breaking news
Narendra Modi
-
ఈసారి ఆ ముగ్గురి ఫోటో.. ట్రంప్లో వణుకు మొదలైంది..!
డొనాల్డ్ ట్రంప్.. నిన్న, మొన్నటి వరకూ ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేశారు. సుంకాల విధింపుతో పలు దేశాలకు నిద్ర లేకుండా చేసిన ట్రంప్కు ఇప్పుడు నిద్ర కరువైనట్లుంది. చైనా వేదికగా జరిగిన షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సదస్సు తర్వాత ట్రంప్ నోటి మాటలు కచ్చితంగా రావడం లేదు.. వెన్నులో వణుకు పుట్టిన మనిషి ఎలా బాధ పడతాడో అలా వ్యవహరిస్తున్నారు ట్రంప్.చైనా, భారత్, రష్యాల మైత్రిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమన్నారంటే.. ఆ మూడు దేశాల మైత్రి చాలా కాలం కొనసాగవచ్చు అంటూనే, తాము భారత్, రష్యాలను కోల్పోయామన్నారు. అదే సమయంలో కుట్ర పూరిత చైనాతో భారత్, రష్యాలు జట్టు కట్టడం విచారకమరన్నారు. తమతో దాదాపు ఆ రెండు దేశాల సత్సంబంధాలు తెగిపోయినట్లేనని మరొకవైపు విచారం వ్యక్తం చేశారు. చైనా వేదికగా జరిగిన షాంఘై సదస్సు, ఆ దేశం నిర్వహించిన అతిపెద్ద.. శక్తివంతమైన సైనిక పరేడ్పైనే ట్రంప్ ప్రధానంగా దృష్టి సారించారు. చైనా సైనిక పరేడ్కు పుతిన్తో పాటు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ హాజరు కావడం కూడా ట్రంప్ నోటిలో ఎలక్కాయ పడ్టట్లు అయ్యింది. నోటి మాట రాక, తన సోషల్ మీడియా సైట్ ‘ట్రూత్’ వేదికగా వరుస పోస్ట్లు పెడుతున్నారు ట్రంప్. ముందుగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఫోటోలు పెట్టి.. తన అసహనం వ్యక్తం చేసిన ట్రంప్.. మళ్లీ గంటల వ్యవధిలోనే చైనా అధ్యక్షుడు, భారత్ ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షులతో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా సైట్లో పెట్టి మూడు దేశాల మైత్రిపై స్పందించారు. ఆ మూడు దేశాల మైత్రి చాలా కాలం కొనసాగుతుందంటూనే ఎక్కడో తెలియని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక భారత్, రష్యాలు తమతో లేవనే బాధను కక్కలేక మింగలేక అన్న చందంగా పంచుకున్నారు. ట్రంప్పై వ్యతిరేక స్వరంఇక అమెరికాలో ట్రంప్పై వ్యతిరేక స్వరం ఎక్కువైంది. ట్రంప్ వ్యతిరేక వర్గం ప్రత్యేకంగా ఆయన చర్యలను తప్పుబడుతోంది. చైనాతో భారత్, రష్యాలు జట్టు కట్టడం కచ్చితంగా ప్రతీ అమెరికన్ వెన్నులో వణుకు పుట్టిస్తుందంటూ ఆ దేశ రాజకీయ విశ్లేషకుడు వేన్ జోన్స్ అభిప్రాయపడ్డారు. చైనాలో జరిగిన షాంఘై సదస్సు మూడు దేశాల(చైనా, రష్యా, భారత్)ల మధ్య జరిగిన చారిత్రాత్మక సదస్సుగా అభివర్ణించారు. ‘ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆ మూడు దేశాలు భారీ ఒప్పందాల దిశగా అడుగులు వేశాయి. మోదీ, పుతిన్, జిన్పింగ్ కలిసి దిగిన ఫోటోలే అందుకు నిదర్శనం. ఇక్కడ ఇరాన్, నార్త్ కొరియాలు కూడా కలిశాయి. ఇది ప్రతీ అమెరికన్కు వెన్నులో వణుకుపుట్టించే అంశం’ అంటూ ట్రంప్ పరిపాలనపై పరోక్షంగా సెటైర్లు వేశారు వేన్ జోన్స్ట్రంప్లో అది పశ్చాత్తాపమేనా?ఈసారి జరిగిన షాంషై సదస్సు ప్రతీ అమెరికన్ వెన్నులో వణుకే పుట్టించేది అన్న వేన్ జోన్స్ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ ట్రంప్ పదే పదే పోస్టులు పెట్టడం ఇప్పుడు ఆయనకు వెన్నులో వణుకు మొదలైందనడానికి సంకేతంగా చెప్పొచ్చు. అటు భారత్పై కాలు దువ్వి, ఇటు రష్యాపై కూడా నువ్వెంత అన్నట్లుగా వ్యవహరించిన ట్రంప్.. ఇప్పుడు తాను చేసిన తప్పుకు కాస్త పశ్చాత్తాపడుతున్నట్లే ఉన్నారు. తాము లేకపోతే ప్రపంచమే లేదు అన్నట్లు వ్యవహరించిన ట్రంప్కు చైనా, భారత్, రష్యాలు గట్టి షాక్ ఇవ్వడంతో ‘ వాట్ నెక్స్ట్’ అనే ఆలోచనలో పడ్డారాయన. అద్భుతమంటూనే సెటైర్ వేసిన ట్రంప్! -
మోదీ సర్కార్ మెగా డిఫెన్స్ ప్లాన్ రెడీ
ఢిల్లీ: మోదీ సర్కార్ 15 ఏళ్ల ప్రణాళికను ఆవిష్కరించింది. సైనిక దళాల ఆధునికీకరణకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ మెగా డిఫెన్స్ ప్లాన్ రూపొందించింది. న్యూక్లియర్ వార్ షిప్స్, హైపర్ సోనిక్ మిస్సైల్స్, లేజర్, రోబోటిక్స్, ఏఐ ఆయుధాలతో భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. నౌక దళం కోసం సరికొత్త ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అనంతరం మోదీ ప్రభుత్వం అతిపెద్ద రక్షణ అభివృద్ధి ప్రణాళికను ప్రకటించింది. దీని ద్వారా భారత సాయుధ దళాలను బిలియన్ల డాలర్ల పెట్టుబడితో అత్యాధునిక సాంకేతికతతో ఆధునీకరించనున్నారు. ఈ రోడ్ మ్యాప్ ప్రకారం, భారత్ తన ఆయుధాగారంలోకి అణుశక్తితో నడిచే యుద్ధ నౌకలు, నెక్ట్స్ జనరేషన్ యుద్ధ ట్యాంకులు, హైపర్సోనిక్ క్షిపణులు, స్టెల్త్ బాంబర్ డ్రోన్లు, AI- ఆధారిత ఆయుధాలు, అంతరిక్ష ఆధారిత యుద్ధ సాంకేతికతను చేర్చనుంది.భారత సైన్యం.. టి-72 యుద్ధ ట్యాంకులకు బదులుగా దాదాపు 1,800 అత్యాధునిక ట్యాంకులను, పర్వత ప్రాంత యుద్ధం కోసం 400 తేలికపాటి ట్యాంకులను, 50,000 ట్యాంకులకు అమర్చే యాంటీ-ట్యాంక్ గైడెడ్ క్షిపణులను, 700 రోబోటిక్ కౌంటర్-IED వ్యవస్థలను చేర్చుకోనుంది.నౌకా దళం ఒక కొత్త విమాన వాహక నౌక, 10 అధునాతన యుద్ధ నౌకలు, 7 ఆధునిక కార్వెట్లు, 4 ల్యాండింగ్ డాక్ ప్లాట్ఫారమ్లను పొందనుంది. యుద్ధ నౌకల కోసం అణు చోదక వ్యవస్థ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్లకు కూడా ఆమోదం లభించింది. -
ట్రంప్, మోదీ బంధం.. ఇది అందరికీ గుణపాఠం: బోల్టన్ సంచలన వ్యాఖ్యలు
వాష్టింగన్: భారత్, అమెరికా మధ్య ప్రస్తుతం ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. నేతలు మాధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇలాంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య వ్యక్తిగతంగా ఉన్న మంచి అనుబంధం ఇప్పుడు మాయమైపోయిందని యూఎస్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ తెలిపారు. ఇది ప్రతి ఒక్కరికి పాఠం లాంటిదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘భారత ప్రధాని మోదీతో అధ్యక్షుడు ట్రంప్నకు మంచి అనుబంధం ఉండేది. ఇప్పుడు అది కనిపించడం లేదు. ఇటీవలి కాలంలో భారత్ తీసుకున్న కొన్ని చర్యలే ఇందుకు కారణం కావచ్చు. అమెరికా-భారత్ సంబంధాలను వైట్ హౌస్ దశాబ్దాల వెనక్కి నెట్టింది. మోదీని రష్యా, చైనాకు చేరువ చేసింది. అమెరికా, ట్రంప్నకు ప్రత్యామ్నాయంగా బీజింగ్ తనను తాను ప్రదర్శించుకుంది.అయితే, ట్రంప్ అంతర్జాతీయ సంబంధాలను ఆయా నేతలతో తనకున్న వ్యక్తిగత అనుబంధాల కోణంలో చూస్తారు. ఒకవేళ ఆయనకు పుతిన్తో సత్సంబంధాలు ఉంటే.. అమెరికా, రష్యాల మధ్య అనుబంధం ఉంటుంది. కానీ.. వాస్తవానికి ఇది అసాధ్యం. ఇది ప్రతి ఒక్కరికి పాఠం లాంటిదే. సత్సంబంధాలు కొన్నిసార్లు సాయపడొచ్చు.. కానీ, అన్ని వేళలా రక్షించవు. ప్రస్తుతం భారత్ విషయంలో ట్రంప్ చాలా కఠినంగా వ్యవహరించాలని అనుకుంటున్నారు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, అమెరికా- భారత్ల మధ్య సుంకాల వివాదం వేళ బోల్టన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇదిలా ఉండగా.. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జాన్ బోల్టన్ జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేశారు. అయితే.. ట్రంప్ వ్యవహారశైలి నచ్చకపోవడంతో వచ్చిన విభేదాల నేపథ్యంలో రాజీనామా చేశారు. రహస్య పత్రాల దుర్వినియోగం ఆరోపణలపై విచారణలో భాగంగా బోల్టన్కు చెందిన నివాసం, వాషింగ్టన్ కార్యాలయంలో ఎఫ్బీఐ ఇటీవల సోదాలు నిర్వహించింది. -
భారత్, ఈయూ నిర్ణయం.. డిసెంబర్కల్లా స్వేచ్ఛా వాణిజ్యం!
న్యూఢిల్లీ: ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న స్వే చ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని(ఎఫ్టీఏ) ఈ ఏడాది డిసెంబర్కల్లా కుదుర్చుకోవాలని, అందుకోసం చర్చలను త్వరగా ముగించాలని భారత్, యూరోపియన్ యూనియన్(ఈయూ) నిర్ణయించుకున్నా యి. ప్రధాని మోదీ గురువారం 27 దేశాల ఈయూ కూటమి ముఖ్యనేతలు ఆంటోనియో కోస్టా, ఉర్సులా వాన్ డెర్ లెయన్తో ఫోన్లో మాట్లాడారు.అమెరికా భారీ టారిఫ్ల నేపథ్యంలో నిబంధనల ఆధారిత ప్రపంచ క్రమాన్ని(గ్లోబల్ ఆర్డర్) ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సమస్యల పరిష్కారంలో భారత్–ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యం పాత్ర కీలకమని మోదీ, ఆంటోనియో కోస్టా, ఉర్సు లా వాన్ డెర్ లెయన్ నిర్ణయానికొచ్చారు. త్వరలో ఇండియాలో జరుగను న్న ఇండియా– ఈయూ సదస్సు గురించి ముగ్గురు నేతలు చర్చించుకున్నారు. ఈ సదస్సుకు హాజరు కావాలని ఆంటోనియో కోస్టా, ఉర్సులాను మోదీ ఆహ్వానించారు. -
భారత్–సింగపూర్ మధ్య సుదృఢ బంధం
న్యూఢిల్లీ: సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరింపజేసుకోవాలని భారత్, సింగపూర్ నిర్ణయించుకున్నాయి. ఇందుకోసం ఒక రోడ్మ్యాప్ను ఆవిష్కరించాయి. ప్రస్తుతం ప్రపంచ భౌగోళిక రాజకీయాలు అస్తవ్యస్తంగా మారిన తరుణంలో ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణ కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరుదేశాలు తీర్మానించాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ గురువారం ఢిల్లీలో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలు, ప్రస్తుత పరిణామాలపై విస్తృతంగా చర్చించుకున్నారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. భారత్–సింగపూర్ మధ్య దౌత్యానికి మించిన గొప్ప అనుబంధం ఉన్నట్లు ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. కృత్రిమ మేధ(ఏఐ), క్వాంటమ్తోపాటు ఇతర డిజిటల్ టెక్నాలజీల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడాలి మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదంపై సింగపూర్తో కలిసి పోరాడుతున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. లారెన్స్ వాంగ్తో భేటీ అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు దేశాలు ఉగ్రవాదం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడడం మానవత్వాన్ని విశ్వసించే అన్ని దేశాల బాధ్యత అని స్పష్టంచేశారు. భారత్–సింగపూర్ సంబంధాలకు కలిసి పంచుకుంటున్న విలువలు, ప్రయోజనాలే ప్రాతిపదిక అని పేర్కొన్నారు. శాంతి, సౌభాగ్యాలే రెండుదేశాల ఉమ్మడి లక్ష్యమని వివరించారు. ప్రస్తుత ప్రపంచ పరిణామాల నేపథ్యంలో భారత్–సింగపూర్ భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఎన్నో రెట్లు పెరిగిందని లారెన్స్ వాంగ్ స్పష్టంచేశారు. మోదీ, వాంగ్ భేటీ నేపథ్యంలో ఇరుదేశాల నడుమ పలు అవగాహనా ఒప్పందాలపై(ఎంఓయూ) సంతకాలు జరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ), మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ మధ్య డిజిటల్ అస్సెట్ ఇన్నోవేషన్ ఒప్పందం కుదిరింది. అలాగే గ్రీన్ షిప్పింగ్ ఒప్పందంలో భాగంగా రెండు దేశాలు కలిసికట్టుగా గ్రీన్ అండ్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్(జీడీఎస్సీ)ను ఏర్పాటు చేయబోతున్నాయి. జేఎన్పోర్ట్ పీఎస్ఏ టెర్మినల్ రెండో దశ ప్రారంభం భారత, సింగపూర్ ప్రధానమంత్రులు మోదీ, లారెన్స్ వాంగ్ గురువారం ముంబైలో జేఎన్పోర్ట్ పీఎస్ఏ టెర్మినల్ రెండో దశను వర్చువల్గా ప్రారంభించారు. దీనివల్ల ఈ టెర్మినల్ కంటైనర్ హ్యాండ్లింగ్ సామర్థ్యం 4.8 మిలియన్ టీఈయూలకు పెరగనుంది. -
అన్నీ మంచి శకునములే...
భారతదేశంపై సుంకాలను అమెరికా అధ్యక్షుడు 50 శాతానికి పెంచిన ఐదు రోజులకు జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సమావేశాల నుంచి దేశానికి అన్నీ మంచి శకునాలే లభించాయి. చైనా, రష్యాలతో సంబంధాలు మరింత బలో పేతమయ్యాయి. ఈ కొత్త స్థితి వెంటనే అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్, ఆయన వాణిజ్య సలహాదారు పీటర్ నవారోలు,ఇండియాపై చేసిన అనుచితమైన వ్యాఖ్య లలో ప్రతిఫలించింది. ప్రధాని మోదీ తమపై కొంత అలిగినా తిరిగి వైఖరి మార్చుకోగలరని వారు చివరి వరకూ ఆశించారు. ఆయనకు తాము తప్ప గత్యంతరం లేదనుకున్నారు. కానీ, మోదీ వైఖరి మరింత దృఢంగా మారినట్లు తియాన్జిన్లో అడుగడుగునా కనిపించింది.అర్థాలు–అంతరార్థాలుఈ సందర్భంగా మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్న మాటలేమిటో యథాతథంగా చూడటం అవసరం. జిన్పింగ్తో సమావేశం అనంతరం మోదీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తూ, రెండు దేశాలూ అభివృద్ధిలో భాగస్వా ములే తప్ప ప్రత్యర్థులు కాదనీ, భిన్నాభిప్రాయాలు వివాదాలుగా మారరాదనీ భావించినట్లు పేర్కొన్నది. పరస్పర గౌరవం, ఉభయుల ప్రయోజనాలు, ఇరువురి సున్నితమైన మనోభావాల గుర్తింపు అవసర మన్నది. ఇటువంటి అవగాహనలు 21వ శతాబ్దపు ధోరణులకు అను గుణంగా బహుళ ధ్రువ ప్రపంచంతోపాటు బహుళ ధ్రువ ఆసియా రూపు తీసుకునేందుకు ఆవశ్యకమని పేర్కొన్నది. చైనాతో సంబంధాల మెరుగుదల నిరుటి కజాన్–బ్రిక్స్ సమావేశాల నుంచే మొద లైందని పలుమార్లు గుర్తు చేస్తున్న మోదీ, ఇపుడు రెండు దేశాల మధ్య ‘శాంతి, సుస్థిరతల వాతావరణం ఏర్పడింద’న్నారు. జిన్పింగ్ మాటలను కూడా కొంత చెప్పుకొన్న తర్వాత ఇరువురి అభిప్రాయాల అర్థాలు, అంతరార్థాలు చూద్దాము: రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన 80 సంవత్సరాల తర్వాత కూడా ప్రచ్ఛన్న యుద్ధ కాలపు మనస్తత్వం, ఆధిపత్య ధోరణి, ప్రొటెక్షనిజం కొనసాగుతున్నాయి. కొద్ది దేశాల అంతర్గత విధానాలను ఇతరులపై రుద్దకూడదు. అంతర్జాతీయ నియమ నిబంధనలన్నవి పరీక్షాత్మక దశకు చేరుకున్నాయి. సమ్మిళితమైన ఆర్థిక ప్రపంచీకరణ అవసరం. భారతదేశం, చైనాలు పరస్పర విశ్వాసాన్ని బలపరచుకుని, పరస్పర అభివృద్ధికి అవకాశాలను పెంచుకోవాలి. వ్యూహాత్మకమైన, దీర్ఘ కాలిక దృక్కోణంతో వ్యవహరించాలి. నాయకులిద్దరూ చెప్పినవి ఇంకా ఉన్నాయిగానీ, అన్నీ ఈ ప్రధా నమైన మాటల చుట్టూ తిరిగేవే. సరిహద్దు వివాదాన్ని, పాకిస్తాన్ అంశాన్ని ప్రధానంగా ముందుకు తెచ్చుకుని అభివృద్ధి సహకార అవకాశాలను విస్మరించవద్దన్నది మొదటి అంతరార్థం. ఇరువురి సున్నిత మనోభావాలన్నది ఇందుకు సంబంధించినదే గాక, ఆసియాతో పాటు ప్రపంచంలోనూ ఒక శక్తిగా ఎదగజూస్తున్న ఇండి యాకు ఆటంకాలు కల్పించరాదనే అర్థం వస్తుంది. ఇక్కడ, బహుళ ధ్రువ ప్రపంచం అన్నమాటతో పాటు, బహుళ ధ్రువ ఆసియా అనే మాటను కొత్తగా ఉపయోగంలోకి తేవటం గమనించదగ్గది. అనగా, చైనాయేగాక ఇండియా కూడా ఒక ధ్రువమనేది గుర్తించటమన్న మాట. 21వ శతాబ్దపు ధోరణులలోకి అది కూడా వస్తుంది. సుంకాలకు ముందు నుంచే...చైనాతో సంబంధాల మెరుగుదల కజాన్ నుంచే మొదలైన మాట నిజమే అయినా ఆ విషయాన్ని మోదీ పదేపదే ఎందుకు ప్రస్తావిస్తున్నట్లు? కేవలం ట్రంప్ సుంకాలు అందుకు కారణమని అమెరికాలో, బయటా జరుగుతున్న ప్రచారం నిజం కాదనీ, భారత దేశం తన ప్రయోజనాల కోసం స్వతంత్ర నిర్ణయాలు గతం నుంచే తీసుకుంటున్నదనీ ప్రకటించేందుకు!చైనా అధ్యక్షుని ఉద్దేశం... రెండు దేశాల మధ్య సరిహద్దుల వంటి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, అందుకు పరిష్కార ప్రయ త్నాలు జరుగుతున్నందున, అందుకు బందీ కాకుండా, పరస్పర అభివృద్ధి అవకాశాలపై దృష్టి పెట్టాలని! అందుకు అనుగుణంగా తాము భారతదేశంతో కలిసి పనిచేయగలమనటం! ఆయన ఉప యోగించిన డ్రాగన్, ఏనుగు కలిసి నాట్యం చేయటమనే మాటలో ఈ అంతరార్థాలన్నీ కనిపిస్తాయి. మారుతున్న పరిస్థితులు, అందు వల్ల రెండు దేశాలకు కలుగుతున్న సమస్యలు, వాటి నుంచి బయట పడేందుకుగానీ, భవిష్యత్తులో అభివృద్ధి కోసం గానీ అవసరమైన వేమిటో రెండు దేశాల నాయకులకు స్పష్టమైన అవగాహన ఏర్పడి నట్లు కనిపిస్తున్నది. రెండు దేశాల మధ్య చాలా కాలంగా నిలిచి పోయిన ఒప్పందాలు ఒక్కటొక్కటిగా ఇప్పటికే జరుగుతుండటం తెలిసిందే.స్పష్టమైన సందేశంరష్యా విషయానికి వస్తే, ప్రధాని మోదీ రష్యా అధ్యక్షునితో జరిపిన సమావేశం, అనూహ్యంగా ఆయన కారులో ప్రయాణించటం, హోటల్కు చేరిన తర్వాత కూడా కారులోనే ఉండి ముప్పావు గంట సేపు చర్చించి ఆ ఫొటోను పోస్ట్ చేయటం, బయట కూడా పుతిన్తో కలిసి వెళ్లి జిన్పింగ్తో చేసిన సంభాషణల వంటివన్నీ ఇటు భారతీయులకు, ప్రపంచ దేశాలకు, అటు అమెరికా శిబిరానికి పంపవలసిన సందేశాలనే పంపాయి. దేశ ప్రయోజనాల కోసం రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగటమే గాక, ఉభయుల మధ్యగల చిరకాలపు సాన్నిహిత్యం ఇంకా బలపడగలదని, సుంకా లకు వెరవబోమనే సంకేతాలను భారత ప్రధాని అమెరికా శిబిరానికి 50 శాతం నాటి ముందుకన్నా బలంగా పంపటం విశేషం. ఇప్పటి కైనా వివేకం కలిగితే ఆ శిబిరం చేయవలసింది తమ తీరును అన్ని విధాలా మార్చుకుని, మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా వ్యవహరించటం!షాంఘై సంస్థ నిజానికి రక్షణ, తీవ్రవాదం అంశాలకు సంబంధించినది. కానీ, మొదటిసారిగా తియాన్జిన్లో ఆర్థిక, రాజకీయ, భౌగోళిక వ్యూహాల గురించి చర్చించటం మారుతున్న పరిస్థితులకు, పాశ్చాత్య ప్రపంచానికి బయటి దేశాల ఆందోళనలు, అవసరాలకు అద్దం పడుతున్నది. ఈ విధంగా ‘బ్రిక్స్’కు అదనంగా మరొక సంస్థ క్రమంగా బలపడుతున్నది. కజాన్లో వలెనే తియాన్జిన్లోనూ పాశ్చాత్య ఆధిపత్య వ్యతిరేకత, బహుళ ధ్రువ ప్రపంచ నిర్మాణం, డాలర్ను క్రమంగా బలహీనపరచటం, ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థలు, ప్రస్తుతం గల అంతర్జాతీయ వ్యవస్థలపై అమెరికా కూటమి నియంత్రణ స్థానే సంస్కరణలతో ప్రజాస్వామికీకరణ, వర్ధమాన దేశాల మధ్య అవగాహనలను, మైత్రీ సహకారాలను బలపరచుకోవటం ప్రధానాంశాలయ్యాయి.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
దేశ ప్రగతికి ‘డబుల్ డోసు’
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను(జీఎస్టీ)లో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. దేశ అభివృద్ధికి ఇది ‘డబుల్ డోసు’ మద్దతు అని తేల్చిచెప్పారు. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో పన్నుల విధానం గందరగోళం ఉండేదని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నుల వ్యవస్థను సంస్కరించి, సరళీకృతం చేశామని పేర్కొన్నారు. జీఎస్టీలో తాజా సంస్కరణలను ప్రసార మాధ్యమాలు ‘జీఎస్టీ 2.0’గా అభివరి్ణస్తున్నాయని తెలిపారు. తాజా మార్పులతో రెండు విధాలుగా లబ్ధి కలుగుతుందని వివరించారు. సాధారణ ప్రజలకు డబ్బు ఆదా కావడంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని.. అందుకే ఇది డబుల్ డోసు అని స్పష్టంచేశారు. గురువారం ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన విజేతలతో మోదీ మాట్లాడారు. జీఎస్టీలో సంస్కరణలతో సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని తెలియజేశారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే... ‘‘దేశం స్వయం సమృద్ధి సాధించాలి. అందుకోసం తదుపరి తరం సంస్కరణలను ఆపే ప్రసక్తేలేదు. దేశ ప్రజలకు డబుల్ ధమాకా ఇస్తానని ఎర్రకోట నుంచి హామీ ఇచ్చా. సెపె్టంబర్ 22న నవరాత్రుల తొలి రోజు నుంచే ఈ ధమాకా అందుబాటులోకి రాబోతోంది. దేశ చరిత్రలో ఇదొక మైలురాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలపై అధిక పన్నులు విధించాయి. వంట గదిలో వాడుకొనే వస్తువులను, ఆఖరికి ఔషధాలను కూడా వదిలిపెట్టలేదు. అప్పటి పాలన ఇంకా కొనసాగుతూ ఉంటే రూ.100 విలువైన వస్తువు కొనుగోలుపై రూ.25 పన్ను చెల్లించాల్సి వచ్చేది. ప్రజల చేతుల్లో డబ్బులు మిగిల్చి, వారి జీవితాలను మెరుగుపర్చాలన్న ధ్యేయంతో మేము పని చేస్తున్నాం. ఆన్లైన్ మనీ గేమింగ్ను నియంత్రించడానికి కొత్త చట్టం తీసుకొచ్చాం. ఈ విషయంలో మాపై ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గలేదు. యువత భవిష్యత్తుకు భద్రత కల్పించాలని నిర్ణయించాం. గేమింగ్ అనేది చెడ్డది కాకపోయినా అదే పేరుతో జూదం ఆడడం ప్రమాదకరమే. ఆన్లైన్ గేమింగ్ సరైన రీతిలో నిర్వహిస్తే గ్లోబల్ మార్కెట్లో మన దేశమే నంబర్ వన్ అవుతుంది. మన దేశ ప్రగతి కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వదేశీ ఉత్పత్తులే ఉపయోగించుకోవాలని మరోసారి కోరుతున్నా’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
Top Twitters: మోడీ తర్వాత మన ఎన్టీఆరే..!
-
ట్రంప్తో జస్ట్ 30 సెకన్లు.. మోదీతో మాత్రం 45 నిమిషాలు
చైనా టియాంజిన్ వేదికగా జరిగిన షాంగై సదస్సు తర్వాత.. భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్లు ద్వైపాక్షికంగా భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే హోటల్లో భేటీ జరిగింది కేవలం 15 నిమిషాలుకాగా, మరో 45 నిమిషాల ఇద్దరూ కారులోనే ప్రయాణించారు. ఈ ప్రయాణంలో వాళ్లేం మాట్లాడుకున్నారనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమైంది. షాంగై సదస్సు కోసం మోదీ రెండ్రోజులపాటు చైనాలో పర్యటించిన సంగతి తెలిసిందే. సదస్సు వేదికగా.. పహల్గాం ఉగ్రదాడిపై సభ్యదేశాల మద్దతును తీర్మానం రూపంలో కూడగట్టారాయన. అయితే సోమవారం సదస్సు తర్వాత.. మోదీ కోసం పుతిన్ 10 నిమిషాలు ఎదురు చూశారు. ఆపై మోదీతో కలిసి తన ప్రత్యేకమైన ఆరుస్ లిమోసిన్Aurus limousine కారులో మాట్లాడుకుంటూ ప్రయాణించారు. అమెరికాతో భారత్కు టారిఫ్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఈ ఇద్దరూ భేటీ కావడం, పైగా ఆ కారు చాలా ప్రత్యేకమైన భద్రతా వ్యవస్థతో కూడుకున్నది కావడంతో ఆటోమేటిక్గా ఏం మాట్లాడుకున్నారనే ప్రశ్న ఎదురైంది. అయితే అందులో పెద్ద రహస్యం ఏం లేదని చైనా పర్యటనలోనే ఉన్న పుతిన్ చెప్పుకొచ్చారు. ‘‘అందులో సీక్రెట్ ఏం లేదు. ఆలస్కా సదస్సులో జరిగిన పరిణామాలను ఆయనకు వివరించా’’ అని ప్రెస్మీట్లో పుతిన్ చెప్పారు. అంతేకాదు.. అలస్కా భేటీ సమయంలోనూ ఆయన ట్రంప్తో కారులో ప్రయాణించిన విషయంపైనా క్లారిటీ ఇచ్చారు. అలస్కా యాంకరేజ్ ఎయిర్పోర్టులో దిగిన తర్వాత పుతిన్, ట్రంప్కు చెందిన లిమోసిన్ ‘ది బీస్ట్’లో భేటీ జరగాల్సిన ప్రాంతం వద్దకు ప్రయాణించారు. అయితే.. ఎయిర్పోర్ట్ నుంచి వేదిక చాలా దగ్గర. అందుకే తమ మధ్య కేవలం 30 సెకన్లపాటే మాటలు జరిగాయని.. అదీ కూడా బ్రోకెన్ ఇంగ్లీష్లోనే సాగిందని అన్నారు. ఆ సమయంలో.. ట్రంప్ పూర్తి ఆరోగ్యవంతంగా కనిపించడంతో తాను సంతోషం వ్యక్తం చేశానని పుతిన్ అన్నారు. మరోవైపు.. రష్యా నేషనల్ రేడియో స్టేషన్ ‘వెస్టిఎఫ్ఎమ్’ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించింది. మోదీ-పుతిన్లు తమ బృందాలతో చైనాలోని ఓ హోటల్లో భేటీ అయ్యారు. అంతకంటే ముందు.. ఆ వేదికకు చేరే క్రమంలో కారులో సుదీర్ఘంగా సంభాషించుకున్నారు అని తెలిపింది. మరోవైపు.. క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పందిస్తూ.. పుతిన్-మోదీ ముఖాముఖి మాట్లాడుకున్నారు. ఆయన(పుతిన్) తమ సంభాషణ మధ్యలో ఎలాంటి అంతరాయం కలగకూడదని భావించే కారులో ప్రయాణించారు’’ అని తెలిపారు. ఇదిలా ఉంటే.. రష్యాతో చమురు, ఆయుధాల కొనుగోళ్లు నేపథ్యంతో ట్రంప్ భారత్పై సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. భారత్ తమ దేశంపై అధిక సుంకాలు విధిస్తోందంటూ సంచలన ఆరోపణలకు దిగారాయన. ఈ పరిణామంపై పుతిన్ తీవ్రంగా స్పందించారు. ఇండియా, చైనాలాంటి దేశాలతో ఆ తీరున వ్యవహారించడం సరికాదని, భాగస్వామ్య దేశాలతో మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వ్యవహరించాలి అని ట్రంప్ వైఖరిని తప్పుబట్టారు. మరోవైపు పుతిన్ డిసెంబర్లో భారత్ పర్యటనకు రానున్నారు, ఉక్రెయిన్ శాంతి చర్చలు.. కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఆగస్టు 15న తటస్థ వేదికగా అలస్కాలో ట్రంప్-పుతిన్ల భేటీ జరిగింది. అయితే ఈ భేటీ ఫలవంతంగా జరగలేదని తెలుస్తోంది. మరోవైపు జెలెన్స్కీ-యూరప్ దేశాధినేతలతో వైట్హౌజ్లో జరిగిన చర్చలు మాత్రం సవ్యంగా సాగినట్లు సంకేతాలు అందాయి. దీంతో.. తదుపరి దశలో జరగబోయే అమెరికా-ఉక్రెయిన్-రష్యా త్రైపాక్షిక చర్చలపై ఉత్కంఠ నెలకొంది. -
అల్లు కనకరత్నమ్మ మృతికి ప్రధాని సంతాపం
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ(94) మృతి చెందిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గత శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. కనకరత్నమ్మ మృతి పట్ల ధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అల్లు కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. కనకరత్నమ్మ తన కళ్లను దానం చేయడం గొప్ప విషయం అని.. ఒక జీవితానికి వెలుగునిచ్చి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఈ కష్ట సమయంలో అల్లు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ మోదీ ఓ సందేశాన్ని పంపారు. ప్రధానమంత్రి తెలిపిస సంతాప సందేశానికి అల్లు అరవింద్ కృతజ్ఞతలు తెలిపారు.అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం హైదరాబాద్లోని కోకాపేటలోని అల్లు కుటుంబ ఫామ్హౌస్లో జరిగాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, వెంకటేష్, నాగ చైతన్య, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. -
జీఎస్టీ భారీగా తగ్గింపు.. వీటి ధరలు దిగొస్తాయ్
న్యూఢిల్లీ: సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ధరల భారం దించుతూ జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవంనాడు ప్రధాని ప్రకటించిన దీపావళి కానుక దసరాకు ముందే వచ్చింది. చపాతీ, పరోటా, బ్రెడ్డు, బన్నులపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అధ్యక్షతన భేటీ అయిన జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. అంతేకాదు కుటుంబాలకు ఆధారమైన ఆరోగ్య, జీవిత బీమాపై ప్రస్తుతమున్న 18 శాతం జీఎస్టీని ఎత్తివేయనుంది. దీంతో ఆ మేరకు వాటి ప్రీమియంలు తగ్గనున్నాయి. ఇకపై జీఎస్టీలో 5, 18 శాతం పన్ను శ్లాబులే ఉంటాయి. 12 శాతం, 28 శాతం శ్లాబుల్లోని వస్తువులు 5, 18 శాతం శ్లాబుల్లోకి మారనున్నాయి. బంగారం, వెండి, వజ్రాభరణాలపై ప్రత్యేక పన్ను రేటు 3 శాతం ఇక ముందూ కొనసాగనుంది. సెప్టెంబర్ 22 నుంచే (దేవీ నవరాత్రి వేడుకలు మొదలయ్యే రోజు) కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. కేంద్రం ప్రతిపాదనలకు అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ‘‘సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని ఈ సంస్కరణలు చేపట్టాం. సామాన్యులు రోజువారీ వినియోగించే అధిక శాతం వస్తువులపై పన్ను రేట్లు గణనీయంగా తగ్గనున్నాయి. కార్మీకుల ఆధారిత రంగాలకు చక్కని మద్దతు లభిస్తుంది. రైతులు, వ్యవసాయ రంగం, ఆరోగ్య రంగం ప్రయోజనం పొందుతాయి. ఆర్థిక వ్యవస్థలోని కీలక చోదకాలకు ప్రాధాన్యం ఇచ్చాం’’అని మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. వ్యాపార నిర్వహణ సైతం సులభతరం అవుతుందని, నిబంధనల అమలు సరళంగా మారుతుందన్నారు. తాజా పన్ను శ్లాబుల క్రమబద్దీకరణతో రూ.48,000 కోట్ల ఆదాయం తగ్గిపోనుందని, ద్రవ్యపరంగా దీన్ని ఎదుర్కోగలమని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ నిర్ణయాలతో దేశీ వినియోగం మరింత పెరుగుతుందన్నది కేంద్ర ప్రభుత్వం అంచనా. మన జీడీపీలో 61.4 శాతం వినియోగం రూపంలోనే సమకూరుతుండడం గమనార్హం. జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చిన రెండో ఏడాదిలో జీడీపీ వృద్ధి 0.5 శాతం మేర అదనంగా నమోవుతుందని ఆర్థిక వేత్తల అంచనా. భారత ఉత్పత్తులపై అమెరికా విధించిన 50 శాతం టారిఫ్లు దేశ ఆర్థిక వృద్ధిని 0.20–0.50 శాతం ప్రభావితం చేస్తాయన్న ఆందోళనలు నెలకొనగా.. జీఎస్టీ సంస్కరణలతో ఈ ప్రభావం సమసిపోనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీటి ధరలు దిగొస్తాయ్.. ప్రస్తుతం బ్రాండెడ్ బ్రెడ్, బ్రెడ్ ఉత్పత్తులపై 5–18 శాతం మేర జీఎస్టీ అమల్లో ఉండగా ఇది తొలగిపోనుంది. పరాటాపై 18 శాతం, చపాతీ, యూహెచ్టీ పాలపై 5 శాతం రేటును ఎత్తివేయనున్నారు. నిత్యావసరాలైన టూత్పేస్ట్, టూత్ బ్రష్లు, టాల్కమ్ పౌడర్, షాంపూలు, సబ్బులు, హెయిర్ ఆయిల్, బటర్, నెయ్యి, మాంసం, బిస్కెట్లతో పాటు షుగర్ కన్ఫెక్షనరీ, జామ్, ఫ్రూట్ జెల్లీలు, డ్రై నట్స్, ఐస్క్రీమ్, పండ్ల రసాలు, కార్న్ఫ్లెక్స్ తదితర ఉత్పత్తులపై 18 శాతం జీఎస్టీ 5 శాతానికి తగ్గిపోనుంది. ఇక వంటింటి వస్తువులు, గొడుగులు, సైకిళ్లు, వెదురు ఫర్నీచర్ వస్తువులు, ఫీడింగ్ బాటిళ్లు, టూత్ పౌడర్పై పన్ను 12 శాతం నుంచి 5 శాతానికి దిగిరానుంది. ఇంటి నిర్మాణంలోకి వినియోగించే సిమెంట్పైనా పన్ను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గనుంది. 350 సీసీ ఇంజన్ సామర్థ్యం వరకు ఉన్న ద్విచక్ర మోటారు వాహనాలు, ఏసీలు, డిష్వాషర్లు, టీవీలు (32 అంగుళాలకు పైన) తదితర ఎలక్ట్రానిక్స్ వస్తువులపైనా ధరల భారం 28 శాతం నుంచి 18 శాతానికి దిగిరానుంది. ప1,200 సీసీ, 4,000 ఎంఎం పొడవు మించని పెట్రోల్, ఎల్పీజీ, సీఎన్జీ వాహనాలు, 1,500 సీసీ వరకు ఉన్న డీజిల్ వాహనాలపైనా పన్ను రేటు 18 శాతానికి తగ్గనుంది. 1,200 సీసీ నుంచి 4,000 ఎంఎం కంటే పొడవైన మోటారు వాహనాలు, 350సీసీకి పైన ద్విచక్ర వాహనాలు, ఎయిర్క్రాఫ్ట్లు (వ్యక్తిగత వినియోగానికి), రేసింగ్కార్లు, క్యాసినోలు/గ్యాంబ్లింగ్/గుర్రపు పందేలు/లాటరీలపై 40 శాతం పన్ను రేటు అమలవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలపై ఎప్పటి మాదిరే 5 శాతం పన్ను కొనసాగనుంది. పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతానికి 28 శాతం సిగరెట్లు, గుట్కాలు, పాన్ మసాలా, జర్దా తదితర పొగాకు ఉత్పత్తులపైనా 40 శాతం పన్ను రేటును ప్రతిపాదించారు. అయినప్పటికీ ప్రస్తుతానికి వీటిపై 28 శాతం జీఎస్టీ, దీనిపై కాంపన్సేషన్ సెస్సును కొనసాగించనున్నారు. రాష్ట్రాలకు ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు తీసుకున్న రుణాలను తిరిగి పూర్తిగా చెల్లించేంత వరకు ఇది కొనసాగుతుందని ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. ఆ తర్వాత వీటిపైనా 40 శాతం పన్ను రేటు అమలు కానుంది. ఇది ఎప్పటి నుంచి అన్నది జీఎస్టీ మండలి తర్వాత నిర్ణయిస్తుంది. పౌరుల జీవనం మెరుగుపడుతుంది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పన్ను తగ్గింపులు, జీఎస్టీ సంస్కరణలకు జీఎస్టీ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలు సామాన్యులకు, రైతులు, ఎంఎస్ంఎఈలు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, యువతకు ప్రయోజనం కలిగిస్తాయి. ఈ విస్తృత స్థాయి సంస్కరణలు పౌరుల జీవనాన్ని మెరుగుపరుస్తాయి. వ్యాపార నిర్వహణ అన్నది, ముఖ్యంగా చిన్న వర్తకులు, వ్యాపారులకు సులభతరం అవుతుంది’’ – ఎక్స్ ప్లాట్ఫామ్పై ప్రధాని మోదీ స్పందన -
జిన్పింగ్ కుడి భుజం కైక్వీతో మోదీ చర్చలు.. ‘నవ్వని వ్యక్తి’తో నెగ్గుకొచ్చారా?
బీజింగ్: కైక్వీ.. కమ్యూనిస్ట్ చైనాలో అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకరు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు కుడిభుజంగా పేరొందిన కైక్వీ అంటే అపరచాణిక్యుడనే పేరు. అటు చైనా కమ్యూనిస్ట్ పార్టీ(సీపీపీ)లో అగ్రగణ్యునిగా కొనసాగుతూనే ఇటు ప్రభుత్వంలోనూ కీలక పదవుల్లో అవలీలగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిన్పింగ్కు తల్లో నాలుకలా వ్యవహరిస్తూ జాతీయ, అంతర్జాతీయ వ్యవహరాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎప్పుడూ సీరియస్గా కనిపిస్తారు. ఆయన నవ్వడం ఎవరూ చూడలేదని చైనా రాజకీయవర్గాల్లో ఓ మాట వినిపిస్తుంది.విదేశాల నుంచి జిన్పింగ్ను కలిసేందుకు ఎందరో దౌత్యాధికారులు వచ్చినా తర్వాత కైక్వీని కలిసి ప్రసన్నంచేసుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఆయన ఎవరినీ కలవరు. ఇటీవల షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) శిఖరాగ్ర భేటీ కోసం తియాంజిన్ తీరనగరానికి విచ్చేసిన ఎస్సీఓ అగ్రనేతలు, దౌత్యవేత్తలు తనను కలవాలని చూసినా కైక్వీ ససేమిరా అన్నారట. అలాంటి కైక్వీ ప్రత్యేకంగా భారత ప్రధాని మోదీతో 45 నిమిషాలకుపైగా విడిగా మాట్లాడిన వార్త ఇప్పుడు చైనా వ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది.చైనాలో జిన్పింగ్ శకం ముగిసి కైక్వీ భావ చైనా అధ్యక్షుడు కావొచ్చనే వాదన సైతం మొదలైంది. అందుకే కైక్వీతో మోదీ భేటీని జిన్పింగ్ స్వయంగా ఏర్పాటుచేశారని తెలుస్తోంది. గల్వాన్ ఘటన తర్వాత దెబ్బతిన్న భారత్, చైనా బంధాన్ని మళ్లీ పూర్వస్థితికి తీసుకురావడమే లక్ష్యంగా కైక్వీని కలవాలని మోదీకి జిన్పింగ్ సూచించినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇరుదేశాల మధ్య బంధాన్ని పటిష్టపర్చి మరింత మెరుగైన ఆర్థిక, దౌత్య సంబంధాల కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలపైనా ఈ భేటీలో చర్చ జరిగినట్లు వార్తలొచ్చాయి. ఎవరీ కైక్వీ? చైనా కమ్యూనిస్ట్ పారీ్టలో అత్యున్నత నిర్ణాయక మండలిలో ఈయన సీనియర్సభ్యునిగా ఉన్నారు. పార్టీ పొలిట్బ్యూరో స్టాండింగ్ కమిటీలో ఐదో అత్యున్నత నేతగా కొనసాగుతున్నారు. జిన్పింగ్కు అత్యంత సన్నిహితుడుగా పేరొందారు. జిన్పింగ్కు చీఫ్ ఆఫ్ స్టాఫ్గానూ కైక్వీ మరో పదవిలో కొనసాగుతున్నారు. మావో తర్వాత చైనాలో ఇలా రెండు, మూడు పదవుల్లో ఏకకాలంలో కొనసాగుతున్న వ్యక్తి ఈయనే కావడం విశేషం. చైనాలోని అధికార క్రమంలో ఐదో స్థానంలో ఉన్నప్పటికీ జిన్పింగ్తో ఉన్న అత్యంత దగ్గరి రాజకీయ సాన్నిహిత్యం కారణంగా తదుపరి దేశాధ్యక్షుడు ఇతననే వాదన సైతం బలంగా వినిపిస్తోంది.ఫుజియాన్ ప్రావిన్స్లోని యూక్సీ కౌంటీలో జన్మించిన ఈయ తొలిసారిగా 1980వ దశకంలో జిన్పింగ్ను కలిశారు. 1975లో ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. సాన్మింగ్, ఖ్వుజోయూ, హాంగ్జోయూ నగరాలకు మేయర్గా పనిచేసిన అనుభవం ఉంది. 2016లో బీజింగ్ నగరానికి తాత్కాలిక మేయర్గా పనిచేశారు. ప్రస్తుతం చైనా ప్రభుత్వంలో, పార్టీలో ఏ స్థాయి ర్యాంక్లో కొనసాగుతున్నాసరే కైక్వీ మాట చెల్లుబాటు అవుతుందని తెలుస్తోంది. పార్టీ జనరల్ ఆఫీస్కి డైరెక్టర్గానూ ఉన్నారు. జిన్పింగ్ను అందరి ఎదుట కైక్వీ ‘అంకుల్’, ‘బాస్’అని పిలుస్తారు. -
నేను క్షమించినా ప్రజలు క్షమించరు: మోదీ
పట్నా: బిహార్లో రాహుల్గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో మోదీ తల్లి దివంగత హీరాబెన్నుద్దేశిస్తూ కొందరు విపక్షనేతలు అవమానకరంగా మాట్లాడిన ఉదంతంపై ప్రధాని మోదీ తొలిసారిగా ఆవేదనాభరితంగా స్పందించారు. బిహార్లో మహిళల నైపుణ్యాభివృద్ధికి కృషిచేసే కొత్త ‘బిహార్ రాజ్య జీవిక నిధి సహకార సంఘ్ లిమిటెడ్’ను మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించి లక్షలాది మంది మహిళలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘ దివంగత నా మాతృమూర్తికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. రాజకీయాలకు దూరంగా ఉండిపోవడమే ఆమె చేసిన తప్పా? ఆమెను మాత్రమే దూషించాల్సిన అవసరం ఏమొచ్చింది?’’ అంటూ గద్గద స్వరంలో మోదీ తన ప్రసంగాన్ని మొదలెట్టారు.‘‘ నా తల్లిని అవమానించిన బిహార్ ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలను నేను క్షమిస్తానేమోగానీ దేశంలోని ప్రజలెవ్వరూ వారిని క్షమించబోరు. ఒకరి తల్లిని దూషించిన వారిని ఇంకొకరు పొరపాటున కూడా క్షమించబోరు. తల్లిపై దారుణదూషణోదంతంలో ఆర్జేడీ–కాంగ్రెస్ పార్టీలను బాధ్యులను చేయాల్సిన కనీస బాధ్యత బిహార్లోని ప్రతి ఒక్క కుమారుడిపై ఉంది. ఆర్జేడీ–కాంగ్రెస్ నేతలు ఏ వీధిలోకి వెళ్లినా, ఏ పట్టణంలో ప్రచారంచేసినా అక్కడ మాతృమూర్తులు, సోదరీమణులను అవమానిస్తే అస్స లు ఊరుకోబోమని, సహించబోమని గట్టిగా, స్పష్టంగా తెలిసేలా చేయండి’’ అని బిహార్ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు.‘‘ తల్లిపై దుర్భాషలాడిన ఆర్జేడీ–కాంగ్రెస్ నేతలను బిహార్లోని తల్లులు, సోదరసోదరీమణులు వీధుల్లోకి వచ్చిమరీ నిలదీయాలి. ఇలాంటివి అస్సలు సహించబోమని స్పష్టంచేయాలి. నన్ను విమర్శించే క్రమంలో తల్లిని, మహిళను తిడితే ఎవ్వరూ ఊరుకోబోరని, తిట్లదండకానికి తెరదించుతామని మీరంతా నిరూపించాలి’’ అని మహిళలకు మోదీ పిలుపునిచ్చారు. బిహార్ రాజ్య జీవిక నిధి సహకార సంఘ్ లిమిటెడ్ అనేది మహిళా స్వయంసహాయక బృందాలకు తక్కువ వడ్డీలకు రుణాలను అందిస్తూ వారి నైపుణ్యాభివృద్ధికి కృషిచేస్తుంది.జానకీమాతకు జన్మస్థలి‘‘బిహార్ అనేది జానకీమాతకు జన్మస్థలి. బిహార్ రాష్ట్రం ఎల్లవేళలా మహిళలను గౌరవిస్తుంది. ఆర్జేడీ–కాంగ్రెస్ సంయుక్త రాజకీయ కార్యక్రమం నా తల్లిని అవమానించేందుకు వేదికగా మారడం, అందునా బిహార్లో ఈ కార్యక్రమం జరగడాన్ని అస్సలు ఊహించలేదు. ఇది నిజంగా బిహార్ తల్లులు, సోదరీమణులను అవమానించడమే. ఇలాంటి నేతలను బిహార్ ప్రజలు అస్సలు క్షమించరు’’ అని మోదీ అన్నారు. ‘‘ ఆర్జేడీ పాలనా కాలంలో తల్లులు, మహిళలు ఎన్నో అవస్థలు పడ్డారు. నేరçస్తులు, రేపిస్టులు, హంతకులను ఆర్జేడీ ప్రభుత్వం కంటికిరెప్పలా కాపాడుకుంది. తమ కుటుంబసభ్యులు క్షేమంగా రోజూ ఇంటికి తిరిగొస్తారో లేదోనని బిహార్ మహిళలు బిక్కుబిక్కుమంటూ గడిపారు.అందుకే తర్వాత మహిళా ఓటర్లు ఆర్జేడీ సర్కార్ను ఇంటికి సాగనంపారు. నాడు ఆర్జేడీ కూటమిని ఇంటికి సాగనంపిన అదే మహిళాలు ఇప్పుడు నా తల్లికి జరిగిన అవమానాకి ప్రతీకారం తీర్చుకుంటారు. దర్భంగాలో జరిగిన దుర్ఘటన విపక్షాల కూటమి దారుణాలకు దర్పణం పడుతోంది. రాష్ట్రంలో మహిళలు దోపిడీ, అణచివేతకు గురవుతున్నారు’’ అని మోదీ అన్నారు. ‘‘ కొడుక్కి తన తల్లి అంటే దేవత, దైవంతో సమానం’’ అని భోజ్పురీ సామెతను రాబోయే నవరాత్రి, ఛాత్ పండుగలను పురస్కరించుకుని మోదీ గుర్తుచేశారు. ‘‘సూర్యభగవానుని మహిళారూపంలో ఏడుగురు దుర్గామాత అక్కచెల్లెళ్ల రూపంలో బిహార్ ప్రజలు పూజిస్తారు. అలాంటి ప్రజలకు కాంగ్రెస్–ఆర్జేడీ క్షమాపణలు చెప్పాల్సిందే’’ అని మోదీ అన్నారు.‘‘ దేశసేవకు నా జీవితాన్ని అంకితం చేస్తానని మా అమ్మతో చెప్పినప్పుడు ఆమె అందుకు అడ్డుచెప్పలేదు. పైగా దేశసేవ చేస్తానన్నందుకు అభినందించి ప్రోత్సహించారు. కుటుంబ బాధ్యతల నుంచి తప్పుకుంటానని చెబితే వారించలేదు. పేద తల్లి కుమారుడు అధికారాన్ని(ప్రధాని పదవిని) స్వీకరించడం పేరుగొప్ప నేతలకు అస్సలు నచ్చట్లేదు. మహిళలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతినీ వాళ్లు ఓర్వలేకపోతున్నారు. దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిగా ఆసీనులైన ద్రౌపదీముర్మును సైతం అవమానించడానికి వాళ్లు దుస్సాహసం చేశారు. నాకంటే 20 ఏళ్లు జూనియర్ అయిన(రాహుల్గాంధీ) ఓ వ్యక్తి ఓ పదిహేను రోజులు ఎస్ఐఆర్పై పోరు పేరు చెప్పి యాత్రచేశారు’’ అని రాహుల్గాంధీని పరోక్షంగా విమర్శించారు. -
ప్రపంచాన్ని మార్చే భారత్ చిప్!
న్యూఢిల్లీ: భారత్లో తయారైన ఓ చిన్న చిప్ ప్రపంచంలో పెద్ద మార్పును తీసుకొస్తుందని, అది ఎంతో దూరంలో లేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెమీకాన్ ఇండియా 2025 సదస్సును ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మాట్లాడారు. భారత్లో రూపుదిద్దుకుని, భారత్లో తయారైందంటూ ప్రపంచమంతా మర్మోగే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.18 బిలియన్ డాలర్ల విలువ చేసే 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులు ప్రస్తుతం అమలు దశలో ఉన్నాయంటూ.. తదుపరి దశ భారత సెమీకండక్టర్ మిషన్ దిశగా అడుగులు వేస్తున్నట్టు ప్రకటించారు. ట్రిలియన్ డాలర్ల అంతర్జాతీయ చిప్ మార్కెట్లో స్థానాన్ని సంపాదించడమే భారత్ లక్ష్యమని పేర్కొన్నారు. వివిధ దేశాలకు చెందిన సెమీకండక్టర్ నిపుణులు, 50 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో భారత యువ శక్తి, ఆవిష్కరణలు ప్రస్ఫుటమవుతున్నట్టు ప్రధాని వ్యాఖ్యానించారు. భారత్ను ప్రపంచం విశ్వసిస్తున్నట్టు ఇది స్పష్టమైన సంకేతం పంపిస్తుందన్నారు. భారత్తో కలసి సెమీకండక్టర్ భవిష్యత్ నిర్మాణానికి ప్రపంచం సుముఖంగా ఉన్నట్టు చెప్పారు. డిజిటల్ డైమండ్స్...చిప్లపై ప్రధాని మోదీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆయిల్ అన్నది నల్ల బంగారం. కానీ చిప్లు అన్నవి డిజిటల్ వజ్రాలు’’అని పేర్కొన్నారు. చమురు గత శతాబ్దాన్ని మలుపు తిప్పగా, 21వ శతాబ్దాన్ని చిన్న చిప్లు నడిపించనున్నట్టు చెప్పారు. పరిమాణంలోనే చిన్నవే అయినా ప్రపంచ పురోగతిని వేగవంతం చేస్తాయని అభిప్రాయపడ్డారు. నోయిడా, బెంగళూరులో ఏర్పాటు చేసిన డిజైన్ కేంద్రాలు ప్రపంచంలోనే అత్యాధునికమైన చిప్ల అభివృద్ధిపై పనిచేస్తున్నాయని, అవి బిలియన్ల లావాదేవీలను నిల్వ చేయగలవన్నారు.‘‘ప్రస్తుతం ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్ 600 బిలియన్ డాలర్లుగా ఉంటే, రానున్న సంవత్సరాల్లో ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. సెమీకండక్టర్ రంగంలో సాధిస్తున్న పురోగతి దృష్ట్యా భవిష్యత్తులో ట్రిలియన్ డాలర్ల మార్కెట్లో భారత్ చెప్పుకోతగ్గ వాటాను సొంతం చేసుకుంటుంది’’అని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ పెద్ద హృదయంతో ఇన్వెస్టర్లకు ఆహ్వానం పలుకుతున్నట్టు ప్రకటించారు. భారత విధానాలు స్వల్పకాలం కోసం కాదంటూ ప్రతి ఇన్వెస్టర్ అవసరాలకు అనుగుణంగా ఉంటాయన్నారు.సెమీకండక్టర్ రంగంలో వేగం ముఖ్యమంటూ.. దరఖాస్తు నుంచి ఫ్యాక్టరీ నిర్మాణం వరకు పేపర్ పని తక్కువగా ఉంటే వేఫర్ తయారీ వేగంగా సాధ్యపడుతుందని చెప్పారు. ప్రభుత్వం ఇదే ధోరణితో పనిచేస్తున్నట్టు తెలిపారు. జాతీయ స్థాయిలో సింగిల్ విండో ద్వారా అన్ని అనుమతులను ఇస్తున్నట్టు చెప్పారు. వెంటనే కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా సెమీకండక్టర్ పార్క్లను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. భూమి, విద్యుత్, పోర్ట్, ఎయిర్పోర్ట్లతో అనుసంధానత, నిపుణులైన మానవవనరులు ఇలా అన్ని అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. వీటితో పారిశ్రామికవృద్ధి వేగవంతం అవుతుందన్నారు. సీజీ పవర్కు చెందిన సెమీకండక్టర్ పైలట్ ప్లాంట్ ఆగస్ట్ 28న కార్యకలాపాలు మొదలు పెట్టిందని, కేనెస్ టెక్నాలజీ ప్లాంట్ పైలట్ పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్టు చెప్పారు. మైక్రాన్ టెక్నాలజీ, టాటా ఎలక్ట్రానిక్స్ ఇప్పటికే తయారీ కార్యకలాపాలు మొదలు పెట్టాయని, వాణిజ్య చిప్ ఉత్పత్తి ఈ ఏడాదే మొదలవుతుందని ప్రధాని ప్రకటించారు. విక్రమ్.. తొలి మేడిన్ ఇండియా చిప్భారత్లో రూపుదిద్దుకుని, ఇక్కడే తయారైన విక్రమ్ 32 బిట్ మైక్రో ప్రాసెసర్తో పాటు ఇతర టెస్ట్ చిప్లను ప్రధాని మోదీకి కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ ఇదే కార్యక్రమంలో అందజేశారు. ఈ తొలి మేడిన్ ఇండియా చిప్ విక్రమ్ను ఇస్రో సెమీకండక్టర్ ల్యాబ్ అభివృద్ధి చేసింది. కఠినమైన ఉపగ్రహ ప్రయోగ పరిస్థితుల్లోనూ వినియోగించేందుకు అనుకూలంగా రూపొందించారు. సెమీకండక్టర్ మిషన్ ప్రారంభించిన మూడున్నరేళ్లలోనే ప్రపంచం భారత్వైపు చూసేలా పురోగతి సాధించినట్టు మంత్రి అశ్వని వైష్ణవ్ పేర్కొన్నారు. -
అసహనంలో అమెరికా.. భారత్కు రష్యా బంపరాఫర్!
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సు అనంతరం, భారత్–రష్యా సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్కు రష్యా బంపరాఫ్ ఇచ్చింది. ముడి చమురుపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. సెప్టెంబర్ చివరి, అక్టోబర్లో లోడ్ అయ్యే ఉరల్స్ గ్రేడ్ చమురు బ్యారెల్కు 3నుంచి 4 డాలర్ల వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లు బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది.ఎస్సీవో సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తూ, దాదాపు గంట పాటు చర్చలు జరిపారు. ఈ సమావేశం అనంతరం, రష్యా భారత్కు చమురు డిస్కౌంట్ ప్రకటించడం గమనార్హం.మరోవైపు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ట్రంప్ ప్రభుత్వం భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై 50శాతం టారిఫ్ విధించింది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్..ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి భారత్ మద్దతిస్తుందని అక్కసు వెళ్లగక్కారు. అయితే,భారత్ మాత్రం రష్యా చమురు కొనుగోళ్లను సమర్థిస్తోంది. చమురు ఎక్కడ తక్కవ దొరికితే అక్కడ నుంచి కొనుగోలు చేస్తామని కుండబద్దలు కొట్టి చెప్పింది. అమెరికా విధించిన టారిఫ్లను భారత్ వ్యతిరేకిస్తోంది. ఈ పరిణామాలు భారత్ అంతర్జాతీయ వ్యూహాత్మక సంబంధాల్లో కీలక మలుపు తిరగనుంది. చమురు వ్యాపారం కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాదు. ఇది అంతర్జాతీయంగా పలుదేశాల్ని ప్రభావితం చేసే శక్తివంతమైన సాధనమని నిపుణులు అభివర్ణిస్తున్నారు. Always a delight to meet President Putin! pic.twitter.com/XtDSyWEmtw— Narendra Modi (@narendramodi) September 1, 2025 -
70 కిలోల ప్రధాని మోదీ చాక్లెట్ శిల్పం..!
