-
భారీ ఆర్డర్లకు కొత్త విద్యుత్తు వాహనాలు
స్నేహితులు, కుటుంబ సభ్యులతో జరుపుకుంటున్న చిన్నపాటి వేడుకలకు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టేలా ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా 50 మందికి ఆహారం అందించేలా కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వాహనాలు అన్నీ ఎలక్ట్రిక్ వెహికిల్స్ అని సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపారు. పెద్ద ఆర్డర్లకు సంబంధించి ఈ తరహా వాహనాలను ఉపయోగిస్తుండటం దేశంలో ఇదే మొదటిసారి అని ఆయన చెప్పారు. ఇంతకుముందు పెద్ద ఆర్డర్లు తీసుకున్నా, సంప్రదాయ డెలివరీ భాగస్వాములే అందించేవాళ్లు అని తెలిపారు. దీని వల్ల వినియోగదారులు ఆశించిన స్థాయిలో సంతృప్తి చెందేవారు కాదని చెప్పారు. కొత్తగా తీసుకొచ్చిన ఈ వాహనాలతో భారీ ఆర్డర్లు పెడుతున్న కస్టమర్ల అవసరాలను తీరుతాయని పేర్కొన్నారు. ఇదీ చదవండి: పెరుగుతున్న దిగుమతులు.. ధరలకు రెక్కలు! ఆ వాహనాల్లో కూలింగ్ కంపార్ట్మెంట్లు, హాట్ బాక్స్ల వంటివి ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దాంతో వినియోగదారులు కోరుకున్న రీతిలో ఆహార పదార్థాలను డెలివరీ చేసే వీలుందన్నారు. ఇటీవల ‘ప్యూర్వెజ్’ పేరుతో తమ వాహానాల కొన్నింటికి రంగు మార్చి విమర్శలకు గురైన సంగతి తెలిసిందే. దాంతో ఆ నిర్ణయం ప్రకటించిన కొద్ది గంటల్లోనే దాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పారు. -
ఫుడ్ డెలివరీలోకి టాటా న్యూ
ముంబై: టాటా గ్రూప్ రూపొందించిన మలీ్టపర్పస్ సూపర్ యాప్ టాటా న్యూ వచ్చే ఏడాది రెండో వసంతంలోకి అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో డిజైన్ను సరికొత్తగా మార్చే యోచనలో ఉంది. అంతేకాకుండా ఆన్లైన్ ఫుడ్ డెలివరీలోకి ప్రవేశించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందుకు ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్(ఓఎన్డీసీ)ను వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ వివరాల ప్రకారం సాంకేతిక అంశాల కారణంగా యూజర్ ఇంటర్ఫేస్ (యూఐ)ను బ్లాక్ నుంచి వైట్ బ్యాక్గ్రౌండ్లోకి మార్చనుంది. 2022 ఏప్రిల్ 7న టాటా గ్రూప్ సూపర్ యాప్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలుత క్లోజ్డ్ యూజర్ గ్రూప్తో టాటా న్యూ యాప్ ప్రారంభంకాగా.. రెండు నగరాల(బెంగళూరు, ఢిల్లీ)కే పరిమితమైంది. ప్రస్తుతం ఓఎన్డీసీతోపాటు మ్యాజిక్పిన్ సహకారం ద్వారా ఫుడ్ డెలివరీ సరీ్వసులను ప్రవేశపెట్టనుంది. గతేడాది ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ కారణంగా మ్యాజిక్పిన్ ఫుడ్ ఆర్డర్లు రెట్టింపయ్యాయి. కాగా.. గత నెలలో కొత్త సీఈవోగా సీఈవో నవీన్ తహిల్యానికి బాధ్యతలు అప్పగించడంతోపాటు పలు మార్పులకు టాటా న్యూ తెరతీసింది. వివిధ బిజినెస్ చీఫ్లతో నవీన్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీలో పరిస్థితులపై ఉద్యోగులతో సర్వే చేపట్టారు. -
జొమాటో యూనిఫామ్లో మార్పులు.. క్షణాల్లోనే నిర్ణయం వెనక్కి..
ప్రత్యేకంగా శాకాహారమే కోరుకునే వినియోగదారుల కోసం ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ పేరుతో ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కొత్త సేవలు ప్రారంభించింది. శాకాహారుల కోరిక మేరకే ఈ సేవలు ప్రారంభించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ తెలిపారు. అయితే ఈ ప్రకటన చేసిన సమయంలో డెలివరీ స్టాఫ్కు ప్రత్యేకంగా గ్రీన్కలర్ డ్రెస్కోడ్ ఉంటుందని ప్రకటించారు. అలా ప్రకటన వెలువరించిన కాసేపటికే కంపెనీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇకపై అందరూ ఎర్ర రంగు యూనిఫామ్ను ధరిస్తారని చెప్పింది. అయితే ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ సేవలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. వెజ్ ఆర్డర్లను అందించడానికి ప్రత్యేక సిబ్బంది ఉంటారని కంపెనీ వివరించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో వ్యతిరేక సామాజిక పరిణామాలు ఎదురైతే మాత్రం ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ను వెంటనే నిలిపివేస్తామని దీపిందర్ గోయల్ తెలిపారు. ఆకుపచ్చ యూనిఫామ్ ధరించడంపట్ల కొన్ని సమాజిక వర్గాల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్యూర్ వెజ్ ఫ్లీట్ వెనుక ఎలాంటి రాజకీయ, మతపరమైన ఉద్దేశాలు లేవని గోయల్ స్పష్టం చేశారు. ‘చాలామంది వినియోగదారులు నిత్యం నాన్వెజ్ ఆర్డర్ చేస్తారు. డెలివరీ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ డెలివరీ బాక్సుల్లో పదార్థాలు కొన్నిసార్లు ఒలికిపోయే అవకాశం ఉంటుంది. దాంతో ఆ వాసన అలాగే ఉండిపోతుంది. తదుపరి ఆర్డర్ చేసే శాకాహార వినియోగదారులకు అది ఒకింత ఇబ్బంది కలిగించే అంశం. దాంతో ఫ్లీట్ను విభజించాం. కొంతమంది ప్యూర్ వెజిటేరియన్ హోటళ్ల నుంచి మాత్రమే ఫుడ్ ఆర్డర్ పెడతారు. వారిని దృష్టిలో ఉంచుకుని తాజా నిర్ణయం తీసుకున్నాం’ అని సీఈఓ వివరించారు. భారత్లోనే అత్యధిక శాతం శాకాహారులు ఉన్నారని గోయల్ తెలిపారు. ఆహారం వండే విధానం, దాన్ని నిర్వహించడంపై వారు ఒక స్పష్టమైన అభిప్రాయంతో ఉంటారని అన్నారు. కేవలం శాకాహారమే అందించే రెస్టారెంట్ల ఎంపిక, నాన్-వెజ్ ఆహారాన్ని మినహాయించడం వంటివి ఫ్యూర్ వెజ్ మోడ్లో ఉంటాయి. ఇదీ చదవండి: ఉద్యోగుల జీతాల పెంపునకు టీసీఎస్ ఎస్? ఫ్యూర్ వెజ్ ఫ్లీట్ ఆహారాన్ని డెలివరీ చేసేందుకు జొమాటో సాధారణంగా వినియోగించే ఎర్ర బాక్సుల స్థానంలో ఆకుపచ్చ డెలివరీ బాక్స్లను వినియోగించనుందని ముందుగా ప్రకటించింది. కొన్ని వర్గాల నుంచి సామాజిక మాధ్యమాల్లో విమర్శలు రావడంతో డెలివరీ బాక్స్లు, యూనిఫామ్ విషయంతో ప్రకటనను తిరిగి వెనక్కి తీసుకుంది. కానీ ప్యూర్ వెజ్ ఫ్లీట్ సేవలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. Update on our pure veg fleet — While we are going to continue to have a fleet for vegetarians, we have decided to remove the on-ground segregation of this fleet on the ground using the colour green. All our riders — both our regular fleet, and our fleet for vegetarians, will… — Deepinder Goyal (@deepigoyal) March 20, 2024 -
Zomato: ఛార్జీలు ఎందుకు పెంచుతుందో తెలుసా..?
గత త్రైమాసిక ఫలితాల్లో క్రమంగా నష్టాలు పోస్ట్ చేసిన జొమాటో ఇటీవల కొంత లాభాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా సేవలందించే సంస్థలు వాటి అవసరాలకు తగినట్లు ఛార్జీలు పెంచుకునే వీలుంది. నూతన సంవత్సరం సందర్భంగా రికార్డు స్థాయిలో ఆర్డర్లను అందుకున్న ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో.. ప్లాట్ఫారమ్ ఛార్జీని రూ.3 నుంచి రూ.4కి పెంచింది. కొత్త సంవత్సరం సందర్భంగా జొమాటో తన ప్లాట్ఫారమ్ ఫీజును తాత్కాలికంగా కొన్ని మార్కెట్లలో ఆర్డర్కు రూ.9 వరకు పెంచింది. మార్జిన్లను మెరుగుపరచడానికి, లాభదాయకంగా మారడానికి గత ఏడాది ఆగస్టులో రూ.2 ప్లాట్ఫారమ్ ఛార్జీను ప్రవేశపెట్టింది. అనంతరం దీనిని రూ.3కు పెంచింది. జనవరి 1న దాన్ని మళ్లీ రూ.4కు తీసుకొచ్చింది. ఇదీ చదవండి: న్యూ ఇయర్ ఎఫెక్ట్ - నిమిషానికి 1244 బిర్యానీలు.. ఓయో బుకింగ్స్ ఎన్నంటే? కొత్త ప్లాట్ఫారమ్ ఛార్జీ ‘జొమాటో గోల్డ్’తో సహా వినియోగదారులందరికీ వర్తిస్తుంది. జొమాటో క్విక్ కామర్స్ ప్లాట్ఫారమ్ బ్లింకిట్ కూడా నూతన సంవత్సం సందర్భంగా అత్యధిక ఆర్డర్లు పొందినట్లు తెలిసింది. ఇదిలావుండగా, జొమాటోకు దిల్లీ, కర్ణాటకలోని పన్ను అధికారుల నుంచి రూ.4.2 కోట్ల జీఎస్టీ నోటీసులు అందాయి. పన్ను డిమాండ్ నోటీసులపై అప్పీల్ చేస్తామని సంస్థ పేర్కొంది. డెలివరీ ఛార్జీలుగా సేకరించిన మొత్తంపై జీఎస్టీ చెల్లించలేదంటూ గతంలోనూ సంస్థ నోటీసులు అందుకుంది. -
అదనపు ఛార్జీలు లేకుండా ఫుడ్, క్యాబ్ సర్వీసు..!
