్టుకోగలరా? ఒప్పందంలో అదనపు ఉత్పత్తులనే ప్రస్తావన ఉంది. మున్ముందు పప్పు ధాన్యాలు, ఇతర పంటలను కూడా దిగుమతి చేసుకోవాలని అమెరికా మనపై ఒత్తిడి పెంచుతుందని దీనర్థమా? వాణిజ్య అవరోధాలను తొలగించడమంటే ఏమిటి? జీఎం పంటలు, పంటల సేకరణను తగ్గించడం, కనీస మద్దతు ధర, బోనస్లు వంటివాటిని తగ్గించడమా? అమెరికా వ్యవసాయోత్పత్తులకు ఒక్కసారిగా తలుపులు తెరిస్తే, ఏటికేడు మరింతగా ఒత్తిడులు పెరుగుతాయి. వాటిని అడ్డుకుంటామా, లేక లొంగిపోతామా? మన సాగు రంగంపై విదేశీ పెత్తనానికి అనుమతిస్తున్నామా?’’ అని రాహుల్ ప్రశ్నించారు. -
నేటి నుంచే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు
న్యూఢిల్లీ: విద్యుత్ ఆవిష్కరణ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యవస్థల్లోనూ సమూల మార్పులకు కారణమవుతున్న కృత్రిమ మేధ సాంకేతికతపై కూలంకషమైన చర్చకు దేశ రాజధానిలోని భారత్ మండపం సిద్ధమైంది. సోమవారం నుంచి 20వ తేదీ దాకా ప్రతిష్టాత్మక ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు జరగనుంది. ఇందుకోసం భారీ స్థాయిలో ఏర్పాట్లుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సాయంత్రం ఐదింటికి సదస్సు ప్రారంభమవుతుంది. ఇందులో పాల్గొనేందుకు 45 దేశాలకు చెందిన మంత్రుల బృందాలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సహా పలు అంతర్జాతీయ సంస్థల అధ్యక్షులు సైతం సదస్సులో కీలక ప్రసంగాలు చేయనున్నారు. ఐదు రోజుల్లో 700కుపైగా సెషన్స్ నిర్వహించనున్నారు. 20 దేశాల అధినేతలు సదస్సుకు హాజరవుతారని భావిస్తున్నారు. మోదీ ఆహా్వనం మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసిల్వా తదితరులు రానున్నారు. సురక్షిత కృత్రిమ మేధ, ఏఐ నిర్వహణ, నైతిక విలువలతో కూడిన ఏఐ, డేటా భద్రత, ఏఐలో భారత్ స్వయంసమృద్ధి, దేశీయంగా వ్యూహాత్మక రంగాలకు కొత్త ఏఐ మోడళ్ల తయారీ వంటి అంశాలపై నిపుణులు, విధాన కర్తలు చర్చించనున్నారు. కీలక సంస్థ సీఈఓల ప్రసంగాలు దక్షిణార్థ గోళంలో జరుగుతున్న తొలి ఏఐ సదస్సు కావడంతో దీనిపై అందరి దృష్టీ నెలకొంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఓపెన్ఏఐ సీఈఓ శ్యామ్ ఆల్ట్మన్, డీప్మైండ్ టెక్నాలజీస్ సీఈఓ డెమిస్ హస్సాబీస్, ఆంత్రోపిక్ సీఈఓ డేరియో ఆమోడెయి, మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ వంటి దిగ్గజాలు సైతం సదస్సులో ప్రసంగించనున్నారు. సదస్సుతోపాటు ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో–2026ను కూడా నిర్వహిస్తున్నారు. ఎక్స్పోను సందర్శించాక ప్రధాని మోదీ దిగ్గజ సంస్థల సీఈఓలతో భేటీ అయ్యే అవకాశముంది.భారత్లోని ఏఐ అంకుర సంస్థలు తమ నూతన ఆవిష్కరణలను సదస్సు వేదికగా ప్రకటించే ఆస్కారముంది. ప్రజారోగ్యం, వ్యవసాయం, ఆర్థిక, విద్య, కార్పొరేట్ రంగాల్లో రాబోతున్న మార్పులకు ఏఐ ఏవిధంగా ఇతోధికంగా దోహదపడుతుందో వక్తలు వివరించనున్నారు. 2025లో ఫ్రాన్స్లోని పారిస్లో, 2024లో దక్షిణకొరియాలోని సియోల్లో, 2023లో బ్రిటన్లోని బ్లెచ్లీ పార్క్లో ఏఐ సదస్సులు జరిగాయి. ప్రపంచంలోనే అతి పెద్ద డిజటల్ ప్రజా మౌలిక సదుపాయాల వ్యవస్థల్లో భారత్ ఒకటి కావడంతో ఈసారి ఢిల్లీలో నిర్వహిస్తున్నారు. ‘‘ఈ రంగంలో ఎంతటి మార్పులొచ్చినా మానవీయ, సమ్మిళిత కోణంలోనే అవి జరగాలనే సందేశం విని్పస్తున్నాం. ఏఐ వనరులు ప్రజాస్వామ్యయుతంగా అందరికీ అందుబాటులో ఉండాలి’’ కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ చెప్పారు. ఏఐ రంగంలో భారత్ తన సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు ఇక్కడి యువతలో ఏఐ పట్ల మక్కువ పెంచే ఉద్దేశంతో ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా మోదీ సర్కార్ ఈ సదస్సును నిర్వహిస్తోంది. పలు దేశాల ప్రభుత్వాలు, అంతర్జాతీయ ఏఐ రంగ సంస్థలు, పరిశోధకులు, స్టార్టప్లు, విద్యార్థులు, పౌరులు ఇందులో పాల్గొననున్నారు. ‘‘ప్రపంచంలోనే అత్యధిక యువకారి్మకశక్తి భారత్లోనే ఉంది. ఇక్కడ జనాభాలో 65 శాతం మంది వయసు 35 ఏళ్లలోపే. ఈ యువతరంలో ఏఐపై అనురక్తిని పెంచి ఏఐ బాటలు పయనించేలా చేస్తే ఈ రంగంలో భారత్ ఎన్నెన్నో అద్భుతాలు చేయగలదని, ఇక్కడ ఏఐ ఆధారిత పరిశ్రమలు పెరిగి, ఆవిష్కరణలు ఎక్కువై, డిజిటల్ సేవలు విస్తరించి, ఉపాధి అవకాశాలు భారీ స్థాయిలో పెరుగుతాయి’’ అని ఏఐరంగ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సదస్సులో ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్, మైక్రోసాఫ్ట్, గూగుల్ తమ కొత్త ఏఐ ఉత్పత్తులపై సదస్సు వేదికగా ప్రకటనలు చేయొచ్చని చెబుతున్నారు.భారతీయ ఏఐపైనే దృష్టి ఏఐ సదస్సులో ప్రధానంగా భారతీయ ఏఐపైనే అందరి దృష్టీ నెలకొననుంది. ఫౌండేషన్ మోడల్ పిల్లర్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీతో ఇప్పటికే 12 భారతీయ అంకురసంస్థలు భేటీ అయ్యాయి. ఇండియన్ లాంగ్వేజ్ ఫౌండేషన్ మోడల్, మల్టీ లింగ్వల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం), స్పీచ్–టు–టెక్ట్స్, టెక్ట్స్,్ట–టు–ఆడియో, టెక్ట్స్,–టు–వీడియో, ఇ–కామర్స్ కోసం జనరేటివ్ ఏఐతో త్రిమితీయ సమాచారం, మార్కెటింగ్, వ్యక్తిగత సమాచార సృష్టి, ఇంజనీరింగ్ సిములేషన్, మెటీరియల్ రీసెర్చ్, అధునాతన అనలైటిక్స్, ఆరోగ్యరంగంలో వ్యాధుల నిర్ధారణ, వైద్య పరిశోధన ఇలా పలు రంగాల్లో అంకుర సంస్థలు తమ కొత్త పరిశోధనలను ఇంపాక్ట్ ఎక్స్పో2026లో ప్రదర్శించే ఆస్కారముంది. 70,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఎక్స్పోలో 600కుపైగా కీలక స్టార్టప్లు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. ఆ్రస్టేలియా, జపాన్, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, సెర్బియా, ఇస్తోనియా, తజకిస్తాన్, ఆఫ్రికా పెవీలియన్లు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. డేటా కేంద్రంగా మార్చండి‘‘ఇన్నాళ్లూ అప్లికేషన్లు, ప్లాట్ఫా మ్లు, డివైజ్ల రంగంలో అభివృద్ధి పైనే దృష్టిపెట్టాం. అంతకంటే ముఖ్యంగా మరో ప్రాథమిక రంగంలోనూ ఆధిపత్యం కనబర్చాల్సి ఉంది. అదే డేటా సెంటర్ల ఏర్పాటు. ఇకనైనా డిజిటల్ మౌలికవసతులు, కృత్రిమ మేధారంగంలో భారత్ను గ్లోబల్ హబ్గా మార్చుకుందాం. ఈ మేరకు ప్రపంచ సమాచార స్టోరేజీకి భారత్ను కేంద్రంగా మార్చండి. దీంతో సాంకేతిక విప్లవంతో మరో సంస్కరణల తరంగాలను సృష్టించండి. ఈ రంగంలో పెట్టుబడులను పెంచేందుకే తాజా బడ్జెట్లో పన్ను రాయితీలను ప్రకటించాం. సదుపాయాల కల్పన ఖర్చులను తగ్గించాం. తద్వారా డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారత్ను అంతర్జాతీయ ప్రధాన పోటీదారుగా మార్చండి’’ అని మోదీ అన్నారు.సరైన వేదిక భారత్: గుటెరస్ ‘‘అభివృద్ధిచెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారత్ విజయపథంలో దూసుకుపోతోంది. ఇలాంటి భారత్ ఈ సదస్సుకు సరైన వేదిక. సూపర్పవర్ లాంటి రెండు శక్తివంతమైన దేశాలు లేదా అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే ఏఐ ఫలాలు దక్కొద్దు. యావత్ ప్రపంచదేశాలూ ఏఐ ప్రయోజనాలను పొందాలి. ఈ సదస్సును నిర్వహిస్తున్న భారత్కు అభినందనలు. ఏఐ స్వతహాగా వృద్ధిచెందితే అది అందరి ఉపయోగకరమే’’ అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. -
తదుపరి దశాబ్దిలోకి... త్రికరణ శుద్ధితో!
న్యూఢిల్లీ: పదేళ్లకు పైగా తమ ప్రభుత్వం తలపెట్టిన పలు సంస్కరణలతో సామాన్య పౌరులకు భారీ స్థాయిలో లబ్ధి చేకూరుతోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆదివారం పీటీఐ వార్తాసంస్థకు ఇచి్చన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ‘‘నిర్మాణాత్మక సంస్కరణలు, మరింత విస్తృత ఆవిష్కరణలు, మరింత సులభతర పాలన. వచ్చే దశాబ్దంలో ఈ మూడు కీలక సంస్కరణలకు కట్టుబడతా. సంస్కరణల్లో పోటీతత్వాన్ని, ఉత్పాదకతను పెంచాలి. తర్వాత సాంకేతికత, తయారీ, సేవల రంగంల వినూత్న ఆవిష్కరణలను సుసాధ్యం చేయాలి. పౌరులు, ప్రభుత్వాలు, పరిశ్రమల మధ్య మరింత సమన్వయం సాధించాలి. అప్పుడే పరిపాలన అత్యంత సులభతరం అవుతుంది. ప్రజల విశ్వాసమూ బలపడుతుంది. ఇప్పటికే మేం తెచి్చన సంస్కరణలతో దళారీ వ్యవస్థ దోపిడీ తగ్గిపోయింది. మౌలిక వసతుల విస్తరణతో రాష్ట్రాల మధ్య అనుసంధానత పెరిగి రవాణా ఖర్చులు భారీగా తగ్గాయి. సంస్కరణలనే పదం వినగానే ఆర్థిక, పరిశ్రమలకే పరిమితమవుతాం. వాస్తవానికి సంస్కరణలు సామాజిక రంగంలో కీలకమైనవి. ఒకప్పుడు వెనకబాటుకు గురైన ప్రాంతాలు ఇప్పుడు ఆశావహ (ఆస్పిరేషనల్) జిల్లాలు, బ్లాకులుగా అభివృద్ధి చెందాయి. గతంలో అభివృద్ధికి నోచుకోని గిరిజనులకు పీఎం–జన్మన్ పథకం ఎంతగానో ఉపయోగపడుతోంది. సంస్కరణల ఎక్స్ప్రెస్తో దేశంలో ఎంతో అభివృద్ధి జరిగింది. దేశాన్ని, ప్రజలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే బలమైన కాంక్ష నాలో రగులుతోంది’’ అని అన్నారు. అందుకు గర్విస్తున్నా ‘‘నత్తనడకన సాగే దశలవారీ సర్దుబాట్ల స్థాయి నుంచి వ్యవస్థీకృత సంస్కరణల దిశలోకి భారత్ను తీసుకొచ్చాం. ఈ విషయంలో ఎంతగానో గర్విస్తున్నా. ఉదాహరణకు వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వచ్చాక రెండు శ్లాబుల పన్నులతో కుటుంబాలు మొదలు సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల, అధిక కార్మిక ఆధారిత రంగాల కష్టాలు తీరాయి. చిన్న కంపెనీల నిర్వహణ వ్యయాలు తగ్గాయి. బీమా రంగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో నచి్చన బీమా కంపెనీని పోర్టబుల్గా ఎంచుకునే వెసులుబాటు సగటు భారతీయునికి అందుబాటులోకి వచి్చంది. అభివృద్ధికి నోచుకోని రంగాలకు మంత్రిత్వ శాఖలను ఏర్పాటుచేశాం. దాంతో నైపుణ్యాభివృద్ధి, ఫిషరీ, సహకార సంఘాలు, ఆయుష్ వంటివి వేగంగా వృద్ధి చెందుతున్నాయి. యూపీఐ చెల్లింపులతో భారత్ డిజిటల్ లీడర్గా ఎదుగుతోంది. స్టార్టప్ల్లోనూ దూసుకెళ్తోంది. మన యువతరం కొత్త ఆర్థికవ్యవస్థను సృష్టిస్తోంది’’ అన్నారు. సంస్కరణల ఫలాలు సిందూర్ వేళ చేతికి‘‘భద్రతా సవాళ్లను అన్ని వేళలా సర్వసన్నద్ధంతో ఎదుర్కోవాలి. ఆ మేరకు దశాబ్దం క్రితం చేపట్టిన రక్షణ రంగ సంస్కరణల ఫలాలు ఆపరేషన్ సిందూర్ వేళ చేతికొచ్చాయి. రక్షణ రంగం ఆధునీకరణలో భాగంగా బడ్జెట్లో దానికి కేటాయింపులు ఏకంగా 15 శాతం పెంచాం. రక్షణరంగంలో స్వయంసమృద్ధికి ఎన్డీఏ సర్కారు కృషి చేస్తోంది’’ అని మోదీ అన్నారు.యూపీఏ ఉండుంటే వాణిజ్య చర్చలు హుళక్కే‘‘అమెరికా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, బ్రిటన్ దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ కూటమితో కీలక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాం. దీంతో సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమల వంటి అధిక కార్మికుల ఆధారిత పరిశ్రమల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లోకి అవకాశాలు పెరిగాయి. ఇవన్నీ మన పోటీతత్వమున్న స్థానిక పరిశ్రమలు, విశ్వసనీయ ధోరణితో సాధ్యమయ్యాయి. గతంలో యూపీఏ ప్రభుత్వాలు సైతం విదేశాలతో వాణిజ్య ఒప్పందాలకు ప్రయతి్నంచి ఘోరంగా విఫలమయ్యాయి. ఆర్థికనిర్వహణలో అసమర్థతే దీనికి అసలు కారణం. ఇంకా యూపీఏ సర్కార్ ఉండి ఉంటే వాణిజ్య ఒప్పందాలు కలగానే మిగిలిపోయేవి’’ అని మోదీ అన్నారు. పనిపై ఎప్పుడూ సంతృప్తి చెందను ప్రజాజీవితం అంటేనే విశ్రాంతిలేకుండా పని చేయడమని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘సంస్కరణల ఎక్స్ప్రెస్తో ఒనగూరిన అభివృద్ధి, చేసిన పని విషయంలో నేనెప్పుడూ సంతృప్తి చెందలేదు. ఇంకా బాగా పని చేయాలనుకుంటా. మరింత వేగంగా, మెరుగ్గా పని చేసేందుకు ఉవ్విళ్లూరుతుంటా. ప్రజల కోసం ఎంతో సాధించాలన్న బలమైన కోరిక నాలో రగిలిపోతుంటుంది. ఎందుకంటే దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి’’ అని చెప్పారు. -
పట్టణాలకు మహర్దశ
సాక్షి, న్యూఢిల్లీ: నగరాలు, పట్టణాలను ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్లుగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన, వాటి అభివృద్ధి కోసం అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం శనివారం ఇందుకు ఆమోదం తెలిపింది. ఈ పథకానికి కేంద్ర సాయంగా ఏకంగా రూ.లక్ష కోట్లను కేటాయించింది! ఈ పథకం 2025–26 నుంచి 2030–31 ఆరి్ధక సంవత్సరం దాకా ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. అనంతరం అవసరాన్ని బట్టి మరింతకాలం పొడిగిస్తారు. అప్పు తెస్తే కేంద్రం సాయం! నగరాలు తమ కాళ్లపై తాము నిలబడేలా, మార్కెట్ నుంచి నిధులు సమీకరించుకునేలా యూసీఎఫ్ను కేంద్రం రూపొందించింది. ఇందులో భాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చేపట్టే పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల్లో 25% నిధులను యూసీఎఫ్ కింద కేంద్రం ఇస్తుంది. ఇందుకోసం ప్రాజెక్టు నిధుల్లో కనీసం 50 శాతాన్ని రాష్ట్రాలు మార్కెట్ నుంచి సమీకరించాల్సి ఉంటుంది. మున్సిపల్ బాండ్లు, బ్యాంక్ రుణాలు లేదా పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) వాటిని సమకూర్చుకోవాలి. మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం, లేదా స్థానిక సంస్థలు భరించాలి. యూసీఎఫ్తో రాబోయే ఐదేళ్లలో దేశ పట్టణాభివృద్ధి రంగంలో ఏకంగా రూ.4 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు వెల్లువెత్తుతాయని కేంద్రం అంచనా వేస్తోంది. పట్టణాభివృద్ధిలో గ్రాంట్ ఆధారిత విధానం స్థానంలో మార్కెట్, సంస్కరణల ఆధారిత విధానానికి ఇది నాంది పలుకుతుందని ఒక ప్రకటనలో పేర్కొంది. చిన్న పట్టణాలకు రూ.5,000 కోట్ల నిధి యూసీఎఫ్ పథకంలో భాగంగా పోటీతత్వానికి కేంద్రం తెర తీసింది. పారదర్శకంగా, సంస్కరణలు అమలు చేసే నగరాలకే ప్రాధాన్యమిస్తారు. పాలనలో డిజిటల్ విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ, అర్బన్ ప్లానింగ్ సంస్కరణలు అమలు చేసే నగరాలు రేసులో ముందుంటాయి. అంతేగాక టైర్2, టైర్3 నగరాలు, ముఖ్యంగా లక్ష లోపు జనాభా ఉన్న చిన్న పట్టణాల కోసం రూ.5,000 కోట్లతో ప్రత్యేక కార్పస్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంతాల్లో లక్ష లోపు జనాభా ఉన్న పట్టణాలు మార్కెట్ రుణాలు పొందడానికి కేంద్రం ‘క్రెడిట్ రీపేమెంట్ గ్యారంటీ’ఇస్తుంది. దీనికింద తొలిసారి రుణాలకు రూ.7 కోట్లు లేదా రుణ మొత్తంలో 70% దాకా కేంద్రమే గ్యారంటీగా ఉంటుంది.మూడు రంగాలపై ఫోకస్ యూసీఎఫ్ ద్వారా మూడు రకాల అభివృద్ధి పనులకు ప్రాధాన్యమిస్తారు... → నగరాల విస్తరణ, ఆర్థిక కారిడార్లు, రవాణా వ్యవస్థ మెరుగుదల → పాత బస్తీలు, హెరిటేజ్ ప్రాంతాల ఆధునీకరణ, బ్రౌన్ఫీల్డ్ ప్రాజెక్టులు, విపత్తుల నుంచి రక్షణ → తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, చెత్త నిర్వహణ (స్వచ్ఛత), నీటి వనరుల రక్షణ ఎవరికి వర్తిస్తుంది? → 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు → రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు → లక్ష జనాభా దాటిన పారిశ్రామిక నగరాలు → చిన్న పట్టణాలు (గ్యారెంటీ స్కీమ్ కింద)కేబినెట్ ఇతర నిర్ణయాలుప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. వేల కోట్ల రూపాయలతో కూడిన పలు ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్ వాటిని మీడియాకు వెల్లడించారు... → తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రల్లో రూ.11 వేల కోట్ల రోడ్డు ప్రాజెక్టులకు అనుమతి → అస్సాంలో రూ.18,662 కోట్లతో బ్రహ్మపుత్ర నది కింద దేశంలోనే తొలి అండర్ వాటర్ రైల్, రోడ్డు ట్విన్ టన్నెల్ ప్రాజెక్టు. దీన్ని గోహ్పూర్–నుమాలిగఢ్ నడుమ 34 కి.మీ. పొడవున నిర్మించనున్నారు → కసారా–మన్మాడ్, ఢిల్లీ–అంబాలా, బళ్లారి–హోస్పేట నడుమ మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణం నిమిత్తం రూ.18,509 కోట్లతో మూడు భారీ ప్రాజెక్టులు → రూ.10 వేల కోట్లతో తలపెట్టిన స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0కు ఆమోదం → నోయిడా మెట్రో రైల్ ప్రాజెక్టు 11.56 కి.మీ. మేరకు విస్తరణ. → ప్రధాని కార్యాలయాన్ని రైసినా హిల్స్లోని సౌత్ బ్లాక్ నుంచి నూతనంగా నిర్మించిన సేవా తీర్్థలోకి మార్చడం పట్ల కేంద్ర మంత్రివర్గం హర్షం వెలిబుచి్చంది. శుక్రవారం సౌత్బ్లాక్ కార్యాలయంలో జరిగిన చివరి మంత్రివర్గ భేటీలో ఈ మేరకు తీర్మానం ఆమోదించింది. ‘‘సేవా తీర్థ్ చరిత్ర, భవిష్యత్తుల కూడలి. గతకాలపు బానిసత్వం నుంచి భవిష్యత్ వికసిత భారత్ దిశగా వేసిన ముందడుగు’’అని అభివరి్ణంచింది. -
ఇండియా ఏఐ సదస్సు రేపటి నుంచే
న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియా ఏఐ సదస్సు సోమవారం నుంచి ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు సాగే ఈ సదస్సులో 20 దేశాల అధినేతలు, ముఖ్య నేతలతో పాటు దిగ్గజ ఏఐ కంపెనీల సీఈఓలు తదితరులు పాల్గొంటున్నారు. సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 40 మందికి పైగా సీఈఓలతో భేటీ కానున్నారు. వీరిలో శామ్ ఆల్టమన్ (ఓపెన్ఏఐ), బిల్ గేట్స్, డేరియో అమొదెయ్ (ఆంత్రోపిక్) తదితరులున్నారు. భారత్లో పెట్టుబడి ప్రణాళికలను గురించి వీరంతా తమ ఆలోచనలను ప్రధానితో పంచుకోనున్నారు. ఈ సదస్సు సందర్భంగా పలు రంగాల్లో ఏకంగా 100 బిలియన్ డాలర్ల మేరకు ఏఐ పెట్టుబడులకు ఒప్పందాలు కుదురతాయని అంచనా. వచ్చే నాలుగేళ్లలో భారత్లో ఏకంగా రూ.15 లక్షల కోట్ల మేరకు పెట్టుబడి ప్రణాళికలను మైక్రోసాఫ్ట్ గత డిసెంబర్లో ప్రకటించడం తెలిసిందే. ఏఐ మౌలిక సదుపాయాలు, క్లౌడ్ సామర్థ్య పెంపు, అత్యాధునిక డిజిటల్ నైపుణ్యాల్లో లక్షలాది మంది యువతకు శిక్షణ తదితరాలపై ఈ మొత్తాన్ని వెచ్చించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఇందులో పాల్గొనేందుకు ఇప్పటికే ఏకంగా 2 లక్షల మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నారు. గత ఏఐ సదస్సులు పారిస్, సియోల్ తదితర నగరాల్లో జరిగాయి. -
ఈశాన్యంలో చొరబాట్లు... కాంగ్రెస్ పుణ్యమే!