ఒడిశాలో విద్యార్థుల అద్భుతమైన పాక ప్రతిభతో ప్రధాని మోదీ శిల్పానికి ప్రాణాం పోశారు. తమ కళాత్మక ప్రతిభతో మోదీ చాక్లెట్ శిల్పాన్ని రూపొందించారు. దీన్ని పూర్తిగా చాక్లెట్ తయారు చేశారు. దాదాపు 70 కిలోలు బరువు ఉంటుంది. అందుకోసం ఆ విద్యార్థులు సుమారు 55 కిలోల డార్క్ చాక్లెట్, 15 కిలోల వైట్ చాక్లెట్ని విపియోగించారు. భువనేశ్వర్ చాక్లెట్ క్లబ్లో డిప్లోమా చేస్తున్న ఈ విద్యార్థు ఆ ప్రతిమలో ప్రభుత్వ సంబంధిత పథకాలకు సంబంధించిన క్లిష్లమైన వివరాలను పొందుపర్చేలా కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఈ క్లబ్ ప్రొఫెషనల్ బేకింగ్ అండ్ ఫైన్ పాటిస్సేరీ పాఠశాల. రాకేష్ కుమార్ సాహు, రంజాన్ పరిదా నేతృత్వంలో సుమారు 15 మంది విద్యార్థుల బృందం ఈ ప్రత్యేకమైన కళకు జీవం పోశారు. మోదీ చాక్లెట్ కళాకృతి తయారు చేసేందుకు సుమారు ఏడు రోజులు పట్టిందట. ఈ ప్రతిమలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, ప్రధాన మంత్రి ఆపరేషన్ సిందూర్, స్వచ్ఛ భారత్ మిషన్ వంటి కీలకమైన ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఇందులో ఉన్నాయి. అంతేగాదు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సాధించిన విజయాలను కూడా ఈ ప్రతిమలో హైలెట్ చేశారు. ఆ సంస్థ ప్రకారం..భారతదేశంలో ఇలా మోదీ చాక్లెట్ శిల్పాన్ని రూపొందించడం ఇదే ప్రప్రథమం. దీన్ని విద్యార్థులు కళ, నైపుణ్యాల కలయికగా అభివర్ణించారు. గతేడాది కూడా మోదీ పుట్టిన రోజు పురస్కరించుకుని ఒడిశాలోని భువనేశ్వర్లోని గడకానాలో 2.5 మిలియన్లకు పైగా ప్రధానమంత్రి ఆవాస్ గృహాలను ప్రారంభించారు. రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళలకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో సుభద్ర యోజనను కూడా ప్రారంభించారు. అలాగే భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కూడా మోదీ పుట్టినరోజు నిమిత్తం పఖ్వాడా" లేదా "సేవా పర్వ్" ప్రచారంతో రక్తదాన శిబిరాలు, డ్రైవ్లు వంటి సామాజిక సేవ కార్యక్రమాలను ప్రారంభించారు. అలాగే ప్రధాని మోదీ సైతం తన పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలను ప్రకటించేవారు. అలాగనే మోదీ కూడా తన పుట్టినరోజు సందర్భంగా 2023లో చేతివృత్తులవారి కోసం విశ్వకర్మ యోజన, 2022లో ఎనిమిది చిరుతలను మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లోకి విడుదల చేయడం వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే.(చదవండి: దేశంలోనే తొలి మహిళా మావటి..!) -
డిజిటల్ డైమండ్.. ఈ శతాబ్దం దీనికే!.. నరేంద్ర మోదీ
భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోని చాలా దేశాలు ఇండియా వైపు చూస్తున్నాయి. ఈ తరుణంలో న్యూఢిల్లీలో జరిగిన 'సెమికాన్ ఇండియా 2025' శిఖరాగ్ర సమావేశంలో.. సెమీకండక్టర్ల పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు.ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి మాట్లాడుతూ.. పెట్టుబడిదారులందరినీ స్వాగతించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రపంచంలోని చాలా దేశాలు.. భారతదేశంలో తయారైన వాటిని విశ్వసిస్తున్నాయి అని చెప్పే రోజు ఎంతో.. దూరంలో లేదని అన్నారు. ప్రపంచంలో.. చమురును నల్ల బంగారం అని, చిప్స్ను డిజిటల్ డైమండ్స్ అంటారని అన్నారు. గత శతాబ్దం మొత్తం చమురుకు ప్రాధాన్యత ఇచ్చింది. కానీ 21వ శతాబ్దం మాత్రం చిప్కే పరిమితం అని అన్నారు. ఈ చిప్ ప్రపంచ అభివృద్ధిని వేగవంతం చేసే శక్తిని కలిగి ఉందని మోదీ పేర్కొన్నారు.#WATCH | At Semicon India 2025, Union Minister for Electronics & Information Technology, Ashwini Vaishnaw presents Vikram 32-bit processor and test chips of the 4 approved projects to PM Narendra Modi.Vikram 32-bit processor is the first fully “Make-in-India” 32-bit… pic.twitter.com/8FCkbe0sve— ANI (@ANI) September 2, 2025కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సెమికాన్ ఇండియాలో.. ప్రధాని మోదీకి విక్రమ్ 32 బిట్ ప్రాసెసర్, టెస్ట్ చిప్లను అందజేశారు. మన ప్రధానమంత్రిని దూరదృష్టితో కొత్త ఆరంభం కోసం మొదటిసారి కలిశాము. అప్పుడే మేము ఇండియా సెమీకండక్టర్ మిషన్ను ప్రారంభించాము. ఇది 3.5 సంవత్సరాల వ్యవధిలోనే.. ప్రపంచం భారతదేశం వైపు నమ్మకంగా చూసేలా చేసింది. నేడు, ఐదు సెమీకండక్టర్ యూనిట్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. మేము ఇప్పుడు మొదటి 'మేడ్-ఇన్-ఇండియా' చిప్ను ప్రధాని మోదీకి అందించామని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నాడు.ఇదీ చదవండి: యూరోపియన్ దేశాలకు.. మోదీ ప్రారంభించిన కారుగత కొన్ని సంవత్సరాలుగా సెమికాన్ ఇండియా ప్రణాళిక కింద జరుగుతున్న పురోగతి గురించి కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. 2023 నాటికి, భారతదేశంలో మొట్టమొదటి సెమీకండక్టర్ ప్లాంట్ సిద్ధమైంది. 2024లో మేము అదనపు ప్లాంట్లను ఆమోదించాము. 2025లో మరో ఐదు అదనపు ప్రాజెక్టులను క్లియర్ చేసాము. మొత్తం మీద ప్రభుత్వం పది సెమీకండక్టర్ ప్రాజెక్టులలో రూ. 1.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నారు. ఇది భారతదేశంపై ప్రపంచ దేశాలు పెంచుకున్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు.First ‘Made in India’ Chips!A moment of pride for any nation. Today, Bharat has achieved it. 🇮🇳This significant milestone was made possible by our Hon’ble PM @narendramodi Ji’s far-sighted vision, strong will and decisive action. pic.twitter.com/ao2YeoAkCv— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 2, 2025 -
యూరోపియన్ దేశాలకు.. మోదీ ప్రారంభించిన కారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల భారతదేశంలో మారుతి సుజుకి తయారు చేసిన ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'ఈ-విటారా'ను ప్రారంభించారు. ఈ మోడల్ కార్లను కంపెనీ 12 యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేయడానికి సిద్ధమైంది. గుజరాత్లోని హన్సల్పూర్ ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా నిర్మించిన 2,900 ఈ-విటారా యూనిట్లను సంస్థ తరలించింది. కాగా ఇక్కడి నుంచే కంపెనీ 100 దేశాలకు ఎగుమతి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.మొట్టమొదటి మారుతి సుజుకి ఈ-విటారా షిప్మెంట్లను.. రాష్ట్రంలోని పిపాపావ్ పోర్టు నుంచి యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, నార్వే, డెన్మార్క్, నెదర్లాండ్స్, స్వీడన్, హంగేరీ, ఐస్లాండ్, బెల్జియంలకు పంపించారు. ఇప్పటికే సుజుకి స్వదేశమైన జపాన్తో సహా దాదాపు 100 దేశాలకు తన 17 ఇతర కార్లను ఎగుమతి చేస్తోంది.ప్రతి సంవత్సరం 50,000 నుంచి 1,00,000 ఈ-విటారాలను కంపెనీ చేయనున్నట్లు మారుతి చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధమైన సామర్థ్యంతో, గుజరాత్ ప్లాంట్ ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ కేంద్రాలలో ఒకటిగా మారబోతోందని సుజుకి మోటార్ కార్పొరేషన్ సిఓ తోషిహిరో సుజుకి ప్రస్తావించారు. ప్రస్తుతం ఇక్కడ మూడు ఉత్పత్తి లైన్లలో సంవత్సరానికి 7,50,000 వాహనాలను ఉత్పత్తి చేయగలదు.ఇదీ చదవండి: చైనా బ్రాండ్ కార్లు.. 10వేల మంది కొన్నారుమారుతి ఈ-విటారా ప్రస్తుతం ఇతర దేశాలకు ఎగుమతి అవుతోంది. కానీ దేశీయ మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాన్ని వెల్లడించలేదు. అయితే ఇది భారతీయ వినియోగదారులకు ఉపయోగపడేలా.. తయారవుతుందని కంపెనీ చెబుతోంది. ఇది అత్యాధునిక డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుందని సమాచారం. దీని ధర రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుందని చెబుతున్నారు. అయితే ధరలు అధికారికంగా.. లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
‘మోదీ క్షమించినా.. బీహార్ వాళ్లను క్షమించదు’
తన మాతృమూర్తి హీరాబెన్పై అనుచిత వ్యాఖ్యల పేరిట వైరల్ అయిన వీడియోపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. తన తల్లికే కాదని.. దేశంలోని తల్లులందరికీ ఇది అవమానమేనని భావోద్వేగంగా మాట్లాడారు. బీహార్లో మహిళల కోసం బీహార్ రాజ్య జీవికా నిధి సాఖ్ సహకారి సంఘ్ లిమిటెడ్ను వర్చువల్గా ప్రారంభించిన ఆయన.. ఆ కార్యక్రమానికి హాజరైన 20 లక్షల మంది మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు.చనిపోయిన నా తల్లికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. అయినా అందులోకి లాగారు. కేవలం నా తల్లినే కాదు.. దేశంలోని ప్రతీ తల్లినీ, సోదరినీ కాంగ్రెస్, ఆర్జేడీలు అవమానించాయి అని అన్నారాయన. ఈ మాటలు నా తల్లిని మాత్రమే కాదు, దేశంలోని ప్రతి తల్లి, సోదరిని అవమానించాయి. మీరు కూడా ఈ మాటలు విన్న తర్వాత నాతోపాటు మీరూ ఎంతగా బాధపడి ఉంటారో నాకు తెలుసు అంటూ ఆయన భావోద్వేగంగా స్పందించారు. అనారోగ్యంతో బాధపడుతూ కూడా నా తల్లి కష్టపడడం ఆపలేదు. మా కోసం దుస్తులు తయారు చేయించేందుకు ప్రతి పైసా ఆదా చేసేది. దేశంలో కోట్లాది తల్లులు ఇలాగే త్యాగం చేస్తూ జీవిస్తున్నారు. తల్లి స్థానం దేవతలకంటే గొప్పది అని ప్రధాని అన్నారు. బీహార్లో కాంగ్రెస్–RJD వేదికపై వాడిన అసభ్య పదజాలం తన తల్లిని మాత్రమే కాదు, దేశంలోని ప్రతి తల్లి, సోదరిని అవమానించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ కుటుంబాల్లో పుట్టినవారు పేద తల్లుల బాధను, వారి కుమారుల పోరాటాన్ని అర్థం చేసుకోలేరు. వీరంతా బంగారు, వెండి చెంచాలతో పుట్టినవారు. బీహార్లో అధికారాన్ని తమ కుటుంబాల స్వంతంగా భావిస్తున్నారు. కానీ మీరు ఒక పేద తల్లి కుమారుడిని ప్రధాన సేవకుడిగా ఆశీర్వదించారు. ఇది ‘నామ్దార్’లకు జీర్ణించుకోవడం కష్టమైంది అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, RJD నేత తేజస్వీ యాదవ్లపై విమర్శలు చేశారు.నాపై అసభ్య పదజాలం వాడిన జాబితా చాలా పొడవుగా ఉంది. నన్ను నీచ్, గంది నాళీ కీ కీడా, పాము అని అంటున్నారు. ఇప్పుడు ‘తూ’ అని కూడా సంబోధిస్తున్నారు.. అంటూ రాహుల్ గాంధీ ర్యాలీలో తనను ‘తూ’ అని పిలిచిన విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఇలాంటి వ్యాఖ్యలకు మోదీ క్షమించినా.. బీహార్ ప్రజలు క్షమించబోరని అన్నారాయన.ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ బీహార్లో చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర సందర్బంగా.. దర్భంగలో మోదీ, ఆయన తల్లి హీరాబన్ను దూషించినట్లుగా ఓ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ ఘటనపై కేసు నమోదుకాగా.. ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు కూడా. -
SCO సదస్సు వద్ద మోదీ-పుతిన్-జిన్పింగ్ స్నేహ ప్రదర్శన
-
రష్యాతో కాదు.. భారత్ ఉండాల్సింది మాతోనే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి చెందిన వాణిజ్య సలహాదారు పీటర్ నవారో..మరోసారి భారత్పై నోరు పారేసుకున్నారు. భారత్-రష్యా సంబంధాలపై తాజాగా విమర్శలు గుప్పించారు. భారత్ ఉండాల్సింది అమెరికాతో.. రష్యాతో కాదంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన.భారత ప్రధాని నరేంద్ర మోదీ.. చైనా తియాంజిన్ (Tianjin) షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు వేదికగా ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్తో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ దరిమిలా ఈ భేటీని సిగ్గుచేటుగా అభివర్ణిస్తూ.. పీటర్ నవారో తీవ్ర విమర్శలు చేశారు.వాషింగ్టన్లో జరిగిన మీడియా సమావేశంలో నవారో మాట్లాడుతూ.. భారత ప్రధాని మోదీ.. పుతిన్, షీ జిన్పింగ్లతో కలిసి ఉండటం సిగ్గుచేటు. ఆయన ఏమి ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ, భారత్ కలిసి ఉండాల్సింది అమెరికాతో.. రష్యాతో కానేకాదు అని అన్నారు.అమెరికా విధించిన టారిఫ్లపై భారత్ స్పందించిన తీరు.. అలాగే రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు కొనసాగించడాన్ని నవారో తీవ్రంగా విమర్శించారు. భారత్ ముడి చమురు కొనుగోలు ద్వారా పుతిన్ యుద్ధానికి నిధులు సమకూర్చుతోంది అని మరోసారి ఆరోపించారు. భారత్ను సుంకాల మహరాజుగా అభివర్ణించిన ఆయన.. రష్యా చమురు కొనుగోలు విషయంలో వాస్తవాల్ని దాచిపెడుతోందని అన్నారు. తాజాగా.. భారత్లో కుల వ్యవస్థను ప్రస్తావిస్తూ.. ఓ వర్గం సాధారణ ప్రజల ఖర్చుతో లాభపడుతోంది అంటూ తీవ్రవ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక.. ఇండియన్ రిఫైనరీలు రష్యా రాయితీ ధరకు ముడి చమురును ప్రాసెస్ చేసి, అధిక ధరలకు ఎగుమతి చేస్తున్నాయని, ఇది "క్రెమ్లిన్ లాండ్రోమాట్"లా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. క్రెమ్లిన్ లాండ్రోమాట్ ఆరోపణకు అర్థం ఏంటంటే.. భారత రిఫైనరీలు రష్యా డబ్బును "శుభ్రం" చేసి, ప్రపంచ మార్కెట్లో తిరిగి ప్రవేశపెడుతున్నాయి అని. తద్వారా రష్యా చమురు అమ్మకాలు కొనసాగుతాయని, పుతిన్కు ఆర్థిక లాభం కలుగుతుందని, ఇది ప్రత్యక్షంగా రష్యా యుద్ధ వ్యయానికి నిధులు సమకూర్చే మార్గంగా మారుతుందని ఆయన అభిప్రాయం.అయితే.. భారత్ మాత్రం తన చమురు కొనుగోలు నిర్ణయాన్ని సమర్థించుకుంటూ వస్తోంది. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, G7 దేశాలు రష్యా చమురుపై ధర పరిమితి విధించాయి. ఈ నేపథ్యంలో భారత్ రాయితీ ధరలకు చమురు కొనుగోలు చేసే అవకాశం పొందింది. మిగతా దేశాల్లాగే జాతి ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు ఉంటాయని, దేశీయ మార్కెట్ను స్థిరంగా ఉంచేందుకు ఇది అవసరమని భారత్ అంటోంది. ఈ క్రమంలోనే అమెరికా విధించిన 50 శాతం సుంకాలను అన్యాయమని భారత్ అభిప్రాయపడుతోంది. -
13న ప్రధాని మోదీ మిజోరం సందర్శన.. ఈశాన్యాన్ని కలిపే రైల్వే లైన్కు పచ్చజెండా
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 13న మిజోరం, మణిపూర్లను సందర్శించే అవకాశం ఉంది. మిజోరం రాష్ట్ర ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ప్రధాని తన పర్యటనను మిజోరంలో ప్రారంభిస్తారు. అక్కడ ఆయన 51.38 కి.మీ. పొడవైన బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్ను ప్రారంభించనున్నారు. ఈ కొత్త ప్రాజెక్ట్ కేంద్రం చేపట్టిన యాక్ట్ ఈస్ట్ పాలసీలో కీలక అడుగు. ఈశాన్య ప్రాంతంలో కనెక్టివిటీని బలోపేతం చేయడం, ఆర్థిక వృద్ధిని పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం దీనిని చేపట్టింది. ఈ రైల్వే లైన్ ఐజ్వాల్ను అస్సాంలోని సిల్చార్ ద్వారా దేశంలోని మిగిలిన ప్రాంతాలను కలుపుతుంది.మిజోరం పర్యటన అనంతరం ప్రధాని మోదీ మణిపూర్కు విమానంలో వెళ్లే అవకాశం ఉంది. 2023 మేలో జాతి హింస చెలరేగిన తర్వాత ప్రధాని రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి అవుతుంది. ప్రధాని పర్యటనకు సన్నాహాలు జరుగుతున్నాయని మిజోరం అధికారులు చెబుతున్నప్పటికీ, ఇంఫాల్లోని అధికారులు మోదీ పర్యటన ఇంకా ధృవీకరణ కాలేదన్నారు. కాగా మిజోరం ప్రధాన కార్యదర్శి ఖిల్లీ రామ్ మీనా ప్రధాని రాక సందర్భంగా వివిధ విభాగాలు, చట్ట అమలు సంస్థలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.మణిపూర్లో జాతి హింసజాతి ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మణిపూర్ పర్యటన ఆసక్తికరంగా మారింది. మే 2023 నుండి రాష్ట్రంలో మెయిటీ, కుకి-జో వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ అశాంతియుత వాతావరణంలో 60 మంది ప్రాణాలను కోల్పోయారు. ఆస్తి విధ్వంసం జరిగింది. వేలాది మంది వలసబాట పట్టారు. మణిపూర్ ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉంది. అప్పటి ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఫిబ్రవరి 9న రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రపతి పాలన విధించారు. 2027 వరకు పదవీకాలం ఉన్న రాష్ట్ర అసెంబ్లీని తాత్కాలికంగా నిలిపివేశారు. -
కలసికట్టుగా ముందుకెళ్దాం... చైనాలోని తియాంజిన్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధినేత పుతిన్తో భేటీ
-
సెమికాన్ ఇండియా సదస్సు నేటి నుంచి
సాక్షి, న్యూఢిల్లీ: దేశాన్ని సెమీకండక్టర్ డిజైన్, తయారీ, సాంకేతిక అభివృద్ధి కేంద్రంగా మార్చే లక్ష్యంతో దేశ రాజధాని ఢిల్లీ మరో అంతర్జాతీయ మహాసదస్సుకు వేదికైంది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని యశో భూమిలో ‘సెమికాన్ ఇండియా–2025’సదస్సును ప్రారంభించనున్నారు. ఈ నెల 2 నుంచి 4 వరకు మూడు రోజులపాటు కొనసాగనుంది. 3వ తేదీ ఉదయం 9.30 గంటలకు ప్రధాని మోదీ వివిధ కంపెనీల సీఈవోల రౌండ్టేబుల్ భేటీలో పాల్గొని చర్చలు జరపనున్నారు. సదస్సుకు 20,750 మంది పాల్గొననున్నారు. వీరిలో 48 దేశాల 2,500 ప్రతినిధులున్నారు. 350 ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులు, సాంకేతికతలను ప్రదర్శించనున్నారు. 2022లో బెంగళూరు, 2023లో గాం«దీనగర్, 2024లో గ్రేటర్ నోయిడాలో ఈ సదస్సులు జరిగాయి. -
భద్రత, శాంతితోనే అభివృద్ధి
తియాంజిన్: షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) పట్ల భారత్ వైఖరి, విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. ఎస్ అంటే సెక్యూరిటీ(భద్రత), సీ అంటే కనెక్టివిటీ(అనుసంధానం), ఓ అంటే అపర్చునిటీ(అవకాశం) అని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశ అభివృద్ధికైనా భద్రత, శాంతి, స్థిరత్వమే పునాది అని వెల్లడించారు. ప్రపంచ దేశాల పురోగతికి ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం ఎన్నో సవాళ్లు విసురుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఉగ్రవాదంపై పోరాటం చేయడం మానత్వం పట్ల మన బాధ్యత అని సూచించారు. చైనాలోని తియాంజిన్లో ఎస్సీఓ సదస్సులో రెండో రోజు సోమవారం ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రాంతీయ అభివృద్ధికి అనుసంధానం అత్యంత కీలకమని చెప్పారు. అనుసంధానం దిశగా జరిగే ప్రతి ప్రయత్నమూ ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించేలా ఉండాలని సూచించారు. ఎస్సీఓ చార్టర్లోని మూలసూత్రాల్లో ఇది కూడా ఒక భాగమేనని గుర్తుచేశారు. కాలం చెల్లిన విధానాలు వద్దు ఎస్సీఓ కింద ‘సివిలైజేషనల్ డైలాగ్ ఫోరమ్’ ఏర్పాటు చేసుకుందామని ప్రధాని మోదీ ప్రతిపాదించారు. ఘనమైన మన ప్రాచీన నాగరికతలు, కళలు, సాహిత్యం, సంప్రదాయాలను అంతర్జాతీయ వేదికపై పరస్పరం పంచుకోవడానికి ఈ ఫోరమ్ తోడ్పడతుందని అన్నారు. దక్షిణార్ధ గోళ దేశాలు(గ్లోబల్ సౌత్) మరింత వేగంగా ప్రగతి సాధించాలని పిలుపునిచ్చారు. కాలం చెల్లిన విధానాలతో అనుకున్న లక్ష్యం సాధించలేమని చెప్పారు. ఇంకా వాటినే నమ్ముకొని ఉండడం భవిష్యతు తరాలకు అన్యాయం చేయడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. గ్లోబల్ సౌత్ దేశాల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని విధానాలు రూపొందించుకోవాలని సూచించారు. భారతదేశ ప్రగతి ప్రయాణాన్ని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సంస్కరణ, పనితీరు, మార్పు అనే మంత్రంతో తమదేశం ముందుకు సాగుతోందన్నారు. విస్తృత స్థాయిలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, దీనివల్ల జాతీయ అభివృద్ధికి, అంతర్జాతీయ సహకారానికి నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. భారత్ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వామిగా మారాలంటూ ఎస్సీఓ సభ్య దేశాలను మోదీ ఆహా్వనించారు. ముష్కరులను పోషించడం మానుకోవాలి ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం కొన్ని దేశాలు ఇకనైనా మానుకోవాలని ప్రధాని మోదీ పరోక్షంగా పాకిస్తాన్కు హితవు పలికారు. ముష్కర మూకలను పెంచిపోíÙస్తే మొత్తం మానవళికి ముప్పు తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాదం అనేది ఏ ఒక్క దేశానికో పరిమితమైన సమస్య కాదని అన్నారు. తాము క్షేమంగా ఉన్నామని ఏ ఒక్కరూ అనుకోవడానికి వీల్లేదన్నారు. కలిసికట్టుగా పోరాడితేనే ఉగ్రవాదం అంతమవుతుందని ఉద్ఘాటించారు. అల్ఖైదా, అని అనుబంధ గ్రూప్లపై యుద్ధం ప్రారంభించామని చెప్పారు. పహల్గాం ఉగ్రవాద దాడిని కూడా ప్రధాని ప్రస్తావించారు. ఇది కేవలం భారత్పై జరిగిన దాడి కాదని, మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్క దేశానికీ, ప్రతి పౌరుడీకి ఒక సవాల్ అని పేర్కొన్నారు. పహల్గాం దాడి సమయంలో భారత్కు అండగా నిలిచిన దేశాలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. -
ఉమ్మడిగా ముందుకెళ్దాం
తియాంజిన్: ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, సుస్థిరతలకు భారత్–రష్యా సంబంధాలే మూలస్తంభమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం రెండు దేశాలు భుజం భుజం కలిపి పనిచేస్తాయని, ఉమ్మడిగా ముందుకెళ్తాయని అన్నారు. చైనాలోని తియాంజిన్లో షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ సోమవారం రష్యా అధినేత పుతిన్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆర్థికం, ఇంధనం, ఎరువులు, వాణిజ్యం, అంతరిక్షం, సాంస్కృతిక, భద్రత తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకొనే దిశగా చర్చలు జరిగాయి. పుతిన్తో సమావేశం అనంతరం మోదీ మాట్లాడారు. ఈ ఏడాది డిసెంబర్లో పుతిన్ ఇండియాలో పర్యటించబోతున్నారని, ఆయనకు స్వాగతం పలకడానికి 140 కోట్ల మంది భారతీయులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. భారత్, రష్యా మధ్యనున్న ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రాధాన్యతకు ఇది నిదర్శనమని చెప్పారు. భారత్–రష్యా బంధం కేవలం ఇరుదేశాల ప్రజలకే కాకుండా మొత్తం ప్రపంచానికి కూడా కీలకమేనని వివరించారు. అది మానవాళి కోరిక ఉక్రెయిన్లో శాంతి సాధన కోసం ఇటీవల జరిగిన ప్రయత్నాలను మోదీ స్వాగతించారు. ఉక్రెయిన్లో ఘర్షణకు సాధ్యమైనంత త్వరగా తెరపడాలని ఆకాంక్షించారు. ఇందుకోసం భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి నిర్మాణాత్మక చర్యలు ప్రారంభించాలన్నారు. అక్కడ యుద్ధం ముగిసి, శాశ్వత శాంతి నెలకొనాలన్నది మొత్తం మానవాళి కోరిక అని ఉద్ఘాటించారు. పుతిన్తో భేటీ అనంతరం మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. కారులో పుతిన్తో కలిసి ప్రయాణిస్తున్న ఫొటోను షేర్ చేశారు. రష్యా అధ్యక్షుడితో అద్భుతమైన చర్చ జరిగిందని పేర్కొన్నారు. కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించామని తెలిపారు. ఉక్రెయిన్ ఘర్షణకు శాంతియుత పరిష్కారం సహా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నామని వివరించారు. బహుముఖ సంబంధాల్లో చురుగ్గా పురోగతి: పుతిన్ భారత్తో బంధానికి ఎల్లప్పుడూ అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పుతిన్ పునరుద్ఘాటించారు. భారత్–రష్యా సంబంధాలు ప్రత్యేక, విశేష వ్యూహా త్మక భాగస్వామ్యం స్థాయికి చేరడం ఆనందంగా ఉందన్నారు. రెండు దేశాలు కలిసి పని చేస్తూనే ఉంటాయని స్పష్టంచేశారు. రెండు దేశాల బహుముఖ సంబంధాలు చురుగ్గా పురోగతి సాధిస్తూనే ఉంటాయన్నారు. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు పూర్తి సానుకూలంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. బహుళ స్థాయి సహకార వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని, రెండు దేశాల మధ్య పర్యాటకుల మారి్పడి నానాటికీ వృద్ధి చెందుతోందని, ఐక్యరాజ్యసమితి, బ్రిక్స్, జీ20, ఎస్సీఓ తదితర అంతర్జాతీయ వేదికలపై సన్నిహితంగా, సమన్వయంతో కలిసి పని చేస్తున్నామని పుతిన్ వెల్లడించారు. ముఖ్యమైన రంగాల్లో భారత్, రష్యా మధ్య ద్వైపాక్షికబంధంపై మోదీ, పుతిన్ సంతృప్తి వ్యక్తంచేశారని భారత ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇరుదేశాల మధ్య ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలని వారు నిర్ణయానికొచ్చినట్లు పేర్కొంది. ఒకే కారులో మోదీ, పుతిన్ ప్రయాణం తియాంజిన్లో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. ఎస్సీఓ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధినేత పుతిన్ సోమవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రష్యాలో తయారైన అరుస్ లిమోజిన్ కారులో ఇరువురు నేతలు ఎస్సీఓ సదస్సు వేదిక నుంచి రిట్జ్–కార్ల్టన్ హోటల్కు చేరుకున్నారు. ఇరువురు నేతలు ఒకే కారులో కలిసి ప్రయాణించడం, సన్నిహితంగా మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. మోదీ, పుతిన్ మధ్య వ్యక్తిగత, వ్యూహాత్మక స్నేహ సంబంధాలకు ఈ ఘటన నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు. పుతిన్తో సంభాషణ ఎల్లప్పుడూ అర్థవంతంగా, నిర్మాణాత్మకంగా ఉంటుందని మోదీ పేర్కొన్నారు. మోదీతో కలిసి ప్రయాణించాలని మొదట పుతిన్ కోరుకున్నట్లు తెలిసింది. అంతేకాకుండా మోదీ రాక కోసం ఆయన ఎస్సీఓ వేదిక వద్ద 10 నిమిషాల పాటు వేచి చూశారు. హోటల్కు చేరుకున్న తర్వాత కూడా కారులోనే 45 నిమిషాలపాటు మాట్లాడుకోవడం విశేషం. అనంతరం హోటల్ లోపల ద్వైపాక్షిక సమావేశం జరిగింది. అంతకుముందు ఎస్సీఓ వేదిక వద్ద మోదీని పుతిన్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. పుతిన్ను కలుసుకోవడం నాకు సదా ఆనందదాయకం అని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మోదీ, పుతిన్, చైనా అధినేత జిన్పింగ్ కలిసి ఉన్న చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
శుభ పరిణామం... త్రైపాక్షికం
ఏడేళ్ల అనంతరం తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో జరిపిన పర్యటన అనేక విధాల సత్ఫలితాలనిచ్చింది. ఇది అంతర్జాతీయ పెత్తందార్లకు తగిన సందేశం పంపింది. పెహల్గామ్ ఉగ్రవాద దాడిపై మూణ్ణెల్లు గడిచినా ఉలుకూ పలుకూ లేకుండా ఉండి పోయిన షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో)తో ఆ ఘటనను ఖండిస్తూ తీర్మానం చేయించింది. చైనా, రష్యాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకునే దిశగా ప్రగతి సాధించింది. ఈ పరిణామాలన్నీ యాదృచ్ఛికంగా జరిగినవి కాదు.అంతర్జాతీయ సంబంధాల్లో అమెరికా సృష్టించిన సరికొత్త గందరగోళం వల్ల ఏర్పడిన అయోమయ వాతావరణాన్ని ఎస్సీవో శిఖరాగ్ర సదస్సు ఒక కుదుపు కుదిపింది. ప్రపంచవ్యాప్త మీడియా ఈ శిఖరాగ్ర సదస్సు కన్నా మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లు చర్చించుకుంటున్న వీడియోకూ, ఛాయాచిత్రాలకూ అత్యధిక ప్రాధాన్యమివ్వటం మోదీ చైనా సందర్శనలోని అంతరార్థాన్నీ, దాని పరిణామాలనూ అవగాహన చేసుకోవటం వల్లే. అయితే కేవలం ఈ పర్యటన వల్లే అంతా మారిపోతుందనీ, చైనా మనతో సవ్యంగా ఉంటుందనీ, అమెరికా తన తెలివితక్కువ విధానాలను సవరించుకుంటుందనీ అనుకోనవసరం లేదు. ఇప్పటికైతే యూరేసియాలోని మూడు అగ్ర దేశాల కలయిక అవసరార్థ బంధమే. బలపడాలంటే చేయాల్సింది చాలా ఉంటుంది. రష్యాకిది వర్తించదు. ఆ దేశంతో మన మైత్రి చిరకాలమైనది. దాన్ని నీరుగార్చడానికి అమెరికా ఎంత ప్రయత్నించినప్పటికీ అదేమంత తగ్గలేదు. కానీ పెరగాల్సినంత పెరగలేదు. ఈ మూడు దేశాల కలయికా ఈ దేశాల ప్రయోజనాలు నెరవేర్చుకోవటంతోపాటు ఈ ప్రాంత శాంతికీ, సుస్థిరతకూ, అభివృద్ధికీ దోహదపడుతుంది. దీని మూలాలు ప్రచ్ఛన్న యుద్ధానంతర పరిణామాల్లో ఉన్నాయి. సోవియెట్ యూనియన్ కుప్పకూలి రష్యాగా మిగిలిపోయిన 1990వ దశకంలో అప్పటి ఆ దేశ ప్రధాని యెవ్జెనీ ప్రైమకోవ్ ఈ భావనకు రూపుదిద్దారు. ఈ వ్యూహాత్మక కలయిక భవిష్యత్తులో అమెరికా ఆధిపత్యా నికి చెక్ పెట్టగలదని భావించారు. మంత్రుల స్థాయిలో, నిపుణుల స్థాయిలో పలు సమావేశాలు కూడా జరిగాయి. కానీ 2020లో గల్వాన్ ఉదంతం అనంతరం నిలిచిపోయాయి. చైనాతో మనకున్న సరిహద్దు తగాదాలూ, చేదు అనుభవాలూ తక్కువేం కాదు. నిజానికి మొన్నటికి మొన్న ఎస్సీవో మంత్రుల స్థాయి భేటీ అనంతరం విడుదలైన సంయుక్త ప్రకటనలో పెహల్గామ్ ప్రస్తావన లేకపోవటాన్ని నిరసిస్తూ మన దేశం దానిపై సంతకం చేసేందుకు నిరాకరించింది. ఇప్పుడు ఎస్సీవో తన తప్పు దిద్దుకోవటం శుభæపరిణామం.ఈ త్రైపాక్షిక కలయికపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాటలు గమనిస్తే ఆయనెంత కలవరపడుతున్నారో తెలుస్తుంది. ఇది ‘ఏకపక్ష విపత్తు’గా పరిణమిస్తుందట! ఆ దేశ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో సరేసరి. రోజుకో రకంగా నోరు పారేసు కుంటున్నారు. మన దేశం సంయమనంతో అమెరికా 50 శాతం సుంకాలు ఎంత అర్థరహితమో చెప్తూ వస్తోంది. తాను తప్ప దిక్కులేదనే స్థితికి చేరిన అమెరికా కళ్లు తెరిపించటం ప్రస్తుతావసరం. దేశాల మధ్య పటిష్ఠమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్న కాలంలో తనకు అనుకూలమైన నిబంధనలతో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)ను అమల్లోకి తెచ్చింది అమెరికాయే. పర్యవనసానంగా ఎడాపెడా ఆర్జించి, స్వీయ తప్పిదాల కారణంగా సంక్షోభంలో పడిన ఆ దేశం అందుకు ఇతరులను నిందిస్తూ మూర్ఖంగా ప్రవర్తిస్తోంది. భారత–చైనా సంబంధాలపై రెండు వైపుల నుంచీ వెలువడిన ప్రకటనలు ఒకే స్వరంతో ఉండటం గమనించదగ్గది. ఇరు దేశాలూ భాగస్వాములే తప్ప ప్రత్యర్థులు కారని ఆ ప్రకటనలు గుర్తుచేశాయి. చైనాతో మన సంబంధాలు బాగున్నప్పుడు పాకిస్తాన్ అణిగిమణిగి ఉండటం మొదటినుంచీ కనబడుతోంది. ఇకపై కూడా అదే జరిగితే మంచిదే. ఏదేమైనా పెత్తందారీ పోకడలు చెల్లబోవని చెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది. కాకపోతే భారత్–చైనా–రష్యా కలయిక వికసించాలంటే ఎంతో చిత్త శుద్ధితో, నిజాయితీతో పనిచేయాల్సి ఉంటుంది. అది జరగాలని ఈ మూడు దేశాలు మాత్రమే కాదు... ప్రపంచమే కోరుకుంటోంది. -
సుంకాలను భారత్ పూర్తిగా ఎత్తేస్తామంది!
న్యూయార్క్/వాషింగ్టన్: బాధ్యతారహిత వ్యాఖ్యలు, పిల్లచేష్టలతో ఇప్పటికే ప్రపంచ దేశాల ముందు నిత్యం నవ్వులపాలవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మిగిలి ఉన్న కాస్త పరువూ పూర్తిగా పోగొట్టుకునేలా ప్రవర్తిస్తున్నారు. అమెరికాపై టారిఫ్లను పూర్తిగా ఎత్తేస్తామంటూ భారత్ ప్రతిపాదించిందని సోమవారం మరో మతిలేని ప్రకటన చేశారాయన. పైగా, ‘అది చాలా ఆలస్యంగా వచ్చిన ప్రకటన! ఎందుకంటే పరిస్థితి ఇప్పటికే చేయిదాటిపోయింది’ అంటూ మేకపోతు గాంభీర్యం కూడా ప్రదర్శించారు. భారత్ తన రక్షణ, సైనిక, చమురు అవసరాల్లో అత్యధికం రష్యా నుంచే దిగుమతి చేసుకుంటోంది తప్ప అమెరికా నుంచి పెద్దగా కొనడమే లేదంటూ మరోసారి అక్కసు ప్రదర్శించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాటు అనూహ్యంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయిన కొద్ది గంటలకే సొంత సోషల్ మీడియా ప్లాట్ఫాం ట్రూత్సోషల్లో ఇలాంటి అర్థం పర్థం లేని కామెంట్లకు దిగారు. ‘‘భారత్ మాతో భారీగా వర్తక వ్యాపారాలు జరుపుతోంది. వాళ్లకు అతి పెద్ద క్లయింట్లం మేమే. కానీ భారత్తో మేం చేసే వ్యాపారం మాత్రం చాలా తక్కువ. ఎందుకంటే మాపై అంత భారీ సుంకాలు విధించింది. మాకు అత్యంత నష్టదాయకమైన ఈ ఏకపక్ష ఉత్పాతపు పోకడ దశాబ్దాలుగా సాగుతూ వస్తోంది. చాలా తక్కువ మందికి తెలిసిన వాస్తవమిది’’ అంటూ వాపోయారు. ‘‘ఇప్పుడు తీరిగ్గా ‘జీరో టారిఫ్’ ప్రతిపాదన చేసి ఏం లాభం? ఆ పని ఏళ్లక్రితమే చేయాల్సింది. ఇదంతా కామన్సెన్స్’’ అంటూ సోషల్ మీడియాలోనే భారత్కు తీరిగ్గా క్లాసు కూడా పీకారు. ట్రంప్ పోస్టులను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెంటనే షేర్ చేసి మద్దతుగా నిలిచారు. అయితే ఇలా భారత్ సున్నా సుంకాల ప్రతిపాదన చేసిందంటూ సోషల్ మీడియా పోస్టులు పెట్టడం ట్రంప్కు ఇది కొత్తేమీ కాదు. వాటిని అప్పట్లోనే విదేశాంగ శాఖ నిర్ద్వంద్వంగా ఖండించింది. కాక పుట్టించిన ‘షాంఘై భేటీ’! : తాజా షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్లో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాటు అనూహ్యంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో కూడా ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కావడం తెలిసిందే. పలు అంశాలపై ఇద్దరు నేతలతో ఆయన లోతుగా చర్చలు జరిపారు. ఈ పరిణామాన్ని అమెరికా కర్రపెత్తనానికి శాశ్వతంగా చెక్ పెట్టే దిశగా పడిన అతి కీలక అడుగుగా పరిశీలకులు ఇప్పటికే అభివరి్ణస్తున్నారు. ఈ పరిణామంతో చిర్రెత్తుకొచ్చి ట్రంప్ ఇలా బాధ్యతారహిత వ్యాఖ్యలకు దిగుతున్నారని వారంటున్నారు. భారత్పై సుంకాలను ఆయన ఇప్పటికే భారీగా 25 శాతానికి పెంచడం తెలిసిందే. దానికి తోడు రష్యా నుంచి భారత్ కొనే చమురుపై మరో 25 శాతం అదనపు సుంకాలు బాదుతున్నట్టు ప్రకటించారు. దాంతో మనపై సుంకాలు ఏకంగా 50 శాతానికి ఎగబాకిన సంగతి తెలిసిందే. -
హతవిధి.. పాక్ ప్రధానికి ఘోర పరాభవం!
2025లో చైనా తియాంజిన్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు గురించి ప్రపంచమంతా ఇప్పుడు చర్చించుకుంటోంది. ట్రంప్ టారిఫ్ వార్, ఉక్రెయిన్ శాంతి చర్చల అంశాలతో పాటు పహల్గాం దాడి విషయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా.. భారత దేశానికి మద్దతుగా సదస్సులో పాల్గొన్న దేశాలు తీర్మానం సైతం చేయడం ప్రధానంగా నిలిచాయి. అయితే.. ఈ సదస్సు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు చేదు అనుభవాన్ని మిగిల్చిందన్న చర్చ జోరుగా నడుస్తోంది. అందుకు ఈ సమ్మిట్లో చోటుచేసుకున్న కొన్ని ఘటనలు కారణంగా కాగా.. వాటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ చేస్తూ పాక్ ప్రధానిని నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. షరీఫ్ అంతర్జాతీయంగా అవమానానికి గురయ్యారన్నది ఆ పోస్టుల సారాంశం. అందుకు కారణం లేకపోలేదు.. వేదికపై ఆతిథ్య దేశాధినేత సహా మిగతా ప్రపంచాధినేతలెవరూ ఆయన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. కాదు కాదు.. అసలు పట్టన్నట్లు వ్యవహరించడమే పెద్దగా హైలైట్ అయ్యింది. అవి ఒక్కొక్కటిగా పరిశీలిస్తే.. મોદી અને પુતિનની મુલાકાત દરમિયાન પાકિસ્તાનને નીચે જોવા જેવી સ્થિતિ પેદા થઈRead more at: https://t.co/xr1jIGM2b2#PMModiSCOsummit2025 #NarendraModi #PMModi #ShehbazSharif #VladimirPutin #SCOsummit2025 #SCOsummitinChina #XiJinping #Reels #shorts #newskida #treeshinewskida pic.twitter.com/NxjZc9wc6W— NewsKida (@TreeshiNewsKida) September 1, 2025భారత ప్రధాని నరేంద్ర మోదీ పాక్ ప్రధాని షరీఫ్ను అసలు పట్టించుకోలేదు. మోదీ-పుతిన్ ఇద్దరూ కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా.. షరీఫ్ బిక్కముఖం వేసుకుని పలకరించలేదే అన్నట్లు చూస్తూ ఉండిపోయారు. పైగా మోదీ తన ప్రసంగంలో పహల్గాం దాడి గురించి మాట్లాడిన ఆయన.. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయంటూ పాక్నే ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఆ ప్రసంగం సాగినంత సేపు అక్కడే ఉన్న షరీఫ్ ముఖంలో నెత్తురు చుక్క కనిపించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది!. PM Modi, Putin, Xi Jinping and Shehbaz Sharif meetup in SCO Summit 2025😭🤣#SCOSummit pic.twitter.com/MKnj7TjCO1— Bruce Wayne (@_Bruce__007) September 1, 2025ఇక.. పుతిన్ను కలవాలన్న షరీఫ్ ఉత్సాహం.. అవమానాన్నే మిగిల్చింది. సదస్సు ముగిశాక.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కరచలనం చేయడానికి షరీఫ్ కంగారుగా పరిగెత్తుతూ కనిపించారు. పుతిన్ షేక్ హ్యాండ్ ఇవ్వడంతో షరీఫ్ మురిసిపోయారు. ఆ సమయంలో పక్కనే ఉన్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. షరీఫ్ను చూసి పూర్తిగా పట్టన్నట్లు ప్రవర్తించారు. అయితే కాసేపటికే పుతిన్ మరోసారి ఆయన్ని పలకరించారు.आतंक पर बड़ी चोट कर रहे थे PM मोदी, सुन रहे थे पाक पीएम शहबाज शरीफ#PMModi #ShehbazSharif #PMModiInChina #SCOSummit2025 #Pakistan pic.twitter.com/EU2UkhZCq1— One India News (@oneindianewscom) September 1, 2025Shehbaz Sharif after seeing Xi and Putin with Modi while ignoring him 😭 pic.twitter.com/fDlEIEQDor— Fazal Afghan (@fhzadran) September 1, 2025 Pakistan PM Shehbaz Sharif Serving Juice to @narendramodi and #Putin Nice Gesture 🙌 #NarendraModi #ShehbazSharif #SCOSummit #SCOSummit2025 pic.twitter.com/R1eZEni9M7— SATYA ᴿᶜᴮ 🚩 (@sidhufromnaayak) September 1, 2025 ఇక సదస్సు ముగిసిన తర్వాత.. గ్రూప్ ఫొటో సమయంలోనూ షరీఫ్కూ పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. మోదీకి ఎక్కడో ఎనిమిది మంది దేశాధినేతల అవతల నిలబెట్టారు. అంతెందుకు.. చైనా, పాకిస్తాన్కు దశాబ్దాలుగా మిత్ర దేశం అయినప్పటికీ.. ఈ సదస్సులో షరీఫ్ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కొసమెరుపు. దీంతో.. షాంగై సదస్సు ఏమోగానీ పాక్ ప్రధాని పరిస్థితి దయనీయంగా, దౌర్భాగ్యంగా కనిపించిందని కొందరు నెటిజన్స్ అభివర్ణించారు. ఇంకొందరైతే ఓ అడుగు ముందుకువేసి.. పుతిన్-మోదీ-జిన్పింగ్ భేటీ అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి, ఇటు పాక్ షరీఫ్కు పీడకలను మిగిల్చే అవకాశం ఉందంటూ జోకులు పేలుస్తున్నారు. ట్విటర్, రెడ్డిట్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ లాంటి ఫేమస్ ఫ్లాట్ఫారమ్లలో మీమ్స్, ట్రోలింగ్ ముంచెత్తాయి. మిత్ర హస్తం అవతలి వాళ్లు అందించాలే తప్ప.. అడుక్కోకూడదు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. పుతిన్తో కరచలనం కోసం ఓ బిచ్చగాడిలా ప్రవర్తించారంటూ పాక్ ప్రజలే ఆయన్ని దెప్పి పొడుస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పాక్కు, ఆ దేశ ప్రధానికి ఉన్న ప్రాధాన్యం ఇదేనా? అనే చర్చా జోరుగా నడుస్తోంది. అదే సమయంలో పాక్ మీడియా షరీఫ్ను గ్లోబల్ పవర్హౌజ్ అంటూ కితాబిస్తూ ప్రచారం చేస్తుండడం గమనార్హం. -
మోదీ కోసం చైనా ప్రతిష్టాత్మక వాహనం.. ప్రత్యేకతలివే..
చైనాలో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల టియాంజిన్ను సందర్శించారు. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం మోదీ కోసం ఆ దేశంలోని ప్రతిష్టాత్మక వాహనంగా ఉన్న ‘హాంగ్కీ ఎల్ 5’ను ఏర్పాటు చేసింది. దీనికి చైనాలో అత్యంత ప్రముఖమైన, ప్రభుత్వ లగ్జరీ కారుగా గుర్తింపు ఉంది.హాంగ్కీ ఎల్ 5 ప్రత్యేకతలుహాంగ్కీ అంటే మాండరిన్ భాషలో ‘రెడ్ ఫ్లాగ్’ అని అర్థం.ఇది చైనా పురాతన ప్యాసింజర్ కార్ బ్రాండ్. దీన్ని 1958లో ప్రభుత్వ యాజమాన్యంలోని ఫస్ట్ ఆటోమోటివ్ వర్క్స్ (ఎఫ్ఎడబ్ల్యు) ప్రారంభించింది.ఎల్ 5 మోడల్ను చైనా అగ్రనేతల కోసం, ఎంపిక చేసిన విదేశీ ప్రముఖుల కోసం రిజర్వ్ చేశారు.అమెరికా అధ్యక్షుడు ప్రయానించే ‘బీస్ట్’కు ఆ దేశంలో ఎంత గుర్తింపు ఉంటుందో.. చైనాలో ‘హాంగ్కీ ఎల్ 5’కు అంత గుర్తింపు ఉంటుంది.5.5 మీటర్ల పొడవు ఉండే ఈ కారు బరువు 3 టన్నుల కంటే ఎక్కువే. దీని విలువ సుమారు రూ.7 కోట్లు (సుమారు 8 లక్షల డాలర్లు)గా ఉంటుందని అంచనా. ఇందులో లెదర్, హ్యాండ్క్రాఫ్ట్ కలపతో ఇంటీరియర్ ఉన్నట్లు తెలుస్తుంది. ప్రముఖులు సంభాషణకు సురక్షితమైన కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉన్నట్లు సమాచారం.ఇదీ చదవండి: వారెన్ బఫెట్ పంచ సూత్రాలు.. -
రాజీ కుదిరింది.. ఎన్డీయే తమిళనాడు సీఎం అభ్యర్థిగా ఆయనే!
తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నన్ అన్నామలై, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తమ మధ్య విబేధాలను పక్కనపెట్టి ఒక్కటయ్యారు. ఇద్దరూ కలిసి ఒకే వేదికపై సందడి చేయడమే కాదు.. సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపైనా స్పష్టత ఇచ్చేశారు. గతంలో ఈపీఎస్ మీద అన్నామలై ఏ స్థాయిలో విరుచుకుపడిందో తెలిసిందే. ‘‘పళనిస్వామి ఓ తెలివితక్కువోడు’’.. అంటూ బహిరంగంగానే విమర్శలు గుప్పించారాయన. దీనికి కౌంటర్గా ‘‘అన్నామలై బుద్ధిహీనుడని, ఆస్పత్రిలో చేర్పించాలి’’ అని ఈపీఎస్ వర్గం కౌంటర్ ఇచ్చింది. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య వైరం కొనసాగుతూ వచ్చింది. అంతేకాదు.. ఈ ఇద్దరూ ఏ ఎన్డీయే మీటింగ్లోనూ కలిసి మెలిగినట్లు కనిపించేది కూడా కాదు. అలాంటిది.. శనివారం చెన్నైలో జరిగిన జీకే మూపనార్ వర్ధంతి కార్యక్రమంలో ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు.. మాజీ ముఖ్యమంత్రి, ఎన్డీయే తరఫున సీఎం అభ్యర్థి ఎడపాడి పళనిస్వామి ఇప్పుడు మాట్లాడారు అంటూ అన్నామలై తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘2026లో మార్పు రావాలి, పేదల అభివృద్ధికి ప్రభుత్వం పని చేయాలి. ఎన్డీయే సీఎం అభ్యర్థిగా ఈపీఎస్ ఉన్నారు’’ అని అన్నారు. దీంతో వీళ్ల రాజకీయ ఐక్యతపై చర్చకు దారి తీసింది. పళనిస్వామి (EPS), అన్నామలై మధ్య విభేదాలు తమిళనాడు ఎన్డీయే కూటమిలో రాజకీయంగా గణనీయమైన ప్రభావం చూపించాయి. వ్యక్తిగత విమర్శలతో పాటు అన్నాడీఎంకే అవసరం ఎన్డీయేకు లేదన్నట్లుగా అన్నామలై వ్యవహరించారు. పైగా సీఎం అభ్యర్థిగా ఈపీఎస్ వర్గం చేసిన ప్రకటనను ఖండించారు. ఈ తీరుతో రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. అయితే.. ఈ రాజకీయంతో ఈపీఎస్ వర్గం బలపడగా.. బీజేపీ పరిస్థితి దారుణంగా తయారైంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఒక్క సీటు కూడా రాలేదు. దీంతో.. అన్నామలై వైఖరినే మార్చాల్సిన అవసరం బీజేపీకి ఏర్పడింది. అందుకే 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం వ్యూహం మార్చి.. ఈపీఎస్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. అన్నామలై కూడా పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ EPS కు మద్దతు ప్రకటించినట్లు ఆయన మాటల్లోనే తెలుస్తోంది.వీళ్ల కలయికపై ఆదివారం అన్నామలైకి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ.. ‘‘పార్టీ చెప్పింది, ప్రధాని మోదీ చెప్పారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానిని శిరసావహించడం కేడర్గా నా బాధ్యత. అది అర్థం చేసుకోండి’’ అని అన్నామలై వ్యాఖ్యానించారు. గత విమర్శలపై ప్రశ్నించగా.. వ్యక్తిగత అభిప్రాయాలు వేరే. పార్టీ కేడర్గా క్రమశిక్షణ పాటించాలి కదా. ఉదాహరణకు డీఎంకే మంత్రిపై నాకు ఎంత కోపం ఉన్నా.. వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని నేను గౌరవిస్తాను. ఇది అంతే. పార్టీ చెప్పినట్లే అన్నామలై వింటాడు’’ అని ఆయన వివరణ ఇచ్చారు.అన్నామలై 2011 బ్యాచ్కు చెందిన మాజీ IPS అధికారి. కర్ణాటకలో ఆయన పోలీసాధికారిగా సేవలందించారు. 2019లో పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. 2020లో BJPలో చేరారు. తమిళనాడు BJP అధ్యక్షుడిగా పనిచేసి.. ‘సింగం’గా ప్రజాదరణ పొందారు. అయితే వరుసగా ఎన్నికల్లో పార్టీ సరైన ఫలితాలు రాబట్టకపోవడంతో బీజేపీ అధిష్టానం ఆయన్ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది.తాజా పరిణామం.. అన్నాడీఎంకే బీజేపీల మధ్య విభేదాలు తొలిగాయనడానికి సంకేతంగా నిలిచింది. 2026 ఎన్నికల కోసం ఈపీఎస్ నాయకత్వంలో కూటమి ముందుకు సాగుతుందన్న సంకేతాలు స్పష్టంగా అందిస్తోంది. -
పాకిస్థాన్ కు గట్టి షాక్ ఇచ్చిన ప్రధాని మోదీ
-
SCO సదస్సులో పహల్గాం ఉగ్రదాడి అంశాన్ని లేవనెత్తిన ప్రధాని మోదీ
-
ద్వైపాక్షిక భేటీకి ఒక కారులో ప్రధాని మోదీ, పుతిన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లు చైనాలోని తియాంజిన్లో జరగబోయే ద్వైపాక్షిక సమావేశానికి చేరేందుకు ఒకే కారులో ప్రయాణించారు. ఈ ఘటన అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఇది ఇరువురి నేతల సాన్నిహిత్యాన్ని లోకానికి చాటిందని నిపుణులు అంటున్నారు. షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశం అనంతరం ఇరు దేశాధినేతలు ఒకే కారులో ప్రయాణించారు. After the proceedings at the SCO Summit venue, President Putin and I travelled together to the venue of our bilateral meeting. Conversations with him are always insightful. pic.twitter.com/oYZVGDLxtc— Narendra Modi (@narendramodi) September 1, 2025పుతిన్తో తన ప్రయాణానికి సంబంధించిన ఫొటోను ‘ఎక్స్’లో షేర్ చేసిన ప్రధాని మోదీ.. ‘ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశం తర్వాత, అధ్యక్షుడు పుతిన్, నేను మా ద్వైపాక్షిక సమావేశ వేదికకు కలిసి ప్రయాణించాం. ఆయనతో సంభాషణలు లోతుగా ఉంటాయి’ అని రాశారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి ముందు, ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ కరచాలనం చేసుకుని ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఆ సమయంలో ప్రధాని మోదీ ‘అధ్యక్షుడు పుతిన్ను కలవడం ఆనందంగా ఉంది’ అంటూ ఒక ఫోటోను షేర్ చేశారు. -
ట్రంప్, మోదీ మధ్య క్షీణిస్తున్న సంబంధాలు
-
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
సరిహద్దు ఉగ్రవాదం భారత్, చైనా దేశాలపై ప్రభావం చూపుతోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదం అనేది మానవత్వానికి, శాంతికి ముప్పుగా పరిణమించిందని తియాన్జిన్ వేదికగా సోమవారం జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు‘‘ఉగ్రవాద సమస్యలతో భారత్ 4 దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతోంది. ఉగ్రవాదం, వేర్పాటువాదం సవాళ్లుగా మారాయి. ఎస్సీవో సభ్య దేశంగా భారత్ కీలక భూమిక పోషిస్తోంది. ఎస్సీవో కోసం భారత్ విజన్, పాలసీ 3 పిల్లర్లపై ఆధారపడి ఉంది. భద్రత, అనుసంధానం, అవకాశాలు 3 పిల్లర్లుగా నిలుస్తాయి. మనమంతా ఏకతాటిపైకి వచ్చి సంస్కరణలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది’’ అని షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు 2025(SCO Summit)లో మోదీ ప్రసంగించారు.సరిహద్దు ఉగ్రవాదం భారత్తో పాటు చైనాపైనా ప్రభావం చూపుతోంది. ఇరు దేశాలకూ ఇదొక సవాల్గా మారిందని మోదీ స్పష్టం చేశారు.ఈ సమస్యను ఎదుర్కొనడానికి పరస్పర సహకారం అవసరమని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత కొనసాగితేనే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతాయని మోదీ అభిప్రాయపడ్డారు. పాక్ ప్రధానిపై విసుర్లుSCO సదస్సు వేదికలో పాకిస్తాన్పై భారత ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా ఘాటు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ దేశం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశంగా బహిరంగంగా విమర్శించారు. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు బలైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇది ఉగ్రవాదం యొక్క అత్యంత వికృత రూపం. అయినా ఉగ్రవాదంపై రాజీ ఉండబోదు అని స్పష్టం చేశారు. ‘‘ఆ సమయంలో కొన్ని దేశాలు భారత్కు మద్దతుగా నిలిచాయి. ఆ దేశాలకు మా కృతజ్ఞతలు. అలాగే.. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇస్తున్నాయి. అలాంటి ద్వంద్వ ప్రమాణాలను మేం అంగీకరించబోం’’ అని వ్యాఖ్యానించారాయన. భద్రత ప్రతి దేశ హక్కు. ఉగ్రవాదం మనమందరికీ సవాల్. ఇది కేవలం భారత్కు మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా ముప్పు. SCO సభ్యదేశాలు ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఖండించాలి. అంతర్జాతీయంగా ఏకతా అవసరమని మోదీ పిలుపునిచ్చారు. ఆ సమయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అక్కడే ఉన్నారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా పాక్కు అపమానకరమేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతకు ముందు.. సదస్సుకు హాజరైన వివిధ దేశాధినేతలను ఆప్యాయంగా పలకరించిన మోదీ.. పాక్ ప్రధాని వైపు కనీసం కన్నెత్తి చూడలేదు.పాక్ పేరు లేకుండానే.. సదస్సు ముగింపు ప్రకటనలో చైనా సహా యూరేషియన్(యూరప్+ఆసియా సమాహారం) దేశాలు భారత్ వైపు నిలిచాయి. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ.. ఎస్సీవో సదస్సులో తీర్మానం చేశాయి. అయితే.. అందులో ఎక్కడా పాకిస్థాన్ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. చైనా, టర్కీ సహా పలు దేశాలు పహల్గాం బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశాయి. దాడికి పాల్పడినవారిని శిక్షించాలని వేదిక నుంచి గళం వినిపించాయి. ఉగ్రవాదం, విభజనవాదం, తీవ్రవాదంపై సంయుక్తంగా పోరాడాలని సభ్యదేశాలు ప్రతిజ్ఞ చేశాయి. అదే సమయంలో.. పాక్లో జరిగిన జాఫర్ ఎక్స్ప్రెస్, ఖుజ్దార్ దాడులను కూడా ఖండించాయి.మరోవైపు.. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్, చైనా అధినేతలు చర్చించుకున్నారు. ఈ విషయంలో భారత్ చైనా మద్దతు కోరగా.. చైనా అందుకు అంగీకరించిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు వెల్లడించారు. -
Modi in China: షాంఘై శిఖరాగ్ర సమావేశం ప్రారంభం.. నేడు ప్రధాని మోదీ ప్రసంగం
తియాన్జిన్: షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు ఆదివారం రాత్రి తియాన్జిన్లో ప్రారంభమయ్యింది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ విందు కార్యక్రమంతో సదస్సు మొదలయ్యింది. నేడు సదస్సులో భారత ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.జిన్పింగ్ ఇచ్చిన విందు కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా వివిధ దేశాధినేతలు పాల్గొన్నారు. కూటమి దేశాల మధ్య ఐక్యతను, సహకారాన్ని పెంపొందించి, పురోగమనంలోకి పయనించేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని జిన్పింగ్ పేర్కొన్నారు. దక్షిణార్థగోళ దేశాల బలాన్ని పెంపొందించేందుకు, మానవ నాగరికత మరింత పురోగమించడానికి వీలు కలుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కాగా 20 మంది విదేశీ నేతలను, 10 అంతర్జాతీయ సంస్థల అధిపతులను ఈ సదస్సుకు జిన్పింగ్ ఆహ్వానించారు.సోమవారం వీరంతా కీలక సమావేశంలో పాల్గొననున్నారు. వేదికపై మోదీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చైనాతో సంబంధాలపై ఆయన ఈ సదస్సులో మాట్లాడే అవకాశం ఉంది. మోదీ సహా వివిధ దేశాధినేతలు జిన్పింగ్తో విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. కాగా షాంఘై సహకార సంస్థ సదస్సులో వివిధ దేశాలు అభివృద్ధిపై వ్యూహాన్ని ఖరారు చేయడంతో పాటు, భద్రత, ఆర్థిక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. PM Modi, President Putin and President Xi shared a light moment on the sidelines of the SCO Summit in China. pic.twitter.com/pEpAdF4qYi— Tar21Operator (@Tar21Operator) September 1, 2025 -
ట్రంప్ కు భారత్ పెద్ద షాక్..!