బిర్యానీ తినాలని ఆన్లైన్లో ఆర్డర్ పెడితే నేరుగా రెస్టారెంట్కు వెళ్లి తినే ఖర్చుకంటే అధికంగా ఛార్జీలు కనిపిస్తూంటాయి. హైదరాబాద్లోని ఏదైనా ప్రముఖ రెస్టారెంట్లో రూ.250కి దొరికే బిర్యానీ.. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే జీఎస్టీ, కన్వేయన్స్, ఇంటర్నెట్ హ్యాండ్లింగ్, ప్యాకింగ్, డెలివరీ ఛార్జీలన్నీ కలిపి రూ.300 పైగానే ఖర్చవుతోంది. రెస్టారెంట్ నుంచి ఇంటి దూరం పెరిగితే ఛార్జీలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా.. నిత్యం ఏదో అవసరానికి ఎమర్జెన్సీలో ఒకప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రయాణించాలంటే ఆన్లైన్లో క్యాబ్, బైక్ బుక్ చేస్తూంటారు. మార్నింగ్, ఈవినింగ్ సమయంలో ‘పీక్, సర్జ్ అవర్స్’ పేరుతో సాధారణం కంటే అదనంగా ఛార్జ్ చేస్తూంటారు. ఇలా కొన్ని సంస్థలు చేస్తున్న వ్యవహారాలపై నియంత్రణ లేకుండా పోయింది. దాంతో వినియోగదారులపై భారంపడుతోంది. అలాంటి వ్యవస్థలను సవాళు చేస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఓఎన్డీసీ (ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్) వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది. డీపీఐఐటీ(డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) ఆధ్వర్యంలో వినియోగదారులకు నిర్దేశిత ధరల్లోనే ఫుడ్ డెలివరీలతో పాటు, క్యాబ్ సర్వీసులు, ఆన్లైన్లో వస్తువుల విక్రయం వంటి సేవలందిస్తున్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రెస్టారెంట్ ధరలు, వినియోగదారుడు ఉన్న దూరం ఆధారంగా నిర్దేశిత రుసుముతోనే ఆర్డర్లను చేర్చడం ఈ వేదిక ప్రత్యేకత. ఉదాహరణకు నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో బిర్యానీ రూ.300 ధర ఉంటే ఓఎన్డీసీ ద్వారా బుక్ చేస్తే డెలివరీ ఛార్జీలు కలిపి సుమారు రూ.325కి లభిస్తుంది. ఇంటర్నెట్, ప్యాకేజింగ్ ఛార్జీలు అంటూ అదనపు బాదుడు ఉండదు. 1,15,000 మందికి పైగా డెలివరీబాయ్స్తో బెంగళూరు, కొచ్చి, మైసూరు, కోల్కతా నగరాల్లో ఈ వేదిక కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆ ప్రాంతాల్లో వీరంతా రూ.160కోట్ల ఆదాయాన్ని పొందారు. హైదరాబాద్లోనూ ఇటీవల ఓఎన్డీసీ సేవలు ప్రారంభించింది. తెలంగాణ గిగ్వర్కర్స్ అసోసియేషన్కు చెందిన డెలివరీబాయ్లు ఇందులో భాగస్వాములైనట్లు ఆ సంస్థ పేర్కొంది. ఓఎన్డీసీకు సంబంధించి ప్రత్యేకమైన యాప్ ఏమీ లేదు. యూపీఐ పేమెంట్ యాప్ల ద్వారానే నేరుగా ఆర్డర్ ఇవ్వొచ్చు. ప్రస్తుతం పేటీఎం ద్వారా ఇది నగరవాసులకు అందుబాటులో ఉంది. హైదరాబాద్కు చెందిన 25వేల మంది డెలివరీబాయ్లు ఇందులో పనిచేస్తున్నారు. ఇదీ చదవండి: ఫ్రీ సినిమా పేరిట సైబర్ మోసం.. ఏం చేస్తున్నారంటే.. హైదరాబాద్లో ఏటా కోటి కంటే ఎక్కువ బిర్యానీలు అమ్ముడవుతున్నాయి. 15 వేలకు పైగా రెస్టారెంట్లు ఉన్నాయి. ఏటా కేవలం ఆన్లైన్ ద్వారానే రూ.500 కోట్ల వ్యాపారం జరుగుతోందని మార్కెట్ విశ్లేషకుల అంచనా. కేంద్రం ప్రారంభించిన ఓఎన్డీసీ వేదిక ఎక్కువమందికి చేరువైతే సుమారు రూ.50కోట్ల మేర వినియోగదారులకు ఆదా అయ్యే అవకాశం ఉందని తెలిసింది. -
జొమాటోలో వాటా విక్రయం
న్యూఢిల్లీ: జపనీస్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ తాజాగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటోలో 1.16 శాతం వాటా విక్రయించింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 10 కోట్ల షేర్ల(1.16 శాతం వాటా)ను అమ్మివేసింది. అనుబంధ సంస్థ ఎస్వీఎఫ్ గ్రోత్(సింగపూర్) పీటీఈ షేరుకి రూ. 94.7 సగటు ధరలో రూ. 947 కోట్లకు విక్రయించింది. మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఏబీ సన్లైఫ్, యాక్సిస్, కొటక్ మహీంద్రాతోపాటు సొసైటీ జనరాలి, మోర్గాన్ స్టాన్లీ ఏషియా సింగపూర్, నోమురా సింగపూర్ తదితరాలు జొమాటో షేర్లను కొనుగోలు చేశాయి. ఈ లావాదేవీ తదుపరి జొమాటోలో సాఫ్ట్బ్యాంక్ వాటా 3.35% నుంచి 2.19 శాతానికి క్షీణించింది. ఈ వార్తలతో జొమాటో షేరు 5.3 శాతం జంప్ చేసి రూ. 100 సమీపంలో ముగిసింది. -
లాభాల్లోకి జొమాటో
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో మొదటిసారి ఓ త్రైమాసికంలో లాభాలను నమోదు చేసింది. జూన్తో అంతమైన మూడు నెలల కాలానికి రూ.2 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ రూ.186 కోట్లు నష్టపోవడం గమనార్హం. కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.1,414 కోట్ల నుంచి రూ.2,416 కోట్లకు చేరింది. వ్యయాలు సైతం రూ.1,768 కోట్ల నుంచి రూ.2,612 కోట్లకు పెరిగాయి. ఈ ఫలితాల్లో బ్లింకిట్ గణాంకాలు సైతం కలిసే ఉన్నాయి. విడిగా ఫుడ్ డెలివరీ ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,470 కోట్ల నుంచి రూ.1,742 కోట్లకు పెరిగింది. హైపర్ ప్యూర్ ఆదాయం రూ.273 కోట్ల నుంచి రూ.617 కోట్లకు పెరిగింది. బ్లింకిట్ ఆదాయం రూ.164 కోట్ల నుంచి రూ.384 కోట్లకు పెరిగింది. వ్యాపారం పెద్ద సంక్లిష్టతలు లేకుండా నిర్వహించేందుకు తాము ఎంతో కష్టపడి పనిచేస్తున్నట్టు జొమాటో వ్యవస్థాపకుడు, ఎండీ, సీఈవో దీపిందర్ గోయల్ వాటాదారులకు రాసిన లేఖలో తెలిపారు. వచ్చే నాలుగు త్రైమాసికాల్లో మొత్తం వ్యాపారం వ్యాప్తంగా లాభాలను ఆర్జిస్తామని ప్రకటించారు. ఇక ముందు తమ వ్యాపారం లాభసాటిగానే కొనసాగుతుందని జొమాటో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అక్షంత్ గోయల్ తెలిపారు. వచ్చే కొన్నేళ్లపాటు తాము ఏటా 40 శాతానికి పైగా ఆదాయంలో వృద్ధిని సాధిస్తామని ప్రకటించారు. వచ్చే పదేళ్లలో జొమాటో కంటే బ్లింకిట్ వాటాదారులకు ఎక్కువ విలువ తెచ్చి పెడుతుందని దీపిందర్ గోయల్ పేర్కొన్నారు. కొన్ని పట్టణాల్లో జొమాటో స్థూల ఆర్డర్ విలువ సమీపానికి బ్లింకిట్ స్థూల ఆర్డర్ విలువ చేరినట్టు చెప్పారు. వృద్ధిని కొనసాగించేందుకు, తాము విజయం సాధిస్తామనుకున్న కొత్త వ్యాపార అవకాశాలను పరిశీలిస్తూనే ఉంటామన్నారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో జొమాటో షేరు 2 శాతం లాభపడి రూ.86 వద్ద ముగిసింది. -
హారిబుల్ ఎక్స్పీరియన్స్: జొమాటో మరో నిర్వాకం వెలుగులోకి!
సాక్షి, ముంబై: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు సంబంధించిన మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ వెజ్ ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళకి నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ చేసి కస్టమరుకు భారీ షాకిచ్చింది. తనకెదురైన చేదు అనుభవాన్ని ట్విటర్లో ఆమెషేర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్వీట్ చేశారు. దీంతో ఇది వైరల్గా మారింది. పలువురు నెటిజనులు జొమాటోపై మండిపడుతున్నారు. ఫలితంగా ఈ పోస్ట్ 6 లక్షలకు పైగా వ్యూస్, 700 లైక్లను పొందింది. జొమాటోలో శాఖాహారం ఆర్డర్ చేస్తే.. చికెన్ పంపించారంటూ నిరుపమా సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ట్విటర్లో షేర్ చేసిన నాలుగు సెకన్ల చిన్న క్లిప్లో చికెన్ ముక్కను చిదుముతూ తన షాకింగ్ అనుభవాన్ని తెలిపారు. ఇదేం సర్వీసురా బాబూ, భయంకరమైన అనుభవం అని ఆమె పేర్కొన్నారు. దీనిపై జొమాటో స్పందించింది. జరిగిన సంఘటనపై హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పింది. దర్యాప్తు చేస్తామని వెల్లడించింది. (జెరోధా నితిన్ నెల జీతం ఎంతో తెలుసా? ఈ తప్పులు చేయొద్దన్న బిలియనీర్) అయితే యూజర్లకు ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది ఓ యూజర్ ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కాఫీలో చికెన్ ముక్క దర్శనమిచ్చింది. ఈ వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. అయితే స్పందించి క్షమాపణలు చెప్పినప్పటికీ జొమాటోతో తన "అసోసియేషన్" అధికారికంగా ఆ రోజు ముగిసిందని పేర్కొనడం గమనార్హం. Hi @zomato , ordered veg food and got all non veg food. 4/5 of us were vegetarians. What is this service, horrible experience. pic.twitter.com/6hDkyMVBPg — Nirupama Singh (@nitropumaa) March 4, 2023 -
‘సారీ మీ ఫుడ్ తినేశా’.. డెలివరీ బాయ్ మెసేజ్తో కస్టమర్ షాక్
లండన్: ప్రస్తుత రోజుల్లో ఇంటికే ఫుడ్ డెలివరీ చేస్తున్నాయి పలు ఆన్లైన్ సంస్థలు. రోజుకు లక్షల మంది ఆయా యాప్ల ద్వారా తమకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు. మంచి ఆకలితో ఉన్నప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాక.. ఇంటి కాలింగ్ బెల్ మోగితే డెలివరీ బాయ్ వచ్చాడేమోనని ఆత్రుతగా పరుగెడతాం. కాదని తెలిస్తే ఒక్కసారిగా కోపం పెరిగిపోతుంది. ఫుడ్ డెలివరీ బాయ్ ఆలస్యంగా వచ్చినా చికాకుతో ఊగిపోతాం. అలాంటి సంఘటనే యూకేలోని ఓ వ్యక్తికి ఎదురైంది. అయితే, ఇక్కడ ఆలస్యం కాలేదు. అసలు తాను ఎదురుచూస్తున్న ఫుడ్ తీసుకురాలేదు కదా తాపీగా సారీ అంటూ ఓ మెసేజ్ చేశాడు ఫుడ్ డెలివరీ బాయ్. ఆ తర్వాత ఏం జరిగింది? లియమ్ బ్యాగ్నాల్ అనే వ్యక్తి ‘డెలివెరూ’ అనే ఫుడ్ డెలివరీ యాప్లో తనకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేశాడు. డెలివరీ కోసం ఎదురుచూడశాగాడు. కొద్ది సేపటి తర్వాత తన ఫోన్కు ఓ మెసేజ్ వచ్చింది. అది ఫుడ్ డెలివరీ ఏజెంట్ ‘సారీ’ అంటూ పంపించాడు. దానికి బ్యాగ్నాల్ ఏం జరిగిందని రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత ‘ఈ ఫుడ్ చాలా రుచికరంగా ఉంది. దానిని నేను తినేశాను. మీరు డెలివెరూ కంపెనీకి రిపోర్ట్ చేయండి’అని రిప్లై ఇచ్చాడు డెలివరీ బాయ్. ఆ తర్వాత నువ్ భయంకరమైన మనిషివి అని లియామ్ పేర్కొన్నాడు. దానికి ‘ఐ డోంట్ కేర్’ అంటూ షాకిచ్చాడు. ఈ సంభాషణ స్క్రీన్ షార్ట్స్ను ట్విట్టర్లో పోస్ట్ చేసి తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు లియామ్. ట్విట్టర్ పోస్ట్కు 192వేల లైక్స్ వచ్చాయి. వేలాది మంది కామెంట్లు చేశారు. Deliveroo driver has gone rogue this morning pic.twitter.com/sFNMUtNRrk — Bags (@BodyBagnall) October 28, 2022 ఇదీ చదవండి: దేవుడే పంపాడేమో! మంటల్లో చిక్కుకున్న నలుగురిని కాపాడిన వ్యక్తి -
Viral: స్విగ్గీ ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేస్తున్న డ్రాగన్స్.. నమ్మడం లేదా?