గువాహటి: కాంగ్రెస్ పారీ్టపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఈశాన్య భారతదేశంలో అభివృద్ధిని దశాబ్దాలుగా కాంగ్రెస్ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అంతేగాక ఈ ప్రాంతంలో చొరబాట్లను విపరీతంగా ప్రోత్సహించింది’’అంటూ దుయ్యబట్టారు. చొరబాటుదారులను కాపాడిన, కాపాడుతున్న చరిత్ర ఆ పార్టీదేనని ఆక్షేపించారు. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేసేందుకు బీజేపీ కంకణం కట్టుకుందని చెప్పారు. అస్సాంలో ఒక్క రోజు పర్యటనలో భాగంగా శనివారం గువాహటిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. కాంగ్రెస్ తన హయాంలో దేశ భద్రతను నిత్యం ప్రమాదంలో నెట్టిందంటూ మండిపడ్డారు. ఆ పార్టీ పాలనలో అస్సాంలో నిత్యం భయం, అభద్రతలే రాజ్యమేలాయని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ నిత్యం సమాజంలో విభజనను ప్రోత్సహించింది. ఓటుబ్యాంకు రాజకీయాల్లో మునిగి తేలింది. దేశ భద్రతను గాలికొదిలేసింది. చివరికి ఆయుధాల కొనుగోళ్లలో కూడా భారీ కుంభకోణాలకు పాల్పడింది. గతంలో ముస్లిం లీగ్ వల్ల దేశ విభజన జరిగింది. కానీ ఇప్పుడు మావోయిస్టులు, ముస్లిం లీగ్, కాంగ్రెస్ (ఎంఎంసీ)లతో దేశానికి ముప్పు పొంచి ఉంది. వీటిపట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి’’అని ప్రధాని సూచించారు. ‘డబుల్ ఇంజన్’కే ఓటెయ్యండి వచ్చే ఐదేళ్ల కాలం అస్సాంకు చాలా కీలకమని మోదీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీజేపీని గెలిపించి డబుల్ ఇంజన్ సర్కారును కొనసాగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవడం ఒక్కటే బీజేపీ లక్ష్యం కాదని, ప్రజల హృదయాలు గెలవడం తమకు ముఖ్యమని చెప్పారు. ‘‘70 ఏళ్లలో బ్రహ్మపుత్ర నదిపై కాంగ్రెస్ కేవలం మూడు వంతెనలు నిర్మించింది. మేం పదేళ్లలోనే ఐదు బ్రిడ్జిలు కట్టి చూపించాం. మా ప్రభుత్వ చర్యల వల్ల రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతోంది. అస్సాంను వేగంగా అభివృద్ధి చేసేందుకు, అన్ని రంగాల్లోనూ రాష్ట్ర అస్తిత్వాన్ని, సంప్రదాయాలను పరిరక్షించేందుకు బీజేపీ కంకణం కట్టుకుంది. 2014 నుంచి ఈశాన్యానికి చెందిన 125 మంది పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు’’అని మోదీ చెప్పారు. బీజేపీకి కార్యకర్తలే ప్రాణవాయువని, పార్టీకి ఎనలేని బలమని అభిప్రాయపడ్డారు. ఎన్నికల వేళ ప్రతి పౌరునికీ చేరువ కావాలని కార్యకర్తలకు సూచించారు. ‘‘మేం విశ్వసించేది వ్యవస్థాగతమైన బలాన్నే. నేను బీజేపీ కార్యకర్తను. అది నాకు గర్వకారణం. అదే నా అతి పెద్ద అర్హత. అస్సాం ప్రజలు నన్నెంతగానో ప్రేమిస్తున్నారు. దానికి అభివృద్ధి రూపంలో వడ్డీతో సహా బదులు చెల్లించుకుంటాను’’అని ప్రకటించారు. పలు ప్రాజెక్టులు ప్రారంభంకొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అస్సాంలో రూ.5,500 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. వీటిపై బ్రహ్మపుత్రా నదిపై భారీ వంతెన, ఐఐఎం, డేటా సెంటర్ తదితరాలున్నాయి. ఐఐఎం–గువాహటిని గువాహటి సమీపంలోని పలాస్బరిలో, హైటెక్ డేటా సెంటర్ను కామరూప్ జిల్లాలోని అమీన్గావ్లో నిర్మించారు. వీటితో పాటు పీఎం–ఇబస్ సేవా పథకం కింద మంజూరైన 225 ఎలక్ట్రిక్ బస్సులను కూడా మోదీ జెండా ఊపి ప్రారంభించారు. బ్రహ్మపుత్రపై భారీ బ్రిడ్జి బ్రహ్మపుత్రా నదిపై రూ.3,030 కోట్లతో నిర్మించిన కుమార్ భాస్కర్ వర్మ సేతును మోదీ ప్రారంభించారు. అనంతరం బ్రిడ్జిపై నడుస్తూ దాన్ని పరిశీలించారు. అప్రోచ్ రోడ్లు, ఫ్లై ఓవర్లతో కలిపి ఇది 7.75 కి.మీ. పొడవుంటుంది. సువిశాలమైన ఈ ఆరు లేన్ల బ్రిడ్జి వల్ల గువాహటి, ఉత్తర గువాహటి నడుమ ప్రయాణ సమయం ఇకపై కేవలం ఏడు నిమిషాలకు తగ్గనుంది. ప్రస్తుతం సరాయ్ఘాట్ బ్రిడ్జి మాత్రమే వాటిని అనుసంధానిస్తోంది. దానిపై బ్రహ్మపుత్రను దాటేందుకు కనీసం 30 నిమిషాలు పడుతుంది. కొత్త బ్రిడ్జిని భారీ భూకంపాలను కూడా తట్టుకునేలా ఎక్స్ట్రా డోస్డ్ ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్తో నిర్మించారు. ఈశాన్య భారతదేశంలో ఈ టెక్నాలజీతో నిర్మించిన తొలి బ్రిడ్జి ఇదే. దీని నిర్మాణానికి 2019లో మోదీయే శంకుస్థాపన చేశారు. 2020 లో నిర్మాణ పనులు మొదలయ్యాయి. -
ఈఎల్ఎఫ్పై ల్యాండైన మోదీ
గువాహటి/మోరాన్: ఈశాన్య భారతదేశంలో నిర్మితమైన తొలి హైవే–రన్వేను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలో మోరాన్ సమీపంలో నేషనల్ హైవే 37పై సిద్ధం చేసిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ఈఎల్ఎఫ్)పై వాయుసేనకు చెందిన సీ–130జె రవాణా విమానంలో ప్రధాని దిగారు. అనంతరం దాన్ని లాంఛనంగా జాతికి అంకితం చేశారు. ఈశాన్య భారతదేశానికి తొలి ఈఎల్ఎఫ్ సదుపాయం అందుబాటులోకి రావడం నిజంగా గరి్వంచదగ్గ విషయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రాకృతిక విపత్తులు తదితర సమయాల్లో ఈ సదుపాయం ఎంతగానో ఉపయోగపడుతుందని హర్షం వెలిబుచ్చారు.అబ్బురపరిచిన ఏరియల్ షో మోదీ ఒక రోజు పర్యటన నిమిత్తం శనివారం అస్సాం చేరుకున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి ఆయన చబువా ఎయిర్ఫోర్స్ స్టేషన్కు చేరుకున్నారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి.సింగ్, రాష్ట్ర మంత్రులు తదితరులు ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం సీ–130జె హెర్క్యులస్ విమానంలో ఆయన ఈఎల్ఎఫ్కు చేరుకున్నారు. రన్వేపై దిగాక సమీపంలో సిద్ధం చేసిన వేదికకు చేరుకున్నారు. అనంతరం ఈఎల్ఎఫ్పై వాయుసేన నిర్వహించిన ప్రత్యేక ఏరియల్ షోను వీక్షించారు. 20 నిమిషాలకు పైగా సాగిన ఈ షో ఆహూతులకు కనువిందు చేసింది. యుద్ధ విమానాలు, రవాణా విమానాలు, హెలికాప్టర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పైలట్లు ఈఎల్ఎఫ్పై కచి్చతత్వంతో ల్యాండింగ్, టేకాఫ్తో పాటు పలు విన్యాసాలు నిర్వహించారు. స్థానికులు భారీ సంఖ్యలో వాటిని వీక్షించారు. తొలుత సుఖోయ్ –30 ఎంకేఐ, దాని వెనకే రఫేల్ ఈఎల్ఎఫ్ నుంచి టేకాఫ్ అయ్యాయి. తర్వాత ఏఎన్–32 హెలికాప్టర్ టచ్ అండ్ గో విన్యాసాలు ప్రదర్శించింది. తర్వాత మూడేసి చొప్పున తొలుత సుఖోయ్, తర్వాత రఫేల్ యుద్ధ విమానాలు ప్రత్యేక విన్యాసాలతో అలరించాయి. విపత్తుల వేళ చేపట్టే సహాయక చర్యల సన్నద్ధతను ప్రత్యేకంగా తయారు చేసిన అధునాతన దేశీయ హెలికాప్టర్లు (ఏఎల్హెచ్) కళ్లకు కట్టాయి. అనంతరం ప్రధాని గువాహటి చేరుకున్నారు.ఎన్నోవిధాలుగా కీలకం అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలో నిర్మించిన ఈఎల్ఎఫ్ వ్యూహాత్మకంగా ఎన్నోవిధాలుగా అత్యంత కీలకమైనది. ఈ ఈఎల్ఎఫ్ చైనాకు 300 కి.మీ., మయన్మార్కు కేవలం 200 కి.మీ. దూరంలో ఉంటుంది. 4.2 కి.మీ. పొడవైన ఈ హైవే–రన్వేను రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించారు. సైనిక, పౌర అవసరాలు రెండింటికీ పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా వాయుసేన సహకారంతో దీన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. పొరుగు దేశాలతో ఘర్షణల వేళ ప్రత్యర్థులు సమీపంలోని వైమానిక స్థావరాలపై దాడులు చేస్తే బలగాల తరలింపు తదితరాలకు తక్షణ సదుపాయంగా ఈఎల్ఎఫ్ కీలకపాత్ర పోషిస్తుంది. విపత్తులు, ఎమర్జెన్సీ సమయాల్లో దిబ్రూగఢ్ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా కూడా పని చేస్తుంది. దిబ్రూగఢ్–మోరాన్ జాతీయ రహదారి–37పై నిర్మించిన ఈఎల్ఎఫ్పై అన్నిరకాల యుద్ధ, రవాణా విమానాలనూ సులువుగా దించవచ్చు. రఫేల్, సుఖోయ్తో పాటు పలు భారీ రవాణా విమానాలు కూడా దీనిపై విజయవంతంగా ట్రయల్ రన్స్ నిర్వహించాయి. 40 టన్నుల బరువైన యుద్ధ విమానాలతో పాటు ఏకంగా 74 టన్నుల రవాణా విమానాలు కూడా దీనిపై సునాయాసంగా దిగవచ్చు. భారత్లో తొలి ఈఎల్ఎఫ్ రాజస్తాన్లోని బార్మేర్ జిల్లాలో 2021లో నిర్మితమైంది. అనంతరం మధ్య, ఉత్తర భారతంలో కూడా పలు ఈఎల్ఎఫ్లు అందుబాటులోకి వచ్చాయి. -
తారిఖ్ రహ్మాన్ రాక.. భారత్కు బంగ్లా టెన్షన్!
తారిఖ్ రహ్మాన్.. బంగ్లా ప్రధాని కాబోతున్న నాయకుడు. ‘డార్క్ ప్రిన్స్’గా ఇంటాబయటా అప్రతిష్టపాలైన నేపథ్యం నుంచి ప్రధాని పీఠాన్ని అందిపుచ్చుకునే దాకా 60 ఏళ్ల రహ్మాన్ ప్రస్థానం బంగ్లాదేశ్ సరికొత్త రాజకీయానికి నాంది పలికింది. ఆయనపై లెక్కకు మించి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక కేసులో రహ్మాన్ అరెస్టయ్యారు. అమెరికా కూడా రహ్మాన్ను ‘డార్క్ ప్రిన్స్’గా అభివర్ణించింది. బెయిల్పై విడుదలైన అనంతరం వైద్యచికిత్స పేరుతో 2008లో లండన్ వెళ్లారు. నాటి నుంచీ కుటుంబంతో పాటు అక్కడే ప్రవాసంలో గడుపుతూ వచ్చారు. లండన్ నుంచే పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించారు.గతేడాది డిసెంబరులో తల్లి ఖాలిదా జియా అనారోగ్యానికి గురి కావడంతో 17 ఏళ్ల తర్వాత మళ్లీ సొంతగడ్డపై అడుగుపెట్టారు. తల్లి మరణానంతరం పార్టీ పగ్గాలు అందుకున్నారు. నిరసనలు, హింసాత్మక ఘటనలతో అస్థిరంగా మారిన దేశంలో మళ్లీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తీసుకొచ్చే దిశగా విస్తృత ప్రచారం చేపట్టారు. ‘బంగ్లా ఫస్ట్’ నినాదంతో యువతను ఆకర్షించారు. కట్ చేస్తే 2026 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మరి ఆయన గెలుపు భారత్కు లాభమేనా? రహ్మాన్ రాక మనకు ఏ మేరకు ఉపయోగపడనుంది?బంగ్లాదేశ్ ఎన్నికలను భారత్ ముందు నుంచీ నిశితంగా గమనించింది. ఇదే సమయంలో భారత్ ప్రయోజనాలను గౌరవిస్తామని స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను ‘రీసెట్’ కోరుకుంటున్నానని, అయితే, అది రెండు దేశాల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. అలాగే, ఉగ్రవాదంపై భారత్ పోరుకు సహకరిస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. తీస్థా నదీజలాల విషయంలో నెలకొన్న వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటామని చెప్పారు. హిందూ మైనార్టీలకు రక్షణ కల్పిస్తామని ఎన్నికల ముందు ఆయన హామీ ఇచ్చారు. భారత్, బంగ్లా సంబంధాలు మెరుగుపడే దిశగా ఇవన్నీ సానుకూల సంకేతాలేనని భావిస్తున్నారు. దీనికితోడు 2001–06 మధ్య బీఎన్పీతో అధికారాన్ని పంచుకున్న రాడికల్ పార్టీ జమాతే ఇస్లామీని ఈసారి రహ్మాన్ దూరం పెట్టారు. ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధించారు. ఇది కూడా భారత్కు కలిసొచ్చే అంశమే. ఆయన పగ్గాలు చేపట్టాక ఇరుదేశాల నడుమ వాణిజ్యంతో పాటు అన్ని రంగాల్లోనూ సంబంధాలు మెరుగవుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇరు దేశాల వాణిజ్యం ఇలా.. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఏటా 14 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతోంది. అయితే, ఇందులో దాదాపు 10 బిలియన్ డాలర్ల వరకు మనకు వాణిజ్య మిగులే ఉంటోంది. మన దేశం నుంచి బంగ్లాదేశ్ టీ, కాఫీ, ఆటో విడిభాగాలు, విద్యుత్, ఉక్కు, స్టీల్, ప్లాస్టిక్, పత్తి వంటివి దిగుమతి చేసుకుంటోంది. బంగ్లా పత్తి దిగుమతుల్లో 80శాతం మన దేశం నుంచే వెళ్తోంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. కాబట్టి దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భారత్తో రహ్మాన్ దౌత్య సంబంధాలు నెరిపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సరిహద్దు భద్రత.. అయితే, సరిహద్దు నియంత్రణ విషయంలో రహ్మాన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై భారత్ దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, పశ్చిమబెంగాల్, అస్సాంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో అక్రమ వలసదారుల అంశమే ఎన్నికల్లో కీలకంగా మారింది. భారత్, బంగ్లాదేశ్ 4,100 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్నాయి. 2024 జూన్ తర్వాత నుంచి దాదాపు 1000కి పైగా చొరబాటు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు చొరబాట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో తెలియాల్సి ఉంది.తీస్తా నది జలాల సమస్య.. తీస్తా నది సిక్కిం నుంచి ఉద్భవించి పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహించి బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. మొత్తం పొడవు సుమారు 414 కిలోమీటర్లు. ఉత్తర బంగ్లాదేశ్లో వ్యవసాయం, సాగు నీటి అవసరాలకు ఇది కీలకంగా ఉంది. అయితే, తీస్తా నదీ జలాలను భారత్ ఎక్కువగా వినియోగిస్తోందని బంగ్లా ఆరోపిస్తోంది. బంగ్లాదేశ్కి తక్కువ వాటా రావడం వల్ల అక్కడి రైతులు, పంటలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని చెబుతోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఎక్కువ వాటా కోరుతోంది. కానీ, భారత్ (ప్రత్యేకంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం) దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.ఒప్పందం ఇలా.. 2011లో తీస్తా జలాలపై ఒప్పందం కుదరబోతుందని భావించారు. కానీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వ్యతిరేకించింది. అప్పటి నుంచి ఒప్పందం నిలిచిపోయింది. 2025లో నాటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ పర్యటన సందర్బంగా ఈ అంశం మళ్లీ చర్చకు వచ్చింది. భారత్ టెక్నికల్ టీమ్ను పంపి నది నిర్వహణపై చర్చిస్తామని తెలిపింది. కానీ, తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో చర్చలు జరగలేదు. మరోవైపు.. తాత్కాలిక యూనస్ ప్రభుత్వం ఇలా పద్మానదిపై ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో పద్మానది ప్రాజెక్ట్పై రెహ్మాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కీలకంగా మారనుంది.భారత్ ముందున్న సవాళ్లు.. తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం బంగ్లాదేశ్లో అధికారంలోకి రావడం భారత్కి కొత్త అవకాశాలు, అలాగే కొన్ని సవాళ్లను తెస్తోంది. రెహ్మాన్ ప్రభుత్వం కనుక చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకుంటే భారత్ మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు. కాబట్టి కొత్త ప్రభుత్వంతో భారత్ వెంటనే ఉన్నత స్థాయి చర్చలు ప్రారంభించడం మంచిదని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, భారత్ విషయంలో చైనా ఎప్పుడూ కయ్యానికి దిగే తరహాలోనే వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో బంగ్లా ప్రభుత్వంతో చైనా వ్యూహరచన చేస్తుందోననే టెన్షన్ కూడా భారత్కు ఉన్నట్టు సమాచారం. -
అస్సాంలో మోదీ.. రోడ్డుపైనే ల్యాండయిన విమానం
దిస్పూర్: ప్రధాని మోదీ అస్సాం చేరుకున్నారు. దిబ్రూగఢ్-మోరాన్ జాతీయ రహదారిపై నిర్మించిన ఎమర్జెన్సీ లాండింగ్ ఫెసిలిటీ రోడ్డుపై.. మోదీ ప్రయాణించిన ప్రత్యేక విమానం ల్యాండయ్యింది. అనంతరం ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రధాని తిలకించారు. ఇటీవల నిర్మించిన 4.2 కిలోమీటర్ల ఈ రహదారిపై రఫెల్, సుఖోయ్ వంటి యుద్ధ విమానాల ల్యాండింగ్ ప్రదర్శన చేయవచ్చు.దానితో పాటు, అత్యవసర పరిస్థితుల్లో సైనిక, పౌర విమానాల ల్యాండింగ్కు ఇది ఉపయోగపడుతుంది. ఈశాన్య భారతంలో ఎమర్జెన్సీ లాండింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఈశాన్య ప్రాంతాలలో ఉండే ప్రత్యేక వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అత్యవసర సమయాల్లో ఉపయోగించడానికి వీలుగా దీనిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.అనంతరం బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన భాస్కర వర్మ సేతు ప్రాజెక్టును మోదీ ప్రారంభించనున్నారు. దాని తర్వాత దాదాపు రూ. 5,450 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అంతకు ముందు ప్రధాని మోదీకి హిమంత బిశ్వశర్మతో పాటు ఇతర నాయకులు స్వాగతం పలికారు. -
‘సేవా తీర్థ్’లోకి మోదీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయ చిరునామా మారిపోయింది. బ్రిటిష్ కాలం నాటి సౌత్ బ్లాక్ నుంచి కొత్త కార్యాలయం ‘సేవా తీర్థ్’లోకి ప్రధాని నరేంద్ర మోదీ అడుగుపెట్టారు. ఢిల్లీని దేశ ఆధునిక రాజధానిగా మార్చి 95 ఏళ్లయిన సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయ(పీఎంఓ) నూతన భవనం సేవా తీర్థ్ను ప్రధాని మోదీ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఇకపై ఇక్కడి నుంచే ఆయన అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తారు. మోదీ పలువురు కేంద్ర మంత్రులు, అధికారులతో కలిసి సేవా తీర్థ్ కాంప్లెక్స్కు చేరుకున్నారు. సేవా తీర్థ్తోపాటు కర్తవ్య భవన్–1, 2లను ప్రారంభించారు. పీఎంఓలో గణేశుడి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. సేవా తీర్థ్ ఫలకాన్ని ఆవిష్కరించారు. ఫలకంపై దేవనాగరి లిపిలో సేవా తీర్థ్ అని లిఖించగా, దాని కింద నాగరిక్ దేవో భవ(పౌరుడే దేవుడు) అని లిఖించారు. సేవా తీర్థ్ ప్రారం¿ోత్సవాన్ని పురస్కరించుకొని రూ.100 ప్రత్యేక నాణెం, పోస్టల్ స్టాంప్ సైతం ప్రధానమంత్రి విడుదల చేశారు. కొత్త భవనంలో మోదీ తొలి రోజు అధికారిక విధులు ప్రారంభించారు. మహిళలు, రైతులు, యువతతోపాటు వృద్ధుల సంక్షేమం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి పౌరుడికి జీవన భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన ‘పీఎం రాహత్’ పథకానికి అనుమతి ఇస్తూ ఫైల్కు సంతకం చేశారు. లఖ్పతీ దీదీల సంఖ్యను ఆరు కోట్లకు పెంచడానికి మరో ఫైల్పై సంతకం పెట్టారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ప్రధాన కార్యదర్శులు పి.కె.మిశ్రా, శక్తికాంత దాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పీఎం రాహత్ పథకం కింద.. ప్రమాదాలకు గురైనవారికి రూ.1.5 లక్షల దాకా నగదు రహిత చికిత్స అందిస్తారు. డబ్బు లేకపోయినా బాధితులకు అత్యవసర చికిత్స తప్పనిసరిగా అందించాలన్నదే ఈ పథకం లక్ష్యమని అధికారులు వెల్లడించారు. మూడు కోట్ల మంది మహిళలను 2027 మార్చి నెల నాటికి లఖ్పతీ దీదీలుగా తీర్చిదిద్దాలని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఇప్పటికే అది పూర్తయ్యింది. ఒక ఏడాది ముందే మూడు కోట్ల మంది లఖ్పతీ దీదీలుగా మారారు. 2029 మార్చి నెల నాటికి మొత్తం ఆరుకోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చాలని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. అధికారులకు టార్గెట్ విధించారు. మరోవైపు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని రూ.2 లక్షల కోట్లకు పెంచారు. ఈ నిధికి గతంలో రూ.లక్ష కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పుడు రెట్టింపు చేశారు. అలాగే రూ.10,000 కోట్లతో ‘స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్(ఎఫ్ఓఎఫ్) 2.0’కు మోదీ అనుమతి మంజూరు చేశారు. ఈ నిధితో నూతన ఆవిష్కరణలకు మరింత ప్రోత్సాహం అందించబోతున్నారు. బ్రిటిష్ ఆనవాళ్లకు మంగళం ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) సేవా తీర్థ్లో కొలువు దీరగా, కేబినెట్ సెక్రెటేరియట్ ఆఫీసు, జాతీయ భద్రతా మండలి సచివాలయ కార్యాలయంతోపాటు పలు కేంద్ర ప్రభుత్వ శాఖలను కర్తవ్య భవన్–1, 2లలోకి తరలిస్తున్నారు. ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఆయా కార్యాలయాలు ఒకేచోట కొలువుదీరబోతున్నాయి. బ్రిటిష్ వలస పాలకుల ఆనవాళ్లను క్రమంగా వదిలించుకొనే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ 2014 నుంచే ఆరంభించారు. ఇందులో భాగంగా అత్యాధునిక వసతులతో నూతన పార్లమెంట్ భవనంతోపాటు సేవా తీర్థ్ భవనం నిర్మించారు. రాజ్పథ్ పేరును కర్తవ్య పథ్గా మార్చారు. బ్రిటిష్ పాలకులు మన మనసును బానిస మనస్తత్వంతో నింపేశారని, దాన్ని తప్పనిసరిగా వదిలించుకోవాలని మోదీ తరచుగా చెబుతున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఇకపై సేవా తీర్థ్గా పిలవాలని అధికారులు స్పష్టంచేశారు. ప్రధానమంత్రి అధికారిక నివాసమైన రేస్ కోర్స్ రోడ్ను కూడా లోక్ కల్యాణ్ మార్గ్గా ప్రభుత్వం ఇప్పటికే మార్చింది. రాష్ట్రాల్లో గవర్నర్లు నివాసం ఉండే రాజ్ భవన్లను లోక్ భవన్లుగా, లోక్ నివాస్లుగా మార్చేసింది. వికసిత్ భారత్ ప్రయాణంలో మైలురాయి: మోదీసేవా తీర్థ్, కర్తవ్య భవనాలు వికసిత్ భారత్ దిశగా మన ప్రయాణంలో కీలకమైన మైలురాయి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరించారు. దేశ ప్రగతితోపాటు ‘పౌరులే కేంద్రంగా ప్రభుత్వ పాలన’కు ఇవి ప్రతీకలు అని స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో సేవా తీర్థ్, కర్తవ్య భవన్–1, 2ల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రిమాట్లాడారు. ఇప్పటిదాకా పీఎంఓగా, ప్రభుత్వ శాఖల కార్యాలయాలుగా సేవలందించిన నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్లు బ్రిటిష్ సామ్రాజ్య ఆలోచనలు, ఆశయాలను ప్రతిబింబించేలా నిర్మించినవేనని తెలిపారు. కానీ, నేడు దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే ధ్యేయంగా సేవా తీర్థ్, కర్తవ్య భవనాలు నిర్మించామని చెప్పారు. ఇకపై ఇక్కడ తీసుకొనే నిర్ణయాలు 140 కోట్ల మంది భారతీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి పునాదిగా తోడ్పడుతాయని పేర్కొన్నారు. -
PM RAHAT: ప్రమాద బాధితులకు వెంటనే 1.5 లక్షల క్యాష్లెస్ వైద్యం
ఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు గోల్డెన్ అవర్స్లో సకాలంలో చికిత్స అందించి వారి ప్రాణాల్ని కాపాడేందుకు కేంద్రం మరో కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. పీఎం రాహత్ పేరుతో రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో రూ.1.5లక్షల వరకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు మోదీ తెలిపారు. శుక్రవారం పీఎంవో నూతన కార్యాలయం సేవాతీర్థ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సేవాతీర్థ్ నుంచి పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ‘సేవాతీర్థ్ కొత్త చరిత్రకు సాక్ష్యం. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు ప్రతిరూపం సేవాతీర్ధ్. స్టార్టప్ ఇండియా 2.0 కోసం 10 వేల కోట్లతో కార్పస్ ఫండ్. సకాలంలో వైద్యం అందక ప్రాణం పోకూడదన్న ఉద్దేశ్యంతో 1.5లక్షల వరకు నగదు రహిత వైద్యం. పీఎం రాహత్, లక్పక్ దీదీలకు 6 లక్షలు పెంచేందుకు యత్నం. ప్రారంభం వ్యవసాయ మౌలిక సదుపాలయ నిధి రెట్టింపు’ చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. పీఎం రాహత్ ఎలా పని చేస్తోందిప్రధానమంత్రి రాహత్ (PM RAHAT) పథకం కింద రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించడానికి రూపొందించింది. ఈ పథకం ద్వారా బాధితులు డబ్బు కోసం ఆందోళన చెందకుండా, వెంటనే చికిత్స పొందే అవకాశం కలుగుతుంది. ప్రమాదంలో గాయపడిన వారికి రూ.1.5 లక్షల వరకు నగదు లేకుండా చికిత్స అందుతుంది. అంటే, ఆసుపత్రి బిల్లులు ముందుగా చెల్లించాల్సిన అవసరం లేకుండా, ప్రభుత్వం నేరుగా ఖర్చును భరిస్తుంది.బాధితుడు ఏ ఆసుపత్రిలో చేరినా, పథకం కింద ఖర్చు నేరుగా ప్రభుత్వమే భరిస్తుంది. ఇది చికిత్స ఆలస్యం కాకుండా, వెంటనే ప్రారంభం కావడానికి సహాయపడుతుంది. ప్రమాదం జరిగిన మొదటి గంటల్లోనే అవసరమైన చికిత్స (సర్జరీ, ICU, మెడికల్ కేర్) అందించడమే ఈ పథకం లక్ష్యం.‘గోల్డెన్ అవర్’లో చికిత్స అందితే ప్రాణాలను రక్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.కుటుంబ సభ్యులు డబ్బు కోసం పరుగులు తీయకుండా బాధితుడు వెంటనే చికిత్స పొందేలా ఈ పథకం సహాయపడుతుంది. ప్రమాదం తర్వాత ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి తగ్గుతుంది. ఈ పథకం వల్ల ‘డబ్బు లేకపోవడం వల్ల ప్రాణం కోల్పోవడం’ అనే పరిస్థితి తగ్గుతుంది. అంటే, ఆర్థిక స్థితి ఎలా ఉన్నా, ప్రతి ఒక్కరికీ సమానంగా వైద్య సహాయం అందుతుంది. -
సేవా తీర్థ్ ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సేవా తీర్థ్ ప్రారంభించారు. గణపతి పూజతో పీఎంవో కార్యాలయం ప్రారంభమైంది. మహిళా, యువత, రైతులకు సంబంధించిన ఫైళ్లపై ప్రధాని మోదీ సంతకాలు చేశారు. యాక్సిడెంట్ల బాధితులకు లక్షన్నర వరకు నగదు రహిత చికిత్స పథకానికి ఆమోదం తెలిపారు. లక్పతి దీదీ పథకం లబ్ధిదారుల సంఖ్య ఆరు కోట్లకు పెంచారు. అగ్రికల్చర్ మౌలిక సదుపాయాల నిధి 2 లక్షల కోట్లకు పెంపు ఫైళ్లపై మోదీ సంతకాలు చేశారు.సౌత్ బ్లాక్ నుంచి నూతన చిరునామాకు పీఎంవో మారింది. పీఎంఓతోపాటు జాతీయ భద్రతా మండలి సచివాలయం, కేబినెట్ సెక్రెటేరియట్ కూడా సేవా తీర్థ్లోనే కొలువుదీరాయి. సేవా తీర్థ్తో పాటు కర్తవ్య భవన్ 1,2ను మోదీ ప్రారంభించనున్నారు. బ్రిటిష్ కాలం నాటి సౌత్ బ్లాక్లో ప్రధాని కార్యాలయంలో కొనసాగుతుంది. కార్యాలయం పాతబడడం, మారుతున్న కాలానికి అనుగుణంగా లేకపోవడంతో నూతన కార్యాలయం ఏర్పాటు చేశారు.కర్తవ్య భవన్లో ఆర్థిక, రక్షణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్పొరేట్ వ్యవహారాలు ,విద్య, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, న్యాయ శాఖ, ఐఅండ్బి శాఖ, వ్యవసాయం, రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ, గిరిజన మంత్రిత్వ శాఖ సహా పలు కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఉద్యోగులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేలా అధునాతన సౌకర్యాలతో నూతన కార్యాలయాలు ఏర్పాటు చేశారు. భవన సముదాయంలో స్మార్ట్ యాక్సెస్ కంట్రోల్, నిఘా నెట్వర్క్, అత్యవసర ప్రతిస్పందన మౌలిక సదుపాయాలు, సమగ్ర భద్రత సౌకర్యాలు ఏర్పాటు చేశారు. -
తారిఖ్ రెహ్మాన్కు ప్రధాని మోదీ అభినందనలు
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఏకపక్ష విజయాన్ని నమోదు చేస్తున్న నేపథ్యంలో, ఆ పార్టీ అధినేత రెహ్మాన్కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన మోదీ.. ఈ విజయం తారిఖ్ రెహ్మాన్ నాయకత్వంపై బంగ్లాదేశ్ ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు. పొరుగు దేశంతో ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు, ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వానికి భారత్ పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని మోదీ తన పోస్ట్లో స్పష్టం చేశారు. ‘ప్రగతిశీల, సమ్మిళిత బంగ్లాదేశ్కు భారత్ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుంది’ అని ఆయన తన సందేశంలో ఉద్ఘాటించారు. 2024లో చెలరేగిన విద్యార్థి ఉద్యమం తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం పతనమై, అనంతరం జరిగిన సాధారణ ఎన్నికలు ఇవే కావడం విశేషం. ఈ చారిత్రాత్మక మార్పు నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.బంగ్లాదేశ్లోని మొత్తం 299 నియోజకవర్గాలకు గాను, ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం బీఎన్పీ, దాని మిత్రపక్షాలు 177 స్థానాల్లో విజయం సాధించి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకుపోతున్నాయి. మొత్తం 237 స్థానాల లెక్కింపు పూర్తి కాగా, మిగిలిన 62 స్థానాల్లో లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఎన్నికల ద్వారా 17 ఏళ్ల ప్రవాసం తర్వాత తారిఖ్ రెహ్మాన్ తిరిగి అధికార పీఠాన్ని అధిష్టించేందుకు మార్గం సుగమమైంది. బీఎన్పీకి ప్రధాన పోటీదారుగా భావించిన జమాతే ఇస్లామీ, దాని మిత్రపక్షాలు కేవలం 53 స్థానాలకే పరిమితమయ్యాయి. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పోటీలో లేకపోవడంతో, ప్రధాన పోరు బీఎన్పీ, జమాతే ఇస్లామీ మధ్యే నెలకొంది. అయితే, బంగ్లాదేశ్ ఓటర్లు తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్పీకే పట్టం కట్టారు. I convey my warm congratulations to Mr. Tarique Rahman on leading BNP to a decisive victory in the Parliamentary elections in Bangladesh. This victory shows the trust of the people of Bangladesh in your leadership.India will continue to stand in support of a democratic,…— Narendra Modi (@narendramodi) February 13, 2026 -
నేడు సేవా తీర్థ్ ప్రారంభం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) చిరునామా మారబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ సౌత్ బ్లాక్ను విడిచిపెట్టి, ఇకపై కొత్త భవనం సేవా తీర్థ్ నుంచే అధికారిక విధులు నిర్వర్తించబోతున్నారు. నూతన పీఎంఓగా తీర్చిదిద్దిన సేవా తీర్థ్ కాంప్లెక్స్ను మోదీ శుక్రవారం లాంఛనంగా ప్రారంభిస్తారు. అలాగే కర్తవ్య భవన్–1, కర్తవ్య భవన్–2ను సైతం ప్రారంభించనున్నారు. పీఎంఓతోపాటు జాతీయ భద్రతా మండలి సచివాలయం, కేబినెట్ సెక్రెటేరియట్ కూడా సేవా తీర్్థలోనే కొలువుదీరనున్నాయి. ప్రస్తుతం ఇవి ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. కర్తవ్య భవన్–1, 2లలో కేంద్ర న్యాయ, రక్షణ, ఆర్థిక, ఆరోగ్య, వ్యవసాయ శాఖలతోపాటు ఇతర శాఖలను ఏర్పా టు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయా శాఖల కార్యాలయాలు లుటెన్స్ ఢిల్లీ రైసినా హిల్స్లోని నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్లో ఉన్నాయి. వాటిని ఖాళీ చేయబోతున్నారు. ప్రధాని మోదీ చివరిసారిగా సౌత్ బ్లాక్లో శుక్రవారం సాయంత్రం కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. నార్త్ బ్లాక్ నుంచి కేంద్ర హోంశాఖ కార్యాలయాన్ని ఇప్పటికే కామన్ సెంట్రల్ సెక్రెటేరియెట్లోని 347 రూమ్ కాంప్లెక్స్కు తరలించారు. -
Bharat Bandh: ఇది ఆరంభం మాత్రమే... బీజేపీకి మాస్ వార్నింగ్
-
దేశాన్ని అమ్మింది కాంగ్రెసే
న్యూఢిల్లీ: వాణిజ్య ఒప్పందం పేరిట దేశాన్ని మోదీ సర్కారు అమెరికాకు అమ్మేసిందన్న విపక్ష నేత రాహుల్గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. ‘‘దేశ ప్రయోజనాలను ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) వంటి అంతర్జాతీయ సంస్థలకు తాకట్టు పెట్టింది కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వమే. పేదలు, రైతుల ప్రయోజనాలను వాటికి అమ్మేసింది. ఏకంగా దేశాన్నే అమ్మేసింది’’అంటూ దుయ్యబట్టారు. కేంద్రంలో అధికారంలో ఉండగా షెర్మెల్ షేక్ చర్చల సందర్భంగా దేశాన్ని దాయాది పాకిస్తాన్కు తనఖా పెట్టిన, ఏకంగా మన సార్వ¿ౌమత్వం విషయంలో రాజీ పడ్డ చరిత్ర కూడా కాంగ్రెస్దేనని ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్ 2026–27పై లోక్సభలో జరిగిన చర్చకు నిర్మల బుధవారం సాయంత్రం బదులిచ్చారు. మన దేశాన్ని అమ్మగల, కొనగల వాడెవరూ పుట్టలేదంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలను ఆమె పునరుద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ అలాంటి పని ఎప్పటికీ చేయబోరని స్పష్టం చేశారు. ఇంధన, ఆర్థిక, ఆహార, డేటా భద్రత తదితరాలపై రాహుల్ లేవనెత్తిన ఆందోళనలను కొట్టిపారేశారు. ఆ విషయాల్లో అవసరమైన అన్ని చర్యలూ కేంద్రం తీసుకుందని, బడ్జెట్లో వాటికి చాలినన్ని నిధులు కేటాయించిందని చెప్పారు. సంబంధిత గణాంకాలను సభకు చదివి వినిపించారు. రాహుల్ అసలు బడ్జెట్నే చదవకుండా నిరాధార ఆరోపణలకు దిగారని మండిపడ్డారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ వ్యయాన్ని రూ.53.47 లక్షల కోట్లుగా అంచనా వేసినట్టు నిర్మల సభకు తెలిపారు. ‘‘మా ప్రభుత్వం కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తోంది. 2027 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు 4.3 శాతానికి పరిమితం కావచ్చు’’అని అంచనా వేశారు. దేశంలో ఎరువుల కొరత ఉందన్న వార్తలను కొట్టిపారేశారు. వాటి దిగుమతికి బడ్జెట్లో ఏకంగా రూ.1.71 లక్షల కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. బెంగాల్లో బాంబుల రాజ్యం! కేంద్ర బడ్జెట్లో పశి్చమబెంగాల్కు కేటాయింపులే లేవన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను నిర్మల తీవ్రంగా ఖండించారు. ఆ పార్టీ ఏలుబడిలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా మంటగలిశాయంటూ మమతా బెనర్జీ సర్కారు పనితీరును దుయ్యబట్టారు. బెంగాల్లో ఎక్కడ చూసినా బాంబుల సంస్కృతే రాజ్యమేలుతోందని ఆరోపించారు. ‘బెంగాల్లో బాంబులే మాట్లాడతాయి, చట్టాలు కాదు’అంటూ పలు ఉదంతాలను ఉటంకించారు. దాంతో విపక్ష సభ్యులు పెద్దపెట్టున నినదిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పాలు, స్టేషనరీ, విద్యపై జీఎస్టీ వసూలు చేస్తున్నారన్న తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు అభిõÙక్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నిర్మల తీవ్రంగా ఖండించారు. ‘‘వాస్తవాలను ఆయన ఉద్దేశపూర్వకంగా పూర్తిగా వక్రీకరించారు. పెన్సిళ్లు, షార్పనర్లపైనా జీఎస్టీ వేశామట! మరీ ఈ స్థాయిలో అబద్ధాలా? 2017లో జీఎస్టీని ప్రవేశపెట్టిన నాటి నుంచీ పాలపై ఎన్నడూ జీఎస్టీ విధించలేదు. చావుపైనా జీఎస్టీ వేశారని పచ్చి అబద్ధాలు చెప్పారు. అంతిమక్రియలపై కూడా ఎప్పుడూ జీఎస్టీ లేదు. వింటున్న సభ్యులకు తెలివి లేదని అభిõÙక్ భావిస్తున్నారా?’’అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. బహుశా పశ్చిమబెంగాల్లో నడుస్తున్న సిండికేట్ మరణాలపైనా పన్నులు వసూలు చేస్తోందేమో అంటూ అధికార తృణమూల్ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అన్యాయానికి గురయ్యామంటూ సానుభూతి కార్డు వాడటం, ప్రతిదానికీ సుప్రీంకోర్టు దగ్గరికి పరుగెత్తడం, చివరికి కోర్టుతో చీవాట్లు తినడం తృణమూల్కు అలవాటుగా మారిందన్నారు. -
రాహుల్ గాంధీపై కేంద్రం సీరియస్
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రం సీరియస్ అయ్యింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి హర్దీప్ సింగ్పై రాహుల్ అసత్య వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. దీంతో ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానానికి సిద్ధమైంది. దీనిపై రాహుల్ సాయంత్రం 5గం లోపు స్పీకర్ కార్యాలయంలోకి హజరై వివరణ ఇవ్వాలని తెలిపింది.దీనిపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ స్పందించారు. రాహుల్ గాంధీకి అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిందన్నారు. ఆయన చేసినవన్ని నిరాధార ఆరోపణలని తెలిపారు. ఎప్స్టీన్ ఫైల్స్ అంశంలో రాహుల్ గాంధీ చెప్పిన అంశాల్లో అసలు వాస్తవం లేదని దానికి సంబంధించిన చాలా నిజాలు పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఓటుచోరి అంటూ అంటూ రాహుల్ ఎలక్షన్ కమిషన్పై ఆయన చేసిన డ్రామా విఫలమయ్యిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ అన్నారు.కాగా అంతకు ముందు రాహుల్ గాందీ పార్లమెంటులో మాట్లాడారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) చేసిన ‘ఇది యుద్ధాల యుగం కాదు’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మనం యుద్ధాల యుగంలోకే ప్రవేశిస్తున్నామని దానికి ఉక్రెయిన్, గాజా, ఇరాన్ తదితర ప్రాంతాల్లో నెలకొన్న యుద్ధ మేఘాలను ఆయన ఉదాహరణగా చూపారు. శాంతి స్థాపన జరుగుతుందన్న అంచనాలు ఇక చెల్లవని, నిరంతర సంఘర్షణలే నేటి ప్రపంచ వాస్తవమని రాహుల్ అన్నారు.అయితే రాహుల్ ఎప్స్టీన్ ఫైల్స్ అంశం ప్రస్థావించాలని ప్రయత్నించగా స్పీకర్ స్థానంలో ఉన్న జగదాంబికా పాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ అదానీ, అంబానీ, హర్ధీప్ సింగ్ పేర్లను ప్రస్థావించారు. దీనిపై రవిశంకర్ ప్రసాద్ పాయింట్ ఆప్ ఆర్డర్ లేవనెత్తారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగించాలని స్పీకర్ ఆదేశించారు. -
’మా కుమారుడి వివాహానికి రండి.. మీ సలహాలకు థాంక్యూ’
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. సచిన్- అంజలి దంపతుల కుమారుడు అర్జున్ టెండుల్కర్ మార్చి 5న వివాహ బంధంలో అడుగుపెట్టనున్నాడు. స్నేహితురాలు సానియా చందోక్తో కలిసి ఏడడుగులు వేయనున్నాడు.వియ్యంకులతో కలిసిఈ నేపథ్యంలో సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar)కుటుంబం.. వియ్యంకులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా కలిసింది. కాబోయే వధూవరులు అర్జున్, సానియా కూడా మోదీని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ విషయాన్ని సచిన్ టెండుల్కర్ స్వయంగా వెల్లడించాడు.రాష్ట్రపతి గారికి ధన్యవాదాలుఅదే విధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలిసి తమ కుమారుడి వివాహానికి (Arjun- Saania Wedding) రావాల్సిందిగా ఆహ్వానించినట్లు సచిన్ తెలిపాడు. ఈ నేపథ్యంలో.. ‘‘గత ఫిబ్రవరిలో గౌరవనీయులైన శ్రీమతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో మాకు ఆతిథ్యం ఇచ్చారు. ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు మా మదిలో అలాగే ఉన్నాయి.ఈరోజు అర్జున్- సానియా వివాహానికి ఆహ్వానించేందుకు మరోసారి వారిని కలిశాము. వధూవరుల్ని ఆశీర్వదించిన గౌరవనీయులైన రాష్ట్రపతి గారికి ధన్యవాదాలు’’ అని సచిన్ ట్వీట్ చేశాడు. రాష్ట్రతితో కలిసి దిగిన ఫొటోలను ఈ సందర్భంగా పంచుకున్నాడు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని సైతం వివాహానికి ఆహ్వానించినట్లు తెలిపాడు సచిన్.మీ విలువైన సలహాలకు థాంక్స్ఇక ప్రధాని నరేంద్ర మోదీకి సైతం సచిన్ ధన్యవాదాలు తెలిపాడు. ‘‘అర్జున్- సానియా వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. యువ జంటకు మీరు ఇచ్చిన విలువైన సలహాలు, ఆశీర్వాదాలకు కృతజ్ఞులమై ఉంటాము’’ అని సచిన్ ప్రధానితో దిగిన ఫొటోలు షేర్ చేశాడు. వ్యాపార కుటుంబంకాగా ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనుమరాలే సానియా చందోక్. ఆమె కూడా వ్యాపార రంగంలోనే ఉన్నారు. సచిన్ కుమార్తె సారా టెండుల్కర్కు సానియా స్నేహితురాలు. ఇక అర్జున్- సానియాల నిశ్చితార్థం గతేడాది జరిగిన విషయం తెలిసిందే. కాగా సచిన్- అంజలి దంపతులకు మొదటి సంతానంగా సారా జన్మించగా.. తర్వాత అర్జున్ జన్మించాడు. అయితే, అక్క కంటే ముందు తమ్ముడు పెళ్లి పీటలు ఎక్కనుండటం విశేషం. ఇక సారా వ్యాపార రంగంలో అడుగుపెట్టగా.. అర్జున్ తండ్రి బాటలో క్రికెటర్ అయ్యాడు. అయితే, ఇప్పటి వరకు ఆశించినంత గుర్తింపు పొందలేకపోయాడు 26 ఏళ్ల అర్జున్. చదవండి: నయా రాకెట్ -
ప్రధానిపై దాడికి యత్నం.. మోదీ సీటును ముట్టడించిన మహిళా ఎంపీలు
-
సాంకేతికతకు సాగిలపడొద్దు
న్యూఢిల్లీ: సాంకేతికత అనేది విద్యార్థులను బానిసలుగా మార్చుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని విద్యార్థులను ప్రధాని నరేంద్ర మోదీ అప్రమత్తంచేశారు. విద్యార్థి దశలో శిక్షణలో భాగంగా నేర్చుకునే పరంపరను కొనసాగించాలనీ అన్నింటిపై కృత్రిమ మేథ మీద ఆధారపడొద్దని ఆయన హితవు పలికారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల విద్యార్థులకు విద్యా సంబంధ చిట్కాలు, సలహాలు చెబుతూ అత్యంత ప్రజాదరణతో కొనసాగుతున్న ‘పరీక్షా పే చర్చా’కార్యక్రమం 9వ విడత రెండో ఎపిసోడ్ సందర్భంగా కోయంబత్తూర్, రాయ్పూర్, గువాహటి, గుజరాత్లకు చెందిన పలువురు ఔత్సాహిక విద్యార్థులతో ప్రధాని మోదీ ముచ్చటించారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఏఐ అంటే భయమేల? ‘‘కృత్రిమ మేధ(ఏఐ) వంటి కొత్త తరం సాంకేతికతలను చూసి విద్యార్థులు భయపడొద్దు. ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకుంటూ వాటిలోనూ మీరు రాణించాలి. ఏఐ లేదా స్మార్ట్ఫోన్ను అత్యున్నత గురువుగా భావించొద్దు. కొందరు పిల్లలకు తొలుత స్మార్ట్ఫోన్లో ఏదైనా చూశాకే వాళ్ల నోట్లోకి ముద్ద దిగుతుంది. మనం ఏఐను ప్రభావవంతంగా వినియోగించుకోవాలి. అంతేగానీ అదే మన మార్గదర్శి అనే స్థాయిలో దానికి విలువ ఇవ్వొద్దు. పాఠ్యపుస్తకాల్లో ఉన్నదానికి ఏఐ సమాచారం అనేది అదనపు విలువ జోడింపు ఇస్తుంది అనే భావనతోనే మెలగాలి. అంతేగానీ నేర్చుకోవడం మానేసి పూర్తిగా ఏఐ ఆధారపడొద్దు. గతంలో ఎడ్లబండి మీద వెళ్లిన మనం ఇప్పుడు ఏరోప్లేన్లో వెళ్లినట్లుగా పాతరకం ఉద్యోగాలు మటుమాయమై ఎల్లప్పుడూ కొత్త రకం ఉద్యోగాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఉపాధి మారొచ్చేమోగానీ జీవితం మారదు. కొనసాగుతూనే ఉంటుంది. భయం, జంకూ వీడి కొత్త రకం సాంకేతికతలను నేర్చుకోవాలి. వాటిపై పట్టుసాధించాలి. సాంకేతికతతో మీ శక్తిసామర్థ్యాలను మరింత పెంపొందించుకోండి. సాంకేతికత సత్తాను మీ పనిలో చూపించండి’’అని మోదీ సూచించారు. పాతవి తిరగేయండి.. హాయిగా నిద్రపొండి ‘‘పరీక్షలకు సంబంధించి పాత క్వశ్చన్ పేపర్లను తిరగేయండి. ప్రశ్నల తీరును అర్థంచేసుకోండి. పగలంతా పక్కా ప్రణాళికతో చదివేసి రాత్రి హాయిగా నిద్రపోండి. రాత్రి బాగా నిద్రపోతేనే ఉదయం అంతకంటే బాగా పరీక్ష రాయగల్గుతారు. పరీక్షకు బాగా సంసిద్ధమయ్యాక కొత్తగా ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. చక్కటి నిద్ర అనేది మిమ్మల్ని రోజంతా హుషారుగా ఉండేలా చేస్తుంది’’అని అన్నారు. తమ పిల్లలను ఇతర విద్యార్థులతో పోల్చి చూసే ధోరణిని తల్లిదండ్రులు విడనాడాలని మోదీ సూచించారు. రెండింటిపై స్వారీ చేయండి విద్య, సొంత ఇష్టాయిష్టాలను సమన్వయం చేసుకోవడం కష్టంగా ఉందని ఓ విద్యార్థి వెలిబుచి్చన ఆవేదనపై మోదీ తనదైన శైలిలో సలహా ఇచ్చారు. ‘‘ఓ వైపు ఆర్ట్ అంటే ఇష్టం. మరోవైపు శాస్త్రసాంకేతిక రంగంలో రాణించాల్సిన పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో ఎటూపాలుపోక నిట్టూర్చేకంటే ప్రతి రోజూ లేదా వారానికి ఒకసారి సొంత ఇష్టాయిష్టాలపై దృష్టిపెట్టండి. విద్యకు ఎప్పట్లాగే అత్యంత ప్రాధాన్యతా ఇవ్వండి’’అని సూచించారు. అంకుర సంస్థల వైపు మొగ్గుచూపొచ్చా? అని మరో విద్యార్థి అడగ్గా..‘‘ముందు అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఒక స్పష్టతకు రావాలి. ఇప్పటికే ఉన్న సాంకేతికతలో నూతన ఆవిష్కరణలు చేయదలిచారా? లేదంటే డ్రోన్లు, విద్యుత్ వ్యవస్థల వంటి వాటికి కొత్త పరిష్కారాలు వెతకాలనుకుంటున్నారా? దీంట్లో స్పష్టత వస్తే అంకురసంస్థను స్థాపించాలా వద్దా అనేది తేలిపోతుంది. ముందుగా సాంకేతికత లేదా ఆర్థిక రంగాలపై పట్టున్న స్నేహితులతో ఒక బృందంగా ఏర్పడండి. స్టార్టప్ను ఆరంభించడానికి వయసుతో పనేలేదు. నిజంగా మీకు దీనిపై ఉత్సుకత ఉంటే ఇప్పటికే ఉన్న అంకురసంస్థలను సందర్శించండి. మీకున్న పరిజ్ఞానంతో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ను సిద్ధంచేయండి. అది బాగుంటే అందరినోటా పడి చివరకు భారీ మద్దతు లభిస్తుంది. ఆర్థికసాయమూ అందుతుంది. తర్వాత ఎలా ముందుకెళ్లాలనేది నిర్ణయించుకోవచ్చు’’అని మోదీ సూచించారు. -
ప్రధాని మోదీతో సీషెల్స్ అధ్యక్షుడి భేటీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ( సోమవారం) హైదరాబాద్ హౌస్ లో సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మీనితో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం సీషెల్స్ అధ్యక్షుడు మోదీతో కలిసి రాజ్ ఘాట్ వద్ద మహత్మాగాంధీకి నివాళులర్పించారు.అంతకుముందు సీషెల్స్ అధ్యక్షుడితో భేటీ ఎంతో ఆనందంగా ఉందని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. సముద్ర పొరుగు దేశాలుగా, ఈ ప్రాంతంలో ఆర్థిక శ్రేయస్సు మరియు భద్రత కోసం విజన్ మహాసాగర్ ని విజయవంతం చేయడంతో ఆయన మద్దతు చాలా విలువైనదిగా భావిస్తున్నానని ఆయన తెలిపారు.ప్రస్తుతం సీషెల్స్ అధ్యక్షుడు భారత పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా చైన్నై, ముంబైలలో పర్యటించిన వివిధ పలువురు వ్యాపార వేత్తలతో సమావేశమయ్యారు. పరిశ్రమలు, కోస్టల్ మేనెజ్ మెంట్, ఆరోగ్యం తదితర రంగాలలో సహాకారాన్ని బలోపేతం చేయడానికి చర్చలు జరిపారు.కేంద్రమంత్రి శర్బానంద సోనోవాలాతో పాట్రిక్ హెర్మీని భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సముద్ర వాణిజ్యం తదితర అంశాలపై ఆయనతో చర్చించారు. భారత పర్యటన నిమిత్తం వచ్చిన పాట్రిక్ హెర్మీని ఫిబ్రవరి 10 వరకూ దేశంలో ఉండనున్నారు. ఇటీవల భారత్, సిీషెల్స్ ద్రైపాక్షిక సంబంధాలు ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయ్యాయి. -
ప్రధాని మోదీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. నిజమెంత?