-
బంధం బలోపేతమే లక్ష్యం
తియాంజిన్: గల్వాన్ ఘటన తర్వాత ఉద్రిక్తతకు నిలయంగా మారిన సరిహద్దు సమస్యను పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వంతో పరిష్కరించుకునేందుకు భారత్, చైనా ముందుకొచ్చాయి. షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు సన్నాహక భేటీలో భాగంగా భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తియాంజిన్ తీరనగరంలో దాదాపు 60 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. ‘‘భారత్, చైనా ద్వైపాక్షిక ఒప్పందాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇరువురం కంకణబద్దమయ్యాం. సమష్టిగా వాణిజ్యం, పెట్టుబడులను మరింతగా విస్తరించి అంతర్జాతీయ వాణిజ్య సుస్థిరతలో మన రెండు ఆర్థికవ్యవస్థలు ఎంతటి కీలకమో చాటి చెబుదాం. సరిహద్దు వెంట ఉద్రిక్తత పొడచూపినా సరే ప్రస్తుతం శాంతి, సుస్థిరత కొనసాగడం సంతోషదాయకం. సరిహద్దు వివాదాల పరిష్కారంలో మన ఇరుదేశాల ప్రతినిధి బృందాలు ఉమ్మడి నిర్ణయంతో ముందుకు వెళ్తున్నాయి. భారత్, చైనా మధ్య నేరుగా విమానసర్వీసులను సైతం పునరుద్దరించాం. మన ద్వైపాక్షిక సహకారం అనేది ఇరుదేశాల్లోని 280 కోట్ల మంది ప్రజల సంక్షేమంతో ముడిపడి ఉంది. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వంతో మన బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్దాం. షాంఘై సహకార సంస్థకు అధ్యక్ష బాధ్యతలు అద్బుతంగా పోషిస్తున్న మీకు నా అభినందనలు. కజాన్ నగరంలో మన చివరి భేటీ ఇరుదేశాల ద్వైపాక్షిక బంధంలో పురోగతికి బాటలువేసింది’’అని జిన్పింగ్తో మోదీ అన్నారు. భారతీయ ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకంగా 50% టారిఫ్ల భారం మోపిన వేళ ఎస్సీఓ వేదికగా భారత్, చైనా మైత్రీబంధం బలపడటం వేగంగా మారుతున్న అంతర్జాతీయ పరిణామాలకు దర్ప ణం పట్టింది. దాదాపు ఏడేళ్ల తర్వాత మోదీ చైనాలో పర్యటించడం విశేషం. భేటీ తర్వాత మోదీ చైనా కమ్యూనిస్ట్పార్టీ పాలిట్బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడు కాయ్క్వీని కలిశారు. జిన్పింగ్తో ఉమ్మడి నిర్ణయం పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చేలా సాయపడాలిన కాయ్క్వీని మోదీ కోరారు. ఎన్నెన్నో అంశాల్లో ఏకతాటి మీదకు ద్వైపాక్షిక వాణిజ్యం మొదలు పెట్టుబడులు, వాణిజ్య లోటు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, ఉగ్రవాదం వంటి కీలక అంశాలపై మోదీ, జిన్పింగ్ చర్చలు జరిపారు. భేటీ వివరాలను తర్వాత భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలోపేర్కొంది. ‘‘భారత్, చైనాలు రెండూ అభివృద్ధి భాగస్వాములేనని మోదీ, జిన్పింగ్ పునరుద్ఘాటించారు. విబేధాలు వివాదాలుగా మారొద్దని ఇరునేతలు అభిలషించారు. నేరుగా విమాన సర్వీసులు మొదలు వీసా జారీ వంటి ఇతరత్రా సదుపాయాల ద్వారా ఇరుదేశాల ప్రజల మధ్య సంబందబాంధ్యవాల పెంపును ఇరునేతలు ఆశిస్తున్నారు. వాణిజ్య బంధం పెంపు, వాణిజ్యలోటు తగ్గింపునకు రాజకీయ వ్యూహాత్మక మార్గంలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఇరునేతలు గుర్తించారు. వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి అనేది ఇరు దేశాలకు ఉంది. ఇందులో మూడో దేశం జోక్యాన్ని అస్సలు అనుమతించకూడదని ఇరునేతలు నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా భారత్లో వచ్చే ఏడాది జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు విచ్చేయాలని జిన్పింగ్ను మోదీ సాదరంగా ఆహ్వానించారు. ఆహ్వానించినందుకు మోదీకి జిన్పింగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భారత బ్రిక్స్ సారథ్యానికి జిన్పింగ్ మద్దతు ప్రకటించారు’’అని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఏనుగు, డ్రాగన్ డ్యాన్స్: జిన్పింగ్తియాంజిన్లో మోదీ, జిన్పింగ్ కరచాలనం ట్రంప్కు కంటగింపుగా మారింది. ఇరుగుపొరుగు వైరిదేశాలు టారిఫ్ల మోత కారణంగా మళ్లీ సత్సంబంధాల దిశ గా అడుగులేస్తూ.. సుంకాల సుత్తితో మోదినంత మా త్రాన అంతా అయిపోలేదని పరోక్ష హెచ్చరికలు చేశా యి. ఈ సందర్భంగా జిన్పింగ్ మాట్లాడారు. ‘‘చైనా కు భారత్ చక్కని మిత్రదేశంగా మారుతోంది. ఇరుదేశాల బంధాన్ని వ్యూహాత్మకంగా దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా కొనసాగించాలి. చైనా, భారత్ బంధాన్ని కేవలం సరిహద్దు అంశం నిర్ణయించకూడదు. సరిహద్దు కోణంలో బంధాన్ని చూడకూడదు. ఆసియాలోని రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు పరస్పర వాగ్దానాలతో ముందుకు సాగాలి. అక్కడ విరోధానికి తావివ్వకూడదు. ప్రపంచం ఇప్పుడు శతాబ్దానికొకసారి సంభవించే కీలక మలుపులో ఉంది. అంతర్జాతీయ పరిణామాలు వేగం పుంజుకున్నాయి. తూర్పున ఉన్న చైనా, భారత్ ప్రాచీన నాగరికతతో భాసిల్లింది. మనవి ప్రపంచంలోనే అత్యధిక జనాభా దేశాలు. దక్షిణ ధృవ ప్రపంచంలో మనమే పాత సభ్యులం. ఈ తరుణంలో పొరుగు దేశాలమైనం మనం మిత్రులుగా మెలగాలని నిర్ణయించుకోవడం సరైన ఎంపిక. డ్రాగన్(చైనా), ఏనుగు(భారత్) కలిసి నృత్యం చేయాల్సిన సమయం వచ్చింది. ఎదుటి దేశాన్ని మన అభివృద్దికి అవకాశంగా భావించాలి. అంతేగానీ ప్రమాదకారిగా భావించకూడదు. బహుళధృవ ప్రపంచం కోసం పాటుపడదాం. అంతర్జాతీయ సంస్థల్లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా చేద్దాం. ఆసియాసహా ప్రపంచవ్యాప్తంగా శాంతి స్తాపనకు మనవంతు కృషిచేద్దాం’’అని మోదీతో జిన్పింగ్ అన్నారు.గ్రూప్ ఫొటోలో జిన్పింగ్, పుతిన్ పక్కపక్కనే ద్వైపాక్షిక భేటీ తర్వాత జిన్పింగ్ షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) విందు కోసం సభ్యదేశాల అగ్రనేతలను ఆహ్వానించారు. ఇందుకోసం తొలుత ఒక్కో నేతలను వేదిక మీదకు ఆహ్వానించి విడివిడిగా ఫొటో దిగారు. తర్వాత నేతలందరితో కలిసి సతీసమేతంగా గ్రూప్ ఫొటో దిగారు. ఇందులో జిన్పింగ్, ఆయన భార్య పెంగ్ లియువాన్ ముందు వరసలో మధ్యలో నిల్చున్నారు. జిన్పింగ్కు కుడివైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ నిల్చున్నారు. మరో ఇద్దరు నేతల తర్వాత ప్రధాని మోదీ సైతం ముందు వరసలో నిల్చుని గ్రూప్ ఫొటోకు పోజిచ్చారు. టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జూ, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తదితరులు ముందు వరసలో నిల్చున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాక్ అగ్రనేతలు ఇలా ఒక అంతర్జాతీయ వేదికపై కనిపించడం ఇదే తొలిసారి. కజక్స్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, బెలారస్సహా పలు దేశాల అగ్రనేతలు పర్యవేక్షక, దౌత్య భాగస్వామి, అతిథులుగా ఎస్సీఓ విందులో పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి, ఆసియాన్ వంటి సంస్థలు సైతం ఎస్సీఓ చర్చల్లో పాల్గొననున్నాయి. జిన్పింగ్ మెచ్చిన కారు మోదీ కోసం రెండ్రోజుల పర్యటన నిమిత్తం చైనాకు విచ్చేసిన ప్రధాని మోదీ అక్కడ ఎక్కడికి వెళ్లాలన్నా ప్రభుత్వ వాహనంలోనే వెళ్లాల్సి ఉంటుంది. అందుకోసం మోదీ కోసం ప్రత్యేకంగా హాంగ్క్వీ కారును తెప్పించారు. ఈ మోడల్ కారు అంటే జిన్పింగ్కు మహా ఇష్టం. 2019లో మహాబలిపురంలో జిన్పింగ్ పర్యటించినప్పుడ ఇదే యాంగ్క్వీ ఎల్5 కారులో కలియతిరిగారు. ఈ కారును రెడ్ఫ్లాగ్ అని కూడా పిలుస్తారు. మేడిన్ ఇండియాలాగే ఈ కారు మేడిన్ చైనా అన్నమాట. కమ్యూనిస్ట్ పార్టీ చైనా అగ్రనేతల పర్యటన కోసం 1958లో చైనా ప్రభుత్వరంగ ఫస్ట్ ఆటోమోటివ్ వర్క్స్ సంస్థ ఈ మోడల్ కారును తొలిసారిగా రూపొందించింది. ఇక తియాంజిన్లో ఉన్నంతసేపూ పుతిన్ రష్యా తయారీ ఆరస్ మోడల్కారులో తిరగనున్నారు. పాతతరం మోడల్లో ఈ కారు ఉంటుంది. రష్యాకు చెందిన ఆరస్ మోటార్స్ సంస్థ ఈ కారును తయారుచేసింది. చైనా తయారీ నంబర్ప్లేట్ను తగిలించి పుతిన్ ఈ కారులో ప్రయాణిస్తున్నారు. జిన్పింగ్ నోట పంచశీల మాట భారత్, చైనాల మధ్య శాంతి, సుస్థిరతలు పరిఢవిల్లాలంటే దశాబ్దాలనాటి ‘పంచశీల’ఒడంబడిక సూత్రాలను అవలంభిస్తే సబబుగా ఉంటుందని జిన్పింగ్ వ్యాఖ్యానించారు. మోదీతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంగా జిన్పింగ్ తన మనసులో మాట బయటపెట్టారు. ఈ నేపథ్యంలో ఆనాటి పంచశీల ఒడంబడిక అంశం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ పంచశీల సూత్రాల ఉనినికి గతంలో ఎన్నో ఒప్పందాల సందర్భంగా భారత్, చైనా గుర్తించాయి. ‘‘పంచశీల సూత్రాలను 70 ఏళ్ల క్రితం నాటి చైనా, భారత్ దిగ్గజ నాయకులు రూపొందించారు. ఇవే సూత్రాలు ఇప్పుడూ అనుసరణీయమే’’అని జిన్పింగ్ అన్నారు. ఏమిటీ పంచశీల ఒప్పందం? 1954 ఏప్రిల్ 29వ తేదీన భారత్, చైనా అనుసరించాల్సిన విధానాలను ఐదు సూత్రాల నియమావళిగా రూపొందించారు. వీటిని పంచశీల సూత్రాలు అంటారు. అవి.. 1. తోటి దేశ ప్రాదేశిక సమగ్రత, సారభౌమత్వాన్ని పూర్తిస్తాయిలో గౌరవించడం 2. ఆ దేశంపై దురాక్రమణకు పాల్పడకపోవడం 3. ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం 4. ఇరుదేశాల మధ్య సమానత్వం, ఉమ్మడి ప్రయోజనాల కోసం కృషిచేయడం 5. శాంతియుత సహజీవనానికి బాటలు వేయడంఆంక్షలపై పోరాడుతాం: పుతిన్ ట్రంప్ విధించిన వివక్షాపూరిత ఆంక్షలపై చైనా, రష్యా పోరాడుతున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యానించారు. ఎస్సీఓ సదస్సు కోసం తియాంజిన్ సిటీకొచ్చిన ఆయన చైనా అధికారిక వార్తాసంస్త జిన్హువాతో మాట్లాడారు. ‘‘అంతర్జాతీయ సవాళ్లను బ్రిక్స్ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా కీలక మౌలికసదుపాయాల ప్రాజెక్టుల నిర్వహణకు చైనా, రష్యా అదనపు వనరుల సమీకరణలో తలమునకలయ్యాయి. సామాజికఆర్థికాభివృద్ధికి అవరోధంగా మారినఅమెరికా ఆంక్షలను ఎదుర్కొనేందుకు చైనా, రష్యా సమష్టిగా పోరాడుతున్నాయి’’అని పుతిన్ అన్నారు. మోదీ, జిన్పింగ్ భేటీ ‘పది’నిసలు → రష్యాలో బ్రిక్స్ సదస్సు తర్వాత తొలిసారిగా భేటీ అయిన మోదీ, జిన్పింగ్లు ఇకమీదటైనా ద్వైపాక్షిక ఒప్పందాల్లో పురోగతిని సాధించాలని నిర్ణయించారు → భారత్, చైనా మధ్య నేరుగా పౌరవిమానయాన సర్వీసులను విస్తరించాలని నిర్ణయించారు → కైలాస్ మానససరోవర్ యాత్ర కోసం భారతీయులకు యాత్రా వీసాలు ఇచ్చేందుకు చైనా ముందుకొచ్చింది → పరస్పర వ్యూహాత్మక సార్వభౌమత్వాన్ని గౌరవించుకుంటూనే మూడో దేశం జోక్యాన్ని ఏమాత్రం సహించకూడదని నిర్ణయించుకున్నారు → సరిహద్దు వెంట బలగాల ఉపసంహరణతో శాంతి స్థాపన సాధ్యమైందని నేతలు పునరుద్ఘాటించారు → భారత్, చైనా ఎప్పటికీ మిత్రులుగా, మంచి పొరుగుదేశాలుగా మెలగాలని జిన్పింగ్ అభిలషించారు → ఇరుదేశాల బంధాన్ని కేవలం సరిహద్దు వివాదం కోణంలో చూసే ధోరణిని విడనాడాలని నిర్ణయించుకున్నారు. వాణిజ్య, పెట్టుబడుల బంధాన్ని బలోపేతం చేయాలని కోరుకున్నారు → చైనా కంపెనీలకు భారత్లో అవకాశం ఇవ్వడం ద్వారా భారత్లో విద్యుత్వాహన రంగం సైతం వేగంగా విస్తరిస్తుందని ఇరునేతలు ఆశించారు → ఇటీవల చర్చల నిర్ణయాలకు అనుగుణంగా మూడు సరిహద్దుల గుండా సరకు రవాణా, వాణిజ్యానికి ద్వారాలు తెరవాలని మోదీ, జిన్పింగ్ నిర్ణయించారు → అధిక టారిఫ్లతో చెడిన అమెరికా బంధానికి బదులు పరస్పర బంధాన్ని బలపర్చుకుని అంతర్జాతీయంగా వాణిజ్యరంగంలో ఎదగాలని ఇరునేతలు కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. -
మీ బోర్డర్ దాటి వస్తున్న పాక్ టెర్రరిస్టుల సంగతేంటి?
న్యూఢిల్లీ: షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ పలు ద్వైపాక్షిక అంశాలను చర్చించారు. ఇందులో చైనా సరిహద్దుల నుంచి భారత్లోకి చొరబడుతున్న పాక్ టెర్రరిస్టుల అంశాన్ని కూడా ప్రధాని మోదీ.. జిన్పింగ్ వద్ద ప్రస్తావించారు. అయితే దీనికి చైనా తన సంపూర్ణ మద్దతును భారత్కు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ‘ జిన్పింగ్ వద్ద పాక్ ఉగ్రవాద కార్యకలాపాలను కూడా మోదీ ప్రస్తావించారు. ఇందుకు చైనా సానుకూలంగా స్పందించింది. టెర్రర్ కార్యకలాపాల వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తామని జిన్పింగ్ అన్నారు. ఎటువంటి ఉగ్రవాద చర్యల నిర్మూలనకైనా తమ మద్దతు ఉంటుందని జిన్పింగ్ అన్నారు. ఇరుదేశాలకు ప్రమాదంగా మారిన ఉగ్రవాద అంశాన్ని జిన్పింగ్ కూడా తీవ్రంగానే పరిగణిస్తున్నారు. ఉగ్రవాద నిర్మూలనకు భారత్కు తమ వంతు సహకారం అందిస్తామన్నారు’ అని విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. టియాంజిన్ నగరంలో ఎస్సీవో సదస్సులో పాల్గొన్న మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రాంతీయ శాంతి, ఆర్థిక స్థిరత్వం, సరిహద్దు ఉద్రిక్తతల తగ్గింపు, సాంకేతిక రంగాల్లో సహకారం పెంచుకునే వంటి అంశాలపై చర్చలు జరిగాయి.వాణిజ్య, టెక్నాలజీ, రక్షణ రంగాల్లో ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. భారత్-చైనా మధ్య స్థిరమైన, స్నేహపూర్వక సంబంధాలు ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, శ్రేయస్సుపై సానుకూల ప్రభావం చూపుతాయి అని ప్రధాని మోదీ తెలపడంతో ఇరు దేశాల సంబంధాలు బలోపేతం కావడానికి అడుగులు పడ్డాయి. ఈ పర్యటన ద్వారా భారత్ తన ప్రాంతీయ ప్రాబల్యాన్ని చాటింది. ఇది భారత్-చైనా సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికే అవకాశం ఉంది. -
‘అసలు ట్రంప్కు బుర్ర ఉందని అనుకోవడం లేదు’
భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఫుల్ స్టాప్ పడ్డ పలు ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా మోదీ.. చైనాలో అడుగుపెట్టారు. ఎప్పట్నుంచో భారత్తో సంబంధాల కోసం ఎదురుచూస్తున్న చైనా కూడా మోదీ పర్యటనకు ఘన స్వాగతం పలికింది. ఇదిలా ఉంచితే, భారత్పై అక్కసు వెళ్లగక్కుతూ సుంకాలను 50 శాతం పెంచేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై చైనాకు చెందిన అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుడు ఎయిమర్ టాన్జెన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచ శాంతి కోసం పాటుపడుతున్నానని చెప్పుకుంటున్న ట్రంప్కు కనీసం బుర్ర ఉంటే భారత్పై ఆ విధంగా సుంకాలు విధించే వాడు కాదంటూ మండిపడ్డారు. ప్రపంచ మార్కెట్ పరంగా చూసినా, కార్మికుల పరంగా చూసినా భారత్ అతి పెద్దదని, అటువంటి దేశంపై ట్రంప్ విజ్ఞత లేకుండా వ్యవహరించి తప్పు చేశాడన్నారు . ట్రంప్ తన బెదిరింపులతో లొంగదీసుకోవాలనుకోవడం, అందులోనూ భారత్ లాంటి దేశంపై సుంకాలతో కాలు దువ్వడం వంటిది అమెరికాకే మంచిది కాదన్నారు. ప్రస్తుతం చైనా అధ్యక్షుడు జిన్పింగ్-మోదీల మధ్య జరుగుతున్న చర్చలతో మరో కొత్త శకం ఆరంభం కానుందన్నారు. ‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్ను బలవంతంగా లొంగిపోయేలా చేయాలనుకున్నారు. రష్యా ఆయిల్ కొంటే సుంకాలు విధించడం ఏంటి?,. భారత్ లాంటి దేశాన్ని తక్కువ చేసి చూడటం సమంజసం కాదనేది నా అభిప్రాయం. తెలివైన వారు ఎవరూ కూడా ఇలా వ్యవహరించరు. ట్రంప్ చర్య సరైనది కాదు. భారత్కు బెదిరింపులకు ఎదురొడ్డి నిలబడే శక్తి ఉంది.. అవకాశం కూడా ఉంది’ అని ఎయిమర్ టాన్జెన్ స్సష్టం చేశారు. ఇదీ చదవండి: భారత్లోకి మళ్ళీ టిక్టాక్?: మొదలైన నియామకాలు -
స్వదేశీ వస్తువులనే వాడండి
సాక్షి, న్యూఢిల్లీ: రాబోయేది పండుగల కాలమని, ఈ సీజన్లో ప్రజలందరూ స్వదేశీ వస్తువులనే ఉపయోగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బహుమతులు, దుస్తులు, అలంకరణలు జీవితంలో ప్రతీది మనదేశంలో తయారైందే ఉపయోగించాలని, ఇది స్వదేశీ అని సగర్వంగా చెప్పుకోవాలని సూచించారు. అదే ఆత్మనిర్భర్ భారత్కు దారి తీస్తుందని ఉద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువులపై 50 శాతం సుంకం విధించడంతో అమెరికాతో సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో దేశం స్వావలంబన చెందాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి 125వ ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ మాట్లాడారు. వివిధ ప్రాంతాలు గణేష్ చతుర్థి, ఆ తరువాత దుర్గా నవరాత్రులు, దీపావళి పండుగలు వరుసగా వస్తున్నందున పండుగల సమయంలో ప్రజలు స్వదేశీ ఉత్పత్తుల గురించి ఎప్పటికీ మరచిపోకూడదన్నారు. రామాయణం, భారతీయ సంస్కృతి పట్ల ప్రేమ ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి మూలకు చేరుకోవడం చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. ప్రకృతి వైపరీత్యాల విధ్వంసంపై విచారం.. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు చేపట్టిన భద్రతా దళాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానికులు చూపిన ధైర్యాన్ని అభినందించారు. ‘వంతెనలు కూలినా, కొండచరియలు విరిగిపడినా, మనుషుల ప్రాణాలను రక్షించేందుకు ప్రతి ఒక్కరూ చేసిన కృషి దేశానికి గర్వకారణం’అని కొనియాడారు. ప్రకృతి వైపరీత్యాలు సృష్టించిన విధ్వంసంపై ప్రధాని విచారం వ్యక్తం చేశారు. పటేల్ వల్లే హైదరాబాద్ విమోచన.. ‘భారత సమగ్రతను కాపాడటంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ పాత్ర చిరస్మరణీయం. 1948లో ఆయనే చూపిన దూరదృష్టి, ధైర్యసాహసాల వలననే హైదరాబాద్ విమోచన సాధ్యమైంది. సెపె్టంబర్ 17వ తేదీ హైదరాబాద్ విమోచన దినోత్సవం మనకు చరిత్రలోని ఒక మహత్తర గాథను గుర్తు చేస్తుంది. అది కేవలం ఒక ప్రాంత విమోచన కాదు, దేశ సమగ్రతకు బలమైన పునాది. ప్రతిభా సేతుతో వందలాది మందికి ఉపాధి యూపీఎస్సీలో ఎంపిక కాని ప్రతిభావంతుల కోసం రూపొందించిన ‘ప్రతిభా సేతు పోర్టల్’గురించి ప్రధాని ప్రస్తావించారు. ఈ పోర్టల్ ద్వారా ఇప్పటికే వందలాది మంది ఉపాధి పొందారన్నారు. మధ్యప్రదేశ్ యువకులు ఫుట్బాల్ ఆడుతున్న దృశ్యం జర్మన్ కోచ్ దృష్టిని ఆకర్షించడం, వారికి జర్మనీలో శిక్షణ కల్పించడానికి ముందుకు రావడాన్ని ప్రధాని ఉదహరించారు. కొంతమంది ఆటగాళ్లు త్వరలో శిక్షణ కోసం జర్మనీకి వెళతారని ప్రధాని తెలిపారు. సైనికుల గాథలను సేకరించి, అమరవీరుల కుటుంబాలతో సంబంధాలు కొనసాగిస్తున్న సమాజసేవకుడు జితేంద్ర సింగ్ రాథోడ్ సేవలను ప్రధాని ప్రశంసించారు. బీహార్కు చెందిన ‘సోలార్ దీదీ’ దేవకి సోలార్ పంపుల ద్వారా గ్రామానికి నీరు అందజేసి రైతుల ఆదాయాన్ని పెంచిన కృషిని గుర్తుచేశారు. విశ్వకర్మ సోదరులకూ వందనం ‘సెపె్టంబర్ 17న విశ్వకర్మ జయంతి. ఆ రోజును మన విశ్వకర్మ సోదరులకు అంకితం చేశాం. వడ్రంగులు, కమ్మరి, స్వర్ణకారులు, కుమ్మరులు, శిల్పులు – ఈ సంప్రదాయ వృత్తులు భారతీయ నాగరికతకు, సాంస్కృతిక వారసత్వానికి పునాదులు. ఒక తరం నుండి మరొక తరానికి నైపుణ్యాన్ని అందిస్తూ, జ్ఞానాన్ని కాపాడుతూ వస్తున్నారు. వీరిని ఆదుకోవడానికి ప్రభుత్వం ‘విశ్వకర్మ యోజన’ను ప్రారంభించింది’అని మోదీ తెలిపారు. PM Narendra Modi (@narendramodi), during the 125th episode of ‘Mann Ki Baat’, says, "Pratibha Setu Portal is a beacon of hope for those UPSC aspirants who narrowly miss selection, opening doors to fresh opportunities and dignity for talented individuals."(Source: Third Party) pic.twitter.com/ODyOTmT87n— Press Trust of India (@PTI_News) August 31, 2025 -
Modi China visit : ద్వైపాక్షిక సహకారంతోనే ప్రజా సంక్షేమం: ప్రధాని మోదీ
తియాంజిన్: ‘పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ఆధారంగా ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి మేము కట్టుబడి ఉన్నాము’ అని అధ్యక్షుడు జీ జిన్పింగ్తో చర్చల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇరుదేశాల ప్రజల సంక్షేమం ఈ ద్వైపాక్షిక సహకారంతో ముడిపడి ఉందన్నారు. సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయ్యారు. ఎస్సీఓ సదస్సులో భాగంగా వీరి మధ్య భేటీ జరిగింది. ఏడేళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.. చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్తో ఆదివారం ద్వైపాక్షిక చర్చలు చేపట్టారు. అమెరికా భారీ సుంకాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్యనున్న విభేదాలను పక్కన పెట్టి, రెండు ఆసియా పొరుగు దేశాలు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న వేళ ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సు 2025 కోసం చైనాలోని తియాంజిన్ నగరానికి చేరిన ప్రధాని, అక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాటు అనేక మంది ప్రపంచ నాయకులతో సమావేశం కానున్నారు. ఈ నేపధ్యంలోనే మోదీ.. జిన్పింగ్తో సమావేశం అయ్యారు. దాదాపు 10 నెలల తర్వాత ఈ ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. చివరిసారిగా ఈ నేతలు రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో కలుసుకున్నారు.2020లో గల్వాన్ లోయలో చోటుచేసుకున్న ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి రావడానికి ఈ భేటీ తోడ్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలుపై ట్రంప్ విధించిన సుంకాల కారణంగా ఇరు దేశాలు ఒత్తిడికి గురవుతున్న సమయంలో ఈ సమావేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోదీ, అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య జరిగిన ఈ చర్చల్లో ఇరు దేశాల సంబంధాలను మెరుగుపరుచుకోవడం ప్రధాన ఎజెండాగా ఉండనుంది. ప్రధాని మోదీ- జిన్పింగ్ భేటీలో ముఖ్యాంశాలుప్రధాని మోదీ , చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య సమావేశం 55 నిమిషాల పాటు కొనసాగింది.కైలాస మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభమైంది- ప్రధాని మోదీరెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాలు కూడా ప్రారంభం కానున్నాయి - ప్రధాని మోదీ శిఖరాగ్ర సమావేశం విజయవంతం అయినందుకు అభినందిస్తున్నాను- జిన్పింగ్తో ప్రధాని మోదీసంబంధాలను మెరుగుపరచుకోవడానికి కట్టుబడి ఉన్నాం- జిన్పింగ్తో ప్రధాని మోదీగత సంవత్సరం కజాన్లో అర్థవంతమైన చర్చలు జరిగాయి- ప్రధాని మోదీ Tianjin, China: During his bilateral meeting with Chinese President #XiJinping, Prime Minister Narendra Modi says, "I congratulate you on China's successful chairmanship of the SCO. I thank you for the invitation to visit China and for our meeting today." pic.twitter.com/McF7aOQu11— Priya Mishra (@Priyaaa_B) August 31, 2025 -
జపాన్ పీఎం దంపతులకు మోదీ కానుకలు
న్యూఢిల్లీ: జపాన్లో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబాకు గౌరవప్రదంగా కొన్ని విలువైన కానుకలు బహూకరించారు. షిగేరు సతీమణికి సైతం మోదీ కానుక అందజేశారు. కశ్మీర్లో లభించే చేతితో అల్లిన అత్యంత నాణ్యమైన పశ్మీనా ఉన్ని శాలువను షిగేరు సతీమణి యోషికోకు బహూకరించారు. లద్దాఖ్లోని ఛాంగ్థంగీ జాతి మేక ఉన్నితో ఈ పశ్మీనా శాలువను తయారుచేశారు. ఈ శాలువ అత్యంత తేలికగా, మృదువుగా, వెచ్చగా ఉంటుంది. గతంలో కశ్మీరీ రాజుల కాలంలో ఈ పశ్మీనా ఉన్ని దుస్తులను ఎంతగానో ఇష్టపడేవారు. అదే సంస్కృతిని కశ్మీరీలు పరంపరగా కొనసాగిస్తూ హస్తకళను జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. శ్వేతవర్ణ అంచుతో, ఎరుపు, గులాబి రంగుల మేళవింపుతో అందంగా ఈ శాలువాను తయారుచేశారు. కాగితపు గుజ్జు, జగురు ఇతర సామగ్రితో అందంగా రూపొందించిన చిన్న పెట్టెలో పెట్టి ఈ శాలువాను ఆమెకు అందజేశారు. ఈ చిన్న పెట్టె మీద సైతం పుష్పాలు, పక్షుల చిత్రాలను అందంగా పెయింటింగ్ వేశారు. జపాన్ ఆహార అలవాట్లకు అనువుగా.. ఆంధ్రప్రదేశ్లో దొరికే అరుదైన గోధుమరంగు మూన్స్టోన్ రాయితో చేసిన రామెన్ గిన్నెను జపాన్ ప్రధానికి మోదీ బహూకరించారు. ఈ రామెన్ బౌల్ను పెట్టేందుకు రాజస్తానీ పార్చిన్కారి శైలిలో శ్వేతవర్ణ మక్రానా పాలరాయితో ఒక బేస్ను తయారుచేశారు. ఈ బేస్పై అరుదైన చిన్న రాళ్లను పొదిగారు. ఈ బౌల్లో ఆహారాన్ని జపాన్ శైలిలో తినేందుకు రెండు చాప్స్టిక్లను తయారుచేశారు. వాటి కొనలను వెండితో రూపొందించారు. పెద్ద బౌల్కు తోడుగా నాలుగు చిన్న బౌల్లను అందజేశారు. జపాన్లోని డోంబురీ, సోబా సంప్రదాయాల్లో ఇలా ఒక పెద్ద గిన్నె, నాలుగు చిన్న గిన్నెలను వాడతారు. మూన్స్టోన్ రాయి ప్రేమ, సమతుల్యత, రక్షణలను సూచిస్తుంది. -
పుతిన్-మోదీ భేటీ వేళ.. జెలెన్స్కీకి ఫోన్కాల్
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్ వేదికగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ భేటీ కంటే ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో మోదీ ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్ శాంతి చర్చల అంశంపై ఈ ఇద్దరూ చర్చించుకున్నట్లు తెలుస్తోంది.కీవ్పై మాస్కో దాడుల ఉధృతమైన నేపథ్యంలో.. తాజా పరిస్థితులు, మానవతా అంశాలు, శాంతి స్థాపన ప్రయత్నాలపై ఇరు దేశాల నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల వాషింగ్టన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జరిగిన సమావేశ వివరాలను జెలెన్స్కీ మోదీకి వివరించారు. అలాగే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని తెలిపారు.‘‘ఉక్రెయిన్ అధ్యక్షుడితో జరిగిన చర్చలో యుద్ధ పరిస్థితి, మానవతా అంశాలు, శాంతి స్థాపన ప్రయత్నాలపై అభిప్రాయాలు పంచుకున్నాం. భారత్ శాంతి కోసం జరిగే అన్ని ప్రయత్నాలకు సంపూర్ణ మద్దతు ఇస్తుంది’’ అని భారత ప్రధాని, జెలెన్స్కీతో ఫోన్కాల్ సారాంశాన్ని వెల్లడించారు. మరోవైపు.. జెలెన్స్కీ కూడా సంభాషణను ఉపయోగకరమైన, ముఖ్యమైన చర్చగా అభివర్ణించారు. అలస్కాలో ట్రంప్-పుతిన్ సమావేశం జరిగినప్పటి నుంచి.. రష్యా నుంచి శాంతి సంకేతాలు రాలేదని, రష్యా ఇటీవల తమ పౌరులపై దాడులు ఉధృతం చేస్తోందని, అసలు పుతిన్ శాంతి చర్చలకు సిద్ధంగా లేడని జెలెన్స్కీ అంటున్నారు. ఈ యుద్ధం ముగియాలంటే వెంటనే కాల్పుల విరమణ అమలు కావాలని అని జెలెన్స్కీ మోదీతో చెప్పినట్లు తెలుస్తోంది. -
టియాంజిన్ లో ల్యాండ్ అయిన ప్రధాని మోదీ
-
చైనాలో అడుగుపెట్టిన మోదీ
తియాంజిన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడేళ్ల తర్వాత చైనాలో అడుగుపెట్టారు. జపాన్లో రెండు రోజుల పర్యటన ముగించుకొని శనివారం సాయంత్రం చైనాకు చేరుకున్నారు. ఉత్తర చైనాలోని తియాంజిన్లో ఆదివారం, సోమవారం జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా చైనా అధినేత షీ జిన్పింగ్తోపాటు ఇతర దేశాల అధినేతలతో సమావేశమవుతారు. తియాంజిన్లో మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు సంప్రదాయ రీతిలో సంగీత, నృత్య కార్యక్రమాలతో స్వాగతం పలికారు. జిన్పింగ్తోపాటు రష్యా అధ్యక్షుడు పుతిన్తో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం భారత్, చైనా కలిసికట్టుగా పనిచేయాలని, పరస్పరం సహకరించుకోవాలని మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే. భారత ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం 50 శాతం టారిఫ్లు విధించిన నేపథ్యంలో భారత్, చైనా మధ్య సంబంధాలు బలపడుతుండడం, మోదీ–జిన్పింగ్ భేటీ అవుతుండడాన్ని ప్రపంచదేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ప్రధాని మోదీ చివరిసారిగా 2018లో చైనాలో పర్యటించారు. ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. అలాగే చైనా అధినేత జిన్పింగ్ 2019 అక్టోబర్లో భారత్లో పర్యటించారు. గణనాథుడి చిత్రాన్ని షేర్ చేసిన చైనా ప్రధాని మోదీ చైనా పర్యటన నేపథ్యంలో భారత్లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్.. వినాయకుడి ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇరుదేశాలు కళలు, విశ్వాసం, సంస్కృతులను పంచుకున్నాయని వెల్లడించారు. ఇవి చైనాలోని టాంగ్ రాజవంశం కాలంలో, మొగావో గుహల్లోని గణనాథుడి ప్రతిమలు అని పేర్కొన్నారు. భారత్, చైనా మధ్య శతాబ్దాలుగా బలమైన సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని చెప్పడానికి ఇవి అద్భుతమైన ప్రతీకలు అని యూ జింగ్ స్పష్టంచేశారు. #WATCH | Prime Minister Narendra Modi receives a warm welcome as he arrives at a hotel in Tianjin, China. Chants of 'Bharat Mata ki jai' and 'Vande Mataram' raised by members of the Indian diaspora.(Video: ANI/DD) pic.twitter.com/hiXQYFqm07— ANI (@ANI) August 30, 2025 -
SCO శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
సెమీకండక్టర్ రంగం అత్యంత కీలకం
టోక్యో: ప్రధాని నరేంద్ర మోదీ జపాన్లో షింకాన్సెన్ బుల్లెట్ రైలులో ప్రయాణించారు. జపాన్ ప్రధానమంత్రి షిగెరు ఇషిబాతో కలిసి రాజధాని టోక్యో నుంచి 300 కిలోమీటర్ల దూరంలోని సెండాయ్కి చేరుకున్నారు. అక్కడ సెమీకండక్టర్ ప్లాంట్ను సందర్శించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మోదీ తొలి రోజు శుక్రవారం ఇషిబాతో సమావేశమై, ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పలు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రెండో రోజు శనివారం టోక్యో ఎల్రక్టాన్ లిమిటెడ్–మియాగీ(టెల్ మియాగీ)ను సందర్శించారు. సెమీకండక్టర్ల తయారీలో ఈ సంస్థ అగ్రగామిగా మారింది. సెమీకండక్టర్ల తయారీలో పరస్పరం సహకరించుకోవాలని భారత్, జపాన్ ఇప్పటికే నిర్ణయానికొచ్చాయి. モディ首相と仙台へ。昨夜に引き続き、車内からご一緒します。 pic.twitter.com/ggE6DonklN— 石破茂 (@shigeruishiba) August 30, 2025భారత్లో ప్లాంట్ల ఏర్పాటుకు జపాన్ సాంకేతిక సహకారం అందించనుంది. అలాగే 508 కిలోమీటర్ల ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టుకు జపాన్ సహకరించేలా ఒప్పందం కుదిరింది. సెండాయ్లో మోదీ గౌరవార్థం ఇషిబా ప్రత్యేక విందు ఇచ్చారు. ఇండియా–జపాన్ మధ్య సహకారంలో సెమీకండక్టర్ రంగం అత్యంత కీలకమని మోదీ ఉద్ఘాటించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. టోక్యో ఎల్రక్టాన్ ఫ్యాక్టరీలో ట్రైనింగ్ రూమ్, ప్రొడక్షన్ ఇన్నోవేషన్ ల్యాబ్ను సందర్శించానని, అధికారులతో మాట్లాడానని తెలిపారు. సెమీకండక్టర్ల రంగంలో భారత్, జపాన్ గత కొన్నేళ్లుగా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాయని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ఈ సహకారం మరింత పెరగాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల సరఫరాలో టెల్–మియాగీ ప్రాధాన్యతను అధికారులు మోదీకి వివరించారు. JR東日本で研修中のインド人運転士さんたちとご挨拶。 pic.twitter.com/UXKoSVP50r— 石破茂 (@shigeruishiba) August 30, 2025 -
భారత్-జపాన్ సంబంధాల్లో సువర్ణ అధ్యాయానికి శ్రీకారం... ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ.. జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాతో ద్వైపాక్షిక భేటీ
-
మోదీకి జపాన్ కానుకగా ఇచ్చింది మన బోధిధర్మ ప్రతిమే
జపాన్ పర్యటనలో అక్కడి ప్రఖ్యాత షోరిన్జాన్ దారూమేజీ ఆలయ సందర్శన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కానుకగా అందుకున్న దారూమా ప్రతిమ అందరి దృష్టినీ తెగ ఆకర్షిస్తోంది. చివరికి ఇంటర్నెట్లో కూడా అదే ట్రెండింగ్గా మారింది. జపాన్ చరిత్ర, సంస్కృతులతో దారూమాది విడదీయలేని బంధం! జపనీస్ భాషలో దారూమ అంటే బోధిధర్మ అని అర్థం. ఇక జీ అంటే ఆలయం. బోధిధర్ముడు జెన్ బౌద్ధ స్థాపకుడు. రాజధాని టోక్యోకు ఉత్తరాన టకసాకిలో ఉన్న షోరిన్జాన్ దారూమేజీ ఆలయం శతాబ్దాలుగా భక్తులు, పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తూ వస్తోంది. ప్రస్తుత రూపంలోని దారూమా ప్రతిమను రూపొందించింది ఆలయపు తొమ్మిదో పీఠాధిపతి అయిన టొగకు. కొంతకాలంలోనే దారూ మా జపనీయుల ఇంటింటి బొమ్మగా మారి పోయింది. నేటికీ ఏటా దారుమా ప్రతిమోత్సవాన్ని షోరిన్జా న్లో ఘనంగా జరుపుతారు. అలాంటి ప్రతిమను మోదీకి బహూ కరించడం ద్వారా భారత్కు జపాన్ శుభాకాంక్షలతో పాటు ఆ ధ్యాత్మిక ఆశీస్సులు కూడా అందించిందని భావిస్తు న్నారు. జపాన్లో మామూలు కుటుంబాలతో పాటు రాజకీయ నాయకులు మొదలుకుని వ్యాపారవేత్తల దాకా ఆశలకు, ప్రగతికి ప్రతీకగా ఇళ్లు, కార్యాల యాల్లో దారూమా ప్రతిమను ఉంచుకోవడం పరిపాటి. బోధిధర్ముడు మనవాడే!జెన్ బౌద్ధ స్థాపకుడైన బోధిధర్ముడు భారతీ యుడేనని, అందునా దాక్షిణాత్యుడని, క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దికి చెందినవాడని చెబుతారు. తమిళ నాడులోని పల్లవ రాజు మూడో కుమారుడైన బోధి« దర్మ సన్యాసం స్వీకరించి జెన్ బౌద్ధాన్ని చైనాకు తీసుకెళ్లాడు. అంతేకాదు, మార్షల్ ఆర్ట్స్లోనూ ఆయన సాటిలేని మేటి. ఆ పోరాట కళను చైనాకు పరిచయం చేసింది కూడా బోధిధర్ముడే. అందుకే చైనీయులు ఆయనను దామో పేరిట దైవంతో సమానంగా కొలుచు కున్నారు. మూలికా వైద్యంలోనూ బోధిధర్ముడు సిద్ధుడు. ఆ విద్యను చైనీయులకు ప్రసాదించింది కూడా ఆయనేనని మనవాళ్లు నమ్ముతారు. ఆ సిద్ధవైద్య కళ శాశ్వతంగా తమకే సొంతం కావాలనే దురాశతో చివరికి దారుమాను విషమిచ్చి అంతం చేశారంటారు. ఈ ఇతివృత్తంతో సూర్య హీరోగా కొన్నేళ్ల క్రితం వచ్చిన సెవెన్త్ సెన్స్ సినిమా ఘనవిజయం సాధించింది.ఎటు తిప్పినా పైకే!చూసేందుకు చిన్నదే అయినా, దారూమా ప్రతిమ తాలూకు ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు...→ తెరుచుకుని ఉండే కన్ను, తిరుగులేని బ్యాలెన్స్ దీని ప్రధాన ఆకర్షణలు.→ ఇది గుండ్రంగా, లోపలంతా బోలుగా, కళ్లు చెదిరే రంగులతో కూడి ఉంటుంది.→ భారీదనం కారణంగా దారూమాను ఎటువైపు పడేలా తట్టినా వెంటనే పైకి లేస్తుంటుంది.→ ఏడుసార్లు కింద పడ్డా, ఎనిమిదోసారి కూడా పట్టు వీడకుండా పైకి లేవాల్సిందే’నన్న ప్రఖ్యాత జపనీస్ సామెతకు ఇది ప్రతీకగా నిలుస్తుంది.→ లక్ష్యాలు నిర్దేశించుకోవడానికి, అహరహం శ్రమించి కలలను నిజం చేసుకోవడానికి దారూమా ప్రతిమను చిహ్నంగా భావిస్తారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కలిసి నడుద్దాం..బలపడదాం!
టోక్యో: భారత్–జపాన్ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంలో నూతన, సువర్ణ అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ సహా వివిధ కీలక రంగాల్లో పరస్పర సహకారం కోసం పదేళ్ల రోడ్మ్యాప్ సిద్ధం చేసినట్లు వెల్లడించారు. జపాన్తో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం జపాన్కు చేరుకున్నారు. రాజధాని టోక్యోలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అదృష్టానికి, శుభానికి సంకేతంగా భావించే జపాన్ సంప్రదాయ దారూమా బొమ్మను బౌద్ధ మత గురువులు బహూకరించారు. అనంతరం జపాన్ ప్రధానమంత్రి షిగెరు ఇషిబాతో మోదీ సమావేశమయ్యారు. భారత్–జపాన్ సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. సెమీకండక్టర్ల నుంచి అరుదైన ఖనిజాల సరఫరా దాకా.. కీలక రంగాల్లో సహకారంపై అభిప్రాయాలు పంచుకున్నారు. మానవ వనరుల అభివృద్ధి, సాంస్కృతిక సంబంధాలపైనా చర్చ జరిగింది. సుస్థిర ఇంధన కార్యక్రమం, బ్యాటరీ సరఫరా వ్యవస్థ భాగస్వామ్యం, ఆర్థిక భద్రత–సహకార కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఇరువురు నేతలు ఉమ్మడిగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘జపాన్ టెక్నాలజీ, ఇండియన్ టాలెంట్ విన్నింగ్ కాంబినేషన్’ అని మోదీ ఉద్ఘాటించారు. రెండూ పూర్తిస్థాయిలో ఒక్కటైతే ఇక తిరుగుండదని తేలి్చచెప్పారు. భౌగోళిక రాజకీయాల పరంగా సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో భారత్, జపాన్ కలిసికట్టుగా పనిచేయాలని, ఒక దేశం బలాన్ని మరో ఉదేశం ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి, స్థిరత్వానికి భారత్–జపాన్ భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలియజేశారు. ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి రెండు దేశాలు సమానమైన సవాళ్లు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. 13 ఎంఓయూలపై సంతకాలు ప్రపంచాన్ని మెరుగ్గా తీర్చిదిద్దడంలో ప్రజాస్వామ్య దేశాల పాత్ర సహజంగానే అధికంగా ఉంటుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆ దిశగానే భారత్, జపాన్ కలిసి ప్రయాణం సాగిస్తున్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య బలీయ బంధానికి.. పెట్టుబడులు, నవీన ఆవిష్కరణలు, ఆర్థిక భద్రత, పర్యావరణ పరిరక్షణ, అత్యాధునిక సాంకేతికత, ఆరోగ్యం, రవాణా, ప్రజల మధ్య పరస్పర సంబంధాలు, ప్రభుత్వం నడుమ భాగస్వామ్యమే ప్రాతిపదిక అని వివరించారు. అత్యాధునిక టెక్నాలజీలో భాగస్వామ్యానికి తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. డిజిటల్ భాగస్వామ్యం 2.0, కృత్రిమ మేధ(ఏఐ) సహకార కార్యక్రమంపై సంప్రదింపులు జరుగుతున్నాయని స్పష్టంచేశారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చంద్రయాన్–5 మిషన్లో జపాన్ సైతం పాలుపంచుకోనుందని ప్రకటించారు. జపాన్ ప్రధాని ఇషిబా మాట్లాడుతూ.. తదుపరి తరం సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలంటే భారత్–జపాన్ సహకరించుకోవాల్సిందేనని స్పష్టంచేశారు. మోదీ–ఇషిబా భేటీ సందర్భంగా భారత్–జపాన్లు 13 అవగాహనా ఒప్పందాల (ఎంఓయూ)పై సంతకాలు చేశాయి. రాబోయే పదేళ్లలో భారత్లో జపాన్ 10 ట్రిలియన్ యెన్లు (రూ.6 లక్షల కోట్లు) పెట్టుబడిగా పెట్టాలని లక్ష్యంగా నిర్దేశించారు. రక్షణ, నూతన ఆవిష్కరణల రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఇరుదేశాలు నిర్ణయానికొచ్చాయి. భారత్, చైనా ఒక్కటైతేనే.. ప్రపంచ ఆర్థిక క్రమం(ఆర్డర్)లో స్థిరత్వం తీసుకురావాలంటే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన భారత్, చైనా తప్పనిసరిగా కలిసి పనిచేయాలని ప్రధాని మోదీ వెల్లడించారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం, సౌభాగ్యం కోసం ఆసియాలో దిగ్గజ దేశాలైన భారత్, చైనా మధ్య స్నేహ సంబంధాలు బలపడాల్సిందేనని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సాగిస్తున్న టారిఫ్ల యుద్ధాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్–చైనాలు ఒక్కటైతే ఇరుదేశాలతోపాటు ప్రపంచ దేశాలకు సైతం మేలు జరుగుతుందని చెప్పారు. జపాన్ పత్రిక యోమియురి షిమ్బన్కు ప్రధాని మోదీ శుక్రవారం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత్–చైనా సంబంధాల ఆవశ్యకతను వివరించారు.పెట్టుబడులకు స్వర్గధామం పారిశ్రామికవేత్తలకు మోదీ పిలుపు భారతదేశం అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. రాజకీయ, ఆర్థిక స్థిరత్వం, పరిపాలన–ప్రభుత్వ విధానాల్లో పారదర్శకత దేశాన్ని పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చాయని అన్నారు. ఈ అవకాశం ఉపయోగించుకోవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ శుక్రవారం జపాన్ రాజధాని టోక్యోలో భారత్–జపాన్ సంయుక్త ఆర్థిక సదస్సులో ప్రసంగించారు. జపాన్ కంపెనీలు ఇండియాలో 40 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయని గుర్తుచేశారు. -
మిత్ర లాభం
అంతా సవ్యంగా ఉన్న రోజుల్లో భిన్న దేశాలతో దౌత్య సంబంధాలు సాఫీగా సాగి పోతాయి. కానీ సవాళ్లు ఎదురయ్యే కాలంలో వాటిని నిలబెట్టుకోవటం, కొత్త బంధాలు ఏర్పర్చుకోవటం సులభం కాదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైఖరి కారణంగా భారత్–అమెరికా సంబంధాల్లో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జపాన్లో రెండు రోజుల పర్యటన ప్రారంభించారు. ఈ నెల 31న, ఆ మర్నాడూ చైనాలోని తియాన్జిన్లో జరగబోయే షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సులో కూడా ఆయన పాలుపంచుకుంటారు. జపాన్తో మనకు చిరకాల మైత్రి ఉంది. మన స్వాతంత్య్రోద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ)ని స్థాపించి పోరాడినప్పుడు అన్ని విధాలా చేయూతనందించింది జపానే. స్వాతంత్య్రానంతరం ఆ బంధం మరింత బలపడింది. రెండో ప్రపంచ యుద్ధ పరిసమాప్తి అనంతరం లాంఛనంగా 1951 సెప్టెంబర్ 8న శాన్ఫ్రాన్సిస్కో శాంతి ఒప్పందం కుదిరినప్పుడు జపాన్కు పాక్షిక సార్వభౌమత్వం మాత్రమే ఇవ్వాలన్న నిబంధనను మన దేశం తీవ్రంగా వ్యతిరేకించి సంతకం చేసేందుకు నిరాకరించింది. అందుకు జపాన్ ఈనాటికీ మన పట్ల కృతజ్ఞతగా ఉంటుంది. తొలిసారి 2014లో ఎన్డీయే సర్కారు ఏర్పడినప్పుడే మోదీ జపాన్ను సందర్శించారు. ఈ దశాబ్ద కాలంలో ఇరు దేశాల సంబంధాలూ మోదీ అన్నట్టు ఎన్నో రెట్లు పెరిగాయి. మన దేశంలో ప్రస్తుత జపాన్ పెట్టుబడుల విలువ 4,200 కోట్ల డాలర్లు. దేశంలోని ఢిల్లీ, ముంబై, కోల్కతా మెట్రో రైలు ప్రాజెక్టులు జపాన్ ఆర్థిక సహకారంతో సాకారమయ్యాయి. ఢిల్లీ–ముంబై పారిశ్రామిక వాడ, సెమీకండక్టర్లు తదితరాలపై జపాన్ ముద్ర బలంగా ఉంది. ముంబై–అహ్మదాబాద్ మధ్య సాకారం కానున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు అత్యాధునిక ఈ–10 రకం బుల్లెట్ రైలును అందించాలని జపాన్ నిర్ణయించింది. వచ్చే పదేళ్లలో మన దేశంలో జపాన్ పెట్టుబడుల్ని పది లక్షల కోట్ల యెన్ల(6,800 కోట్ల డాలర్ల) స్థాయికి తీసుకెళ్లాలని మోదీ, జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా శిఖరాగ్ర సమావేశంలో నిర్ణయించటం, పెట్టుబడులతోపాటు నవీకరణ, పర్యావరణం, ఆరోగ్యం తది తరాల్లో కలిసి పనిచేయాలనుకోవటం... రాగల అయిదేళ్లలో భిన్న రంగాల నిపుణుల సేవలు పొందేందుకు పరస్పరం అయిదు లక్షల మందిని బదలాయించుకోవాలను కోవటం భారత్, జపాన్ల మైత్రి పటిష్ఠతకు నిదర్శనం. ఈ క్రమంలో సహజంగానే సవాళ్లుంటాయి. స్వేచ్ఛాయుత, శాంతియుత, సంపద్వంత ఇండో–పసిఫిక్ ఆవిర్భవించాలన్న నినాదం అమెరికా ఛత్రఛాయలో ఏర్పడింది. దక్షిణ చైనా సముద్ర ప్రాంత సరిహద్దుల విషయంలో చైనాతో జపాన్కు తగాదా లేకున్నా, దాని దూకుడు పెద్ద సమస్యగా మారింది. చైనా తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల జపాన్కు ఎగుమతుల సమస్య ఏర్పడుతోంది. చైనాను కట్టడి చేయాలన్న బృహత్తర పథకానికి ఈ వివాదం తోడ్పడుతుందని అమెరికా భావించి మనల్ని అందులో కీలక భాగస్వామిని చేసింది. సుంకాల వివాదంలో ఇది ఎటు పోతుందన్న ఆందోళన జపాన్కు సహజంగానే ఉంటుంది. అయితే తమ వైఖరి మారబోదని మోదీ చెప్పటం జపాన్కు ఊరటనిచ్చే అంశం. ఇండో–పసిఫిక్ విషయంలో మన వైఖరి చైనాకు కంటగింపుగానే ఉండొచ్చు. జపా న్తో సంబంధాలు సుహృద్భావంతో ఉండగా, చైనాతో సంబంధాలు అందుకు భిన్నం. సుంకాల వివాదం నేపథ్యంలో భారత్ దగ్గరవుతుందన్న అంచనా చైనాకుంది. ఎస్సీవో శిఖరాగ్ర సదస్సుకు మోదీ వెళ్తారా వెళ్లరా అనే సంశయం మొదట్లో ఉన్నా... రష్యా చొరవతో అది సాధ్యపడుతోంది. ఇది సాన్నిహిత్యానికి దారి తీస్తుందా లేదా అన్నది చూడాలి. చైనా ఇప్పటికే ఎరువులు, అరుదైన ఖనిజాలు, సొరంగాల తవ్వకంలో తోడ్పడే యంత్ర సామగ్రి ఎగుమతులపై ఉన్న నిషేధాలు తొలగించటానికి సూత్రప్రాయంగాఅంగీకరించింది. మోదీ చైనా పర్యటనలో ఈ విషయంలో మరింత స్పష్టత వస్తుంది. చైనాతో మన సంబంధాలు బలపడే సూచనలుండగా, ట్రంప్ సైతం చైనాతో సన్నిహితమై దక్షిణాసియాలో పలుకుబడి పెంచుకోవాలనుకుంటున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మన వ్యూహాత్మక ఆధిక్యతను నిలబెట్టుకుంటూ జపాన్, చైనాలతో సఖ్యత కుదుర్చుకోవటం దౌత్యపరంగా మనకు పెను సవాలే. మోదీ దీన్ని ఎలా ఛేదించగలరో చూడాలి. -
భారత్-చైనా సంబంధాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
టోక్యో: భారత్-చైనా సంబంధాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాతో సంబంధాలు మెరుగు పరుచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. చైనాలో జరగనున్న ఎస్సీవో (షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్) సమ్మిట్ కోసం చైనా తియాంజిన్ నగరానికి వెళ్లనున్నారు.అంతకంటే ముందే చైనా పర్యటనపై ప్రధాని మోదీ స్పందించారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న మోదీని ఆ దేశ ప్రముఖ జాతీయ దినపత్రిక ‘యోమియురి షింబున్’ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో అంతర్జాతీయంగా ఆర్ధిక ఒడిదుడుకులు కొనసాగుతున్న తరుణంలో భారత్-చైనాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇరు దేశాలు పరస్పర గౌరవం, ప్రయోజనాలు దీర్ఘకాలికంగా కలిసి ముందుకు సాగాలి. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆహ్వానం మేరకు తియాంజిన్కి వెళ్లనున్నట్లు చెప్పిన మోదీ.. గతేడాది కజాన్లో జరిగిన ఓ సమావేశం తర్వాత ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయని తెలిపారు.భారత్, చైనా వంటి రెండు పెద్ద దేశాల మధ్య స్థిరమైన, అనుకూలమైన సంబంధాలు ప్రాంతీయ, ప్రపంచ శాంతికి, అభివృద్ధికి దోహదపడుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిరత నేపథ్యంలో భారత్-చైనా కలిసి పనిచేయడం ద్వారా ఆర్థిక స్థిరత సాధించవచ్చని మోదీ పేర్కొన్నారు.ప్రధాని మోదీ శనివారం సాయంత్రం చైనాలోని తియాంజిన్ చేరతారు. ఆదివారం ఉదయం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో 40 నిమిషాల పాటు సమావేశం జరగనుంది. సోమవారం ఎస్సీవో ప్రధాన సమావేశం జరుగుతుంది.ఈ క్రమంలో 2020 నుంచి కొనసాగుతున్న సరిహద్దు ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలను పునరుద్ధరించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారంటూ అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. -
రాహుల్ క్షమాపణ చెప్పాలి
గౌహతి: చొరబాటుదార్ల కారణంగా అస్సాంలో జనాభా స్థితిగతుల్లో మార్పులు వస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆందోళన వ్యక్తంచేశారు. చొరబాటు సమస్యను అధ్యయనం చేయడానికి ప్రధాని మోదీ డెమొగ్రఫీ మిషన్ను ప్రకటించారని తెలిపారు. చొరబాటుదార్ల నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామంటూ హామీ ఇచ్చామని, అది కచి్చతంగా నిలబెట్టుకుంటామని తేల్చిచెప్పారు. అమిత్ షా శుక్రవారం అస్సాంలో పర్యటించారు. అస్సాం తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి గోలాప్ బొర్బోరా శత జయంతి వేడుకల్లో ప్రసంగించారు. ఏ ఒక్క చొరబాటుదారుడు మన దేశంలో ఉండడానికి వీల్లేదని స్పష్టంచేశారు. విదేశీయుల అక్రమంగా వచ్చి మన దగ్గర తిష్టవేస్తే సహించాలా? అని ప్రశ్నించారు. చొరబాటుదారులందరినీ బయటకు పంపించక తప్పదని అన్నారు. తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించడానికే ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)ను చేపట్టిందని, దానిపై రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని ప్రతిపక్షాలపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్షాలు ఓటర్ అధికార్ యాత్ర ముసుగులో చొరబాటుదార్ల బచావో యాత్ర చేస్తున్నాయని నిప్పులు చెరిగారు. ఏ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకైనా ఓటర్ల జాబితా గుండెకాయ లాంటిదని స్పష్టం చేశారు. బిహార్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఓటర్ అధికార్ యాత్ర సందర్భంగా ఆ పార్టీ నాయకులు ప్రధాని మోదీ తల్లిని అవమానించారని అమిత్ షా దుయ్యబట్టారు. రాహుల్ గాం«దీకి నిజంగా సిగ్గుంటే తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్కు వెళ్లొచ్చే నేతలు అస్సాంను పాలించాలా? తరచుగా పాకిస్తాన్కు వెళ్లొచ్చే నాయకులు అస్సాంను పరిపాలిస్తామంటే ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్కి పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయని పరోక్షంగా మండిపడ్డారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. రాజధాని గౌహతితో పంచాయతీ ప్రతినిధుల ర్యాలీలో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలు చొరబాటుదార్లకు, ఆక్రమణదార్లకు మద్దతిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిని ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చొరబాటుదార్లు అస్సాంలో వేలాది ఎకరాల భూమిని ఆక్రమించారని, వారిని వెళ్లగొట్టేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయతి్నస్తుండగా, కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. 1.29 లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వం ఆక్రమణదార్ల చెర నుంచి విడిపించిందని గుర్తుచేశారు. అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ వర్మ అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారని ప్రశంసించారు. ఆయన నాయకత్వంలో బీజేపీ మళ్లీ విజయం సాధిస్తుందని చెప్పారు. -
Japan: గాయత్రి మంత్రంతో ప్రధాని మోదీకి స్వాగతం
టోక్యో: ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల పర్యటనలో భాగంగా జపాన్లోని టోక్యోకు చేరుకున్నారు. ఆయన 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. టోక్యోలో ప్రధాని మోదీని గాయత్రి మంత్ర జపంతో స్వాగతించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. దానిలో జపాన్ కళాకారులతో పాటు ప్రధాని మోదీ కూడా గాయత్రి మంత్రాన్ని పఠించడం కనిపిస్తుంది.జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జపాన్ పర్యటన చేపట్టారు. ప్రధాని మోదీ 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. పలువురు వ్యాపారవేత్తలతో సంభాషించనున్నారు. ‘టోక్యోలో అడుగుపెట్టాను. భారత్- జపాన్ తమ అభివృద్ధి సహకారాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి. ఈ పర్యటనలో ప్రధాని ఇషిబా, ఇతర అధికారులతో సంభాషించాలనుకుంటున్నాను. ఇది సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించడానికి ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు. VIDEO | Members of the Japanese community welcomed Prime Minister Narendra Modi in Tokyo by reciting the Gayatri Mantra and other chants as he arrived in Japan.PM Modi is on a two-day visit to Japan at the invitation of Japanese Prime Minister Shigeru Ishiba to attend the 15th… pic.twitter.com/95m0ktLB9U— Press Trust of India (@PTI_News) August 29, 2025టోక్యోలో ఆత్మీయ స్వాగతం అందించిన జపాన్లోని భారతీయ సమాజాన్ని మోదీ ప్రశంసించారు.‘టోక్యోలోని భారతీయ సమాజం అందించిన ఆప్యాయత నన్ను బాగా ఆకట్టుకుంది. మన సాంస్కృతిక మూలాలను కాపాడుకుంటూనే ఇక్కడి భారతీయులు మెలగడం నిజంగా ప్రశంసనీయం. జపాన్ పర్యటన పూర్తయ్యాక ప్రధాని మోదీ చైనాను సందర్శించనున్నారు. అక్కడ జరిగే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. -
క్వాడ్ టు బుల్లెట్ ట్రైన్ .. జపాన్లో ప్రధాని మోదీ చర్చలివే