బిర్యానీ, దోశ, స్వీట్స్.. ఇలా ఏదైనా తినాలని అనిపిస్తే వెంటనే ఏం చేస్తాం.. హా ఇంట్లో వండుకొని తింటాం అంటారా.. కానీ ఇప్పుడంతా ఏమంటున్నారో తెలుసా..? వండుకునేంత టైం లేదండీ ఆన్లైన్లో ఫుండ్ ఆర్డర్ చేసుకొని లాగించడమే అని అంటున్నారు. అందరూ కాకపోయినా చాలా మంది ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లవైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు దీనికి ఉన్న డిమాండ్ అలాంటిది మరి. ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేసి పేమెంట్ చేస్తే చాలు.. నిమిషాల్లో ఫుడ్ డెలివరీ అవుతుంది. ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు.. ప్రిపరేషన్, డెలివరీ బాయ్ పికప్, ఆర్డర్ డెలివరీ ఎప్పుడు అవుతుందో ట్రాకర్ ద్వారా తెలుసుకోవచ్చు. సాధారణంగా డెలివరీ ట్రాకింగ్ ఇంటర్ ఫేస్లో బైక్పై వ్యక్తి ట్రావెల్ చేస్తూ వస్తున్నట్లు చూపిస్తుంది. తాజాగా స్విగ్గీ ఓ వినూత్న ప్రయోగం చేసింది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రసారం అవుతున్న హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్ను తమ ప్రమోషన్ కోసం వాడుకుంది. దీంతో ఫుడ్ ఆర్డర్ చేస్తే ట్రాకింగ్లో డెలివరీ పార్ట్నర్ బైక్ ప్లేస్లో స్విగ్గీ డ్రాగన్గా మార్చింది. చదవండి: Viral Photo: దారుణం.. చావు ఇంట్లో నవ్వులు.. ఫ్యామిలీ ఫోటోపై ట్రోలింగ్.. స్విగ్గీలో ఆర్డర్ ట్రాకింగ్లో ‘ఆకలితో ఉండకండి. మా డ్రాగన్ మీ ఫుడ్ను డెలివరీ చేస్తాడు’ అనే ట్యాగ్లైన్తో కనిపిస్తోంది. అంటే మన ఆర్డర్ను డ్రాగన్ డెలివరీ చేస్తున్నట్లు కస్టమర్లు ఫీల్ అయ్యేలా ఆలోచన చేసింది. ఇక స్విగ్గీలో కొత్తగా హౌజ్ ఆఫ్ డ్రాగన్ థీమ్ కనిపించడంతో నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. ఆర్డర్ ట్రాకింగ్కు సంబంధించిన స్క్రీన్షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ స్విగ్గీ క్రియెటివిటీని మెచ్చుకుంటున్నారు. చదవండి: చైన్ స్నాచర్ల కోసం జొమాటో డెలివరీ బాయ్గా మారిన ముంబై పోలీసులు.. 3 రోజులపాటు View this post on Instagram A post shared by Swiggy (@swiggyindia) -
Swiggy: రచయితకు చేదు అనుభవం.. రూ.70 వాపస్ చేస్తామనడంతో..
తమిళ పాటల రచయిత కో శేషాకు ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ప్యూర్ వెజిటేరియన్ అయిన ఆయన స్విగ్గీ పుణ్యామా అని మాంసం రుచి చూడాల్సి వచ్చింది. శేషా బెంగళూరులో స్టే చేశాడు. ఈక్రమంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ద్వారా బుధవారం ‘గోబీ మంచూరియా విత్ కార్న్ ఫ్రైడ్ రైస్’ ఆర్డర్ చేశాడు. మాంచి ఆకలిమీదున్న ఆయన ఫుడ్ రాగానే ఆబగా తినేశాడు. కొద్దిగా తిన్న తర్వాత ఆయనకు ఫుడ్లో ఏదో తేడా అనిపించింది. అది వెజ్ మంచూరియా కాదని నిర్ధారణకు వచ్చి తినడం ఆపేశాడు. తనతోపాటు ఉన్న ఇద్దరు నాన్ వెజిటేరియన్ మిత్రులకు దాన్ని రుచి చూపించగా.. వాళ్లు అది చికెన్ మంచూరియా అని క్లారిటీ ఇచ్చారు. కంగుతిన్న శేషా స్విగ్గీ తప్పిదంపై కస్టమర్ కేర్ను సంప్రదించాడు. (చదవండి: బ్రెయిన్ పని చేయని స్థితిలో కమెడియన్) Found pieces of chicken meat in the “Gobi Manchurian with Corn Fried Rice” that i ordered on @Swiggy from the @tbc_india. What’s worse was Swiggy customer care offered me a compensation of Rs. 70 (!!!) for “offending my religious sentiments”. 1/2 pic.twitter.com/4slmyooYWq — Ko Sesha (@KoSesha) August 17, 2022 అయితే, తమ పొరపాటును గుర్తించిన సదరు సంస్థ.. ఆర్డర్ విలువ రూ.70 వాపస్ చేస్తామని బదులిచ్చింది. దీంతో శేషాకు చిర్రెత్తుకొచ్చింది. తన మత విశ్వాలసాలను 70 రూపాయలకు విలువ కడతారా? అంటూ విమర్శలు గుప్పించాడు. చెత్త సర్వీస్ అంటూ ట్విటర్ వేదికగా గరం అయ్యాడు. పుట్టు వెజిటేరియన్ అయిన తనకు స్విగ్గీ స్టేట్ హెడ్ క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. అవసరమనుకుంటే డెలివరీ యాప్పై లీగల్గా కూడా వెళ్తానని శేషా చెప్పుకొచ్చాడు. I’ve been a strict vegetarian all my life & it disgusts me to think how casually they tried to buy my values. I demand that a representative of Swiggy, no lesser than the State Head call me to personally to apologise. I also reserve my rights to a legal remedy.@SwiggyCares — Ko Sesha (@KoSesha) August 17, 2022 కాగా, శేషా ట్వీట్పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కొందరు ఆన్లైన్ ఫుల్ డెలివరీల్లో ఇవన్నీ కామన్ అని అంటుండగా మరికొందరు.. స్విగ్గీ సర్వీస్ మునుపటిలా లేదని అంటున్నారు. ఇంకొందరు.. ఇదివరకు ఎప్పుడూ మాంసం తిననపుడు.. అది వెజ్ కాదు.. నాన్ వెజ్ అని ఎలా తెలిసింది? అని శేషాను ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ వివాదంపై స్విగ్గీ ట్విటర్ వేదికగా స్పందించింది. రెస్టారెంట్ పార్టనర్ వల్లే తమ కస్టమర్కు ఇబ్బంది కలిగిందని, తమ సర్వీస్లో లోపం కాదని చెప్పింది. నిజంగా పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుని.. శేషాకు వివరణ ఇస్తామని బదులిచ్చింది. (చదవండి: విధి ఆడిన వింత నాటకం: ఇష్టమైన ఆటే ప్రాణం తీసింది!) For all those who have rushed to the aid of Swiggy:https://t.co/Fwsn7mmX51 — Ko Sesha (@KoSesha) August 17, 2022 -
ఆ యాప్ ద్వారా ఫ్రీ ఫుడ్, మందు.. క్షణాల్లోనే వందల ఆర్డర్స్
వాషింగ్టన్: ఆఫర్లో తక్కువ ధరకే ఏదైనా వస్తువు వస్తుందంటేనే జనాలు ఎగబడతారు. అలాంటిది ఉచితంగా ఆహారం, మందు వస్తుంటే ఊరుకుంటారా? ఓ యాప్ ద్వారా ఉచితంగా ఫుడ్, లిక్కర్ వస్తోందని తెలుసుకుని వందల మంది ఆర్డర్ చేశారు. క్షణాల్లోనే కుప్పలు తెప్పలుగా ఆర్డర్లు రావటంతో నిర్వహకులు అవాక్కయ్యారు. ఈ సంఘటన అమెరికాలో జరిగింది. డోర్డాష్ అనే ఫుడ్ డెలివరీ యాప్లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల ఈ సంఘటన ఎదురైంది. ఆ యాప్లో పేమెంట్ గేట్వే లేకుండానే ఆర్డర్లు బుక్కయ్యాయి. ఈ ఆఫర్ తెలుసుకున్న పలువురు ఆర్డర్ చేయటమే కాదు.. తాము ఉచితంగా పొందామని తమ ఆర్డర్ చిత్రాలను ఆన్లైన్లో పోస్ట్ చేశారు. అందులో టెకిలా వంటి అత్యంత ఖరీదైనవి సైతం ఉండటం గమనార్హం. దీంతో శుక్రవారం మధ్యాహ్నానికి డోర్డాష్ యాప్ ట్విట్టర్లో ట్రెడింగ్లోకి వచ్చింది. అయితే.. ఈ సమయంలో ఎంత మంది పేమెంట్ లేకుండా ఆర్డర్ చేశారనేది మాత్రం తెలియరాలేదు. అయితే.. అలాంటి ఆర్డర్లను తొలగిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలపటం ఉచితంగా ఆహారం, మందు పొందాలనుకున్న వారిని నిరాశకు గురి చేసింది. 'జులై 7న సాయంత్రం డోర్డాష్ యాప్లో పేమెంట్ సమస్య తలెత్తింది. ఆ తర్వాత కొద్ది సేపు ఎలాంటి పేమెంట్ లేకుండానే పలువురు యూజర్లు ఆర్డర్ బుక్ చేయగలిగారు. అలా కొందరు వినియోగదారులు ఆర్డర్ చేశారని తెలుసుకుని.. వెంటనే సమస్యను పరిష్కరించాం.' అని డోర్డాష్ ప్రతినిధి ఒకరు తెలిపారు. Doordash glitch went crazy im all stocked up free of charge pic.twitter.com/3gvtGZXPtL — annabelle. (@oomfabelle) July 8, 2022 Ain’t gone be a wing left in Chicago with this DoorDash glitch going on 🤦🏾♂️🤦🏾♂️🤦🏾♂️ pic.twitter.com/ghqIyF2Ktj — Follow Da Realest (@Cameron_773) July 8, 2022 ఇదీ చదవండి: అధ్యక్షుడి భవనంలో కరెన్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు -
ఫుడ్ డెలివరీ సంస్థల్లో ఆర్డర్ పెడుతున్నారా.. ఇంత మోసమా..?