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాను తలుచుకుంటే నరేంద్ర మోదీ రాజకీయ జీవితాన్ని అంతం చేయగలనని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు ఉన్న ఈ క్లిప్ భారతీయ నెటిజన్లలో తీవ్ర గందరగోళాన్ని, ఆందోళనను రేకెత్తించింది. ట్రంప్ రెండవమారు అధికారంలోకి వచ్చాక భారత్-అమెరికా సంబంధాల్లో ప్రతికూలతలు కనిపిస్తున్న తరుణంలో ఈ వైరల్ క్లిప్ దుమారం రేపుతోంది.అయితే ఈ వైరల్ వీడియో ప్రచారంలో వాస్తవం లేదని ‘ఫ్యాక్ట్ చెక్’ ద్వారా స్పష్టమైంది. ఈ వీడియో 2025 అక్టోబర్లో వైట్ హౌస్లో ట్రంప్ విలేకరులతో మాట్లాడిన సందర్భానికి సంబంధించినదని తేలింది. ఆ సమయంలో ఆయన మోదీని ప్రశంసిస్తూ, ఆయనపై తనకు ఉన్న గౌరవాన్ని చాటుకునేందుకు ప్రయత్నించారు. ప్రధాని మోదీకి తనపై ఎంతో ప్రేమ ఉందని చెబుతూ, ఆ ‘ప్రేమ’ అనే పదాన్ని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకూడదని ట్రంప్ చమత్కరించారు. ఆ సందర్భంలోనే ఆయన తాను ప్రధాని మోదీ రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం లేదంటూ సరదాగా వ్యాఖ్యానించారు. 🚨 Breaking NewsDonald Trump's statement is making headlines.“I could end Narendra Modi’s political career, but I don’t want to.”One Statement, Many Questions.Is this just a Political statement, or is there a Deeper Meaning Behind It?In Global Politics, Words Carry… pic.twitter.com/my42g7J6r2— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) February 8, 2026కొందరు సోషల్ మీడియా యూజర్స్ ట్రంప్ వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించి పోస్ట్ చేస్తున్నారు. ‘నేను మోదీ కెరీర్ను అంతం చేయగలను.. కానీ నాకు ఇష్టం లేదు’ అని ట్రంప్ బెదిరించినట్లుగా క్యాప్షన్లు పెట్టి షేర్ చేస్తున్నారు. కాగా అధికారిక వైట్ హౌస్ నివేదికలు గానీ, అంతర్జాతీయ మీడియా సంస్థలు గానీ ఇలాంటి హెచ్చరికలు వచ్చినట్లు తెలియజేయలేదు. అసలు క్లిప్లో ట్రంప్ ఎంతో స్నేహపూర్వకంగా మోదీని ‘గ్రేట్ మ్యాన్’ అని కొనియాడారు.కొందరు కేవలం ఒక చిన్న పదాన్ని పట్టుకుని, అప్పటి సందర్భాన్ని తొలగించి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని స్పష్టమయ్యింది. నాడు ట్రంప్ భారతదేశంపై, మోదీ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. భారతదేశాన్ని ఒక అద్భుతమైన దేశంగా అభివర్ణిస్తూ, గతంలో భారత్ పదే పదే నాయకత్వ మార్పులను చూసేదని, కానీ మోదీ వచ్చాక రాజకీయ స్థిరత్వం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. మోదీని కాలపరీక్షకు నిలబడిన నాయకుడు అని ట్రంప్ కొనియాడారు. ఇది కూడా చదవండి: ‘ఆ బిడ్డ నాది కాదు’.. తేజ్ ప్రతాప్ విలవిల -
‘పరీక్షలంటే ఒక ఉత్సవం’: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు(సోమవారం) ‘పరీక్షా పే చర్చా’ 2026 రెండో ఎపిసోడ్లో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు. పరీక్షల సమయంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని ఎలా అధిగమించాలి? బోర్డు, పోటీ పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో ఎలా సిద్ధం కావాలనే అంశాలపై ప్రధాని కీలక సూచనలు చేశారు. పరీక్షలను ఒక భయానక అంశంగా కాకుండా, ఒక ‘ఉత్సవం’లా జరుపుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, సానుకూల దృక్పథానికి ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం ఒక వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ చర్చా కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా చదువుతో పాటు కళలు, క్రాఫ్ట్స్ ఎలా కొనసాగించాలంటూ కోయంబత్తూరు విద్యార్థి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. చదువును, కళలను విడివిడిగా చూడవద్దని మోదీ సూచించారు. సైన్స్ ప్రయోగాలను బొమ్మల రూపంలో గీస్తూ, చదివితే సబ్జెక్టు సులభంగా అర్థమవుతుందని, రోజువారీ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు కళలు ఒక ఔషధంలా పనిచేస్తాయని ప్రధాని వివరించారు. స్టార్టప్లు ప్రారంభించాలనుకునే వారు కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా, పరిశ్రమ నిపుణులను కలిసి, వారు ఎలా పనిచేస్తారో క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని పిలుపునిచ్చారు.పరీక్షా పే చర్చా 2026 ఎడిషన్ గత రికార్డులను తిరగరాసింది. ఈ ఏడాది ఏకంగా 4.5 కోట్ల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఇతర అనుబంధ కార్యకలాపాలతో కలిపి మొత్తం 6.76 కోట్ల మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. 2023లో 38.8 లక్షలుగా ఉన్న రిజిస్ట్రేషన్లు, 2025 నాటికి 3.53 కోట్లకు చేరుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను సృష్టించగా, ఈ ఏడాది ఆ సంఖ్య మరింతగా పెరగడం గమనార్హం.దేశంలోని విభిన్న రాష్ట్రాల నుంచి విద్యార్థులు తమ అనుభవాలను పంచుకోవడానికి ఈ వేదిక దోహదపడింది. ఈ కార్యక్రమం దూరదర్శన్ నేషనల్, డీడీ న్యూస్, డీడీ ఇండియాతో పాటు ఆల్ ఇండియా రేడియో, పలు ప్రైవేట్ ఛానెల్స్లో ప్రత్యక్ష ప్రసారమైంది. అలాగే పీఎంఓ, విద్యా మంత్రిత్వ శాఖ వెబ్సైట్లు, యూట్యూబ్, ఫేస్బుక్ లైవ్ తదితర డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా కూడా లక్షలాది మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. -
ఐఎన్ఏ యోధుడితో ప్రధాని మోదీ భేటీ
కౌలాలంపూర్: ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఆజాద్ హింద్ ఫౌజ్)లో పనిచేసిన యోధుడు జయరాజ్ రాజారావును మలేషియా పర్యటనలో భాగంగా ఆదివారం ప్రధాని మోదీ కౌలాలంపూర్లో కలుసుకున్నారు. ఐఎన్ఏ శ్రేణులు ప్రదర్శించిన అసాధారణ ధైర్యసాహసాలు, వారి ఆశయాలు, త్యాగాలకు భారతీయులందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు. జయరాజ్ రాజా రావును కలుసుకోవడం ఎంతో ప్రత్యేకమని అనంతరం ప్రధాని మోదీ ఎక్స్లో పేర్కొన్నారు. ఆయనతో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కొనే క్రమంలో ఎదురైన అనుభవాలను ఆయన నుంచి తెలుసుకోవడం ఎంతో ప్రేరణ కలిగించిందన్నారు. జయరాజ్ రాజావుతోపాటు మరో వెటరన్ను కూడా ప్రధాని మోదీ కలుసుకున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. బ్రిటిషర్ల పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించడమే లక్ష్యంగా ఒకప్పుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఐఎన్ఏను స్థాపించడం తెల్సిందే. 1943 సెప్టెంబర్లో కౌలాలంపూర్లోని ఇండిపెండెన్స్ స్క్వేర్లో చేరిన వేలాది మంది అనుచరులనుద్దేశించి నేతాజీ చేసిన ప్రసంగం అనంతరకాలంలో ఎందరో యువత ఐఎన్ఏలో చేరేందుకు ప్రేరణగా నిలిచింది. అప్పట్లో మలేసియా, సింగపూర్ ప్రధాన కేంద్రాలుగా ఐఎన్ఏ కార్యకలాపాలు సాగాయి. -
ప్రగతి బాటలో కలిసి నడుద్దాం
కౌలాలంపూర్: ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, మలేషియా తీర్మానించుకున్నాయి. వాణిజ్యంలో అత్యధిక ప్రాధాన్య రంగాలతోపాటు పెట్టుబడులు, రక్షణ, ఇంధనం, తయారీ, సెమీకండక్టర్ల రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని, ప్రగతి బాటలో కలిసి నడవాలని నిర్ణయించాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం భారత్, మలేషియా కట్టుబడి ఉన్నట్లు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆయన ఆదివారం మలేషియా పరిపాలనా రాజధాని అయిన పుత్రజయలో మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో సమావేశమయ్యారు. ఇరుదేశాల సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా భారత్, మలేషియా మధ్య 11 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. సెమీకండక్లర్ట రంగంలో ఫ్రేమ్వర్క్ ఒప్పందంతోపాటు కీలక రంగాల్లో సహకారానికి సంబంధించిన ఒప్పందాలు ఇందులో ఉన్నాయి. భేటీ అనంతరం మోదీ, అన్వర్ ఇబ్రహీం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాదాన్ని వారిద్దరూ తీవ్రంగా ఖండించారు. మానవాళికి శత్రువుగా మారిన ఉగ్రవాద భూతాన్ని సమాధి చేయడానికి ప్రపంచదేశాలన్నీ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరాటంలో తన వైఖరిని కుండబద్ధలు కొట్టినట్లు మోదీ బహిర్గతం చేశారు. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు గానీ, రాజీపడడం గానీ ఉండబోదని స్పష్టంచేశారు. భారత్–మలేషియా మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉందని వివరించారు. ఇరుదేశాల ప్రజల మధ్య శతాబ్దాలుగా లోతైన, సౌహార్ధ సంబంధాలు ఉన్నట్లు గుర్తుచేశారు. వ్యూహాత్మక విశ్వాసంతో ఇరుదేశాల ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తున్నట్లు చెప్పారు. ‘అంతర్జాతీయ’ సంస్థల్లో సంస్కరణలు తప్పనిసరి మలేషియాలో భారత కాన్సులేట్ జనరల్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలియజేశారు. ఉగ్రవాదంపై పోరాటం, నిఘా సమాచారం పంచుకోవడం, మారిటైమ్ సెక్యూరిటీ విషయంలో మలేషియాతో సహకారాన్ని బలోపేతం చేసుకుంటామన్నారు. రక్షణ బంధాన్ని సైతం విస్తృతపర్చుకుంటామని వివరించారు. కృత్రిమ మేధ(ఏఐ), డిజిటల్ టెక్నాలజీతోపాటు సెమీకండక్టర్లు, ఆరోగ్యం, ఆహార భద్రతపై భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతం ప్రపంచానికి గ్రోత్ ఇంజన్గా ఎదుగుతోందని వెల్లడించారు. మలేషియా లాంటి మిత్రదేశాల అండతో ‘ఆసియాన్’ దేశాలతో సంబంధాలను మెరుగుపర్చుకుంటామని చెప్పారు. ఇండియా–ఆసియాన్ వాణిజ్య ఒప్పందాన్ని సమీక్షిస్తామని తెలిపారు. ఇండో–పసిఫిక్లో ఆసియాన్తో కలిసి అభివృద్ది, శాంతి, స్థిరత్వానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అన్వర్ ఇబ్రహీంతో అర్థవంతమైన చర్చ జరిగిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశి్చత పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్, మలేషియా మధ్య స్నేహసంబంధాలు పెరుగుతుండడం ఇరుదేశాలకు మేలు చేస్తుందని వెల్లడించారు. సవాళ్లను అధిగమించాలంటే అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు చేపట్టడం తప్పనిసరి అని తేల్చిచెప్పారు. భారత్–మలేషియా సంబంధాల విషయంలో అన్వర్ ఇబ్రహీం చక్కటి చొరవ చూపుతున్నారని కొనియాడారు. చరిత్రాత్మక నిర్ణయం: ఇబ్రహీం భారత్ అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని ఇబ్రహీం ప్రశంసించారు. భారత్తో భాగస్వామ్యం వల్ల తమకు ఎనలేని లబ్ధి చేకూరుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఇరుదేశాల వాణిజ్యాన్ని స్థానిక కరెన్సీల్లో నిర్వహించుకోవాలన్నది చరిత్రాత్మక నిర్ణయమన్నారు. ఐరాస భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి పూర్తి మద్దతు ప్రకటించారు.భారత సంతతి నేతలతో భేటీ మలేషియాలో భారత సంతతి మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, సెనేటర్లను ప్రధాని మోదీ కలుసుకున్నారు. రెండు దేశాల నడుమ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి వారు చేస్తున్న కృషిని ప్రశంసించారు. భారత్తో వారి భావోద్వేగ అనుబంధం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. భారత సంతతి వ్యక్తులు ప్రజా జీవితంలో సాధిస్తున్న విజయాలు గర్వకారణమని ఉద్ఘాటించారు. మలేషియాలో అభివృద్ధిలో చురుగ్గా పాలుపంచుకుంటున్నారని, దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. భారత్, మలేషియా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారని వివరించారు. భారత్ను అభివృద్ధి చేయడంలో మోదీ దార్శనికత, కార్యాచరణ స్ఫూర్తిదాయమని భారత సంతతి నేతలు పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలతో: ప్రధాని నరేంద్ర మోదీ మలేషియాలో నలుగురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. భారత అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములయ్యేందుకు వారు చూపుతున్న ఆసక్తిని ప్రశంసించారు. ఇంధన రంగంలో పునరుత్పాదక, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, ఎల్ఎన్జీ, పెట్రోకెమికల్స్లో భాగస్వామ్యంపై వారితో చర్చించారు. అలాగే భారత్, మలేషియాకు చెందిన పలు కంపెనీల సీఈఓలతోనూ మోదీ భేటీ అయ్యారు. అనంతరం రెండు రోజుల మలేషియా పర్యటన ముగించుకొని ఆదివారం స్వదేశం చేరుకున్నారు. -
పాక్కు పుతిన్ మెసేజ్..భారత్కు దూరం కానున్న రష్యా?
భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ రష్యాకు కోపం తెచ్చిందా?. భారత్కు ఎల్లవేళలా అపన్న హస్తం అందించే చిరకాల మిత్రుడు ఇప్పుడు ఇండియాకి దూరం కానున్నారా? ఈ రెండు దేశాల మధ్య డిస్టెన్స్ ఇప్పుడు మాస్కోని పాకిస్థాన్కు చేరువచేస్తుందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ని ఇంతకాలం పక్కకు పెట్టిన వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు ఆ దేశంలో బాంబు దాడి జరిగితే స్వయంగా స్పందించారు.రష్యా- భారత్ మైత్రి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. "రష్యా సుఖ-దుఃఖ కాలంలో భారత్కు సహాయకారిగా ఉండే గొప్ప మిత్రుడు" అని భారత ప్రధాని మోదీ అన్నారంటే ఇరుదేశాల మధ్య మైత్రి ఎంతగొప్పదో అర్థం చేసుకోవచ్చు. భారత్ సైతం రష్యాకు ఆపద సమయంలో ఆపన్న హస్తం అందించింది. ఈయూతో పాటు ఇతర దేశాలు రష్యాతో ఆర్థిక బంధాలు తెంచుకున్న సమయంలో అక్కడి నుంచి చమురు కొనుగోలు చేసి ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం అందించింది.అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఇంతకాలం చిరకాల మిత్రులుగా ఉన్న దేశాలను దూరం చేసేలా కనిపిస్తున్నాయి. ట్రంప్ ఇటీవల భారత్పై అధిక పన్నులు తగ్గించారు. ఫలితంగా భారత్ రష్యానుంచి చమురు కొనుగోలు చేయదని మాటిచ్చిందన్నారు. అయితే ఇక్కడ తుంటరి ట్రంప్ మాటలను నమ్మేవారు అధికంగా లేకున్నా.. ఇండియా ఈ వ్యాఖ్యలను ఖండించలేదు. పైగా ట్రంప్ని ప్రశంసిస్తూ మోదీ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై రష్యా సైతం సానుకూలంగా స్పందించింది. భారత్ ఎవరి నుంచైనా చమురు కొనుగోలు చేయచ్చని దానిలో పెద్ద ఆశ్చర్యమేమి లేదని తెలిపింది.ఇదిలా ఉండగా రష్యా పాక్తో దగ్గరయ్యే యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం రష్యా పాకిస్థాన్ను పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవల జరిగిన ఓ అంతర్జాతీయ సమావేశంలో సైతం పాక్ ప్రధాని షెహబాజ్, పుతిన్ కోసం 40 నిమిషాలు ఎదురుచూసి అసహనానికి గురయ్యారు. కాగా ఇప్పుడు రష్యా పాక్తో మైత్రికి చేయి చాపుతున్నట్లు సమాచారం. ఇటీవల ఇస్లామాబాద్లో బాంబుదాడి జరిగి 36 మంది మృతిచెందారు. దాని పట్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు, ప్రధానికి మెసేజ్ పెట్టారు.పుతిన్ మెసేజ్లో.. మతపరమైన వేడుకల్లో ప్రజలను చంపడం ఉగ్రవాదుల క్రూరమైన, అమానవీయమైన మనస్థత్వాన్ని తెలియజేస్తుందని అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహాబాజ్ షరీప్లకు సంతాప సందేశం పంపారు. అంతే కాకుండా భద్రత, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాక్తో కలిసి పనిచేయడానికి రష్యా సిద్ధంగా ఉంది అని తెలిపారు. దీంతో పాకిస్తాన్తో కలిసి పుతిన్ కొత్త కూటమి ఏర్పాటు చేసే అవకాశాలున్నాయా అని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే రష్యానుంచి చమురు కొనుగోలు భారత్ ఆపేసిందని ట్రంప్ ప్రకటనలపై భారత్ అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ నిజంగా అలా చేస్తే మాత్రం ఎల్లవేళలా అండగా ఉన్న గొప్పమిత్రున్ని భారత్ దూరం చేసుకున్నట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. -
‘ఉగ్రవాదంపై రాజీ లేదు.. ద్వంద్వ ప్రమాణాలకు తావు లేదు’
కౌలాలంపూర్: ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం మలేషియా పర్యటనలో ఉన్నారు. ఆదివారం ఆయన ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ‘పుత్రజయ’లో కీలక భేటీ నిర్వహించారు. రక్షణ, భద్రత, ఆర్థిక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అంతర్జాతీయ వేదికపై మరోసారి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు. ‘ఉగ్రవాదం విషయంలో మా సందేశం చాలా స్పష్టం.. ఇందులో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదు, రాజీ పడే ప్రసక్తే లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో ఇరు దేశాలు పరస్పరం సమాచారాన్ని పంచుకోవాలని, భద్రతా పరమైన సహకారాన్ని పెంచుకోవాలని అన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్గా మారుతున్నదని, ఆసియా దేశాల (ASEAN) సహకారంతో ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాల కోసం భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య ఉన్న సముద్ర తీర సంబంధాలను, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. భారత్ వెలుపల అత్యధికంగా భారత సంతతి ప్రజలు నివసిస్తున్న రెండో దేశం మలేషియా అని పేర్కొంటూ, ఇరు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని ఇరు దేశాల అధినేతలు నిర్ణయించారు. రక్షణ రంగంలో సహకారాన్ని కేవలం కొనుగోళ్లకే పరిమితం చేయకుండా, సమగ్రంగా మార్చాలని మోదీ పిలుపునిచ్చారు.సెమీకండక్టర్లు, ఆరోగ్యం, ఆహార భద్రత తదితర కీలక రంగాలలో సరికొత్త ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మాట్లాడుతూ.. వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ రంగాల్లో భారత్ సాధిస్తున్న వృద్ధిని అభినందించారు. శనివారం కౌలాలంపూర్ చేరుకున్న ప్రధాని మోదీకి మలేషియా ప్రభుత్వం అపూర్వ స్వాగతం పలికింది. విమానాశ్రయంలో ప్రధాని అన్వర్ ఇబ్రహీం స్వయంగా మోదీని ఆహ్వానించడం విశేషం. ఆదివారం ఉదయం పెర్దానా పుత్రలో ప్రధానికి ఘనంగా గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ హానర్) సమర్పించారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య నాగరికత, చారిత్రక,ప్రజల మధ్య ఉన్న సంబంధాలను మరింత దృఢ పరుస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. #WATCH | Kuala Lumpur, Malaysia: Prime Minister Narendra Modi says, "Yesterday, I also had the opportunity to meet with members of the diaspora with you. It was a very special experience, and I saw the personal respect and affection that the diaspora has for you, which was… https://t.co/Y1N6KORfGz pic.twitter.com/4gLdLyAcwB— ANI (@ANI) February 8, 2026 -
ఇది వంచనే: కాంగ్రెస్
న్యూఢిల్లీ: భారతీయ రైతులు, సూక్ష్మచిన్నమధ్యతరహా పరిశ్రమలు, ప్రజల ప్రయోజనాలను దారుణంగా దెబ్బతీసేలా మోదీ సర్కార్ ట్రంప్ ప్రభుత్వం ఎదుట సాగిలపడిందని కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. భారత్, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగ సారథి పవన్ ఖేడా శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘తాజాగా కుదిరింది ఎన్డీఏ ప్రభుత్వం, ట్రంప్ సర్కార్ల మధ్య వాణిజ్య ఒప్పందంగా లేదు. అగ్రరాజ్యం ముందు మోదీ ప్రభుత్వం ఒంగి సలామ్ చేసినట్లుగా ఉంది. ఈ ఒప్పందం అమలైతే అమెరికా నుంచి పెద్ద ఎత్తున అమెరికన్ ఉత్పత్తులు భారత్ను ముంచెత్తుతాయి. ఇవి మన రైతులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సాధారణ ప్రజానీకం ప్రయోజనాలను నాశనంచేస్తాయి. గత 75 ఏళ్లుగా భారత్ అవలంభిస్తున్న విధానాలను పూర్తిగా తుంగలో తొక్కి వంచనతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం అంటే ఇరుపక్షాలు సమస్థాయిలో సమావేశమై కుదుర్చుకునేది. అంతేగానీ నీ తలపై తుపాకీ గురిపెట్టి, బ్లాక్మెయిల్ చేసి కుదుర్చుకునేది ఒప్పందం అనిపించుకోదు. అది కేవలం సరెండర్ అవడం అవుతుంది. భారత ప్రధాని విదేశం ఎదుట లొంగిపోవడాన్ని కాంగ్రెస్ ఏమాత్రం సహించట్లేదు. ఇది నిజంగా దురదృష్టం’’అని ఖేడా వ్యాఖ్యానించారు. రైతన్నల వెన్ను విరిచారు ‘‘అమెరికా నుంచి విపరీతంగా సాగు సంబంధ ఉత్పత్తుల దిగుమతికి మోదీ సర్కార్ ఇప్పుడు అనుమతించింది. దీంతో ఇక్కడ రైతుల వెన్ను విరగనుంది. దీంతో భవిష్యత్తులో వ్యవసాయం అనేది కష్టాలపాలుకానుంది. ఈ ఒప్పందం భారత్లో వ్యవసాయాన్ని ఎంతగా నాశనం చేయనుందో త్వరలోనే కళ్లకుకడుతుంది. ఒప్పందం కారణంగా ఎన్ని రకాల ఉత్పత్తులు భారతీయ విపణికి విపరీతంగా పోటెత్తనున్నాయో వాణిజ్య మంత్రి పీయూశ్ గోయల్ చెప్పట్లేరు. దిగుమతి కాబోయే వస్తూత్పత్తుల జాబితాను ఆయన తెలివిగా దాచేశారు. ఏఏ ఉత్పత్తుల ధరలు తగ్గుతాయో అవి మాత్రమే ఘంటాపథంగా చెబుతున్నారు’’అని ఖేడా వెల్లడించారు. గోయల్నుద్దేశిస్తూ.. ‘‘మన రూపాయి భవితవ్యం, మన ఆర్థికవ్యవస్థ తాజా పరిస్థితి మీకు తెలుసా? ప్రస్తుతం అమెరికా నుంచి దిగుమతుల విలువ ఏటా 40 లేదా 42 బిలియన్ డాలర్లు ఉంటే ఇకపై ఏటా అది 100 బిలియన్ డాలర్లకు పెరిగిపోనుంది. అంతగా విదేశీమారకద్రవ్యాలను ఎక్కడి నుంచి తెచ్చి కడతాం?’’అని నిలదీశారు. హగ్లు, ఫొటోలు పనిచేయలేదు ‘‘ఏ దేశాధినేత, ప్రధాని, అగ్రనేతను కలిసినా మోదీ ఆలింగనం చేసుకుంటూ తెగ ఫొటోలు దిగుతారు. ఈ హగ్లు చేసుకునే హగ్లోమసీ, ఫొటోలు దిగే ఫొటో–ఆప్స్ ఏమాత్రం భారత అనుకూల ఒప్పందాన్ని సాకారంచేయలేదు. పేరుకే ఆయన నరేంద్ర మోదీ. పని మాత్రం సరెండ్ కావడం అంటూ ‘నామ్ నరేందర్, కామ్ సరెండర్’అని వ్యంగ్య వ్యాఖ్యలుచేశారు. ‘‘హౌడీ మోదీ నినాదం కంటే నమస్తే ట్రంప్ నినాదమే ఆధిపత్యం కనబర్చింది’’అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. ‘‘అమెరికన్ రైతులపై భారత్ దిగుమతి సుంకం ఎత్తేసింది. దీంతో వాళ్లు భారత్లోకి విపరీతంగా తమ సరుకులను దిగుమతిచేయడం ఖాయం’’అని జైరాం అన్నారు. -
నమ్మకమే బలమైన కరెన్సీ
కౌలాలంపూర్: అగ్రరాజ్యం అమెరికా మొదలు యురోపియన్ యూనియన్ దాకా ముఖ్యదేశాలు, కీలక కూటములతో భారత్ బలమైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం వెనుక అంతకంటే బలమైన విశ్వాసం దాగి ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మలేసియాలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా శనివారం కౌలాలంపూర్కు చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి భారతీయసంతతి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘బ్రిటన్, అమెరికా, ఆ్రస్టేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, న్యూజిలాండ్ మొదలు ఈయూదాకా అన్ని దేశాలు భారత్ను విశ్వసనీయమైన అభివృద్ధి భాగస్వామిగా చూశాయి. అందుకే భారత్తో ఒప్పందాలు చేసుకున్నాయి. ఇక్కడ భారత రూపాయి కంటే భారత్ అనే విశ్వసనీయతే బలమైన కరెన్సీగా ఎదిగింది. ఇక మలేసియా విషయానికొస్తే ఇక్కడ 30 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఈ లెక్కన అత్యధిక మంది భారతీయులున్న రెండో అతిపెద్ద దేశంగా మలేసియా అవతరించింది. ఇది ఇరుదేశవాసుల మదులను దోచుకుంటోంది. ఇదొక్కటే కాదు మలేసియాలో సర్వసాధారణంగా ఆరగించే రోటీ కనాయ్, మలబార్ పరోటా, కొబ్బరితోపాటు సుగంధ ద్రవ్యాలు, వేడివేడి తేహ్ టరీక్ టీ.. కౌలాలంపూర్లో అయినా కొచి్చలో అయినా ఒకేలా గుబాళిస్తాయి. తమిళనాడు మూలాలున్న వ్యక్తులు మలేసియాలో చాలా ఎక్కువగా ఉన్నారు’’అని అన్నారు. ప్రధానికి ఎంజీఆర్ పాటలంటే ఇష్టం ‘‘మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, నేనూ ఎప్పట్నుంచో మంచి స్నేహితులం. మలేసియా ప్రధాని పీఠంపై అధిరోహించకముందే ఈయన నాకు తెలుసు. ఈయనకు రాజకీయ చతురతే కాదు పాటలు పాడటంలోనూ ప్రావీణ్యం ఉంది. ఇటీవలే ఆయన ఓ పాట కూడా పాడారు. ఆయనకు తమిళ దిగ్గజం ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్) పాటలంటే ఎంతో ఇష్టం. భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు ఎస్.జైశంకర్, నిర్మలా సీతారామన్, ఎల్.మురుగన్ కూడా తమిళులే. మలేసియాలో శతాబ్దాలుగా తమిళులు స్థిరనివాసం ఏర్పర్చుకున్నారు. ఈ చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని మలయ విశ్వవిద్యాలయ తిరువల్లువార్ పీఠాన్ని ఇక్కడ ఏర్పాటుచేసుకోవడం మనకు గర్వకారణంగా ఉంది. ఈ ఏడాది తొలి విదేశీ పర్యటనను మలేసియాతో మొదలెట్టడం ఆనందంగా ఉంది. అంతర్జాతీయంగా భారత్ విజయం సాధించిందంటే మలేసియా సైతం గెలిచిట్లే. ఆ లెక్కన ఆసియా గెలుపొందినట్లే. ఇరుదేశాల అభివృద్ధి దిశాపదం ఇంపాక్ట్(ఇండియా మలేసియా పార్ట్నర్షిప్ ఫర్ అడ్వాన్సింగ్ కలెక్టివ్ ట్రాన్స్ఫార్మేషన్–ఐఎంపీఏసీటీ)’’అని మోదీ అభివరి్ణంచారు. మోదీకి ఘన స్వాగతం అంతకుముందు ఢిల్లీ నుంచి కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న ప్రధాని మోదీకి మలేసియా ప్రధాని ఇబ్రహీం ఘన స్వాగతం పలికారు. ఎర్రతివాచీ పరచి స్వయంగా ఎదురొచ్చి ఆలింగనం చేసుకున్నారు. -
మధ్యంతర ఒప్పందానికి సై
వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య పూర్తిస్థాయి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా మరో ముందడుగు పడింది. ఇరుదేశాల పారిశ్రామికవర్గాలు, ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులకు తీపి కబురు అందింది. భారత్, అమెరికాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్వర్క్ను ఖరారు చేసుకున్నాయి. ఈ మేరకు ఇరుదేశాలు శనివారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ప్రస్తుతం భారత ఉత్పత్తులపై 50 శాతం సుంకాలు వసూలు చేస్తుండగా.. మధ్యంతర ఒప్పందంలో భాగంగా వాటిని 18 శాతానికి తగ్గించినట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు గత ఏడాది ఆగస్టులో విధించిన 25 శాతం అదనపు సుంకాలను రద్దు చేసినట్లు వెల్లడించింది. సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. 25 శాతం అదనపు సుంకాలను శనివారం నుంచే రద్దు చేస్తున్నట్లు అమెరికా తేలి్చచెప్పింది. రష్యా నుంచి చమురు కొనడం ఆపేసి, అమెరికా నుంచి ఇంధన ఉత్పత్తులను భారత్ కొంటుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ప్రస్తావించారు. రాబోయే పదేళ్లలో అమెరికాతో రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి ఫ్రేమ్వర్క్కు కట్టుబడి ఉంటామని భారత్ అంగీకరించిందని పేర్కొన్నారు. వచ్చే నెలలో సంతకాలు! ఒప్పందంలో భాగంగా పలు ఉత్పత్తులు, వస్తువులపై సుంకాలు రద్దు చేయడం లేదా తగ్గించడం జరిగినట్లు ఉమ్మడి ప్రకటనలో ఇరుదేశాలు పేర్కొన్నాయి. తద్వారా రెండు దేశాల నడుమ ద్వైపాక్షిక వాణిజ్యం మరింత వృద్ధి చెందుతుందని, పరిశ్రమలకు, ప్రజలకు లబ్ధి చేకూరుతుందని తెలియజేశాయి. ఇది పరస్పరం ఇచి్చపుచ్చుకొనే, ఉమ్మడిగా ప్రయోజనం పొందే ఒప్పందమని అభివరి్ణంచాయి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో ఇది తొలిదశ అని ఉద్ఘాటించాయి. పూర్తిస్థాయి ఒప్పందంపై చర్చలను మరింత వేగవంతం చేస్తామని తెలిపాయి. మధ్యంతర ఒప్పందం వల్ల అమెరికాలో 30 ట్రిలియన్ డాలర్ల విలువైన మార్కెట్ భారత ఎగుమతిదారులకు అందుబాటులోకి వస్తుందని భారత ప్రభుత్వం ఆశాభావం వ్యక్తంచేసింది. మధ్యంతర ఒప్పందంపై వచ్చే నెల రెండో వారంలో సంతకాలు జరిగే అవకాశాలున్నాయి. ఈ ఒప్పందాన్ని చాలా వేగంగా అమల్లోకి తీసుకొస్తామని భారత్, అమెరికా ప్రకటించాయి. భారత్, రష్యాల చమురు వాణిజ్యంపై నిఘా అమెరికా ఆహార, వ్యవసాయ ఉత్పత్తులతోపాటు కొన్ని రకాల పారిశ్రామిక ఉత్పత్తులు, వస్తువులపై సుంకాలను రద్దు చేశామని, మరికొన్నింటిపై తగ్గించామని భారత ప్రభుత్వం వెల్లడించింది. పశువుల దాణాగా ఉపయోగించే ఎర్రజొన్నలు, ట్రీ నట్స్, శుద్ధి చేసిన పండ్లు, సోయాబీన్ ఆయిల్, వైన్, స్పిరిట్స్, మద్యం తయారీలో వాడే ధాన్యాల వంటివి ఇందులో ఉన్నట్లు పేర్కొంది. అమెరికా నుంచి వచ్చే ఐదేళ్లలో 500 బిలియన్ డాలర్ల విలువైన ఇంధన ఉత్పత్తులు, ఎయిర్క్రాఫ్ట్లు, విమాన విడిభాగాలు, అరుదైన లోహాలు, టెక్నాలజీ ఉత్పత్తులు, కోకింగ్ కోల్ వంటివి దిగుమతి చేసుకోబోతున్నట్లు స్పష్టంచేసింది. రష్యా నుంచి ప్రత్యక్ష లేదా పరోక్ష చమురు దిగుమతులను భారత్ నిలిపివేస్తుందని తాము ఆశిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. ఒకవేళ రష్యా నుంచి ఎప్పటిలాగే చమురు కొంటున్నట్లు తేలితే భారత్పై మరోసారి 25 శాతం అదనపు సుంకాలు విధించడంతోపాటు మరికొన్ని ఆంక్షలు ఉంటాయని కార్యనిర్వాహక ఉత్తర్వులో తేలి్చచెప్పడం గమనార్హం. భారత్, రష్యాల మధ్య చమురు వాణిజ్యంపై నిఘా వేస్తామని అమెరికా సర్కార్ వెల్లడించింది. అతిపెద్ద మార్కెట్ అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ అంబాసిడర్ జెమీసన్ గగ్రీర్ హర్షం వ్యక్తంచేశారు. రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య బంధం మరింత బలపడుతుందని చెప్పారు. అమెరికా ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుందని, దానివల్ల తమ పరిశ్రమలు, కారి్మకులకు మేలు జరుగుతుందని చెప్పారు. భారత్తో ఈ ఒప్పందం విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వం గత ఏడాది ఇండియాపై 25 శాతం సుంకాలతోపాటు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ప్రతీకారంగా 25 శాతం అదనపు సుంకాలు విధించింది. మొత్తం సుంకాలు 50 శాతానికి చేరుకోవడంతో భారత్కు ఇబ్బందులు ఎదురయ్యాయి. భారత ఎగుమతిదారులు నష్టాలు చవిచూశారు. భారత ఉత్పత్తులకు అతిపెద్ద మార్కెట్ అమెరికా. మధ్యంతర ఒప్పందంతో మొత్తం సుంకాలు ఏకంగా 18 శాతానికి దిగిరావడం భారీ ఊరటగా చెప్పుకోవచ్చు. భారత్ నుంచి వ్రస్తాలు, తోలు ఉత్పత్తులు, చెప్పులు, ప్లాస్టిక్, రబ్బర్, ఆర్గానిక్ రసాయనాలు, ఇంటి అలంకరణ సామగ్రి, కొన్ని రకాల యంత్రాలు, హస్త కళాకృతుల ఎగుమతులు ఇక ఊపందుకోనున్నాయి. భారత జనరిక్ ఫార్మాస్యూటికల్స్, రత్నాలు, వజ్రాలపై టారిఫ్లను రద్దు చేస్తామని అమెరికా తెలియజేసింది. మనకు భారీ ప్రయోజనం → 44 బిలియన్ డాలర్ల ఎగుమతులపై సున్నా సుంకాలు → కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం వల్ల మన దేశానికి భారీగా ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టంచేశారు. మన దేశం నుంచి 44 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తుల ఎగుమతులపై ఎలాంటి సుంకాలు ఉండవని తెలిపారు. సున్నా టారిఫ్లు అమలవుతాయని అన్నారు. శనివారం ఒప్పందం ఖరారైన తర్వాత పీయూష్ గోయల్ స్పందించారు. లేబర్ ఇంటెన్సివ్ రంగాలకు సంబంధించిన వ్రస్తాలు, తోలు, పాదరక్షలు, హస్త కళాకృతుల ఎగుమతులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని వెల్లడించారు. 2030 నాటికి అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పారదర్శకమైన, సమతూకంతో కూడిన ఒప్పందానికి వచ్చామని స్పష్టంచేశారు. మన జనరిక్ ఫార్మాస్యూటికల్స్, ఎయిర్క్రాఫ్ట్, ఆటో విడిభాగాలకు సైతం జీరో టారిఫ్ వర్తిస్తుందన్నారు. 30 ట్రిలియన్ డాలర్ల అమెరికా మార్కెట్ మనకు అందుబాటులోకి వస్తుందని వివరించారు. యువత, మహిళలు, నిపుణులకు అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయని స్పష్టంచేశారు. మనదేశంలో కొత్తగా లక్షలాది ఉద్యోగాలు వస్తాయన్నారు. మన రైతులు, మత్స్యకారుల ఉత్పత్తులకు మంచి ధరలు లభిస్తాయన్నారు. వస్త్రాలు, వజ్రాలు, రత్నాలు, యంత్ర విడిభాగాలు, బొమ్మలు, తోలు, పాదరక్షలు, హోమ్ డెకార్, స్మార్ట్ ఫోన్ల పరిశ్రమల వృద్ధికి చక్కటి అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులపై మనం సుంకాలు రద్దు చేయడం గానీ, తగ్గించడం గానీ చేయడం లేదని తేలి్చచెప్పారు. మన రైతాంగం ప్రయోజనాలు కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని పీయూష్ గోయల్ వివరించారు. మొత్తానికి మధ్యంతర ఒప్పందం వల్ల ‘మేక్ ఇన్ ఇండియా’కు మరింత ఊపు వస్తుందన్నారు. ముఖ్యాంశాలు → భారత ఉత్పత్తులపై సుంకాలు 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిపోతాయి. → భారత ఎగుమతిదారుల కోసం 30 ట్రిలియన్ డాలర్ల విలువైన అమెరికా మార్కెట్లోకి ద్వారాలు తెరుచుకుంటాయి. ప్రధానంగా భారత సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ), రైతులకు, మత్స్యకారులకు లాభం చేకూరుతుంది. → ఎగుమతులు పెరిగితే సహజంగానే పరిశ్రమల్లో ఉత్పత్తిని పెంచాల్సి ఉంటుంది. దానివల్ల యువతకు, మహిళలకు కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. → ఎగుమతులపై ఆధారపడిన భారత్లోని ముఖ్యమైన రంగాలకు మేలు జరుగుతుంది. → సెక్షన్ 232 కింద విమాన విడిభాగాలపై భారత్కు కొన్ని మినహాయింపులు ఇవ్వడానికి అమెరికా అంగీకరించింది. ఆటో విడిభాగాలపై టారిఫ్ రేట్ కోటా అమలు చేస్తామని తెలిపింది. → అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులపై సుంకాలు రద్దు చేసే ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం స్పష్టంచేసింది. తమ రైతుల ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీ పడబోమని ప్రకటించింది. → ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రభావితం చేసే నాన్–టారిఫ్ అవరోధాలను, డిజిటల్ ట్రేడ్ అవరోధాలను పరిష్కరించుకుంటామని భారత్, అమెరికా తెలిపాయి. → గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు సహా టెక్నాలజీ ఉత్పత్తుల వాణిజ్యాన్ని మరింత పెంచుకుంటామని వెల్లడించాయి. ఉమ్మడి టెక్నాలజీ సహకారాన్ని ముందుకు తీసుకెళ్తామని ఉద్ఘాటించాయి. అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు నో రిలీఫ్ తమ రైతుల ప్రయోజనాలు పణంగా పెట్టలేమని, అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులను తమ దేశంలోకి అనుమతించబోమని భారత్ తేల్చేసింది. అమెరికా నుంచి వచ్చే ఆయా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టంచేసింది. అమెరికా మొక్కజొన్న, గోధుమ, బియ్యం, సోయా, పౌల్ట్రీ, పాలు, చీజ్, ఇథనాల్, పొగాకు, కొన్ని రకాల కూరగాయాలు, మాంసంపై సుంకాలు యథాతథంగా వసూలు చేస్తామని, మినహాయింపులేవీ ఉండవని పేర్కొంది. భారత్లో కోట్లాది మంది రైతులు వ్యవసాయ, పాడి పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులే. అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులపై సుంకాలు తగ్గిస్తే అవి చౌకగా వచి్చపడే అవకాశం ఉంటుంది. దానివల్ల భారత రైతులు నష్టపోవడం ఖాయం. ఇతర దేశాలతో కుదుర్చుకునే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో మన రైతులు ప్రయోజనాల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం, పాడి రంగాలే వెన్నెముక అనడం అతిశయోక్తి కాదు.‘మేక్ ఇన్ ఇండియా’ బలోపేతం: మోదీన్యూఢిల్లీ: అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందంతో ‘మేక్ ఇన్ ఇండియా’ బలోపేతం కావడం తథ్యమని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఈ ఒప్పందంతో మనకు నూతన అవకాశాలు వస్తాయన్నారు. రైతులు, వ్యాపారవేత్తలకు మేలు జరుగుతుందని, యువతకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ఈ మేరకు మోదీ శనివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. భారత్, అమెరికాల మధ్య సంబంధాల బలోపేతం కోసం వ్యక్తిగతంగా చొరవ తీసుకుంటున్నందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు కృతజ్ఞతలు తెలియజేశారు. మధ్యంతర ఒప్పందం రెండు దేశాలకు ఒక గొప్ప శుభవార్త అని పేర్కొన్నారు. భారత్, అమెరికాల భాగస్వామ్యంలో లోతైన విశ్వాసానికి ఇదొక ప్రతీక అని అభివర్ణించారు. రాబోయే రోజుల్లో ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ భాగస్వామ్యం మరింత బలపడుతుందన్నారు. సప్లై చెయిన్లకు ప్రోత్సాహం లభిస్తుందని, ప్రపంచానికి సైతం ఆర్థికంగా మేలు జరుగుతుందని మోదీ వివరించారు. మన ప్రజల సాధికారత, దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇతర దేశాలతో ఒప్పందాలు, భాగస్వామ్యాలు కుదుర్చుకుంటున్నామని ఉద్ఘాటించారు. ఉమ్మడి ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. -
మలేషియాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
కౌలాలంపూర్: రెండు రోజుల పర్యటన నిమిత్తం.. ప్రధాని నరేంద్ర మోదీ మలేసియా రాజధాని కౌలాలంపూర్కు చేరుకున్నారు. ఆయనకు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం సాదర స్వాగతం పలికారు. ఇరు దేశాల జెండాలతో చిన్నారులు ప్రధాని మోదీకి అభివాదం చేశారు. అనంతరం, ఎయిర్ పోర్టు నుంచి మోదీ, అన్వర్ ఇబ్రహీం కలిసి ఒకే కారులో ప్రయాణించారు. కౌలాలంపూర్ లోని భారత సంతతి ప్రజలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయ నృత్యంతో మోదీకి ప్రవాస భారతీయులు స్వాగతం పలికారుకాగా, భారత్-మలేషియా మధ్య ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం' మరింత పటిష్టం చేయడమే ప్రధాని పర్యటన సాగుతోంది. రక్షణ, భద్రత, ఆర్థిక బంధాల బలోపేతంపై ఇరు దేశాల దృష్టి పెట్టారు. ఈ పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రక్షణ, భద్రత, ఆర్థిక, ఆవిష్కరణల రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.From airport to community meet: PM Modi shares car ride with Malaysia's PM Anwar, reflecting personal rapportRead @ANI Story | https://t.co/ZzlEW7jXby#PMModi #Malysia #bilatiralvisit #AnwarIbrahim pic.twitter.com/vgOnvrbQjd— ANI Digital (@ani_digital) February 7, 20262024లో ఇరు దేశాల మధ్య కుదిరిన 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయి పెంపు తర్వాత ప్రధాని మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. భారతీయ సంతతి ప్రజలు ఇరు దేశాల మధ్య 'సజీవ వారధి'గా నిలుస్తున్నారని, వారి చారిత్రక స్నేహానికి వారే బలమైన స్తంభాలని ప్రధాని మోదీ కొనియాడారు. -
రిటైర్మెంట్పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన 9వ ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ తన వయసు, పదవీ విరమణపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని.. గత ఏడాది సెప్టెంబర్లో తాను 75వ ఏట అడుగుపెట్టిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఒక ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు. తన పుట్టినరోజున ఒక నేత తనకు ఫోన్ చేసి ‘మీకు 75 ఏళ్లు నిండాయి కదా’.. అని అన్నారని, దానికి తాను స్పందిస్తూ ‘75 ఏళ్లు పూర్తి కాలేదు, ఇంకా 25 ఏళ్లు మిగిలే ఉన్నాయి’ అని బదులిచ్చినట్లు ప్రధాని తెలిపారు. గడిచిన కాలం కంటే, దేశం కోసం ఇంకా చేయాల్సిన పనులనే తాను లెక్కిస్తానని ప్రధాని మోదీ అన్నారు.బీజేపీలో 75 ఏళ్లు నిండిన నేతలు క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకోవాలనే అప్రకటిత నిబంధన గతంలో చర్చనీయాంశమైంది. ఇదే క్రమంలో మోదీ వయసుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గతంలో చేసిన వ్యాఖ్యలను శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ప్రస్తావిస్తూ, గతంలో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి సీనియర్లను ఇదే వయస్సు సాకుతో పక్కన పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత నాయకత్వానికి ఈ నిబంధన వర్తిస్తుందో లేదో చూడాలని ఆయన సవాల్ విసిరారు.ప్రధాని మోదీ నాయకత్వంపై బీజేపీ అగ్రనేతలు పూర్తి భరోసా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ రాజ్యాంగంలో ఎక్కడా 75 ఏళ్లకు రిటైర్ కావాలనే నిబంధన లేదని కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో కూడా ఎన్డీఏ తరఫున మోదీయే ప్రధాని అభ్యర్థిగా ఉంటారని వారు చెప్పారు. అటు మోహన్ భగవత్ సైతం తన వ్యాఖ్యలను వివరణ ఇస్తూ, తాను ఎవరినీ రిటైర్ కావాలని సూచించలేదని, కేవలం ఒక సందర్భాన్ని మాత్రమే ప్రస్తావించానని క్లారిటీ ఇచ్చారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి (2047), దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తన ఏకైక లక్ష్యమని ప్రధాని మోదీ గతంలో స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: మలేషియా పర్యటనకు ప్రధాని మోదీ -
మలేషియా పర్యటనకు ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు (శనివారం) తన రెండు రోజుల మలేషియా పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ కానున్నారు. రక్షణ, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సంస్కృతి, పర్యాటక రంగాలలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఈ పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘రక్షణ, భద్రతా సంబంధాలను మరింతగా పటిష్టం చేసుకోవడమే మా లక్ష్యం. ఆర్థిక, ఆవిష్కరణల భాగస్వామ్యాన్ని పెంపొందించుకుంటూ, నూతన రంగాలలో మా సహకారాన్ని విస్తరిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వంటి ఆధునిక అంశాల్లో కూడా మలేషియాతో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆ ప్రకటనలో తెలిపారు.#WATCH | PM Narendra Modi departs for Kuala Lumpur, Malaysia, for a two-day visit.Source: DD pic.twitter.com/qn2As5M9NK— ANI (@ANI) February 7, 2026మలేషియా అభివృద్ధిలో అక్కడి భారతీయ సంతతి పోషిస్తున్న పాత్రను ప్రధాని మోదీ కొనియాడారు. మలేషియాలోని భారతీయులను కలుసుకోనున్నానని తెలిపారు. మలేషియా పురోగతికి వారి అపారమైన కృషి ఉందన్నారు. ఈ రెండు దేశాల మధ్య ఒక సజీవ వంతెనలా వారు పోషిస్తున్న పాత్ర, చారిత్రక స్నేహానికి బలమైన పునాదిని అందిస్తోందని మోదీ ప్రశంసించారు.ఇది కూడా చదవండి: ‘మేక్ ఇన్ ఇండియా’కు గ్లోబల్ బూస్ట్: ప్రధాని మోదీ -
‘మేక్ ఇన్ ఇండియా’కు గ్లోబల్ బూస్ట్: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారతదేశం- అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పంద ముసాయిదాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. శనివారం న్యూఢిల్లీలో ఈ కీలక పరిణామాన్ని ప్రకటించిన ఆయన ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర విశ్వాసానికి, బంధానికి ప్రగతికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూపిస్తున్న చొరవను, నిబద్ధతను మోదీ ఈ సందర్భంగా కొనియాడారు.ఈ వాణిజ్య ఒప్పందం భారతీయ ఆర్థిక వ్యవస్థకు, ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదానికి మరింత ఊతాన్నిస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తులకు మెరుగైన అవకాశాలు లభించడంతో స్థానిక పరిశ్రమలు ప్రపంచ స్థాయికి ఎదుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. దేశీయంగా తయారయ్యే వస్తువులకు అంతర్జాతీయ గుర్తింపు లభించడమే కాకుండా, విదేశీ ఎగుమతులు పెరుగుతాయన్నారు. ఈ నూతన ఒప్పందం ద్వారా రైతులకు, పారిశ్రామికవేత్తలకు, స్టార్టప్ ఆవిష్కర్తలకు భారీ ప్రయోజనం చేకూరనుందని ప్రధాని పేర్కొన్నారు. Great news for India and USA! We have agreed on a framework for an Interim Trade Agreement between our two great nations. I thank President Trump for his personal commitment to robust ties between our countries.This framework reflects the growing depth, trust and dynamism of… https://t.co/zs1ZLzamhd— Narendra Modi (@narendramodi) February 7, 2026అమెరికాతో సులభతర వాణిజ్యం వల్ల గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థలు బలోపేతం కావడమే కాకుండా, చిన్న తరహా పరిశ్రమలు తమ సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ఒప్పందం కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాకుండా, దేశంలో భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. ప్రధానంగా దేశంలోని యువతకు, మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి మార్గాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక పాత్ర పోషించేందుకు దోహదపడుతుందని అన్నారు. ఇది చారిత్రక ఒప్పందం: పీయూష్ గోయల్భారతదేశం- అమెరికా మధ్య కుదిరిన తాజా మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల ఆర్థిక సంబంధాల్లో మైలురాయిగా నిలవనుందని, ప్రధాని నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలితంగా ఈ ఒప్పంద ముసాయిదా ఖరారైనట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతిదారులకు అంతర్జాతీయ స్థాయిలో అపారమైన అవకాశాలు లభించనున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
భారత్, అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు
-
బదులిచ్చే ధైర్యం ప్రధానికి లేదు: ఖర్గే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుక్రవారం విమర్శలు గుప్పించారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ప్రధానికి లేదన్నారు. ప్రభుత్వం సభను ప్రజాస్వామ్య పద్ధతిలో నడపాలనుకోవడం లేదని ఆరోపించారు. పదేపదే అబద్ధాలు చెప్పడమే మోదీ పని అని ఆరోపించారు. ‘‘రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై మోదీ తన 97 నిమిషాల ప్రసంగంలో ముఖ్యమైన, అవసరమైన విషయం ఒక్కటీ చెప్పలేదు. ఇంకా వందేళ్లు, 75 ఏళ్లు, 50 ఏళ్ల కిందటి సంగతులే మాట్లాడుతున్నారు’’ అని ఎద్దేవా చేశారు. ‘‘లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తావించిన ఆర్మీ మాజీ చీఫ్ నరవణే పుస్తకం ఇంకా ప్రచురణ కాలేదని అధికార పక్షం పార్లమెంటులో చెబుతోంది. తాము ఆ పుస్తకాన్ని బాహాటంగా చూపినా వారికి అర్థం కావడం లేదు. ముందుగా వాస్తవాలను శ్రద్ధగా విని, ఆపై సమాధానం చెప్పాలి’’ అని ఖర్గే అన్నారు. రాహుల్, కేంద్ర మంత్రి రవ్నీత్ బిట్టూ్ట వివాదంపైనా ఆయన స్పందించారు. సభ బయట ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణను సిక్కులకు జరిగిన అవమానంగా ముద్ర వేశారని మండిపడ్డారు. ‘‘సిక్కులను కాంగ్రెస్ పార్టీ ఎంతో గౌరవిస్తుంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, తర్వాత ప్రధానిగా పనిచేశారు’’ అని గుర్తు చేశారు. సిక్కులను, దళితులను, ఆదివాసీలను ఎవరినీ గౌరవించే అలవాటు లేనిది బీజేపీకేనన్నారు. ఇతరు లను ఎలా కించపరచాలా అనే మోదీ ఆలోచిస్తారని ఖర్గే ఆరోపించారు. ‘‘దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించిందే తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. కానీ మోదీ మాత్రం వాటిని దివాలా తీసే కర్మాగారాలు అని పిలుస్తూ నెహ్రూపై విమర్శలు చేస్తున్నారు. దేశాన్ని నడిపే దార్శనికత మోదీకి లేదు’’ అన్నారు. రాహుల్ ఏం ప్రశ్నలు అడుగుతారో, ఎలాంటి వాస్తవాలు బయటపెడతా రోనని మోదీ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘‘లోక్సభలో మోదీపై దాడి జరుగుతుందని నిఘా సమాచారముందని చెబుతున్నారు. అంత గొప్ప ఇంటలిజెన్స్ పుల్వామా వంటి ఉగ్ర దాడుల సమయంలో ఏమైంది?’’ అని ఖర్గే ప్రశ్నించారు. ‘‘ఎప్స్టీన్ ఫైల్స్ బయటపడ్డ తరవాత మోదీ ఆందోళనగా ఉన్నారు. అందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు లొంగిపోయి ఆ దేశంతో ఏకపక్ష వాణిజ్య ఒప్పందం కుదుర్చు కున్నారు. తద్వారా మన దేశ రైతులను బలిపశు వులను చేశారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విద్య.. మోయలేని భారం కాదు
న్యూఢిల్లీ: విద్యాభ్యాసం అంటే మోయలేని భారంగా భావించొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. కేవలం మార్కులపైనే కాకుండా జీవితాన్ని మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఇతరులు చెప్పేది వినాలని.. చివరకు మన జీవితానికి సంబంధించిన నిర్ణయం మనమే తీసుకోవాలని పేర్కొన్నారు. మారాలన్న బలమైన సంకల్పం ఉన్నప్పుడే మన జీవన విధానం మారుతుందని స్పష్టంచేశారు. పరీక్షలు వస్తున్నాయంటే భయపడాల్సిన పని లేదని, పరీక్షలను పండుగలా భావిస్తూ ఆనందంగా జరుపుకోవాలని వెల్లడించారు. ‘ప్రధానమంత్రితో పరీక్షా పే చర్చ–2026’కార్యక్రమంలో భాగంగా దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి వచి్చన పాఠశాల విద్యార్థులతో మోదీ ఢిల్లీలోని తన నివాసంలో సమావేశమయ్యారు. త్వరలో పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు విలువైన సూచనలు చేశారు. ఒత్తిడిని జయించి, పరీక్షలకు హాజరైతే విజయం సొంతమవుతుందని అన్నారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ వీడియోను మోదీ శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. పరీక్షలను పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడంపై విద్యార్థులతో చక్కటి చర్చ జరిగిందని వివరించారు. ఈ వీడియోను అందరూ తిలకించాలని కోరారు. పరీక్షా పే చర్చలో ప్రధానమంత్రి ఏం చెప్పారంటే. మనపై మనకు విశ్వాసం ఉండాలి ‘‘కంఫర్ట్ జోన్లో ఉండిపోతే జీవితం మారదు. అందుకోసం జీవన విధానం మార్చుకోవాలి. విద్యను భారంగా భావించకుండా అందులో పూర్తిగా నిమగ్నం కావాలి. అరకొరగా చదివితే ఉపయోగం ఉండదు. కేవలం మార్కులే పరమావధిగా భావించకుండా జీవితంపైనా దృష్టి పెట్టాలి. తల్లిదండ్రులు, టీచర్లు, మిత్రులు ఏం చెప్పారన్నది కాకుండా మనపై మనకు విశ్వాసం ఉండాలి. ఇతరులు చెప్పేది మనసులో పెట్టుకోవాలి. మన జీవితాన్ని మార్చే నిర్ణయం మనమే తీసుకోవాలి. ఆశించిన లక్ష్యం సమీపంలోనే ఉంటుంది. కానీ, దాన్ని అందుకోవాలంటే కష్టపడాలి. మనసును అదుపులో పెట్టుకొని చదివితే అనుకున్నది సాధించడం సులభమే. మార్కుల కోసం ఎక్కువ ఆరాట పడొద్దు. గత ఏడాది బోర్డు పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థి పేరు ఎవరికైనా గుర్తుందా? చాలావరకు గుర్తుండదు. అలాంటి విద్యార్థిని కొద్దిసేపు ప్రశంసిస్తాం, తర్వాత మర్చిపోతాం. అందుకే పరీక్షల్లో మార్కులే ముఖ్యమని భావించడానికి వీల్లేదు. చదువులో సొంత విధానం ఉండాలి విద్యార్థుల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. చదువు విషయంలో ఒత్తిడి చేస్తుంటారు. చదివే విధానం గురించి తల్లిదండ్రులు ఒకలా, టీచర్లు మరొకలా చెబుతుంటారు. విద్యార్థులు ఇంకోలా భావిస్తుంటారు. మొత్తానికి వారిలో గందరగోళం ఏర్పడుతుంది. ఏది సరైందో నిర్ణయించుకోలేరు. ఒక ఇంటిలో తోబుట్టువుల్లోనే ఎన్నో వ్యత్యాసాలు ఉంటాయి. ఎవరి సొంత విధానం వారికే ఉంటుంది. అందుకే చదువు విషయంలో మీకు ఏది నచి్చతే అదే చేయండి. కొందరు రాత్రిపూట చదువుకోవడానికి, మరికొందరు ఉదయం పూట చదువుకోవడానికి ఇష్టపడుతుంటారు. మీకు ఎప్పుడు చదుకోవడం వెసులుబాటుగా ఉంటుందో అప్పుడే చదువుకోండి. సొంత విధానాన్ని నమ్ముకోవాలి. ఇతరుల సూచనలు జాగ్రత్తగా వింటూ.. సొంత అనుభవాల ద్వారా ఆ విధానంలో మార్పులు చేసుకోవచ్చు. ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా అనుసరించాల్సిన పనిలేదు. నేను ‘పరీక్షా పే చర్చ’ను ప్రారంభించినప్పుడు కొన్నాళ్లు ఒకేలాగా కొనసాగింది. తర్వాత మెరుగుపర్చాం. వేర్వేరు రాష్ట్రాల్లో సెషన్లు నిర్వహించాం. మూలానికి కట్టుబడి ఉంటూనే ఫార్మాట్ మార్చాం. జరిగిపోయిన దాని గురించి ఎందుకు? విద్యార్థులు గతాన్ని తవ్వుకుంటూ సమయం వృథా చేయొద్దు. భవిష్యత్తు గురించి ఆలోచించాలి. జరిగిపోయిన దాని గురించి నేను అంతగా పట్టించుకోను. ఇకపై ఏం జరగబోతోందో దానిపైనే నా దృష్టి ఉంటుంది. పరీక్షల్లో రాబోయే ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాలు మాత్రమే టీచర్లు బోధించే విధానం గతంలో ఉండేది. పరీక్షల్లో మంచి మార్కుల కోసం అలా చేసేవారు. నిజానికి ఒక మంచి టీచర్ జీవితానికి పనికొచ్చే అన్ని అంశాలూ బోధిస్తాడు. విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తాడు. జీవితం అంటే పరీక్షలు ఒక్కటే కాదు, జీవితంలో పైకి ఎదగడానికి విద్య ఒక సాధనం. నేను ప్రధానమంత్రిని అయ్యాను. విభిన్నంగా పనిచేయండి అని ప్రజలు చెబుతుంటారు. మీరు కూడా విభిన్నంగా చదవడం ప్రయత్నించండి. ఇంటర్నెట్పై సమయం వృథా చేయొద్దు ఇంటర్నెట్లో గేమింగ్లు పక్కనపెట్టి చదువుపైనే దృష్టి పెట్టాలంటూ విద్యార్థులపై సమాజం నుంచి ఒత్తిడి ఉన్నమాట నిజమే. గేమింగ్ అంటే ఒక అభిరుచి మాత్రమే కాదు.. అదొక నైపుణ్యం. అందులో రాణించాలంటే వేగం, అప్రమత్తత అవసరం. సెల్ఫ్ డెవలప్మెంట్కు గేమింగ్ తోడ్పడుతుంది. నాణ్యమైన గేమ్ల్లో అనుభవం పెంచుకోండి. అదేసమయంలో చదువును నిర్లక్ష్యం చేయొద్దు. గేమింగ్లో జూదానికి దూరంగా ఉండాలి. జూదాన్ని అరికట్టే చట్టాలు మనదేశంలో ఉన్నాయి. ఆన్లైన్ బెట్టింగ్లు చాలా ప్రమాదకరం. దేశంలో ఇంటర్నెట్ చౌకగా దొరుకుతోంది కదా అని దానిపైనే సమయం వృథా చేయకండి. నిర్మాణాత్మక నైపుణ్యాలు పెంచుకోవడం కోసం గేమ్లు ఆడొచ్చు. భారతీయ సంస్కృతి, పురాణ గాథలతో ముడిపడి ఉన్న స్టోరీ టెల్లింగ్ గేమ్లను అభివృద్ధి చేయండి. వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటే చక్కటి గుర్తింపు లభిస్తుంది. అప్పుడు తల్లిదండ్రులు సంతోషిస్తారు. మరింత ప్రోత్సహిస్తారు. కొత్త ఐడియాలు ఇస్తారు. పంచతంత్ర కథల ఆధారంగా గేమ్ను అభివృద్ధి చేయొచ్చు. మీరు క్రియేటర్గా మారండి. సొంతంగా సోషల్ మీడియా పేజీ ప్రారంభించండి. విద్యార్థి ఒక అడుగు ముందే ఉండాలి విద్యార్థి వేగం ఎల్లప్పుడూ టీచర్ వేగం కంటే ఎక్కువే ఉండాలి. అలా ఉండేలా చూసే బాధ్యత టీచర్లదే. అంటే టీచర్ కంటే విద్యార్థి ఒక అడుగు ముందే ఉండాలి. విద్యార్జనలో సమతూకం ఉండేలా జాగ్రత్తపడాలి. చదువుతోపాటు విశ్రాంతి, నైపుణ్యాలు, అభిరుచులకు ప్రాధాన్యం ఇవ్వాలి. లైఫ్ స్కిల్స్, ప్రొఫెషనల్ స్కిల్స్ అని రెండు రకాల నైపుణ్యాలు ఉంటాయి. ఆ రెండింటినీ విడదీసి చూడలేం. కేవలం ఒకదానివైపే మొగ్గు చూపితే జీవితంలో విఫలమవుతారు. రెండు రకాల నైపుణ్యాలూ సమానమే’’అని ప్రధాని మోదీ వివరించారు. గిన్నిస్ రికార్డుకెక్కిన చర్చ ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ‘పరీక్షా పే చర్చ’2018లో ప్రారంభమైంది. ప్రతిఏటా ఆయన విద్యార్థులతో సంభాషిస్తున్నారు. వార్షిక పరీక్షల ముందు వారిలో ఆత్మస్థైర్యం నింపుతున్నారు. పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇది దేశంలో అతిపెద్ద విద్యా కార్యక్రమాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. పరీక్షా పే చర్చలో పాల్గొనడం కోసం 2023లో 38.8 లక్షల మంది విద్యార్థులు రిజి్రస్టేషన్ చేసుకోగా, 2025లో ఆ సంఖ్య 3.53 కోట్లకు చేరింది. ఈ ఏడాది 4.5 కోట్ల మంది రిజి్రస్టేషన్ చేసుకున్నారు. ఈ కార్యక్రమం ఇప్పటికే గిన్నిస్ బుక్ రికార్డుకెక్కింది. ఇంకా 25 ఏళ్లు ఉన్నాయి పరీక్షా పే చర్చలో విద్యార్థులతో మోదీ ఒక ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు. గత ఏడాది సెపె్టంబర్ 17వ తేదీన ఆయన 75వ జన్మదినం జరిగింది. ఈ సందర్భంగా ఓ నాయకుడు ప్రధానమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మీకు 75 ఏళ్లు వచ్చాయంటూ గుర్తుచేశారు. మోదీ బదులిస్తూ.. 75 ఏళ్లు రావడం కాదు, ఇంకా 25 ఏళ్లు ఉన్నాయని చెప్పారు. మణిపూర్ సైనిక్ స్కూల్ నుంచి వచ్చిన ఇమోటా కె.శ్యామ్ అనే విద్యార్థి మోదీతో మాట్లాడాడు. చిన్నప్పటి నుంచి మీరంటే ఎంతో స్ఫూర్తి అని అన్నాడు. తన పుట్టినరోజు గురించి తెలిపాడు. మోదీ స్పందిస్తూ... ‘జరిగిపోయినదాన్ని నేను లెక్కపెట్టను. జరగబోయేది మాత్రమే లెక్కిస్తా. మీకు నేను చెప్పేది ఒక్కటే. పాత విషయాల గురించి ఆలోచిస్తూ టైమ్ వేస్టు చేసుకోకండి. జరగబోయేదే ఆలోచించండి. మిగిలిన జీవితం ఎలా జీవించాలో యోచించండి’’అని సూచించారు. -
ఆరోసారి భారత్కు ప్రపంచకప్.. ప్రధాని మోదీ ప్రశంసలు
కుర్రాళ్లు కుమ్మేశారు. ఏకంగా ఆరోసారి అండర్-19 ప్రపంచకప్ విజేతగా టీమిండియా నిలిచింది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా శుక్రవారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ని 100 పరుగుల తేడాతో యువ భారత్ ఓడించింది. అలా ఆరో వరల్డ్కప్ని టైటిల్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ.. యువ జట్టుని అభినందిస్తూ ట్వీట్ చేశారు.'భారత క్రికెట్ ప్రతిభ మెరిసింది. మన అండర్-19 జట్టు ప్రపంచకప్ సాధించినందుకు గర్వంగా ఉంది. టోర్నీ ఆసాంతం అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలానే ఆకట్టుకునే ప్రతిభ చూపించింది. ఈ విజయం చాలామంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం. గెలిచిన ఆటగాళ్లకు నా అభినందనలు' అని మోదీ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా యువ టీమిండియాని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో ఇంగ్లండ్ కష్టపడినప్పటికీ 311 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. గతంలో 2000, 2008, 2012, 2018, 2022లో వరల్డ్కప్ సొంతం చేసుకుంది.టీమిండియా యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ.. ఈ టోర్నీ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే ఇన్నింగ్స్.. ఫైనల్లో ఆడాడు. 14 ఏళ్ల వైభవ్.. తన బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 80 బంతుల్లో 175 పరుగులు (15 ఫోర్లు, 15 సిక్సర్లు) చేసి ఫైనల్ మ్యాచ్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. India’s cricketing talent shines! Proud of our U-19 team for bringing home the World Cup. The team has played very well through the tournament, showcasing exceptional skill. This win will inspire several young sportspersons too. Best wishes to the players for their upcoming…— Narendra Modi (@narendramodi) February 6, 2026 -
ఓం బిర్లా చెప్పిందంతా పచ్చి అబద్ధం
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సభకు రాకుండా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెనుక దాక్కున్నారని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ వాద్రా ధ్వజమెత్తారు. మోదీ సభకు వస్తే కాంగ్రెస్ ఎంపీలు దాడి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందిందని, అందుకే రావొద్దని చెప్పానంటూ బిర్లా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బిర్లా చెప్పిందంతా పచ్చి అబద్ధమని మండిపడ్డారు. గురువారం లోక్సభ వాయిదా పడిన తర్వాత ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడారు. సభకు వచ్చి విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ప్రధాని మోదీకి ఎంతమాత్రం లేదన్నారు. అందుకే స్పీకర్తో అబద్ధాలు చెప్పిస్తున్నారని విమర్శించారు. సభలో మోదీపై దాడి చేయాలన్న ఆలోచన ఎవరికీ లేదని స్పష్టంచేశారు. మోదీపై చేతులెత్తే ప్రసక్తే లేదన్నారు. లేని ఆలోచన ఉన్నట్లు కల్పించవద్దని సూచించారు. బుధవారం లోక్సభలో ప్రధానమంత్రి స్థానం వద్ద ముగ్గురు మహిళా ఎంపీలు నిల్చున్నారని, అంతకు మించి ఏమీ జరగలేదని ప్రియాంక గాంధీ తేలి్చచెప్పారు. సభలో ఏదైనా మాట్లాడేందుకు అధికారపక్ష ఎంపీలకు స్పీకర్ అనుమతి ఇస్తున్నారని విమర్శించారు. తమను మాత్రం మాట్లాడనివ్వడం లేదన్నారు. ప్రతిపక్షాలను ఎందుకు మాట్లానివ్వడం లేదో మోదీని, అమిత్ షాను అడగాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీని సైతం అనుమతించడం లేదని ఆమె ఆక్షేపించారు. -