న్యూఢిల్లీ: అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య సుంకాల ఉద్రిక్తతల నడుమ ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటన ఆసక్తికరంగా మారింది. జపాన్తో ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను పెంచుకునే వార్షిక ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ చేరుకున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో ప్రధాని మోదీ ‘క్వాడ్’పై దృష్టి సారించనున్నారు.ప్రధాని మోదీ జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో పాటు 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. జపాన్కు చెందిన మీడియా ప్లాట్ఫామ్ నిక్కీ ఆసియా, రాబోయే దశాబ్దంలో భారతదేశంతో ద్వైపాక్షిక వ్యాపారాన్ని పెంచడానికి జపాన్ 10 ట్రిలియన్ యన్ (68 బిలియన్ అమెరికన్ డాలర్ల) పెట్టుబడి పెడుతుందని తెలిపింది. కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్లు, పర్యావరణం మరియు వైద్యంతో సహా బహుళ రంగాలో ఇది ఊతం కానున్నదని పేర్కొంది. ఈ పర్యటనకు ముందు ప్రధాని మోదీ‘ఎక్స్’లో.. ‘ఇరుదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు, ఆర్థిక,పెట్టుబడి సంబంధాల పరిధిని, ఆశయాన్ని విస్తరించేందుకు, ఏఐ,సెమీకండక్టర్లతో సహా నూతన సాంకేతిక రంగాలలో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తామని అన్నారు.ప్రపంచంలో చైనాకు పెరుగుతున్న ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు, ఇండో-పసిఫిక్ దేశాలకు నిధులు, ఆర్థిక అభివృద్ధికి ప్రత్యామ్నాయాన్ని అందించడానికి ఏర్పడిన వ్యూహాత్మక సమూహమే ‘క్వాడ్’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘క్వాడ్’లో భారతదేశం, ఆస్ట్రేలియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్ భాగస్వాములుగా ఉన్నాయి. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 50 శాతం సుంకాలు విధించిన తర్వాత క్వాడ్ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. జపాన్ వాణిజ్య సంధానకర్త రియోసీ అకాజావా చివరి నిమిషంలో అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. అలాగే జపాన్.. అమెరికాకు అందించే 550 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్యాకేజీని ఖరారు చేయడంలో ఆలస్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. Landed in Tokyo. As India and Japan continue to strengthen their developmental cooperation, I look forward to engaging with PM Ishiba and others during this visit, thus providing an opportunity to deepen existing partnerships and explore new avenues of collaboration.… pic.twitter.com/UPwrHtdz3B— Narendra Modi (@narendramodi) August 29, 2025అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్యాకేజీ మొత్తాన్ని తమ ఇష్టానుసారం పెట్టుబడి పెట్టడానికి వినియోగిస్తామని పేర్కొనగా,జపాన్ అధికారులు అందుకు విభేదించారు. తమ పెట్టుబడి పరస్పర ప్రయోజనాలకు లోబడి ఉంటుందని స్పష్టం చేశారు. కాగా ప్రధాని మోదీ ఈ పర్యటనలో టోక్యోలోని ఎలక్ట్రాన్ ఫ్యాక్టరీ, బుల్లెట్ రైళ్ల కోచ్లను నిర్మించే తోహోకు షింకన్సెన్ ప్లాంట్ను కూడా సందర్శిస్తారు. భారతదేశ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో టోక్యో భాగస్వామ్యం పై ఇరు దేశాలు చర్చించనున్నాయి. భారత్- జపాన్ మధ్య రక్షణ సహకారాన్ని మరింతగా పెంచాలని ప్రధాని మోదీ యోచిస్తున్నారు. జపాన్ పర్యటన తర్వాత ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ ఆహ్వానం మేరకు టియాంజిన్లో జరిగే షాంఘై శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. -
31న జిన్పింగ్తో మోదీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 31, వచ్చే నెల 1వ తేదీల్లో చైనాలో పర్యటించబోతున్నారు. తియాంజిన్ నగరంలో జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఈ నెల 31వ తేదీన చైనా అధినేత షీ జిన్పింగ్తో మోదీ సమావేశమవుతారు. ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్–చైనా సంబంధాలు, పరస్పర సహకారంతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై వారు చర్చించే అవకాశం ఉంది. అలాగే వచ్చే నెల 1వ తేదీన రష్యా అధ్యక్షుడు పుతిన్తో నరేంద్ర మోదీ భేటీ అవుతారు.భారత్–అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఒత్తిడికి లోనవుతున్న నేపథ్యంలో చైనా, రష్యా అధినేతలతో భారత ప్రధానమంత్రి ప్రత్యేకంగా సమావేశం కాబోతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాన్ని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు భారత ఉత్పత్తులపై ట్రంప్ ప్రభుత్వం ఏకంగా 50 శాతం టారిఫ్లు విధించిన సంగతి తెలిసిందే. మరోవైపు భారత్–చైనా మధ్య సంబంధాలు క్రమంగా బలపడుతున్నాయి. భారత్పై అమెరికా విధించిన భారీ టారిఫ్లను జిన్పింగ్ తప్పుపట్టారు.ప్రధాని మోదీ చైనాలో పర్యటిస్తుండడం ఏడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం. ఆయన చివరిసారిగా 2018లో చైనాలో పర్యటించారు. వూహాన్ సిటీలో షీ జిన్పింగ్తో సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా, మోదీ–పుతిన్ మధ్య జరగబోయే ద్వైపాక్షిక భేటీకి విశేషమైన ప్రాధాన్యం ఉంది. ఇటీవలి కాలంలో ఇండియాకు మరింత దగ్గరయ్యేందుకు పుతిన్ ప్రయత్నిస్తున్నారు. ఉక్రెయిన్పై దండయాత్ర ప్రారంభించిన తర్వాత రష్యాపై పశ్చిమ దేశాలు కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్, చైనాల నుంచి మరింత సహకారాన్ని పుతిన్ కోరుకుంటున్నారు. తియాంజిన్లో మోదీ, జిన్పింగ్, పుతిన్ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు రష్యా ప్రభుత్వం ఇటీవల సంకేతాలిచ్చింది. -
పుతిన్ కాదు.. ఇది ‘మోదీ యుద్ధం’.. భారత్పై అమెరికా అక్కసు
వాషింగ్టన్: భారత్ను టార్గెట్ చేసిన అమెరికా మరోసారి మన దేశంపై తన అక్కసును వెళ్లగక్కింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగడానికి భారత్ ప్రధాన కారణం అంటూ వైట్హౌస్ సలహాదారు పీటర్ నవారో సంచలన ఆరోపణలు గుప్పించారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ‘మోదీ యుద్ధం’ అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో అమెరికా సుంకాల నుంచి భారత్ తప్పించుకోవాలంటే రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం వెంటనే ఆపేయాలని సూచనలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.వైట్హౌస్ సలహాదారు పీటర్ నవారో తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగేందుకు భారత్ ప్రధాన కారణం. రష్యా నుంచి రాయితీపై భారత్ ముడిచమురు కొనుగోలు చేయడంతో యుద్ధంలో పుతిన్ దూకుడుగా వ్యవహరించారు. భారత్ అలా కొనుగోలు చేయకపోతే యుద్ధం ఇంత కాలం కొనసాగేది కాదు. ఇది మోదీ యుద్ధం. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ ఆపేయాలి. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్యలకు భారత్ కూడా సహకరించాలి. మోదీ తీరు విచిత్రంగా ఉంది. రష్యా విషయంలో మోదీ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు. Trump Adviser Peter Navarro: Everyone in America loses because of India buys oil from Russia. US taxpayers have to send money for Modi’s war in UkraineAnchor (confused): You mean Putin’s war? Navarro: No I mean Modi’s war! pic.twitter.com/HVE8EO7W8g— Shashank Mattoo (@MattooShashank) August 28, 2025ఇరుదేశాల మధ్య ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే.. భారత్ కూడా అందుకు సహకరించాల్సి ఉంటుంది. భారత్ చర్యల వల్ల అమెరికా పన్ను చెల్లింపుదారులు నష్టపోవాల్సి వస్తుంది. ఒకవేళ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును నిలిపివేస్తే.. 25 శాతం సుంకాలను పునరుద్ధరిస్తారా? అని ప్రశ్నించగా.. భారత్ ఆ దిశగా చర్యలు తీసుకున్న తర్వాతి రోజు నుంచే 25శాతం సుంకాలు అమలుచేస్తామని స్పష్టంచేశారు.అంతకుముందు కూడా నవారో భారత్పై సంచలన కామెంట్స్ చేశారు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకొంటూ భారత్ ‘లాభదాయకమైన పథకం’ నడుపుతోందని ఆరోపించారు. భారత్ను సుంకాల ‘మహారాజు’గా అభివర్ణించారు. భారత్తో అమెరికా వ్యాపారం వల్ల అమెరికన్లపై పడే నికర ప్రభావం ఏంటి?. అమెరికా వ్యాపారాన్ని, అమెరికన్ కార్మికులను ఇది దెబ్బతీస్తుంది. అమెరికా నుంచి పొందుతున్న డబ్బును రష్యన్ చమురు కొనుగోలుకు ఉపయోగిస్తున్నారు. ఆ డబ్బును రష్యా ఆయుధాల తయారీకి వాడి ఉక్రేనియన్లను చంపుతోంది. జరుగుతున్న రక్తపాతంలో తన పాత్రను గుర్తించడానికి భారత్ ఇష్టపడటం లేదు. ప్రస్తుతం భారత్ చేస్తున్నది శాంతిని కోరుకునేలా లేదని, యుద్ధాన్ని కొనసాగిస్తున్నట్లుగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. -
‘ట్రంప్ ఫోన్.. ఆపరేషన్ సిందూర్ను ఆపిన ప్రధాని మోదీ’
పాట్నా: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తానే అణచివేశానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. తన చొరవ లేకపోతే రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగే ప్రమాదం ఉండేదని ఆయన బహిరంగంగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యల ప్రకారం.. ఆయన ప్రధాని మోదీకి ఫోన్ చేసి ఆపరేషన్ సిందూర్ను నిలిపివేయాలని సూచించారని, కాబట్టే ఆపరేషన్ సిందూర్ ఆగిందని ఆరోపించారు.బీహార్ ముజాఫర్పూర్లో కాంగ్రెస్ ఓటర్ అధికార్ యాత్ర పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ జరిగే సమయంలో ట్రంప్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. వినండి.. మీరు ఏమి చేస్తున్నారో..అది 24 గంటల్లోపు ఆపండి’అని అన్నారు. అందుకు మోదీ ఆపరేషన్ సిందూర్ను ఐదుగంటల్లోనే ఆపేశారంటూ విమర్శలు గుప్పించారు. కాగా,బీహార్లో కాంగ్రెస్ తలపెట్టిన ఓటర్ అధికార్ యాత్ర కొనసాగుతోంది. బీహార్లో 1,300 కిలోమీటర్ల మేర సాగనుంది. 20కి పైగా జిల్లాలను కవర్ చేస్తూ సెప్టెంబర్ 1న పాట్నాలో ముగియనుంది. #WATCH | Muzaffarpur, Bihar | Addressing during the 'Voter Adhikar Yatra', Lok Sabha LoP Rahul Gandhi says, "Trump said today that when the war between India and Pakistan was going on, I picked up the phone and told Narendra Modi and told him to stop whatever he was doing within… pic.twitter.com/ap4ih0Ruqt— ANI (@ANI) August 27, 2025 -
ఫోన్ చేసి బెదిరించా.. మోదీ యుద్ధం ఆపేశారు: ట్రంప్
భారత్ ఎంత ఖండిస్తున్నా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు మారడం లేదు. భారత్-పాక్ ఘర్షణలను తానే ఆపానంటూ మరోసారి మీడియా ముఖంగా ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి తానే స్వయంగా ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపించినట్లు చెప్పారాయన. అమెరికా కాలమానం ప్రకారం.. మంగళవారం వైట్హౌస్లో కేబినెట్ సమావేశం జరిగింది. మీడియా బ్రీఫింగ్లో ఆయన ఈ కాల్పుల విరమణ ప్రకటన వెలువడిన రోజు జరిగిన పరిణామాలంటూ స్పందించారు. ‘‘ఆ రోజు ఓ కఠినమైన వ్యక్తి.. భారత ప్రధాని మోదీతో మాట్లాడాను. పాకిస్థాన్తో మీకు ఏం జరుగుతోందని ప్రశ్నించాను. ఆ తర్వాత పాక్తోనూ చర్చించా. అప్పటికే వారి మధ్య ఘర్షణలు తీవ్రస్థాయికి చేరాయి. ఇది సుదీర్ఘకాలం కొనసాగే ముప్పుఉందని భావించా. అణుయుద్ధానికి దారితీసే ప్రమాదం ఉండటంతో ఘర్షణలను ఆపాలని కోరా. లేదంటే భారత్, పాక్తో వాణిజ్యఒప్పందాలు చేసుకోబోమని హెచ్చరించా. నేను విధించే భారీ టారిఫ్లతో మీ కళ్లు బైర్లు కమ్ముతాయని చెప్పా. నేను మరుసటిరోజు దాకా సమయం ఇస్తే.. ఐదు గంటల్లోనే అంతా సద్దుమణిగింది’’ అని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు.US President #DonaldTrump once again doubles down on his claim of playing a catalyst in the truce between India and Pakistan.I am talking to a very terrific man, Prime Minister of India, Narendra Modi. I said, What's going on with you and Pakistan?, says Trump.For the latest… pic.twitter.com/8eQ86ZU0ql— NDTV Profit (@NDTVProfitIndia) August 27, 2025భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలను తానే ఆపానంటూ గత కొంతకాలంగా ట్రంప్ చెబుతూనే ఉన్నారు. ఈ ప్రకటనలో విపక్షాలు ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఈ వాదనను భారత్ ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్–పాకిస్థాన్ మధ్య మిలిటరీ స్థాయి చర్చల ద్వారానే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని భారత్ స్పష్టం చేసింది. అలాగే.. మోదీ–ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని విదేశాంగ మంత్రి జైశంకర్ స్వయంగా పార్లమెంట్లో ప్రకటించారు. ఇక..ఆ మధ్య జీ7 సదస్సు నిమిత్తం కెనడా వెళ్లిన ప్రధాని మోదీ దీనిపై స్పందిస్తూ.. భారత్-పాక్ (India-Pakistan) మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. ‘‘పహల్గాం, ఆపరేషన్ సిందూర్ పరిణామాల సమయంలో భారత్-అమెరికా మధ్య ఏ స్థాయిలోనూ వాణిజ్యఒప్పందం గురించి చర్చలు జరగలేదు. భారత్-పాకిస్థాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వానికి అంశం పైనా చర్చలు కూడా జరగలేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి భారత్-పాక్ మధ్య మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి. పాక్ అభ్యర్థన మేరకే ‘ఆపరేషన్ సిందూర్’ను నిలిపివేశాం. ఇప్పుడు, ఎప్పుడూ.. భారత్ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోం’’ అని నాడు అమెరికా అధ్యక్షుడికి మోదీ స్పష్టం చేశారు. అయినా కూడా ట్రంప్, అమెరికా అదే పాట పాడుతూ వస్తోంది.ఇదీ చదవండి: ట్రంప్ ఫోన్ కాల్స్కు మోదీ నో -
పుతిన్, మోదీలకు జిన్పింగ్ రెడ్ కార్పెట్
బీజింగ్: ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు చైనాలోని టియాంజిన్లో జరగనున్న షాంఘై సహకార సదస్సు(ఎస్సీవో) సందర్భంగా కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ శిఖరాగ్రానికి రావాలంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీలను రెడ్ కార్పెట్ పరిచి జిన్పింగ్ స్వయంగా ఆహా్వనం పలకనున్నారు. బ్రిక్స్ దేశాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ వాణిజ్య యుద్ధం తీవ్రరూపం దాల్చిన వేళ అమెరికా ఆధిపత్యానికి గండికొట్టడంతోపాటు, ప్రత్యామ్నాయం తామేనని చూపేందుకు జిన్పింగ్ ప్రయత్నం చేయనున్నారు. ఈ సదస్సుకు మధ్య, పశ్చిమ, దక్షిణ, ఆగ్నేయ ఆసియా దేశాల నేతలు పాల్గొననున్నారు. మరో వారంలో మొదలయ్యే కీలక సదస్సులో ఎస్సీవోలో మరికొన్ని దేశాలను చేర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని పరిశీలకులు అంటున్నారు. ‘అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ క్రమం ఎలా దారుణంగా ఉంటుందో చెప్పడంతోపాటు, జనవరి నుంచి చైనా, ఇరాన్, రష్యా, తాజాగా భారత్ను కట్టడి చేసేందుకు వైట్ హౌస్ చేసిన ప్రయత్నాలు అంతగా ప్రభావం చూపలేదని చూపడానికి ఈ శిఖరాగ్ర సమావేశాన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలని జిన్పింగ్ భావిస్తున్నారు’అని ది చైనా–గ్లోబల్ సౌత్ ప్రాజెక్ట్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎరిక్ ఒలాండర్ విశ్లేషించారని రాయిటర్స్ పేర్కొంది. అమెరికా విధానాలకు వ్యతిరేకంగా ఐక్య వేదికను చూపుకునేందుకు, బహుళ ధ్రువ క్రమం దిశగా ప్రపంచం సాగుతోందని తెలియజేయడమే చైనా లక్ష్యంగా కనిపిస్తోందని అంటున్నారు. అంతర్జాతీయంగా ఇటీవల చోటుచేసుకున్న దౌత్యపరమైన పరిణామాలు, బ్రిక్స్ దేశాల మధ్య బలోపేతమవుతున్న ఆర్థిక సంబంధాలను ప్రస్తావించిన ఒలాండర్..ఇవన్నీ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అనూహ్య చర్యల ఫలితమేనన్నారు. ఎస్సీవోలో ప్రస్తుతం 10 శాశ్వత సభ్య దేశాలు, మరో 16 దేశాలు పరిశీలక హోదాలో ఉన్నాయి. ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో సహకార దృక్పథానికి ఉన్న ప్రాముఖ్యాన్ని ఇవి తెలియజేస్తున్నాయని ఒలాండర్ పేర్కొన్నారు. సభ్య దేశాల సంఖ్య పెరిగినప్పటికీ దేశాల మధ్య సహకారం పరంగా చూస్తే బ్రిక్స్ మంచి ఫలితాలను రాబట్టలేకపోతోందని తక్షశిల ఇన్స్టిట్యూట్కు చెందిన మనోజ్ కేవల్రమణి రాయిటర్స్తో వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఎస్సీవో లక్ష్యం, ఆచరణాత్మక వైఖరి ఇప్పటికీ అస్పష్టంగానే ఉన్నాయని ఆయన తెలిపారు. మొత్తమ్మీద అమెరికా విధానాలకు వ్యతిరేకంగా ఉమ్మడి ప్రయోజనాలను సాధించుకోవడమనేదే ఎస్సీవో ప్రధాన లక్ష్యంగా ఉందని చెప్పారు. సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడమే ఈ వేదిక లక్ష్యం అయినప్పటికీ, చైనా–భారత్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను సడలించేందుకు ఇది ఉపయోగపడనుందని తెలిపారు. భారత్ మంకుపట్టును వీడి చైనాతో సామరస్యంగా వ్యవహరిస్తుందని ఒలాండర్ అంచనా వేశారు. తద్వారా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ శిఖరాగ్రం సందర్భంగా భారత్–చైనాలు సరిహద్దుల్లోని ఉద్రిక్త ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణతోపాటు వీసా నియంత్రణలు, వాణిజ్య సంబంధాల బలోపేతానికి సంబంధించిన కీలకమైన ప్రకటనలు చేయవచ్చని తెలిపారు. వాతావరణ మార్పుల వంటి అంశాల్లో రెండు దేశాల మధ్య సహకారం విస్తృతం కానుందన్నారు. భద్రతా పరమైన అంశాల్లో ఎస్సీవో సాధించే పురోగతి మాత్రం పరిమితంగానే ఉంటుందని కేవల్రమణి విశ్లేషించారు. 2001లో ఎస్సీవోను ప్రకటించాక జరుగుతున్న అతిపెద్ద శిఖరాగ్రం ఇదే. అంతర్జాతీయ వ్యవహారాల్లో పెరుగుతున్న ఈ కూటమి ప్రాధాన్యతను చెప్పకనే చెబుతుందని పరిశీలకులు అంటున్నారు. కొత్త ప్రపంచ క్రమతను చాటే ముఖ్యమైన వేదిక ఎస్సీవో శిఖరాగ్రమని చైనా విదేశాంగ శాఖ తాజాగా అభివర్ణించడం గమనార్హం. -
ట్రంప్ ఫోన్ కాల్స్కు మోదీ నో
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడేందుకు పదేపదే ప్రయత్నించారా? అందుకు మోదీ తిరస్కరించారా? ట్రంప్తో సంభాషణకు మోదీ ఇష్టపడలేదా? అంటే.. అవుననే చెబుతోంది జర్మనీ వార్తాపత్రిక ఫ్రాంక్ఫర్టర్ అల్జెమేని(ఎఫ్ఏజెడ్). భారత ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం ఏకంగా 50 శాతం టారిఫ్లు విధించిన సంగతి తెలిసిందే. దీనిపట్ల భారత నాయకత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో మోదీతో ఫోన్లో మాట్లాడడానికి ట్రంప్ కనీసం నాలుగుసార్లు ప్రయత్నించారని జర్మనీ పత్రిక పేర్కొంది. అమెరికా నుంచి నాలుగుసార్లు ఫోన్ చేసినా మోదీ స్పందించలేదని వెల్లడించింది. అమెరికా విజ్ఞప్తులను ఆయన గట్టిగా తిరస్కరించారని, ట్రంప్ విధించిన టారిఫ్ల పట్ల తన ఆగ్రహాన్ని పరోక్షంగా వ్యక్తీకరించారని స్పష్టంచేసింది. ఈ మేరకు జర్మనీ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని బెర్లిన్కు చెందిన గ్లోబల్ పబ్లిక్ పాలసీ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ థార్స్టెన్ బెన్నర్ తాజాగా ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ట్రంప్ శాపనార్థాలు భారత్–అమెరికా మధ్య గత 25 ఏళ్లుగా సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. కానీ, ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచి్చన తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేస్తుండడాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. భారత్ ఇస్తున్న సొమ్మును ఉక్రెయిన్లో యుద్ధానికి రష్యా ఖర్చు చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. అందుకే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ హెచ్చరికలను భారత ప్రభుత్వం లెక్కచేయకపోవడంతో ప్రతీకార చర్యల కింద 50 శాతం టారిఫ్లు విధించారు. భారత్–రష్యా సంబంధాల గురించి తాను పట్టించుకోనని, ఆ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు మృతప్రాయంగా మారుతాయంటూ ట్రంప్ శాపనార్థాలు సైతం పెట్టారు. అయితే, ట్రంప్కు ప్రధాని మోదీ గట్టిగా బదులిచ్చారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం తథ్యమని తేలి్చచెప్పారు. టారిఫ్లకు బెదిరిపోయే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. రెచ్చగొట్టేలా ట్రంప్ చర్యలు! మరోవైపు భారత్–పాకిస్తాన్ ఘర్షణను తానే ఆపేశానని ట్రంప్ తరచుగా చెప్పుకుంటున్నారు. తాను చొరవ తీసుకోకపోతే రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగేదని ఆయన బహిరంగంగా పేర్కొన్నారు. భారత్పై ఒత్తిడి తెచ్చి పాకిస్తాన్పై దాడులకు తెరదించేలా చేశానని ట్రంప్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ హఠాత్తుగా ఆగిపోవడం తన ఘనతేనని స్పష్టంచేశారు. అయితే, ట్రంప్ వ్యాఖ్యలను భారత్ పలుమార్లు ఖండించింది. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గడం లేదు. భారత్–పాక్ యుద్ధాన్ని ఆపేసినందుకు నోబెల్ శాంతి బహుమతికి అర్హుడినని అంటున్నారు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ను ట్రంప్ ముద్దు చేస్తున్నారు. వైట్హౌస్కు అధికారికంగా ఆహా్వనించి, ఘనంగా విందు ఇచ్చారు. పాకిస్తాన్కు ఆర్థికంగా మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ భారత ప్రభుత్వానికి రుచించడం లేదు. ట్రంప్ చర్యలు తమను రెచ్చగొట్టేలా ఉన్నాయని భావిస్తోంది. అందుకు ట్రంప్తో మాటాడ్డానికి ప్రధాని మోదీ ఇష్టపడలేదని తెలుస్తోంది. మరోవైపు ఇటీవలి కాలంలో చైనాతో సంబంధాలకు మోదీ ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. ఆయన ఈ నెలాఖరులో చైనాలో పర్యటించబోతున్నారు -
హన్సల్ పూర్ లో స్వదేశీ ఈవీ ఫెసిలిటీని ప్రారంభించిన మోదీ
-
భారత్లో రూ.70 వేలకోట్ల పెట్టుబడి!.. సుజుకి మోటార్ ప్రెసిడెంట్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. గుజరాత్లోని హన్సల్పూర్ తయారీ కర్మాగారాన్ని ప్రారంభించడంతో మారుతి సుజుకి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, జపాన్ రాయబారి కీచి ఒనో, సుజుకి మోటార్ అధ్యక్షుడు తోషిహిరో సుజుకి.. కంపెనీకి చెందిన ఇతర కార్యనిర్వాహకులు పాల్గొన్నారు.మారుతి సుజుకి ఈ-విటారా ఉత్పత్తి ప్రారంభం తర్వాత.. సుజుకి మోటార్ కార్పొరేషన్ అధ్యక్షుడు తోషిహిరో మాట్లాడుతూ.. జపాన్ తయారీదారు రాబోయే ఐదు నుంచి ఆరు సంవత్సరాలలో భారతదేశంలో రూ. 70 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. నాలుగు దశాబ్దాలుగా.. భారతదేశంలో కార్యకలాపాలను కొనసాగిస్తున్నాము. భారతదేశంతో మేము భాగస్వాములు కావడం గర్వకారణంగా ఉందని అన్నారు. భారతదేశం దార్శినికతకు మద్దతు ఇవ్వడానికి.. వికసిత్ భారత్కు దోహదపడటానికి మేము కట్టుబడి ఉన్నామని తోషిహిరో సుజుకి అన్నారు.సుజుకి మోటార్ కార్పొరేషన్ అధ్యక్షుడు తన ప్రసంగంలో.. కొత్తగా ప్రారంభించిన గుజరాత్ ప్లాంట్ ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ కేంద్రాలలో ఒకటిగా మారుతుందని, భారతదేశంలోని వినియోగదారులకు సేవలందిస్తుందని అన్నారు. ఈ ప్లాంట్ 1 మిలియన్ యూనిట్ల సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: భారత్ నుంచి 100 దేశాలకు!.. ఈ-విటారా ప్రారంభించిన మోదీఈ ప్లాంట్లో ఉత్పత్తి చేసిన మొదటి వాహనం మారుతి సుజుకి ఇ-విటారా, ఇది బ్రాండ్ మొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం కూడా. ఈ ఎలక్ట్రిక్ కారును జపాన్.. యూరప్తో సహా 100కు పైగా దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా మొట్టమొదటి లిథియం-అయాన్ బ్యాటరీ.. ఎలక్ట్రోడ్ స్థాయి స్థానికీకరణతో కూడిన సెల్ ఉత్పత్తి ప్రారంభాన్ని కూడా తోషిహిరో సుజుకి ప్రస్తావించారు. -
5 ఏళ్లు.. 70,000 కోట్లు
హన్సల్పూర్, గుజరాత్: ఆటో రంగ జపనీస్ దిగ్గజం సుజుకీ మోటార్ కార్పొరేషన్ భారత్లో రానున్న 5–6ఏళ్లలో రూ. 70,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. తద్వారా దేశీయంగా కార్యకలాపాలను మరింత పటిష్ట పరచుకోనున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్ తొషిహిరో సుజుకీ పేర్కొన్నారు. దేశీ అనుబంధ సంస్థ మారుతీ సుజుకీ తొలిసారిగా రూపొందించిన ఎలక్ట్రిక్ కారు ఈ–విటారా ఎగుమతులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అంతేకాకుండా హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహన తయారీలో వినియోగించే లిథియం అయాన్ బ్యాటరీ సెల్స్ ఉత్పత్తికి సైతం ప్రధాని తెరతీశారు. రానున్న 5–6 ఏళ్లలో దేశీయంగా రూ. 70,000 కోట్ల పెట్టుబడులను చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొషిహిరో వెల్లడించారు. భారత్ మొబిలిటీ ప్రయాణంలో నాలుగు దశాబ్దాలుగా భాగస్వామి అయినందుకు గర్వపడుతున్నట్లు చెప్పారు. గ్రీన్ మొబిలిటీ, వికసిత భారత్ లక్ష్యాల సాధనలో మద్దతివ్వడానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. వార్షికంగా 40 లక్షల యూనిట్ల తయారీ లక్ష్యాన్ని అందుకునేందుకు తాజా పెట్టుబడులను వినియోగించనున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. ఇందుకు మద్దతుగా మౌలికసదుపాయాలు, ఆర్అండ్డీ, కొత్త టెక్నాలజీలపై పెట్టుబడులను వెచ్చించనున్నట్లు వివరించారు. ఇదీ చదవండి: సుంకాల ప్రభావం.. ఎదురయ్యే సవాళ్లు: ఆర్బీఐ గవర్నర్జీఎస్టీ సమావేశం తర్వాత.. వచ్చే నెలలో నిర్వహించనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తదుపరి గుజరాత్లో రెండో ప్లాంటు ఏర్పాటుపై స్పష్టత రాగలదని భార్గవ పేర్కొన్నారు. రూ. 35,000 కోట్ల పెట్టుబడితో రెండో ప్లాంటును నెలకొల్పనున్నట్లు గతేడాది ప్రకటించిన నేపథ్యంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబుగా భార్గవ జీఎస్టీ నిర్ణయాల కోసం వేచిచూస్తున్నట్లు తెలియజేశారు. ఎగుమతులకు ఉద్ధేశించిన ఈ–విటారా కార్లను 100 దేశాలకు సరఫరా చేయనున్నట్లు భార్గవ వెల్లడించారు. అయితే దేశీయంగా ఎప్పుడు విడుదల చేసేదీ వెల్లడించలేదు. బ్యాటరీలను దిగుమతి చేసుకుంటుండటంతో కార్ల తయారీ ధర అధికంగా ఉందన్నారు. కాగా.. సుజుకీ గ్రూప్ ఇప్పటికే భారత్లో రూ. లక్ష కోట్లను ఇన్వెస్ట్ చేసినట్లు మారుతీ సుజుకీ పేర్కొంది. వీటి ద్వారా ప్రత్యక్షంగా 11 లక్షలకుపైగా ఉద్యోగాల కల్పన జరిగినట్లు తెలియజేసింది.#WATCH | Gujarat: Prime Minister Narendra Modi flags off the 'e-VITARA', Suzuki’s first global strategic Battery Electric Vehicle (BEV), at the Suzuki Motor plant in Hansalpur, Ahmedabad. (Source: DD News) pic.twitter.com/CLKE9nvnKG— ANI (@ANI) August 26, 2025 -
టారిఫ్ల మోత వేళ.. కీలక భేటీ
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై దండయాత్రకు దిగిన రష్యాను ఏమాత్రం నిలువరించట్లేదని ఆరోపిస్తూ భారత్పై పన్నుల మోత మోగించిన ట్రంప్ సర్కార్ విధించిన ఆగస్ట్ 27 గడువు ముగుస్తుండటంతో ప్రధానమంత్రి కార్యాలయం నేడు కీలక సమీక్ష సమావేశం నిర్వహించనుంది. ప్రధానమంత్రి ప్రధానకార్యదర్శి సారథ్యంలో ఈ సమీక్ష సమావేశం జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. భారత్పై అమెరికా ప్రభుత్వం తాజాగా విధించిన 50 శాతం దిగుమతి టారిఫ్ ఆగస్ట్ 27వ తేదీ నుంచి అమల్లోకిరానుంది. ఈ నేపథ్యంలో ఆయా ఎగుమతి సంస్థల లాభాల్లో కోత పడడం, ఆక్వారంగం, లెదర్, వజ్రాభరణాల ఉత్పత్తుల ఎగుమతిపై టారిఫ్ ప్రతికూల ప్రభావం వంటి కీలక అంశాలపై ఆయా రంగాల ప్రతినిధులు, సంస్థలతో ప్రధాని కార్యాలయం సమాలోచనలు జరపనుందని తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాకు తమ ఉత్పత్తులను ఎగుమతిచేసే సంస్థలతో, ఎగుమతి రంగ నిపుణులతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సంప్రదింపులు మొదలెట్టింది. అమల్లోకి వచ్చిన 25 శాతం టారిఫ్ కారణంగా తమ లాభాలు పూర్తిగా తగ్గిపోయాయని, నష్టభయాలను ఎదుర్కొంటున్నామని పలువురు కేంద్ర మంత్రిత్వశాఖ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నట్లు తెలుస్తోంది. 50 శాతం టారిఫ్ అమల్లోకి రావడంతో తక్షణం ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనే వర్గాలను ఆదుకోవాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం. ఎగుమతిదారులు మాత్రం అత్యయిక రుణపరపతి పథకం ద్వారా మూలధనాన్ని అందించాలని, తద్వారా తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపినట్లు తెలుస్తోంది. అయితే రంగాలవారీగా ఆదుకుంటేనే దీర్ఘకాలిక ప్రయోజనాలు దక్కుతాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. -
Trump Tariffs: కేంద్రం కీలక భేటీ
-
భారత్కు అమెరికా టారిఫ్ నోటీసులు
వాషింగ్టన్: భారత్పై అదనంగా మరో 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా నోటీసు జారీ చేసింది. భారత్ నుండి వచ్చే దిగుమతులపై ఈ అదనపు భారం వర్తిస్తుందని అమెరికా అధికారికంగా బహిరంగ నోటీసు విడుదల చేసింది. ఈ కొత్త సుంకాలు ఆగస్టు 27న అర్ధరాత్రి 12:01 నుండి అమల్లోకి వస్తాయని తెలియజేసింది.అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ)ద్వారా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుపై ఆగస్టు 6న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. రష్యన్ ఫెడరేషన్ ప్రభుత్వం అమెరికా విషయంలో చేస్తున్న బెదిరింపులకు ప్రతిస్పందించాలని యూఎస్ ఏజెన్సీలను ఈ ఉత్తర్వులో ఆదేశించారు. దీనిలో భాగంగా భారతదేశంపై కొత్త సుంకాల విధింపును కూడా పేర్కొన్నారు.ఈ నోటీసులో పేర్కొన్న పలు భారతీయ ఉత్పత్తులకు ఈ సుంకాలు వర్తిస్తాయని అమెరికా పేర్కొంది. గడువు ముగిసిన తర్వాత వచ్చే లేదా గిడ్డంగులనుండి బయటకు తీసుకెళ్లే ఏ వస్తువులకైనా ఈ సుంకాలు వర్తిస్తాయని కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ ఒప్పందం కుదరని పక్షంలో రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై కూడా అదనపు సుంకాలు విధిస్తామని లేదా మాస్కోపై అదనపు ఆంక్షలు విధించనున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నోటీసు ద్వారా సంకేతాలిచ్చారు. ఈ విషయంలో పురోగతి సాధించలేని పక్షంలో రాబోయే వారాల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.ఇప్పటివరకు యూఎస్.. చైనాతో సహా రష్యన్ చమురు కొనుగోలుదారులపై ఇలాంటి చర్యలను చేప్టటలేదు. ఈ ఏడాది ఆగస్టులో ట్రంప్ భారత్పై అదనంగా 25 శాతం సుంకాలను విధించారు. భారతదేశం నుండి వచ్చే ఉత్పత్తులపై మొత్తం సుంకాన్ని 50 శాతానికి పెంచారు. న్యూఢిల్లీ.. రష్యా చమురు కొనుగోలును కొనసాగించినందుకు జరిమానాగా అమెరికా ఈ చర్య చేపట్టింది. అయితే భారత్ వీటిని ద్వితీయ సుంకాలని పేర్కొంటూ, వీటిని అన్యాయం, అసమంజసం అని పేర్కొంది. అదే సమయంలో చర్చలలో పురోగతి చోటుచేసుకుంటే పెరిగిన సుంకాల అవసరం కూడా ఉండదని ఆశాభావం వ్యక్తం చేస్తూ వచ్చింది.కాగా అహ్మదాబాద్లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధాని మోదీ అమెరికా సంకాలపై స్పందిస్తూ.. వాషింగ్టన్ విధించే ఆర్థిక ఒత్తిడిని లెక్క చేయమని, ఇందుకు ప్రతిగా తమ ప్రభుత్వం ఒక మార్గాన్ని కనుగొంటుందని పేర్కొన్నారు. ఎంత ఒత్తిడి వచ్చినా, దానిని తట్టుకునే శక్తిని పెంచుకుంటూనే ఉంటామని, నేడు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఎంతో శక్తిని పొందుతోందని, దీని వెనుక రెండు దశాబ్దాల కృషి ఉందన్నారు. -
భరిస్తాం.. స్వప్రయోజనాలను పణంగా పెట్టం: ప్రధాని మోదీ
అహ్మదాబాద్: అధిక పన్నుల భారం మోపినా భరిస్తాంగానీ దేశ స్వప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రధాని మోదీ తెగేసి చెప్పారు. భారతీయ ఉత్పత్తులపై ఆగస్ట్ 27వ తేదీ నుంచి అమెరికా మోపిన 50 శాతం దిగుమతి టారిఫ్ భారంగా మారనున్న నేపథ్యంలో ప్రధాని స్పందించారు. సోమవారం సొంతరాష్ట్రంలో పర్యటన ఆరంభించిన ప్రధాని మోదీ రూ.5,477 కోట్ల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. తొలుత రెండు కిలోమీటర్ల మేర రోడ్షో నిర్వహించారు. తర్వాత అహ్మదాబాద్లోని నికోల్ ప్రాంతంలో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగించారు. ‘‘ రైతులు, పశుపోషకులు, చిన్నతరహా పరిశ్రమల ప్రయోజ నాలే భారత్కు ముఖ్యం. అదనపు టారిఫ్ల పేరిట మాపై పెనుభారం మోపినా భరిస్తాం. అంతేగానీ స్వప్రయోజనాలను పణంగా పెట్టబోం’’ అని అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ భారత్పై విదేశీ ప్రభావాన్ని మోదీ ప్రధా నంగా గుర్తు చేశారు. ‘‘ ప్ర పంచ దేశాల్లో నేడు రాజకీ యాలు పూర్తిగా ఆర్థిక ప్రయోజనాల చుట్టూతా తిరుగుతున్నాయి. అయినా సరే నేను మహాత్మా గాంధీజీ చూపిన స్వదేశీ వస్తువు లకు పట్టం కట్టాలనే బాటలోనే పయనిస్తున్నా. అందుకే చిన్నపరిశ్రమలు, కర్షకులు, పశుపోష కులకు నేనొక్కటే చెప్పదల్చు కున్నా. మీ ప్రయోజ నాలే నాకు సర్వోన్నతం. మీ ప్రయోజనాల విష యంలో మా ప్రభుత్వం ఏమాత్రం పట్టు సడలించదు. మాపై ఎంతటి ఒత్తిడి పడినా సరే మేం భరిస్తాం. మీ ప్రయో జనాలకు భంగం కల్గకుండా చూసుకుంటాం’’ అని మోదీ అన్నారు. చక్రధారి, చరఖాధారి బాటలో..‘‘దుష్టశిక్షణ, శిష్టరక్షణ, శక్తిసామర్థ్యాలకు, పరి రక్షణకు మారుపేరైన సుదర్శన చక్రధారి అయిన మోహన్ కృష్ణ భగవానుడు, ఛరఖాధారి అయిన మోహన్ మహాత్మా గాంధీ చూపిన అడుగుజాడల్లో భారత్ పయనిస్తోంది. నూలు వడికే రాట్నం చక్రంతో గాంధీజీ స్వాతంత్రోద్యమాన్ని ఉరకలెత్తించారు. పహల్గాంలో ఉగ్ర ముష్కరుల పాశవిక దాడికి దీటుగా బదులిస్తూ భారత సైనికుల తెగువ, ధైర్య సాహసాలకు దర్పణమే ఆపరేషన్ సిందూర్’’ అని మోదీ అన్నారు.కాంగ్రెస్పై విమర్శల జడి‘‘60 నుంచి 65 ఏళ్లపాటు భారత్ను పాలించిన కాంగ్రెస్ కూడా ‘దిగుమతి స్కామ్’లకు పాల్పడి భారత్ను పరాయి దేశాలపై సరుకుల కోసం ఆధారపడేలా మార్చేసింది. పరాధీనంగా మార్చేసి బాపూజీ కీలక ఉపదేశమైన స్వదేశీ మంత్రాన్ని కాంగ్రెస్ మంటగల్పింది. గాంధీజీ పేరు చెప్పుకుని తిరిగే కాంగ్రెస్ పెద్దలు ఆయన సూచించిన స్వచ్ఛత, స్వదేశీ పదాలను గాలికొదిలేశారు’’ అని మోదీ విమర్శించారు. -
ఇది పరిశ్రమకు కొత్త విజయగాథ: నరేంద్ర మోదీ
ఇండియన్ ఆటోమొబైల్ రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. వాహన ఉత్పత్తిలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న భారత్ మరింత ముందుకు దూసుకెళ్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెబుతూనే ఉన్నాయి. ఇప్పుడు భారతదేశం 100 దేశాలకు ఎలక్ట్రిక్ వాహనాలను ఎగుమతి చేయడానికి సన్నాహాలు చేస్తోందని, దీనిని పరిశ్రమకు "కొత్త విజయగాథ" అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు.భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతి అంశంపై.. ప్రభుత్వం మొదటిసారిగా ఒక సంఖ్యను నిర్ణయించింది. దేశీయ వాహన తయారీదారులు తమ ప్రపంచ వ్యూహాలను వేగవంతం చేస్తున్న సమయంలో ఈ ప్రకటన వెలువడింది. దేశ ఆర్ధిక వ్యవస్థకు.. ఆటోమొబైల్ రంగం కీలకంగా ఉంది. దీనిని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.దశాబ్ద కాలంలో.. భారతదేశ ఆటో ఎగుమతులు బాగా పెరిగాయి. 2014లో దీని విలువ రూ. 50,000 కోట్లు ఉండగా.. నేడు ఇది రూ. 1.2 లక్షల కోట్లకు చేరిందని మోదీ స్పష్టం చేశారు. భారతదేశం నుంచి కార్లు, బైకులు మాత్రమే కాకుండా.. మెట్రో కోచ్లు, ట్రైన్ కోచ్లు, లోకోమోటివ్ల రవాణాను పెంచాలని అన్నారు.ఇదీ చదవండి: టెక్ దిగ్గజం అతిపెద్ద డీల్.. నెలకు రూ.5.4 కోట్ల రెంట్!భారతదేశం ఎదగాలంటే.. అనుకున్నది సాధించాలంటే, దిగుమతులపై ఎక్కువ ఆధారపడకూడదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. విదేశాలలో లభించే పరిజ్ఞానం బాగానే ఉండవచ్చు, కానీ దేశ దీర్ఘకాలిక స్థితిని నిర్ణయించేది మాత్రం స్వదేశీ ఆవిష్కరణలేనని అన్నారు. సొంత పరిజ్ఞానం అలవాటు చేసుకోవాలని మోదీ సూచించారు. -
పీఎం మోదీ డిగ్రీ వివరాలు బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు: ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ వివాదం అంశానికి సంబంధించి తనిఖీకి అనుమతిస్తూ కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. ప్రధాని మోదీ విద్యకు సంబంధించిన రికార్డులను బహిరంగ పర్చాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలపై గత కొన్ని సంవత్సరాలుగా వివాదం కొనసాగుతోంది. 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి నరేంద్ర మోదీ.. బీఏ డిగ్రీ పూర్తి చేశారని చెబుతున్న నేపథ్యంలో, ఆ డిగ్రీ వివరాలను బహిర్గతం చేయాలన్న డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే 2016లో కేంద్ర సమాచార కమిషన్.. మోదీ డిగ్రీ రికార్డులను తనిఖీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది ఢిల్లీ యూనివర్సిటీ. ఈరోజు(సోమవారం, ఆగస్టు 25వ తేదీ) సీఐసీ ఆదేశాలను కొట్టేసింది. వ్యక్తిగత గోప్యత హక్కు అనేది తెలుసుకునే హక్కు కంటే మిన్న అని ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. యూనివర్సిటీ విద్యార్థుల రికార్డులు,.. ఆర్టీఐ చట్టం కింద బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని తేల్చింది.మోదీ డిగ్రీ వివరాలను కోర్టుకు అందించేందుకు యూనివర్సిటీ సిద్ధంగా ఉన్నా, అవి అపరిచితులతో పంచుకోవడం గోప్యత ఉల్లంఘన అవుతుందని ఢిల్లీ యూనివర్శిటీ తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయపడ్డారు. దీంతో ఏకీభవించిన హైకోర్టు.. సీఐసీ ఆదేశాలను నిలిపివేస్తూ తీర్పునిచ్చింది. తాజా హైకోర్టు తీర్పుతో ఇప్పటి వరకూ మోదీ డీగ్రీ వివాదంపై జరుగుతున్న రాజకీయ వివాదానికి దాదాపు ముగింపు దొరికినట్లే కనబడుతోంది. -
ధన్ఖడ్ రాజీనామాపై అమిత్ షా స్పందన.. రాజ్యాంగ సవరణపై ఇలా..
ఢిల్లీ: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా అంశం, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా పలు అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత అనారోగ్య సమస్యల కారణంగానే ధన్ఖడ్ రాజీనామా చేశారని చెప్పుకొచ్చారు. అలాగే, రాజ్యాంగ సవరణ బిల్లును ఉద్దేశించి.. ప్రధానమంత్రి అయినా జైలు నుంచే పరిపాలన చేయడం మంచి విషయమేనా? అని ప్రశ్నించారు.ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘ఏఎన్ఐ’కి అమిత్ షా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజ్యాంగ పదవిలో కొనసాగారు. ఆయన పదవీకాలంలో ఎన్నో మంచి పనులు చేశారు. వ్యక్తిగత అనారోగ్య సమస్యల కారణంగా ఇప్పుడు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని మరీ ఎక్కువగా లాగొద్దు. కేవలం ప్రతిపక్షాల ఆరోపణల ఆధారంగా దీనిపై ఓ అంచనాకు రావడం సరికాదు’ అంటూ క్లారిటీ ఇచ్చారు. అనంతరం, ఉపరాష్ట్రపతి ఎన్నికపై మాట్లాడుతూ.. రాష్ట్రపతిని తూర్పు భారతం నుంచి ఎన్నుకున్నాం. ఇప్పుడు ఉపరాష్ట్రపతి దక్షిణాది నుంచి ఉండాలని అనుకున్నాం. దీనికి, తమిళనాడు ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు అని అన్నారు.#WATCH | On opposition raising questions about the resignation of former VP Jagdeep Dhankhar, Union HM Amit Shah says, "...'Baat ka batangad nahi banana chahiye' (don't make a fuss about it). Dhankhar ji was on a constitutional post and during his tenure, he did good work… pic.twitter.com/jJGRMogynf— ANI (@ANI) August 25, 2025ఇదే సమయంలో 130వ రాజ్యాంగ సవరణపై మాట్లాడుతూ.. ప్రధానమంత్రి అయినా జైలు నుంచే పరిపాలన చేయడం మంచి విషయమేనా?. మన ప్రజాస్వామ్యానికి అది మర్యాదపూర్వకంగా ఉంటుందా? అంటూ విపక్షాలపై మండిపడ్డారు. జైలు నుంచే ప్రభుత్వాలను నడిపే పరిస్థితి మన దేశంలో రాకూడదు. ప్రధాని గానీ, ముఖ్యమంత్రి లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ఏ నేత అయినా సరే.. ఏదైనా కేసులో అరెస్టయితే 30 రోజుల్లో బెయిల్ పొందాలి. లేదంటే తమ తమ పదవులకు రాజీనామా చేయాలి. అలా చేయకపోతే.. చట్టమే వారిని తప్పించేలా 130వ రాజ్యాంగ సవరణను తీసుకొస్తున్నాం. చట్టమేదైనా ప్రభుత్వం, ప్రతిపక్షానికి ఒకేలా అమలవుతుంది. ఈ నిబంధన ప్రధాని పదవికి కూడా వర్తించేలా స్వయంగా మోదీనే దీన్ని సవరణలో చేర్చారు. ఆయనకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రధాని జైలుకెళ్తే ఆయనైనా రాజీనామా చేయాల్సిందే. ఎన్నికైన ప్రభుత్వం రాజ్యాంగ సవరణను తీసుకొస్తే దానిపై అభ్యంతరాలు లేవనెత్తే హక్కు అందరికీ ఉంటుంది. అంతేగానీ, పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కూడా అవకాశం లేకుండా ఆందోళనలు చేస్తే ఎలా?. బిల్లు కచ్చితంగా పార్లమెంట్లో ఆమోదం పొందుతుంది అని వ్యాఖ్యలు చేశారు. -
బీజేపీ, ఈసీ మిలాఖత్
అరారియా: మోదీ సర్కారు, కేంద్రం ఎన్నికల సంఘం కుమ్మక్కయ్యాయని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ముసుగులో బిహార్లో ఓట్ల దోపిడీకి పాల్పడుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. బిహార్లో ఓట్ల చోరీని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ‘ఓటర్ అధికార్ యాత్ర’లో భాగంగా అరారియా జిల్లాలో ఆదివారం బహిరంగ సభలో, అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘నా యాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఓటు చోర్, గద్దీ ఛోడ్ (ఓట్ల దొంగా, దిగిపో) అంటూ ఆరేళ్ల బాలుడు సైతం నినదిస్తున్నాడు’’ అన్నారు. ‘‘బిహార్లో ఎస్ఐఆర్ ముసుగులో ఏకంగా 65 లక్షల మంది ఓటర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగించారు. దీనిపై బీజేపీ నోరువిప్పడం లేదు. బీజేపీ, ఈసీ కుమ్మక్కుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఈసీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నానంటూ నాపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. ఎస్ఐఆర్ను బిహార్ ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు’’ అని చెప్పారు. ‘ఇండియా’దే గెలుపు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు విపక్ష ‘ఇండియా’ కూటమిదేనని రాహుల్ ధీమా వెలిబుచ్చారు. ‘‘కూటమి పార్టీలన్నీ కలిసికట్టుగా పని చేస్తున్నాయి. పరస్పరం గౌరవించుకుంటున్నాయి. మేం కలిసి పోటీ చేస్తాం. గెలుస్తాం. దీనిపై మా మేనిఫెస్టో కమిటీ కార్యాచరణ ప్రారంభించింది. రైతు సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం’’ అని వెల్లడించారు. -
నిలుపుకోవాల్సిన బంధం
ఇండియాకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నోరుపారేసు కోవడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ఆయన అక్కసు వెనుక ప్రతిసారీ ఒక భూ స్వామ్య పెత్తందారీ విధానం కనిపిస్తుంది. సుంకాలు, జరిమానాలను రక్షణ కవచంగా ధరించి ఆయన విమర్శలకు, బెదిరింపులకు దిగుతూంటారు. అమెరికా అధ్యక్షుడి వదరుబోతుదనంలో ఒక సామ్రాజ్య వాదిలో ఉండే దురహంకారం ప్రతిబింబిస్తూ ఉంటుంది.రష్యా చమురును ఒక బూచిగా చూపిస్తున్నారంతే. అలనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ ధోరణి ఇప్పుడు అమెరికా వ్యవహార శైలిలో కనిపిస్తోంది. వ్యవసాయం, పాడి, మత్స్య పరిశ్రమ పట్ల భారత దేశం అనుసరిస్తున్నట్లు చెబుతున్న సంరక్షణ విధానంపై నిజంగానే అమెరికా విభేదిస్తోందని మనకు ఎక్కడైనా మనసు పొరల్లో చిన్న సందేహం మిగిలి ఉంటే, ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఉపయోగించిన భాషతో అది కాస్తా పటాపంచలైపోతుంది. ‘మహారాజా సుంకాలు’ అనే పద బంధాన్ని గమనిస్తే, భారత దేశాన్ని ప్రాచ్యవాద, పురాతన జాతివాద కళ్ళద్దాలతోనే నవారో చూస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఈసారి ఆయన ‘పాములు ఆడించే వాళ్ళ’ ఉపమానాన్ని ఉపయోగిస్తారేమో! ఏదో ఒక పక్షం వైపు రావలసిందిగా భారతదేశాన్ని నేరుగానే హెచ్చరించారాయన. కొత్తగా ఉపయోగించిన మాటలతో భారతీయుల మనసును నవారో మరింత గాయపరచారు. క్రెమ్లిన్కి ‘లాండ్రోమాట్’గా ఆయన భారతదేశాన్ని అభివర్ణించారు. నిజానికి, అప్ప టికి కొద్ది రోజుల క్రితమే అలాస్కాలో వ్లాదిమీర్ పుతిన్కి ట్రంప్ అక్షరాలా ఎర్ర తివాచీ పరచి స్వాగతం పలికిన సంగతిని ఆయన సమయానుకూలంగా మరచినట్లుంది. అమెరికా ఆత్మవంచనమనం రష్యా ముడి చమురు కొని, శుద్ధి చేసిన తర్వాత, ఆ చమురును యూరప్ దేశాలు కూడా కొనుగోలు చేశాయి. అలా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం ద్వారా మనం ‘లాభాలు గడిస్తున్నా’మని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ ఆరోపించారు. కానీ, ఉక్రెయిన్ యుద్ధం వల్ల నిజంగా లబ్ధి పొందు తున్నది వారే! ఐరోపా దేశాలు అమెరికా నుంచి ఆయుధాలు కొని ఉక్రెయిన్కు లాభాలకు అమ్ముతున్నాయి. అందుకే అవి విక్రయిస్తున్న అన్ని ఆయుధాలపైనా (అదనపు వ్యయాలు, లాభం కింద) ట్రంప్ ప్రభుత్వం 10% మొత్తాన్ని తీసుకుంటోందని బిసెంట్ మరో ఇంటర్వ్యూలో స్వయంగా అంగీకరించారు. ఇండియా మాత్రం రష్యా చమురు కొనడం తమ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని చెబుతూంటే... అదే వ్యక్తులు, పుతిన్ యుద్ధాన్ని మనం బలో పేతం చేస్తున్నట్లుగా నిందిస్తున్నారు. ఇక్కడ అమెరికా ఆత్మ వంచన కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కపటత్వానికీ స్థిరమైన వాదన అవసరం.ఎవరో ఒక అధ్యక్షుడి చపలచిత్త ధోరణిని పట్టించుకోనక్కర లేదని, భారత–అమెరికా స్నేహ సంబంధాలు సుదీర్ఘమైనవి, గాఢ మైనవని వాదించేవారితో నేనూ ఏకీభవిస్తాను. కానీ, ట్రంప్కు అర్థ మయ్యే భాషలోనే ఆయనకు వ్యతిరేకంగా స్వల్పకాలిక చర్యనైనా తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా నేను అర్థం చేసుకోగలను. అలా గని వాషింగ్టన్ ఇవ్వనిది చైనా మనకేదో దోచిపెడుతుందని కూడా నేను అనుకోవడం లేదు. చైనాను నమ్మవచ్చా?ట్రంప్ది దూకుడు తత్త్వం. చైనా సైనికంగా మనకి ప్రత్యర్థి. ట్రంప్వి అవాకులో చవాకులో బహిరంగంగానే ఉంటాయి. జిన్పింగ్వి పారదర్శకం కాని తెరవెనుక చర్యలు. పాకిస్తాన్ పట్ల ట్రంప్ మెతక వైఖరిని అర్థం చేసుకోవచ్చు. దాని పొగడ్తలకు ఆయన ఉబ్బి పోయాడు, లేదా అది ఇవ్వజూపిన ప్రయోజనాలకు ప్రలోభపడ్డాడు అనుకుందాం. కానీ, ఇటీవలి ‘ఆపరేషన్ సిందూర్’లో కూడా పాకి స్తాన్తో చైనా చెట్టపట్టాలేసుకుని తిరిగింది.కనుక, ట్రంప్ను, ప్రస్తుత లోటుపాట్లను పక్కనపెట్టి అమెరికా – భారత్ స్నేహ సంబంధాన్ని కాపాడుకోవాలని కోరుకోవడంలో ఔచిత్యం ఉంది. ఇప్పటి అమెరికా స్పందన ఒకటే పాఠం నేర్పుతోంది. అది: ప్రపంచంలో ఓ మూలనున్న ప్రాంతంపై లేదా ఒకే దేశంపై ఆశలన్నీ పెట్టుకోవద్దు. అది ప్రమాదకరం.మనవాళ్లు ఏం చేస్తున్నట్టు?ట్రంప్ను భారత్ ఎందుకు దారికి తెచ్చుకోలేకపోయింది అనే దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆపరేషన్ సిందూర్ ఆగి పోవడంలో ట్రంప్ స్వోత్కర్షను సమర్థించనందుకా? ఆయన ‘ఇగో’ దెబ్బతిందా? ట్రంప్ మాజీ అంగరక్షకుడు ఒకరిని పాకిస్తాన్ తన లాబీయిస్టులలో ఒకడిగా చేర్చుకుందని చెబుతున్నారు. మనం అలా కాకుండా, లాంఛన పూర్వకంగా, సంయమనంతో దౌత్యం నెరప డమా? కానీ, నాకొకటే సందేహం. అమెరికాలో ఉంటున్న భారత సంతతికి చెందిన గొప్ప వ్యక్తులు ఏమైపోయినట్లు? యాభై లక్షల మంది ఇండియన్–అమెరికన్ సమూహాన్ని ఒక చక్కని వలస వర్గానికి నమూనాగా తరచూ అభినందిస్తూ ఉంటారు. ఆ వర్గం నాయకులు పెద్ద టెక్, ఫినాన్షియల్ సంస్థలను నడుపు తున్నారు. విద్యా, విధాన నిర్ణాయక సంస్థల్లో కీలక పదవుల్లో ఉన్నారు. ఇండియా పట్ల అమెరికా వ్యవహరిస్తున్న తీరు చూసి వారికి ఒళ్ళు మండటం లేదా? స్వీయ నిర్ణయాలు తీసుకోవడం భారతదేశానికున్న సార్వభౌమాధికారమనే సంగతిని ట్రంప్ ప్రభుత్వం అర్థం చేసుకోలేకపోతే, ఆయన శ్వేత సౌధం నుంచి నిష్క్ర మించే నాటికి కాపాడుకోవాల్సినవి పెద్దగా ఏమీ మిగలవు.బర్ఖా దత్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ట్రంప్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోండి.. భారత్కు నిక్కీ హేలీ సూచన
వాషింగ్టన్: అమెరికా, భారత్ మధ్య ప్రస్తుత పరిస్థితులపై అమెరికా రిపబ్లికన్ నిక్కీ హేలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయం, చమురు కొనుగోళ్లపై లేవనెత్తిన అభ్యంతరాన్ని భారత్ సీరియస్గా తీసుకోవాలని సూచనలు చేశారు. ట్రంప్, మోదీ మధ్య ఇలాంటి పోరాటం దురదృష్టకరం అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో చైనాపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.భారత్కు నిక్కీ హేలీ మంచి మిత్రురాలిగా పేరున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంక్షలు విధించి భారత్ను అమెరికా దూరం చేసుకోవడంపై నిక్కీ హేలీ మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నిక్కీ హేలీ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘దశాబ్దాలుగా రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య ఉన్న స్నేహం, విశ్వాసం ఉంది. రష్యా నుంచి చమురు విషయంలో ట్రంప్ లేవనెత్తిన అభ్యంతరాలను భారత్ సీరియస్గా తీసుకోవాలి. దాని పరిష్కారం కోసం వీలైనంత త్వరగా అమెరికాతో కలిసి పనిచేయాలి. వాణిజ్యంలో, రష్యా చమురుపై అభిప్రాయభేదాలు వంటివి పరిష్కరించుకోవడానికి బలమైన చర్చలు, సంప్రదింపులు అవసరం.India must take Trump's point over Russian oil seriously, and work with the White House to find a solution. The sooner the better. Decades of friendship and good will between the world's two largest democracies provide a solid basis to move past the current turbulence.…— Nikki Haley (@NikkiHaley) August 23, 2025ఇక, చైనాను ఎదుర్కోవడానికి అమెరికాకు భారత్ మిత్రులుగా ఉండాలి అన్న అంశం చాలా ముఖ్యమైంది. దానిని ఏమాత్రం విస్మరించడకూడదు. చైనాను ఎదుర్కోవాలన్న వ్యూహాత్మక లక్ష్యాల సాధనకు ట్రంప్ నిర్ణయాలు విపత్కరంగా మారాయి. ప్రపంచంలో ఆరోవంతు జనాభాకు కేంద్రం భారత్. అత్యంత యువ జనాభాతో చైనాను దాటేసింది. చైనా జనాభాలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ ’ అని స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా.. అమెరికా, భారత్ మధ్య ఘర్షణల వాతావరణం నేపథ్యంలో మాజీ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, అమెరికా మధ్య పోరు దురదృష్టకరమని అభివర్ణించారు. భారత్ లాంటి మిత్రదేశాలను ట్రంప్ దూరం చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. నిజమైన దౌత్య ప్రయత్నాలు జరగకుండా, అల్టిమేటంలు జారీ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. గొప్ప దేశాలు ఎల్లప్పుడూ ప్రజలకు అల్టిమేటంలు ఇవ్వడం ద్వారా గొప్పతనాన్ని ప్రదర్శించవు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలనలో చర్చలు పరస్పర సహకారం, గౌరవం ద్వారా జరిగాయి. కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువ ఆదేశాలు, ఒత్తిడితో జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
తేజస్వీ యాదవ్పై ఎఫ్ఐఆర్ నమోదు
గడ్చిరోలి/కటిహార్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా అభ్యంతరకరమైన పోస్ట్ను ఎక్స్లో పోస్ట్ చేశారన్న ఆరోపణలపై బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్పై మహారాష్ట్రలో కేసు నమోదైంది. గడ్చిరోలి బీజేపీ ఎమ్మెల్యే మిలింద్ నరొటే ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు శుక్రవారం చెప్పారు.ఈ పరిణామంపై తాజా తేజస్వీ యాదవ్ స్పందించారు. ‘కేసులను చూసి భయపడను, ఇకపైనా నిజమే మాట్లాడుతా’అని ఆయన ప్రకటించారు. శుక్రవారం ప్రధాని మోదీ.. బీహార్ పర్యటన వేళ తేజస్వీ యాదవ్ ‘ఎక్స్’లో బీహార్ ప్రజలకు మోదీ ఇచ్చిన హామీలన్నీ వట్టి భూటకమని విమర్శించారు. ఓటర్ అధికార్ యాత్రలో భాగంగా తేజస్వీ కటిహార్లో మీడియాతో మాట్లాడారు. ప్రధాని హామీలను భూటకమనడం అభ్యంతరకరమైన మాటలు ఎలా అవుతాయి అంటూ ఎదురుదాడి చేశారు. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోనివ్వండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అంతరిక్ష రహస్యాలు ఛేదించాలి
న్యూఢిల్లీ: అంతరిక్ష రహస్యాలు ఛేదించడమే లక్ష్యంగా మరింత లోతైన ప్రయోగాలకు సిద్ధం కావాలని స్పేస్ సైంటిస్టులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇలాంటి ప్రయోగాలు మానవాళి భవిష్యత్తుకు ఉపకరిస్తాయని తెలిపారు. డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. ‘జాతీయ అంతరిక్ష దినం’సందర్భంగా మోదీ శుక్రవారం ఒక వీడియో విడుదల చేశారు. భవిష్యత్తులో చేపట్టబోయే అంతరిక్ష మిషన్ల కోసం ఇప్పటినుంచే వ్యోమగాముల బృందాన్ని సిద్ధం చేస్తున్నామని, యువత ఇందులో భాగస్వాములు కావాలని సూచించారు. చంద్రుడిపైకి, అంగారకుడిపైకి చేరుకున్నామని, ఇకపై అంతరిక్షం లోతుల్లోకి వెళ్లాల్సి ఉందని అన్నారు. స్పేస్ సెక్టార్లో ఒక విజయం తర్వాత మరో విజయం సాధించడం మన దేశానికి, మన సైంటిస్టులకు సహజమైన అలవాటుగా మారిందని ప్రధానమంత్రి హర్షం వ్యక్తంచేశారు. మన విశ్వానికి సరిహద్దు అంటూ లేదని, మన ప్రయోగాల్లోనూ సరిహద్దులు ఉండకూడదని చెప్పారు. ఎలక్ట్రిక్ ప్రొపల్షన్, సెమీ–క్రయోజెనిక్ ఇంజన్ల వంటి అధునాతన సాంకేతికతను మనం సాధించామని తెలిపారు. -
‘భారత్ అంటే గౌరవం.. మోదీ అంటే అంత కంటే..’