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో ఎంతో ఫేమసో అందరికీ తెలిసిందే. ఫుడ్ ఆర్డర్ల విషయంలో కస్టమర్లు జోమాటోతో పాటు ఇతర సంస్థలను ఎంచుకుంటుంటారు. కాగా, జోమాటో ఆర్డర్లపై ఓ కస్టమర్ షాకింగ్ విషయాలు వెలుగులోకి తెచ్చాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నాడు. వివరాల ప్రకారం.. రాహుల్ కబ్రా అనే ఒక లింక్డ్ఇన్ యూజర్.. ఆన్లైన్, ఆఫ్లైన్ ఫుడ్ ఆర్డర్ బిల్లులను పోల్చుచూ ఓ పోస్టును పెట్టాడు. అందులో భాగంగా ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో వినియోగదారుల నుంచి ఎక్కువ వసూలు చేస్తోందని అతడు పేర్కొన్నాడు. ఈ క్రమంలో రెండింటి మధ్య ధరల డిఫరెన్స్ను గమనించి ఖంగుతిన్నాడు. ఈ క్రమంలోనే ఛార్జీల పేరుతో డెలివరీ సంస్థలు వినియోగదారులను దోచుకుంటున్నాయని ఆరోపించాడు. కాగా, అతని ఆర్డర్లో వెజ్ బ్లాక్ పెప్పర్ సాస్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, మష్రూమ్ మోమోలు ఉన్నాయి. ఆఫ్లైన్ ఆర్డర్ బిల్లు సీజీఎస్టీ, ఎస్జీఎస్టీతో కలుపుకుని రూ.512 అయింది. అయితే, ఇదే ఆర్డర్ జోమాటోలో రూ.689.90 ఉంది. అది కూడా రూ. 75 డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఉండటం విశేషం. ఆ క్రమంలో జోమాటో 34.76% ఎక్కువ (రూ.178) వసూలు చేసినట్లు రాహుల్ తెలిపాడు. ఈ సందర్భంగా.. రాహుల్ కబ్రా డెలివరీ సంస్థలపై ఆగ్రహం వ్యక్తపరిచాడు. డెలివరీ సంస్థల బిల్లులపై ప్రభుత్వం ఫోకస్ చేయాల్సిన అవసరముందన్నాడు. అధిక ఛార్జీల పెరుగుదలను ప్రభుత్వం కట్టడి చేయాల్సిన అవసరం ఉందని తాను భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు. తద్వారా అందరికీ ఉపయోగం ఉంటుందని తెలిపాడు. భవిష్యత్తులో వినియోగదారులు జోమాటో వసూలు చేస్తున్న అధిక ఖర్చులను వినియోగదారులు అర్థం చేసుకుంటారని అన్నాడు. రాహుల్ కబ్రా పోస్టుపై మరో నెటిజన్ స్పందిస్తూ.. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో స్విగ్గి ఆర్డర్పై తన అనుభవాన్ని చెప్పుకొచ్చాడు. ‘‘నేను సమీపంలోని రెస్టారెంట్ నుండి థాలీని ఆర్డర్ చేయాలనుకున్నాను. స్విగ్గీలో ధరను 120 ప్లస్ డెలివరీ ఛార్జీలుగా చూపింది. కానీ, నేను అదే రెస్టారెంట్ వైపు వెళ్తున్నా కారణంగా ఆన్లైన్లో ఆర్డర్ కాకుండా డైరెక్ట్గా రెస్టారెంట్ నుండి తీసుకున్నాను. దీంతో, అదే థాలీ రూ. 99కి వచ్చింది. అదే ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఉంటే.. 40% ఎక్కువ ఉన్న అదే ఆహారం కోసం నేను స్విగ్గీకి దాదాపు 140 చెల్లించాల్సి వచ్చేదని అన్నాడు. కాగా, ఆయన పోస్టుపై రాహుల్ కాబ్రా.. నెటిజన్ల స్పందన ఏమిటో తెలపండి అంటూ కోరాడు. దీంతో, కొందరు నెటిజన్లు.. కంపెనీ ఇస్తున్న సర్వీసు వల్ల కొంత ఎక్కువ ఛార్జ్ చేస్తే తప్పేంటి, వారు చేస్తున్నదీ వ్యాపారమేగా అని కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం వ్యతిరేకించారు. మరొక యూజర్ ఈ యాప్లను తన ఫోన్ల నుంచి డిలీట్ చేసి పక్కనే ఉండే రెస్టారెంట్లకు వెళ్లి తినటం మంచిదని బదులిచ్చాడు. ఇది కూడా చదవండి: గూగుల్ని తిట్టిపోస్తున్న నెటిజన్లు...నివాళి ఇచ్చే పద్ధతి ఇదేనా! -
ఫిర్యాదుల పరిష్కారానికి ఏం చేస్తున్నారు..
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ ఆపరేటర్లపై కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది. ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన వ్యవస్థను మెరుగుపర్చుకోవడానికి తీసుకుంటున్న చర్యల గురించి 15 రోజుల్లోగా ప్రతిపాదనలను సమర్పించాలని స్విగ్గీ, జొమాటో తదితర ఆపరేటర్లను ఆదేశించింది. ప్రస్తుతం పాటిస్తున్న విధానం, అలాగే మెరుగుపర్చే ప్రతిపాదనలను ఇవ్వాలంటూ వినియోగదారుల వ్యవహారాల విభాగం బడా ఈ–కామర్స్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లను (ఎఫ్బీవో) ఆదేశించినట్లు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ సారథ్యంలో సోమవారం ఎఫ్బీవోలతో జరిగిన సమావేశం సందర్భంగా ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొంది. గడిచిన 12 నెలల వ్యవధిలో నేషనల్ కన్జూమర్ హెల్ప్లైన్ నంబరుకు (1915) స్విగ్గీపై 3,631, జొమాటోపై 2,828 పైచిలుకు ఫిర్యాదులు వచ్చినట్లు వివరించింది. డెలివరీ చార్జీలు, ప్యాకేజింగ్ చార్జీలు, పన్నులులాంటి ప్రతి చార్జీ గురించి వినియోగదారులకు పారదర్శకంగా చూపాలని సూచించినట్లు తెలిపింది. స్విగ్గీ, జొమాటో సహా ఎఫ్బీవోలు, రెస్టారెంట్ల సమాఖ్య ఎన్ఆర్ఏఐ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హెల్ప్లైన్కి వచ్చిన ఫిర్యాదులపై ఇందులో చర్చించారు. తాము మెరుగైన సర్వీసులు అందించడానికి లేకుండా ఎఫ్బీవోలు కస్టమర్ల వివరాలను ఇవ్వడం లేదంటూ ఎన్ఆర్ఏఐ ఆరోపించింది. ప్రతి ఆర్డరుపై 20 శాతం కమీషన్ తీసుకోవడంతో పాటు డెలివరీ చార్జీలను కూడా ఎఫ్బీవోలే ఇష్టానుసారంగా నిర్ణయిస్తున్నాయని పేర్కొంది. మరోవైపు, తాము ఇప్పటికే ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను అమలు చేస్తున్నామని, దీన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు అవకాశం ఉందని ఎఫ్బీవోలు తెలిపాయి. -
నిమిషానికి 115 ఆర్డర్స్..! 2021లో భారతీయులు ఎగబడి లాగించేసిన ఫుడ్ ఇదే...!
2021గాను ఆన్లైన్లో అత్యధికంగా ఆర్డర్స్ చేసిన ఫుడ్ డిషెస్ వివరాలను ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ రిలీజ్ చేసింది. నిమిషానికి 115 ప్లేట్ల ఆర్డర్స్తో బిర్యానీ టాప్ పొజిషన్లో నిలిచినట్లు స్విగ్గీ వెల్లడించింది. ఆరో వార్షిక నివేదిక StatEATstics రిపోర్ట్లో పలు విషయాలను కంపెనీ పేర్కొంది. అగ్రస్థానం బిర్యానీదే..! భోజన ప్రియులు 2021లో స్విగ్గీ ప్లాట్ఫాంను భారీగానే తలుపుతట్టారు. ఈ ఏడాదిలో సుమారు 4.25 లక్షల మంది కొత్త యూజర్లు స్విగ్గీలో చేరినట్లు కంపెనీ ప్రకటించింది. వీరు మొదటి ఆర్డర్గా చికెన్ బిర్యానీనే పెట్టినట్లు స్విగ్గీ వెల్లడించింది. అదే సమయంలో ఈ ఏడాదిలో ఎక్కువగా ఆర్డర్ చేసిన స్నాక్ ఐటమ్గా సమోసా నిలిచింది. 2021లో సుమారు 50 లక్షల సమోసా ఆర్డర్స్ వచ్చినట్లు స్విగ్గీ పేర్కొంది. ఈ ఆర్డర్స్ దాదాపు న్యూజిలాండ్ దేశ జనాభాతో సమానం. గత ఏడాది 2020లో, నిమిషానికి 90పైగా బిర్యానీలు ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ పేర్కొంది. ఈ ఏడాదిలో ఫుడ్ లవర్స్ ఒక సెకనులో సుమారు రెండు బిర్యానీలను ఆర్డర్స్ చేసినట్లు పేర్కొంది. చికెన్ బిర్యానీ, సమోసాల తరువాత చికెన్ వింగ్స్, పావ్ భాజీ నిలిచాయి. 21 లక్షల ఆర్డర్స్తో ఇండియా సెకండ్ ఫేవరెట్ స్నాక్ పావ్బాజీ నిలిచింది. స్విట్స్లో 21 లక్షల ఆర్డర్స్తో గులాబ్ జామూన్ నిలవగా, తరువాతి స్థానంలో రస్మలై సుమారు 12 లక్షల ఆర్డర్స్ను డెలివరీ చేసినట్లు స్విగ్గీ పేర్కొంది. హెల్త్పై ఎక్కువ.. కరోనా రాకతో చాలా మంది హెల్తీ డైట్పై అవగాహన పెంచుకున్నారు. స్విగ్గీలో హెల్తీ డైట్ను వెతికిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గత పెడాదితో పోలీస్తే 200 శాతం మేర ఆర్డర్స్ పెరిగాయని స్విగ్గీ తన రిపోర్ట్లో పేర్కొంది. అత్యంత ఆరోగ్య స్పృహ కలిగిన నగరంగా తొలిస్థానంలో బెంగుళూరు నిలవగా, తరువాతి స్థానంలో హైదరాబాద్, ముంబై నగరాలు నిలిచాయి. గ్రాసరీ బిజినెస్ విషయానికి వస్తే..! స్విగ్గీ ఫుడ్ డెలివరీ సేవలతోపాటుగా ఇన్స్టామార్ట్ పేరుతో గ్రాసరీ డెలివరీ సేవలను మొదలుపెట్టింది. ఈ ఏడాదిలో 28 మిలియన్ ప్యాక్ల పండ్లు , కూరగాయలను డెలివరీ చేసింది. ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేసిన మొత్తం అరటిపండ్ల పరిమాణం అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే 2.6 రెట్లు అధికం. చదవండి: జనవరి 1 నుంచి స్విగ్గీ, జొమాటోలో ఫుడ్ ధరలు పెరగనున్నాయి? -
లీటర్ పెట్రోల్ రూ.112... భారీగా చార్జీలు పెంచేసిన జొమాటో, స్విగ్గీ, క్యాబ్స్!