ప్రధాని సమాధానం లేకుండానే.. లోక్సభలో తీర్మానం ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభ ఆమోదం తెలిపింది. పార్లమెంట్ చరిత్రలో గత 22 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ప్రధాని మోదీ బుధవారమే సమాధానం ఇస్తారని భావించినప్పటికీ, నినాదాలు, నిరసనల కారణంగా సభ గురువారానికి వాయిదా పడిన విషయం తెల్సిందే. గురువారం ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభమైన సభ కూడా కొద్దిసేపటికే వాయిదా పడింది. తిరిగి 12 గంటలకు సభ ఆరంభమయ్యాక సైతం ప్రధాని మోదీతో పాటు కేంద్రప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఇండియా కూటమి ఎంపీలు నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాం«దీకి మాట్లాడే అవకాశం నిరాకరించారంటూ ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘నరేంద్ర–సరెండర్’ అంటూ ప్రధాని మోదీ వ్యతిరేక నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ వెల్లోకి వెళ్లారు. కాశీలో మణికరి్ణక ఘాట్ వ్యవహారంపై బ్యానర్లు ప్రదర్శిస్తూ సమాజ్వాదీ పార్టీ సభ్యులు.. టీఎంసీ, ఇతర ఇండియా కూటమి సభ్యులు కూడా వారికి జత కలిశారు. ఈ గందరగోళం మధ్యే జనవరి 28న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని స్పీకర్ సభలో చదివి వినిపించారు. ఆ తీర్మానాన్ని మూజువాణి ఓటు ద్వారా సభ ఆమోదించింది. తీర్మానానికి ప్రతిపక్షాలు చేసిన సవరణలను స్పీకర్ తిరస్కరించారు. -
రాష్ట్రపతిని కించపర్చారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో వరుస పరాజయాలను ఆ పార్టీ జీరి్ణంచుకోలేకపోతోందని అన్నారు. తనపై ఎంత విద్వేషం గుమ్మరించినా తనను సమాధి చేయడం కాంగ్రెస్ పార్టీ తరం కాదని తేలి్చచెప్పారు. గురువారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ సమాధానమిచ్చారు. దాదాపు 100 నిమిషాలపాటు సుదీర్ఘంగా మాట్లాడారు. పలు అంశాలను ప్రస్తావించారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించడం పట్ల విచారం వ్యక్తంచేశారు. అత్యున్నత రాష్ట్రపతి పదవిలో ఉన్న పేద గిరిజన మహిళను, రాజ్యాంగబద్ధమైన పదవిని, భారత రాజ్యాంగాన్ని ఆ పార్టీ కించపర్చిందని మండిపడ్డారు. దళితులను, గిరిజనులను, ఈశాన్య రాష్ట్రాల ప్రజలను కూడా కించపర్చిందని ఆక్షేపించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి రవనీత్సింగ్ బిట్టూను ద్రోహి అని నిందించడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చొరబాటుదార్లను నిస్సిగ్గుగా కాపాడుతోందని మండిపడ్డారు. ‘ప్రేమ దుకాణం’ అంటూ కల్ల»ొల్లి కబుర్లు చెప్పే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మోదీ.. తేరీ ఖబర్ ఖుదేగీ(మోదీ.. నీ సమాధి తవ్వుతాం) అంటూ నినాదాలు చేస్తోందని ధ్వజమెత్తారు. అది వారి తరం కాదని అన్నారు. పేద కుటుంబంలో జని్మంచిన తాను ఉన్నత స్థానానికి చేరుకోవడం, ఈ పదవి ఇంకా కొనసాగుతుండడం చూసి కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని, అందుకే నిత్యం తనను దూషిస్తోందని విమర్శించారు. ప్రధానమంత్రి పదవిని వారి కుటుంబ హక్కుగా భావిస్తున్నారని సోనియా గాంధీ కుటుంబంపై మండిపడ్డారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... ప్రతిపక్షాల వల్లే లోక్సభకు వెళ్లలేకపోయా.. ‘‘దేశంలో కోట్లాది మంది తల్లులు, సోదరీమణులు, పేదల ఆశీస్సులు నాకున్నాయి. వారి సంక్షేమం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నా. ప్రజల అండదండలున్న నన్ను ఏమీ చేయలేరు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను ఒక సమస్యగా పరిగణిస్తోంది. కానీ, మేము ప్రజలను ఒక బలంగా, సవాళ్లకు పరిష్కారంగా భావిస్తున్నాం. బుధవారం లోక్సభలో జరిగిన పరిణామాలు నిజంగా బాధాకరం. ప్రతిపక్షాలు అలజడి సృష్టించడం వల్లనే సభకు వెళ్లలేకపోయా. ప్రజాస్వామ్య దేవాలయంలో ఇష్టానుసారంగా ప్రవర్తించారు. సభాపతి స్థానంలో ఉన్న అస్సాం ఎంపీపై, ఆంధ్రప్రదేశ్ దళిత ఎంపీపై పేపర్లు విసిరేశారు. అస్సాం ప్రజలను.. మొత్తం ఈశాన్య రాష్ట్రాల ప్రజలను అవమానించారు. దళితులను అవమానించారు. కాంగ్రెస్ వల్ల అస్సాం గాయకుడు భూపేన్ హజారికా ఎన్నో అవమానాలకు గురయ్యారు. సదానందన్ మాస్టర్ను అవమానించారు బీజేపీ నేత, కేంద్ర మంత్రి బిట్టూను కాంగ్రెస్ నాయకుడొకరు(రాహుల్ గాం«దీ) బుధవారం ద్రోహి అంటూ దూషించారు. ఆ పార్టీకి సిక్కులంటే ద్వేషం. కాంగ్రెస్ నుంచి ఎన్నో గ్రూప్లు విడిపోయాయి. ఎంతోమంది ఆ పార్టీ నుంచి వెళ్లిపోయారు. బిట్టూ సిక్కు కాబట్టి ద్రోహి అని నిందించారు. ఇది సిక్కులకు, గురువులకు జరిగిన అవమానం. సిక్కుల పట్ల విద్వేషాన్ని కాంగ్రెస్ మరోసారి బయటపెట్టుకుంది. నిన్న రాజ్యసభలో స్వతంత్ర సభ్యుడు సదానందన్ మాస్టర్ తన కృత్రిమ కాలును ప్రదర్శిస్తే ప్రతిపక్ష ఎంపీలు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇంతకంటే దారుణం ఉంటుందా? ఆయన గొప్ప విలువలున్న వ్యక్తి. రాజకీయ గొడవల వల్ల మూడు దశాబ్దాల క్రితం కాలు పోగొట్టుకున్నారు. ఆయనను అవమానించడం మొత్తం దేశానికి బాధ కలిగించింది. అందుకు విపక్ష ఇండియా కూటమి బాధ్యత వహించాలి. ఓట్ల కోసం చొరబాటుదార్లను రక్షిస్తున్నారు ‘‘పశ్చిమ బెంగాల్లో దయలేని ప్రభుత్వం అధికారం చెలాయిస్తోంది. పతనం కావడంతో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోంది. ఓట్ల కోసం చొరబాటుదార్లను కాపాడుతోంది. తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి. అధికారం కోసం దేశాన్ని నాశనం చేయొద్దు. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం చొరబాటుదార్లను సహించవు. వారిని బయటకు వెళ్లగొడతాయి. మనదేశంలో మాత్రం చొరబాటుదార్లను రక్షించే పరిస్థితులున్నాయి. అందుకోసం కోర్టులపైనా ఒత్తిడి తెస్తున్నారు. మన యువత హక్కులను లాక్కొని, గిరిజనుల భూములను కబ్జా చేస్తున్నవారిని కాపాడడం ఏమిటి? మన ఆడబిడ్డలు, కుమారుల జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నవారిని రక్షించడం తగదు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, వామపక్షాలు దశాబ్దాలపాటు అధికారం అనుభవించాయి. అధికారంలో ఉన్నప్పుడు సొంత లాభం చూసుకోవడం తప్ప ప్రజల బాగు కోసం చేసిందేమీ లేదు. నేడు మనం డీల్స్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నాం. గతంలో డీల్ అంటే బోఫోర్స్ డీల్ మాత్రమే. ప్రజల జీవితాలను మార్చడం వారికి ముఖ్యం కాదు. సొంత జేబులు నింపుకోవడమే ముఖ్యం’’ అని మోదీ ధ్వజమెత్తారు. .నాణ్యమైన వస్తువులు ఉత్పత్తి చేయాలి ‘‘అన్ని రంగాల్లో నూతన స్ఫూర్తి, శక్తితో వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలి. ఇందులో భాగంగా నాణ్యమైన వస్తువుల ఉత్పత్తిపై మనం దృష్టి పెట్టాలి. ఇందుకు ప్రజలు సహకరించాలి. నాణ్యత విషయంలో రాజీపడొద్దు. ‘మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ భారత్’ ప్రపంచమంతటా వినిపించాలి. మన నాణ్యమైన ఉత్పత్తులు అన్ని చోట్లకూ వెళ్లాలి. అంతరిక్షం, సైన్స్, టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్, ఏఐ, అరుదైన ఖనిజాల రంగాల్లో ముందడుగు వేస్తున్నాం. సంస్కరణల ఎక్స్ప్రెస్ పరుగులు తీస్తోంది. గతంలో నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు సంస్కరణల వల్ల లాభాల్లోకి వస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలోనూ సంస్కరణలు చేపట్టాం. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చేసిన నిర్వాకాలకు ఇప్పుడు ఆ పార్టీ సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వాల తప్పులను సరిచేయడానికి మా శక్తిని ఖర్చు పెడుతున్నాం’’ అని ప్రధాని మోదీ వివరించారు. రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్రాజ్యసభలో ప్రధానమంత్రి ప్రసంగం ప్రారంభించడానికి తన స్థానం నుంచి లేవగానే విపక్ష సభ్యులు బిగ్గరగా నినాదాలు చేశారు. విపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని చైర్మన్ సి.పి.రాధాకృష్ణన్ను కోరారు. అందుకు ఆయన నిరాకరించారు. దాంతో మోదీ ప్రసంగం ప్రారంభించారు. దాంతో ప్రతిపక్ష ఎంపీలు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలతో హోరెత్తించారు. నిరసన వ్యక్తంచేశారు. లోక్సభలో రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవమానాలు సహించబోమని అన్నారు. కూర్చొని నినాదాలు ఇవ్వొచ్చంటూ ఖర్గేకు ప్రధాని మోదీ సూచించారు. కొద్ది సేపటి తర్వాత ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. మోదీ ప్రసంగం కొనసాగింది. విపక్ష సభ్యులు బయటకు వచ్చి మకరద్వారం వద్ద నినాదాలు చేశారు. ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి పోశారు. ఆ ఒప్పందాలతో ప్రపంచంలో గొప్ప విశ్వాసం ‘‘యూరోపియన్ యూనియన్తో కుదిరిన చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం తర్వాత అమెరికాతో ఒప్పందానికి వచ్చాం. ఇవి ఫ్యూచర్ రెడీ ఒప్పందాలు. ప్రపంచంలో గొప్ప విశ్వాసం నింపాయి. ప్రపంచ స్థిరత్వానికి ఈ ఒప్పందాలు తోడ్పడుతాయి. గత కొన్నేళ్లలో తొమ్మిది పెద్ద దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాం. ఇది ఈయూతో కుదిరిన ఒప్పందం ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’. మనం ఇక వెనక్కి చూడాల్సిన అవసరం గానీ, పరుగు ఆపాల్సిన అవసరం గానీ లేదు. ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధన దిశగా వేగంగా దూసుకెళ్తున్నాం. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి సమయంలో ప్రపంచమంతటా అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత నూతన ప్రపంచ క్రమం ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇలాంటి పరిస్థితే కనిపించింది. ఇప్పుడు భారత్ పట్ల ప్రపంచదేశాల్లో గొప్ప విశ్వాసం వ్యక్తమవుతోంది. ఎన్నో దేశాలకు మన దేశం విశ్వసనీయ భాగస్వామిగా మారింది. భారతదేశ ఉజ్వల భవిష్యత్తులో పాలుపంచుకోవాలని ఇతర దేశాలు కోరుకుంటున్నాయి. అందుకే మనతో ఒప్పందాలకు ముందుకొస్తున్నాయి. దక్షిణార్ధ గోళ దేశాలకు(గ్లోబల్ సౌత్) నేడు మనమే బలమైన గొంతుకగా మారాం’’ అని మోదీ అన్నారు. -
దేశం కోసం కాంగ్రెస్ ఎప్పుడూ పనిచేయలేదు: మోదీ
సాక్షి, ఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్బంగా ప్రధాని ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాల వాకౌట్ చేశాయి. మరోవైపు.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై ప్రధాని మోదీ సెటైరికల్ కామెంట్స్ చేశారు. మీరు కూర్చునే నినాదాలు చేయొచ్చు అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా.. విపక్ష పార్టీల ఎంపీలు నిరసనతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే కూడా లేచి నిలబడి నిరసనలు తెలిపారు. దీంతో, మోదీ... వయసు రీత్యా ఖర్గే కూర్చుని నిరసనలు చేపట్టొచ్చని మోదీ అన్నారు. అనంతరం, రాజ్యసభ నుంచి విపక్ష నేతలు వాకౌట్ చేశారు. ముందు నన్ను మాట్లాడనివ్వాలంటూ విపక్షాలకు ప్రధాని మోదీ సూచించారు.మరోవైపు.. రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..‘ఎన్డీయే హయాంలో భారత్ మూడో ఆర్థిక వ్యవస్థగా మారనుంది. దేశం సరైన మార్గంలో వేగంగా పురోగమిస్తోంది. దేశంలో ప్రతిభావంతులైన యువతకు కొరత లేదు. గతంలో భారత్తో ఒప్పందానికి పలు దేశాలు ముందుకు వచ్చేవి కాదు. దేశం కోసం కాంగ్రెస్ ఎప్పుడూ పనిచేయలేదు. కాంగ్రెస్కు ఎప్పుడూ ఒక విజన్ లేదు. ఎన్డీయే హయాంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. మా హయాంలో అనేక సంస్కరణలు చేపట్టాం.భారత్ తొమ్మిది దేశాల్లో ట్రేడ్ డీల్ చేసుకుంది. అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొవడానికి దేశం సిద్దంగా ఉంది. యూపీఏ హయాంలో భారత్ 11వ ఆర్థిక వ్యవస్థగా ఉండేది. ఇటీవలి కాలంలో దేశం శరవేగంగా పురోభివృద్ధి సాధిస్తోంది. అన్ని వర్గాల్లో మార్పు కనిపిస్తోంది. 27 దేశాలు, ఈయూతో అనేక ఒప్పందాలు చేసుకున్నాం’ అని చెప్పుకొచ్చారు. #WATCH | In Rajya Sabha, PM Modi says, "...India is signing future-ready trade deals with several countries. In the past few days, we signed trade deals with 9 big and important countries of the world. Mother of all deals with 27 countries, with European Union is one of them..." pic.twitter.com/qpOcOpVUks— ANI (@ANI) February 5, 2026రాష్ట్రపతిని విపక్షాలు దారుణంగా అవమానించారు. దేశ అత్యున్నత పదవిని విపక్షాలు అవమానించాయి. దేశ అత్యున్నత పదవిని, రాజ్యాంగాన్ని, ఆదివాసీలను అవమానించారు. లోక్సభలో విపక్షాల ప్రవర్తన నన్నెంతో బాధపెట్టింది. స్పీకర్ కుర్చీలో కూర్చున్న దళితులను విపక్షాలు అవమానించాయి. అసోం ప్రజలు ఈ అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. కాంగ్రెస్ యువరాజు ఓ ఎంపీని ద్రోహి అన్నారు. అతనికి గర్వం తలకెక్కింది. కాంగ్రెస్ నుంచి ఎంతో మంది పార్టీని వీడారు. బిట్టు సిక్కు కావడంతో అతడిని అవమానించారు. సిక్కుల పట్ల ఎంత ద్వేషం ఉందో వారి మాటల్లో కనిపించింది అని మండిపడ్డారు. -
లోక్ సభలో మోదీపై దాడి? బయటపడ్డ సంచలన వీడియో..
-
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని మోదీపై దాడి చేసేలా కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు వ్యవహరించారు. అందుకే ప్రధానిని సభకు రావొద్దని చెప్పాను. పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదు. విపక్షాలు సభా మర్యాదలను ఉల్లంఘించారు’అని ఆయన అన్నారు.పలువురు ప్రతిపక్ష ఎంపీలు ప్రధాని మోదీని అగౌరవపరచవచ్చనే ముందస్తు సమాచారం నాకు అందింది. అందుకే ప్రధానిని సభకు రావొద్దని విజ్ఞప్తి చేశాను’అని స్పీకర్ తెలిపారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని మోదీ మాట్లాడకపోవడంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఆయన స్పందించారు.బుధవారం ప్రధానమంత్రి ప్రసంగానికి ముందు సభలో జరిగిన గందరగోళం, వాయిదాపై ఓం బిర్లా వ్యాఖ్యానిస్తూ..‘ప్రతిపక్ష ఎంపీలు ప్రధాని మోదీ కుర్చీని చుట్టుముట్టారు. లోక్సభలో కొంతమంది సభ్యులు దురుసుగా ప్రవర్తించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఎంపీలు ప్రధానమంత్రి ప్రసంగం సమయంలో గందరగోళం సృష్టించవచ్చని నాకు ముందస్తు సమాచారం వచ్చింది’ అని ఆయన వెల్లడించారు. -
7,8లలో ప్రధాని మోదీ మలేషియా పర్యటన
న్యూఢిల్లీ: మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల(ఫిబ్రవరి) 7, 8 తేదీల్లో ఆ దేశంలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై కీలక చర్చలు జరగనున్నాయి. మోదీ మలేషియాలో పర్యటించడం ఇది మూడోసారి. 2024, ఆగస్టులో ఇరు దేశాల మధ్య కుదిరిన ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ తర్వాత ప్రధాని మోదీ చేస్తున్న పర్యటన ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ, అన్వర్ ఇబ్రహీంలు భారత్-మలేషియా సంబంధాలలోని పలు అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, సముద్ర తీర సహకారం తదితర రంగాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. వీటితో పాటు డిజిటల్, ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఇంధనం, ఆరోగ్యం, విద్య, సంస్కృతి, పర్యాటక రంగాల్లో పరస్పర సహకారాన్ని ఇరు దేశాల నేతలు సమీక్షించనున్నారు. భవిష్యత్తులో రెండు దేశాల ప్రయోజనాల కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు.ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మలేషియాలోని భారతీయ కమ్యూనిటీ సభ్యులతో సమావేశం కానున్నారు. పారిశ్రామిక, వ్యాపార రంగ ప్రముఖులతో ఆయన ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇదే సమయంలో ‘10వ భారత్-మలేషియా సీఈఓ ఫోరమ్’ కూడా జరగనుంది. ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించడం ద్వారా ఇరు దేశాల మైత్రిని మరింత పటిష్టం చేయడమే ఈ భేటీల ప్రధాన ఉద్దేశం. భారత్- మలేషియాల మధ్య సుదీర్ఘమైన చారిత్రక, నాగరికత, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. -
బాధ్యత దులిపేసుకున్న మోదీ
న్యూఢిల్లీ: భారత్–చైనా మధ్య 2020లో జరిగిన ఘర్షణ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ముఖ్యమైన బాధ్యతను అప్పటి ఆర్మీ చీఫ్పైకి నెట్టేసి, చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. దేశ భద్రతకు సంబంధించిన అత్యంత సంక్షోభ సమయంలో మోదీ అలా తప్పించుకోవడం ఏమిటని నిలదీశారు. ప్రజలు ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పారిపోతోందని విమర్శించారు. రాహుల్ బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం.నరవణే రచించి, ఇంకా అధికారికంగా విడుదల చేయని జ్ఞాపకాల పుస్తకాన్ని ప్రదర్శించారు. అందులోని కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ పుస్తకం నిజంగా ఉందన్న సంగతిని యువత తెలుసుకోవాలని కోరారు. అసలు ఇలాంటి పుస్తకమే లేదని ప్రభుత్వం నమ్మబలుకుతోందని, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ అదేమాట చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తూర్పు లద్ధాఖ్లో గల్వాన్ ఘర్షణ సమయంలో ఏం జరిగిందో నరవణే సవివరంగా రాశారని తెలిపారు. మోదీ వస్తే పుస్తకం అందజేస్తా.. ‘‘చైనా యుద్ధ ట్యాంకులు కైలాస పర్వతం దాకా దూసుకొచ్చాయి.. ఇప్పుడేం చేయాలని ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తోపాటు రక్షణ శాఖమంత్రి రాజ్నాథ్ సింగ్ను అడిగారు. అందుకు వారు సమాధానం చెప్పలేదు. దాంతో రాజ్నాథ్ సింగ్ను మళ్లీ అడిగారు. ఉన్నత స్థాయి వాళ్లను(ప్రధానమంత్రి) అడిగి చెప్తానని రాజ్నాథ్ బదులిచ్చారు. రాజ్నాథ్ వెళ్లి ప్రధానమంత్రిని అడిగితే.. మీకు ఏది సముచితం అనిపిస్తే అదే చేయండి అంటూ మోదీ బాధ్యత దులిపేసుకున్నారు. చైనా యుద్ధ ట్యాంకులు మన భూభాగంలోకి ప్రవేశించినా తనకు సంబంధం లేదన్నట్లుగా మాట్లాడారు. దాంతో ఈ అంశంలో పూర్తిగా ఒంటరిగా మారిపోయినట్లు భావించానని నరవణే తన పుస్తకంలో రాశారు. ఇదే విషయం నేను పార్లమెంట్లో చెప్తానని ప్రభుత్వం భయపడుతోంది. అందుకే నన్ను సభలో మాట్లాడనివ్వడం లేదు. లోక్సభకు వచ్చేంత ధైర్యం ప్రధాని మోదీకి ఉందని నేను అనుకోవడం లేదు. ఒకవేళ ఆయన వస్తే ఈ పుస్తకం అందజేస్తా’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అనంతరం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఈ పుస్తకం ప్రతిపక్ష నేత గానీ, విదేశీ రచయిత గానీ రాయలేదని వెల్లడించారు. మాజీ ఆర్మీ చీఫ్ రాశారని పేర్కొన్నారు. అయినా ఇలాంటి పుస్తకం లేనేలేదని అంటున్నారని తప్పుబట్టారు. పార్లమెంట్కు వచి్చ, నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం మోదీకి లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం భయపడుతోంది: ప్రియాంక చైనాతో ఘర్షణ జరిగినప్పుడు మోదీ ప్రభుత్వ నిర్వాకం ఏమిటో జనరల్ నరవణే బయటపెట్టారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా పేర్కొన్నారు. నిజాలు ప్రజలకు తెలుస్తాయని మోదీ సర్కార్ భయపడుతోందని, అందుకే లోక్సభలో మాట్లాడేందుకు రాహుల్ గాంధీకి అనుమతి ఇవ్వడం లేదని బుధవారం విమర్శించారు. బీజేపీ ఎంపీలు కూడా గతంలో పుస్తకాలు, మేగజైన్లు, రిపోర్టులను ప్రస్తావిస్తూ పార్లమెంట్లో మాట్లాడారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ కూడా సంజయ్బారు పుస్తకం గురించి మాట్లాడారని తెలిపారు. నరవణే పుస్తకంపై రాహుల్ మాట్లాడితే తప్పేమిటని ప్రశ్నించారు. అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఎంపీలకు ఉందన్నారు. -
సభలో రచ్చరచ్చ
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందం, మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం.నరవణే పుస్తకంపై లోక్సభలో ప్రతిపక్ష సభ్యులు బుధవారం సైతం ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజలకు నిజాలు బహిర్గతం చేయాలని పట్టుబట్టారు. సభలో బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించాల్సి ఉండగా, ఆయన సభకు హాజరు కాలేదు. ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలు ప్రారంభించారు. శాంతించాలంటూ స్పీకర్ విజ్ఞప్తి చేసినా వారు వినిపించుకోలేదు. దాంతో స్పీకర్ సభను ఉదయం 11 గంటల దాకా వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా విపక్ష సభ్యుల ఆందోళన ఆగలేదు. ప్రభుత్వం సమాధానం చెప్పేదాకా విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. విపక్ష ఎంపీలు తొలుత వెల్లో బైఠాయించారు. అనంతరం బ్యానర్లు ప్రదర్శిస్తూ అధికార పక్ష సభ్యులవైపు దూసుకొచ్చారు. నరవణే పుస్తకంపై సభలో రాహుల్ గాం«దీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వారి తీరును కేంద్ర మంత్రులు రాజ్నాథ్, అమిత్ షా తప్పుపట్టారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ మధ్యాహ్నం 12 గంటల దాకా, తర్వాత 2 గంటల దాకా వాయిదా వేశారు. మరో వాయిదా తర్వాత 5 గంటలకు సభ మళ్లీ ప్రారంభమయ్యాక కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ సమయంలోనే ప్రధాని ప్రసంగించాల్సి ఉంది. కాంగ్రెస్ మహిళా ఎంపీ వర్షా గైక్వాడ్ సహా మరికొందరు మహిళా సభ్యులు ప్రధాని కూర్చొనే స్థానం వద్దకొచ్చి ఘోరావ్ చేశారు. అప్పుడు మోదీ సభలో లేరు. వెనక్కి రావాలంటూ కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు కోరినా విపక్ష సభ్యులు పట్టించుకోలేదు. పరిస్థితి సద్దుమణగకపోవడంతో స్పీకర్ స్థానంలో ఉన్న సంధ్యా రాయ్ సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు. పరిస్థితి అదుపులో లేకపోవడం వల్లనే మోదీ సభకు రాలేదని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ చెప్పారు. రాహుల్కు పోటీగా దూబే పుస్తక ప్రదర్శన..మధ్యాహ్నం 2 గంటలకు సభ పునఃప్రారంభమైన తర్వాత బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ‘ఎడ్వినా అండ్ నెహ్రూ’, ‘మిత్రోఖిన్ ఆర్కైవ్’ అనే పుస్తకాలను సభలో ప్రదర్శిస్తూ వాటి గురించి ప్రస్తావించడంతో వివాదం మొదలైంది. దివంగత ప్రధానమంత్రులు నెహ్రూ, ఇందిరా గాం«దీ, రాజీవ్ గాంధీపై ఆయన విమర్శలు చేశారు. వారు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అయితే, సభలో పుస్తకాల గురించి ప్రస్తావించడానికి వీల్లేదని సభాపతి స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్ తెన్నేటి స్పష్టంచేశారు. నిషికాంత్ దూబ్ తీరుపై మండిపడుతూ కాంగ్రెస్ సహా ఇతర విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో సభాపతి లోక్సభను సాయంత్రం 5 గంటల దాకా వాయిదా వేశారు. తర్వాత కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. నిషికాంత్ దూబేపై సస్పెన్షన్ వేటు వేయాలని డిమాండ్ చేశారు. -
ట్రంప్నే బెంబేలెత్తించింది.. భారత్ విజయ రహస్యం ఇదే!
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే అక్కసుతో భారత్పై భారీగా సుంకాలు మోపిన అమెరికా.. ఉన్నఫళంగా ఎందుకు దిగివచ్చింది? ఏకపక్షంగా సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా భారత్తో డీల్ కుదిరిందని, ట్యాక్స్లను 18 శాతానికి తగ్గించామని ఎందుకు ప్రకటించారు?? బెదిరింపులతో లొంగదీసుకుందామని ట్రంప్ భావిస్తే.. ఏకు మేకై కూర్చుంటామంటూ పలు దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం అమెరికా తల వంచిందా?ఐరోపా సమాఖ్యతో స్వేచ్ఛాయుత వాణిజ్యంపై భారత్ కుదుర్చుకున్న డీల్ ఇప్పుడు ట్రంప్ మెడలను వంచిందా? బంగారం ధరలు మొదలు.. పలు దేశాల షేర్ మార్కెట్లను మాటలతో శాసిస్తున్న ట్రంప్ వెనక్కి తగ్గడానికి కారణాలేంటి?? ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కటే..! అహింసామార్గంలో.. శాంతియుతంగా ఎదుటివారి మెడలు వంచేలా చేయడం భారత్ నైజం..!! ఈ విషయంలో భారత్ వ్యూహాత్మక అడుగులు.. వాటి ఫలితాలను గురించి వివరంగా తెలుసుకోవాలంటే.. చదవాల్సిందే👉అది అనుకున్నంత ఈజీ కాకపోగా..ప్రస్తుత పరిస్థితుల్లో ఒక దేశాన్ని ఓడించాలంటే యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు..! బాలిస్టిక్ మిసైల్స్.. యుద్ధ విమానాలతో విరుచుకుపడాల్సిన పని లేదు..! ఆంక్షల ఛట్రంలో ఆ దేశాన్ని బంధించి, ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు రద్దయ్యేలా చేస్తే చాలు..! ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే దశలో ఆ దేశాలను దారికి తెచ్చుకోవచ్చు..! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు ఆడుతున్న మైండ్ గేమ్ ఇదే..! ఇదే మైండ్ గేమ్తో ఎన్నో దేశాలను దారికి తెచ్చుకున్నాడు. భారత్ను కూడా అదే గాడిన కట్టాలనుకున్నాడు. భారత్ ఆత్మగౌరవం ముందు ఓడిపోయాడు. అది అనుకున్నంత ఈజీ కాకపోగా.. అమెరికన్లకే ధరాఘాతంతో శాపంగా మారుతోంది. దీంతో.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదుల మెట్లు దిగిరాక తప్పలేదు..!👉ఆ మౌనమే ట్రంప్ను బెంబేలెత్తించింది..భారత్ను దారికి తెచ్చుకోవాలనే తపనతో ట్రంప్ చేయని ప్రయత్నం లేదు. ఆఖరికి భారత్ నుంచి ప్రకటనలు లేకున్నా.. తానే భారతీయుల తరఫున ప్రకటనలు చేసుకున్నారు. రష్యా చమురును భారత్ కొనబోదని.. అమెరికా నుంచే కొంటుందని ప్రకటించేసుకున్నారు. అలాంటి ప్రకటనలకు భారత్ తొందరపడి ఏమాత్రం స్పందించలేదు. ‘నో కామెంట్’ అంటూ దాటవేయలేదు. చేసిందల్లా.. మౌనంగా ఉండడమే..! ఆ మౌనమే ఇప్పుడు ట్రంప్ను బెంబేలెత్తించింది. వెనక్కి తగ్గేలా చేసింది. మౌనంగానే భారత్ విజయం సాధించింది.👉జియోపాలిటిక్స్లో మౌనానికి అర్థాలే వేరు..సాధారణంగా మౌనం అర్ధాంగీకారం అంటారు. కానీ, జియోపాలిటిక్స్లో మౌనానికి అర్థాలే వేరు. ఒక పాలసీని అమలు చేయడానికి ముందు.. దానికి సమ్మతిని ఇవ్వడానికి ముందు చేసే ఆలోచనలు, కసరత్తుకు నిదర్శనమే మౌనం అంటారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు. 1988లో అమెరికన్ ఆలోచనాపరుడు నోమ్ చోమ్స్కీతోపాటు.. ఆర్థికవేత్త ఎడ్వర్డ్.ఎస్.హెర్మాన్ తమ పుస్తకం ‘ది పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ద మాస్ మీడియా’లో ఇదే అంశాన్ని నొక్కి వక్కాణించారు. ఆంక్షలు, లేదా యుద్ధాలకు ముందు.. నిరసనను వ్యక్తం చేయకుండా.. విధానాలను సాధారణీకరించేందుకు మౌనం దాల్చడం ఓ రాజనీతి అంటారు. అమెరికా సుంకాల విషయంలో భారత్ పాటించిన మౌనం దీనికి చక్కటి ఉదాహరణ..!👉కన్జూమర్ సైకాలజీ అంటే ఇదే..కొనుగోలుదారులు ఎవరైనా తమకు కావాల్సిన వస్తువు ఎక్కడ చౌకగా దొరుకుతుందో అక్కడే కొంటారు. అది కన్జూమర్ సైకాలజీ. ఈ బేసిక్ నాలెడ్జ్ని కూడా మరిచిపోయిన ట్రంప్ చమురు విషయలో భారత్పై ఒత్తడి తేవాలని ప్రయత్నించి భంగపడ్డారు. ఇక రాజనీతి విషయానికి వస్తే.. అగ్రదేశాలు అంతగా జియోపాలిటిక్స్ను వంటబట్టించుకోని రోజుల్లోనే మనదేశంలో ద్వాపరయుగంలో విదురనీతి.. ఆధునిక యుగంలో చాణక్యనీతి అమల్లో ఉన్నాయి. భారత్కు రష్యా ముందు నుంచి మిత్ర దేశం. ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా ఆంక్షల ఛట్రంలో రష్యా కూరుకుపోయింది.👉భారత్ను దెబ్బతీయాలనుకున్నారు కానీ...ఈ క్రమంలో చౌకగా చమురు అమ్మేందుకు రష్యా సిద్ధమైనా.. అభివృద్ధి చెందుతున్న దేశాలేవీ కొనేందుకు ముందుకు రాలేదు. ఐరోపా దేశాలే రష్యా చమురు కొంటున్న తరుణంలో భారత్ కూడా రష్యాకు అతిపెద్ద వినియోగదారుగా మారింది. ఈ చర్య అటు రష్యాకు, ఇటు భారత్కు లబ్ధి చేకూర్చింది. దీన్ని జీర్ణించుకోలేని ట్రంప్.. సుంకాలతో భారత్ను దెబ్బతీయాలనుకున్నారు. భారత్ తన ప్లాన్-బీని అమలు చేసింది.👉ఊహించని పరిణామం..అంతే.. కొత్త వినియోగదారులను సొంతం చేసుకుంది. ఐరోపా సమాఖ్యతో 19ఏళ్లుగా కలగా ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంతకు ముందే.. చైనాకు దగ్గరైంది. ఉప్పు-నిప్పుగా ఉండే తాలిబాన్లను అక్కున చేర్చుకుంది. ఇరాన్తోనూ వాణిజ్య ఒప్పందాలకు సిద్ధమైంది. జీయోపాలిటిక్స్లో శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరనే సందేశాన్ని ప్రపంచానికి పంపింది. ఊహించని ఈ పరిణామం అమెరికా మార్కెట్పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉండడంతో.. ట్రంప్ వాణిజ్య ఒప్పందంపై ప్రకటన చేయాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.👉భారత్ స్వరం మార్చింది..దౌత్యం విషయంలో భారత వ్యూహాలు మునుపటిలా లేవు. గడిచిన దశాబ్దన్నర కాలంగా వ్యూహప్రతివ్యూహాలు మారుతూ వస్తున్నాయి. ఒకప్పుడు అంతా భగవతేచ్ఛ.. అని భావించే భారత్.. ఇప్పుడు స్వరం మార్చింది. ప్రేమిస్తే.. ప్రాణమిస్తాం.. వంచిస్తే.. కాలరాస్తాం.. ఎక్కడా తగ్గేదే లే.. అని చాటిచెప్పింది. ‘ఆపరేషన్ సిందూర్’ విషయంలో ఈ విషయం స్పష్టమైంది. ఏరంగంలోనైనా శత్రువు ఢీ-అంటే ఢీకొడతామని తేల్చిచెప్పింది.👉ఇంకా చెప్పాలంటే..ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే.. 2019లో ఆంక్షల పేరుతో ఇరాన్, వెనిజెవెలా, భారత్ నుంచి చమురు దిగుమతులను నిలివేశారు. ఆ సమయంలో ఐక్య రాజ్య సమితిలో అమెరికా రాయబారిగా ఉన్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీతో రాయబారాలు నెరిపారు. అప్పటి నుంచే.. భారత్-అమెరికా మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు భారత్ ఆత్మనిర్భరతతో ఉందనే విషయాన్ని అమెరికాకు చాటి చెప్పింది. అమెరికా సాధారణంగా తన దారికి తెచ్చుకోవాలనుకునే దేశాలపై ప్రయోగించే సామ, దాన, బేధ, దండోపాయాలకు తాము అతీతమని భారత్ నిరూపించింది. ట్రంప్ మాదిరిగా.. దావోస్లాంటి వేదికను బెదిరింపులకు వినియోగించుకోకుండా.. అసందర్భ ప్రేలాపనలకు పోకుండా.. మౌనం వహించింది. విజయం సాధించింది. -
మౌనంగానే మెడలు వంచి!
అసలే అతను డొనాల్డ్ ట్రంప్. శత్రువులా, మిత్రులా అన్న తేడా కూడా లేకుండా అన్ని దేశాలనూ హడలెత్తిస్తూ వస్తున్న వ్యక్తి! కఠిన పదజాలంతో కూడిన బెదిరింపులతో, ఎడాపెడా టారిఫ్ల బాదుడుతో వణుకు పుట్టించడాన్నే తన నైజంగా మార్చుకున్నారు. రెండోసారి అధికారం చేపట్టింది మొదలు, ఈ ఏడాది కాలంలో ప్రపంచ దేశాలకు ఒకరకంగా పీడకలలా పరిణమించారు. చివరికి దక్షిణ కొరియా, బ్రిటన్ వంటి అతి సన్నిహిత మిత్ర దేశాలు కూడా ట్రంప్ బెదిరింపులకు జడిసి ఆయన డిమాండ్లకు అనుగుణంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందాలకు తలొగ్గాల్సి వచ్చింది.ఇలాంటి పరిస్థితుల్లో భారత్ విషయంలో మాత్రం ట్రంప్ హఠాత్తుగా దిగొచ్చిన తీరు ప్రపంచ దేశాలను విస్మయానికి గురి చేస్తోంది. భారత్పై 50 శాతం టారిఫ్లను ఏకంగా 18 శాతానికి తగ్గిస్తున్నట్టు సోమవారం ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. దీన్ని భారత్ సాధించిన ఘన విజయంగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో తొలినుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ట్రంప్ బెదిరింపులకు తలొగ్గకుండా, మాటల యుద్ధానికి బదులివ్వకుండా సంయమనం పాటిస్తూనే చివరికి మౌనంగానే ఆయన మెడలు వంచారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమ వుతోంది. బెదిరింపులనే తిరుగులేని ఆయుధంగా చేసుకుంటూ గత ఏడాది కాలంలో ట్రంప్ చెలరేగి పోయారు. దేశాధినేతలంతా తాను చెప్పినట్టు వినాలన్న ఒంటెత్తు పోకడ ప్రదర్శించారు. చివరికి నోబెల్ శాంతి పురస్కారానికి తాను అర్హుడినంటూ ప్రకటనలు చేయాల్సిందిగా వారిని ఒత్తిడి చేసే స్థాయికీ వెళ్లారు! పాక్ లాంటి పలు దేశాల అధినేతలు అందుకు తలొగ్గారు కూడా. కానీ మోదీ నుంచి మాత్రం మౌనమే సమాధానమైంది. దాంతో ట్రంప్ ఇగో దెబ్బ తిన్నది కూడా. మోదీ వ్యక్తిగతంగా ఫోన్ చేయనందుకే భారత్తో వాణిజ్య ఒప్పందం ఖరారు కాలేదని అమెరికా వాణిజ్య మంత్రి లుట్నిక్ బాహాటంగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పట్టాయి. ప్రధాని మాత్రం వీటిని పట్టించుకోలేదు. అంతేగాక ట్రంప్ బెదిరింపుల ఉచ్చులో పడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.ఒప్పందం విషయమై ట్రంప్ నాలుగుసార్లు స్వయంగా ఫోన్ కాల్స్ చేసినా పట్టించుకోలేదు. ఆయన కారాలు, మిరియాలు నూరుతున్నా లక్ష్యపెట్టకుండా బ్రిటన్, న్యూజిలాండ్, అనంతరం ఒమన్లతో లాభదాయక రీతిలో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తద్వారా స్వతహాగా వ్యాపారి అయిన ట్రంప్నే మించిపోయే స్థాయిలో మోదీ వ్యాపార దక్షత ప్రదర్శించారు. ఈ చర్యతో ఆయనను పునరాలోచనలో పడేశారు. ఇక గత నెలలో యూరోపియన్ యూనియన్తో అతి కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని భారత్ ఖరారు చేసుకుంది. ప్రపంచ చరిత్రలోనే అత్యంత భారీదని కొనియాడుతున్న ఈ డీల్ భారత్పై దూకుడు విషయంలో ట్రంప్కు గట్టిగా బ్రేకులు వేసిందని చెబుతున్నారు.27 దేశాల కూటమి అయిన ఈయూతో కుదిరిన ఈ ఒప్పందం అంతర్జాతీయ వేదికపై భారత స్థాయిని మరింత పెంచింది. ట్రంప్ చపలచిత్తం పుణ్యమా అని ఇతర దేశాల దృష్టిలో అమెరికా శరవేగంగా విశ్వసనీయతను కోల్పోతూ వస్తోంది. అందుకు విరుద్ధంగా భారత్ మాత్రం అత్యంత నమ్మదగ్గ భాగస్వామ్య దేశంగా తన ప్రతిష్టను పెంచుకుంటూ వచ్చింది. పైగా ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్ను ఏ దేశమూ ఇప్పుడు తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఇందుకు అమెరికా కూడా మినహయింపు కాదు. అందుకే వ్యవసాయ, పాడి తదితర కీలక రంగాలను అమెరికా పరిశ్రమలకు బాహాటంగా తెరిచేందుకు కరాఖండిగా నిరాకరించి కూడా ఒప్పందానికి ట్రంప్ను భారత్ ఒప్పించగలిగింది! అదే సమయంలో ట్రంప్ ఎంతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ప్రతి వ్యాఖ్యలకు దిగకుండా మోదీ పరిణతి ప్రదర్శించారు. చైనాతో స్నేహ గీతంట్రంప్ దూకుడుకు చెక్ పెట్టే చర్యల్లో భాగంగా వ్యూహాత్మకంగా చైనాకు దగ్గరయ్యేందుకు కూడా భారత్ వెనకాడలేదు. గతేడాది షాంఘై సహకార సమాఖ్య భేటీకి హాజరయ్యేందుకు ఏడేళ్ల అనంతరం మోదీ చైనాలో పర్యటించారు! ఆ సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. అవి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. చివరికి ట్రంప్ కూడా వాటిపై చిర్రబుర్రులాడారు. భారత్, రష్యాలను అమెరికా చివరికి చైనాకు కోల్పోయిందంటూ నిట్టూర్చారు! ఆ తర్వాత రెండు నెలలకే పుతిన్కు ఢిల్లీలో మోదీ రాచమర్యాదలు చేశారు.రష్యాతో పలు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. ఇలా పలు అగ్ర రాజ్యాలతో భారత్ వ్యూహాత్మకంగా ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసుకుంటున్న వైనం కూడా ట్రంప్ను పునరాలోచనలో పడేసింది. భారత్ అక్కడితోనే ఆగలేదు. ట్రంప్ టారిఫ్లకు ప్రతీకా రంగా తాను కూడా అమెరికాపై సుంకాలు బాదింది! అమెరికా నుంచి దిగుమతయ్యే పప్పులు, తృణధాన్యాలపై ఏకంగా 30 శాతం టారిఫ్లు విధించింది. ట్రంప్లా గొంతెత్తి ప్రకటనలు చేయకుండా మౌనంగానే గత నవంబర్ నుంచే వాటిని వసూలు చేయడం కూడా ప్రారంభించింది.‘ఒప్పందం’పై మోదీ మౌనంభారత్తో వాణిజ్య ఒప్పందం కుదిరిపోయిందని ట్రంప్ ప్రకటించినా, దానిపై మోదీ మాత్రం సూటిగా స్పందించకపోవడం విశేషం. అంతేగాక రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపేసేందుకు భారత్ ఒప్పుకుందని, అమెరికా నుంచి దిగుమతులను ఏకంగా 500 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లనుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపైనా మోదీ మౌనమే వహించారు. కేవలం టారిఫ్ల తగ్గింపుకు హర్షం వ్యక్తం చేయడానికే తన స్పందనను పరిమితం చేయడం గమనార్హం. – సాక్షి, నేషనల్ డెస్క్ ‘గోర్’ ఫ్యాక్టర్సెర్గియో గోర్. భారత్లో అమెరికా నూతన రాయబారి. భారత్తో అమెరికా వాణిజ్య ఒప్పందం, టారిఫ్ల తగ్గింపు వెనక ఆయన పాత్ర కీలకంగా నిలిచింది. ఇరు దేశాల సంబంధాలు కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా దిగజారిన తరుణంలో గత జనవరి 12న ఆయన బాధ్యతలు స్వీకరించారు. ద్వైపాక్షిక సంబంధాలను ఎన్నడూ లేనంత బలోపేతం చేయడమే ఆ సందర్భంగా స్పష్టంగా ప్రకటించారు. ‘నిజమైన మిత్రులు తొలుత విభేదించవచ్చు. కానీ అంతిమంగా ఒక్కతాటిపైకే వస్తారు’ అని చెప్పుకొచ్చారు. అమెరికాకు భారత్ కంటే ముఖ్యమైన దేశం మరేదీ లేదని కూడా స్పష్టం చేశారు.ఖనిజాల అన్వేషణ, ఏఐ టెక్నాలజీ వాడకానికి సంబంధించి అమెరికా ఏర్పాటు చేసిన ‘పాక్స్ సిలికా’ కూటమిలో చేరాల్సిందిగా భారత్ను ఆహ్వానించారు కూడా. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న సుదీర్ఘ ప్రతిష్టంభన కాస్తా ఆయన వచ్చిన మూడు వారాల్లోపే వీడిపోవడం విశేషం. ట్రంప్కు అత్యంత సన్నిహితునిగా గోర్కు పేరుంది. ఏ సందర్భంలోనైనా గోర్ను తాను పూర్తిగా విశ్వసిస్తానని ట్రంప్ చెబుతుంటారు. భారత్తో ఒప్పందం, టారిఫ్ల తగ్గింపు విషయంలో ట్రంప్పై ఆయన ప్రభావం చాలా ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.మాకు సమాచారం లేదు: రష్యా మాస్కో: చమురు కొనుగోళ్ల నిలిపి వేతపై భారత్ నుంచి ఇప్పటి దాకా అధికారికంగా ఎలాంటి సమాచారమూ లేదని రష్యా పేర్కొంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపేసేందుకు భారత్ అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. ఇకపై వెనెజువెలా నుంచే భారత్ అధికంగా చమురు కొనుగోలు చేస్తుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలపై క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ మంగళవారం ఈ మేరకు స్పందించారు. భారత్తో వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేసుకోవాలన్నదే తమ లక్ష్యమని ఆయన చెప్పారు.ట్రంప్ వ్యాఖ్య లను నిశితంగా పరిశీలి స్తున్నట్టు రష్యా ఇంధన రంగ వ్యవహారాలు చూసే ఉప ప్రధాని అలెగ్జాండర్ నొవాక్ చెప్పారు. భారత రిఫైనరీల నుంచి ఒప్పందాల రద్దు దిశగా ఎలాంటి నోటీసులూ అందలేదని రష్యా ఇంధన శాఖ వర్గాలు కూడా స్పష్టం చేశాయి. ఉక్రెయిన్తో యుద్ధం అనంతరం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ భారీగా పెంచుకోవడం తెలిసిందే. ఆ దేశం నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న దేశంగా కూడా నిలిచింది. దీనిపై అమెరికాతో పాటు యూరప్ దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా లెక్కచేయని సంగతి తెలిసిందే. -
ప్రధాని మోదీపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: లోక్సభలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో ట్రేడ్ డీల్పై విమర్శలు గుప్పించారు. చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనివ్వలేదు. మోదీ ఇమేజ్ను క్రియేట్ చేసిన వాళ్లే దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్లో విడుదల చేయనివి ఇంకా ఉన్నాయి. అమెరికాలో అదానీపై కేసు నమోదు చేశారు. వాళ్ల టార్గెట్ అదానీ కాదు.. మోదీ ఆర్థిక మూలాలను దెబ్బతీయడం. యూఎస్-ఇండియా ట్రేడ్ నాలుగు నెలలుగా పెండింగ్లో ఉంది. ఇప్పటికిప్పుడు భారత్-అమెరికా ట్రేడ్ ఒప్పందంపై కేంద్రం ఆమోదం ఎందుకు తెలిపింది.‘మోదీ చాలా భయంతో ఉన్నారు. మోదీని ట్రంప్ బెదిరించి ఒప్పందం చేసుకున్నారు. ట్రంప్ ఒత్తిడితోనే ట్రేడ్ డీల్పై ప్రధాని మోదీ సంతకాలు చేశారు. రైతుల రక్త మాంసాలను కేంద్రం అమ్ముకుంది. మోదీ దేశాన్ని అమెరికాకు అమ్మేశారు.’ అని దుయ్యబట్టారు. ప్రధాని మోదీపై రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్లోక్సభలో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్కు గుయ్యారు. బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేంతవరకు సస్పెన్షన్ కొనసాగనుంది. సెక్రటరీ జనరల్ బెంచ్పైకి ఎక్కి నినాదాలు చేస్తూ సభ సజావుగా జరగనీయకుండా అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ ఎంపీలు మాణిక్యం ఠాగూర్, వారింగ్, కిరణ్ రెడ్డి సస్పెన్షతో పాటు మొత్తం ఎనిమిది మంది లోక్సభ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. -
భారత్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుడ్ న్యూస్