న్యూఢిల్లీ: భారత పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా వ్యవహరిస్తున్నారో అందరికీ తెలిసిందే. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత్ను ఆర్థికంగా దెబ్బతీయానే ఉద్దేశంతో సుంకాల పెంపునకు నాంది పలికారనే వాదన బలంగా వినిపిస్తోంది.. భారత్పై వరుస సుంకాలతో ఇరుకున పెట్టే యత్నం చేస్తున్నారని అంటున్నారు పలువురు ప్రముఖులు. భారత్ను చైనా కంటే దారుణంగా చూడటం తగదని అంటున్నారు. చైనా కంటే అధికంగా భారత్పై సుంకాలు విధించడమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. కొన్ని దశాబ్డాలుగా అమెరికాకు మిత్రదేశంగా ఉన్న భారత్ పట్ల ట్రంప్ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో ఆయనకే తెలియాలి. భారత్ను ఆర్థికంగా ఎదుగకుండా చూడాలని ట్రంప్ చేస్తున్నారా? అనేది ఒక క్వశ్చన్ మార్క్. అదే సమయంలో .భారత్పై ట్రంప్ వైఖరి పట్ల అటు అమెరికాలోనే పలు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించగా, ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలనే యత్నం కూడా యూఎస్ నుంచి జరుగుతున్నట్లే కనబడుతోంది. తాజాగా అమెరికా మాజీ దౌత్యవేత్త, రాజకీయ నాయకుడు మిచెల్ బామ్గార్టనర్ అమెరికా-భారత్ల ‘మైత్రి’ తిరిగి గాడిలో పడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ మీడియా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మిచెల్ బామ్గార్టనర్ మాట్లాడుతూ.. ట్రంప్కు భారత్ అంటే చాలా గౌరవమని, ప్రధాని మోదీ అంటే అంతకంటే గౌరవమంటూ స్పష్టం చేశారు. ఏ రకంగా భారత్ను డొనాల్డ ట్రంప్ గౌరవిస్తున్నారో చెప్పకపోయినా, త్వరలోనే ఇరుదేశా మధ్య సంబంధాలు తిరిగి యథాస్థితికి వస్తాయని జోస్యం చెప్పారు. ట్రంప్ వైఖరిపై చాలాకాలం ఓపిక పట్టిన భారత్.. ఇప్పుడు మాటల యుద్ధాన్ని ఆరంభించింది. అటు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు.. అవకాశం దొరికినప్పుడల్లా ట్రంప్ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా రష్యాతో బంధాన్ని చెడగొట్టాలని చూసిన ట్రంప్కు.. భారత్ అనూహ్య షాకిచ్చింది. తమకు దేశ ప్రయోజనాలే ముఖ్యమని, అందుకు రష్యాతో చమురు కొనుగోలులో ఎటువంటి మార్పు ఉండబోదనే సంకేతాలు పంపింది. దాంతో ట్రంప్కు నోట్లో ఎలక్కాయపడినట్లు అయ్యింది. ప్రస్తుతం నేరుగా మాట్లాడకుండా రాజీ చేసుకునే మంత్రాన్ని అమలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారనేది ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి కనిపిస్తోంది. ఇటీవల ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతాన్యాహు కూడా అమెరికా-భారత్ సంబంధాలు తిరిగి మెరుగుపడతాయని, అందుకు తనవంతు సహకారం అందిస్తానని కూడా చెప్పారు. మరి ఇప్పుడు అమెరికా మాజీ దౌత్యవేత్త మిచెల్ బామ్గార్టనర్ సైతం అదే పల్లవి అందుకున్నారు. ఈ రెండు పెద్ద దేశాల మధ్య పలు ప్రాథమిక అంశాలు చాలా బలంగా ఉన్నాయనేది ఒప్పుకోక తప్పదన్నారు. అందువల్ల ఇరు దేశాలు తిరిగి పూర్వ స్థితిని కొనసాగించే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నారు. -
లార్డ్ స్వరాజ్పాల్ కన్నుమూత
లండన్/న్యూఢిల్లీ: ప్రముఖ ప్రవాస భారతీయ పారిశ్రామిక దిగ్గజం లార్డ్ స్వరాజ్ పాల్ (94) లండన్లో కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఇటీవల ఆయన చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. స్వరాజ్పాల్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. పరిశ్రమ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి పాటుపడిన దానశీలిగా ఆయన్ను అభివరి్ణంచారు. బ్రిటన్–భారత్ సంబంధాలను బలోపేతం చేసేందుకు స్వరాజ్ పాల్ ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. వ్యాపార దిగ్గజం, దానశీలి, అంతర్జాతీయంగా ప్రవాస భారతీయులకు ఆయనొక ఐకాన్ అని తెలిపారు. 1966లో కుమార్తె చికిత్స కోసం బ్రిటన్ వెళ్లిన లార్డ్ పాల్ ఆ తర్వాత అక్కడే అంతర్జాతీయ సంస్థ కపారో గ్రూప్ను నెలకొల్పారు. ఉక్కు, ఇంజినీరింగ్, ప్రాపర్టీ తదితర రంగాల్లో దిగ్గజంగా తీర్చిదిద్దారు. బ్రిటన్లో అత్యంత సంపన్న ఏషియన్గా ఎదిగారు. దశాబ్దాల పాటు వ్యాపార, రాజకీయ రంగాల్లో కీలకంగా నిల్చారు. -
‘ఆనాడు కేజ్రీవాల్ రాజీనామా చేసుంటే.. ఈ బిల్లు వచ్చేది కాదు’
న్యూఢిల్లీ: రాజకీయ నాయకులు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ వరుసగా నెల రోజులు జైల్లో ఉంటే వారు తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. బిల్లును విపక్షాలు వివాదాస్పద బిల్లు అని అంటుంటే, కేంద్రం మాత్రం దాన్ని సమర్ధించుకుంటుంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పైబడినా ఈ తరహా బిల్లును ఎవరూ తీసుకురాలేదని, దీన్ని తీసుకొచ్చినందుకు ఎన్డీఏ ప్రభుత్వం గర్విస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. బిల్లులకు చట్ట సవరణలు చేయాలా? వద్దా? అని అమిత్ షా ప్రశ్నించారు. ఈ బిల్లుకు చట్ట సవరణ వద్దు అని విపక్షాలు పట్టుబట్టినా దాన్ని తాము ముందుకు తీసుకెళ్లామన్నారాయన. పీఎం నుంచి సీఎం, మంత్రులు ఇలా వెవరైనా తీవ్ర నేరాలకు పాల్పడి ఆ అభియోగాలపై 30 రోజుల పాటు జైల్లో ఉంటే రాజీనామా చేయాలనే బిల్లును తీసుకొస్తే తప్పేముందని ఓ ఇంటర్వ్యూలో అమిత్ షా ప్రశ్నించారు. ఇది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారణంగానే తీసుకొచ్చిన బిల్లు అనే చర్చకు కూడా ఆయన పుల్స్టాప్ పెట్టారు. లిక్కర్ కేసులో జైలు పాలైన అరవింద్ కేజ్రీవాల్ అప్పుడే రాజీనామా చేసి ఉంటే ఈ బిల్లు వచ్చి ఉండేది కాదేమో అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు అమిత్ షా. ఎక్కడైనా నైతికత అనేది చాలా ముఖ్యమైనదని, దాన్ని తుంగలో తొక్కి మళ్లీ పదవులు అలంకరిస్తామంటే కుదరదన్నారు. తీహార్ జైలు నుంచే కేజ్రీవాల్ పరిపాలన సాగించిన విషయాన్ని అమిత్ షా ఉదహరించారు. ప్రజాస్వామ్యంలో నైతికతకు ప్రతీ ఒక్క రాజకీయ పార్టీ బాధ్యత తీసుకోవాలనేది తమ విధానమన్నారు. ఈ క్రమంలోనే బిల్లును సవరించామన్నారు. ‘ఈ దేశంలోని ప్రజలు.. ఏ రాష్ట్ర సీఎం అయినా జైల్లో ఉండి పరిపాలించాలని కోరుకుంటారా?, ఇదేంటో అర్థం కావడం లేదు. ఇక్కడ ఎవరి వైపు నుంచి చూసినా నైతికత అనేదే ముఖ్యం’ అని కేరళలోని మనోరమా న్యూస్ కాంక్లేవ్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. People of the nation have to decide whether they want a PM, CM, or minister to run government from jail. pic.twitter.com/a8yiTYXM5T— Amit Shah (@AmitShah) August 22, 2025 కాగా, గతేడాది ఢిల్లీ సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ మద్యం పాలసీ కేసులో జైలు శిక్షను అనుభవించారు. జైలు నుంచి పరిపాలన కొనసాగించారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓటమి సంగతి అటుంచితే.. లిక్కర్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ రాజీనామా చేయలేదు. -
ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరైనా ఒక్కటే రూల్ : మోదీ
-
నేరగాళ్లు జైలు నుంచి పరిపాలించాలా?
గయాజీ: అవినీతికి పాల్పడి జైలుపాలైన ప్రజాప్రతినిధులను పదవుల నుంచి తప్పించడానికి చట్టం తీసుకొస్తామంటే ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు. అధికారం వెలగబెడుతున్న వ్యక్తులు జైలుకెళ్లి, అక్కడి నుంచే పరిపాలన సాగిస్తున్న పరిస్థితులు చూసి మనం నిజంగా బాధపడాలని అన్నారు. ఒకవైపు ఊచలు లెక్కిస్తూ మరోవైపు ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారంటే మనం చింతించాలని చెప్పారు. అలాంటి వ్యక్తులు(ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ) రాజ్యాంగ విలువలను హేళన చేస్తున్నారని ధ్వజమెత్తారు. నేరగాళ్లు జైలు నుంచే పరిపాలన చేస్తామంటే మనం చూస్తూ ఉండిపోవాలా? అని నిలదీశారు. 11 ఏళ్ల మా పాలనలో ఎలాంటి అవినీతి మరక లేదని గర్వంగా చెబుతున్నామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ పాలనలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని, బిహార్లో ఆర్జేడీ అవినీతి బాగోతాలు ప్రతి ఒక్కరికీ తెలుసని చెప్పారు. అందుకే అవినీతి ముఖ్యమంత్రులు వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే పదవి నుంచే తొలగించేలా చట్టం తీసుకురావాలని నిర్ణయించామని, ప్రధానమంత్రి సైతం వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే పదవి నుంచి దిగిపోవాల్సిందేనని స్పష్టంచేశారు. ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా తప్పుచేసి 50 గంటలు జైల్లో ఉంటే పోస్టు నుంచి తొలగిస్తారని, మరి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులను ఎందుకు వదిలిపెట్టాలి? అని ప్రశ్నించారు. తాము తీసుకొస్తున్న కఠినమైన చట్టాన్ని కాంగ్రెస్, ఆర్జేడీ సహా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని, చేసిన పాపాలకు శిక్ష పడుతుందని భయపడుతున్నాయని విమర్శించారు. నేరగాళ్లు ఉండాల్సింది జైల్లోనే తప్ప పదవుల్లో కాదన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీలు అధికారంలో ఉన్నప్పుడు జనం సొమ్ముతో బొజ్జలు నింపుకున్నాయని నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ శుక్రవారం బిహార్, పశి్చమ బెంగాల్లో పర్యటించారు. బిహార్లోని గయాజీ జిల్లాలో రూ.13,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. బెంగాల్ రాజధాని కోల్కతాలో మూడు మెట్రో రైలు మార్గాలను ప్రారంభించారు. ఎక్స్ప్రెస్వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ(130 సవరణ) బిల్లు– 2025తోపాటు బిహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియను పరోక్షంగా సమరి్థంచారు. వ్యవస్థలో ఉన్న లోపాలను సరి చేస్తున్నామని చెప్పారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే... ‘‘పహల్గాంలో మన పర్యాటకులను బలి తీసుకున్న ముష్కరులపై ప్రతీకారం తీర్చుకుంటామని బిహార్ గడ్డపైనే ప్రతిజ్ఞ చేసి, నెరవేర్చి చూపించా. ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్ ఉగ్రవాదుల భరతం పట్టాం.ఓట్ల కోసమే విపక్షాల ఆరాటం: దేశంలో జనాభా స్వరూపం మారకుండా చూడాలన్న లక్ష్యంతో అక్రమ వలసదార్లు, చొరబాటుదార్లపై చర్యలు తీసుకుంటే విపక్షాలకు ఉలుకెందుకు? మన దేశానికి వలసదార్లు, చొరబాటుదార్లు అతిపెద్ద ముప్పుగా మారారు. ఈ సమస్య గురించి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించా. కొన్ని రాష్ట్రాల్లో జనాభా స్వరూపమే మారిపోతోంది. స్థానికులు మైనారీ్టలుగా మారుతున్నారు. ఇది ఇకపై సాగడానికి వీల్లేదు. అందుకే డెమోగ్రఫీ మిషన్ ప్రారంభించాలని నిర్ణయించాం. కానీ, ఓటుబ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదార్లను కాపాడేందుకు ప్రతిపక్షాలు ఆరాటపడుతున్నాయి. చొరబాట్లను సహించే ప్రసక్తే లేదు: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చొరబాటుదార్లను ప్రోత్సహిస్తోంది. కేవలం అధికారం దాహంతో దేశ భద్రతను పణంగా పెడుతోంది. చొరబాటుదార్లను గుర్తించి, వెనక్కి పంపించే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. చొరబాట్లను సహించే ప్రసక్తే లేదు. వారు మన దేశంలో తిష్ట వేస్తామంటే ఒప్పుకోం. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలు బుజ్జగింపు రాజకీయాలను నమ్ముకుంటున్నాయి. చొరబాటుదార్ల ఓట్లతో ఎన్నికల్లో నెగ్గాలని చూస్తున్నాయి. అక్రమంగా వచ్చినవారంతా దేశం విడిచి వెళ్లిపోవాల్సిందే. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక ఇంటికి సాగనంపాలి’’. -
సుంకాల్లో భారత్ ‘మహారాజ్’.. అమెరికా అధికారి విమర్శలు
వాషింగ్టన్: భారత్ టార్గెట్గా అమెరికా మరోసారి సంచలన విమర్శలు చేసింది. సుంకాల్లో భారత్ను ‘మహారాజ్’ అని పేర్కొంటూ వైట్హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నరావో వ్యాఖ్యలు చేశారు. ప్లాన్ ప్రకారమే రష్యా నుంచి చమురు కొనడం ద్వారా లాభదాయక కార్యక్రమాన్ని భారత్ కొనసాగిస్తోంది అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. భారత రిఫైనరీలు యుద్ధానికి ఆజ్యం పోస్తూ డబ్బు సంపాదిస్తున్నాయని అన్నారు.వైట్హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నరావో తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పీటర్.. ఆగస్టు 27 నుంచి 50 శాతం సుంకాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో.. వీటి గడువును ట్రంప్ పొడిగిస్తారని తాను ఆశించడం లేదన్నారు. గతంలో ట్రంప్ ప్రకటించినట్లుగా వచ్చే వారం కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. సుంకాలు విధించడంలో భారత్.. ‘మహారాజ్’గా ఉంది. భారత్ సుంకాలు ఎక్కువగా ఉంటాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ భారత్కు చెందిన రిఫైనరీలు లాభాలు ఆర్జిస్తున్నాయి. రష్యా ద్వారా లాభదాయక కార్యక్రమాన్ని భారత్ కొనసాగిస్తోంది.White House Trade Adviser Peter Navarro on India: "Nonsense that India needs Russian Oil""Profiteering by Indian refiners""India has Maharaja tariffs""Road to peace runs thru New Delhi" pic.twitter.com/w64a9nRg2P— Sidhant Sibal (@sidhant) August 21, 2025భారత్కు రష్యన్ చమురు అవసరం అనేది అర్ధం లేనిది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం విషయంలో భారత్ తన పాత్రను గుర్తించాలని కోరుకోవడం లేదు. భారత్ మనకు వస్తువులను అమ్మి.. వారు రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడానికి మన నుండి వచ్చే డబ్బును ఉపయోగిస్తున్నారు. రష్యన్లు ఆ డబ్బును మరిన్ని ఆయుధాలను కొనుగోలు చేయడానికి, ఉక్రెయిన్ ప్రజలపై దాడులు చేయడానికి అది వాడుకుంటున్నారు అని ఆరోపించారు. భారత నాయకత్వాన్ని నేను విమర్శించాలని నేను అనుకోవడం లేదు. మోదీ గొప్ప నాయకుడు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ పాత్ర ఏంటో చూడండి.. మీరు ప్రస్తుతం చేస్తున్నది శాంతిని పునరుద్ధరించడానికి కాదు.. అది యుద్ధాన్ని కొనసాగిస్తోంది. రష్యా పట్ల భారత్ తన వైఖరి మార్చుకోవాలి అంటూ వ్యాఖ్యలు చేశారు. -
యూత్ కాంగ్రెస్ లీడర్లు మంచి టాలెంటెడ్ ఉన్నారు.. కానీ: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: కొంతకాలంగా ఓట్ చోరీ అంశంపై అటు ఈసీనీ, ఇటు కేంద్రాన్ని విమర్శిస్తున్న ఏఐసీసీ నేత రాహుల్ గాంధీలో అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ చురకలంటిచినట్లు తెలుస్తోంది. ఈరోజు(గురువారం, ఆగస్టు 21) పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా టీ బ్రేక్లో ఎన్డీఏ నేతలతో మోదీ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్లో యువత టాలెంట్కు కొదవలేదు. చాలామంది యువ కాంగ్రెస్ నాయకుల్లో మంచి టాలెంట్ ఉంది. యూత్ కాంగ్రెస్ లీడర్లు మంచి టాలెంటెడ్ ఉన్నారు. కానీ వారికి మాట్లాడే అవకాశం రావడం లేదు. దాన్ని రాహుల్ గాంధీనే కల్పించడం లేదు. రాహుల్ గాంధీ అభద్రతా భావంతో ఉన్నట్లు ఉన్నారు. ఇది ‘‘ కుటుంబ అభద్రతాభావం’’ అయి ఉండొచ్చు’ అని ఎన్డీఏ నేతలతో మోదీ వ్యాఖ్యానించినట్లు సమాచారం.కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్సభ నిరవధిక వాయిదా పడింది. సమావేశాల్లో భాగంగా 21 రోజుల పాటు జరిగిన లోక్సభ నేడు నిరవధికంగా వాయిదా పడింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఎక్కువ శాతం నిరసనలతోనే సభ గడిచింది. బీహార్లో చేపట్టిన ఓట్ల సవరణ ప్రక్రియపై చర్చ చేపట్టాలని విపక్షాలు ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాయి. కానీ, ఆ అంశంపై ఇచ్చిన వాయిదా తీర్మానాలను ప్రభుత్వం మాత్రం పక్కన పెట్టేసింది. జాబితా నుంచి 65 లక్షల ఓటర్ల తొలగింపుపై చర్చ చేపట్టాలని వర్షాకాల సమావేశాలు ప్రారంభం నుంచి విపక్షాలు డిమాండ్ చేశాయి.నేడు లోక్సభకు ప్రధాని మోదీ వచ్చారు. కానీ విపక్షాలు మాత్రం తమ పట్టువీడలేదు. విపక్షాల తీరుతో విసుగెత్తిన స్పీకర్ ఓం బిర్లా .. సభను నిరవధికంగా వాయిదా వేశారు. -
నింద మాటున ప్రభుత్వాలను కూల్చేస్తారా?... ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రుల తొలగింపు బిల్లులపై లోక్సభలో విపక్షాల ఆగ్రహం
-
మళ్లీ చివురించిన చెలిమి
ఏ దేశానికైనా ప్రథమ ప్రాధాన్యం స్వీయ ప్రయోజనాలు. ఆ తర్వాతే మిగిలినవన్నీ. గాల్వాన్ ఘర్షణల తర్వాత గత అయిదేళ్లుగా భారత్, చైనాల మధ్య ఏర్పడిన వివాదాలు అనేకానేక చర్చల పరంపర తర్వాత కూడా అసంపూర్ణంగానే ఉండిపోయిన నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మన దేశంలో రెండురోజులు పర్యటించటం, ఇరు దేశాల మధ్యా ఏదో మేరకు సదవగాహన కుదరటం హర్షించదగ్గ పరిణామం. ఆయన ప్రధాని నరేంద్ర మోదీతోపాటు అంతకు ముందు విదేశాంగ మంత్రి జైశంకర్తో చర్చలు జరిపారు. ఇరుగు పొరుగు అన్నాక సమస్యలు ఉంటాయి. ఒకటి రెండు పర్యటనలతోనో, రెండు మూడు దఫాల చర్చల్లోనో అవి పరిష్కారం కావాలంటే సాధ్యం కాకపోవచ్చు. అందుకు ఎంతో ఓరిమి, తమ వైఖరిపై అవతలి పక్షాన్ని ఒప్పించే నేర్పు అవసరం. దీర్ఘకాలం ఆ వివాదాలను కొనసాగనిస్తే మూడో దేశం తనకు అనుకూలంగా మలుచుకునే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. నిరుడు అక్టోబర్లో రష్యాలోని కజాన్లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అప్పటికి నాలుగేళ్ల తర్వాత తొలిసారి కలుసుకున్నారు. ఇరు దేశాల సంబంధాలనూ సాధారణ స్థితికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే మొన్న జూన్లో కైలాస– మానససరోవర్ యాత్రకు భక్తులను అనుమతించేందుకు చైనా అంగీకరించింది. భారత్ సందర్శించే చైనా యాత్రికులకు మన దేశం పర్యాటక వీసాలు పునరుద్ధరించింది. ఈనెల 31, సెప్టెంబర్ 1 తేదీల్లో చైనాలోని తియాన్జిన్లో షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో వాంగ్ యీ వచ్చారు. ఆ సదస్సుకు మోదీ హాజరుకావాలంటే సుహృద్భావ సంబంధాలు అవసరమని కూడా చైనా భావించింది. ప్రధాని ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి హాజరైతే ఆయన ఏడేళ్ల అనంతరం చైనా సందర్శించి నట్టవుతుంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాల సైనికుల మధ్యా జరిగిన ఘర్షణల తర్వాత సైనికాధికారుల స్థాయిలో చాలా దఫాలు చర్చలు సాగాయి. అయినా సరిహద్దుల్లో ఏప్రిల్ 2020కి ముందున్న పరిస్థితులు ఏర్పడలేదు. ఆఖరికి కజాన్లో మోదీ–షీల మధ్య సమావేశం తర్వాత కూడా గత పది నెలల్లో చెప్పుకోదగ్గ ప్రగతి లేదు. వాంగ్ యీ పర్యటన సందర్భంగా ఇరుదేశాలూ 12 అంశాల్లో కీలక నిర్ణయాలు తీసు కున్నాయి. రెండు దేశాల మధ్యా విమాన రాకపోకలను పునరుద్ధరించుకోవాలనీ, వివాదాస్పద సరిహద్దు సమస్యపై చర్చించేందుకు మూడు వేర్వేరు బృందాలు ఏర్పాటు చేసుకోవాలనీ తీర్మా నించాయి. సరిహద్దు విషయంలో ఇప్పుడు పనిచేస్తున్న బృందంతో పాటు తూర్పు, మధ్య సెక్టార్లకు సంబంధించి వేర్వేరు బృందాలు ఏర్పడితే త్వరితగతిన పరిష్కారం సాధించవచ్చని ఇరు దేశాల విదేశాంగమంత్రులూ భావించారు. అలాగే వాణిజ్యాన్ని పెంచుకోవటానికి సరి హద్దుల్ని మళ్లీ తెరవాలని నిర్ణయించారు. లిపూలేఖ్ పాస్, షిప్కి లా పాస్, నాథూ లా పాస్ల గుండా ఈ వాణిజ్యం సాగుతుంది. అలాగే పరస్పరం పెట్టుబడుల ప్రవాహానికి కూడా అనుమ తిస్తారు. అన్నిటికన్నా ముఖ్యం – అరుదైన ఖనిజాల ఎగుమతులకు చైనా అంగీకరించటం. స్మార్ట్ ఫోన్ల నుంచి ఫైటర్జెట్ల వరకూ, విండ్ టర్బైన్ల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వరకూ ఉత్పాదన ప్రక్రియలో ఈ అరుదైన ఖనిజాలు అత్యవసరం. ఇవి ప్రపంచంలో 99 శాతం చైనాలోనే లభ్యమవుతాయి. వీటితోపాటు ఎరువుల ఎగుమతులపై లోగడ విధించిన నిషేధాన్ని తొలగించ టానికి చైనా అంగీకరించటం ఈ పర్యటనలో ప్రధానాంశం. మన రైతులు ఎక్కువగా మొగ్గు చూపే డీఏపీ ఎరువులు చైనాలో ఉత్పత్తవుతాయి. రెండుచోట్లా ప్రవహించే నదీజలాలపై డేటాను ఇచ్చిపుచ్చుకోవటానికి భారత్, చైనా అంగీకరించాయి. త్రీగోర్జెస్ డ్యామ్ను మించిన స్థాయిలో బ్రహ్మపుత్ర నదిపై 16,000 కోట్ల డాలర్ల వ్యయంతో భారీ ఆనకట్ట నిర్మించాలని చైనా తలపెట్టిన నేపథ్యంలో నదీ జలాల డేటాపై అంగీకారం కుదరటం హర్షించదగ్గది.చర్చల తర్వాత తాజా ప్రపంచ పరిణామాలపై వాంగ్ యీ విడుదల చేసిన ప్రకటనలో పరోక్షంగా అమెరికా వ్యవహారశైలిపై విమర్శలుండటం గమనార్హం. స్వేచ్ఛా వాణిజ్యాన్నీ, అంతర్జాతీయ సంబంధాలనూ భగ్నం చేసేలా కొందరు ఏకపక్షంగా బెదిరింపులకు దిగుతున్న పర్యవ సానంగా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని ఆయన ప్రస్తావించారు. ఆధిపత్య ధోరణులు ఏ రూపంలో ఉన్నా గట్టిగా ప్రతిఘటించటం చాలా అవసరం. ఏదేమైనా ఇరుదేశాలూ సాధ్యమైనంత త్వరగా సరిహద్దు సమస్యకు పరిష్కారం అన్వేషించగలిగితే, ఉగ్రవాదం అంతానికి చేతులు కలిపితే... ప్రధాని మోదీ చెప్పినట్టు అది రెండు దేశాల మధ్య మాత్రమే కాదు, ఆసియా ఖండంలోనే కాదు... యావత్ ప్రపంచశాంతికీ, సౌభాగ్యానికీ దోహదపడుతుంది. సాధ్యమైనంత త్వరగా అది సాకారం కావాలని ఆశించాలి. -
దీపావళి కానుకపై ఆశలు
దేశవ్యాప్త వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ)ని ఎనిమిదేళ్ళ క్రితం అట్టహాసంగా ప్రారంభించారు. ఆ సందర్భంగా అర్ధరాత్రి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని కూడా నిర్వహించారు. దేశాన్ని ఉమ్మడి ఆర్థిక మార్కెట్గా ఏకీకృతం చేసే చారిత్రక సంస్కరణగా దాన్ని కొనియాడారు. పరోక్ష పన్నులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెస్తున్నామన్నారు. ఘర్షణలు, ఎగవేతలను నిర్మూలిస్తుందని చెప్పారు. ఎక్సైజ్, సర్వీసు పన్నులను విధించే హక్కును కేంద్ర ప్రభుత్వం వదులుకోవడంతో సాయలాపాయలాగా కుదుర్చుకున్న వ్యవహారంగా జీఎస్టీ సంస్కరణ ఆమోదం ఖ్యాతికెక్కింది. దానికి తగ్గట్లుగానే అన్ని రాష్ట్రాలూ రాష్ట్ర స్థాయిలో విధించే అమ్మకం పన్నులు, విలువ–జోడింపు పన్ను, ఆక్ట్రాయ్ వంటి ఇతర చిన్నా చితకా పన్నులను విధించే హక్కును కేంద్రానికి దత్తం చేశాయి. రాష్ట్రాలకు పన్నుల రాబడులలో ఏర్పడే లోటును తాము భర్తీ చేస్తామని కేంద్రం వాగ్దానం చేయడం వల్ల ఆ రాజీ బేరం కుదిరింది. రాష్ట్రాలు పన్నుల విధింపులో ఉన్న స్వయం ప్రతిపత్తిని త్యాగం చేశాయి. దీన్ని 2017 నాటి తొలి చట్టంలో జీఎస్టీ పరిహార క్లాజుగా చేర్చారు. ఆ క్లాజు గడువు 2022తో పూర్తయింది. ఇపుడు జీఎస్టీలో తమ వాటా ఒక్కసారిగా బాగా తగ్గిపోయే ప్రమాదం ఉందని రాష్ట్రాలు భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ‘దీపావళి కానుక’గా జీఎస్టీలో పెద్ద సంస్కరణనే తీసుకురానున్నట్లు ప్రకటించడం హర్షణీయం. తదుపరి సంస్కరణలు సాధారణ ప్రజానీకంపై, ముఖ్యంగా మధ్యతరగతి, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలపై పన్ను భారాన్ని తగ్గించేవిగా ఉంటాయని ఆయన వాగ్దానం చేశారు. సంస్థాగత సంస్కరణలు, రేటు హేతుబద్ధీకరణ, బతుకు తెరువును సులభతరం చేయడమనే మూడు అంశాలను ప్రభుత్వం పరిగణించవచ్చు.పుట్టుకలోనే లోపాలురూపకల్పన, అమలులో కూడా ఏకీకృత, దేశవ్యాప్త, పరోక్ష పన్నుగా జీఎస్టీ పుట్టుకలోనే కొన్ని లోపాలున్నాయని చెప్పక తప్పదు. రూపకల్పనలోని లోపం ఏమిటంటే, జీఎస్టీ వంటి పరోక్ష పన్ను అంతర్గతంగానే తిరోగమనమైనది. ఒక వ్యక్తి చెల్లించే పన్ను ఆ వ్యక్తి ఆదాయంపైన కాక, కొనే వస్తువు విలువపై ఆధారపడి ఉంటుంది. కనుక, జీఎస్టీ మంట ధనికుల కన్నా పేదలకు ఎక్కువ తెలుస్తుంది. ఆదాయ పన్ను, సంపద పన్ను వంటి ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నుల కన్నా ఔచిత్యంతో కూడినవిగా ఉంటాయి. మీ పన్ను ఆదాయంతోపాటే పెరుగుతుంది. ఆదాయం తగ్గితే పన్ను ఉండదు.జీఎస్టీలోని అసమంజసత్వాన్ని తగ్గించేందుకు బహుళ శ్లాబులు పెట్టారు. పేదలు కొనే వస్తువులను సున్నా లేదా 5 శాతం శ్లాబులో పెట్టారు. ధనికులు కొనే వస్తువులను హెచ్చు శ్లాబులో పెట్టారు. ఇది ఒక రకంగా పేదలు ఏ వస్తువులను వాడాలో శాసించడమవుతుంది. సాధారణంగా ఆహారం, ఔషధాలను పన్నుల నుంచి మినహా యించే విధానం ప్రపంచ వ్యాప్తంగా అమలులో ఉంది. అన్ని వస్తు వులు, సేవలకు ఒకే రేటు ఉండటం హేతుబద్ధమైన, సమర్థమైన వ్యవస్థ అనిపించుకుంటుంది. యూరోపియన్ యూనియన్ దేశాలు, సింగపూర్, ఆస్ట్రేలియాలలో అది కనిపిస్తుంది. మధ్యస్థ రేటు ఉండా లన్నది స్థూలంగా అంగీకరించే సూత్రం. (ఆహారం, ఔషధాలు వంటి) అత్యవసర వస్తువులపై చాలా తక్కువగా, (పొగాకు, మద్యం వంటి) వ్యసన, విలాస వస్తువులపై చాలా ఎక్కువగా ఉంటుంది. సులభతర శ్లాబులు మేలుఇక అమలులో లోపాల గురించి ముచ్చటించుకుందాం. జీఎస్టీ బహుళ పన్ను శ్లాబుల (0 శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం, పాప కార్యాల కింద వచ్చే వాటిపై వేసే పన్ను, వివిధ సెస్సులు)తో కూడిన సంక్లిష్ట వ్యవస్థ. ఈ సంక్లిష్టత, వస్తువులు, సేవల వర్గీకరణ, పన్ను చెల్లింపుదారులలో అయోమయం, వ్యాజ్యాలు వంటి వివాదాలకు దారితీస్తోంది. అంతిమ వస్తువుల పైన కన్నా ఆ యా వస్తువులను తయారు చేసేందుకు ఉపయోగించే వస్తువులపై పన్ను రేట్లు అధికంగా ఉన్న దృష్టాంతాలు కూడా ఉన్నాయి. ఇది దేశంలో వస్తూత్పత్తిని నీరుగారుస్తోంది. వ్యవసాయం, పెట్రోలు ఉత్పత్తులు, విద్యుచ్ఛక్తి, ఆల్కహాల్, స్థిరాస్తుల రంగం వంటి జీడీపీలోని పెద్ద భాగాలు... జీఎస్టీ పరిధికి బయటనే కొనసాగుతున్నాయి. కొన్నింటికి మినహాయింపు ఇవ్వడం వల్ల రెవెన్యూ తగ్గుతుంది. జీఎస్టీ సంస్కరణలోని స్ఫూర్తి దెబ్బతింటోంది. చిన్న వ్యాపారాల వారు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల వారిపై భారం పడుతోంది. కారణం– వారు వెంటనే జీఎస్టీ చెల్లించాల్సి రావడం, వారి ఖాతాదారులు చెల్లింపులలో జాప్యం చేయటం! రిఫండులలో జాప్యాలు ఉండనే ఉన్నాయి. ఇవి వ్యాపారు లకు చేతిలో నగదు ఆడకుండా చేస్తున్నాయి. ప్రధాని ప్రకటించిన ప్రతిపాదిత సంస్కరణల్లో ఒకటి గణ నీయమైన మార్పు తీసుకురాగల ఆశ రేపుతోంది. అది ప్రస్తుత బహుళ శ్లాబుల పద్ధతిని రద్దు చేసి, రెండు (స్టాండర్డ్, మెరిట్ ) రేట్ల శ్లాబుల సులభతర విధానానికి మళ్ళడం! కొన్ని ఎంపిక చేసిన వస్తువులపైన మాత్రం ప్రత్యేక రేట్లు ఉంటాయి. వ్యాజ్యాలతోపాటు, వర్గీకరణకు సంబంధించిన వివాదాలు తగ్గుతాయి. దైనందిన వాడుక వస్తువులు, జనం సమకూర్చుకోవాలని ఆశపడే వాటిపై పన్ను రేటు తగ్గుతుందని భావిస్తున్నారు. వినిమయం పెరగడం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ రేట్లు తగ్గించడం వల్ల భారతదేశపు ఎగుమతుల పోటీ సామర్థ్యం పెరుగుతుంది. దేశంలో ఉద్యోగాల కల్పనకూ సాయపడుతుంది. మధ్యస్థ రేటును మరీ భారం మోపేదిగా ఉన్న 18 శాతంగా కాక 15 శాతంగా నిర్ణయించవచ్చు. పన్నుల సంస్కరణలపై ఏర్పాటు చేసిన కేల్కర్ సత్వర కార్యాచరణ బృందం సిఫార్సు చేసినట్లుగా దాన్ని 15 శాతంకన్నా తక్కువగా 12 శాతంగా నిర్ణయిస్తే ఇంకా బాగుంటుంది. రాష్ట్రాలకు చేయి తిరిగేలా...చివరగా, ఫెడరలిజంలో (ఆరోగ్యం, విద్య వంటివాటిపై) వ్యయాల బాధ్యతలను రాజ్యాంగం రాష్ట్రాల పైనే మోపింది. కానీ, స్వతంత్ర ఆదాయ వనరులను మాత్రం కొద్దిగానే కల్పించింది. ఈ అసమతౌల్యాన్ని జీఎస్టీ ఇంకా పెంచి, కేంద్ర బదలాయింపులపైనే రాష్ట్రాలు ఎక్కువగా ఆధారపడక తప్పని స్థితి కల్పించింది. స్థానిక అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి నిధుల సమీకరణకు రాష్ట్రాలకు పన్నులు విధించే అధికారం కొంత కావాలి. జీఎస్టీ భారతదేశపు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసిందనే అభిప్రాయం ఒకటి ఉంది. రాష్ట్రాలకు కోశాగారాన్ని విస్తరించుకునే, స్వయం ప్రతిపత్తిని కల్పించే అవకాశాన్ని పునరుద్ధరించేందుకు అన్వేషించవలసిన అవసరం ఉంది. ఫలితంగా, రాష్ట్రాలు వాటి నిర్దిష్ట ఆర్థిక, సామా జిక, ప్రాంతీయ అవసరాలకు తగ్గట్లుగా విధానాలు రూపొందించు కోగలుగుతాయి. అసమానతలను తగ్గించేందుకు, ప్రస్తుతం పరోక్ష పన్నుల వైపు తూగిన తక్కెడను ప్రత్యక్ష పన్నుల వైపు మొగ్గే విధంగా చేయాల్సిన అవసరం కూడా ఉంది. అజీత్ రానాడే వ్యాసకర్త ఆర్థికవేత్త (‘దక్కన్ హెరాల్డ్’ సౌజన్యంతో) -
భారత్పై సుంకాలు అందుకే.. కరోలిన్ లీవిట్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: భారత్పై సుంకాల విషయమై అమెరికా మరోసారి స్పందించింది. ఉక్రెయిన్, రష్యా యుద్దం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహంలో భాగంగానే భారత్పై సుంకాల విధించినట్టు వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ చెప్పుకొచ్చారు. రష్యాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇలా చేసినట్టు తెలిపారు.వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తాజాగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని ట్రంప్ నిశ్చయించుకున్నారు. ఇందులో భాగంగానే ఆయా దేశాల నేతలతో ట్రంప్ చర్చల్లో ఉన్నారు. ఇదే సమయంలో ఉక్రెయిన్పై దాడులు నేపథ్యంలో రష్యాతో వాణిజ్యం కొనసాగించే దేశాలపై ట్రంప్ దృష్టి సారించారు. ఆ దేశాలను లక్ష్యంగా చేసుకొని ఒత్తిడి తీసుకురావాలని అనుకున్నారు. అది ట్రంప్ పరిపాలన వ్యూహం. ఇందులో భాగంగా భారత్పై 50 శాతం సుంకాలను విధించారని అన్నారు. ఇదే సమయంలో భారత్ ఎప్పుడు అమెరికాకు మిత్ర దేశమే అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా భారత్- పాక్ల మధ్య యుద్ధాన్ని ట్రంప్ వాణిజ్యంతో ముగించారని పాత పాటే పాడారు.మరోవైపు.. ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి సంబంధించి ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీల మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయని తెలిపారు. నాటో సెక్రటరీ జనరల్తో సహా యూరోపియన్ నాయకులతో జరిగిన చర్చలే తొలి అడుగు అని పేర్కొన్నారు. త్వరలోనే రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. Breaking:President Trump has put 'sanctions' on India to put 'this war (in Ukraine) to a close' & he 'wants to see this war end' says White House Spokesperson Karoline Leavitt pic.twitter.com/rLLq6aiznT— Sidhant Sibal (@sidhant) August 19, 2025 -
భారత్-చైనా వివాదాల పరిష్కారానికి నిపుణుల బృందం ఏర్పాటు
న్యూఢిల్లీ: భారత్-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు త్వరలో ఫుల్స్టాప్ పడనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిల సంయుక్త భేటీ అనంతరం ఇరు దేశాల సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.భారత్-చైనాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి మరో ముందడుగు పడింది. ఇరు దేశాలు సరిహద్దు సమస్య పరిష్కారం కోసం కలసి పనిచేయాలని నిర్ణయించాయి. సరిహద్దు డీలిమిటేషన్కు పరిష్కారాన్ని అన్వేషించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసే దిశగా నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిల సమావేశం అనంతరం విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది.ఇరుదేశాలు వీలైనంత త్వరగా ప్రత్యక్ష విమానాలను పునఃప్రారంభించాలని, కైలాస పర్వత యాత్ర, మానసరోవర్ యాత్రకు మరింత ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించాయని ఆ ప్రకటనలో తెలిపారు. అలాగే లిపులేఖ్ పాస్, షిప్కి లా , నాథు లా వాణిజ్య కేంద్రాల ద్వారా సరిహద్దు వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ చర్చల ద్వారా త్వరలో భారత్-చైనా సరిహద్దు ప్రాంతాలలో శాంతి కొనసాగేందుకు అడుగుపడనున్నదనే అభిప్రాయాన్ని ఇరు పక్షాలు వ్యక్తం చేశాయి. భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించేందుకు, సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని కాపాడుకునేందుకు ఈ చర్చలు దోహదపడతాయని మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది.భారత్-చైనాల సరిహద్దు సమస్య పరిష్కారం కోసం న్యాయమైన, సహేతుకమైన, పరస్పరం ఆమోదయోగ్యమైన చట్టాన్ని తీసుకువచ్చేందుకు ఇరు పక్షాల మధ్య ఒక ఒప్పందం కుదిరిందని ఆ ప్రకటనలో వెల్లడించారు. భారత-చైనా సరిహద్దు ప్రాంతాల్లో సరిహద్దు డీలిమిటేషన్ను అన్వేషించేందుకు, సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు, సమన్వయం కోసం వర్కింగ్ మెకానిజం (డబ్ల్యూఎంసీసీ) కింద నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయడానికి ఇరుదేశాల ప్రత్యేక ప్రతినిధులు అంగీకరించారని ఆ ప్రకటనలో విదేశాంగ శాఖ తెలిపింది. కాగా టియాంజిన్లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ)శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కావడాన్ని చైనా స్వాగతించింది. -
బలపడుతున్న చైనా, భారత్ బంధం
న్యూఢిల్లీ: గల్వాన్ ఘర్షణ ఉదంతం తర్వాత క్షీణించిన భారత్, చైనా సత్సంబంధాల బలోపేతమే లక్ష్యంగా మంగళవారం ఢిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. త్వరలో చైనాలో మోదీ పర్యటన నేపథ్యంలో భారత్లో పర్యటిస్తున్న ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ, భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో మంగళవారం విస్తృతస్థాయి చర్చలు జరిపారు. పలు రంగాల్లో పరస్పర సహకారం, అభివృద్దే లక్ష్యంగా 12 అంశాలపై ఉమ్మడిగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. వాణిజ్యం పెంపు ధ్యేయంగా సరిహద్దులను తెరవడం, ఇరువైపులా పెట్టుబడుల వరద పారించడం, నేరుగా పౌరవిమానయాన సేవలను పునరుద్దరించడం వంటి కీలక అంశాలపై నేతలు అవగాహనకొచ్చారు.అమెరికా మోపిన అధిక టారిఫ్ భారం కారణంగా పరోక్షంగా చాన్నాళ్ల తర్వాత భారత్, చైనా ఏకతాటి మీదకు రావడం విశేషం. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ల కీలక ఉమ్మడి ఆశయాల అమలుకు కృషిచేయాలని ఇరు పక్షాలు మంగళవారం నిర్ణయించాయి. లిపులేఖ్ పాస్, షిప్కీ లా పాస్, నాథూ లా పాస్ సరిహద్దుల గుండా తిరిగి విస్తృతస్థాయిలో వాణిజ్యం చేయాలని జైశంకర్, వాంగ్ నిర్ణయించారు. స్నేహపూర్వక సంప్రతింపుల ద్వారా సరిహద్దు వెంట మళ్లీ శాంతిస్థాపనకు ప్రయత్నించనున్నారు. ఈ మేరకు 12 అంశాలతో సంయుక్త పత్రాన్ని నేతలు విడుదలచేశారు. పర్యాటకులు, వ్యాపారులు, మీడియా ప్రతినిధులు, ఇతర కారణాలతో సందర్శించే వ్యక్తులకు వీసాలు ఇవ్వాలని ఇరుదేశాలు నిర్ణయించాయి.వచ్చే ఏడాది కైలాశ్ పర్వత యాత్ర, మానస్సరోవర్ యాత్ర కోసం భారతీయులను చైనా అనుమతించనుంది. ఇరుదేశాల భూభాగాల్లో ప్రవహించే నదీజలాలపై సహకారం, ప్రవాహస్థాయిలు, వరదలపై ఎప్పటికప్పుడు సమాచార మారి్పడికి, ఇరుదేశాల నిపుణుల స్థాయి వ్యవస్థకు ప్రాధాన్యతనివ్వడం వంటివి ఈ సంయుక్త పత్రాల్లో చోటు దక్కించుకున్నాయి. భారత్కు అరుదైన ఖనిజాలు, ఎరువుల ఎగుమతులపై ప్రస్తుతం అమల్లో ఉన్న ఆంక్షలను సడలించడానికి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అంగీకరించారు. భారత్కు అవసరమైన అరుదైన ఖనిజాలు, ఎరువులు సరఫరా చేస్తామని వాంగ్ హామీ ఇచ్చారు. ఖనిజాలు, ఎరువులతోపాటు టన్నెల్ బోరింగ్ మెషిన్ల అవసరం ఉందని జైశంకర్ చెప్పగా, వాంగ్ యీ వెంటనే సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.‘‘తైవాన్పై మా వైఖరిలో మార్పు లేదు’’ తైవాన్ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని భారత ప్రభుత్వ వర్గాలు మంగళవారం తేల్చిచెప్పాయి. వాంగ్తో సమావేశమైనప్పుడు చైనాలో తైవాన్ అంతర్భాగం అని జైశంకర్ వ్యాఖ్యానించినట్లు చైనా విదేశాంగ శాఖ పొరపాటున తెలియజేసింది. దీనిపై భారత ప్రభుత్వ వర్గాలు తాజాగా స్పష్టతనిచ్చాయి. ప్రపంచంలోని ఇతర దేశాల తరహాలోనే తైవాన్తో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నాయి. తైవాన్తో భారత్కు చక్కటి సంబంధాలు ఉన్నట్లు వెల్లడించాయి. భారత్ – చైనా సంబంధాలు పైపైకి: మోదీ భారత్–చైనా మధ్య సంబంధాలు స్థిరంగా పురోగమిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పరస్పర ప్రయోజనాలను, అవసరాలను గౌరవించుకుంటూ ముందుకెళ్తున్నాయని తెలిపారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. భారత్–చైనా సంబంధాలపై వారు మాట్లాడుకున్నారు. అనంతరం మోదీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గత ఏడాది అక్టోబర్లో రష్యాలోని కజన్ సిటీలో చైనా అధినేత జిన్పింగ్తో భేటీ అయ్యానని, అప్పటి నుంచి భారత్–చైనా సంబంధాలు వేగం పుంజుకున్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల నడుమ స్థిరమైన, నిర్మాణాత్మక సంబంధ బాంధవ్యాల వల్ల ఆసియాతోపాటు ప్రపంచంలో శాంతి, సౌభాగ్యం నెలకొంటాయని మోదీ స్పష్టంచేశారు. -
ప్రజల నడ్డి విరిచే పన్నులు ఎత్తివేయాలి
సాక్షి, హైదరాబాద్: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) స్లాబ్లో రద్దు లేదా మార్పు ద్వారా ప్రజలకు నిజమైన దీపావళి అందిస్తామని ప్రచారం చేసుకుంటున్న ప్రధాని నరేంద్రమోదీకి చిత్తశుద్ధి ఉంటే పెట్రో «ఉత్పత్తుల ధరలు తగ్గించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. బుధవారం జరిగే జీఎస్టీ జాతీయ కౌన్సిల్ సమావేశ నేపథ్యంలో ప్రధానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలి ‘తెలంగాణలో చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేనేత ఉత్పత్తులపై పన్నులు ఉండకూడదని భావించాం. కానీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేనేత వ్రస్తాలపై తొలుత 5శాతం విధించి ఆ తర్వాత 12శాతానికి పెంచాలని నిర్ణయించింది. దేశవ్యాప్త వ్యతిరేకత వెల్లువెత్తడంతో 12శాతం పన్ను విధింపు నిర్ణయాన్ని వాయి దా వేశారు. చేనేతపై పన్ను విధింపును విరమించుకోవాలి. జీఎస్టీలోనీ 12శాతం స్లాబ్ ను రద్దు చేసి పేద, మధ్య తరగతి ప్రజ లకు మేలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మొత్తం జీఎస్టీ ద్వారా సమకూరే రూ.22 లక్షల కోట్లలో 12% స్లాబ్ వాటా కేవలం 5శాతం మాత్రమే. దశాబ్ద కాలంగా నిత్యావసరాలపై జీఎస్టీ విధించి సామాన్యుడి నడ్డి విరిచిన బీజేపీ ప్రభుత్వం స్లాబ్ రద్దు అంటూ లీకులు ఇస్తూ ప్రచారం చేసుకుంటోంది. పెట్రో, ఎల్పీజీ ధరలను తగ్గించాలి పెట్రో ఉత్పత్తులు, ఎల్పీజీ ధరలను తగ్గిస్తే పరోక్షంగా ఇతర నిత్యావసరాల ధరల భారం కూడా తగ్గుతుంది. సెస్సుల రూపంలో రాష్ట్రాల ఆదాయాన్ని దెబ్బకొట్టే కుట్రకు పాల్పడిన కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసింది. పెట్రో ఉత్పత్తులు, ఎల్పీజీ రేట్లను వెంటనే తగ్గించి సెస్సులను పూర్తిగా ఎత్తివేయాలి. జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు, విద్యకు సంబంధించిన ఫీజులు, కేన్సర్ చికిత్సకు అవసరమైన ఔషధాలపై విధిస్తున్న జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలి’అని ప్రధానికి రాసిన లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు.కాంగ్రెస్ సర్కారు ముక్కు నేలకు రాయాలి: కేటీఆర్ మహబూబ్నగర్ జిల్లాలోని అడ్డాకుల మండలం గుడిబండ పెద్దవాగుపై కాంగ్రెస్ కాంట్రాక్టర్ నిర్మించిన చెక్డ్యామ్ 2 నెలల్లోనే ఎందుకు కొట్టుకుపోయిందో సీఎం రేవంత్ సమాధానం చెప్పాలని కేటీఆర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల సంగతిని పక్కన పెడితే ఒక్క ఇటుక ముక్క కూడా సరిగా పేర్చలేని కాంగ్రెస్ ప్రభుత్వం ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలన్నారు.హైదరాబాద్లో శాంతిభద్రతలు క్షీణించాయ ని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. చందానగర్ నగల దుకాణంలో దోపిడీ, కూకట్పల్లిలో 12ఏళ్ల బాలిక దారుణ హత్య దిగజారిన శాంతిభద్రతలకు అద్దం పడుతున్నాయన్నారు. -
నెహ్రూ వల్ల రెండు సార్లు దేశ విభజన: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దివంగత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సొంత ప్రతిష్ట పెంచుకోవడానికి దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడ్డారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. పాకిస్తాన్తో నెహ్రూ కుదుర్చుకున్న సింధూ జలాల ఒప్పందంతో మనకు పూడ్చలేని నష్టం జరిగిందన్నారు. అప్పటి మంత్రివర్గాన్ని గానీ, పార్లమెంట్ను గానీ విశ్వాసంలోకి తీసుకోకుండా ఈ ఒప్పందంపై ఆమోదముద్ర వేశారని విమర్శించారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎన్డీఏ ఎంపీలకు మోదీ పిలుపునిచ్చారు.దేశానికి.. ప్రధానంగా రైతన్నలకు నష్టం చేకూర్చేలా నెహ్రూ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను తాము అధికారంలోకి వచి్చన తర్వాత నిలిపివేశామని గుర్తుచేశారు. నెహ్రూ నిర్వాకం వల్ల రెండుసార్లు దేశ విభజన జరిగిందన్నారు. ఒకసారి రాడ్క్లిఫ్ లైన్తో భారత్ను విభజించారని, సింధూ నదిని ముక్కలు చేసి దేశాన్ని మరోసారి విభజన తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. అధికార ఎన్డీయే తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సి.పి.రాధాకృష్ణన్ను ప్రధాని మోదీ మంగళవారం ఎన్డీయే ఎంపీలకు పరిచయం చేశారు. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ ఆధ్వర్యంలో రాధాకృష్ణన్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఏం చెప్పారంటే... రాద్ధాంతం ఎందుకని దబాయింపు ‘‘సింధూ నదిలో 80 శాతానికి పైగా నీటిని పాకిస్తాన్కే అప్పగించారు. మన రైతులను దగా చేశారు. అప్పటి జనసంఘ్ ఎంపీ అటల్ బిహారీ వాజ్పేయి సహా పలువురు పార్లమెంట్ సభ్యులు నెహ్రూ నిర్ణయాన్ని తప్పుపట్టారు. నిరసన వ్యక్తంచేశారు. దీనిపై పార్లమెంట్లో రెండు గంటలపాటు చర్చ జరిగింది. కొన్ని బకెట్ల నీరు పోతే రాద్ధాంతం ఎందుకని నెహ్రూ దబాయించారు. పైగా లద్ధాఖ్లో మన భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటే చూసీచూడనట్లు వదిలేశారు. అక్కడ గడ్డి పరక కూడా పెరగదని వ్యంగ్యంగా మాట్లాడారు. చేసిన పొరపాటును నెహ్రూ కొన్నిరోజులకు ఒప్పుకున్నారు. సింధూ నది జలాల ఒప్పందం కుదుర్చుకుంటే పాకిస్తాన్తో ఇతర సమస్యలు పరిష్కారం అవుతాయని భావించానని, కానీ, అలా జరగలేదని ఒక సహచరుడితో అన్నారు. నెహ్రూ హయాంలో చేసిన తప్పిదాలను సరి చేస్తున్నాం’’ అని అన్నారు. సరిపడా విదేశీ మారకద్రవ్య నిల్వలు ‘‘ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ ఇండియా క్రెడిట్ రేటింగ్ను ఇటీవల అప్గ్రేడ్ చేసింది. మన ఆర్థిక వ్యవస్థ ప్రగతికి ఇదొక నిదర్శనం. దీనివల్ల మన దేశానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయి. జీఎస్టీలో తదుపరి తరం సంస్కరణలు తీసుకొస్తామని, జీఎస్టీ రేట్లను సరళీకృతం చేస్తామంటూ ఎర్రకోట నుంచి చేసిన ప్రకటనను స్టాక్మార్కెట్ స్వాగతించింది. సెన్సెక్స్ వరుసగా రెండు రోజులు ర్యాలీ చేసింది. మన ఆర్థిక వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉంది. ప్రపంచంలోని అత్యంత రద్దీ ఎయిర్పోర్టుల్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. విదేశీ మారకద్రవ్య నిల్వలకు ఢోకా లేదు. సరిపడా నిల్వలు మన దగ్గర ఉన్నాయి’’ అని అన్నారు.రాజకీయాలతో రాధాకృష్ణన్ ఆడుకోలేదు ‘‘ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ను ఎంపిక చేయడం హర్షణీయం. ఆయన ఎంతో నిరాడంబరంగా జీవిస్తారు. దశాబ్దాలుగా ప్రజాసేవకు అంకితమయ్యారు. క్రీడల్లో ఆయనకు ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ రాజకీయాలతో ఏనాడూ ఆడుకోలేదు. రాధాకృష్ణన్తో నాకు నాలుగు దశాబ్దాలుగా అనుబంధం ఉంది. మాకు నల్లజుట్టు ఉన్నప్పటి నుంచి పరస్పరం మంచి పరిచయం ఉంది. ప్రజాసేవ అంటే ఆయనకు అమితమైన అనురక్తి. వివిధ స్థాయిలో ప్రజలకు సేవలందించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో రాధాకృష్ణన్ను గెలిపించాలని అన్ని రాజకీయ పారీ్టలకూ విజ్ఞప్తి చేస్తున్నా. ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకుందాం. అందుకు సహకరించాలని ప్రతిపక్షాలను కోరుతున్నా’’ అని అన్నారు. -
సీపీ రాధాకృష్ణన్కు మద్దతు కోరిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీకి దిగిన సీపీ రాధాకృష్ణన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్రధాని మోదీ కోరారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ.. సీపీ రాధాకృష్ణన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్రతిపక్షాలతో సహా అన్ని పార్టీలకు ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారని తెలిపారు.ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన సీపీ రాధాకృష్ణన్ను ఎన్డీఏ ఎంపీలు, ఫ్లోర్ లీడర్లు స్వాగతించారు. ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ను ఎంపిక చేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధానమంత్రి మోదీ.. సీపీ రాధాకృష్ణన్ పరిచయం చేశారు.ఎన్టీఏతో పాటు అన్ని పార్టీల ఎంపీలు ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్డీఏ నిర్ణయించిన అభ్యర్థికి ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘ఉపరాష్ట్రపతి ఎన్నికలో తాము రాధాకృష్ణన్కు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం. ఇది మన ప్రజాస్వామ్యానికి, మన దేశానికి, రాజ్యసభను నడపడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని’ ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
భారతీయులందరికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనలకు పెద్దపీట వేసే ప్రధాని మోదీ దేశ గగన్యాన్ కలలను సాకారంచేసే భారత వ్యోమగామి శుభాంశు శుక్లాను కలిసిన వేళ ఆనందంలో మునిగిపోయారు. రష్యా, అమెరికా మొదలు ఇస్రో, నాసా దాకా అన్ని రకాల వ్యోమగామి శిక్షణా వ్యయాలను భరించిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రధాని మోదీని కలిసిన వేళ శుభాంశు శుక్లా సైతం ఒకింత ఉది్వగ్నానికి లోనయ్యారు. అంతరిక్షకేంద్రంలో తాను అనుభవించి, గడించిన అది్వతీయ అనుభూతిని, అనుభవాన్ని చిన్న పిల్లాడిలా ఎంతో ఉత్సాహంతో ప్రధాని మోదీకి పూసగుచ్చినట్లు వివరించారు. ఈ అపురూప ఘట్టానికి ఢిల్లీలోని లోక్కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని అధికార నివాసం వేదికైంది. జూన్ 25 నుంచి జూలై 15వ తేదీదాకా యాగ్జియం–4 మిషన్ తరఫున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో గడిపిన భారత మొట్టమొదటి వ్యోమగామిగా చరిత్ర లిఖించాక తొలిసారిగా శుభాంశు శుక్లా ప్రధాని మోదీని సోమవారం కలిసి తన అనుభవాలను పంచుకున్నారు. ‘‘వ్యోమగామిగా మాత్రమే కాదు అవనికి ఆవల సైతం భారతీయులు తమ కలలను నెరవేర్చుకోగలరని నువ్వు నిరూపించావు. వాళ్లకు స్ఫూర్తిగా నిలిచావు’’అని శుక్లాను మోదీ పొగిడారు. శుక్లా చెప్పిన ప్రతి విషయాన్ని మోదీ ఎంతో శ్రద్ధగా ఆలకించారు. భారత త్రివర్ణ పతాకాన్ని ఐఎస్ఎస్లో రెపరెపలాడించినందుకు శుభాంశును మోదీ మనసారా అభినందించారు. వ్యోమగామి ప్రత్యేక జాకెట్ ధరించి వచ్చిన శుభాంశు కలవగానే కరచాలనం చేసి మోదీ ఆయనను ఆతీ్మయంగా హత్తుకున్నారు. శెభాష్ అంటూ భుజం తట్టారు. కొద్దిసేపు హాల్లో నడుస్తూ మాట్లాడారు. తర్వాత కూర్చుని శుక్లా సవివరంగా తన అంతరిక్ష యాత్ర వివరాలను మోదీకి తెలియజేశారు. ట్యాబ్లో పలు అంశాలను సోదాహరణంగా వివరించారు. ఆ తర్వాత మోదీకి రెండు బహుమతులను బహూకరించారు. ఐఎస్ఎస్కు వెళ్లినప్పుడు తన వెంట తీసుకెళ్లి తిరుగుపయనం వేళ మళ్లీ వెంట తీసుకొచ్చిన త్రివర్ణ పతాకాన్ని మోదీకి శుభాంశు బహూకరించారు. తర్వాత శుక్లాతో భేటీ వివరాలను ప్రధాని తన సామాజికమాధ్యమం ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్చేశారు. ‘‘శుభాంశు శుక్లాతో భేటీ అద్భుతంగా సాగింది. అంతరిక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రయోగాలు మొదలు అక్కడి సహచరుల తోడ్పాటు, అక్కడి ప్రయోగాల సత్ఫలితాలు, శాస్త్ర, సాంకేతికతల పురోభివృద్ధి, భారత ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్ ప్రాజెక్ట్ వివరాలపై ఎన్నో విషయాలు నాతో పంచుకున్నారు. ఐఎస్ఎస్లో గడిపి, ఆయన చేసిన ప్రయోగాలతో శుక్లాను చూసి భారత్ గర్వపడుతోంది’’అని మోదీ వ్యాఖ్యానించారు. శుక్లా ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు జూన్ 29వ తేదీన మోదీతో వర్చువల్గా మాట్లాడారు. ‘‘ఐఎస్ఎస్లో గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తుంచు కో. అక్కడి వాతావరణం, ప్రయోగశాల స్థితిగతులు, ప్రయోగాలు చేసే విధానం.. ఇలా ప్రతీది తర్వాత దేశీయంగా భారత్ చేపట్టే సొంత అంతరిక్ష ప్రయోగాలకు అక్కరకొస్తుంది’’అని శుక్లాకు మోదీ సూచించడం తెల్సిందే. ఇదే విషయా న్ని శుక్లా రెండు వారాల క్రితం గుర్తుచేసుకున్నారు. ‘‘ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు మోదీ నాకు ఇచ్చిన హోమ్వర్క్ నాకు బాగా గుర్తుంది. ఆ హోమ్వర్క్ను చాలా బాగా పూర్తిచేశా. ఐఎస్ఎస్లో నేను చేసిందంతా మళ్లీ ప్రధానికి చెప్పేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. ఐఎస్ఎస్లో నేను గడించిన అనుభవం మన గగన్యాన్ మిషన్కు ఎంత కీలకమో నాకు బాగా తెలుసు’’అని శుక్లా గతంలో చెప్పారు. -
జీఎస్టీ కొత్త రూపు
ఎనిమిదేళ్ల క్రితం అమల్లోకొచ్చిన సరుకులు, సేవల పన్ను (జీఎస్టీ) ఎట్టకేలకు వచ్చే దీపావళి నాటికి కొత్త రూపాన్ని సంతరించుకోబోతోంది. మొన్న శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుపై నుంచి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ చల్లని కబురందించారు. 2016లో లోక్సభ 122వ రాజ్యాంగ సవరణను ఆమోదించి జీఎస్టీకి మార్గం సుగమం చేయటానికి ముందు పదిహేనేళ్లపాటు ఈ ఏకీకృత పన్నుల వ్యవస్థపై చర్చోపచర్చలు జరిగాయి. రాష్ట్రాలను ఒప్పించేందుకు అంతకు ముందున్న ఎన్డీయే సర్కారు, తర్వాత వచ్చిన యూపీఏ ప్రభుత్వం ఎడతెగని ప్రయత్నాలు చేశాయి. కానీ ఏకాభిప్రాయం కుదరలేదు. చివరకు 2017లో అమల్లోకి వచ్చినప్పుడు సైతం విపక్ష రాష్ట్రాలు రుసరుసలుపోయాయి. ఇంత పెద్ద సంస్కరణలో తన పాత్ర ఘనం అని చెప్పుకోవటానికైనా పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగే ఉత్సవానికి వెళ్లాలని కాంగ్రెస్ అనుకుంది. కానీ చివరకు ముఖం చాటేసింది. జీఎస్టీ విషయంలో వివిధ వర్గాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోలేదని, చిన్న వ్యాపారులూ వర్త కులూ దీనివల్ల అగచాట్లు పడతారని కారణాలుగా చూపింది. వామపక్షాలు సరేసరి. నిజాలు నిష్టూరంగానే ఉంటాయి. జీఎస్టీ రాకతో కేంద్రం విధిస్తున్న ఏడెనిమిది రకాల పన్నులు రద్దుకావటంతో పాటు రాష్ట్రాలు విధించే రకరకాల పన్నులకు స్వస్తి చెబుతామని, పన్ను వసూళ్లను హేతుబద్ధీకరిస్తామని అప్పట్లో ప్రకటించారు. ఇందువల్ల ఆదాయం కోల్పోతామన్న రాష్ట్రాల ఆందోళనను ఉపశమింపజేసేందుకు అయిదేళ్లపాటు ఆ లోటును పూడుస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ ఆచరణలో సమస్యలెలా వస్తాయో తెలియాలంటే ఇటీవల కర్ణాటకలో చిన్న వ్యాపారులు పడిన అగచాట్లను ప్రస్తావించుకోవాలి. వివిధ రకరకాల యాప్ల ద్వారా వినియోగ దారుల నుంచి చెల్లింపులు స్వీకరిస్తున్న తోపుడు బండి వ్యాపారులనూ, వీధుల్లో చిన్నా చితకా దుకాణాలు నడుపుకునేవారినీ లక్ష్యంగా చేసుకుని జీఎస్టీ నిబంధనలు ఉల్లంఘించారంటూ అక్కడి వాణిజ్య పన్నుల విభాగం 13,000 నోటీసులు జారీచేసింది. వీటికి ఏం జవాబివ్వాలో, ఎవరిని ఆశ్రయించాలో కూడా తెలియక, అందుకయ్యే ఖర్చు భరించలేక చాలామంది నగదు చెల్లించాలని వినియోగదారుల్ని కోరటం మొదలుపెట్టారు. వాజపేయి హయాంలో నాటి ఆర్థిక మంత్రి జశ్వంత్సింగ్కు సలహాదారుగా వ్యవహరించిన విజయ్ కేల్కర్ ఈ జీఎస్టీ ఆలోచనకు ఆద్యుడు. ఆయన ఆధ్వర్యంలోని టాస్క్ఫోర్స్ పలు దేశాల పన్ను వ్యవస్థలను అధ్యయనం చేసి దీన్ని రూపొందించింది. మధ్యతరగతి, అట్టడుగువర్గాలవారు పన్నుపోటు నుంచి ఉపశమనం పొందుతారని చెప్పింది. కానీ జరిగిందంతా వేరు. పరోక్ష పన్నులు చెల్లించేవారి నుంచి మరింత పిండుకోవడానికే జీఎస్టీ తీసుకొస్తున్నారని, ప్రత్యక్ష పన్నుల జోలికి వెళ్లాలన్న ఆలోచనే కేంద్రం చేయటం లేదని విమర్శలొచ్చాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ. 11.7 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లుండగా ఇప్పుడది దాదాపు రెట్టింప యింది. సగటున ప్రతి నెలా రూ. 2 లక్షల కోట్ల ఆదాయం వస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ సాధారణ వర్గాల అవస్థలు అంతకంతా పెరిగాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు, ఇంకా ఆ దిగువనుండేవారూ జీఎస్టీ కింద దాఖలు చేయాల్సిన రకరకాల పత్రాలు, వివాదాలు, ప్రభుత్వం నుంచి వెనక్కు రావలసిన సొమ్ము కోసం పడి గాపులు... వీటన్నిటితో విసిగిపోయారు. ఈ సంక్లిష్ట వ్యవస్థను సంతృప్తిపరిచే మార్గం దొరక్క అల్లాడిపోయారు. ఈ ప్రత్యక్ష పన్నుల వ్యవస్థ ద్వారా వసూళ్లు భారీగా పెరుగుతుంటే, ప్రత్యక్ష పన్నులు చెల్లించే కార్పొరేట్ల నుంచి రావాల్సిన ఆదాయం పడిపోవటం ఒక వైచిత్రి. 2023 –24లో వివిధ రకాల ప్రోత్సాహాల కింద దాదాపు లక్ష కోట్ల రూపాయల పన్ను రాయితీలు ఇచ్చామని ఇటీవల పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.జీఎస్టీ సరికొత్త రూపంలో రాబోవటం అన్ని వర్గాలకూ శుభవార్త. ప్రస్తుతం 5, 12, 18, 28 శాతాలుగా ఉన్న నాలుగు స్లాబ్ల స్థానంలో ఇకపై రెండే... 5, 18 శాతాలు ఉంటాయని కేంద్రం చెబుతోంది. లగ్జరీ కార్ల వంటి విలాస వస్తువుల పైనా... పొగాకు, పాన్మసాలా, ఆన్లైన్ గేమింగ్ వంటి హానికారకాల పైనా మాత్రం 40 శాతం వరకూ ఉంటుంది. జీఎస్టీ వసూళ్లు స్థిరత్వంలో పడటం వల్ల సాధారణ ప్రజానీకాన్ని పన్నుపోటు నుంచి తప్పించాలని భావించినట్టు కనబడుతున్నా, ఇంతకాలమూ ఈ పరిధిలో లేని మద్యం, ఇంధనం వంటివాటిని చేర్చబోతున్నారని అంటున్నారు. సహజంగానే దీనిపై రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా ప్రపంచమంతటా ఒకరకమైన మాంద్యం అలుముకున్న వర్తమానంలో జీఎస్టీ సంస్కరణలు మన ఆర్థికవ్యవస్థకు ఊతాన్నివ్వగలవనీ, ఈ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలూ చాలావరకూ తగ్గుతాయనీ ఆశించాలి. -
ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్
మాస్కో: అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (valdimir Putin) మధ్య ఉక్రెయిన్ యుద్ధం ముగించే విషయంపై చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వ్లాదిమిర్ పుతిన్ తనకు ఫోన్ చేసినట్లు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో‘ఇటీవల అలాస్కాలో ట్రంప్తో జరిగిన సమావేశం గురించి ఫోన్లో మాట్లాడి, తన అభిప్రాయాలను పంచుకున్నారు. నా స్నేహితుడు పుతిన్కు ధన్యవాదాలు. ఉక్రెయిన్ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భారత్ నిరంతరం కోరుకుంటుంది.ఈ విషయంలో జరుగుతున్న అన్నీ ప్రయాత్నాలకు భారత్ మద్దతు పలుకుతుంది’అని పేర్కొన్నారు. ఫిబ్రవరి 2022 నుండి కొనసాగుతున్న ఉక్రెయిన్పై కొనసాగుతున్న రష్యా యుద్ధంపై ప్రపంచ దేశాల ఎదుట భారత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.యుద్ధాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని, ఈ విషయంలో భారత్ తన పూర్తి మద్దతును అందిస్తుందని ప్రధాని కార్యాలయంలో విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. Thank my friend, President Putin, for his phone call and for sharing insights on his recent meeting with President Trump in Alaska. India has consistently called for a peaceful resolution of the Ukraine conflict and supports all efforts in this regard. I look forward to our…— Narendra Modi (@narendramodi) August 18, 2025 -
జీఎస్టీ సంస్కరణలే దిక్సూచి
స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దీపావళికల్లా వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)లో భారీ సంస్కరణలకు తెరతీయనున్నట్లు ప్రకటించడం దేశీయంగా సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోపక్క గత వారం ఎస్అండ్పీ రెండు దశాబ్దాల తదుపరి దేశ సావరిన్ రేటింగ్ను అప్గ్రేడ్ చేయడం ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు తెలియజేశారు. అయితే ఉక్రెయిన్, తదితర అంశాలపై ట్రంప్, పుతిన్ సమావేశం ఎటూ తేల్చకపోవడంతో అంతర్లీనంగా అనిశ్చితి సైతం కనిపించనున్నట్లు విశ్లేషించారు. వివరాలు చూద్దాం... రానున్న దీపావళికల్లా జీఎస్టీలో శ్లాబులను, రేట్లను కనిష్టానికి సవరించనున్నట్లు ప్రధాని మోడీ పేర్కొనడంతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్ లభించనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. గత 8 ఏళ్లుగా అమలు చేస్తున్న జీఎస్టీలో భారీ సంస్కరణలను తీసుకురానున్నట్లు ప్రధాని తెలియజేశారు. జీఎస్టీ నిబంధనల అమలు, పన్ను ఎగవేతలు, వివాదాలు ముసురుగొనడం వంటి సవాళ్లకు చెక్ పెట్టే బాటలో శ్లాబులను, రేట్లను తగ్గించనున్నట్లు సంకేతమిచ్చారు. దీంతో స్టాక్ మార్కెట్లో సెంటిమెంటు బలపడే వీలున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. సరైన సమయంలో జీఎస్టీ 2.0కు తెరతీయనుండటంతో దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ లభించనున్నట్లు ఈవై ఇండియా ట్యాక్స్ పార్ట్నర్ సౌరభ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రపంచవ్యాప్త వాణిజ్య ఆందోళనల మధ్య ఇవి కేవలం విధానపరమైన మార్పులు కాదని, అత్యంత ఆవశ్యకమైన నిర్మాణాత్మక సంస్కరణలని పేర్కొన్నారు. జీఎస్టీలో సంస్కరణల కారణంగా వర్కింగ్ క్యాపిటల్ సమస్యలు పరిష్కారంకావడంతోపాటు.. పోటీ ప్రపంచంలో ఎగుమతులకు దన్ను లభించనున్నట్లు వివరించారు. జెలెన్స్కీతో ట్రంప్ భేటీ కీలకం..కొన్ని నెలలుగా రష్యా– ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధ పరిస్థితులకు చెక్ పెట్టే బాటలో గత వారాంతాన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ సమావేశమైన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమైంది. అయితే సమావేశ వివరాలు వెల్లడికానప్పటికీ.. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో ట్రంప్ భేటీపై మార్కెట్లు దృష్టిపెట్టనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్పై 25 శాతం అదనపు సుంకాలను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు తెలియజేశారు. అయితే ముందు ప్రకటించినట్లు ఈ నెల 27నుంచి కొత్త టారిఫ్లు అమలుకాకపోవచ్చని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ అభిప్రాయపడ్డారు. ఇది మార్కెట్లలో సానుకూలతకు దోహదపడే వీలున్నట్లు అంచనా వేశారు. ఫెడ్ మినిట్స్ ఈ వారం యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ గత పాలసీ సమీక్షా నిర్ణయాల వివరాలు(మినిట్స్) వెల్లడికానున్నాయి. ఫండ్స్ రేట్లను 4.25–4.5 శాతంగా కొనసాగించేందుకే ఫెడ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరోపక్క చైనా కేంద్ర బ్యాంకు 1–5 ఏళ్ల కాలావధి రుణాలపై వడ్డీ రేట్లను ప్రకటించనుంది. ఇవికాకుండా యూఎస్ హౌసింగ్ గణాంకాలు తదితరాలు వెలువడనున్నాయి. దేశీయంగా హెచ్ఎస్బీసీ తయారీ, సరీ్వసుల పీఎంఐ ఇండెక్స్లను ప్రకటించనున్నారు. వీటితోపాటు.. దేశీ స్టాక్స్లో విదేశీ ఇన్వెస్టర్ల తీరు, డాలరు మారకం, ముడిచమురు ధరలు వంటి అంశాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు తెలియజేశారు. వెరసి కన్సాలిడేషన్ బాటలో సాగుతున్న మార్కెట్లు ఈ వారం ఆటుపోట్ల మధ్య కదిలే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.రేటింగ్ ఎఫెక్ట్ గత వారం రేటింగ్ దిగ్గజం ఎస్అండ్పీ సుమారు 18 ఏళ్ల తరువాత దేశ సావరిన్ క్రెడిట్ రేటింగ్ను అప్గ్రేడ్ చేసింది. స్థిరత్వంతోకూడిన ఔట్లుక్తో బీబీబీ రేటింగ్ను ప్రకటించింది. పటిష్ట ఆర్థిక పురోభివృద్ధి, ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వ కట్టుబాటు, ద్రవ్యోల్బణ అదుపునకు ఆర్బీఐ అనుసరిస్తున్న సానుకూల పరపతి విధానాలు ఇందుకు పరిగణనలోకి తీసుకున్నట్లు ఎస్అండ్పీ వివరించింది. వెరసి ఇన్వెస్టర్లకు జోష్ లభించనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు తెలియజేశారు.గత వారమిలా.. నాలుగు రోజులకే పరిమితమైన గత వారం(11–14) ట్రేడింగ్లో ఎట్టకేలకు 6 వారాల వరుస నష్టాలకు చెక్ పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 740 పాయింట్లు(0.9 శాతం) పుంజుకుని 80,598 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 268 పాయింట్లు(1.1 శాతం) ఎగసి 24,631 వద్ద ముగిసింది. అయితే బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.2 శాతం, స్మాల్ క్యాప్ 0.6 శాతం చొప్పున క్షీణించాయి.సాంకేతికంగా చూస్తే.. ఆరు వారాల తదుపరి మార్కెట్లు గత వారం సానుకూలంగా ముగిసినప్పటికీ నష్టాల నుంచి బయటపడిన సంకేతాలు పూర్తిగా వెలువడనట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా మరో రెండు వారాలు కన్సాలిడేషన్ కొనసాగవచ్చని అంచనా వేశారు. వీరి విశ్లేషణ ప్రకారం ఈ వారం మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి సాంకేతికంగా తొలుత 24,450 పాయింట్ల వద్ద బలమైన మద్దతు లభించవచ్చు. ఇలాకాకుండా 24,700ను దాటి బలపడితే.. 24,800 వద్ద, 25,000 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. అమ్మకాలు అధికమై 24,450 దిగువకు చేరితే 24,000 సమీపానికి చేరే అవకాశముంది.ఎఫ్పీఐల అమ్మకాల స్పీడ్ఈ నెలలో రూ. 21,000 కోట్లు వెనక్కి ఇటీవల దేశీ స్టాక్స్లో నిరవధిక విక్రయాలకు పాల్పడుతున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) ఈ నెలలో ఇప్పటివరకూ(1–14) రూ. 21,000 కోట్ల పెట్టుబడులను నికరంగా వెనక్కి తీసుకున్నారు. యూఎస్ వాణిజ్య సుంకాల భారం, తొలి త్రైమాసిక ఫలితాల నిరుత్సాహం, రూపాయి బలహీనత ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఈ కేలండర్ ఏడాదిలో ఇప్పటివరకూ దేశీ ఈక్విటీల నుంచి రూ. 1.16 లక్షల కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం జూలైలోనూ ఎఫ్పీఐలు నికరంగా రూ. 17,741 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. మార్చి– జూన్మధ్య కాలంలో రూ. 38,673 కోట్లు ఇన్వెస్ట్ చేశారు! – సాక్షి, బిజినెస్ డెస్క్ -
రాజ్యాంగ స్ఫూర్తిని ధ్వంసం చేసి డ్రామాలా?