సాక్షి, హైదరాబాద్: క్యాబ్లు, ట్యాక్సీబైక్లు, జొమాటో, స్విగ్గీ తదితర యాప్ ఆధారిత సేవల చార్జీలపై పెట్రోల్, డీజిల్ ధరలు ఆజ్యం పోస్తున్నాయి. ఇప్పటికే సర్ చార్జీలు, పీక్ అవర్స్ పేరిట ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్న క్యాబ్లు.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల భారాన్ని సైతం ప్రయాణికులపైనే మోపుతున్నాయి. అన్ని రకాల క్యాబ్లు, బైక్ల సేవలపై తాజాగా 15 శాతానికి పైగా చార్జీలను పెంచేశారు. దీంతో సిటీజనుల ప్రయాణం మరింత భారంగా పరిణమించింది. మరోవైపు యాప్ ఆధారంగా ఆహార పదార్థాలు, వివిధ రకాల వస్తువులను అందజేసే యాప్ ఆధారిత సేవలపై సైతం చార్జీలను పెంచేశారు. చదవండి: స్విగ్గీ చేసింది.. ఆమెకు అండగా... ఆరోజులలో సెలవు! ప్రతి రోజు వేలాది మంది ఎంతో ఇష్టంగా ఆర్డర్ ఇచ్చే బిర్యానీలు, రకరకాల ఫుడ్ ఐటెమ్స్పై రవాణా సేవల రూపంలో ఇప్పుడు మరికొంత అదనంగా చెల్లించుకోవాల్సివస్తోంది. నిత్యావసర వస్తువులను, సేవలను అందజేసే యాప్ ప్లాట్ఫామ్స్ కూడా ఇప్పుడు తమ రేట్ కార్డులను సవరించాయి. ‘గతంలో ఒకటిన్నర కిలోమీటర్ దూరానికి రూ.20 మాత్రమే సర్వీసు చార్జీ తీసుకుంటే ఇప్పుడు కొన్ని యాప్ ప్లాట్ఫామ్స్ రూ.25 నుంచి రూ.30 వరకు చార్జీలు వేస్తున్నాయి’ అని వినియోగదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెట్రోల్ చార్జీల పెంపుతోనే సర్వీస్ చార్జీలు పెరిగాయని డెలివరీ బాయ్స్ చెబుతున్నారు. చదవండి: డ్యూటీలో ఉన్న డాక్టర్పై ఊడిపడిన ఫ్యాన్.. హెల్మెట్ డాక్టర్స్! బైక్ బెంబేలు... ► సింగిల్ ప్యాసింజర్కు ఎంతో అనుకూలంగా ఉన్న బైక్ ట్యాక్సీలకు కూడా ఇప్పుడు రెక్కలొచ్చేశాయి. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ నుంచి కొండాపూర్ వరకు గతంలో కేవలం రూ.21 నుంచి రూ.25 వరకు ఉన్న చార్జీ ఇప్పుడు రూ.35 దాటింది. పైగా రోజు రోజుకు ఈ చార్జీల్లో తేడాలు కనిపిస్తున్నాయి. ► సికింద్రాబాద్ నుంచి హబ్సిగూడ వరకు గతంలో రూ.30 వరకు చార్జీ ఉండగా ఇప్పుడు కొన్ని బైక్ ట్యాక్సీల్లో రూ.50 వరకు పెరిగింది. మరోవైపు క్యాబ్లు, ఆటోలు సైతం ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. ► ఉప్పల్ నుంచి బంజారాహిల్స్ వరకు గతంలో రూ.275 ఉన్న క్యాబ్ చార్జీ ఇప్పుడు రూ.350 దాటింది. పీక్ అవర్స్లో ఈ చార్జీలు మరింత పెరుగుతున్నాయి. ► దీంతో పాటు సర్చార్జీల రూపంలో క్యాబ్ సంస్థలు మరింత భారం మోపుతున్నాయి. ‘పెట్రోల్ మోతతో సొంత బండి పక్కన పెట్టి ట్యాక్సీ బైక్పై వెళ్దామనుకుంటే ఇప్పుడు ఆ చార్జీలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి’ అని మల్కాజిగిరికి చెందిన ఫణీంద్ర విస్మయం వ్యక్తం చేశారు. సగటు జీవి విలవిల... ► రోజు రోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సగటు జీవిని అతలాకుతలం చేస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.112.27, లీటర్ డీజిల్ రూ.105.46. 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.952 దాటింది. ► ఏ రోజుకా రోజు పెరుగుతున్న ధరలతో జనం విలవిల్లాడుతున్నారు. పెరిగిన ఇంధన ధరలతో కూరగాయలు, అన్ని రకాల కిరాణా సరుకులు, నిత్యావసర వస్తువుల ధరలు అనూహ్యంగా పెరిగాయి. ► కోవిడ్ కట్టడి కోసం విధించిన లాక్డౌన్ దృష్ట్యా గతంలో వివిధ రకాల వస్తుసేవల ధరలు పెరిగాయి. కరోనా తగ్గుముఖం పట్టి, ఆంక్షల సంకెళ్లు తొలగిపోయి కొద్దిగా ఊరట పొందుతున్న తరుణంలో సామాన్యుడి ముంగిట పేలిన పెట్రో బాంబు ఊపిరి తీసుకొనేందుకు అవకాశం లేకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. -
స్విగ్గీపై గరమైన డెలివరీ బాయ్స్
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తమను మోసం చేస్తోందంటూ డెలివరీ బాయ్స్ నిరసన వ్యక్తం చేశారు. స్విగ్గి కంపెనీ యాజమాన్యం తమకు కమిషన్ తక్కువగా ఇస్తోందని మాదాపూర్ పోలీసు స్టేషన్ ఎదురుగా మంగళవారం ఆందోళన నిర్వహించారు. గతంలో 2 కిలోమీటర్ల పరిది లోపు ఒక డెలివరీ ఐటెమ్కు 35 రూపాయల కమిషన్ ఇస్తున్న సంస్థ ప్రస్తుతం భారీగా కోత విధించిందని తెలిపారు. ఒక కిలోమీటర్ పరిధిలోపు డెలివరీ చేస్తే కేవలం 6 రూపాయలు మాత్రమే ఇస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దూరం పెరడంతో రోజుకి 200 రూపాయలు కూడా సంపాదించలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. స్విగ్గీ యాజమాన్యం థర్డ్ పార్టీని పెట్టి తమ పొట్ట కొడుతోందని స్విగ్గి డెలివరీ బాయ్స్ ఆరోపించారు. థర్టీ పార్టీకి ఎక్కువ కమిషన్ ఇస్తూ తమకు మాత్రం తక్కువ కమిషన్ చెల్లిస్తోందని పేర్కొన్నారు. స్విగ్గీ మోసం చేస్తోందంటూ మాదాపూర్ పోలీసు స్టేషన్లో పిర్యాదు చేశారు. దీంతో మాదాపూర్ పోలీస్ స్టేషన్కు వచ్చిన స్విగ్గీ ప్రతినిధులు రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామినిచ్చారు. రెండు రోజుల్లో సమస్యలు పరిష్కారం కాకుంటే హైదరాబాద్ మొత్తం ఆందోళనలు చేస్తామని డెలివరీ బాయ్స్ తెగేసి చెప్పారు. (చదవండి: ఒక ఐడియా అతని జీవితాన్ని మార్చేసింది) -
ఇక డ్రోన్స్తో ఫుడ్ డెలివరీ!
న్యూఢిల్లీ: దేశీయంగా ఫుడ్ డెలివరీ సేవల్లో డ్రోన్లను కూడా ఉపయోగించే దిశగా ప్రయత్నాలు వేగవంతమవుతున్నాయి. ఇందుకు సంబంధించి సంక్లిష్టమైన బీవీఎల్వోఎస్ డ్రోన్లతో ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహించేందుకు 13 సంస్థల కన్సార్షియానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతులిచ్చింది. ఫుడ్ డెలివరీ స్టార్టప్ సంస్థలైన జొమాటో, స్విగ్గీ, డుంజోతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ దన్నుగా ఉన్న డ్రోన్ స్టార్టప్ ఆస్టీరియా ఏరోస్పేస్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. సెప్టెంబర్ 30 నాటికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్దేశించిన నిర్దిష్ట గగనతలంలో ఈ కన్సార్షియం కనీసం 100 గంటల ఫ్లైట్ టైమ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డీజీసీఏకి నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ టెస్టులు జూలై తొలి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. స్థానికంగా డ్రోన్ ఆధారిత సర్వీసులను అభివృద్ధి చేసుకునే దిశగా భారత్కు ఇది తొలి అడుగు కానుంది. గతేడాది నుంచే ప్రయత్నాలు .. సుదీర్ఘ దూరాల శ్రేణి డ్రోన్ ఫ్లయిట్స్ను ప్రయోగాత్మకంగా అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు భారత్ గతేడాదే ప్రకటించింది. జొమాటో గతేడాదే డ్రోన్లను ఉపయోగించి డెలివరీ చేసే ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. 5 కేజీల పేలోడ్తో 10 నిమిషాల వ్యవధిలో 5 కి.మీ. దూరాన్ని డ్రోన్ అధిగమించినట్లు గోయల్ చెప్పారు. ఇది గరిష్టంగా గంటకు 80 కి.మీ. వేగాన్ని అందుకున్నట్లు వివరించారు. 15 నిమిషాల కన్నా తక్కువ వ్యవధిలోనే కస్టమర్కు ఫుడ్ డెలివరీ పూర్తి చేసే దిశగా జొమాటో ప్రయత్నాలు చేస్తోంది. ‘ఇంత వేగంగా డెలివరీ చేయాలంటే రహదారి మార్గం ద్వారా కుదరదు. ఆకాశమార్గం ద్వారా మాత్రమే 15 నిమిషాల్లో డెలివరీ వీలవుతుంది‘ అని గోయల్ తెలిపారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా మరింత వేగవంతంగా ఫుడ్ డెలివరీ సేవలు అందించడం కోసం జొమాటో 2018లో స్థానిక డ్రోన్ స్టార్టప్ సంస్థ టెక్ఈగిల్ను కూడా కొనుగోలు చేసింది. డ్రోన్ ట్రయల్స్కు తమకు అనుమతులు లభించినట్లు చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్జెట్ మే నెలలో వెల్లడించింది. అనుమతి తప్పనిసరి... డ్రోన్ల వినియోగానికి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో.. వీటి తయారీ, వినియోగానికి సంబంధించి మసాయిదా నిబంధనలను పౌర విమానయాన శాఖ విడుదల చేసింది. డీజీసీఏ నుంచి అనుమతి కలిగిన తయారీ సంస్థ లేదా దిగుమతిదారు.. డీజీసీఏ నుంచి అమోదం పొందిన సంస్థ లేదా వ్యక్తికి డ్రోన్లను విక్రయించొచ్చు. అంటే డ్రోన్ల విక్రయాలకు, కొనుగోలుకు కూడా డీజీసీఏ అనుమతి తప్పనిసరి. డ్రోన్లు వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఎదురయ్యే నష్టాలకు థర్డ్ పార్టీ బీమాను తీసుకోవడం కూడా తప్పనిసరి అని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. -
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సురక్షితమే
కరోనా వైరస్తో దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లడంతో రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లి ఇష్టమైన ఆహారాన్ని తినలేకపోతేన్నామనే భావన ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. రెండువారాలు దిగ్భంధంలో గడిపిన తరువాత కూడా పరిస్థితిలో ఏ మార్పు రాకపోవడంతో లాక్డౌన్ పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఈ నేపథ్యంలో కరోనా వైరస్ బారీన పడకుండా ఉండాలంటే మనమంతా ఇంట్లోనే ఉంటూ, పరిశుభ్రంగా ఉండడమే ఉత్తమమైన మార్గం అని గ్రహించాము. అంతేగాక ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా మా రోజువారీ దినచర్యలను మార్చుకున్నాము.వీటిలో ఇంట్లోకి తీసుకువచ్చే బయటి వస్తువులతో పాటు, ఫుడ్ డెలివరీ విషయంలో కూడా అదనపు జాగ్రత్త వహించడం కూడా ఒకటి. ఈ అసాధారణమైన పరిస్థితులలో బయటి నుంచి తీసుకువచ్చే వస్తువుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా వాటిని శుభ్రం చేయడంలో జాగ్రత్త వహించాలి. పలు ఆరోగ్య సంస్థలు నిరంతరం చేతులు కడుక్కోవాలని ప్రజలకు సూచించినప్పటికీ, ఫుడ్ డెలివవరీలను ఏ విధంగా నిర్వహించాలనే దానిపై సమాచారం అందుబాటులో లేదు. ఫుడ్ డెలివరీ నిర్వహణ విషయంలో అనేక సందేహాలు ఉండడంతో అది అంత సురక్షితం కాదేమోనని ఫుడ్ ఆర్డర్ చేయడానికి ప్రజలు భయపడుతున్నారు. కానీ ఫుడ్ ఆర్డర్ చేయడం సురక్షితం అని మీకు తెలియడానికి ఎటువంటి భద్రతా చర్యలను అనుసరిస్తున్నామనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాం. అంతేగాక అన్ని సమయాల్లో సూక్ష్మక్రిములు సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న సూపర్ మార్కెట్కు వెళ్లడం కంటే ఆహారాన్ని మీ ఇంటికే తెప్పించుకోవడం సురక్షితం అని గ్రహించండి. అయితే శానిటరీ టెక్నిక్లను ఉపయోగించి మీ ప్యాకేజీలను అన్ ప్యాకేజ్ చేయడం కూడా అంతే ముఖ్యం. రెస్టారెంట్లు, హోమ్ డెలివరీ విభాగాలు పలు ఆరోగ్య సూత్రాలను అనుసరిస్తూ తమ వినియోగదారులు సురక్షితంగా ఉండడం కోసం ముందడుగు వేశాయి. పరిశుభ్రమైన ఆహారం తయారీ, తాజాగా వండిన భోజనం, చెఫ్లు పాటించవలసిన ఆరోగ్య విధానాలు, కాంటాక్ట్ డెలివరీ, డోర్ డెలివరీ ఎగ్జిక్యూటివ్లు జాగ్రత్త వహించేలా రెస్టారెంట్ యజమానులు చర్యలు తీసుకుంటారు. కాబట్టి వీటిలో కలుషితానికి తక్కువ ఆస్కారం ఉందని మీకు హామీ ఇస్తున్నాం. వైరస్ సోకకుండా మీ ప్యాకేజీలను సరైన పద్దతిలో ఎలా అన్ ప్యాకేజీ చేయాలనేది చూడండి ►మీరు మీ ఫుడ్ ప్యాకేజీలను తీసుకున్నపుడు మీకు, డెలివరీ సిబ్బందితో ఎటువంటి కాంటాక్ట్ ఉండదని నిర్ధారించుకోండి. ►ప్యాకేజీని తీసుకునేటపుడు చేతికి తప్పనిసరిగా గ్లౌజులు ధరించండి. ►మీరు ప్యాకేజీని టేబుల్పై ఉంచే ముందు క్రిమి సంహారక మందుతో ఆ ప్రదేశాన్నిశుభ్రంచేయండి. ►ప్యాకేజీని కూడా అదే వస్త్రంతో శుభ్రం చేయండి. ►ఇప్పుడు ప్యాకేజీలోని పదార్థాన్ని శుభ్రం చేసిన పాత్రలోకి మార్చి, ప్యాకేజీని చెత్తకుండీలో పడేయండి. ►తరువాత ఆ చేతులతో మీముఖాన్ని తాకకుండా 20 సెకన్ల పాటు కడుక్కోవాలి. ►ముందు జాగ్రత్తగా ఆహారాన్ని మీ చేతులతో కాకుండా ఇంటిలోని వస్తువులను ఉపయోగించి తినడం మంచిది. ►పలు ఫుడ్ స్టాండర్డ్ ఏజెన్సీలు తాజాగా వండిన, వేడి వేడి ఆహారాన్ని తినడం మంచిదని ప్రజలకు సూచించాయి ►మీ ఆహారాన్ని సుమారు 12 నిమిషాలు వేడిచేసుకోవడం మంచిది. -
మన బిర్యానీకి ప్రపంచమే ఫిదా
న్యూఢిల్లీ : భోజన ప్రియులు అత్యధికంగా తినే ఆహార పదార్ధాల్లో బిర్యానీ ముందు వరసలో ఉంటుంది. ఇందులో నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా తీసుకునే ఆహరం చికెన్ బిర్యానీ. ఆదివారం వచ్చిందంటే చాలు ఇంట్లో తయారు చేసుకోనో లేదా ఫుడ్ యాప్స్లో ఆర్డర్ చేసుకొనో లొట్టలేసుకుంటూ తింటారు. ఇక ఆన్లైన్ బుకింగ్లో చికెన్ బిర్యానీది ఎప్పుడూ నెంబర్ వన్ ప్లేసే.ఇది ఒక్క హైదరాబాద్ లేదా ఇండియాకే పరిమితం కాదు.. ప్రపంచమంతా మన బిర్యానీకి ఫిదా అయిపోయింది. 2019 సంవత్సరానికి గానూ ఆన్ లైన్ ఫుడ్ యాప్ సెర్చ్ లో టాప్ 10 ఐటమ్స్ లో దీనికే తొలిస్థానం దక్కింది. ఆ తర్వాతి స్థానంలో బటర్ చికెన్, సమోసా, చికెన్ టిక్కా మసాలా, దోశ, తందూరి చికెన్, పాలక్ పనీర్, నాన్, దాల్మఖని, చాట్ వంటి భారత వంటకాలు నిలిచాయి. వీటి గురించి కూడా నెటిజన్లు పెద్ద సంఖ్యలో వెతుకుతున్నట్టు అధ్యయనంలో తేలింది. పంజాబీ ప్రత్యేక వంటకమైన బటర్ చికెన్ కోసం 4 లక్షలసార్లు వెతికారట. సమోసా కోసం 3.9 లక్షల సెర్చ్లు రాగా, చికెన్ టిక్కా మసాలా కోసం నెలకు సగటున 2.5 లక్షల సెర్చ్లు వస్తున్నట్లు సర్వే తెలిపింది.ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో భారతీయులు ఉండడం వల్లే ఇండియన్ ఫుడ్స్ టాప్ లో ఉన్నాయని సర్వే పేర్కొంది. -
జొమాటో చేతికి ఉబెర్ ఈట్స్
న్యూఢిల్లీ: ఉబెర్ ఈట్స్ భారత వ్యాపారాన్ని సొంతం చేసుకున్నట్టు ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ల స్వీకరణ, డెలివరీ సంస్థ జొమాటో స్పష్టంచేసింది. ఫలితంగా ఉబెర్ ఈట్స్కు జొమాటోలో 9.99 శాతం వాటా దక్కనుంది. ఈ కొనుగోలుతో ఉబెర్ ఈట్స్, ఉబెర్ యాప్ల ద్వారా ఫుడ్ డెలివరీ, ఆర్డర్ల స్వీకరణ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఉబెర్ ఈట్స్ యాప్ యూజర్లు, డెలివరీ భాగస్వాములు, రెస్టారెంట్లను జొమాటో ప్లాట్ఫామ్తో అనుసంధానించామని, మంగళవారం నుంచే ఇది అమల్లోకి వచ్చిందని జొమాటో ఒక ప్రకటనలో తెలియజేసింది. తీవ్ర పోటీ, ధరల పరంగా సున్నితమైన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్లో తాజా డీల్తో స్థిరీకరణకు అవకాశం ఏర్పడిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. కాగా ఈ లావాదేవీతో జొమాటోలో తమకున్న వాటా 22.71%కి తగ్గుతుందని ఇన్ఫోఎడ్జ్ బీఎస్ఈకి తెలియజేసింది. ఈ డీల్ అనంతరం జొమాటో విలువ 3.55 బిలియన్ డాలర్లుగా అంచనా. జొమాటో తన ప్లాట్ఫామ్పై ప్రతినెలా 5 కోట్లకు పైగా ఆర్డర్లతో, 55 శాతం మార్కెట్తో అగ్రగామి కంపెనీగా అవతరించినట్టయింది. ఇప్పటిదాకా స్విగ్గీ నంబర్వన్ స్థానంలో ఉంది. -
జొమాటో చేతికి ఉబెర్ ఈట్స్..