న్యూఢిల్లీ: ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘అధికారంలో ఉండగా రాజ్యాంగ స్ఫూర్తిని ధ్వంసం చేసి, చట్టాలను కాలరాసి, అంబేడ్కర్ ఆశయాలను పాతర వేసినవారే నేడు అదే రాజ్యాంగ ప్రతులను తలపై పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారు. డ్రామాలాడుతున్నారు’’ అని మండిపడ్డారు. రూ.11,000 కోట్లతో నిర్మించిన ద్వారకా ఎక్స్ప్రెస్ వే, అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్డును ఆదివారం ఢిల్లీలో ఆయన ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ఢిల్లీ, పొరుగు రాష్ట్రాలైన హరియాణా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి రావడాన్ని విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. ‘‘సామాజిక న్యాయం గురించి పెద్ద మాటలు చెబుతున్న విపక్షాలు అధికారంలో ఉండగా బడుగు బలహీన వర్గాలను దగా చేసే చట్టాలు, నిబంధనలు తెచ్చాయి. ఆ తిరోగమన చట్టాలను వందలాదిగా రద్దు చేస్తున్నాం’’ అని మోదీ వివరించారు.‘వికసిత్’ నమూనాగా ఢిల్లీ ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ ప్రజలు బీజేపీ భుజాలపై పెద్ద బాధ్యత పెట్టారని మోదీ అన్నారు. వారి ఆకాంక్షలు నెరవేర్చేలా ఆ రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాలు పని చేస్తున్నాయని వివరించారు. ‘‘కొన్ని పార్టీలు ప్రజాతీర్పును ఇప్పటికీ అంగీకరించలేకపోతున్నాయి. ప్రజల విశ్వాసానికి, క్షేత్రస్థాయి వాస్తవాలకు దూరంగా బతుకుతున్నాయి. ఢిల్లీలో ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా కొన్ని నెలల క్రితం పెద్ద కుట్రలు జరిగాయి. ఢిల్లీకి వచ్చే తాగు నీటిలో హరియాణా ప్రజలు విషం కలిపారంటూ తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. ఆ ప్రతికూల రాజకీయాల నుంచి ఢిల్లీవాసులకు స్వేచ్ఛ లభించింది. వికసిత్ భారత్కు ఢిల్లీని ఆదర్శ నమూనాగా తీర్చిదిద్దుతాం’’ అన్నారు. జీఎస్టీలో అత్యాధునిక సంస్కరణల రూపంలో దీపావళికి దేశవాసులకు డబల్ బోనస్ దక్కనుందని శ్లాబుల తగ్గింపును ఉద్దేశించి పునరుద్ఘాటించారు. జీఎస్టీ సంస్కరణలకు సహకరించాలని ప్రజలను కోరారు. వాటితో పేదలు, మధ్య తరగతి ప్రజలతోపాటు చిన్న, పెద్ద వ్యాపారాలకు మేలు జరుగుతుందన్నారు. -
బీజేపీ కీలక సమావేశం.. ఉపరాష్ట్రపతి రేసులో రాజ్నాథ్, లక్ష్మణ్..
సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికపై అధికార బీజేపీ దృష్టి పెట్టింది. తమ అభ్యర్థిని సాధ్యమైనంత త్వరగా ఖరారు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆదివారం భేటీ కానుంది. సాయంత్రం ఆరు గంటలకు పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక బాధ్యతలను ఎన్డీయే అప్పగించింది. పార్టీ అభ్యర్థి పేరుపై ఈ సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 4న ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ ఆకస్మికంగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.అభ్యర్థి ఎంపిక పరిశీలనలో పేర్లు ఇవే..ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక పరిశీలనలో కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్, జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా, మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణ, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత, ఆర్ఎస్ఎస్ నేత శేషాద్రి చారి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఉన్నట్టు పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. సెప్టెంబర్ 9న కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. ఆగస్టు 21తో నామినేషన్ల గడువు ముగియనుంది. లోక్సభ, రాజ్యసభలో కలిపి మొత్తం 781 మంది సభ్యులు కలిగిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికలో నెగ్గాలంటే కనీసం 391 ఓట్లు అవసరం. 422 మంది ఎంపీల బలం కలిగిన అధికార ఎన్డీయేకు స్పష్టమైన విజయావకాశాలు ఉన్నాయి. మరోవైపు విపక్ష ‘ఇండియా’ కూటమి సైతం తమ ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. -
భారత్కు మరో షాకిచ్చిన అమెరికా.. ట్రంప్ ప్లాన్ అదేనా?
ఢిల్లీ: భారత్, అమెరికా మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వాణిజ్య చర్చల కోసం భారత్కు రావాల్సిన అమెరికా బృందం ట్విస్ట్ ఇస్తూ.. తమ పర్యటనను రద్దు చేసుకుంది. ఈ మేరకు పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. దీంతో, వారి తదుపరి పర్యటనపై సస్పెన్స్ నెలకొంది.వివరాల ప్రకారం.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కారణంతో భారత్పై అమెరికా భారీగా సుంకాల భారాన్ని మోపింది. ట్రంప్ ఇటీవల భారత్పై 50శాతం సుంకాలు విధించారు. పాత 25శాతం సుంకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. అదనపు 25% టారిఫ్లు ఈ నెల 27ను అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో సుంకాలు అమలులోకి రాకముందే.. అమెరికాతో వాణిజ్య చర్చలు జరిపి మధ్యంతర ఒప్పందం చేసుకోవాలని ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.🚨 US trade team CALLS OFF Aug 25–29 Delhi visit for trade talks. pic.twitter.com/TOVBv10nwZ— Beats in Brief 🗞️ (@beatsinbrief) August 16, 2025ఈ క్రమంలో దీనికి సంబంధించి ఇప్పటికే ఇరు దేశాల ప్రతినిధుల మధ్య ఐదు దఫాలు చర్చలు జరిగాయి. ఆరో దఫా చర్చలకు అమెరికా ప్రతినిధులు ఈ నెల 25-29 మధ్య భారత్లో పర్యటించాల్సి ఉంది. ఈ దఫా చర్చల్లో భాగంగా.. వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాలకు సంబంధించిన చిక్కుముడులు వీడే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే, తాజాగా వారు ఆ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. చర్చలకు సంబంధించిన తదుపరి తేదీలను కూడా వారు వెల్లడించలేదు. దీంతో, మరోసారి ఇరు దేశాల మధ్య చర్చలు ఉంటాయా? లేదా? అనే సందిగ్థత నెలకొంది. ఒకవేళ చర్చలు విఫలమైతే.. భారత్పై టారీఫ్ల భారం పడే అవకాశం ఉంది. కాగా, భారత్పై సుంకాలు విధించాలనే ఆలోచనతోనే ట్రంప్ ఇలా ప్లాన్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా, భారత్ను టార్గెట్ చేసి ట్రంప్ సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ దేశ ప్రజలకు సూచనలు చేశారు. రైతుల ప్రయోజనాలపై ఎన్నటికీ రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆయన మరోసారి అమెరికాలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ట్రంప్తో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య చర్చలు సఫలం అవుతాయా? అని అందరూ ఆసక్తికంగా ఎదురుచూస్తున్నారు. -
నేడు ఢిల్లీలో ప్రధాని మోదీ..
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రవాణా సౌకర్యాలకు కొత్త ఊపిరి పోసే రెండు కీలక జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీలోని రోహిణిలో రూ.11 వేల కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయనున్నారు. అనుసంధానత మెరుగు ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ భారాన్ని తగ్గించడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సమగ్ర ప్రణాళికలో భాగంగా ద్వారకా ఎక్స్ప్రెస్ వే, అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్–2 (యూఈఆర్–2) ప్రాజెక్టులను చేపట్టారు. ప్రపంచ స్థాయి రవాణా సదుపాయాలు, మలీ్ట–మోడల్ కనెక్టివిటీ కలి్పంచడమే వీటి ప్రధాన ఉద్దేశం. ద్వారకా ఎక్స్ప్రెస్ వేపై దాదాపు రూ.5,360 కోట్లతో 10.1 కిలోమీటర్ల ఢిల్లీ భాగం అభివృద్ధి చేశారు. ప్యాకేజీ–1 కింద శివమూర్తి కూడలి నుంచి ద్వారకా సెక్టార్–21 ఆర్యూబీ వరకు (5.9 కి.మీ), ప్యాకేజీ–2 కింద ద్వారకా సెక్టార్–21 ఆర్యూబీ నుంచి ఢిల్లీ–హరియాణా సరిహద్దు వరకు (4.2 కి.మీ) నిర్మాణం చేశారు. ఇది యశోభూమి, డీఎంఆర్సీ బ్లూ, ఆరెంజ్ లైన్లు, కొత్తగా వచ్చే బిజ్వాసన్ రైల్వే స్టేషన్, ద్వారకా బస్ డిపోలతో నేరుగా అనుసంధానమవుతుంది. గత సంవత్సరం మార్చిలో హరియాణా విభాగంలోని 19 కి.మీ భాగాన్ని మోదీ ప్రారంభించారు. యూఈఆర్–2 ప్రాజెక్టు రూ.5,580 కోట్లతో యూఈఆర్–2లోని అలీపూర్–డిచాన్ కలాన్ రహదారితో పాటు, బహదూర్గఢ్, సోనిపట్లకు కొత్త లింక్ రోడ్లు కూడా ప్రజల వినియోగానికి అందించనున్నారు. ఇవి ఢిల్లీ ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు, ముకర్బా చౌక్, ధౌలా కువాన్, ఎన్హెచ్–09 వంటి రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తాయి. అంతేగాక పరిశ్రమల మధ్య అనుసంధానాన్ని పెంచడంతో పాటు ఎన్సీఆర్లో రవాణా వేగవంతం అవుతుంది. ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా రోహిణిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. -
నేడు స్వదేశానికి శుభాంశు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో గడిపి చరిత్ర సృష్టించిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఆదివారం అమెరికా నుంచి స్వదేశానికి రానున్నారు. యాగ్జియం–4 మిషన్ కోసం అమెరికాలో గత ఏడాదిగా శిక్షణ పొందిన శుక్లా ముందుగా ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకుంటారు. అనంతరం, యూపీలోని సొంతూరు లక్నోకు బయలుదేరి వెళతారు. ఆ తర్వాత అక్టోబర్లో మొదలయ్యే గగన్యాన్ మిషన్ శిక్షణలో పాల్గొంటారు. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి జూన్ 25న నింగిలోకి దూసుకెళ్లిన యాగ్జియం–4 మిషన్లోని నలుగురు వ్యోమగాముల్లో శుభాంశు శుక్లా ఒకరు. జూన్ 26వ తేదీ నుంచి ఐఎస్ఎస్లో పలు ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసుకుని, తిరిగి జూలై 15న భూమిపైకి చేరుకున్నారు. శనివారం శుభాంశు విమానంలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను ఇన్స్టాలో షేర్ చేశారు. ‘నేను స్వదేశానికి చేరుకునేందుకు విమానంలో కూర్చు న్నప్పుడు, మిశ్రమ భావోద్వేగాలు కలిగాయి. గత ఏడాదికాలంలో నా స్నేహితులు, కుటుంబసభ్యులుగా ఉన్న అద్భుతమైన వ్యక్తులను విడిచిపెట్టాల్సి వస్తున్నందుకు ఓ వైపు బాధ, మిషన్ తర్వాత మొదటిసారిగా నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, దేశంలోని ప్రతి ఒక్కరినీ కలవబోతున్నందుకు మరో వైపు ఉత్సాహం ఉన్నాయి. జీవితం అంటే ఇదేనేమో అని అనుకుంటున్నాను’అని శుక్లా పేర్కొన్నారు. శుక్రవారం హూస్టన్లోని భారత కాన్సులేట్లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో శుక్లాతోపాటు వ్యోమగామిగా ఎంపికైన ప్రశాంత్ నాయర్ కూడా పాల్గొన్నారు. -
నా దేశం.. శత్రుదుర్భేద్యం!
శ్రీకృష్ణుడి ఆయుధమైన సుదర్శన చక్రం స్ఫూర్తితో.. దేశానికి భద్రతా కవచాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 15న ప్రకటించారు. దీంతో ప్రపంచదేశాల దృష్టి ఒక్కసారిగా మనపై పడింది. నిజమే.. రక్షణ రంగంలో ఇప్పుడున్నది ఒకప్పటి భారత్ కాదు. గత పదేళ్లలోనే రక్షణ రంగంలో ఉత్పత్తుల విలువ పెరగడం.. దిగుబడులు తగ్గడమే ఇందుకు నిదర్శనం. అప్పట్లో మన ఆయుధాల్లో 65 శాతం దిగుమతులే. అది ఇప్పుడు 35 శాతానికి పరిమితం చేయగలిగాం. ‘మేడిన్ ఇండియా’ ఆయుధాలతో మన సత్తా ఏంటో ఇటీవలే ‘ఆపరేషన్ సిందూర్’తో ప్రపంచానికి చాటాం. – సాక్షి, స్పెషల్ డెస్క్త్వరలో దేశానికి సుదర్శన చక్ర రక్షణ వ్యవస్థ రానుంది. ఇందులో భాగంగా దేశంలోని కీలక ప్రాంతాలను గగనతల దాడుల నుంచి రక్షించేలా బహుళ అంచెల కవచాన్ని ఏర్పాటు చేయనున్నారట. అంతేకాదు, ప్రతిదాడి వ్యవస్థను కూడా రూపొందిస్తారు. యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టం వంటి వాటితో ఇది ఇజ్రాయెల్ ఐరన్డోమ్ తరహాలో పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్షణ ఉత్పత్తుల్లో మన దేశం స్వయం సమృద్ధి దిశగా పయనిస్తోందనడానికి ప్ర‘బల’ నిదర్శనం. ఉత్పత్తుల్లో రికార్డు2013–14లో దేశ రక్షణ రంగ బడ్జెట్ రూ.2.53 లక్షల కోట్లు. 2025–26లో అది 2.6 రెట్లు పెరిగి రూ.6.81 లక్షల కోట్లకు చేరింది. 2024–25లో మనదేశం రికార్డు స్థాయిలో రూ.2.09 లక్షల కోట్ల విలువైన 193 డిఫెన్స్ కాంట్రాక్టులు కుదుర్చుకుంది. ఇందులో రూ. 1.69 లక్షల కోట్ల విలువైన 177 కాంట్రాక్టులు దేశీయ సంస్థలవే కావడం గమనార్హం. 2014–15లో దేశ రక్షణ ఉత్పత్తుల విలువ రూ.46,429 కోట్లు. 2024–25లో ఇది రికార్డు స్థాయిలో రూ.1.50 లక్షల కోట్లకు చేరిందని ఇటీవల కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. అంటే మూడు రెట్లకుపైగా పెరిగింది! 2019–20లో ఇది కేవలం రూ.79,071 కోట్లే. అంటే 5 ఏళ్లలోనే దాదాపు రెట్టింపయిందన్నమాట. ఎగుమతుల జోరు» 2013–14లో రూ.686 కోట్లుగా ఉన్న మన రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు.. 2024–25 నాటికి ఏకంగా 34 రెట్లు పెరిగి రూ.23,622 కోట్లకు చేరాయి. ఈ ఎగుమతుల్లో రక్షణ రంగ సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థల వాటా 77 శాతం కాగా.. ప్రైవేటు రంగ వాటా 23 శాతం కావడం విశేషం. వీలైనంత త్వరలో రక్షణ పరికరాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. మనదేశ రక్షణ ఉత్పత్తులు అమెరికా, ఫ్రాన్స్ వంటి 100 దేశాలకు వెళ్తున్నాయి. అమెరికా వాటా 10% లోపే!గత దశాబ్దకాలంలో మనదేశ రక్షణ దిగుమతులు తగ్గుతూ వస్తున్నాయి. మనకు ప్రధాన ఎగుమతిదారులు రష్యా, ఫ్రాన్స్. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రి) గణాంకాల ప్రకారం.. » మన మొత్తం దిగుమతుల్లో సుమారు 40 శాతం రష్యా నుంచే వస్తున్నాయి. » 2020లో ఫ్రాన్స్ నుంచి దిగుమతులు 25 శాతానికిపైగా ఉంటే.. 2021లో ఏకంగా 50 శాతానికి పెరిగాయి. ఆతరవాత తగ్గుతూ 2024లో సుమారు 15 శాతానికి పరిమితమయ్యాయి.» మొత్తం దిగుమతుల్లో ఇజ్రాయెల్ నుంచి 2022 వరకు 10 శాతంగానే ఉన్న వాటా.. 2023లో ఒక్కసారిగా 40 శాతానికి చేరింది. 2024లో అది సుమారు 28 శాతానికి చేరింది. » 2020 నుంచి చూస్తే అమెరికా వాటా ఎప్పుడూ 20 శాతం కూడా దాటలేదు. ప్రస్తుతం 10 శాతంలోపే ఉంది.ఆ మూడు దేశాలే..మనదేశానికి యుద్ధ విమానాల సరఫరాలో ఫ్రాన్స్ కీలకపాత్ర పోషిస్తోంది. 2020–25 మధ్య రికార్డు స్థాయిలో 2,543 సరఫరా చేయగా, రష్యా నుంచి 1,280 దిగుమతి చేసుకున్నాం. ఇక మిసైళ్ల విషయానికొస్తే రష్యా నుంచి 1,149, ఇజ్రాయెల్ నుంచి 802 వచ్చాయి. శత్రువుల దాడులను తట్టుకోగలిగే దుర్భేద్యమైన రక్షణ వాహనాలు రష్యా నుంచి మాత్రమే 963 వచ్చాయి. గగన తల భద్రతా వ్యవస్థలు రష్యా నుంచి 390, ఇజ్రాయెల్ నుంచి 376 వచ్చాయి. ఫ్రాన్స్ నుంచి 899, రష్యా నుంచి 304 షిప్స్ దిగుమతి చేసుకున్నాం. ఏయే ఆయుధాల కోసం ప్రధానంగా ఏయే దేశాలపై ఆధారపడుతున్నామంటే..విమానాలు: ఫ్రాన్స్, రష్యా, అమెరికాగగనతల రక్షణ వ్యవస్థలు: రష్యా, ఇజ్రాయెల్దుర్భేద్యమైన రక్షణ వాహనాలు: రష్యామిసైళ్లు: రష్యా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్సెన్సర్లు: ఇజ్రాయెల్, జర్మనీ, ఫ్రాన్స్షిప్స్ : ఫ్రాన్స్, రష్యా -
ఘనంగా జన్మాష్టమి వేడుకలు.. ప్రధాని మోదీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జన్మాష్టమి సందర్బంగా ‘దహీ హండీ’ (ఉట్టికొట్టే ఉత్సవం) వేడుకలకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. #WATCH | Guajrat | Devotees take darshan of Lord Krishna and Goddess Radha at the ISKCON temple in Ahmedabad, on the occasion of Krishna Janmashtami pic.twitter.com/PM6mizJVgS— ANI (@ANI) August 16, 2025కృష్ణుడు వెన్న దొంగిలించినందుకు గుర్తుగా ఈ వేడుకలను నిర్వహిస్తుంటారు. దహి హండీ మహోత్సవంలో పాల్గొనేందుకు స్పానిష్ క్యాస్టెల్లర్ల బృందం ఇప్పటికే మహారాష్ట్ర చేరుకుంది.#WATCH | Guajrat | Devotees take darshan of Lord Krishna and Goddess Radha at the ISKCON temple in Ahmedabad, on the occasion of Krishna Janmashtami pic.twitter.com/PM6mizJVgS— ANI (@ANI) August 16, 2025మరోవైపు గుజరాత్లోని అహ్మదాబాద్లో గల ఇస్కాన్ ఆలయంలో భక్తులు శ్రీకృష్ణుడిని, రాధాదేవిని దర్శనం చేసుకునేందుకు తరలివస్తున్నారు. మధురలోని శ్రీ కృష్ణుని ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు.#WATCH | Guajrat | Devotees take darshan of Lord Krishna and Goddess Radha at the ISKCON temple in Ahmedabad, on the occasion of Krishna Janmashtami pic.twitter.com/PM6mizJVgS— ANI (@ANI) August 16, 2025ప్రధాని మోదీ ‘ఎక్స్’లో దేశ ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ..‘నమ్మకం, ఆనందం, ఉత్సాహం నడుమ జరిగే ఈ ఉత్సవం అందరి జీవితాల్లో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపాలని కోరుకుంటున్నాను.. జై శ్రీ కృష్ణ’అని రాశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు.सभी देशवासियों को जन्माष्टमी की असीम शुभकामनाएं। आस्था, आनंद और उमंग का यह पावन-पर्व आप सभी के जीवन में नई ऊर्जा और नए उत्साह का संचार करे। जय श्रीकृष्ण!— Narendra Modi (@narendramodi) August 16, 2025 -
ఎర్రకోట సాక్షిగా పాకిస్తాన్కు ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిక
-
సిందూర్లో స్వదేశీ సత్తా
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులను పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ ముష్కరులకు, వారి పోషకులకు తగిన బుద్ధి చెప్పడమే లక్ష్యంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు 100 రోజులు పూర్తయ్యాయి. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఈ ఆపరేషన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్వదేశీ ఆయుధాలు, రక్షణ వ్యవస్థలతో మనం విజయం సాధించామని చెప్పారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ఆయుధాల సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసొచ్చిందని అన్నారు. రక్షణ రంగంలో పూర్తి స్వావలంబన దిశగా ముందుకు సాగుతున్నామని వివరించారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్లో శత్రువుపై ఎక్కుపెట్టిన స్వదేశీ ఆయుధాలు ఏమిటో తెలుసుకుందాం.. డి–4 డ్రోన్ల విధ్వంసకారి డి–4 యాంటీ డ్రోన్ సిస్టమ్ను డీఆర్డీఓ అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థ ఆపరేషన్ సిందూర్లో తన వంతు సేవలు అందించింది. గగనతల నుంచి పాక్ చేసిన దాడులను గట్టిగా తిప్పికొట్టింది. సాధారణ డ్రోన్లతోపాటు చిన్నపాటి మానవ రహిత యుద్ధ విమానాలను నేలకూల్చగలదు. ఆపరేషన్ సిందూర్లో స్వదేశీ ఆయుధాలతోపాటు విదేశాల భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఆయుధాలను సైతం భారత సైన్యం ఉపయోగించింది. వాటిలో స్కై స్ట్రైకర్ కామికాజ్ డ్రోన్లు, బరాక్–8 మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైళ్లు ఉన్నాయి. అంతేకాదు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఉపగ్రహాలు కూడా ఈ ఆపరేషన్కు సహకరించాయి. సమర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ ఫర్ అష్యూర్డ్ రిటాలియేషన్(సమర్) అనేది ఇండియా గగనతల రక్షణ వ్యవస్థలో ఒక భాగం. పాక్ సైన్యం ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులకు మధ్యలోనే కూలి్చవేసింది. భారత వైమానిక దళం సహకారంతో భారత రక్షణ రంగ పరిశ్రమలు దీన్ని రూపొందించాయి. గగనతలంలో తక్కువ ఎత్తులో దూసుకొచ్చే క్షిపణులు, మానవ రహిత విమానాలను ఇది పేల్చేయగలదు. భారత సైన్యంలో ఇది కీలక అస్త్రంగా మారింది. బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్రూయిజ్ మిస్సైళ్లు పాకిస్తాన్తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లోని ఉగ్రవాదుల స్థావరాలు, శిక్షణ శిబిరాలు, ఎయిర్బేస్లపై భారత సైన్యం మే 10వ తేదీన అత్యంత కచి్చతత్వంలో కూడిన దాడులు ప్రారంభించింది. ఇందుకు బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్రూయిజ్ మిస్సైళ్లు ఎంతగానో తోడ్పడ్డాయి. బ్రహ్మోస్ క్షిపణుల దెబ్బకు పాకిస్తాన్లో 20 శాతం వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఈ క్షిపణులను భారత రక్షణ శాఖ ఆధ్వర్యంలోని డీఆర్డీఓపాటు రష్యా రక్షణ పరిశోధన సంస్థ కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. కచ్చితత్వంతో కూడిన దాడులు చేయడానికి ఇవి ప్రపంచంలో అత్యంత అధునాతనమైన క్షిపణులుగా గుర్తింపు పొందాయి. బ్రహ్మోస్ మిస్సైళ్లను సబ్మెరైన్లు, నౌకలు, యుద్ధ విమానాలతోపాటు భూభాగం నుంచి ప్రయోగించవచ్చు. ఇవి ధ్వని వేగం కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్తాయి. ప్రయోగించామంటే లక్ష్యాన్ని తాకాల్సిందే. గురితప్పే ప్రసక్తే లేదు. బ్రహ్మోస్ అంటే కేవలం ఆయుధం కాదు, భారతీయ సైనిక శక్తికి ప్రతీక అని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభివరి్ణంచారు. ఆకాశ్ క్షిపణి వ్యవస్థ భారతదేశ ఐరన్ డోమ్గా పేరుగాంచిన ఆకాశ్ క్షిపణులు ఆపరేషన్ సిందూర్లో కీలక పాత్ర పోషించాయి. డీఆర్డీఓ అభివృద్ధి చేసిన ఈ మిస్సైళ్లను బీడీఎల్ తయారు చేసింది. ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత సైన్యం దాడులు ప్రారంభించిన తర్వాత పాక్ సైన్యం ప్రతిదాడులకు దిగింది. డ్రోన్లు, మిస్సైళ్లు ప్రయోగించింది. ఇవి చాలావరకు తుర్కియే, చైనా సరఫరా చేసినవే. ఆకాశ్ మిస్సైల్ సిస్టమ్ వాటిని సమర్థంగా తుత్తునియలు చేసింది. భారత భూభాగానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఆకాశ్ అనేది షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్తో దీన్ని పోల్చుతుంటారు. ఆకాశ్ క్షిపణి 25 కిలోమీటర్ల దూరంలోని నాలుగు లక్ష్యాలను ఒకేసారి ఛేదించగలదు. -
కన్నుల పండువగా...
న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఎక్స్’లో స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మన స్వాతంత్య్ర సమరయోధుల కలలు సాకారం చేయడానికి, ‘అభివృద్ధి చెందిన భారత్’నిర్మాణానికి పౌరులంతా కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. → ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్య్ర దినోత్సవానికి హాజరు కావడానికంటే ముందు ప్రధాని మోదీ తొలుత రాజ్ఘాట్ వద్ద మహాత్మాగాం«దీకి ఘనంగా నివాళులరి్పంచారు. అక్కడి నుంచి ఎర్రకోటకు బయలుదేరి వెళ్లారు. → పంద్రాగస్టు వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. మోదీ ఈసారి కాషాయ రంగు తలపాగా ధరించారు. తెల్లరంగు కుర్తా, కాషాయ రంగు బంద్గలా జాకెట్ ధరించి, జాతీయ జెండా ఎగురవేశారు. ఆయన గత 12 ఏళ్లుగా స్వాతంత్య్ర దినోత్సవాల్లో దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేర్వేరు రంగులు తలపాగాలు ధరిస్తున్నారు. → స్వాతంత్య్ర దినోత్సవాల ప్రసంగాల విషయంలో దివంగత ప్రధాని ఇందిరా గాంధీ రికార్డును మోదీ తిరగరాశారు. మోదీ వరుసగా 12 ఏళ్లు ఎర్రకోట నుంచి ప్రసంగించారు. ఈ విషయంలో జవహర్లాల్ నెహ్రూ తర్వాతి స్థానం మోదీదే కావడం విశేషం. నెహ్రూ ఎర్రకోట నుంచి వరుసగా 17 సార్లు స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాలు చేశారు. ఇందిరా గాంధీ ప్రధానమంత్రి హోదాలో మొత్తం 16 సార్లు ఎర్రకోట నుంచి ప్రసంగించగా, ఇందులో వరుసగా ప్రతిఏటా చేసిన ప్రసంగాలు 11 మాత్రమే. → ఈసారి వేడుకలకు 5,000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ప్రజలకు విశిష్టమైన సేవలు అందించిన అంగన్వాడీ కార్యకర్తలు, సర్పంచ్లు, లఖ్పదీ దీదీలతోపాటు వినూత్న సాగు పద్ధతులతో గుర్తింపు పొందిన రైతులను ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో విజేతలుగా నిలిచివారికి కూడా ఆహా్వనం పలికింది. త్వరలో స్పెషల్ ఒలింపిక్స్లో పాల్గొన్నబోతున్న భారత క్రీడాకారులు, కేంద్ర ప్రభుత్వ పథకాల లబి్ధదారులు, అంతర్జాతీయ యోగా దినోత్సవంలో సేవలందించిన వాలంటీర్లు, పారిశుధ్య కారి్మకులు సైతం హాజరయ్యారు. → వేర్వేరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 1,500 మంది తమ సంప్రదాయ వ్రస్తాలు ధరించి రావడం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. → ప్రధానమంత్రి ప్రసంగం ఏకంగా 103 నిమిషాల పాటు సాగింది. → మోదీ తన ప్రసంగంలో పలు కవితలను ప్రస్తావించారు. ‘సమృద్ధ భారత్’కోసం కృషి చేయాలని పిలుపునిస్తూ కష్టపడి పనిచేసేవారే చరిత్ర సృష్టిస్తారని కవిత రూపంలో చెప్పారు. ఉక్కు లాంటి రాళ్లను ముక్కలు చేసే సత్తా కలిగినవారికి కాలం కూడా సహకరిస్తుందని అన్నారు. కాలాన్ని మనకు అనువుగా మార్చుకోవడానికి ఇదే సరైన సమయమని ఉద్ఘాటించారు. → రాజ్యసభలో ప్రతిపక్ష నేత అయిన మల్లికార్జున ఖర్గే, లోక్సభలో విపక్ష నేత అయిన రాహుల్ గాంధీ ఈసారి ఎర్రకోట వద్ద వేడుకులకు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. -
రాజ్యాంగ స్ఫూర్తికి దగా
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)పై ప్రశంసల వర్షం కురిపించడం పట్ల ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. మోదీ తీరును తీవ్రంగా ఖండించాయి. ఆర్ఎస్ఎస్పై మోదీ ప్రశంసలు రాజ్యాంగ స్ఫూర్తిని, లౌకిక గణతంత్రాన్ని దగా చేయడమే అవుతాయని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ శుక్రవారం ‘ఎక్స్’లో విమర్శించారు. ఆర్ఎస్ఎస్ పెద్దలను మచ్చిక చేసుకోవడానికి మోదీ తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. 75 ఏళ్లు దాటినవారు పదవుల నుంచి తప్పుకోవాలని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చెప్పారని గుర్తుచేశారు. మోదీ ఈ రోజు అలసిపోయారని, త్వరలో పదవి నుంచి తప్పుకుంటారని జైరామ్ రమేశ్ తేల్చిచెప్పారు. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రభుత్వానికి సంబంధం లేని సంస్థను పొగడడం ఏమిటని మండిపడ్డారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం స్వాతంత్య్ర దినోత్సవాన్ని రాజకీయ అంశంగా మార్చేశారని, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కరాని మోదీపై నిప్పులు చెరిగారు. ఆర్ఎస్ఎస్పై మోదీ ప్రశంసల పర్వాన్ని సీపీఎం జాతీయ కార్యదర్శి ఎం.ఎ.బేబీ ఖండించారు. స్వాతంత్య్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్కు ఎలాంటి పాత్ర లేదని గుర్తుచేశారు. ఆ సంస్థను గతంలో నిషేధించారని వెల్లడించారు. అందుకోసం మోదీ నాగపూర్ వెళ్లాలి: ఒవైసీ సంఘ్ను ఆకాశానికి ఎత్తేయడం భారత స్వాతంత్య్ర పోరాటాన్ని తక్కువ చేయడమే అవుతుందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆక్షేపించారు. ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలకు సేవకులుగా పనిచేశాయని దుయ్యబట్టారు. స్వాతంత్య్ర పోరాటానికి అవి దూరంగా ఉన్నాయని, మహాత్మా గాం«దీని వ్యతిరేకించాయని చెప్పారు. ఆర్ఎస్ఎస్ను మంచి చేసుకోవాలంటే నాగపూర్కు వెళ్లాలి తప్ప ఎర్రకోట నుంచి ప్రశంసించడం ఏమిటని మోదీపై ఒవైసీ ధ్వజమెత్తారు. తప్పుడు చరిత్రను పక్కనపెట్టి ఆసలైన చరిత్ర, అసలైన హీరోల గురించి తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు. ఆర్ఎస్ఎస్పై సమాజ్వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆర్ఎస్ఎస్ త్వరలో 100 ఏళ్లు పూర్తి చేసుకోనుందని, అందుకు ఆ సంస్థ పెద్దలు బ్రిటిష్ పాలకులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బ్రిటిషర్ల దయతోనే ఆ సంస్థ ఏర్పాటైందని అన్నారు. ఆర్ఎస్ఎస్ను మోదీ కీర్తించడాన్ని తప్పుపట్టారు. మత సంస్థ పేరును అధికారిక కార్యక్రమంలో ప్రస్తావించడాన్ని ఆక్షేపించారు. నరేంద్ర మోదీ ఒక ప్రధానమంత్రిగా కాకుండా ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా వ్యవహరించారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ అనేది ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ, విద్వేష, విభజన సంస్థ అని తేలి్చచెప్పారు. అది ప్రభుత్వం వద్ద రిజిస్టర్ కాలేదని, పన్నులు చెల్లించడం లేదని అన్నారు. అలాంటి సంస్థను ప్రధానమంత్రి ప్రశంసించడం దారుణమని సిద్ధరామయ్య విమర్శించారు. రాజకీయంగా బలహీనపడినప్పుడల్లా ఆర్ఎస్ఎస్ మద్దతు కోసం పాకులాడడం మోదీకి అలవాటుగా మారిందన్నారు. ఆర్ఎస్ఎస్కు ఘనమైన చరిత్ర ఏమీ లేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ స్పష్టంచేశారు. -
Independence Day 2025: దుస్సాహసానికి దిగారో ఖబడ్దార్!
ప్రతి ఒక్కరమూ భారత్లో, మన తోటివారు చెమటోడ్చి తయారు చేసిన వస్తువులనే వాడతామని ప్రతినబూనుదాం. ఇతరులూ వాడేలా చేద్దాం. స్వదేశీ వస్తువులే అమ్ముతాం అంటూ ప్రతి చిరు వ్యాపారీ, దుకాణదారూ బోర్డు పెట్టాలి. ప్రతి రంగంలోనూ దేశీయ తయారీ వస్తువులే ఉండాలి. వాటిని ప్రపంచ దేశాలన్నింటికీ ఎగుమతి చేసే స్థాయికి చేరాలి. టారిఫ్లతో మన రైతులు, పశుపాలకులు, మత్స్యకారులతో సహా ఎవరూ నష్టపోకుండా అండగా నిలుస్తా. ..: మోదీ :..న్యూఢిల్లీ: దాయాది గుండెలదిరేలా ప్రధాని నరేంద్ర మోదీ సింహనాదం చేశారు. పహల్గాం పాశవికత్వం వెనక పాక్ ప్రమేయాన్ని ప్రస్తావిస్తూ పలుగు రాళ్లతో నలుగు పెట్టారు. ‘‘పహల్గాం ఉగ్రోన్మాదానికి ప్రతీకారంగా మన సైన్యం చేసిన ‘సిందూర’ గర్జన తాలూకు భయంతో శత్రు దేశం నేటికీ నిద్ర లేని రాత్రులు గడుపుతోంది. మన దళాలు పాక్ భూభాగంలో వందలాది కిలోమీటర్ల మేరకు చొచ్చుకెళ్లి మరీ ఉగ్ర, సైనిక లక్ష్యాలను తుత్తునియలు చేశాయి. ఆ విధ్వంసానికి సంబంధించి నేటికీ రోజుకో కొత్త కబురు తెరపైకి వస్తోందంటే అతిశయోక్తి కాదు’’ అంటూ ఎద్దేవా చేశారు. మళ్లీ అలాంటి దుస్సాహసానికి దిగితే దాయాదికి జన్మలో మర్చిపోలేని రీతిలో గట్టి గుణపాఠం నేర్పి తీరతామంటూ ప్రతినబూనారు. అణు బెదిరింపులకు జడిసే రోజులు గతించాయంటూ పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు పదునైన హెచ్చరికలు జారీ చేశారు. అటువంటి మతిలేని ఉన్మాదానికి దిగితే దీటుగా బదులిస్తామని స్పష్టం చేశారు. ‘‘60 ఏళ్లుగా భారత రైతుల పొట్ట కొడుతూ పాక్ పొలాలను తడుపుతున్న ఏకపక్ష సింధూ నదీ జల ఒప్పందం శాశ్వతంగా కాలగర్భంలో కలిసినట్టే. నీరూ నెత్తురూ కలిసి పారడం జరగని పని’’ అంటూ కుండబద్దలు కొట్టారు. ‘‘భరత జాతి దశాబ్దాలుగా పదేపసదే ఉగ్ర భూతానికి బలవుతూ వస్తోంది. దాయాది దన్నుతో జాతి గుండెను ఉగ్ర పోట్లు పదేపదే చీలుస్తూ వచ్చాయి. అది ఇకపై సాగదు. ఉగ్రవాదానికి మహారాజ పోషకులుగా మారి దానికి జవసత్వాలు అందజేస్తున్న దేశాలు, శక్తులను కూడా ఇకపై విడిగా చూడబోం. వారినీ ఆ ముష్కరులతో సమానంగా శిక్షించి తీరతాం. ఇదే మా నయా మంత్రం’’ అంటూ పాక్కు పెను హెచ్చరికలు చేశారు. ‘‘వారి మధ్య ఎలాంటి తేడా లేదు. ఇద్దరూ మానవాళికి సమాన శత్రువులే’’ అని స్పష్టం చేశారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎర్రకోటపై ప్రధాని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతినుద్దేశించి ఏకంగా 103 నిమిషాల పాటు ప్రసంగించారు. గతేడాది 98 నిమిషాలు ప్రసంగించిన స్వీయ రికార్డును అధిగమించారు. అంతేగాక ఎర్రకోట నుంచి వరుసగా 12 వసారి పంద్రాగస్టు ప్రసంగం చేయడం ద్వారా ఇందిరాగాంధీ రికార్డు (11)ను అధిగమించారు. వరుసగా 17సార్లు పంద్రాగస్టు ప్రసంగాలు చేసిన తొలి ప్రధాని నెహ్రూ తర్వాత రెండోస్థానంలో నిలిచారు. అన్ని రంగాల్లోనూ ఆత్మ నిర్భరత తాలూకు ఆవశ్యకతను మోదీ తన ప్రసంగంలో పదేపదే నొక్కిచెప్పారు. సెమీ కండక్టర్లు మొదలుకుని కీలక ఖనిజాలు, అణు ఇంధనం దాకా అన్నింట్లోనూ స్వయంసమృద్ధి సాధించిన నాడే దేశం నిజమైన అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని స్పష్టం చేశారు. తన వికసిత్ భారత్ కలలను సవివరంగా దేశ ప్రజల ముందుంచారు. కాంగ్రెస్తో పాటు విపక్షాలన్నీ అభివృద్ధి నిరోధకులుగా మారుతున్నాయంటూ తూర్పారబట్టారు. అర్థం లేని డిమాండ్లతో పార్లమెంటును నిత్యం స్తంభింపజేస్తూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కీలక పథకాల అమలులో ఇప్పటికైనా కేంద్రంతో కలిసి రావాల్సిందిగా పిలుపునిచ్చారు.బలగాలు సత్తా చాటాయి ‘‘రాజస్తాన్ ఎడారులు మొదలుకుని హిమ శిఖరాలు, సముద్ర తీరం, అత్యంత జనసమ్మర్ధ ప్రాంతాల దాకా ఇంటింటా నేడు త్రివర్ణ స్ఫూర్తి వెల్లివిరుస్తోంది. కానీ గత ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో అమాయక పర్యాటకులను ఉగ్ర ముష్కరులు పిరికిదెబ్బ తీశారు. పిల్లల కళ్లముందు తండ్రులను పొట్టన పెట్టుకున్నారు. భార్యల సిందూరాన్ని కర్కశంగా తుడిపేశారు. ఆ దారుణాన్ని తలచుకుని జాతి యావత్తూ క్రోధావేశాలతో ఆక్రోశించింది. అందుకు ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో మన సైనిక బలగాలు పూర్తిస్థాయిలో సత్తా చాటాయి’’ అన్నారు.శ్రీకృష్ణుడే స్ఫూర్తిగా మిషన్ సుదర్శన చక్ర దేశ భద్రతకు ఛత్రం పదేళ్లలో అందుబాటులోకి దేశ భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ‘మిషన్ సుదర్శన్ చక్ర’ పేరుతో 2035 నాటికి అత్యంత శక్తిమంతమైన సరికొత్త రక్షణ వ్యవస్థ ఏర్పాటును ప్రధాని మోదీ ప్రకటించారు. దీనిద్వారా దేశ భద్రతా ఛత్రాన్ని మరింతగా విస్తరించి, బలోపేతం చేసి ఆధునీకరిస్తామని పేర్కొన్నారు. ‘‘శనివారం శ్రీకృష్ణుని జన్మదినం. కచి్చతత్వంతో పని పూర్తి చేయడం, ఆ వెంటనే కృష్ణున్ని చేరుకోవడం సుదర్శన చక్రం ప్రత్యేకత. దాని స్ఫూర్తితో రూపొందే పూర్తి దేశీయ భద్రతా వ్యవస్థ కూడా అలాగే అత్యాధునికంగా రూపుదిద్దుకుంటుంది’’ అన్నారు. యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టం వంటివాటితో ఇది ఇజ్రాయెల్ ఐరన్డోమ్ తరహాలో పని చేస్తుందన్నది నిపుణుల అంచనా.‘సింధూ’ ఇక భారత సొత్తే! ‘‘మన నేలపై పుట్టి పారే నదులు శత్రు దేశపు పొలాలను తడుపుతున్నాయి. మన రైతులు దాహార్తితో అల్లాడుతున్నారు. సింధూ ఒప్పందం 70 ఏళ్లుగా వారికి చేసిన నష్టం మాటలకందనిది. అది ఎంతటి ఏకపక్ష ఒప్పందమో ఇప్పుడు దేశవాసులందరికీ తెలిసొచ్చింది. దీన్నిక సహించేది లేదు. ఆ ఒప్పందానికి నూకలు చెల్లినట్టే. సింధూ జలాలన్నీ ఇక పూర్తిగా మన రైతులవే. టారిఫ్లతో మన రైతులు, మత్స్యకారులతో సహా ఎవరూ నష్టపోకుండా అండగా నిలుస్తా’’.అక్రమ వలసలు... అతి పెద్ద కుట్ర! హై పవర్ మిషన్తో అడ్డుకట్ట అక్రమ వలసలు దేశానికి తలనొప్పిగా మారాయని మోదీ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘ఇది పక్కా పథకం ప్రకారం కొందరు పన్నిన కుట్ర. ఉద్దేశపూర్వకంగా చొరబాట్లను ప్రోత్సహిస్తూ పెను సంక్షోభానికి బీజం వేస్తున్నారు. దేశంలో జనాభా సమతౌల్యాన్నే దెబ్బతీయజూస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఇది జాతీయ భద్రత పాలిట పెను ప్రమాదంగా పరిణమిస్తోంది. మన ఐక్యతకు, ప్రగతికి గొడ్డలిపెట్టుగా మారుతోంది. సామాజిక ఉద్రిక్తతల బీజాలు నాటుతోంది. చొరబాటుదార్లు అమాయక గిరిపుత్రులను మోగిస్తున్నారు. వారి అటవీ భూములను కాజేస్తున్నారు. ఈ ఘోరాలను ఇకపై సహించే ప్రసక్తే లేదు. అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతస్థాయి డెమోగ్రాఫిక్ మిషన్కు రూపకల్పన చేస్తున్నాం’’ అని ప్రకటించారు. నారీ శక్తికి సలాం ‘‘స్త్రీ శక్తి ప్రతి రంగంలోనూ సత్తా చాటుతోంది. స్టార్టప్లు, క్రీడలు, సైన్యం మొదలుకుని అంతరిక్షం దాకా ప్రతి రంగంలోనూ దేశ సామాజిక, ఆర్థిక ప్రగతిలో కీలక చోదక శక్తిగా నిలుస్తోంది. నేషనల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్డీఏ) నుంచి తాజాగా తొలి బ్యాచ్ మహిళా కేడెట్లు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న చరిత్రాత్మక క్షణాలను తలచుకుని జాతి యావత్తూ గర్వంతో ఉప్పొంగిపోయింది. లక్పతీ దీదీ పథకంతో కోట్లాది మంది మహిళలు స్వయంసమృద్ధి సాధించారు’’.స్వదేశీ సత్తా చాటుదాం-ఆ కలను నిజం చేయండి యువతకు మోదీ సవాలు వందేళ్ల పై చిలుకు దాస్యం మనలను నిరుపేదలుగా, పరాధీనులుగా మార్చిందని మోదీ ఆవేదన వెలిబుచ్చారు. నేటికీ ఏ జాతి ఆత్మ గౌరవానికైనా ఆత్మ నిర్భరతే అతి పెద్ద తార్కాణమని నొక్కిచెప్పారు. స్వయం సమృద్ధ భారతే వికసిత భారత్కు పునాది అని స్పష్టం చేశారు. ‘‘ఇది ఎగుమతులు, దిగుమతులు, కరెన్సీలకే పరిమితం కారాదు. మేడిన్ ఇండియా ఆయుధాల తాలూకు గొప్పదనాన్ని ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచమంతటికీ ఘనంగా చాటాం. శత్రు లక్ష్యాలను రెప్పపాటులో తుత్తునియలు చేశాం. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించకపోతే ఇది సాధ్యపడేదా?’’ అని ప్రశ్నించారు. ‘‘ప్రతి ఒక్కరమూ భారత్లో, మన తోటివారు చెమటోడ్చి తయారు చేసిన వస్తువులనే వాడతామని ప్రతినబూనుదాం. ఇతరులూ వాడేలా చేద్దాం. ‘స్వదేశీ వస్తువులే అమ్ముతాం’ అంటూ ప్రతి చిరు వ్యాపారీ, దుకాణదారూ బోర్డు పెట్టాలి. ప్రతి రంగంలోనూ దేశీయ తయారీ వస్తువులే ఉండాలని, వాటిని ప్రపంచ దేశాలన్నింటికీ ఎగుమతి చేసే స్థాయికి చేరాలి’’ అని ఆకాంక్షించారు. ‘‘దేశీయ జెట్ ఇంజన్లు, యుద్ధవిమానాలు మొదలుకుని సోషల్ మీడియా వేదికల దాకా తిరుగులేని రీతిలో డిజైన్ చేయాలి. మన యువతకు, ఇన్నొవేటర్లకు, సైంటిస్టులకు, ఇంజనీర్లకు, ప్రొఫెషనల్స్కు ఇదే నా సవాలు’’ అని పేర్కొన్నారు. తద్వారా దేశాన్ని బలోపతంగా, స్వయంసమృద్ధంగా తీర్చిదిద్దడంలో పాలుపంచుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. ‘‘అంతరిక్ష రంగంలోనూ ఆత్మ నిర్భరత అత్యవసరం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగు పెట్టిన తొలి భారతీయునిగా రికార్డు నెలకొల్పిన వాయుసేన గ్రూప్కెపె్టన్ శుభాన్షు శుక్లాను చూసి జాతి యావత్తూ పొంగిపోతోంది. తొలి దేశీయ మానవసహిత అంతరిక్ష గగన్యాన్కు త్వరలో శ్రీకారం చుట్టనున్నాం. అంతేకాదు, సొంత అంతరిక్ష కేంద్రాన్నీ నిర్మించుకోనున్నాం’’ అని చెప్పారు. అతి పెద్ద సేవాసంస్థ ఆరెస్సెస్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఆవిర్భావానికి వందేళ్లవుతున్న సందర్భంగా మోదీ అభినందనలు తెలిపా రు. దాన్ని ప్రపంచంలోకెల్లా అతి పెద్ద స్వచ్ఛంద సంస్థగా అభివరి్ణంచారు. ‘‘దేశానికే గర్వకారణమైన ప్రస్థానం ఆరెస్సెస్ది. అంకితభావంతో దేశానికి సేవ చేస్తున్న ఆరెస్సెస్ కార్యకర్తలందరికీ నా సెల్యూట్. కోట్లాది మంది ప్రజలు, సాధుసంతులు, సైంటిస్టులు, టీచర్లు, రైతులు, సైనికులు, శ్రామికులు, వ్యక్తులు, సంస్థల మొక్కవోని ప్రయత్నాల ఫలస్వరూపంగా ఆరెస్సెస్ ఎదిగింది. వ్యక్తి, జాతి నిర్మాణానికి, దేశ సంక్షేమానికి వందేళ్లుగా వారంతా తిరుగులేని త్యాగాలు చేస్తూ వస్తున్నారు. ఆ స్వయం సేవకులదరినీ ఎర్రకోట వేదికగా సగౌరవంగా గుర్తుచేసుకుంటున్నా’’ అన్నారు.తగ్గనున్న జీఎస్టీ శ్లాబులు-దివాలీ డబుల్ బొనాంజా ‘‘త్వరలో భారీస్థాయిలో సరికొత్త జీఎస్టీ సంస్కరణలు తేనున్నాం. జీఎస్టీ శ్లాబులను బాగా తగ్గించనున్నాం. తద్వారా పౌరులపై పన్ను భారం గణనీయంగా తగ్గుతుంది. ఈ దీపావళికి వారికిది కేంద్రం తరఫున డబుల్ బొనాంజా. వార్షిక వ్యక్తిగత ఆదాయ పన్ను చట్టాలను కూడా సరళీకరించాం’’. యువత కోసం... రూ.లక్ష కోట్లు ‘‘దేశ యువత కోసం రూ.లక్ష కోట్లతో ‘ప్రధాన్మంత్రీ వికసిత్ భారత్ రోజ్గార్ యోజన’ పేరుతో కొత్త పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నాం. దీనికింద ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందే యువతీ యువకులందరికీ రూ.15 వేలు అందజేయనున్నాం. యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందించే కంపెనీలకు ప్రోత్సహకాలు అందుతా యి. ఈ పథకం ద్వారా కనీసం 3.5 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తాం’’. కీలక ఖనిజాలపై దృష్టి ‘‘ఇది టెక్నాలజీ ఆధారిత శతాబ్ది. దాన్ని అందిపుచ్చుకున్న దేశాలే అభివృద్ధిలో దూసుకెళ్లాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం. గత ప్రభుత్వాలను విమర్శించడం నా లక్ష్యం కాదు. కానీ మన దేశంలో సెమీ కండక్టర్ల తయారీకి సంబంధించిన ఫైళ్లు కదలడం 60 ఏళ్ల కిందే మొదలైంది. కానీ ఏళ్లు గడిచినా ఎక్కడి గొంగళి అక్కడే! అలా మనం అతి విలువైన 50 ఏళ్లను కోల్పోతే మిగతా దేశాలు ఆ రంగంలో దూసుకెళ్లాయి. మేం అధికారంలోకి వచ్చాక సెమీ కండక్టర్ల తయారీకి పెద్దపీట వేస్తున్నాం. ఇక కీలక ఖనిజాల అవసరాన్ని నేడు ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయి. ఈ రంగంలోనూ స్వయం సమృద్ధి సాధించడం అత్యంత కీలకం. పరిశ్రమలు, ఇంధనం, రక్షణ, టెక్నాలజీ... ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా కీలక ఖనిజాలే ప్రాణావసరంగా మారిన పరిస్థితి! ఈ అవసరాలను పూర్తిస్థాయిలో దేశీయంగానే తీర్చుకునేందుకు నేషనల్ క్రిటికల్ మిషన్కు శ్రీకారం చుట్టాం. దేశవ్యాప్తంగా ఏకంగా 1,200 చోట్ల కీలక ఖనిజాల అన్వేషణకు తెర తీశాం’’.పదింతలకు ‘అణు’ పాటవం ‘‘దేశవ్యాప్తంగా 10 కొత్త అణు రియాక్టర్లను శరవేగంగా నిర్మిస్తున్నట్టు మోదీ వెల్లడించారు. దేశ అణు ఇంధన సామర్థ్యాన్ని 2047 నాటికి పదింతలు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటించారు’’. -
కొత్త ‘క్రీడా విధానం’తో రాత మారిపోతుంది
న్యూఢిల్లీ: దేశంలోని క్రీడా వ్యవస్థలో పలు మార్పులను ఆశిస్తూ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నేషనల్ స్పోర్ట్స్ పాలసీ (ఎన్ఎస్పీ) బిల్కు ఇటీవలే పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం లభించింది. త్వరలోనే చట్టంగా మారనున్న ఈ బిల్లుతో క్రీడా రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం ఇచ్చిన ప్రసంగంలో ఆయన భారత క్రీడల అభివృద్ధి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘అభివృద్ధిలో క్రీడలు కూడా ఒక భాగం. ఒకప్పుడు ఆటలు ఆడితే తల్లిదండ్రులు కోప్పడే పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రోత్సహించే వరకు పరిస్థితి మారడం సంతోషంగా ఉంది. ఇది మంచి సంకేతం. భారతీయ కుటుంబాల్లో క్రీడలు కూడా అంతర్భాగం కావడం నాకు గర్వంగా అనిపిస్తోంది. భారత భవిష్యత్తుకు కూడా ఇది చాలా మంచిది’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. కొత్తగా అమల్లోకి రాబోయే స్పోర్ట్స్ పాలసీ దేశంలో పలు మార్పులకు శ్రీకారం చుడుతుందని, జవాబుదారీతనం పెంచుతుందని ఆయన అన్నారు. ‘క్రీడలను మరింతగా ప్రోత్సహించేందుకే పలు దశాబ్దాల తర్వాత కొత్త పాలసీని తీసుకొచ్చాం. పాఠశాలలనుంచి ఒలింపిక్స్ వరకు ఇది ఆటలను అభివృద్ధి చేసేలా ఉంటుంది. కోచింగ్, ఫిట్నెస్, మౌలిక సౌకర్యాల కల్పనకు సంబంధించి ఒక వ్యవస్థను దీని ద్వారా రూపొందిస్తున్నాం. ఇది దేశంలోని మారుమూలలకు వెళ్లి పని చేస్తుంది’ అని మోదీ స్పష్టం చేశారు. ఫిట్నెస్, క్రీడల ప్రాధాన్యత గురించి వివరిస్తూ ప్రధాని... ప్రస్తుతం దేశంలో ఊబకాయం అతి పెద్ద సమస్యగా మారిందని, దీనిలో మార్పుల తేవాలంటే నూనెల వినియోగాన్ని తక్కువ చేయాలని సూచించారు. -
దేశానికి రక్షణగా.. శ్రీకృష్ణుడి స్పూర్తితో ‘మిషన్ సుదర్శన్ చక్ర’
న్యూఢిల్లీ, సాక్షి: మహాభారతంలో శ్రీకృష్ణుడి స్పూర్తితో ఎలాంటి ముప్పునుంచైనా దేశాన్ని రక్షించేందుకు వీలుగా మిషన్ సుదర్శన్ చక్రను అనే ఆధునిక ఆయుధ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా 103 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో .. రాబోయే పదేళ్లలో అంటే 2035 నాటికి, దేశ భద్రత కోసం రక్షణా కవచాన్ని అందుబాటులోకి తేనున్నాం. అందుకే శ్రీకృష్ణుడి స్పూర్తితో సుదర్శన చక్ర మార్గాన్ని ఎంచుకున్నట్లు చెప్పారు.ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు సుదర్శన్ చక్ర ఆయుధ వ్యవస్థ 2035 నాటికి అభివృద్ధి అవుతుంది. మిషన్ సుదర్శన్ చక్ర దేశ రక్షణలో కీలక పాత్ర పోషించనుంది. రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు ప్రార్ధనా స్థలాలు సహా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కీలక ప్రదేశాలను సురక్షితంగా ఉంచేలా మిషన్ సుదర్శన చక్ర కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. ఈ మిషన్లో ఖచ్చితమైన లక్ష్య వ్యవస్థ, అత్యాధునిక ఆయుధాలు ఉంటాయని, ఇది శత్రువుల దాడిని అడ్డుకునేందుకు.. సుదర్శన్ చక్రం వలె శక్తివంతమైన ప్రతీకార దాడుల్ని తిప్పికొడుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కాగా, గత పదేళ్లలో అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భారత్ .. పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణి, డ్రోన్ దాడులను నిలువరించిన ఆపరేషన్ సిందూర్ గురించి ఆయన ప్రస్తావించారు. -
"నిశ్శబ్ద సంక్షోభం"గా ఊబకాయం: ప్రధాని మోదీ
స్వాతంత్ర్య దినోత్సవ వేళ ప్రధాని మోదీ యువతకు, ప్రజలకు ఎన్నో వరాలజల్లు కురిపించేలా పథకాలను అందించడమే కాకుండా ప్రజా ఆరోగ్యంపై కూడా మాట్లాడారు. ఈమేరకు ఢిల్లీ ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..ప్రస్తుతం ప్రజలంతా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యపై కీలక వ్యాఖ్యలతోపాటు కొన్ని సూచనలు కూడా అందించారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని సుమారు 103 నిమిషాల పాటు జరిగిన ప్రసంగంలో లక్షలాది మంది పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ..జీవనశైలిలో వస్తున్న మార్పులు, సరైన ఆహారపు అలవాట్ల లేమి, తగిన శారీరక శ్రమ లేకపోవడం కారణంగా గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు, వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం ఎలా పెరిగిపోతోందో నొక్కి చెప్పారు. అంతేగాదు రాబోయే సంవత్సరాల్లో ఊబకాయం మన దేశానికి పెద్ద సవాలుగా మారవచ్చు అని కూడా అన్నారు. ప్రతి కుటుంబంలో నూనె వాడకాన్ని సుమారు 10% తగ్గిస్తే ఇది దేశ ఆరోగ్యానికే మేలు చేస్తుందని చెప్పారు. వంటనూనెతో వ్యాధుల కనెక్షన్..ప్రధాని మోదీ నూనె వాడకం గురించి ఇచ్చిన పిలుపు నిజంగా సరైనదేనా..అంటే..ముమ్మాటికి కరెక్టేనని చెబుతున్నారు నిపుణులు. అధిక నూనె వినియోగం వల్ల సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్లు శరీరంలో అధికమై బరువు పెరిగేందుకు దారితీస్తుందని తెలిపారు. అలాగే ఈ అధిక కొలెస్ట్రాల్ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాని పెంచేస్తుందని పోషకాహారా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే మోదీ భారతీయులు తక్కువ నూనెను ఉపయోగించే సాంప్రదాయ వంట పద్ధతులను స్వీకరించడం తోపాటు ఆవిరి పట్టడం, వేయించడం, ఉడకబెట్టడం, వంటి వాటిపై ఆధారపడాలని, మొక్కల ఆధారిత పదార్థాలను చేర్చుకోవాలని ప్రజలకు హితవు పలుకుతున్నారు. జీవనశైలిపై దృష్టి సారించాలి..ఒత్తిడి, ఆందోళనతో యువత బాధపడటానికి కారణం, యోగా ధ్యానం వంటి అలవాట్ల లేమి కారణమని చెబుతున్నారు మోదీ. కనీసం నడక, సైక్లింగ్, కొద్దిపాటి వ్యాయామాలు చేయాలని సూచించారు. ప్రాసెస్ చేసిన పదార్థాలకు దరిచేరనీయకుండా తృణధాన్యాలు, కూరగాయలు, కాలానుగుణ పండ్లను తీసుకోవాలని సూచించారు. చారిత్రాత్మకంగా భారత్ అనుసరించే సమతుల్య సాంప్రదాయ ఆహార జ్ఞానానికి మళ్లీ తిరిగి రావాలని ఆ ప్రసంగంలో కోరారు.ఎందకు ఈ హెచ్చరికలు అంటే..ఈ ఊబకాయం ప్రస్తుతం నగరాలకే పరిమితం కాలేదు. భారతదేశంలో 24% మంది మహిళలు, 23% మంది పురుషులు అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు. పట్టణ ప్రాంతంలో ఈ పరిస్థితి మరి ఎక్కువగా ఉంది. బాధకరం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరిస్థితి ఇలానే ఉండటమేనని అన్నారు మోదీ. అందుకు ప్రధాన కారణం కేలరీలు అధికంగా ఉండే ఆహార పదార్థాల వినియోగమేనని చెప్పారు.ఇక 136 మిలియన్ల మందికి పైగా ప్రీ డయాబెటిస్ ఉంది. అందులో ఎక్కువ భాగం ఊబకాయం కారణంగా ఈ వ్యాధి బారినపడినవే.బడి వయసు పిల్లలు సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.ఊబకాయం కారణంగా వచ్చే వ్యాధుల ప్రమాదం..ఊబకాయం బహుళ దీర్ఘకాలిక పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటంటే..టైప్ 2 డయాబెటిస్రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులురొమ్ము, పెద్దప్రేగు కేన్సర్తో సహా కొన్ని రకాల కేన్సర్లుకీళ్ల ఒత్తిడి కారణంగా వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ తదితరాలు వస్తాయి.దీన్ని గనుక ఆదిలోనే అదుపులో ఉంచే ప్రయత్నం చేయకపోతే 2035 నాటికి, ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు ఈ అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడే అవకాశం ఉందని వరల్డ్ ఒబెసిటీ సమాఖ్య అంచనా వేసింది.ఆరోగ్యం కోసం జాతీయ మిషన్..ఊబకాయంపై వ్యతిరేకంగా పోరాడటాన్ని వ్యక్తిగత బాధ్యత, సమిష్టి లక్ష్యంగా రూపొందించారు మోదీ. నిజానికి చమురు వినియోగాన్ని 10% తగ్గించాలనే ఆయన సూచన పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు..పైగా అందరూ సులభంగా ఆచరించదగినదే. తర్వాతి తరాలకి ఆరోగ్యకరమైన దేశాన్ని బహుమతిగా ఇవ్వాలన్న ఆకాంక్షతో మోఈ ప్రజలకు ఈ ఆరోగ్య సూచనలిచ్చారు. ఆ నేపథ్యంనే మోదీ ఫిట్ ఇండియా ఉద్యమం, పోషన్ అభియాన్ వంటి ప్రచార కారక్రమాలను చేపట్టారు.ఆచరణలోకి తీసుకురాగలమా అంటే..ప్రధాని మోదీ పిలుపుని ఆచరణలో పెట్టేందుకు ఏమంత కష్టపడిపోవాల్సిన పనిలేదు..జస్ట్ ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే చాలు..వంట చేసే మందుకు నూనెను కొలత ప్రకారం ఉపయోగిస్తే చాలు. కంటైనర్ నుంచి నేరుగా కాకుండా ఒక స్పూన్ లేదా కొలతగా పెట్టుకున్న మరేదైనా చాలు. ఆరోగ్యకరమైన నూనెలు ఎంచుకోండి. అంటే ఆవాలు, వేరుశెనగ, బియ్యం ఊక నుంచి వచ్చే ఆయిల్ వంటి వాటిని ఎంచుకోండి. డీప్ ఫ్రై చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. రోజుకు 30 నిమిషాలు నడక లేదా కొద్దిపాటి వ్యాయమాలకి కేటాయించే ప్రయత్నం చేయండి చాలు.గమనిక: ఇది కేవలం అవగామన కోసంమ మాత్రమే ఇచ్చాం. పూర్తి వివ్రాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: స్వేచ్ఛా తరంగాలు..! నవతరానికి స్ఫూర్తి ఈ నారీమణులు..) -
భారీగా తగ్గనున్న GST..! దేశ ప్రజలకు పీఎం మోదీ గుడ్ న్యూస్
-
అమెరికా ఓవరాక్షన్.. ఎర్రకోటపై ట్రంప్కు మోదీ స్ట్రాంగ్ కౌంటర్
ఢిల్లీ: దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికాకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. అమెరికా సుంకాల బెదిరింపుల నేపథ్యంలో భారత శక్తిని ఇతరులను తక్కువ చేసి మాట్లాడటంలో వృథా చేయకూడదని సూచించారు. నాణ్యమైన ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్లో మన సామర్థ్యం నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందని సూచించారు. ప్రభుత్వ విధానాలతో మార్పులు అవసరమైతే తెలియజేయాలని పిలుపునిచ్చారు.దేశంలో 79వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం, అమెరికా సుంకాల బెదిరింపుల నేపథ్యంలో పౌరులను ఉద్దేశిస్తూ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎర్రకోటపై మోదీ మాట్లాడుతూ.. ‘కొందరు భారత్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. చరిత్రను లిఖించాల్సిన సమయం ఆసన్నమైంది. మనం ప్రపంచ మార్కెట్ను పాలించాలి. ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకోవాలి. నాణ్యమైన ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్లో మన సామర్థ్యం నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. తక్కువ ధర, అధిక నాణ్యత అని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆర్థిక స్వార్థం పెరుగుతోంది. మన లక్ష్యాలను చేరుకోవడానికి ముందుకుసాగాల్సిన సమయం ఇది అని పిలుపునిచ్చారు.#WATCH | Delhi: Prime Minister Narendra Modi says, "... Viksit Bharat ka aadhar bhi hai Aatmanirbhar Bharat... If someone becomes too dependent on others, the very question of freedom starts to fade... Aatmanirbhar is not limited merely to imports, exports, rupees, pounds, or… pic.twitter.com/ZmP6uYoezm— ANI (@ANI) August 15, 2025ఇదే సమయంలో మన శక్తిని ఇతరులను తక్కువ చేసి మాట్లాడటంలో వృథా చేయకూడదని సూచించారు. మనల్ని మనం బలోపేతం చేసుకోవడంపై దృష్టిసారించాలన్నారు. దేశంలోని వ్యాపారులు, దుకాణదారులు స్వదేశీ ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టిపెట్టాలన్నారు. ప్రపంచం మన పురోగతిని గమనిస్తుందన్నారు. ప్రభుత్వ విధానాలతో మార్పులు అవసరమైతే తెలియజేయాలని పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక విధానాలను సహించేది లేదన్నారు. రైతులు మన ఆర్థిక వ్యవస్థకు ఎంతో తోడ్పడతారు. అన్ని సందర్భాల్లో వారికి అండగా నిలబడాలి. డీజిల్, పెట్రోల్ దిగుమతులపై లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం. కొత్త ఇంధనాల అభివృద్ధితో పెట్రోలియం దిగుమతులు తగ్గించాలి. నేడు ప్రపంచమంతా కీలక ఖనిజాల చుట్టే తిరుగుతోంది అంటూ కామెంట్స్ చేశారు.A very sharp message from PM Modi: Don’t waste your energy containing the other, focus all your energy on boosting your own. Economic selfishness is on the rise, but we must not sit and cry about it. Focus on building your future. No “selfishness” can trap us. This goes hard. pic.twitter.com/duImGAtzjJ— Shubhangi Sharma (@ItsShubhangi) August 15, 2025 -
దేశ ప్రజల క్షేమమే మా ధ్యేయం..! ఎర్ర కోటపై పవర్ ఫుల్ స్పీచ్
-
ఎర్రకోటపై జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ
-
ఎర్రకోటపై స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ (ఫొటోలు)
-
ప్రైవేట్ ఉద్యోగస్తులకు ప్రధాని మోదీ బంపరాఫర్
సాక్షి,న్యూఢిల్లీ: రోజువారీ వినియోగించే వస్తువులపై విధించే పన్నును తగ్గించడంతో పాటు దేశంలో యువత కోసం రూ.లక్ష కోట్లతో కొత్త పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.ఢిల్లీ ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘నా దేశ యువత కోసం ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన (Pradhan Mantri Viksit Bharat Rozgar Yojana) పేరుతో ఈ కొత్త పథకం అందుబాటులోకి తెస్తున్నాం. ఈ కొత్త పథకం ఈ రోజు నుంచే అమలులోకి వస్తోంది. ఈ పథకం కింద, ప్రైవేట్ రంగంలో మొదటి ఉద్యోగం పొందుతున్న యువతకు రూ.15,000 ఆర్థిక సహాయం అందిస్తున్నాం. తద్వారా ద్వారా 3.5 కోట్లకు పైగా యువతకు ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. ఉద్యోగ అవకాశాలు కల్పించే కంపెనీలకు తగిన ప్రోత్సాహకాలు కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రూ.15 వేలు కేంద్రం ఎలా ఇస్తుంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో తొలిసారిగా రిజిస్టర్ చేసుకున్న ఉద్యోగులకు రెండు విడతలుగా రూ. 15,000 వరకు పొందవచ్చు. రూ. లక్ష వరకు జీతం ఉన్న ఉద్యోగులు అర్హులు. ఆరు నెలల సర్వీస్ తర్వాత మొదటి విడత .. మరో ఆరునెలల సర్వీస్లో రెండో విడుత కింద అందిస్తుంది.రూ.15వేలను ఎలా డ్రా చేసుకోవచ్చుసేవింగ్స్ను ప్రోత్సహించేలా కేంద్రం అందించే రూ.15వేలులో కొంత మొత్తాన్ని ఈపీఎఫ్ ఖాతాలో నిర్ణీత కాలం వరకు ఉంచుతుంది. ఆ తర్వాత మొత్తాన్ని సదరు ఉద్యోగి విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ చెల్లింపు ఆధార్ బ్రిడ్జ్ పేమెంట్ సిస్టమ్ (ABPS) ఉపయోగించి డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) మోడ్ ద్వారా జరుగుతాయి. -
దేశ ప్రజలకు శుభవార్త.. ట్యాక్స్పై ప్రధాని మోదీ కీలక ప్రకటన
సాక్షి,న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభవార్త చెప్పారు.‘ఈసారి దీపావళి రెండింతల ఆనందాన్ని తీసుకురాబోతోంది ..అంటూ, జీఎస్టీ విధానంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకురానున్నట్లు వెల్లడించారు. సామాన్యులు చెల్లించే పన్నుల్లో భారీగా కోత పెట్టనున్నట్లు తెలిపారు.ఈ మార్పుల వల్ల నిత్యవసర వస్తువుల ధరలు తగ్గి, ప్రజలకు ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. అదే సమయంలో, దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట వేదికగా దేశ ప్రజలకు ఊరట కలిగించేలా మోదీ కీలక ప్రకటన చేశారు. ప్రతి కుటుంబానికి ఉపశమనం కలిగించేలా, నిత్యవసర వస్తువులపై విధించే పన్నును తగ్గిస్తున్నాం. వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా, జీఎస్టీ స్లాబ్లను వరిస్తున్నామన్నారు. ఈ దీపావళి నాటికి, సామాన్యుల జీవితాన్ని మరింత సులభతరం చేసేలా, సరళీకృత జీఎస్టీ విధానాన్ని మీరు చూస్తారు’ అని హామీ ఇచ్చారు.హైపవర్ కమిటీ ఏర్పాటు చేసి జీఎస్టీ సంస్కరణలు జరిపి ఈ దీపావళికి బహుమతిగా ఇస్తాం. సామాన్యులకు ప్రయోజనం కలిగేలా రోజువారి వస్తువుల్ని అందుబాటులోకి తీసుకొస్తాం. సంస్కరణల విషయంలో మాకు మద్దతు పలకాలి’ అని కోరారు. -
ఎర్రకోట వేదికగా పాకిస్తాన్కు ప్రధాని మోదీ హెచ్చరిక
సాక్షి,న్యూఢిల్లీ: 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ పాకిస్తాన్కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ.. దేశ భద్రతపై తన దృఢమైన వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. పాకిస్తాన్ పదే పదే చేస్తున్న అణు బెదిరింపులను ఖండించారు. అణు దాడుల బెదిరింపులకు భారత్ భయపడదని తేల్చి చెప్పారు. అదే సమయంలో సింధూ జలాల ఒప్పందానికి తాము అంగీకరించబోమని పాక్కు స్పష్టం చేశారు. రక్తం, నీరు కలిసి పారటం కుదరదన్నారు.సింధూ జలాల ఒప్పందం కారణంగా నా దేశ భూమి నీరు లేక కటకటలాడింది. రైతులు నీరు లేక అనేక బాధలు పడ్డారు. ఇకపై రైతులు అలాంటి బాధలు పడకూడదు. భారతదేశానికి హక్కుగా చెందాల్సిన నీరు భారతదేశానికి మాత్రమే’ అని తెలిపారు. నయా భారత్ థీమ్తో అంతకు ముందు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్ర కోట వేదిగా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. న్యూఇండియా (Naya Bharat) అనే థీమ్ ప్రతిబింబించేలా వస్త్రధారణతో దేశభక్తిని చాటిచెప్పారు. ఇక ప్రధాని మోదీ ఇది వరుసగా 12వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం. ఆచారం ప్రకారం, ప్రధానమంత్రి రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి పుష్పగుచ్ఛాలు అర్పించి, జాతినుద్దేశించి ప్రసంగించే ముందు రెడ్ ఫోర్డ్ వద్ద ఉన్న చారిత్రాత్మక లాహోరి గేట్ (ఢిల్లీలోని ఎర్రకోటకు ప్రధాన ద్వారం) వద్దకు చేరుకున్నారు. అక్కడ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం, తన ప్రసంగాన్ని ప్రారంభించారు. -
బ్లాక్ మెయిల్ నడవదు.. పాక్ బెదిరింపులకు భయపడేది లేదు: మోదీ హెచ్చరిక
సాక్షి, ఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ప్రధాని మోదీ.. కీలక వ్యాఖ్యలు చేశారు. బ్లాక్ మెయిల్కు భారత్ తలవంచే రోజులు పోయాయని మోదీ హెచ్చరికలు జారీ చేశారు. ఆపరేషన్ సిందూర్తో మన దేశ సత్తా చాటామని చెప్పుకొచ్చారు. అణుబాంబు బెదిరింపులను సహించేది లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆత్మనిర్భర్ అంటే డాలర్, పౌండ్పై ఆధారపడటం కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోటపై 12వసారి జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ. ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి మోదీ ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ విజయం గురించి మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఎర్రకోట వద్ద ఎంఐ-17 హెలికాప్టర్ పూల వర్షం కురిపించింది. ఎర్రకోటపై జాతినుద్దేశించి మోదీ ప్రసంగిస్తూ.. ప్రతీ ఇంటిపై మువ్వెన్నల జెండా ఎగిరే సమయం ఇది. 140 కోట్ల మంది సంకల్ప పండుగ ఇది. సమైక్య భావంతో దేశం ఉప్పొంగే సమయం. కోట్ల మంది త్యాగాలతో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం కోసం ప్రాణ త్యాగం చేశారు. దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం.#WATCH | Delhi: Prime Minister Narendra Modi says, "My beloved citizens of India, this festival of independence is a festival of 140 crore resolutions. It is a moment of collective achievements, filled with pride and joy. The nation is continuously strengthening the spirit of… pic.twitter.com/YPze5woDJ6— ANI (@ANI) August 15, 2025ఉగ్రవాదులకు బుద్ది చెప్పాం.. పహల్గాంలో ఉగ్రవాదులు నరమేథం సృష్టించారు. భార్య ముందే భర్తలను చంపేశారు. పిల్లల ముందే తండ్రిని చంపేశారు. మతం అడిగి మరీ మారణహోమం సృష్టించారు. ఆపరేషన్ సిందూర్తో పాక్ ఉగ్రవాదులను మట్టిలో కలిపేశాం. మన సైన్యం పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఆపరేషన్ సిందూర్తో మన దేశ సత్తా చాటాం. ఆపరేషన్ సిందూర్ హీరోలకు నా సెల్యూట్. అణుబాంబు బెదిరింపులను సహించేది లేదు. మన సైనికులు ఊహకందని విధంగా శత్రువులను దెబ్బతీశారు. పాక్ బ్లాక్ మెయిల్ నడవదు.. ఇకపై ఎవరి బ్లాక్ మెయిల్ నడవదు. నీళ్లు, రక్తం కలిసి ప్రవహించలేవు. ఉగ్రమూకలకు మన సైన్యం బుద్ది చెప్పింది. మన సైన్యానికి పూర్తి స్వేచ్చ ఇచ్చాం. ఉగ్రవాదులకు సాయం చేసే వారినీ వదలిపెట్టం. బ్లాక్ మెయిల్కు పాల్పడితే ధీటుగా జవాబిస్తాం. ఎన్నో ఏళ్లుగా అణుబాంబుల పేరిట బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. సింధూ నది జలాలపై భారత్కు పూర్తి హక్కులున్నాయి. ఏడు దశాబ్దాలుగా మన రైతులు ఇబ్బంది పడ్డారు. సింధూ నదిలో నీరు భారతీయుల హక్కు. సింధూ ఒప్పందాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు. ఉగ్రవాదం మానవాళి మనుగడకే ముప్పు. ఆత్మ నిర్భర్ భారత్తో స్వయం సమృద్ది..ఆపరేషన్ సిందూర్తో మేడిన్ ఇండియా సత్తా ప్రపంచానికి చాటి చెప్పాం. ఆత్మనిర్భర్ అంటే డాలర్, పౌండ్పై ఆధారపడటం కాదు. అనేక సవాళ్లు ఎదుర్కొన్న భారత్.. ఇప్పుడు స్వయం సమృద్ధి దిశగా నడుస్తోంది. న్యూక్లియర్ ఎనర్జీపై భారత్ చొరవ చూపిస్తోంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా స్వయం సమృద్ధిపై వెనక్కి తగ్గేది లేదు. ప్రతీ రంగంలో భారత్ అడుగులు ముందుకు వేస్తోంది. 2030లోగా భారత్లో 50 శాతం క్లీన్ ఎనర్జీ తీసుకురావడం లక్ష్యం. ఎగుమతి, దిగుమతులు, ఆదాయ వ్యయాలే స్వయం సమృద్ధి కాదు. స్వయం సమృద్ధి అంటే సమున్నతంగా నిలబడటం. మేక్ ఇన్ ఇండియా నినాదం రక్షణ రంగంలో మిషన్ మోడ్లో పనిచేస్తోంది. టెక్నాలజీ సాయం కోసం భారత్ ఇప్పుడు ప్రపంచాన్ని అర్థించడం లేదు. ప్రపంచ దేశాలకు సాయం, టెక్నాలజీ అందిస్తున్నాం. ఆత్మ నిర్భర్ భారత్తో మన సామర్థ్యం ప్రపంచ దేశాలకు తెలిసింది. దీపావళి బహుమతి ఇవ్వబోతున్నాం..సైబర్ టెక్నాలజీ, డీప్ టెక్నాలజీల్లో భారత్ బలమైన పాత్ర. ప్రపంచ వాణిజ్యంలో మన సామర్థ్యం చాటాల్సి ఉంది. అంతరిక్ష పరిశోధనాల్లోనూ భారత్ తనదైన ముద్ర వేసింది. గగన్యాన్తో భారత్ శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసింది. మన యువ శాస్త్రవేత్తలు, నిపుణులు నిరంతరం శ్రమిస్తున్నారు. వ్యాక్సిన్ పరిశోధనల్లో భారత్ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాం. అనేక క్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచానికి భారత్ అండగా నిలిచింది. జీఎస్టీలో సంస్కరణలు తీసుకువస్తున్నాం. సామాన్యులు చెల్లించే పన్నుల్లో భారీగా కోత పెట్టబోతున్నాం. దీని వల్ల వస్తువుల ధరలు భారీగా తగ్గుతాయి. దేపావళికి దేశ ప్రజలకు బహుమతి ఇవ్వబోతున్నాం. ఈసారి దీపావళికి రెండింతల సంతోషం తీసుకురాబోతున్నాం. ఖనిజాలే ముఖ్యం.. నాకు యువత శక్తి, సామర్థ్యాలపై నమ్మకం ఉంది. సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్వైపు దేశ యువత దృష్టి పెట్టాలి. ఫైటర్ జెట్లకు మేడిన్ ఇండియా ఇంజిన్లపై దృష్టిపెడతాం. గ్రీన్హైడ్రోజన్ ప్రాజెక్ట్లను ముందుకు తీసుకెళ్తున్నాం. కొత్త ఇందనాల అభివృద్ధితో పెట్రోలియం దిగుమతులు తగ్గించాలన్నది లక్ష్యం. 2047 నాటికి న్యూక్లియర్ ఎనర్జీని 10 రేట్లు పెంచాలన్నది టార్గెట్. 10 కొత్త అణు రియాక్టర్లపై వేగంగా పనులు జరుగుతున్నాయి. ఇవాళ ప్రపంచమంతా కీలక ఖనిజాల చుట్టే తిరుగుతుంది. కీలక ఖనిజాల విషయంలో స్వయం సమృద్ధికి కృషి చేస్తున్నాం. ఖనిజాల కోసం 1200 ప్రాంతాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. త్వరలో మేడిన్ ఇండియా చిప్స్ మార్కెట్ను ముంచెత్తనున్నాయి. సెమీ కండక్టర్ల విషయంలో భారత్ ఎప్పుడో ఆలోచన చేసింది. యువత కోసం రూ.లక్ష కోట్లతో కొత్త పథకం. పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పేరుతో పథకం. పంద్రాగస్ట్ సందర్భంగా పథకం ప్రారంభం. సంస్కరణల విషయంలో మాకు మద్దతు పలకాలి. తొలిసారి ఉద్యోగం పొందిన యువతీయువకులకు 15వేలు అందజేస్తాం. కంపెనీలకు ప్రోత్సాహం అందిస్తాం. ఇక, అంతకుముందు.. ఎర్రకోటలో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్. కాగా, 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్రం నయా భారత్ థీమ్తో ఉత్సవాలు జరుపుతోంది.#WATCH | Delhi: Prime Minister Narendra Modi hoists the national flag at the Red Fort. #IndependenceDay (Video Source: DD) pic.twitter.com/UnthwfL72O— ANI (@ANI) August 15, 2025#WATCH | Prime Minister Narendra Modi pays tribute to Mahatma Gandhi at Rajghat, in Delhi, on #IndependenceDay (Video: DD) pic.twitter.com/3ecTwDdQXB— ANI (@ANI) August 15, 2025 -
వచ్చే నెలలో అమెరికాకు మోదీ
ఐక్యరాజ్యసమితి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్లో అమెరికాలో పర్యటించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 9 నుంచి ఐక్యరాజ్యసమితి సాధారణ సభ(యూఎన్జీఏ) వార్షిక ఉన్నతస్థాయి సమావేశం ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 23 నుంచి 29 దాకా జనరల్ డిబేట్ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారని సమాచారం. డిబేట్లో ప్రసంగించేవారి పేర్ల జాబితాను ఐక్యరాజ్యసమితి విడుదల చేసింది. ఇందులో మోదీ పేరును సైతం చేర్చారు. సంప్రదాయం ప్రకారం తొలుత బ్రెజిల్, తర్వాత అమెరికా అధినేత ప్రసంగిస్తారు. డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెల 23న యూఎన్జీఏ పోడియం నుంచి ప్రసంగించబోతున్నారు. ఆయన రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఐక్యరాజ్యసమితిలో చేయబోతున్న తొలి ప్రసంగం ఇదే కావడం విశేషం. సెప్టెంబర్ 26న మోదీ ప్రసంగించే అవకాశం కనిపిస్తోంది. అదే రోజు ఇజ్రాయెల్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ నేతలు కూడా మాట్లాడుతారు. మరోవైపు అమెరికా పర్యటన సందర్భంగా డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ కాబోతున్నట్లు సమాచారం. భారత ఉత్పత్తులపై విధించిన 50 శాతం సుంకాలపై ట్రంప్తో ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో పర్యటించారు. వైట్హౌస్లో ట్రంప్తో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. -
భారత్ వైపు ప్రపంచం చూపు!
ఇప్పుడు ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తున్నదనటంలో అతిశయోక్తి లేదు. ఈ పరిణామం ఈ నెల 6వ తేదీన చోటుచేసుకుంది. ఆ రోజున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై సుంకాలను మరొక 25 శాతం పెంచి, మొత్తం 50 శాతానికి చేర్చారు. దానితో మోదీ ప్రభుత్వం ఒత్తిడికి గురై రష్యన్ చమురు కొనుగోళ్ళను ఆపటంతో పాటు, వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న చర్చలో తమ ప్రతిపాదనలకు అంగీకరించగలదన్నది ట్రంప్ ఎత్తుగడ. అనూహ్యమైన రీతిలో ప్రధాని మోదీ అదేరోజు రాత్రి ఎదురుదాడి ప్రారంభించారు.ప్రపంచం కోసం నిలబడగలమా?ట్రంప్ చర్యలను చైనా, బ్రెజిల్, యూరోపియన్ యూనియన్, కెనడా, జపాన్, దక్షిణాఫ్రికా, రష్యా వంటివి మొదటి నుంచి పూర్తిగానో, పాక్షికంగానో వ్యతిరేకిస్తుండటంలో విశేషం లేదు. వీటన్నింటికి భిన్నంగా పెద్ద దేశాలలో ఇండియా ఒక్కటే మొదటి నుంచి అమెరికాతో మెత్తగా వ్యవహరిస్తూ వచ్చింది. ఒక పెద్ద వర్ధమాన దేశం అయి ఉండి, ‘బ్రిక్స్’లో ప్రధాన పాత్ర వహిస్తూ, ట్రంప్ చర్యల కారణంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తున్నా, ప్రతిఘటించకపోవటంపై అంతటా విమర్శలు వినిపించాయి. అటువంటి స్థితిలో మోదీ చేసిన ప్రసంగం, అందులోని భాష, తనలో కనిపించిన దృఢమైన వైఖరి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడిక ఆయన భారతదేశం కోసమే గాక, తక్కిన ప్రపంచంతో కూడా కలిసి నిలబడవచ్చుననే ఆశాభావాలు వినవస్తున్నాయి.అదే సమయంలో, ఇల్లలకగానే పండుగ కాదనే పెద్దల హెచ్చరికను గుర్తుంచుకోవలసి ఉంటుంది. వీటికి స్వల్పకాలిక, మధ్యకాలిక ప్రభావాలు అనేకం ఉంటాయి. అవి వాస్తవంగా భూకంపానికి దారితీయగలవు. స్లో మోషన్లో ఆర్థిక ప్రపంచ యుద్ధాన్ని సృష్టించగలవు. మన ప్రపంచం నిజమైన అర్థంలో రాజకీయంగా, ఆర్థికంగా, ప్రజాస్వామికంగా మారాలంటే, చిరకాలపు అధిపత్య శక్తుల భూమి కింద అటువంటి భూకంపం రావటం అవసరం.కొండ చరియలలో కింది వైపున కేవలం ఒక రాయి కదలికలో మొత్తం చరియలే కూలినట్లు, చరిత్రలో ఒకోసారి చిన్న ఘటనలు పెనుమార్పులకు దారి తీస్తుంటాయి. క్రమంగా బలహీనపడుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థను, భౌగోళిక ఆధిపత్యాన్ని తిరిగి శక్తిమంతం చేయదలచిన ట్రంప్, అమెరికన్ కొండచరియలో ఒకొక్క రాయినే తనకు తెలియకుండానే తోసివేస్తున్నారు. ఇప్పుడు ఇండియా రూపంలో ఒక ముఖ్యమైన రాయి తొలగిపోతున్నదనుకోవాలా?ఇండియా దృఢ వైఖరినిజంగానా, లేక ఇది తొందరపాటు మాటా అన్నది ప్రశ్న. ఒకవైపు అమెరికా నాయకత్వాన ఒక శక్తిమంతమైన కూటమి ఉంది. అది బలహీన పడుతున్న మాట నిజమేగాని అవసాన దశకేమీ చేరలేదు. మరొకవైపు భారత్తో కూడిన ‘బ్రిక్స్’ దేశాలు నానాటికీ బలపడుతున్నాయి. ఇది తమ ఆధిపత్యానికి ఎంత ప్రమాదకరం కాగలదో అర్థమైనందువల్లనే ట్రంప్ ‘బ్రిక్స్’పై కత్తిగట్టారు. ఆయన వేర్వేరు దేశాలపై వేర్వేరుగా ప్రకటిస్తున్న ట్యారిఫ్లను, వేర్వేరు పద్ధతులలో సాగిస్తున్న చర్చలను గమనిస్తే, ‘బ్రిక్స్’ దేశాల పట్ల ‘విభజించి పాలించే’ వ్యూహాన్ని అనుసరిస్తున్నటు స్పష్టమవుతుంది.చర్చలోకి వెళితే, మోదీ నాయకత్వాన భారతదేశానికి అమెరికాతో అవసరాలున్నాయి, పేచీలు కూడా ఉన్నాయి. గతకాలపు చిన్నచిన్న పేచీలను అటుంచి ఇప్పుడు ట్యారిఫ్లతో, వాణిజ్య ఒప్పందంలోని ప్రతిపాదనలతో పెద్ద పేచీ తలెత్తింది. ఒకవైపు భారతదేశం స్వతంత్ర శక్తిగా గతం కన్నా బలపడుతూ తన భవిష్యత్తు పట్ల దృష్టి మారుతుండటం, మరొకవైపు అమెరికా క్రమంగా బలహీనపడుతూ ఏకధ్రువ ప్రపంచ స్థితి మారుతుండటం గమనించవలసిన కొత్త పరిణామాలు.ఇటువంటిది ఏర్పడినపుడు, వ్యూహాత్మకంగా అగ్రరాజ్యం ఎంతో వివేకంగా, చతురతతో వ్యవహరించాలి. ట్రంప్ నాయకత్వాన అమెరికా అవివేకపు వ్యూహాన్ని అనుసరిస్తున్నందున, ఇండియా వంటి మిత్రదేశంతోనూ సంబంధాలు చెదిరిపోతున్నాయి. అట్లా జరగకుండా ఉండేందుకు మోదీ మొదట గట్టి ప్రయత్నమే చేశారు. కానీ, ఏమి చేసైనా సరే తన ‘మాగా’ లక్ష్యాలను సాధించాలనే ఒత్తిడుల మధ్య అమెరికా అధ్యక్షుడు– యూరప్, కెనడా, జపాన్, మెక్సికో వంటి ఇతర మిత్ర దేశాలకు వలెనే ఇండియాను కూడా దారికి తెచ్చుకోగలనని నమ్మారు. వాటికీ,భారత్కూ మధ్యగల వ్యత్యాసాలను గ్రహించలేకపోయారు. దానితో, ఇంధనం అయితేనేమి, వ్యవసాయ రంగం అయితేనేమి... దేశ ప్రయోజనాల కోసం మోదీ ప్రభుత్వం నిలబడక తప్పలేదు. వాస్తవానికి వ్యవసాయ రంగం విషయమై, గాట్ – డబ్ల్యూటీవో చర్చల దశలో ఇండియా ఇతర వర్ధమాన దేశాలతో కలిసి గట్టిగానే నిలబడింది. అదే ఇపుడు కూడా జరుగుతున్నది. పాఠాలు నేర్చుకోనిది అమెరికా కూటమే!ఆర్థిక భూకంపం రానుందా?ఇంతవరకు బాగున్నది. రాగల కాలపు పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. ట్రంప్ తన ధోరణిని మార్చుకుని అంతా సుఖాంతం కావచ్చునా? భారతదేశంతో తగినంత రాజీ పడవచ్చునా? ట్రంప్ స్వభావమేమిటో ఈ సరికి బోధపడింది గనుక ఆయనను నమ్మలేమని ప్రధాని మోదీ తన స్వతంత్ర వైఖరిని కొనసాగించగలరా? మొన్నటి 6వ తేదీ తర్వాత వడివడిగా రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలాతో సంప్రతింపులు జరిపి, పుతిన్ను ఆహ్వానించి, చైనాలో జరగనున్న షాంఘై సహకార సంస్థ సమావేశాలకు వెళ్ళనున్నట్లు ప్రకటించి, అక్కడ జిన్పింగ్తో సమావేశం జరగవచ్చుననే సంకేతాలు పంపినందున, ఇవన్నీ మునుముందు బ్రిక్స్ వేదికగా కొత్త మార్గాన్ని మరింత దృఢంగా అనుసరించగలమనే సూచనలు కావచ్చునా? అటువంటిది గనుక అయితే, ఆగస్టు 6 నాటి భూ ప్రకంపనలు రాగల కాలపు భూకంపానికి నాంది అవుతాయి. అట్లా జరగాలన్నదే వర్ధమాన ప్రపంచపు కోరిక కావచ్చు కూడా! కానీ అది తేలిక కాదు. ట్రంప్ ప్రతీకారాన్ని తట్టుకునేందుకు సైతం సిద్ధపడవలసి ఉంటుంది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య సంబరాల్లో పాల్గొనాలంటే..!
దేశంలో ఎటు చూసినా.. పంద్రాగస్టు సంబరాల కోలహలమే. చారిత్రక ప్రదేశాల్లో ఈ 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకునేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే పనులతో సందడిగా ఉంది. ఎందరో అమర వీరుల త్యాగఫలమే ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక. ఆ సమరయోధుల అందర్నీ స్మరిస్తూ..సగర్వంగా ఈ వేడుకుని జరుపుకోనుంది భారతదేశం. ఈ వేడుక ఢిల్లీ ఎర్రకోటలో మరింత ప్రత్యేకం. వివిధ రాష్ట్రాల సాంస్కృతిక వైభవానికి అర్థంపట్టేలా విభిన్న శకటాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ సాయుధ దళాల సాహస విన్యాసాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య వేడుకలు ప్రేక్షకులను ఆద్యంతం అలరిస్తూ కట్టిపడేసేలా మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అదీగాక ఈ వేడుకల్లో దేశ విదేశాల ప్రముఖులు, సెలబ్రిటీలు పాల్గొంటారు. వారందరి సమక్షంలో ఈ వేడుకలను తిలకిస్తే కలిగే ఆ అనుభవం వేరెలెవెల్ . పైగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జెండా ఎగరువేసిన తదనంతరం ఇచ్చే స్పీచ్ని ప్రత్యక్షంగా చూడాలని చాలామంది కోరుకుంటారు. ఈ సంబరాల్లో ప్రత్యక్షంగా పాల్గొని మోదీ స్పీచ్ని వీక్షించాలనుకుంటే జస్ట్ ఇలా చేయండి చాలు..ఎర్రకోట వద్ద జరిగే స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలనుకుంటే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో టికెట్లు బుక్ చేసుకుంటే చాలు. టిక్కెట్ల అమ్మకాలు ఆగస్టు 13, 2025 నుండి రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక పోర్టల్లలో ప్రారంభమవుతాయి. అదెలాగంటే..ఆన్లైన్ ప్రక్రియ..అధికారిక వెబ్సైట్ aamantran.mod.gov.in లేదా e-invitations.mod.gov.in. సందర్శించి స్వాతంత్ర్య దినోత్సవం 2025 టికెట్ బుకింగ్ లింక్పై క్లిక్ చేయాలి. వివరాలను ఇలా పూరించాలి..పేరు, మొబైల్ నంబర్, టిక్కెట్ల సంఖ్య పూర్తి చేయాలివెరిఫికేషన్ కోసం మీ ఆధార్ కార్డ్ లేదా ఏదైనా చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ ఫోటో IDని డౌన్లోడ్ చేసుకోండి.టికెట్ కేటగిరీని ఎంచుకోవాలి: రూ. 20 (జనరల్ కేటగిరీ), రూ. 100 (మధ్యతరగతి), రూ. 500 (ప్రీమియం కేటగిరీ)ఆ తర్వాత ఆన్లైన్లో చెల్లింపు చేసి QR కోడ్ సీటింగ్ వివరాలతో ఇ-టికెట్ను డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని ఫోన్లో డిజిటల్ కాపీ లేదా ప్రింటవుట్ కాపీని ఉంచండి — అది గేట్ వద్ద అవసరం.ఆఫ్లైన్లో బుక్ చేసుకోవడం ఎలాప్రస్తుతం అంతా ఆన్లైన్ సేవలే వినియోగిస్తున్నప్పటికీ రక్షణ మంత్రిత్వ శాఖ ఆగస్టు 10, 12 తేదీల్లో ఎంపిక చేసిన ఢిల్లీలోని కొన్ని ప్రదేశాల్లో కౌంటర్లను ఏర్పాటు చేస్తుంది. దీన్ని సాధారణంగా ప్రభుత్వ భవనాలు, వార్తాపత్రికలు, అధికారికి వెబ్సైట్లో ప్రకటిస్తుందిఆఫ్లైన్ బుకింగ్ కోసం..చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడి (ఆధార్, ఓటరు ఐడి, పాస్పోర్ట్) తీసుకెళ్లాలి.టికెట్ ధరను (రూ. 20, రూ. 100, లేదా రూ. 500) నగదుగా లేదా డిజిటల్ చెల్లింపుల్లో చెల్లించండి.టిక్కెట్ను తీసుకుని సురక్షితంగా ఉంచుకోవాలి. ఆఫ్లైన్ టికెట్లు పరిమిత సంఖ్యలో దొరకుతాయి కాబట్టి ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది.ఏవిధంగా చేరుకోవాలంటే..ఎర్రకోట చేరుకోవడానికి ఢిల్లీ మెట్రో అత్యంత అనుకూలమైన మార్గం. అందుకోసం లాల్ ఖిలా లేదా చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఈ మెట్రో సేవలు ఉదయం: 4.00 గంటలకు ప్రారంభమవుతాయి. కార్యక్రమం ఉదయం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి ఉదయం 6:30–7:00 గంటల మధ్య చేరుకునేలా ట్రావెల్ని ప్లాన్ చేసుకోవాలి. ప్రవేశానికి ముందు చాలా కఠినతరమైన భద్రత ఉంటుందనేది గుర్తు ఎరగాలి. చివరగా ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని ఎర్రకోట నుంచి ప్రత్యక్షంగా వీక్షించే అనుభవాన్ని పొందాలనుకుంటే మాత్రం త్వరితగతిన టికెట్లు బుక్ చేసుకుని టైమ్కి చేరుకునేలా చక్కగా ట్రావెల్ని ప్లాన్ చేసుకోవాలనేది గ్రహించండి.(చదవండి: Goa Tourism 2025 Rules: గోవా వెళ్తున్నారా? ఈ విషయం తెలుసా? రూ.లక్ష కట్టాల్సిందే...) -
ఐరాస సమావేశానికి ప్రధాని మోదీ .. ట్రంప్తో ముఖాముఖీ?
న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్యసమితి(ఐరాస) సర్వసభ్య సమావేశం (యూఎన్జీఏ) వార్షిక ఉన్నత స్థాయి సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే అవకాశం ఉందని పీటీఐ తెలిపింది. ఇదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ సమావేశంలో ప్రసంగించనున్నారని పేర్కొంది.భారత దిగుమతులపై ట్రంప్ పరస్పర సుంకాలు విధించడంతో భారత్- అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో ప్రధాని మోదీ యూఎన్జీఏ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశం అమెరికాలోని న్యూయార్క్లో జరగనుంది. సెప్టెంబర్ 23 నుండి 29 వరకు జరిగే ఈ సదస్సును సాంప్రదాయకంగా బ్రెజిల్ ప్రారంభించనుంది. ఆ తరువాత యునైటెడ్ స్టేట్స్ సెషన్ ఉంటుందని సమాచారం. భారత ప్రతినిధి సెప్టెంబర్ 26న ఉదయం అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు పీటీఐ పేర్కొంది. అదే రోజున ఇజ్రాయెల్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రతినిధులు కూడా ప్రసంగించే అవకాశం ఉంది.గత ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికాలోని వైట్ హౌస్లో ట్రంప్తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం భారత్తో వాణిజ్య చర్చలు నడుస్తున్న తరుణంలోనే ట్రంప్ భారతదేశంపై 25 శాతం అదనపు సుంకం విధించారు. దీంతో మొత్తం విధించిన సుంకం 50 శాతంగా మారింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ చర్యను అన్యాయమైనదిగా పేర్కొంది. కాగా సెప్టెంబర్ 26న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోదీ.. అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి భేటీ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సహా పలు దేశాధినేతలతో మోదీ భేటీ కానున్నారని తెలుస్తోంది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై వివాదం నెలకొన్న ప్రస్తుత తరుణంలో ప్రధాని మోదీ , అధ్యక్షుడు ట్రంప్ భేటీ కానుండటం ఆసక్తికరంగా మారింది. -
వైరల్ ఫొటో.. ప్రధాని మోదీ వెనుకనున్న అదాసో కపేసా ఎవరంటే..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల యూకేలో పర్యటించారు. ఈ సందర్భంగా నలుపురంగు సూట్ ధరించిన ఒక మహిళా అధికారి ప్రధాని మోదీకి రక్షణగా నిలిచిన ఫొటో ఒకటి వైరల్గా మారింది. ఈ నేపధ్యంలో ఆమె ఎవరనే చర్చ ఇంటర్నెట్లో మొదలయ్యింది. ఆమె ఎవరో, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు.వైరల్ ఫొటోలో ప్రధాని మోదీ వెనుక రక్షణగావున్న ఆ మహిళా అధికారి పేరు అదాసో కపేసా. ప్రధాని రక్షణ బాధ్యతలు వహించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)లో పనిచేస్తున్న మొట్టమొదటి మహిళ ఆమె. అదాసో కపేసా మణిపూర్లోని సేనాపతి జిల్లాలోని కైబి గ్రామానికి చెందిన మహిళ. స్థానిక పాఠశాలలో చదువు పూర్తి చేసిన అనంతరం ఆమె సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ)లో చేరారు. ఉత్తరాఖండ్లోని పిథోరగఢ్లోని 55వ బెటాలియన్లో విశిష్ట సేవలందించారు. ఆమె తన పనితీరుతో సీనియర్ అధికారుల నుండి అభినందనలు అందుకున్నారు. ఎంతో కఠినమైన కమాండో శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన ఆమె ఎస్పీజీకి ఎంపికయ్యారు.ఎస్పీజీ అనేది దేశంలోని అత్యంత ఉన్నత భద్రతా విభాగం. ఇది ప్రధాని, అతని కుటుంబ సభ్యులకు గట్టి భద్రత కల్పిస్తుంది. ఎస్పీజీలో ఎంపిక కావాలంటే ఆయుధ శిక్షణ, యుద్ధ కళలు, బాంబు నిర్వీర్యం తదితర అంశాలలో శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలో పలు శారీరక, మానసిక పరీక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది. అదాసో కపేసా 2020లో ఎస్పీజీ కమాండో శిక్షణను పూర్తి చేసి, 2024లో ప్రధాని ప్రధాన భద్రతా బృందంలో చేరారు. ఇంతటి అత్యున్నత బాధ్యతలు చేపట్టిన అదాసో కపేసా మహిళలకు స్ఫూర్తినందిస్తున్నారు.1984లో నాటి ప్రధాని ఇందిరా గాంధీని ఆమె సొంత అంగరక్షకులే హత్య చేసిన దరిమిలా 1985లో ఎస్పీజీ ఏర్పాటయ్యింది. ప్రధాని రక్షణ బాధ్యత ఎస్పీజీ అధికారులపై ఉంటుంది. ఇండియన్ పోలీస్ సర్వీస్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సశస్త్ర సీమా బల్ తదితర సాయుధ విభాగాల నుండి ఎస్పీజీ సిబ్బందిని నియమిస్తారు. భారతదేశ భద్రతా వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరిగిందనడానికి అదాసో కపేసా ఒక ఉదాహరణగా నిలిచారు. -
మోదీకి జెలెన్స్కీ ఫోన్
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోమ వారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్లోని నగరాలు, గ్రామాలపై జరుగుతున్న రష్యా సైన్యం దాడుల గురించి వివరించారు. కాల్పుల విరమణకు రష్యా సిద్ధంగా లేనట్లు కనిపిస్తోందని అన్నారు. ఉక్రెయిన్–రష్యా మధ్య శాంతికి చొరవ చూపాలని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశం సందర్భంగా వ్యక్తిగతం భేటీ కావాలని జెలెన్స్కీ, మోదీ నిర్ణయించుకున్నారు. నరేంద్ర మోదీతో సంభాషణ అనంతరం జెలెన్స్కీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. భారత్, ఉక్రెయిన్ మధ్య ద్వైపాకిక్ష సహకా రంతోపాటు దౌత్య సంబంధాల్లో పురోగతిపై చర్చించామని తెలిపారు. ఉక్రెయిన్–రష్యా మధ్య ఘర్షణకు తెరప డాలని, సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొనాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. అందుకు భారత్ సహకారం అవసరమని పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్కు అన్నివిధాలుగా అండగా నిలుస్తున్నందుకు ప్రధాని మోదీకి జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలియజేశారు. మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొ ద్దంటూ భారత్కు అమెరికా చేసిన హెచ్చరికల అంశం కూడా జెలెన్స్కీ, మోదీ మధ్య చర్చకు వచ్చింది. భారత్ చెల్లిస్తున్న డబ్బులతో రష్యా సైన్యం తమపై దాడులు చేస్తోందని జెలెన్స్కీ పేర్కొన్నారు. అందుకే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మోదీ సైతం ‘ఎక్స్’లో ప్రతిస్పందించారు. ఉక్రెయిన్– రష్యా మధ్య శాంతికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టంచేశారు. ఉక్రెయిన్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామన్నారు. -
చట్టసభలే సరైన వేదికలు
మన చట్టసభల వల్ల ప్రజలకూ, ప్రజాస్వామ్యానికీ ఏ మేరకు ప్రయోజనం కలుగుతోందన్న అంశంలో ఎవరి అభిప్రాయాలు వారికున్నా... అక్కడి చర్చల సరళి ఇంకా మెరుగుపడాలని, ప్రభుత్వ జవాబుదారీతనం మరింత పెరగాలన్న విషయంలో అందరూ ఏకీభవిస్తారు. గత నెలాఖరున మూడు రోజులపాటు ‘ఆపరేషన్ సిందూర్’పై విస్తృత చర్చ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలోనూ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలోనూ సమాధానమిచ్చారు. కానీ భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ శనివారం చేసిన ప్రసంగంలోనూ, అంతక్రితం ఈ నెల 4న సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది మద్రాస్ ఐఐటీలో చేసిన ఉపన్యాసంలోనూ కనబడిన స్పష్టత, వివరాలు చర్చ సందర్భంగా ప్రధాని, కేంద్ర హోంమంత్రి చేసిన ప్రకటనల్లో లేవు. ఇరు దేశాల మధ్యా కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం వెనక ఏ ప్రపంచ నాయకుల ఒత్తిళ్లూ లేవని ఇద్దరూ నిర్ద్వంద్వంగా చెప్పటం హర్షించదగ్గదే అయినా, ఆ ఆపరేషన్లో మనం సాధించిన విజయాలనూ, ఆ క్రమంలో ఎదురైన సవాళ్లనూ వివరించకపోవటం, అసలు పెహల్గాం భద్రతా లోపాలూ, వాటిపై చర్యలూ వెల్లడించకపోవటం లోటే అనిపిస్తుంది. అనర్గళంగా మాట్లాడగలిగే శక్తివున్నవారెవరో, అవతలి పక్షాన్ని వ్యంగ్యంతో, వెటకారంతో గేలిచేసి చిన్నబుచ్చగలవారెవరో తెలుసుకోవటానికి ప్రజలు చట్టసభల ప్రత్యక్ష ప్రసారాలు చూడరు. వాస్తవాలు తెలుసుకోవా లనుకుంటారు. విపక్షాల సందేహాలకు ప్రభుత్వం సూటిగా, స్పష్టంగా జవాబిచ్చిందా లేదా అనేది గమనిస్తారు. కానీ పార్లమెంటులో జరిగింది వేరు. ఎప్పటిలా పరస్పరం నిందారోపణలు చేసుకోవటంతోనే చాలా సమయం గడిచింది. ‘సిందూర్’లో జరిగిందేమిటో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ చెప్పారు. పాకిస్తాన్కు చెందిన అయిదు యుద్ధ విమానాలను కూల్చటంతోపాటు మరో భారీ విమానాన్ని సైతం పడగొట్టామని, దాదాపు 90 గంటల వ్యవధిలో అనుకున్న లక్ష్యాలను సాధించామని ఆయన వివరించారు. మన గగనతల రక్షణ వ్యవస్థ, డ్రోన్ వ్యవస్థ సక్రమంగా పనిచేయటంతో పాక్ సైన్యం పాచికలేమీ పారలేదని, వారి ఎఫ్–16లూ, డ్రోన్లూ, క్షిపణులనూ కూల్చేయటంతోపాటు రెండు కమాండ్ కంట్రోల్ కేంద్రాలనూ, ఒక వైమానిక స్థావరాన్నీ ధ్వంసం చేశామని ప్రకటించారు. జనరల్ ద్వివేది అయితే ప్రభుత్వం రాజకీయ స్పష్టతతో దిశానిర్దేశం చేయటం, విశ్వాసాన్నీయటం, నిర్ణయాన్ని తమకే వదిలేయటం తొలిసారి చూశామని చెప్పారు. ఇటువంటి ప్రకటనలు పార్లమెంటు వేదికపై ప్రభుత్వం వైపుగా వస్తే, వాటిపై విపక్షం ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు వెల్లడయ్యేవి. ముఖ్యంగా జనరల్ ద్వివేది ప్రసంగం వాస్తవ స్థితేమిటో చెప్పింది. శత్రువుతో ఇప్పుడు నాలుగు రోజుల్లోనే ఘర్షణలు సమసినా... త్వరలోనే మరో యుద్ధం జరిగినా ఆశ్చర్యం లేదని, ఈసారి ఒంటరిగా వస్తారా, వేరే దేశాలతో కలిసి వస్తారా అన్నది కూడా చెప్పలేమని ఆయన అనటం గమనించదగ్గది. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్జీత్, జనరల్ ఉపేంద్ర ద్వివేది కూడా ‘ఆపరేషన్ సిందూర్’ దేశాన్ని ఏకం చేయటం గురించి ప్రస్తావించారు. దేశ ప్రజానీకమంతా ఒక్కటై నిలబడటం సాధారణ విషయం కాదు. ఇందులో విపక్షాల పాత్రను కొట్టిపారేయలేం. పెహల్గాంలో భద్రతా లోపాలపై తీసుకున్న చర్యలేమిటో చెప్పకపోవటం, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్–పాక్ ఘర్షణలు ఆగటం తన ఘనతేనని ప్రకటించటం విపక్షాలకు అభ్యంతరకరం అయింది. ట్రంప్ మధ్యలో స్వరం మార్చినా తిరిగి దాన్నే పదే పదే చెబుతున్నారు. అందువల్ల పార్లమెంటు వేదికగా దేశానికి మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి జరిగిందేమిటో చెప్పాల్సిన బాధ్యత పాలకులపై పడింది. ప్రశ్నిస్తున్న విపక్షాలు పాకిస్తాన్తో కుమ్మక్కయ్యాయని ప్రత్యారోపణ చేయటం ఇందుకు ప్రత్యామ్నాయం కాదు. యుద్ధ రంగంలో వ్యూహాలూ, ఎత్తుగడలూ ఎలావుండాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను సైన్యానికి వదిలిపెట్టినా, ఆ క్రమంలో ఏర్పడ్డ సమస్యలను తెలుసుకుని అవసరమైన సూచనలీయటం, జరిగిందేమిటో ప్రజలకు తేటతెల్లం చేయటం దేశ రాజకీయ నాయకత్వం బాధ్యత. మన రక్షణ దళాల చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సింగపూర్లో జూన్ నెలాఖరున మాట్లాడుతూ మన దళాలు చేసిన కొన్ని ‘వ్యూహాత్మక తప్పిదాల’ కారణంగా జెట్ విమానాలు కోల్పోయామని చెప్పటం వివాదాస్పదమైంది. పార్లమెంటులో దానిపై ప్రభుత్వం వైపునుంచి ఎలాంటి వివరణా లేదు. ఇప్పుడు దళాధిపతుల ప్రసంగాల్లోనూ ఆ వివరాల్లేవు. ఈ విషయమై సందేహాలు పోగొట్టడానికి పార్లమెంటే సరైన వేదిక. దాన్నుంచి వెలువడే సందేశం దేశ ప్రజానీకాన్ని ఒక్కటి చేస్తుంది. ఆ సంగతిని అధికార పక్షంతోపాటు విపక్షం కూడా మరువరాదు. -
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు.. ప్రధాని మోదీకి చిన్నారి లేఖ వైరల్
బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా'రోడ్డు చాలా దారుణంగా ఉంది. దయచేసి సహాయం చేయండి' అంటూ ఐదేళ్ల చిన్నారి చేతితో రాసిన విజ్ఞప్తి ప్రజల దృష్టిని ఆకర్షించింది . నెట్టింట తీవ్ర చర్చకు దారి దీసింది.బెంగళూరు నివాసి అభిరూప్ కుమార్తె ఆర్య, నగరంలోని దీర్ఘకాలిక ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించమని కోరుతూ ప్రధానమంత్రికి ఒక చిన్న లేఖ రాసింది. “నరేంద్ర మోదీ జీ, ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. మేము పాఠశాలకు , కార్యాలయానికి ఆలస్యంగా వెళ్తాము. రోడ్డు చాలా దారుణంగా ఉంది. దయచేసి సహాయం చేయండి” అని ఆమె రాసింది.PM is visiting Bangalore. My 5-year-old girl sees it as her chance to finally fix traffic. pic.twitter.com/EJdzpxSs89— Abhiroop Chatterjee (@AbhiroopChat) August 10, 2025 చిన్నారి లేఖను తండ్రి అభిరూప్ ఎక్స్లో షేర్ చేశారు. ప్రధాని బెంగళూరును పర్యటన సందర్భంగా. నా 5 ఏళ్ల అమ్మాయి దీనిని చివరకు ట్రాఫిక్ను సరిదిద్దే అవకాశంగా భావిస్తోంది" అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ త్వరగా వైరల్ అయింది, నాలుగు లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. దీంతో నెటిజన్లు కూడా ఆమె మద్దతుగా స్పందించారు.మరికొంతమంది బెంగళూరు ట్రాఫిక్ కష్టాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “కోరమంగళ నుండి ఇందిరానగర్ వరకు ఉన్న రోడ్ల కారణంగా అధ్వాన్నం. అటునుంచి వెళ్లాలంటేదాదాపు చచ్చినంత పని.. నేను రూ.3 లక్షలు ఆదాయపు పన్ను చెల్లిస్తాను. అయినా మనకు లభించేది యమపురికి దారుల్లాంటి రోడ్లు అంటూ మండిపడ్డారు. మరోవైపు ఒక యూజర్ ముంబైలో శబ్ద కాలుష్యం గురించి 15 సంవత్సరాల క్రితం తన కుమార్తె రాసిన లేఖను గుర్తు చేసుకున్నారు. ఆగస్టు 11 నుండి ఉదయం 6:30 గంటలకు బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ ప్యాసింజర్ సర్వీసులు ప్రారంభమైనాయి. కర్ణాటక మెట్రో ప్రాజెక్టు నిధులలో 87శాతం అందిస్తుందని,చ, 2030 నాటికి బెంగళూరులో 220 కి.మీ నెట్వర్క్ పూర్తవుతుందని సీఎం సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: బాల అమితాబ్ గుర్తున్నాడా? ఇపుడు రూ. 200 కోట్ల కంపెనీకి అధిపతి -
5 స్టార్ హోటల్ రేంజ్ లో ఎంపీ నేతలకు కొత్త ఫ్లాట్స్
-
పండుగలను ఇక్కడే జరుపుకోండి
న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యుల కోసం నిర్మించిన బహుళ అంతస్తుల ఫ్లాట్ల సముదాయాన్ని ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుపుకునే పండుగలను నివాస ప్రాంగణాల్లోనే జరుపుకోవాలని, అదే సమయంలో పరిశుభ్రత విషయంలో పోటీ పడాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. ప్రజలను ఐక్యంగా ఉంచుతున్న వేర్వేరు నదుల పేర్లను నాలుగు టవర్లకు పెట్టామని ఆయన చెప్పారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఒక టవర్కు కోసి నది పేరును పెట్టామంటూ కొందరు అల్పబుద్ధితో వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. లక్షలాది మందికి జీవం పోసే ఈ నదులు ఇప్పుడు ప్రజా ప్రతినిధుల జీవితాల్లో కొత్త ఆనందాలకు ప్రేరణగా నిలుస్తా యి’అని ఆయన అన్నారు. ఢిల్లీలోని బాబా ఖడక్ సింగ్ మార్గ్లో పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్కు సమీపంలో నిర్మించిన మరో మూడు టవర్లకు కృష్ణా, గోదావరి, హూగ్లీ నదుల పేర్లను పెట్టారు. కాంప్లెక్స్లో మొత్తం 184 ఫ్లాట్లు న్నాయి. అత్యా« దునిక వసతులు, పక్కాగా భద్రతా ఏర్పాట్లను కల్పించారు. ఎంపీలకు ఇళ్ల కొరత ఇబ్బందిగా మారిందని, మొదటిసారి ఎంపీలైన వారికి ఇల్లు దొరకడమే కష్టంగా మారిందని ప్రధాని ఫ్లాట్ల ప్రారంభం సందర్భంగా తెలిపారు. 2004–2014 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎంపీలకు కొత్తగా నివాసాలను నిర్మించనే లేదని ఆయన పేర్కొ న్నారు. పాతబడిన భవనాల్లో ఎంపీలు పలు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నా రు. తాము అధికారంలోకి వచ్చాక 350 ఫ్లాట్లను ఎంపీల కోసం నిర్మించామని చెప్పారు. ఇక మునుపటి ఇబ్బందులేవీ ఉండవని హామీ ఇచ్చారు. తాజాగా నిర్మించిన ఫ్లాట్లు 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలంగా ఉన్నాయని వివరించారు. వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలకు చెందిన ఎంపీలు ఈ ప్రాంగణాల్లో బస చేస్తారని.. ఇది ’ఏక్ భారత్– శ్రేష్ఠ భారత్’ ఆలోచనకు ప్రతీక అని అన్నారు. వివిధ రాష్ట్రాల పండుగలను సమష్టిగా ఇక్కడ జరుపుకోవడం గొప్ప అనుభూతినిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఎంపీలు తమ నియోజ కవర్గ ప్రజలను కూడా వేడుకల్లో భాగస్వాములుగా చేసుకోవచ్చన్నారు. ఇక్కడుండే ఎంపీలు, పరి శుభ్రతను తమ కర్తవ్యంగా భావించాలని, ఈ విష యంలో ఏటా రెండుమూడు పర్యాయాలు పోటీలు పెడితే బాగుంటుందని సంబంధిత శాఖను, కమిటీ లను కోరుతానని తెలిపారు. ఈ పోటీలో పరిశు భ్రతలో అత్యుత్తమైన బ్లాక్ పేరును ప్రకటిస్తా రన్నారు. మరో ఏడాది తర్వాత, ఉత్తమ బ్లాక్, చెత్తగా ఉండే బ్లాకులను నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. సముదాయం ఆవరణలో అనంతరం ప్రధాని మోదీ సిందూరం మొక్కను నాటారు. భవన నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్న ఇంజనీరింగ్ అధికారులు, ఇతర సిబ్బందితో ముచ్చటించారు. వారి కృషిని కొనియాడారు. -
ఎంపీల కోసం కొత్తగా 184 నివాసాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యుల కోసం నిర్మించిన కొత్త నివాస గృహాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలోని బాబా ఖరక్ సింగ్ మార్గ్లో నిర్మించిన 184 టైప్–7 మల్టీ స్టోరీ ఫ్లాట్లను ప్రధాని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఎంపీల నివాస సముదాయంలో ప్రధాని మోదీ ‘సిందూర’మొక్కను నాటి, ఆ తర్వాత నిర్మాణంలో పాల్గొన్న శ్రమజీవులతో ముచ్చటిస్తారు. అనంతరం సభికులను ఉద్దేశించి ప్రసంగిచనున్నారు. స్వయం సమృద్ధి లక్ష్యంగా రూపొందించిన ఎంపీల నూతన నివాస సముదాయం పార్లమెంట్ సభ్యుల అవసరాలకు తగిన అన్ని ఆధునిక సదుపాయాలతో ఉంటుంది. ప్రతి యూనిట్ విస్తీర్ణం సుమారు 5 వేల చదరపు అడుగులు కాగా, ఇందులో నివాసంతో పాటు అధికారిక పనులకు అనుకూలంగా గదులను కేటాయించారు. సిబ్బంది నివాసాలు, కార్యాలయాలు, కమ్యూనిటీ సెంటర్ వంటి సదుపాయాలు కల్పించారు. నివాస సముదాయంలో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను అమలు చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు. పర్యావరణ హిత సాంకేతికతతో నిర్మాణం చేపట్టి, గ్రీహా 3 స్టార్ రేటింగ్, నేషనల్ బిల్డింగ్ కోడ్–2016 ప్రమాణాలను అనుసరించారు. దీంతో శక్తి పొదుపు, పునరుత్పత్తి ఇంధన వనరుల వినియోగం, వ్యర్థాల నిర్వహణలో మెరుగులు సాధ్యమవుతాయని అధికారులు పేర్కొన్నారు. అల్యూమినియం షట్టరింగ్ విధానంలో మోనోలితిక్ కాంక్రీట్ సాంకేతికతతో నిర్మాణం పూర్తి చేయడం వల్ల సమయానికి పనులు ముగిశాయని.. భూకంప నిరోధకంగా, దివ్యాంగులకు అనుకూలంగా ఈ భవనాలను రూపొందించారు. ప్రాజెక్ట్ కోసం భూమి పరిమితంగా ఉండటంతో అపార్ట్మెంట్ తరహా గృహ నిర్మాణం చేశారు. -
మృతప్రాయ ఆర్థిక వ్యవస్థ కాదు.. మూడో స్థానానికి ఎదుగుతున్నాం
సాక్షి, బెంగళూరు: భారతదేశ ఆర్థిక వ్యవస్థ మృతప్రాయంగా మారిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా తిప్పికొట్టారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా భారత్ పరుగులు తీస్తోందని తేలి్చచెప్పారు. స్పష్టమైన ఉద్దేశాలు, నిజాయితీగల ప్రయత్నాలతో ముందుకెళ్తున్నామని వివరించారు. మన ఆర్థిక వ్యవస్థలో వేగానికి ‘సంస్కరణ, పనితీరు, మార్పు’ చోదక శక్తిగా పని చేస్తున్నాయని వెల్లడించారు. 11 ఏళ్ల క్రితం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ పదో స్థానంలో ఉండేదని, ఇప్పుడు ఐదో స్థానానికి చేరుకుందని గుర్తుచేశారు. మూడో స్థానానికి ఎగబాకడం ఇక ఎంతో దూరంలో లేదన్నారు. ప్రధాని మోదీ ఆదివారం కర్ణాటక రాజధాని బెంగళూరులో పర్యటించారు. బెంగళూరు మెట్రోరైలు నెట్వర్క్కు సంబంధించిన ‘ఎల్లో లైన్’ను ప్రారంభించారు. ఆర్.వి.రోడ్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సంభాíÙంచారు. బెంగళూరు మెట్రోరైల్ ప్రాజెక్టు మూడో దశకు(ఆరెంజ్ లైన్) మోదీ శంకుస్థాపన చేశారు. అలాగే మూడు వందేభారత్ రైళ్లను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. 2014లో ఇండియాలో మెట్రో రైలు వ్యవస్థ కేవలం ఐదు నగరాల్లోనే ఉండేదని, ప్రస్తుతం 24 నగరాల్లో అందుబాటులోకి వచి్చందని చెప్పారు. ఈ వ్యవస్థ వెయ్యి కిలోమీటర్లకు విస్తరించిందని తెలియజేశారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద మెట్రో రైలు నెట్వర్క్ మన దేశంలోనే ఉందన్నారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... పట్టణ ప్రణాళిక అత్యంత కీలకం ‘‘దేశంలో 2014 కంటే ముందు కేవలం 20 వేల కిలోమీటర్ల రైలు మార్గం విద్యుదీకరణ జరిగింది. గత 11 ఏళ్లలో 40 వేల కిలోమీటర్లకు పైగా విద్యుదీకరణ పూర్తిచేశాం. 2014లో దేశంలో కేవలం 74 ఎయిర్పోర్టులు ఉండేవి, ఇప్పుడు వాటి సంఖ్య 160కి చేరింది. 2014లో జాతీయ జలరహదారులు కేవలం మూడు ఉండగా, ప్రస్తుతం అవి 30కి చేరుకున్నాయి. మన నగరాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెంది, ప్రభావంతంగా మారితేనే మన దేశం ప్రగతి పథంలో సాగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. అందుకే నగరాల్లో అధునిక మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. 21వ శతాబ్దంలో పట్టణ ప్రణాళిక, పట్టణ మౌలిక సదుపాయాలు అత్యంత కీలకం. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మన నగరాలు, పట్టణాలను తీర్చిదిద్దుకోవాలి. నవ భారత్ ఎదుగుదలకు బెంగళూరు ఒక ప్రతీక. ఆధ్యాతి్మక జ్ఞానం, సాంకేతిక విజ్ఞానం బెంగళూరు ఆత్మలో మిళితమయ్యాయి. ‘సిందూర్’ విజయం వెనుక సాంకేతికత‘మేక్ ఇన్ ఇండియా’ ఆపరేషన్ సిందూర్ విజయం వెనుక భారతీయ సాంకేతికత, ‘మేక్ ఇన్ ఇండియా’ ఉన్నాయి. మన దేశంపైకి ఉగ్రవాదులను ఏగదోసిన పాకిస్తాన్ను కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మోకాళ్లపై నిల్చోబెట్టాం. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశంలో కొత్త ముఖాన్ని ప్రపంచం తొలిసారిగా దర్శించింది. పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిక్షణ శిబిరాలను, వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాం, మన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాం. దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతోపాటు ‘మేక్ ఇన్ ఇండియా’ బలం మనకు విజయం చేకూర్చిపెట్టాయి. ఆపరేషన్ సిందూర్లో బెంగళూరుతోపాటు ఇక్కడి యువత కీలక పాత్ర పోషించారు. ప్రపంచంలో అతిపెద్ద నగరాల్లో ఒకటిగా బెంగళూరు గుర్తింపు పొందడం సంతోషంగా ఉంది. మనదేశం ప్రపంచంతో పోటీ పడడమే కాకుండా, ప్రపంచాన్ని స్వయంగా ముందుకు నడిపిస్తోంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
ట్రంప్కు ప్రధాని మోదీ కౌంటర్!
బెంగళూరు: భారత్ ‘డెడ్ ఎకానమీ’ అంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ప్రపంచంలో భారత్ మూడో ఆర్థిక శక్తిగా ఎదగడానికి ఎంతో సమయం పట్టదంటూ స్పష్టం చేశారు. ఈరోజు( ఆదివారం, ఆగస్టు 10వ తేదీ) బెంగళూరులో మెట్రో ఫేజ్-3 కి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన మోదీ ప్రసంగించారు. భారత్ మూడో ఆర్థిక శక్తి కాబోతుందంటూ ఆయన స్పష్టం చేశారు. రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అనేవి భారత్ ఆర్థికంగా ఎదగడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ‘గత 11 ఏళ్లలో భారత ఆర్థికంగా బలోపేతమైంది. 10వ స్థానం నుంచి 5 స్థానానికి వచ్చాం. ఇప్పుడు మూడో ఆర్థిక శక్తిగా ఎదిగే ట్రాక్లో ఉన్నాం. కచ్చితమైన, నిజాయితీ పరమైన దృష్టి పెట్టడంతోనే ఇది సాధ్యమవుతూ వస్తుంది. అందుకే ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా ఎదగడానికి మనం దగ్గర్లోనే ఉన్నాం,’ అని తెలిపారు.2014 నాటికి మన దేశంలో ఐదు నగరాల్లో మాత్రమే మెట్రో రైలు అందుబాటులో ఉండేది. ఇప్పుడు 24 నగరాల్లో ఆ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇది ప్రపంచంలో మూడో అతిపెద్ద మెట్రో నెట్వర్క్. 2014 నాటికి ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్లు అనేవి ఏడు, మెడికల్ కాలేజీలు 387 ఉండేవి. ఇప్పుడు మెడికల్ ఇన్స్టిట్యూట్లు 22, మెడికల్ కాలేజీలు 704 ఉన్నాయి. ఎలక్రికల్ రైళ్లు 2014 నాటికి 20వేలు మాత్రమే ఉంటే నేటికి అవి 40వేలు అయ్యాయి. ఇక ఎయిర్పోర్ట్లు 74 నుంచి 180కు పెరిగాయి’ అని ప్రభుత్వం సాధించిన ఘనతలను చెప్పుకొచ్చారు మోదీ. -
పాక్తో భారత్ మ్యాచ్ ఆడటమేంటి?.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: ఆసియా కప్లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరగబోయే క్రికెట్ మ్యాచ్పై ఎంఐఎం అధినేత, లోక్సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రక్తం, నీళ్లు కలిసి ప్రవహించలేవు.. పాకిస్తాన్తో భారత్ క్రికెట్ ఎలా ఆడుతుంది అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మ్యాచ్కు బీసీసీఐ ఎలా అనుమతి ఇచ్చింది అంటూ నిలదీశారు.ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జాతీయ మీడియా పోడ్ కాస్ట్లో మాట్లాడుతూ..‘నీళ్ళు, రక్తం కలిసి ప్రవహించలేవని.. చర్చలు, ఉగ్రవాదం కలిసి సాగలేవని ప్రధానమంత్రి మోదీ స్వయంగా చాలా సార్లు చెప్పారు. ఇలా మాట్లాడి.. మళ్లీ ఇప్పుడు పాకిస్తాన్తో ఎలా క్రికెట్ ఆడుతారు. దుబాయ్లో పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నామని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. నేను ఈ మ్యాచ్ను చూడను. పాక్తో భారత్.. వాణిజ్య సంబంధాలను తెంచుకున్నారు, గగనతలాన్ని మూసివేశారు. కానీ, మీరు క్రికెట్ ఆడటానికి సిద్ధంగా ఉన్నారా? ప్రశ్నించారు. పాక్తో ఆడటానికి కేంద్రం ఎలా అనుమతి ఇస్తుంది. భారతదేశంలో క్రికెట్ అనేది ఒక వ్యామోహం. క్రికెట్ ప్రతీ దాన్ని స్తంభింపజేస్తుంది అని అన్నారు.ఇదే సమయంలో పహల్గాం ఉగ్రవాద దాడిలో ప్రజలు వారి కుటుంబ సభ్యుల ముందే చనిపోయారు. ఈ దాడి నన్ను తీవ్రంగా బాధించింది. ఈ ఘటన చాలా దారుణం. భార్యాపిల్లల ముందే తమ వారిని ఎవరైనా హత్య చేయడం బాధాకరం. ఇంత దారుణం జరిగినప్పుడు పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ ఆడటంలో అర్థం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బీసీసీఐ, కేంద్ర ప్రభుత్వం మ్యాచ్కు అనుమతి ఇస్తుంది?. పాక్, భారత్ మ్యాచ్ బాయ్కాట్ చేయాలని పిలుపునిచ్చారు.అలాగే, హిందూ ఉగ్రవాదం అనేదే లేదు అని హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనకు ప్రతిస్పందిస్తూ.. మహాత్మా గాంధీని ఎవరు చంపారు? ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలను ఎవరు చంపారు?. మహాత్మా గాంధీని ఎవరు చంపారో అమిత్ షా మర్చిపోయి ఉండవచ్చు అంటూ వ్యాఖ్యలు చేశారు. పహల్గాంలో భద్రతా లోపానికి జవాబుదారీతనం వహించాలి. భారీ సైనిక ఉనికి ఉన్నప్పటికీ ఉగ్రవాదులు ఎలా ప్రవేశించారు?. పౌరులను ఎలా హత్య చేయగలిగారు?. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటికీ ఉగ్రవాద నిరోధక చర్యలు విఫలమయ్యాయి’ అని విమర్శించారు. -
మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ
శివాజీనగర: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కర్ణాటకలో పర్యటించారు. మూడు వందే భారత్ రైళ్లు, మెట్రో ఎల్లో మార్గాన్ని ఆయన ప్రారంభించారు. ప్రత్యేక విమానంలో హెచ్ఏఎల్ విమానాశ్రయానికి వచ్చిన ప్రధాని.. అక్కడి నుంచి హెలికాప్టర్లో మేఖ్రి సర్కిల్ వద్ద ఉన్న హెలిప్యాడ్కు చేరుకున్నారు.అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మెజెస్టిక్లోని సంగొళ్లి రాయణ్ణ రైల్వేస్టేషన్కు చేరుకొని బెంగళూరు– బెళగావి మధ్య వందే భారత్ రైలుకు పచ్చ జెండా ఊపారు. అలాగే అమృత్సర్– శ్రీమాతా వైష్ణోదేవి కట్రా రైల్వే స్టేషన్, నాగపూర్–పూణె మధ్య వందే భారత్ రైలు సేవలను ప్రారంభించారు. అనంతరం ఆర్వీ రోడ్డు రాగిగుడ్డ మెట్రో స్టేషన్కు చేరుకొని మెట్రో ఎల్లో మార్గం ప్రారంభించి.. మెట్రో రైలులో ఎల్రక్టానిక్ సిటీ వరకు ప్రయాణించారు. #WATCH | Bengaluru | Prime Minister Narendra Modi, along with Karnataka CM Siddaramaiah, Dy CM DK Shivakumar, and Union Minister Manohar Lal Khattar, undertakes a metro ride from RV Road (Ragigudda) to Electronic City metro station via the Yellow line that PM Modi inaugurated… pic.twitter.com/RxB1AcCPwC— ANI (@ANI) August 10, 2025 ఎల్రక్టానిక్ సిటీలో ఐఐఐటీ సభా మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెట్రో 3వ దశకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రసంగించారు. బెంగళూరు-బెళగావి వందే భారత్ రైలు సంచారంతో కళ్యాణ కర్ణాటకకు రవాణా వసతి మరింత మెరుగుపడుతుంది. ఈ రైలు బుధవారం తప్ప వారంలో అన్ని రోజులు అందుబాటులో ఉంటుంది. రోజూ ఉదయం 5.20కి బెళగావిలో బయలుదేరి మధ్యాహ్నం 1.50కి బెంగళూరు రాయణ్ణ రైల్వే స్టేషన్కు చేరుకొంటుంది. మధ్యాహ్నం 2.20కి రాయణ్ణ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి బెళగావికి రాత్రికి 10.40కి బెళగావి చేరుకొంటుంది. యశ్వంతపుర, తుమకూరు, దావణగెరె, హావేరి, హుబ్లీ–ధారవాడ స్టేషన్లలో నిలుస్తుంది. -
చిన్నారులతో ప్రధాని మోదీ రాఖీ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
మరో వందేభారత్కు ప్రధాని మోదీ పచ్చజెండా.. ఎప్పుడంటే?
న్యూఢిల్లీ: భారతదేశపు అత్యంత దూరం ప్రయాణించే తొలి వందే భారత్ రైలును ప్రధాని మోదీ మహారాష్ట్రలో ప్రారంభించనున్నారు. ఈ వందే భారత్ రైలు మొత్తం 881 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఈ రైలుకు మొత్తం 10 స్టాప్లు ఉంటాయి. సగటున 73 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది.నాగ్పూర్లోని అజ్ని- పూణే మధ్య దీర్ఘ దూరం నడిచే వందే భారత్ రైలు మహారాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇది రాష్ట్రంలోని 12వ వందే భారత్ రైలుగా నిలవనుంది. ఆగస్టు 10న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు. రైలు నంబర్లు 26101/26102. ఆగస్టు 11 నుండి పూణే స్టేషన్ నుండి, ఆగస్టు 12 నుండి అజ్ని స్టేషన్ నుండి తన సాధారణ సేవలను ప్రారంభించనుంది. ఈ రైలు వారానికి ఆరు రోజులు రాకపోకలు సాగించనుంది.మహారాష్ట్రలోని ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు,సాధారణ ప్రయాణాలు సాగించేవారికి ఈ రైలు ప్రయోజనకరంగా ఉండనుంది. ఈ రైలు వార్ధా, బద్నేరా, అకోలా, షెగావ్, భూసావల్, జల్గావ్, మన్మాడ్, కోపర్గావ్, అహ్మద్ నగర్ , దౌండ్ కార్డ్ స్టేషన్లలో ఆగనుంది. ఎనిమిది కోచ్లతో.. ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్, ఏడు స్టాండర్డ్ చైర్ కార్లు, మొత్తం 590 మంది ప్రయాణీకులకు కూర్చునేందుకు ఈ రైలు అవకాశం కల్పిస్తుంది. -
ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము రాఖీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: నేడు(శనివారం) దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు జరుగుతున్నాయి. అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ములకు రాఖీలు కడుతూ, తీపి తినిపిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. सभी देशवासियों को रक्षाबंधन की अनेकानेक शुभकामनाएं।Best wishes on the special occasion of Raksha Bandhan.— Narendra Modi (@narendramodi) August 9, 2025రాష్ట్రపతి ముర్ము తన ‘ఎక్స్’ట్వీట్లో.. రక్షా బంధన్ శుభ సందర్భంగా, భారతదేశంతోపాటు విదేశాలలో నివసిస్తున్న తోటి పౌరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ‘ఎక్స్’లో ‘రక్షా బంధన్ ప్రత్యేక సందర్భంగా శుభాకాంక్షలు’ అని రాశారు. President Murmu extends greetings on Raksha Bandhan, hails it as a symbol of sibling bond and heritageRead @ANI story | https://t.co/Oeb9qKhST8#President #DroupadiMurmu #RakshaBandhan pic.twitter.com/JKdmMt5uAq— ANI Digital (@ani_digital) August 9, 2025 -
ప్రధాని మోదీని స్వాగతించిన చైనా
బీజింగ్: ప్రధాని మోదీ త్వరలో చైనాలో పర్యటించబోతున్నారు. ఈ నెల 31న, వచ్చే నెల 1న చైనాలో జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఎస్సీఓ సదస్సుకు నరేంద్ర మోదీని స్వాగతిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గుయో జియాకున్ శుక్రవారం పేర్కొన్నారు. ఈ సదస్సు భాగస్వామ్యపక్షాలకు స్నేహపూర్వక, ఫలవంతమైన ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీఓ సభ్యదేశాలతోపాటు మొత్తం 20 దేశాల అధినేతలు సదస్సులో పాల్గొంటారని వెల్లడించారు. -
పుతిన్కు ప్రధాని మోదీ ఫోన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధినేత పుతిన్తో శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. రష్యాతో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి తాము కట్టుబడి ఉన్నట్లు పుతిన్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. తన మిత్రుడు పుతిన్తో చక్కటి, సమగ్రమైన సంభాషణ జరిగిందన్నారు. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ప్రతీకారంగా ఇండియా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం టారిఫ్లు విధించిన నేపథ్యంతో పుతిన్తో మోదీ చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పుతిన్తో మాటామంతీ అనంతరం మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ ఏడాది జరిగే 23వ ఇండియా–రష్యా వార్షిక సదస్సులో పుతిన్కు ఆతిథ్యం ఇవ్వడానికి ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. ఉక్రెయిన్ విషయంలో తాజా పరిణామాలను తనతో పంచుకున్నందుకు పుతిన్కు కృతజ్ఞతలు తెలియజేశారని చెప్పా రు. భారత్–రష్యా ద్వైపాక్షిక ఎజెండా ప్రగతిని సమీక్షించామని వెల్లడించారు. ఉక్రెయిన్–రష్యా ఘర్షణ విషయంలో ఇండియా వైఖరి స్థిరంగా ఉన్నట్లు పుతిన్కు మోదీ తెలియజేశారని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. శాంతి చర్చలు ప్రారంభించాలని, ఘర్షణకు సాధ్యమైనంత ముగింపు పలకాలని ఉక్రెయిన్, రష్యాలను ఇండియా కోరుతున్న సంగతి తెలిసిందే. భారత భద్రతా సలహాదారు గురువారం రష్యాలో పర్యటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఏడాది భారత్లో పర్యటించబోతున్నారని ఆయన నిర్ధారించారు. -
మోదీ దెబ్బ.. ఇది ట్రంప్ రాయబారమా?
అమెరికా విషయంలో ఏదైతే అది అయ్యిందనే నిర్ణయానికొచ్చింది భారత్. ఇప్పటిరకూ అమెరికాతో సంబంధాలపై ఆచితూచి అడుగులేసిన భారత్.. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి రష్యాతో వాణిజ్య ఒప్పందానికే ఓకే చెప్పింది. గత కొంతకాలంగా ట్రంప్ విధించే సుంకాలపై సహనంగా ఉన్న భారత్.. అమెరికా ఆయుధాల కొనుగోలుకు తాత్కాలికంగా ఫుల్స్టాప్ పెట్టింది. ‘రోజూ భయపడుతూ కూర్చుంటే ట్రంప్ ఏదొక నిర్ణయంతో ఇరకాటంలో పెడుతూనే ఉంటారని నిర్ణయానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో భారత్.. ఎట్టకేలకు స్పందించింది. ఎంత సుంకాన్ని అయినా భరిస్తామని, అయితే రష్యాతో వాణిజ్య ఒప్పందం విషయంలో రాజీ పడేది లేదనే సంకేతాలు పంపింది. ఇప్పటివరకూ అమెరికాను మిత్రదేశంగా భావించిన భారత్.. ఉపయోగం లేని మిత్రత్వం అవసరం లేదనే విషయాన్ని యూఎస్కు అర్థమయ్యేలా చెప్పేసింది. తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు తాము లొంగమనే విషయాన్ని తేటతెల్లం చేసింది. నెతాన్యాహూ భారత్ పర్యటన..?అమెరికా-భారత్ల మిత్రత్వం దాదాపు చెడిందనే సంకేతాల నడుమ ఇజ్రాయిల్ రంగంలోకి దిగింది. ఇజ్రాయిల్ ప్రధాని నెతాన్యాహూ భారత్ పర్యటనకు రాబోతున్నట్లు తెలుస్తోంది. భారత పర్యటనలో నెతాన్యాహూ మోదీని కలిసి ఓ సలహా ఇవ్వనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఆ సలహా ఏమిటనేది పక్కన పెడితే.. డొనాల్డ్ ట్రంప్కు అత్యంత సన్నిహితుడైన నెతాన్యాహూ భారత్కు ఎందుకు రానున్నారనే చర్చ నడుస్తోంది. ఇది అమెరికా ఆడుతున్న డ్రామాగా ఉంందని మరొక వాదన వినిపిస్తోంది. అమెరికాతో వాణిజ్య సంబంధాలను తాత్కాలికంగా పక్కన పెట్టిన భారత్ను ఒప్పించేందుకు నెతాన్యాహూను ట్రంప్ రాయబారిగా పంపడానికి సిద్ధమయ్యారనే వాదన తెరపైకి వచ్చింది. ప్రత్యేకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఫోన్ చేసి మోదీ మాట్లాడటం, అమెరికా ఆయుధాలను, వైమానిక క్షిపణులకు కొనుగోలుపై భారత్ విముఖత వ్యక్తం చేసిన తరుణంలో నెతాన్యాహూ ఆ దిశగానే మోదీతో మాట్లాడేందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా అనేది భారత్కు అతిపెద్ద మార్కెట్ అనే అంశం అందరికి తెలిసిందే. ఆటువంటి తరుణంలో కూడా భారత్.. అమెరికాతో రాజీ పడేందుకు సిద్ధంగా లేకపోవడంతో నెతాన్యాహూను ట్రంప్ రంగంలోకి దింపే ఆలోచన కూడా చేసి ఉండొచ్చు. ట్రంప్ అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకుంటారనే విమర్శ కూడా ఆయనపై ఉంది. అగ్రరాజ్యం అమెరికా అనేది మినహాయిస్తే ఇక్కడ ట్రంప్ గొప్పతనం ఏమీ లేదు. తాము చెప్పినట్లు ‘ఆడాలని’ ట్రంప్ అనుకుంటూ ఉంటారని, అది అన్ని దేశాలతో కుదరదనే విషయం భారత్ చెప్పకనే చెప్పేసింది.. ఇప్పుడు భారత్, రష్యా, చైనాల మైత్రితో అమెరికాకు గుండెల్లో రాయి పడినట్లే ఉంది.మూడు అగ్రదేశాలు ఏకం అవుతున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ను కాస్త ఇరకాటంలో పడేసినట్లే ఉంది. ఎప్పుడూ భారత్కు వ్యతిరేకంగా ఉండే చైనా కూడా, ఇప్పుడు ట్రంప్ బెదిరింపులను తట్టుకోలేకపోతోంది. మన మంచిని కోరలేని శత్రువుకు అంగుళం చోటిస్తే మొత్తం ఆక్రమిస్తారంటూ ట్రంప్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టింది. ఈ అన్ని అంశాలను బేరీజు వేసుకున్న ట్రంప్.. నెతాన్యాహూను అనధికార రాయబారిగా పంపుతున్నారా? అనేది ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఒకవేళ నెతాన్యాహూ భారత్ పర్యటనకు వస్తే మాత్రం, కచ్చితంగా అమెరికాతో భారత్ సంబంధాలపై మాట్లాడి రాజీ కుదిర్చే అవకాశాల్ని కూడా కొట్టిపారేయలేం. ఇంకా భారత్-అమరికాల బంధం చాలా బలంగా ఉందని స్వయంగా నెతాన్యాహూ చెప్పిన తరుణంలో.. ఆ దిశగానే పావులు కదిపే అవకాశం ఉంది. -
ట్రంప్కు మరోషాక్.. పుతిన్కు మోదీ ఆహ్వానం
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్కు మరో షాకిచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. అమెరికా-భారత్ల మధ్య నెలకొన్న టారిఫ్ల వివాదంతో రష్యాతో వాణిజ్య సంబంధాలకే మోదీ జై కొట్టారు. ఈరోజ(శుక్రవారం, ఆగస్టు 8వ తేదీ) రష్యా అధ్యక్షడు పుతిన్క స్వయంగా ఫోన్ చేసిన మోదీ.. ఆయనతో సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే భారత్కు రావాలని మోదీ ఆహ్వానించారు. 23వ భారత-రష్యా వార్షిక సదస్సుకు హాజరుకావాలని మోదీ ఆహ్వానం పలికారు. మరొకవైపు ఉక్రెయిన్లో తాజా పరిస్థితులను మోదీకి వివరించారు పుతిన్. ఉక్రెయిన్తో సంబంధాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పుతిన్కు విన్నవించారు మోదీ. అమెరికా ఆయుధాల కొనుగోలుకు భారత్ విముఖతఅగ్రరాజ్యం నుంచి కొత్త ఆయుధాలను, వైమానిక విమానాలను కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ క్రమంలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారు. ట్రంప్ భారత్పై విధించిన భారీ సుంకాలతో డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా పాలనలో అమెరికా, భారత్ మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయిభారత్ మిత్రదేశమే అయినా అమెరికాతో వాణిజ్యం అనుకున్నంత సంతృప్తిగా జరగడం లేదని.. పైగా రష్యాతో చమురు కొనుగోళ్లు జరుపుతోందంటూ ట్రంప్ గతంలో 25 శాతం టారిఫ్ విధించారు. ఆపై అగష్టు 6వ తేదీన.. తాను చెప్పినా వినలేదంటూ మరో 25 శాతం సుంకాలు ప్రకటించారు.అమెరికాతో వాణిజ్యం జరిపే దేశాల్లో భారత్పై విధించిన సుంకమే హయ్యెస్ట్. దీంతో.. ట్రంప్ నిర్ణయాన్ని భారత్ అన్యాయంగా పేర్కొంది. అమెరికా, ఐరోపా దేశాలు తమ దేశాలకు అనుగుణంగా రష్యాతో వాణిజ్యం చేస్తుండడాన్ని ప్రముఖంగా లేవనెత్తింది కూడా. అయితే భారత్తో వాణిజ్య చర్చలు ఉండబోవని ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ట్రంప్ టారిఫ్ వార్పై తాము కూడా తగ్గేదే లేదని భారత్ సంకేతాలిచ్చింది.రష్యాతో చమురు ఒప్పందాలు ఆగేది లేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. అదే సమయంలో.. రాజీ పడేది లేదని, సుంకాలతో భారీ మూల్యం చెల్లించేందుకైనా సిద్ధమని భారత ప్రధాని మోదీ ప్రకటించారు. అమెరికా సుంకాలపై అటు రష్యా, ఇటు అనూహ్యంగా చైనా భారత్కు మద్ధతుగా నిలిచాయి. ఈ క్రమంలో.. భారత ప్రధాని మోదీ త్వరలో చైనాలో పర్యటిస్తుండగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు వస్తుండడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ప్రత్యేకంగా పుతిన్కు ఫోన్ చేసి మోదీ ఆహ్వానించి ట్రంప్కు ఊహించని షాకిచ్చారు మోదీ. అమెరికా సుంకాలకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్! -
‘పీఎం–ఉజ్వల’కు రూ.12వేల కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: రక్షాబంధన్ వేడుకల వేళ దేశ మహిళలకు కేంద్రం శుభవార్త తెలిపింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల మహిళలకు చేయూత నిచ్చే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి 2025–26 ఆర్ధిక సంవత్సరంలో రూ.12,060 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఉజ్వల యోజన లబ్ధిదారులుగా ఉన్న 10.33 కోట్ల గృహ వినియోగదారులకు మేలు చేకూర్చనుంది. ఉజ్వల లబ్ధిదారులకు ఏటా 9 రీఫిల్ల వరకు 14.2 కిలోల సిలిండర్కు రూ.300 వరకు రాయితీ ఇస్తుంది. ఉజ్వల వినియోగదారుల సగటు తలసరి వినియోగం 2019–20లో కేవలం 3 రీఫిల్స్, 2022–23లో 3.68 రీఫిల్స్గా ఉండగా, 2024–25 ఆర్థిక సంవత్సరానికి 4.47కి చేరింది. 2016లో ప్రారంభమైన ఈ పథకం కింద 2024–25 వరకు రూ.52 వేల కోట్లను ఖర్చు చేసినట్లు కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలిపారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగిందన్నారు. ఎల్పీజీ ధరల స్థిరీకరణకుగాను చమురు మార్కెటింగ్ కంపెనీలకు రూ.30వేల కోట్ల ప్రధాన సబ్సిడీ ప్యాకేజీని కూడా మంత్రివర్గం ఆమోదించిందని ఆయన వివరించారు. అంతర్జాతీయంగా అధిక ధరల కారణంగా దేశీయ ఎల్పీజీ అమ్మకాలపై చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎదుర్కొంటున్న నష్టాలను పూడ్చేందుకు ఇది ఉపకరిస్తుందన్నారు. మన ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం వరకు దిగుమతులే తీరుస్తున్నాయన్నారు. దీంతోపాటు, 175 ఇంజనీరింగ్ సంస్థలు, 100 పాలిటెక్నిక్లతో కూడిన 275 సాంకేతిక సంస్థల్లో ’మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్’(ఎంఈఆర్ఐటీఈ) పథకాన్ని అమలు చేసే ప్రతిపాదనపై సైతం కేబినెట్ ఆమోదముద్ర వేసింది. జాతీయ విద్యా విధానం–2020కి అనుగుణంగా సాంకేతిక విద్యలో నాణ్యత, సమానత్వం, పాలనను మెరుగుపరచడమే ఈ పథకం లక్ష్యం. 2025–26 నుంచి 2029–30 వరకు మొత్తం రూ.4,200 కోట్లను ఈ పథకం కింద ఖర్చు చేయనుండగా, ఇందులో ప్రపంచ బ్యాంకు రుణం రూ.2100 కోట్లని కేంద్ర మంత్రి తెలిపారు. వీటితో పాటే అస్సాం, త్రిపురల్లో అమల్లో కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీల పథకం (ఎస్డీపీ) కింద రూ.4,250 కోట్లు వ్యయం చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వైష్ణవ్ వివరించారు.వీటితోపాటు కేంద్ర కేబినెట్ తమిళనాడులోని మరక్కణమ్– పుదుచ్చేరిని కలిపే నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణానికి రూ.2,157 కోట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. -
భారత్కు మరో షాకిచ్చిన ట్రంప్.. మోదీ కీలక భేటీ!
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్ను టార్గెట్ చేసి అదనపు సుంకాలు విధిస్తున్నారు. ఇక, తాజాగా భారత్ సుంకాలపై మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుంకాల విషయంలో భారత్తో చర్చలకు తాను సిద్ధంగా లేనని కుండబద్దలు కొట్టారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు మరో చర్చకు దారి తీశాయి.వివరాల ప్రకారం.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో భారత్పై అమెరికా విధించిన అదనపు సుంకాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలను విధించడంతో ట్రంప్ విధించిన భారాన్ని చర్చలతో పరిష్కరించుకోవాలని భారత్ చూస్తోంది. అయితే, అందుకు అధ్యక్షుడు ట్రంప్ మాత్రం సిద్ధంగా లేనట్లు స్పష్టం చేశారు. తాజాగా ట్రంప్ ఓ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. టారిఫ్ల వివాదం పరిష్కారం అయ్యే వరకు భారత్తో ఎలాంటి వాణిజ్య చర్చలు ఉండవు అని తేల్చి చెప్పారు. దీంతో, భారత్కు గట్టి ఎదురుదెబ్బ ఎదురైంది. ఇదిలా ఉండగా.. రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగితే భారత్పై మరిన్ని ఆంక్షలు ఉంటాయని ట్రంప్ మళ్లీ హెచ్చరించడం గమనార్హం.#WATCH | Responding to ANI's question, 'Just to follow up India's tariff, do you expect increased trade negotiations since you have announced the 50% tariffs?', US President Donald Trump says, "No, not until we get it resolved."(Source: US Network Pool via Reuters) pic.twitter.com/exAQCiKSJd— ANI (@ANI) August 7, 2025ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీకి సిద్ధమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి కేబినెట్ సమావేశం జరగనుంది. ట్రంప్ టారిఫ్లపై భారత్ ఎలా స్పందించాలనే విషయంపై ఈ భేటీలో చర్చించే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశం తర్వాత సుంకాలపై కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.Prime Minister Narendra Modi will chair a high-level Cabinet meeting at 1 pm on Friday to review the impact of the recent tariff hike imposed by the United States on Indian exports.— indian DOTS (@AMEERALIHU1807) August 8, 2025అమెరికా విదేశాంగ శాఖ కీలక ప్రకటన..మరోవైపు.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు విరుద్ధంగా అమెరికా విదేశాంగ శాఖ మరో ప్రకటన చేసింది. విదేశాంగశాఖ అధికార ప్రతినిధి టామీ పిగోట్ విలేకరులతో మాట్లాడుతూ.. భారత్ వ్యూహాత్మక భాగస్వామి అని పేర్కొన్నారు. టారిఫ్ల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత కొనసాగుతున్నప్పటికీ ఆ దేశంతో పూర్తిస్థాయి చర్చల్లో పాల్గొంటామన్నారు. వాణిజ్యం, రష్యా నుంచి చమురు కొనుగోలు వంటి విషయాల్లో ట్రంప్ స్పష్టంగా ఉన్నారన్నారు. దానికి ప్రతిస్పందనగానే ట్రంప్ నేరుగా చర్యలు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. -
ప్రధాని మోదీకి బ్రెజిల్ అధ్యక్షుడి ఫోన్
న్యూఢిల్లీ: ట్రంప్ దురహంకారాగ్రహానికి గురై 50 శాతం టారిఫ్ భారాన్ని మోస్తున్న భారత్, బ్రెజిల్ దేశాల అగ్రనేతలు గురువారం ఫోన్లో సంభాíÙంచుకున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ లూలా డసిల్లా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్చేసి పలుఅంశాలపై చర్చించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్ అమల్లోకి వచ్చిన గురువారం రోజే ఇరు దేశాధినేతలు మాట్లాడుకోవడం గమనార్హం. వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం, రక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, సాంస్కృతిక సంబంధాల అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించుకున్నారని ప్రధాని కార్యాలయం తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ మీదనే ప్రధానంగా ఇరునేతలు చర్చించుకున్నారని తెలుస్తోంది. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలూ చర్చకు వచ్చాయి. -
ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక బాధ్యత ప్రధాని మోదీదే
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక బాధ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాలకు అప్పగిస్తూ ఎన్డీఏ కూటమి నిర్ణయం తీసుకుంది. గురువారం పార్లమెంట్ భవన సముదాయంలో జరిగిన బీజేపీ, మిత్ర పక్షాల నేతల భేటీలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయించారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అమిత్ షా, జేపీ నడ్డాలతోపాటు జేడీయూ నుంచి లలన్ సింగ్, శివసేన నుంచి శ్రీకాంత్ షిండే, టీడీపీ నుంచి ఎల్. దేవరాయలు, ఎల్జేపీ నుంచి చిరాగ్ పాశ్వాన్, ఇంకా అనుప్రియా పటేల్, ఉపేంద్ర కుష్వాహా, ఏఐఏడీఎంకే తదితర ఇతర చిన్న పార్టీల నేతలు సైతం పాల్గొన్నారన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని బలపర్చాలనే అంశంపై ఎలాంటి చర్చా జరగలేదని తెలిపారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వంపై ఈ నెల 12వ తేదీన స్పష్టత వచ్చే అవకాశాలున్నాయన్నారు. ఎన్ఏడీ పక్షాల మధ్య సమన్వయం కొనసాగింపుపై ఈ సమావేశం చర్చించిందన్నారు. -
రైతుల ప్రయోజనాలపై రాజీపడం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టిగా తిప్పికొట్టారు. తమ రైతన్నల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మత్స్య, పాడి పరిశ్రమలను ఎట్టిపరిస్థితుల్లోనూ కాపాడుకుంటామని ఉద్ఘాటించారు. దేశీయంగా వ్యవసాయ, పాడి రంగాలకు నష్టం చేకూర్చే నిర్ణయాలేవీ తీసుకోవడం లేదని స్పష్టంచేశారు. ఇతర దేశాల ఒత్తిళ్లకు తలొగ్గబోమని, తమపై టారిఫ్ బెదిరింపులు పనిచేయబోవని పరోక్షంగా వెల్లడించారు. అవసరమైతే వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్.స్వామినాథన్ శత జయంతి సందర్భంగా గురువారం ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. అన్నదాతలతోపాటు మత్స్యకారులు, పాడి రైతులు, కార్మికుల ప్రయోజనాల పరిరక్షణకు, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. వారికి మేలు చేసే విషయంలో వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని తనకు తెలుసని, అందుకు సిద్ధంగానే ఉన్నానని వివరించారు. మన వాళ్ల బాగుకోసం ఎంత దూరమైనా వెళ్లడానికి దేశం సర్వసన్నద్ధంగా ఉందన్నారు. ఎం.ఎస్.స్వామినాథన్ స్మారక నాణెం, తపాలా బిళ్లను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... పౌష్టికాహార భద్రత సాధించాలి ‘‘దేశంలో వ్యవసాయ రంగ పురోభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. పౌష్టికాహార భద్రత సాధించడం అత్యవవసరం. ఆధునిక అవసరాలకు అనుగుణంగా పంటల వైవిధ్యంపై దృష్టి పెట్టాలి. వాతావరణ మార్పులను తట్టుకొనే వంగడాలను అభివృద్ధి చేయాలి. సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పెంచాలి. కరువులు, అధిక ఉష్ణోగ్రతలు, వరదలను తట్టుకొని అధిక ఉత్పాదకత ఇచ్చే వంగడాలను కృత్రిమ మేధ(ఏఐ), మెíషీన్ లెర్నింగ్తో రూపొందించాలి. పంటల ఉత్పత్తిని ముందుగానే అంచనా వేయడానికి, తెగుళ్లను గుర్తించడానికి, రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడానికి రియల్–టైమ్ వ్యవస్థలను ప్రతి జిల్లాలో అందుబాటులోకి తీసుకురావాలి. పంటల మారి్పడిపై పరిశోధనలు మరింత ఊపందుకోవాలి. ఏ నేలలో ఎలాంటి పంటలు సాగు చేయాలో గుర్తించాలి. మట్టి పరీక్షల కోసం చౌక ధరల్లో దొరికే పరికరాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని మోదీ అన్నారు.పథకాలతో అన్నదాతల్లో ఆత్మవిశ్వాసం ‘‘దేశ ప్రగతికి పునాది రైతుల ప్రగతే. రైతన్నల కోసం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నాం. పీఎం–కిసాన్, పీఎం ఫసల్ బీమా యోజన, పీఎం కృషి సించాయ్ యోజన, పీఎం కిసాన్ సంపద యోజన, పీఎం ధన్ ధాన్య యోజన వంటివాటిని వ్యవసాయం, అనుబంధాల రంగాల సమగ్రాభివృద్ధి కోసమే తీసుకొచ్చాం. 10 వేల రైతు ఉత్పత్తి సంస్థలు ఏర్పాటు చేశాం. ఆయా పథకాలతో కేవలం ఆర్థిక తోడ్పాటే కాకుండా, రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. పంటల ఉత్పత్తి వ్యయం తగ్గించడానికి, రైతుల ఆదాయం పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. వారి కోసం నూతన ఆదాయ మార్గాలు సృష్టిస్తున్నాం. సహకార సంఘాలకు, స్వయం సహాయక గ్రూప్లకు ఆర్థిక మద్దతు లభిస్తోంది. దాంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలం పుంజుకుంటోంది. పంటల ఉత్పత్తిని పెంచుకోవడంతోపాటు అదే సమయంలో పర్యావరణాన్ని, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎం.ఎస్. స్వామినాథన్ పదేపదే సూచించారు. ఆయన నిర్దేశించిన బాటలో మనం నడవాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్ చంద్, ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్పర్సన్ సౌమ్య స్వామినాథన్ పాల్గొన్నారు. మోదీ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు గురువారం శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలో చేనేత రంగం ప్రగతి పథంలో సాగుతోందని పేర్కొన్నారు. 2,600 ఎగ్జిబిషన్ల ద్వారా 43 లక్షల మంది చేనేత కారి్మకులు, అనుబంధ కార్మికులకు నేరుగా మార్కెట్ సౌలభ్యం లభించిందని, రూ.1,700 కోట్లకుపైగా అమ్మకాలు జరిగాయని వెల్లడించారు. 20కిపైగా దేశాలకు మన చేనేత ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని, వాటి విలువ రూ.21,000 కోట్లకు చేరిందని హర్షం వ్యక్తంచేశారు. మన సంప్రదాయ చేనేత కళ, వైభవం అంతర్జాతీయ స్థాయికి చేరిందన్నారు. -
మోదీ, అమిత్ షా అడ్డుకున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల బిల్లుల విషయంలో కాంగ్రెస్కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అపాయింట్మెంట్ ఇవ్వకుండా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు అడ్డుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇస్తే 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులపై సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని భావించే మోదీ, అమిత్ షా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. గురువారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.ప్రభుత్వం మొత్తం ఢిల్లీకి వచ్చినా..‘బీసీ రిజర్వేషన్ల బిల్లులు, ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్కు సంబంధించి పది రోజుల ముందే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరాం. అయితే కాంగ్రెస్ నేతలు అపాయింట్మెంట్ కోరాక మోదీ, అమిత్షాలు రాష్ట్రపతితో భేటీ అయ్యారు. వారు ఏం మాట్లాడుకున్నారో తెలియదు.కానీ, రాష్ట్రపతి మా వినతిని వింటే రిజర్వేషన్లు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని భావించి ఆమె అపాయింట్మెంట్ రాకుండా మోదీ, అమిత్ షా అడ్డుకున్నట్టుగా మా మంత్రివర్గ సహచరులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓ నిర్ధారణకు వచ్చారు. 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో అందుబాటులో ఉంటామని రాష్ట్రపతికి తెలియజేసినా అపా యింట్మెంట్ ఇవ్వలేదు. ప్రభుత్వం మొత్తం ఢిల్లీకే వచ్చినా, రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరక్కపోవడం శోచనీయం, బాధాకరం, అవమానకరం..’ అని సీఎం పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ బీసీ ద్రోహులు..‘బీజేపీ, బీఆర్ఎస్ నేతలు బీసీ వ్యతిరేకులుగా మారారు. 42 శాతం రిజర్వేషన్లకు బీఆర్ఎస్ కనీస నైతిక మద్దతు తెలపడం లేదు. రిజర్వేషన్లు 50 శాతానికి మించుతాయంటూ బీజేపీ అడ్డుకుంటోంది. బీజేపీది తొలి నుంచీ బీసీ వ్యతిరేక వైఖరే. మండల్ కమిషన్ సిఫార్సులను అడ్డుకునేందుకు కమండల్ యాత్రను ప్రారంభించింది. మన్మోహన్సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించినప్పుడు యూత్ ఫర్ ఈక్వేషన్ పేరుతో వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది.బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో బీజేపీతో అంటకాగుతూ బీఆర్ఎస్ శిఖండిలా వ్యవహరిస్తోంది. విధ్వంసకర పాత్ర పోషిస్తోంది. పది రోజుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను, మూడు రైతు వ్యతిరేక బిల్లులను ఆమోదించిన బీజేపీకి బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించడం ఒక్క రోజు పని అని. కానీ చిత్తశుద్ధి లేనందునే బిల్లులు ఆమోదించడం లేదు..’ అని రేవంత్ ధ్వజమెత్తారు.గల్లీ లీడర్లా కిషన్రెడ్డి వ్యాఖ్యలు‘బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చెట్టుకింద ప్లీడర్లా, గల్లీ లీడర్లా మాట్లాడుతున్నారు. సామాజిక న్యాయ శాఖ మంత్రిని కిషన్రెడ్డి హైదరాబాద్కు తీసుకొని వస్తే ఆయనకు కావల్సిన వివరాలన్నీ అందిస్తాం. లేకుంటే ఆయన సమయం చెబితే మేమే ఢిల్లీలో అన్ని గణాంకాలు అందజేస్తాం. ముస్లింలు ముఖ్యమంత్రులు కావద్దనేలా కిషన్రెడ్డి మాట్లాడడం సరికాదు. ముస్లింలను తొలగిస్తే రిజర్వేషన్లు పెంచుతామని బీజేపీ నాయకులు అంటున్నారు. ఎలా తొలగిస్తారో.. ఎలా పెంచుతారో వాళ్లు చేసి చూపాలి. రిజర్వేషన్ల పెంపు, ఇతర విషయాల్లో కిషన్రెడ్డి అబద్ధాలు చెప్పినంత కాలం నేను నిజాలు చెబుతా..’ అని ముఖ్యమంత్రి అన్నారు. మోదీని కుర్చీ దింపడమే పరిష్కారం‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు అన్ని ప్రయత్నాలు చేశాం. ఇక ముందు ఏం చేయాలనే దానిపై రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)తో భేటీ అవుతాం. మంత్రులు, పీఏసీతో చర్చించిన తర్వాత త్వరలో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తాం. బీసీ రిజర్వేషన్ల పెంపు, ఇతర సమస్యలన్నింటికీ పరిష్కారం మోదీని కుర్చీ నుంచి దింపడమే. ఇప్పటికైనా రాష్ట్రపతి, మోదీ బీసీ బిల్లులను ఆమోదించాలి..’ అని రేవంత్ కోరారు. అందుకే రాహుల్ రాలేదు..‘రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇందిరా భవన్లో 4 గంటల పాటు తెలంగాణ కుల సర్వే, బీసీ రిజర్వేషన్ల పెంపు గురించి సావధానంగా విన్నారని.. వంద మంది ఎంపీలకు వివరించారని సీఎం చెప్పారు. శిబుసోరెన్ అంత్యక్రియలు.. ఓ కేసు విషయమై జార్ఖండ్ వెళ్లినందునే రాహుల్ జంతర్ మంతర్ సదస్సుకు హాజరుకాలేదని వివరించారు. ఓడిపోవడమే కేసీఆర్కు పెద్ద శిక్షవిలేకరుల సమావేశం అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో చిట్చాట్ చేశారు. ‘కాళేశ్వరం కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో చర్చకు పెడతాం. అక్కడేం నిర్ణయిస్తారో చూద్దాం. ఈ విషయంలో ప్రతీకార చర్యలేవీ ఉండవు. కేసీఆర్ను కొత్తగా జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు. చర్లపల్లి జైలుకు, ఆయన ఫాంహౌస్కు పెద్దగా తేడా లేదు. ఆయన ఇప్పటికే స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అక్కడా అదే నాలుగు గోడలు.. పోలీసు పహారా..ఫాంహౌస్లోనూ అదే పహారా. ఎన్నికల్లో ఓడిపోవడమే ఆయనకు పడిన పెద్ద శిక్ష.. ’ అని సీఎం వ్యాఖ్యానించారు.ఓటర్ల జాబితాలో అక్రమాలు నిజమే..ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ లేవనెత్తిన ఓటరు జాబితా అక్రమాలపై ముఖ్యమంత్రి స్పందించారు. ‘ఓటర్ల జాబితాలో అక్రమాలు నిజమే. 2018లో కొడంగల్లోనే 15 వేల ఓట్లు తొలగించారు. నేను 8 వేల ఓట్ల తేడాతో ఓడిపోయా..’ అని అన్నారు. చిట్చాట్ అనంతరం కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఇండియా కూటమి పక్షాల విందుకు రాహుల్గాంధీ ఆహ్వానం మేరకు రేవంత్ కూడా హాజరయ్యారు. విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్కుమార్, వివేక్, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు మల్లు రవి, అనిల్ యాదవ్, చామల కిరణ్కుమార్రెడ్డి, బలరాం నాయక్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.