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో... మరో ఫుడ్ డెలివరీ సంస్థ ఉబర్ ఈట్స్ ను కొనుగోలు చేసింది. ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ కు చెందిన ఫుడ్ డెలివరీ సంస్థ ఉబర్ ఈట్స్ ను కొనుగోలు చేసినట్లు జొమాటో మంగళవారం ప్రకటించింది. ఆల్ స్టాక్ ఒప్పందంలో భాగంగా జొమాటో ఈ మేరకు కొనుగోలు చేసింది. ఇకపై ఉబెర్ ఈట్స్ తన కార్యకలాపాలను ప్రత్యక్షంగా నిలిపివేసి అనుబంధ సంస్థ జొమాటోటోకు బదిలీ చేయనుంది. కాగా గతంలోనే ఉబెర్ ఈట్స్ను జోమాటో కొనుగోలు చేస్తున్నట్లు అనేక వార్తలు వెలుబడిన విషయం తెలిసిందే. నివేదికల ప్రకారం 350 మిలియన్ డాలర్లకు(భారత కరెన్సీ ప్రకారం రూ. 2,485 కోట్లు) డీల్ కుదుర్చుకొని ఉబెర్ ఈట్స్ను జొమాటో తన వశం చేసుకుంది. ఇక ఈ ఒప్పందం మంగళవారం నుంచి అములులోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఉబెర్ ఈట్స్ డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్న వారి భవిష్యత్తు ఏంటనేది స్పష్టత ఇవ్వలేదు. కాగా ఉబర్కు 10 శాతం వాటాను ఇవ్వనున్నట్లు జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ప్రకటించారు. ‘‘ఉబెర్ ఈట్స్ ఇండియా ఇప్పుడు జొమాటోగా మారింది. ఇకపై వినియోగదారులకు మరింత రుచికరమైన ఆహారాన్ని అందించనున్నాం. ఇది కొత్త ప్రయాణం’’ అని ట్వీట్ చేశారు. అలాగే దేశంలోని 500నగరాలకు పైగా జొమాటో తన సేవలను అందిస్తోందని తెలిపారు. ఉబెర్ ఈట్స్ను 2017లో ప్రారంభించారు. అప్పటికే ఉన్న జొమాటో, స్విగ్గీ వంటి వాటితో పోటీపడి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించినప్పటికీ ఆశించిన స్థాయిలో మార్కెట్ను నిలబెట్టుకోలేకపోయింది. భారతదేశంలో ఉబెర్ ఈట్స్ గత రెండేళ్లుగా భారీ మొత్తాన్ని ఆర్జించిందని ఉబెర్ సీఈఓ దారా ఖోస్రోషాహి అన్నారు. భారతదేశంలో ఉబెర్కు మంచి మార్కెట్ ఉందని, ఇకపై తమ రైడింగ్ బిజినెస్ను పెంచుకోడానికి పెట్టుబడులు పెడతామని ఆయన పేర్కొన్నారు. Uber Eats India is now Zomato. Here's to better food for more people, and new beginnings. For more details: https://t.co/cq8Wp9ikOk pic.twitter.com/nK4ICY2ikW — Deepinder Goyal (@deepigoyal) January 21, 2020 -
భళారే.. బిర్యానీ
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా అత్యధికంగా ఇష్టపడే ఆహారంగా బిర్యానీ వరుసగా నాలుగో ఏడాది కూడా తన అగ్రస్థానాన్ని నిలుపుకుంది. అదే సమయంలో భారతీయుల ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వెలుగుచూశాయి. ముఖ్యంగా కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే కీటోజెనిక్ ఆహారం తీసుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతోందని ఫుడ్ డెలివరీ యాప్ సంస్థ స్విగ్గీ తాజాగా జరిపిన సర్వేలో తేలింది. స్టాట్‘ఈట్’స్టిక్స్ పేరిట స్విగ్గీ ఏటా నిర్వహించే సర్వేలో ఈసారి పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు దేశవ్యాప్తంగా 530కి పైగా స్విగ్గీ డెలివరీ కేంద్రాల సమాచారం ఆధారంగా ఈ నివేదికను విడుదల చేసింది. ఈ సంస్థ రాష్ట్రంలో అన్ని ముఖ్య పట్టణాల్లో సేవలందిస్తోంది. ఆన్లైన్ ఆహార సరఫరా మార్కెట్లో 50 శాతంపైగా వాటాతో స్విగ్గీ మొదటి స్థానంలో ఉండగా, 26 శాతం వాటాతో జొమాటో రెండో స్థానంలో ఉంది. మిగిలిన భాగాన్ని ఫుడ్పాండా, ఫాసోస్, బాక్స్ 8 వంటి యాప్స్ పంచుకుంటున్నాయి. మార్కెట్లో 35,056 రకాల బిర్యానీలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 35,056 రకాల బిర్యానీలను సరఫరా చేస్తున్న స్విగ్గీ.. బోన్లెస్ చికెన్ బిర్యానీ, చికన్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీలకే అత్యధికంగా డిమాండ్ ఉందని తేల్చింది. ముంబైలో ‘చాల్ థానో తావా బిర్యానీ’ అతి తక్కువ ధర రూ.19కే లభిస్తుంటే.. పూణేలో లభించే ‘చికెన్ సజక్ తప్’ బిర్యానీ రూ.1,500లతో అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. అంతేకాదు.. ప్రతీ నిమిషానికి 95 మంది బిర్యానీని ఆర్డర్ చేస్తున్నారంటే దీనిపై భారతీయులకు ఉన్న మోజును అర్థంచేసుకోవచ్చు. నాన్వెజ్లో చికెన్ బిర్యానీ మొదటిస్థానంలో ఉండగా, శాఖాహారంలో మసాలా దోశ, పన్నీర్ బట్టర్ మసాలాకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఆరోగ్యమూ ముఖ్యమే.. ఈ ఏడాది భోజన ప్రియులు ఆరోగ్యకరమైన ఆహారం వైపు అత్యధికంగా మొగ్గు చూపుతున్నట్లు స్విగ్గీ సర్వేలో వెల్లడైంది. గతేడాదితో పోలిస్తే కేలరీలు తక్కువగా ఉండే కీటోజెనిక్ ఫుడ్కి ఆర్డర్లు మూడు రెట్లు పెరిగినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఆరోగ్యకరమైన ఆహార ఆర్డర్లు 306 శాతం పెరిగి 3.15 లక్షలకు చేరాయి. కీటో బ్రౌనీస్, కీటో ఫ్రెండ్లీ టస్కాన్ చికెన్, హెల్దీ రెడ్ రైస్ పోహా వంటి వాటిని అత్యధికంగా ఇష్టపడుతున్నారు. అంతేకాదు.. ఇంటి వద్ద తయారుచేసే ఆహారానికీ ఆదరణ పెరుగుతోందట. ఈ ఏడాది పప్పు–బియ్యంతో తయారు చేసే కిచిడీ ఆర్డర్లలో 128 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇదే సమయంలో రాజ్మా చావల్, పెరుగు అన్నం వంటి వాటికి కూడా డిమాండ్ బాగుంది. దూసుకుపోతున్న గులాబ్జామ్ ఇక తీపి పదార్థాలు, శీతల పానీయాల విషయానికి వస్తే.. అత్యధిక ఆర్డర్లతో గులాబ్జామ్ దూసుకుపోతోంది. ఈ ఏడాది పది నెలల కాలంలో 17.69 లక్షల మంది గులాబ్జామ్ కోసం ఆర్డర్లు ఇచ్చారు. ఆ తర్వాత 11.94 లక్షల ఆర్డర్లతో ఫలూదా రెండో స్థానంలో నిలిచింది. శీతల పానీయాల్లో ఫలూదాకు ఒక్కసారిగా ఈ స్థాయిలో డిమాండ్ పెరగడంపై స్విగ్గీ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. కేకుల్లో బ్లాక్ ఫారెస్ట్ 3 లక్షల ఆర్డర్లతో మొదటి స్థానంలో నిలిచింది. డెత్ బై చాక్లెట్, టెండర్ కోకోనట్ ఐస్క్రీం, తిరమిసూ ఐస్క్రీం, కేసరి హల్వాలను కూడా అత్యధికంగా ఇష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఒకేరోజు అత్యధిక ఆర్డర్లు ఇవ్వడం ద్వారా భోజన ప్రియులు ఈ ఏడాది ప్రత్యేకంగా కొత్త జాతీయ ఆహార తేదీలను కూడా ప్రకటించుకున్నారట. ఫిబ్రవరి 17 జాతీయ గులాబ్జామ్ డే, మే 12 కాఫీ డే, జూన్ 16 ఫ్రెంచ్ ఫ్రైస్, సెప్టెంబర్ 22 పిజ్జా, అక్టోబర్ 20 బిర్యానీ, టీ డేలుగా ప్రకటించుకోవడం గమనార్హం. -
అదిరిపోయే ఆఫర్లు.. ఇంకెందుకు ఆలస్యం
కొత్త సంవత్సరం ఎన్నో ఆశలను, ఆశయాలను తీసుకువస్తుంది. ప్రతి ఏడాది మనకు అనేక జ్ఞాపకాలను, అనుభూతులను అందిస్తుంది. వీటికితోడు కొన్ని చేదు అనుభవాలను సైతం ఇస్తుంది. గడిచిన ప్రతి క్షణం రేపటికి ఒక జ్ఞాపకమే. మంచి చెడుల సమ్మేళనమే జీవితం. అలాంటి జీవితంలో మరో నూతన అధ్యాయాన్ని స్వాగతిస్తూ.. న్యూ ఇయర్కు వెల్కమ్ చెబుతాం.. న్యూ ఇయర్ ఇంకో నెల రోజులు ఉంది అనగానే వేడుకలు, సంబరాల గురించి మదిలో ఆలోచనలు మెదులుతాయి. గత ఏడాది కంటే భిన్నంగా ఈసారి డిసెంబర్ 31 వేడుకల నిర్వహణకు హైదరాబాదీయులు తహతహలాడుతున్నారు. మొదట్లో ఈ కల్చర్కు ఇంత క్రేజు లేకున్నా రానూ రానూ పరాయి వేడుకపై మోజు బంగారం ధరలా పెరుగుతూనే ఉంది. ఇక ఈ నూతన సంవత్సర సంబరాలలో ప్రజలను ఆకర్షించే వాటిలో ఆఫర్లు ప్రధానమైనవి. కేకుల నుంచి ఫేస్ క్రీమ్ వరకు అన్ని ఆఫర్లే (క్లాతింగ్, ఫుట్వేర్, జ్యూవెల్లరీ, ఫుడ్, కాస్మోటిక్స్).. వీటిలో మరీ ముఖ్యమైనది ఫుడ్. కోటి విద్యలు కూటి కొరకే అన్నారు పెద్దలు. ఫుడ్ను ఇష్టపడని వారంటూ ఉండరు. అసలే హైదరాబాదీలు భోజన ప్రియులు. ఇక ఆఫర్లు కనిపిస్తే ఊరుకుంటారా... లేదండోయ్ ఆవురావురంటూ లాంగిచేయడమే. చాలా సందర్బాల్లో ఫుడ్ ఫెస్టివల్స్ను సైతం నిర్వహిస్తుండటం తెలిసిందే. మరీ ఫుడ్కు ఉన్న డిమాండేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.. ఆఫర్లే ఆఫర్లు... నగరంలో ఇంచుమించుగా 12వేల వరకు చిన్న, పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు ఉండగా. మరో 10వేల దాకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మెస్లు హోటల్ ఉన్నాయి. హోటళ్లు, రిసార్ట్లు ప్రజలను ఆకర్షించేందుకు వినూత్నడిస్కౌంట్లు, స్పెషల్ ఆఫర్లతో తలుపులు తెరుస్తున్నాయి. నోరూరించే ఆహారాన్ని అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. రెస్టార్లెంటు, హోటళ్లు, దాబాలు, చిన్న చిన్న హోటళ్లు సైతం తమదైన రీతిలో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఒకటి కొంటే మరొకటి ఉచితమని,, ఒక్కొదానిపై 30, 40, 50 శాతం వరకు డిస్కౌంట్ను ప్రకటిస్తున్నాయి. కొన్ని రెస్టారెంట్లయితే బఫేపై వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఇస్తున్నాయి. కొన్నిచోట్ల అన్లిమిటెడ్ ఫుడ్, బేవరేజ్ను ఆఫర్ చేస్తున్నారు. పేరుగాంచిన హోటళ్లు పాశ్చాత్య వంటకాలు, కాక్టైల్స్, మాక్టైల్స్ను రుచి చూపించనున్నాయి. నాన్ వెజ్ ఆఫర్లు.. ఆదివారం వచ్చిందంటే ముక్క లేనిది ముద్ద దిగదు. అలాంటిది వేడుకల్లో నాన్ వెజ్ లేకుంటే.. నో నో తప్పకుండా ఉండాల్సిందే అంటున్నారు హైదరాబాదీలు. మరీ నాన్ వెజ్ లవర్స్ వారి కోసం ప్రముఖ రెస్టారెంట్లు ఇస్తున్న ఆఫర్లు ఏంటో తెలుసుకుందాం. హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు... ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్బంలో బిర్యాని లాంగించేస్తూ ఉంటారు. వీటిలో చికెన్, మటన్, మష్రూమ్,ఫిష్ బిర్యానీలు ప్రత్యేకం. ఈ సారి ఈ బిర్యానిపైలపై ఆఫర్లు ఆశించిన స్థాయిలో లేనట్లు కన్పిస్తోంది. సాధారణ రోజుల్లో బిర్యాని ధర రెస్టారెంట్లను బట్టి 150 నుంచి 300 వరకు ఉండగా... న్యూ ఇయర్ సందర్భంగా ఈ ధరను 100 నుంచి 250 లోపు తగ్గించారు. అదేవిధంగా కొన్ని రకాల ఐటమ్లపై 10 నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్ను అందిస్తున్నాయి. ఇక స్టాటర్లు, సూప్లు ధరలు అదేవిధంగా కొనసాగుతున్నాయి. ఆన్లైన్ ఫుడ్ సర్వీసింగ్.... ఆన్లైన్ ఫుడ్ సర్వీస్లు వచ్చాక నగరంలో తిండికి కొదవే లేకుండా పోయింది. యాంత్రిక టెక్నాలజీ వచ్చాక బిజీ సిటీ లైఫ్లో అటు ఉద్యోగం ఇటు జీవితాన్నిసమన్వయం చేయలేక నానా తాంటాలు పడుతున్న కుటుంబాలు ఎన్నో. అలాంటి వారికి ఆన్లైన్ ఫుడ్ డెలీవరీ యాప్లు ఎంతగానో దోహదపడుతున్నాయి. కేవలం తినాలనుకున్న సమయానికి అరగంట ముందు కావాల్సిన ఫుడ్ను ఆర్డర్ చేసుకుంటే సరి. దీనికి కావాల్సింది. కేవలం సంబంధిత యాప్ను డౌన్లోడ్ చేసుకోవడమే. హోటల్ కు వెళ్లి తినేవారు తగ్గడంతో ఆన్లైన్ ఫుడ్ సర్వీస్లను డిమాండ్ పెరిగింది. ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించడంతో ఫుడ్డీస్ రెస్టారెంట్లకు క్యూ కడుతున్నారు. వెజ్, నాన్వెజ్, ఫాస్ట్ఫుడ్ ఐటమ్ ఏదైనా సరే మనీ ఉంటే చాలు. మీ దరికి విచ్చేస్తుంది. అంతేగాక 10 శాతం నుంచి 50 శాతం వరకు డిస్కౌంటు లభిస్తుంది. పైగా డెలివరీ కూడా ఫ్రీ... అర్థరాత్రి అపరాత్రి అన్న తేడా కూడా లేదు. ఎప్పుడంటే అప్పుడు.. ఎక్కడంటే అక్కడ మీరు కోరుకున్న ఆహారం.. మీ చెంతకు చేరుతుంది. దీంతో ఫుడ్ ఆర్డరింగ్ అనేది చాలామంది జీవితాలలో ఓ ఫ్యాషన్లో మారిపోయింది. ఫేమస్ ఫుడ్ యాప్లు ఆన్లైన్ ఫుడ్ యాప్లో స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఈట్స్, ఫుడ్ పాండా వంటివే అధికం. సిటీలో నిత్యం అమ్ముడయ్యే ఫుడ్లో 60శాతం మేర ఆన్ లైన్ డెలివరీలే ఉంటాయి. ఒక్క స్విగ్గీ ఫుడ్ డెలివరీ సంస్థనే నగరంలో రోజూ 80వేల ఆర్డర్ల వరకు యాప్ ద్వారా విక్రయిస్తోంది. ఇలా మిగతా ఫుడ్ డెలివరీ సంస్థలు అన్ని కలిసి దాదాపు ప్రతి నెల 10లక్షలకు పైనే ఆర్డర్లను చేరవేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండానే తమ వద్దకు ఫుడ్ వస్తుండటంతో ఈ యాప్లకు క్రేజ్ పెరిగిపోయింది. దీంతో ప్రత్యేక ప్యాకేజీల రూపంలో తమ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. భోజన ప్రియులను కట్టిపడేస్తున్నాయి. ఇంకేముంది ఆర్డర్ చేసిన అరగంటలో నోరూరించే వంటకాలు మన ముంగిట ప్రత్యక్షమవుతున్నాయి. ప్రమోషన్ ఆఫర్లు, డిస్కౌంట్ల వర్షాలు.. కొద్ది తేడాతో దాదాపు అన్ని సంస్థలు ఒకే విధమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా బిర్యానీలు, పిజ్జాలు, మిల్క షేక్లు,ఫ్యామిలీ ప్యాక్ వంటివి అధికంగా ఉన్నాయి. ఈ న్యూ ఈయర్కు మరీ ఏ సంస్థ ఏ ఆర్డర్ను అందిస్తోందో ఓ లుక్కేద్ధాం... జొమాటో...న్యూ యూజర్లకు 40 శాతం డిస్కౌంట్ను అందిస్తుంది. అంతేగాక ప్రోమో కోడ్లు అందిస్తుంది. అలాగే పేటీఎం యూపీఐ ద్వారా రూ. 350 మించి కొనుగోలు చేస్తే 30 శాతం డిస్కౌంట్ను అందిస్తోంది. ఇందుకు ZOMATO300 కోడ్ను ఆప్లై చేయాలది. అదే విధంగా స్నాక్స్పై 50 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. టాప్ రెస్టారెంట్లలో రూ. 99 కంటే కొనుగోలు చేస్తే 50 శాతం డిస్కౌంట్ను అందిస్తోంది. ఇందుకు ZOMATO కోడ్ను అప్లై చేయాలి. కోటక్ మహీంద్ర కార్డు ద్వారా రూ. 250 కంటే ఎక్కు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్ను అధికంగా రూ75 వరకు అందిస్తోంది. ప్రత్యేక పార్టీ ఆఫర్ పేరుతో రూ .500 విలువైన ఆహార ఆర్డర్లలో రూ .1000 వరకు ఆదా ఇస్తుంది. ఇది కేవలం ఎంచుకున్న రెస్టారెంట్లలో మాత్రమే. స్విగ్గీ.. కొత్త యూజర్లకు 33 శాతం డిస్కౌంట్ను ఇస్తుంది. దీంతోపాటు ఫ్రీ డెలివరీ లభిస్తుంది. ఫుడ్ డెలివరీ యాప్స్ అన్నీ కొత్త యూజర్లను ఆకట్టుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తాయి. ఆఫర్లు కూడా వారికే ఎక్కువ ఉంటాయి. సంబంధిత రెస్టారెంట్ల ద్వారా WELCOME50... ద్వారా 50 శాతం డిస్కౌంట్ను ఇస్తుంది. 150LPAYNEW ద్వారా 150 క్యాష్ బ్యాక్ అందిస్తోంది. రెండు మీడియం పిజ్జాలను ఒక పిజ్జా ధరకే పిజ్జా హట్ ద్వారా ఇస్తోంది. ఉబర్ ఈట్స్.. ఉబర్ రైడ్లతోపాటు ఉబర్ ఈట్స్ ఆహార డెలివరీ యాప్ ప్రముఖంగా నిలుస్తోంది అన్ని రకాల పదార్థాలపై 30 శాతం డిస్కౌంట్ను అందిస్తోంది. సెలక్టెడ్ రెస్టారెంట్ల నుంచి 50 శాతం బిర్యానిపై డిస్కౌంట్ను అందిస్తోంది. సంబంధిత రెస్టారెంట్లపై30,40, 50 శాతం వరకు కూడా తగ్గింపును అందిస్తోంది. వీటికి ఎలాంటి ప్రోమో కోడ్ అవసరం లేదు. నేచురల్ ఐస్ క్రీం నుంచి కప్ ఐస్ క్రీమ్నుఒకటి కొంటే ఒకటి ఉచితంగా అందిస్తోంది. మిల్క్ షేక్లను కేవలం 99 రూపాయలకే అందిస్తోంది. HYDFEAST50, HYDFEAST30, HYDFEAST20 ద్వారా 50,30, 20 శాతం డస్కౌంట్ను ఇస్తుంది బేకరీల్లో బారులు.. న్యూయర్ దగ్గర పడుతుండటంతో బేకరీలలో కేకుల తయారీలు జోరందుకున్నాయి. కేకుల్లో వెజ్, నాన్ వెజ్, పేస్ట్రీస్ వంటివి.. విభిన్న రకాల ఆకృతిలో అందుబాటులో ఉన్నాయి.. ఒక్కో బేకరీలలో దాదాపు 500 నుంచి 1000 కేకుల వరకు తయారీ చేస్తున్నారు. నూతన సంవత్సర సందర్భంగా కేక్లు కొనుగోలు చేసేందుకు బేకరీ నిర్వాహకులు వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నారు. బేకరీలలో అయితే. కేజీ కేకు 400 రూపాయలు, అర కేజీ కేకు 200 రూపాయలకే అందిస్తున్నాయి. అంతేగాక వీటికి 500 ఎంఎల్ కూల్డ్రింక్, మిక్చర్ వంటివి ఉచితంగా అందజేస్తున్నాయి. వీటితోపాటు పిజ్జా, బర్గర్ సెంటర్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, బేకరీలు ఆఫర్లను జోరుగా అందిస్తున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం.. వెంటనే న్యూ ఇయర్ ఆఫర్లను ఆరగించండి.. - గుండా భావన (వెబ్ డెస్క్ ప్రత్యేకం) -
జొమాటో చేతికి ఉబెర్ఈట్స్..!
న్యూఢిల్లీ: ఆన్లైన్ రెస్టారెంట్ అగ్రిగేటర్, ఫుడ్ డెలివరీ సేవల సంస్థ జొమాటో.. ఇదే రంగంలోని మరో ప్రముఖ సంస్థ ఉబెర్ఈట్స్ను కైవసం చేసుకునే దిశగా పావులుకదుపుతోంది. ఉబెర్ఈట్స్ను సొంతం చేసుకునేందుకు పలు కంపెనీల నుంచి పోటీ పెరిగిన నేపథ్యంలో తాజాగా ఈ సంస్థ 500 మిలియన్ డాలర్లను ఆస్క్ ప్రైస్గా కోట్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, జొమాటో ఈ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. జొమాటోలో చైనా చెల్లింపుల సంస్థ యాంట్ ఫైనాన్షియల్ పెట్టుబడులు ఉన్నాయి. ‘షేర్ల జారీ మార్గంలో కొనుగోలు పూర్తిచేసేందుకు జొమాటో చర్చలు కొనసాగిస్తుంది. అయితే, ఎంత మొత్తం అనే విషయంలో కాస్త అటుఇటుగా ఉన్నప్పటికీ... చర్చల్లో పురోగతి ఉందని మాత్రం కచ్చితంగా చెప్పగలం’ అని ఈ డీల్తో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. ఉబెర్ఈట్స్ మాతృసంస్థ, ట్యాక్సీ అగ్రిగేటర్ ఉబెర్... డీల్ పూర్తయిన తరువాత జొమాటోలో 500–600 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలపై తాము వ్యాఖ్యానించబోమని ఉబెర్ పేర్కొంది. ఇక మరో సంస్థ స్విగ్గీ కూడా ఉబెర్ఈట్స్ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. 2020లో రూ.1,451 కోట్ల నష్టాలు భారత్లో ఉబెర్ఈట్స్ 2020 అంచనా నష్టం రూ.1,451 కోట్ల వరకు ఉండవచ్చని ఉబెర్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఈట్స్ కారణంగా ఐపీఓ లిస్టింగ్లో భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. లిస్టింగ్ ధర నుంచి 33 శాతం పతనమైంది. ఇక్కడి మార్కెట్లో 3వ స్థానంలో ఉన్న ఈ సంస్థను విక్రయించడం ద్వారా నష్టాల నుంచి బయటపడేందుకు ఉబెర్ ప్రయత్నిస్తోంది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement