-
భారీ ఆర్డర్లకు కొత్త విద్యుత్తు వాహనాలు
స్నేహితులు, కుటుంబ సభ్యులతో జరుపుకుంటున్న చిన్నపాటి వేడుకలకు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టేలా ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా 50 మందికి ఆహారం అందించేలా కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వాహనాలు అన్నీ ఎలక్ట్రిక్ వెహికిల్స్ అని సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపారు. పెద్ద ఆర్డర్లకు సంబంధించి ఈ తరహా వాహనాలను ఉపయోగిస్తుండటం దేశంలో ఇదే మొదటిసారి అని ఆయన చెప్పారు. ఇంతకుముందు పెద్ద ఆర్డర్లు తీసుకున్నా, సంప్రదాయ డెలివరీ భాగస్వాములే అందించేవాళ్లు అని తెలిపారు. దీని వల్ల వినియోగదారులు ఆశించిన స్థాయిలో సంతృప్తి చెందేవారు కాదని చెప్పారు. కొత్తగా తీసుకొచ్చిన ఈ వాహనాలతో భారీ ఆర్డర్లు పెడుతున్న కస్టమర్ల అవసరాలను తీరుతాయని పేర్కొన్నారు. ఇదీ చదవండి: పెరుగుతున్న దిగుమతులు.. ధరలకు రెక్కలు! ఆ వాహనాల్లో కూలింగ్ కంపార్ట్మెంట్లు, హాట్ బాక్స్ల వంటివి ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దాంతో వినియోగదారులు కోరుకున్న రీతిలో ఆహార పదార్థాలను డెలివరీ చేసే వీలుందన్నారు. ఇటీవల ‘ప్యూర్వెజ్’ పేరుతో తమ వాహానాల కొన్నింటికి రంగు మార్చి విమర్శలకు గురైన సంగతి తెలిసిందే. దాంతో ఆ నిర్ణయం ప్రకటించిన కొద్ది గంటల్లోనే దాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పారు. -
సమస్య పరిష్కారానికి ఇరవై గంటల జూమ్కాల్
శాకాహారుల కోసం జొమాటో ప్రత్యేకంగా ప్రారంభించిన ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ ఇటీవల వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కొత్త సేవలు ప్రారంభమైన కొద్దిసేపటికే అందులో మార్పులు చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు ప్రకటించాయి. డెలివరీ బాయ్స్ కోసం ప్రత్యేకంగా గ్రీన్ యూనిఫాం కాకుండా ఎర్ర రంగు దుస్తులు మాత్రమే ఉంటాయని ప్రకటించి వివాదానికి ముగింపు పలికింది. అయితే, శాకాహారుల కోసం ప్రత్యేక సేవలు ప్రారంభించడం వెనుక కారణం.. వివాదాస్పదమైన తర్వాత తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన విషయాలను కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల ఓ వార్తాసంస్థకు తెలిపారు. జొమాటో వినియోగదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే ప్యూర్ వెజ్ ఫ్లీట్ ప్రారంభించామని దీపిందర్ చెప్పారు. తర్వాత ఓ సర్వే నిర్వహించినట్లు తెలిపారు. ‘మీరు మరిన్ని ఆర్డర్లు చేయాలంటే జొమాటో నుంచి ఏం ఆశిస్తున్నారు?’ అని వినియోగదారులను అడిగినట్లు చెప్పారు. దీంట్లో చాలా మంది శాకాహారుల కోసం మరేదైనా ప్రత్యేక సేవలు అందించాలని సూచించినట్లు తెలిపారు. దీనిపై సుదీర్ఘ చర్చల తర్వాత ప్యూర్ వెజ్ ఫ్లీట్ సేవలను ప్రారంభించామన్నారు. అయితే, ఆ పదాల్లో ఉన్న నిగూఢార్థం తమకు తెలియదని.. ఇంతటి వివాదానికి కారణమవుతుందని ఊహించలేదన్నారు. సోషల్ మీడియాలో వివాదం తలెత్తిన తర్వాతే అసలు విషయం అర్థమైందన్నారు. ఇదీ చదవండి..డెబిట్ కార్డు యూజర్లపై భారంమోపిన ప్రముఖ బ్యాంక్ సామాజిక మాధ్యమాల్లో వివాదానికి తెరలేపే వార్తలు వైరల్గా మారిన నేపథ్యంలో వెంటనే దాదాపు 20 గంటల పాటు జొమాటోలోని ఉన్నతోద్యోగులందరూ జూమ్ కాల్లో చర్చించామని చెప్పారు. సమస్యను ఎలా పరిష్కరించాలో మంతనాలు జరిపినట్లు తెలిపారు. చివరకు గ్రీన్ యూనిఫామ్ తొలగించాలనే నిర్ణయానికి వచ్చామన్నారు. కొత్త సేవల వెనుక ఎలాంటి రాజకీయ, మతపరమైన ఉద్దేశాలు లేవని మరోసారి స్పష్టం చేశారు. -
రెండోపెళ్లి చేసుకున్న జొమాటో సీఈవో.. అమ్మాయి ఎవరంటే!
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్(41) రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. మెక్సికన్కు చెందిన మోడల్ గ్రేసియా మునోజ్ను దీపిందర్ పెళ్లి చేసుకున్నారని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఈ వివాహం జరిగి మాత్రం నెలవుతుందని సమాచారం. తాజాగా గోయల్, గ్రేసియో సన్నిహితంగా ఉన్న ఫొటోలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో విషయం ఆరా తీశారు. దాంతో ఇద్దరికీ వివాహం జరిగినట్లు తెలిసింది. మునోజ్ ఇన్స్టాగ్రామ్ వివరాల ప్రకారం.. ఆమె మెక్సికోలో జన్మించారు. ప్రస్తుతం భారత్లో ఉన్నారు. గతంలో మోడలింగ్ చేసిన ఆమె.. ఇప్పుడు సొంతంగా లగ్జరీ కన్జూమర్ప్రొడక్ట్లకు సంబంధించి ఒక స్టార్టప్ నడుపుతున్నారు. 2022 ఏడాదికిగాను మెట్రోపాలిటన్ ఫ్యాషన్వీక్ విజేతగా నిలిచారు. దీపిందర్కు ఇది రెండో పెళ్లి. ఆయన ఐఐటీ దిల్లీలో చదువుతున్నపుడు కంచన్ జోషితో పరిచయం ఏర్పడింది. దాంతో ఇరువురు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం కంచన్ దిల్లీ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. దీపిందర్.. 2008లో హరియాణాలోని గురుగ్రామ్ కేంద్రంగా జొమాటో సంస్థను స్థాపించారు. కన్సల్టింగ్ సంస్థలో ఉద్యోగాన్ని వదిలి.. ఆహార డెలివరీ యాప్ ప్రారంభించారు. దేశంలో వెయ్యికి పైగా నగరాల్లోకి దీని కార్యకలాపాలు విస్తరించాయి. సుమారు రూ.1.5లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ కలిగిన జొమాటో ఇటీవల శాకాహారుల కోసం ప్రత్యేక సేవలు ప్రారంభించి వివాదంలోకి వెళ్లింది. ఇదీ చదవండి: మొదటి విద్యుత్కారును ఆవిష్కరించిన ఫేమస్ కంపెనీ ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ పేరుతో కొత్త సేవలు మొదలుపెట్టింది. అయితే ఆ ఫ్లీట్లో డెలివరీ స్టాఫ్కు ప్రత్యేకంగా గ్రీన్కలర్ డ్రెస్కోడ్ ఉంటుందని ప్రకటించడంతో వివాదం చెలరేగింది. అలా ప్రకటన వెలువరించిన కాసేపటికే కంపెనీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇకపై అందరూ ఎర్ర రంగు యూనిఫామ్ను ధరిస్తారని చెప్పింది. అయితే ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ సేవలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. వెజ్ ఆర్డర్లను అందించడానికి ప్రత్యేక సిబ్బంది ఉంటారని కంపెనీ వివరించింది. View this post on Instagram A post shared by Grecia Muñoz (@greciamunozp) -
జొమాటో యూనిఫామ్లో మార్పులు.. క్షణాల్లోనే నిర్ణయం వెనక్కి..
ప్రత్యేకంగా శాకాహారమే కోరుకునే వినియోగదారుల కోసం ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ పేరుతో ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కొత్త సేవలు ప్రారంభించింది. శాకాహారుల కోరిక మేరకే ఈ సేవలు ప్రారంభించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ తెలిపారు. అయితే ఈ ప్రకటన చేసిన సమయంలో డెలివరీ స్టాఫ్కు ప్రత్యేకంగా గ్రీన్కలర్ డ్రెస్కోడ్ ఉంటుందని ప్రకటించారు. అలా ప్రకటన వెలువరించిన కాసేపటికే కంపెనీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇకపై అందరూ ఎర్ర రంగు యూనిఫామ్ను ధరిస్తారని చెప్పింది. అయితే ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ సేవలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. వెజ్ ఆర్డర్లను అందించడానికి ప్రత్యేక సిబ్బంది ఉంటారని కంపెనీ వివరించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో వ్యతిరేక సామాజిక పరిణామాలు ఎదురైతే మాత్రం ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ను వెంటనే నిలిపివేస్తామని దీపిందర్ గోయల్ తెలిపారు. ఆకుపచ్చ యూనిఫామ్ ధరించడంపట్ల కొన్ని సమాజిక వర్గాల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్యూర్ వెజ్ ఫ్లీట్ వెనుక ఎలాంటి రాజకీయ, మతపరమైన ఉద్దేశాలు లేవని గోయల్ స్పష్టం చేశారు. ‘చాలామంది వినియోగదారులు నిత్యం నాన్వెజ్ ఆర్డర్ చేస్తారు. డెలివరీ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ డెలివరీ బాక్సుల్లో పదార్థాలు కొన్నిసార్లు ఒలికిపోయే అవకాశం ఉంటుంది. దాంతో ఆ వాసన అలాగే ఉండిపోతుంది. తదుపరి ఆర్డర్ చేసే శాకాహార వినియోగదారులకు అది ఒకింత ఇబ్బంది కలిగించే అంశం. దాంతో ఫ్లీట్ను విభజించాం. కొంతమంది ప్యూర్ వెజిటేరియన్ హోటళ్ల నుంచి మాత్రమే ఫుడ్ ఆర్డర్ పెడతారు. వారిని దృష్టిలో ఉంచుకుని తాజా నిర్ణయం తీసుకున్నాం’ అని సీఈఓ వివరించారు. భారత్లోనే అత్యధిక శాతం శాకాహారులు ఉన్నారని గోయల్ తెలిపారు. ఆహారం వండే విధానం, దాన్ని నిర్వహించడంపై వారు ఒక స్పష్టమైన అభిప్రాయంతో ఉంటారని అన్నారు. కేవలం శాకాహారమే అందించే రెస్టారెంట్ల ఎంపిక, నాన్-వెజ్ ఆహారాన్ని మినహాయించడం వంటివి ఫ్యూర్ వెజ్ మోడ్లో ఉంటాయి. ఇదీ చదవండి: ఉద్యోగుల జీతాల పెంపునకు టీసీఎస్ ఎస్? ఫ్యూర్ వెజ్ ఫ్లీట్ ఆహారాన్ని డెలివరీ చేసేందుకు జొమాటో సాధారణంగా వినియోగించే ఎర్ర బాక్సుల స్థానంలో ఆకుపచ్చ డెలివరీ బాక్స్లను వినియోగించనుందని ముందుగా ప్రకటించింది. కొన్ని వర్గాల నుంచి సామాజిక మాధ్యమాల్లో విమర్శలు రావడంతో డెలివరీ బాక్స్లు, యూనిఫామ్ విషయంతో ప్రకటనను తిరిగి వెనక్కి తీసుకుంది. కానీ ప్యూర్ వెజ్ ఫ్లీట్ సేవలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. Update on our pure veg fleet — While we are going to continue to have a fleet for vegetarians, we have decided to remove the on-ground segregation of this fleet on the ground using the colour green. All our riders — both our regular fleet, and our fleet for vegetarians, will… — Deepinder Goyal (@deepigoyal) March 20, 2024 -
మనుషుల్లేకుండా ఫుడ్ డెలివరీ.. వీడియో వైరల్
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో రోబోల వాడకం ఎక్కువవుతోంది. మనుషులు వెళ్లలేని ప్రదేశాలకు అవి వెళ్తున్నాయి.. చేయలేని పనులు చేస్తున్నాయి. భవిష్యత్తులో మానవులు నేరుగా చేసే పనుల స్థానాల్లో క్రమంగా రోబోల సంఖ్య పెరుగుతుంది. జపాన్ వంటి కొన్ని దేశాల్లో కార్మికుల కొరత అధికమవుతోంది. వారిస్థానాలను భర్తీ చేసేలా రోబోలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఉబర్ ఈట్స్ సంస్థ ఫుడ్ డెలివరీ చేయడానికి జపాన్లో రోబోలను వినియోగిస్తోంది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ ఉబర్ ఈట్స్ జపాన్లో ఫుడ్ డెలివరీ కోసం రోబోలను రంగంలోకి దించింది. డెలివరీ బాయ్స్కు బదులుగా రోబోల ద్వారా ఫుడ్ డెలివరీ చేసే సర్వీసులను ఇటీవల ప్రారంభించింది. దేశం ఎదుర్కొంటున్న కార్మికుల కొరత సమస్యను ఇది తీరుస్తుందని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఈ రోబోల సేవలను టోక్యోలోని రెండు స్టోర్లకు మాత్రమే పరిమితం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో వీటిని మరిన్ని స్టోర్లకు విస్తరిస్తామని చెప్పారు. కెమెరాల ద్వారా ట్రాఫిక్ను తప్పించుకుంటూ గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ఇవి ప్రయాణిస్తాయి. 27 లీటర్ల పానీయాలు, 27 కేజీల ఆహారాన్ని ఏకకాలంలో తీసుకుపోయే సామర్థ్యం వీటిటి ఉందని కంపెనీ వివరించింది. ఇదీ చదవండి: ప్రపంచం వాడుతున్న జర్మన్ ఆవిష్కరణలు ఉబర్ ఈట్స్ సంస్థ కార్ట్కెన్ అండ్ మిసుబుషి ఎలక్ట్రిక్ కంపెనీతో కలిసి టోక్యోలో ఈ రోబోలను వినియోగిస్తుంది. ఇవి ‘మోడల్ సీ’ రోబోలుగా ప్రసిద్ధి చెందాయి. స్టార్షిప్ టెక్నాలజీస్ అమెరికాలోని జార్జ్ మాసన్ యూనివర్సిటీలో మొదట రోబోల ద్వారా ఫుడ్ డెలివరీ చేసి రికార్డుల్లో నిలిచింది. డెలివరీ రోబోట్లను ఫుడ్ డెలివరీ, ప్యాకేజీ డెలివరీ, హాస్పిటల్ డెలివరీ, రూమ్ సర్వీస్ వంటి విభిన్న అవసరాలకు వాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 食品宅配サービスを手掛けるウーバーイーツジャパン(東京)は5日、自律走行ロボットによる配送を東京・日本橋エリアで6日に始めると発表しました。記事→https://t.co/jbVVrbcb22 #ウーバーイーツ #ロボット配送 #ubereats pic.twitter.com/oWbYjRGrn0 — 時事通信映像ニュース (@jiji_images) March 5, 2024 -
Zomato: ఛార్జీలు ఎందుకు పెంచుతుందో తెలుసా..?
గత త్రైమాసిక ఫలితాల్లో క్రమంగా నష్టాలు పోస్ట్ చేసిన జొమాటో ఇటీవల కొంత లాభాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా సేవలందించే సంస్థలు వాటి అవసరాలకు తగినట్లు ఛార్జీలు పెంచుకునే వీలుంది. నూతన సంవత్సరం సందర్భంగా రికార్డు స్థాయిలో ఆర్డర్లను అందుకున్న ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో.. ప్లాట్ఫారమ్ ఛార్జీని రూ.3 నుంచి రూ.4కి పెంచింది. కొత్త సంవత్సరం సందర్భంగా జొమాటో తన ప్లాట్ఫారమ్ ఫీజును తాత్కాలికంగా కొన్ని మార్కెట్లలో ఆర్డర్కు రూ.9 వరకు పెంచింది. మార్జిన్లను మెరుగుపరచడానికి, లాభదాయకంగా మారడానికి గత ఏడాది ఆగస్టులో రూ.2 ప్లాట్ఫారమ్ ఛార్జీను ప్రవేశపెట్టింది. అనంతరం దీనిని రూ.3కు పెంచింది. జనవరి 1న దాన్ని మళ్లీ రూ.4కు తీసుకొచ్చింది. ఇదీ చదవండి: న్యూ ఇయర్ ఎఫెక్ట్ - నిమిషానికి 1244 బిర్యానీలు.. ఓయో బుకింగ్స్ ఎన్నంటే? కొత్త ప్లాట్ఫారమ్ ఛార్జీ ‘జొమాటో గోల్డ్’తో సహా వినియోగదారులందరికీ వర్తిస్తుంది. జొమాటో క్విక్ కామర్స్ ప్లాట్ఫారమ్ బ్లింకిట్ కూడా నూతన సంవత్సం సందర్భంగా అత్యధిక ఆర్డర్లు పొందినట్లు తెలిసింది. ఇదిలావుండగా, జొమాటోకు దిల్లీ, కర్ణాటకలోని పన్ను అధికారుల నుంచి రూ.4.2 కోట్ల జీఎస్టీ నోటీసులు అందాయి. పన్ను డిమాండ్ నోటీసులపై అప్పీల్ చేస్తామని సంస్థ పేర్కొంది. డెలివరీ ఛార్జీలుగా సేకరించిన మొత్తంపై జీఎస్టీ చెల్లించలేదంటూ గతంలోనూ సంస్థ నోటీసులు అందుకుంది. -
అదనపు ఛార్జీలు లేకుండా ఫుడ్, క్యాబ్ సర్వీసు..!
బిర్యానీ తినాలని ఆన్లైన్లో ఆర్డర్ పెడితే నేరుగా రెస్టారెంట్కు వెళ్లి తినే ఖర్చుకంటే అధికంగా ఛార్జీలు కనిపిస్తూంటాయి. హైదరాబాద్లోని ఏదైనా ప్రముఖ రెస్టారెంట్లో రూ.250కి దొరికే బిర్యానీ.. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే జీఎస్టీ, కన్వేయన్స్, ఇంటర్నెట్ హ్యాండ్లింగ్, ప్యాకింగ్, డెలివరీ ఛార్జీలన్నీ కలిపి రూ.300 పైగానే ఖర్చవుతోంది. రెస్టారెంట్ నుంచి ఇంటి దూరం పెరిగితే ఛార్జీలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా.. నిత్యం ఏదో అవసరానికి ఎమర్జెన్సీలో ఒకప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రయాణించాలంటే ఆన్లైన్లో క్యాబ్, బైక్ బుక్ చేస్తూంటారు. మార్నింగ్, ఈవినింగ్ సమయంలో ‘పీక్, సర్జ్ అవర్స్’ పేరుతో సాధారణం కంటే అదనంగా ఛార్జ్ చేస్తూంటారు. ఇలా కొన్ని సంస్థలు చేస్తున్న వ్యవహారాలపై నియంత్రణ లేకుండా పోయింది. దాంతో వినియోగదారులపై భారంపడుతోంది. అలాంటి వ్యవస్థలను సవాళు చేస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఓఎన్డీసీ (ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్) వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది. డీపీఐఐటీ(డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) ఆధ్వర్యంలో వినియోగదారులకు నిర్దేశిత ధరల్లోనే ఫుడ్ డెలివరీలతో పాటు, క్యాబ్ సర్వీసులు, ఆన్లైన్లో వస్తువుల విక్రయం వంటి సేవలందిస్తున్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రెస్టారెంట్ ధరలు, వినియోగదారుడు ఉన్న దూరం ఆధారంగా నిర్దేశిత రుసుముతోనే ఆర్డర్లను చేర్చడం ఈ వేదిక ప్రత్యేకత. ఉదాహరణకు నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో బిర్యానీ రూ.300 ధర ఉంటే ఓఎన్డీసీ ద్వారా బుక్ చేస్తే డెలివరీ ఛార్జీలు కలిపి సుమారు రూ.325కి లభిస్తుంది. ఇంటర్నెట్, ప్యాకేజింగ్ ఛార్జీలు అంటూ అదనపు బాదుడు ఉండదు. 1,15,000 మందికి పైగా డెలివరీబాయ్స్తో బెంగళూరు, కొచ్చి, మైసూరు, కోల్కతా నగరాల్లో ఈ వేదిక కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆ ప్రాంతాల్లో వీరంతా రూ.160కోట్ల ఆదాయాన్ని పొందారు. హైదరాబాద్లోనూ ఇటీవల ఓఎన్డీసీ సేవలు ప్రారంభించింది. తెలంగాణ గిగ్వర్కర్స్ అసోసియేషన్కు చెందిన డెలివరీబాయ్లు ఇందులో భాగస్వాములైనట్లు ఆ సంస్థ పేర్కొంది. ఓఎన్డీసీకు సంబంధించి ప్రత్యేకమైన యాప్ ఏమీ లేదు. యూపీఐ పేమెంట్ యాప్ల ద్వారానే నేరుగా ఆర్డర్ ఇవ్వొచ్చు. ప్రస్తుతం పేటీఎం ద్వారా ఇది నగరవాసులకు అందుబాటులో ఉంది. హైదరాబాద్కు చెందిన 25వేల మంది డెలివరీబాయ్లు ఇందులో పనిచేస్తున్నారు. ఇదీ చదవండి: ఫ్రీ సినిమా పేరిట సైబర్ మోసం.. ఏం చేస్తున్నారంటే.. హైదరాబాద్లో ఏటా కోటి కంటే ఎక్కువ బిర్యానీలు అమ్ముడవుతున్నాయి. 15 వేలకు పైగా రెస్టారెంట్లు ఉన్నాయి. ఏటా కేవలం ఆన్లైన్ ద్వారానే రూ.500 కోట్ల వ్యాపారం జరుగుతోందని మార్కెట్ విశ్లేషకుల అంచనా. కేంద్రం ప్రారంభించిన ఓఎన్డీసీ వేదిక ఎక్కువమందికి చేరువైతే సుమారు రూ.50కోట్ల మేర వినియోగదారులకు ఆదా అయ్యే అవకాశం ఉందని తెలిసింది. -
ఇకపై కేటరింగ్ చేయనున్న ఫుడ్ డెలివరీ సంస్థ..?
ఫుడ్ డెలివరీ చేసే టెక్ సంస్థ జొమాటో భారీ ఆర్డర్లను అందించే విస్తృత వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆ వ్యూహంలో భాగంగా జొమాటో కేటరింగ్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నట్లు కొన్ని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఫుడ్ డెలివరీతోపాటు ప్రస్తుత రెస్టారెంట్ భాగస్వాముల నెట్వర్క్ను ఉపయోగించి కేటరింగ్ సర్వీస్లను అందించాలని సంస్థ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత కాలంలో నిత్యం ఉద్యోగాలు, ఇతర పనులతో బిజీగా ఉంటున్న ప్రజలు.. ఖాళీ దొరికితే బయటకెళ్లి సమయం గడపాలనుకుంటున్నాయి. ఒంటరిగా కంటే ఉమ్మడిగా, స్నేహితులతో కలిసి సమయం గడుపుతుంటారు. దాంతో వారందరికీ ఫుడ్ ఆర్డర్ చేయడం కొంత కష్టంతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి అలాంటి వారి అవసరాలు తీర్చేలా జొమాటో కేటరింగ్ సర్వీస్లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఇదీ చదవండి: డిసెంబర్ 20న మొబైల్ ఫోన్లు స్విచ్ఆఫ్.. ఎందుకంటే..? ఒకేసారి వివిధ రెస్టారెంట్ల నుంచి ఆర్డర్స్ పెట్టుకోవడానికి మల్టీ కార్ట్ ఫీచర్ను ఈ ఏడాది జూన్లో జొమాటో లాంచ్ చేసింది. ఫుడ్ డెలివరీ సెగ్మెంట్లో తాజా స్ట్రాటజీతో మరింతగా విస్తరించాలని కంపెనీ చూస్తోంది. చిన్న సైజ్ ఆర్డర్లు పెట్టే వారిని ఆకర్షించేందుకు జొమాటో ఈ ఏడాది ‘ఎవ్రిడే’ను లాంచ్ చేసింది. -
స్విగ్గీ జొమాటోలకు మరో షాక్:‘ వాయు’ వేగంతో వచ్చేసింది!
సాక్షి, ముంబై: ఫుడ్ డెలివరీ సంస్థలకు మరోషాక్ తగిలింది. ఇప్పటికే ప్రభుత్వానికి చెందిన, తక్కువ ధరల ఫుడ్ డెలివరీ యాప్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) యూజర్ల ఆదరణతో దూసుకుపోతోంది. తాజాగా దేశీయ మార్కెట్లోకి మరో సరికొత్త ఫుడ్ డెలివరీ యాప్ ఎంట్రీ ఇచ్చింది. ఫుడ్ డెలివరీ కోసం ముంబై హోటల్స్ తమ సొంత ఆన్లైన్ ప్లాట్ఫారమ్ను లాంచ్ చేశాయి. వాయు (Waayu) పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. బాలీవుడ్ నటుడు, బిజినెస్మేన్ సునీల్ శెట్టి కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా దీన్ని ప్రారంభించారు. ఈ యాప్లో అతనికి వాటా కూడా ఉంది. అంతేకాదు ఓఎన్డీసీతో ఇంటిగ్రేట్ చేయాలని కూడా చూస్తోంది. ఫుడ్ డెలివరీకి బిజినెస్కు ఫుల్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వాయు యాప్ మార్కెట్లోకి దూసుకొచ్చింది. ఇతర అగ్రిగేటర్లతో పోలిస్తే 15 నుంచి 20 శాతం తక్కువ ధరలకే అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. దీంతో కమీషన్లు, ఫేక్ ర్యాంకింగ్,పెయిడ్ రివ్యూలు, నాణ్యత లేకపోవడం లాంటి సమస్యలకు చెక్పడుతుందని అంచనా. (ఇదీ చదవండి: పర్ఫెక్ట్ బిజినెస్ లేడీ నీతా అంబానీ బ్యూటీ సీక్రెట్ తెలుసా మీకు!) టెక్ ఫౌండర్స్ అనిరుధ కోట్గిరే, మందార్ లాండే స్థాపించిన డెస్టెక్ HORECA ప్రొడక్ట్స్లో వాయు యాప్ ఒకటి. ముంబైకి చెందిన ఇండియన్ హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్ (AHAR), ఇతర పరిశ్రమ సంస్థల సపోర్టుతో మార్కెట్లోకి ఎంట్రీ వచ్చింది. సాఫ్ట్వేర్ యాజ్ఏ సర్వీస్ (SaaS) అనే ప్లాట్ఫారమ్ ద్వారా భగత్ తారాచంద్, మహేష్ లంచ్ హోమ్, బనానా లీఫ్, శివ్ సాగర్, గురు కృపా, కీర్తిమహల్, పర్షియన్ దర్బార్, లడు సామ్రాట్లతో ఇతర ముంబై రెస్టారెంట్లతో కస్టమర్లను కనెక్ట్ చేస్తుంది. రెస్టారెంట్ల నుంచి ఎలాంటి కమీషన్ రుసుములను వసూలు చేయదు. (ONDC తక్కువ రేట్లతో దూకుడు: స్విగ్గీ, జొమాటోకు దబిడి దిబిడే!) కానీ ఒక్కో అవుట్లెట్కు నెలకు రూ. 1,000 ప్రారంభ ధరతో నిర్ణీత రుసుము. తరువాత ఇది రూ. రెండు వేలుగా నిర్ణయిస్తుంది. ఈ యాప్లో ప్రస్తుతం 1,000కి పైగా రెస్టారెంట్ లిస్టింగ్లు ఉన్నాయి. ముంబై మరియు పూణేలో వచ్చే మూడు నెలల్లో 10,000కి పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం ముంబైలో అందుబాటులో ఉన్న ఈ సర్వీస్ భారతదేశంలోని ఇతర మెట్రో , నాన్-మెట్రో నగరాలకు విస్తరించాలని చూస్తోంది. ఈ వాయు యాప్ వినియోగదారులకు అత్యంత సరసమైన ధరకే ఫుడ్ డెలివరీ చేయనుంది. కమీషన్-రహిత మోడల్ ద్వారా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ఇండస్ట్రీలో కొత్త మార్పులు తీసుకురానుందని ఫౌండర్ అనిరుధ కోట్గిరే చెప్పారు. అంతేకాదు సకాలంలో, పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుందనీ, డెలివరీ విషయంలో ఎలాంటి ఆలస్యం లేకుండా క్లీన్ ఫుడ్, క్వాలిటీతో ఉంటుందనీ తమకు 16 ఆదాయ మార్గాలు ఉన్నాయని అనిరుధ తెలిపారు. What a Entry ❤️❤️ Super Cool and Handsome Brand Ambassador @SunielVShetty Sir at the Waayu App launch...❤️❤️@WAAYU_App#sunielshetty #waayu #waayuapp pic.twitter.com/KeNULJBjAI — Suniel Shetty FC (@SunielShetty_FC) May 10, 2023 సునీల్ శెట్టి ఏమన్నారంటే చాలా కాలంగా రెస్టారెంట్, హోటల్ పరిశ్రమలో భాగస్వామిగా వాయు యాప్ ఒక గొప్ప అవకాశంగా భావించానని, అలాగే హోటల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫుడ్ టెక్నాలజీలో కూడా ప్రావీణ్యం సంపాదించానని శెట్టి చెప్పారు. ఫుడ్ డెలివరీ యాప్లు వసూలు చేసే అధిక కమీషన్లు రెస్టారెంట్లు, కస్టమర్లను ప్రభావితం చేస్తున్నాయని, దీనికి పరిష్కారాని టైం వచ్చిందన్నారు. అలాగే రెస్టారెంట్లు వారి స్వంత డెలివరీ భాగస్వాములను కలిగి ఉండేలా ప్రోత్సహిస్తున్నామనీ, డబ్బావాలాలు (ముంబై) డెలివరీ భాగస్వాములుగా రావాలనేది తన కల అని శెట్టి చెప్పారు. (‘ముసలోళ్లం.. చూసి నేర్చుకోండి..లేదంటే’! ఇన్ఫీ నారాయణమూర్తి దంపతుల వ్యాఖ్యలు) వాయు యాప్ను ఎలా వాడాలి? ♦ఇందులో యాప్లో రెండు వెర్షన్లు ఉన్నాయి. డెలివరీ ఎగ్జిక్యూటివ్ల కోసం వాయు డెలివరీ పార్టనర్, కస్టమర్ల కోసం వాయు యాప్ వినియోగించుకోవచ్చు. ♦ గూగుల్ ప్లేస్టోర్లో నుంచి ‘వాయు’ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.లేదా వెబ్సైట్ కూడా ఉంది. ♦ ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్ అడ్రస్తో సైన్ ఇన్, లాగిన్ చేయాలి. ♦ లొకేషన్ ఎంటర్ చేసి,యాక్సెస్కు అంగీకరించాలి ♦ మీ లొకేషన్ డెలివరీ చేసే రెస్టారెంట్లు, మెనూల బ్రౌజ్ చేయండి. ♦ ఆర్డర్ చేయాలనుకుంటున్న వంటకాలను ఎంచుకుని, కార్ట్కు జోడించాలి. ♦ ఆర్డర్ని మరోసారి చెక్ చేసుకుని, చెక్అవుట్ పై క్లిక్ చేయాలి. ♦ ఆర్డర్ను ప్రాధాన్యతలు లేదా ప్రత్యేక సూచనలతో కస్టమైజ్ చేసుకోవచ్చు ♦ వంటకాలు, రేటింగ్, ధర లేదా ఆఫర్ల ద్వారా కూడా ఫిల్టర్ చేయవచ్చు. ♦ ఆన్లైన్లో లేదా క్యాష్ ఆన్ డెలివరీయా సెలెక్ట్ చేసుకోవాలి ♦ అందుబాటులో ఉంటే మీరు ఏవైనా కూపన్ కోడ్లు లేదా డిస్కౌంట్లను కూడా వాడుకోవచ్చు ♦ ఆర్డర్ కంప్లీట్ అయ్యాక రెస్టారెంట్ నుండి నిర్ధారణ మెసేజ్ వస్తుంది. ♦ యాప్ లేదా వెబ్సైట్లో ఆర్డర్ను ట్రాక్ చేయవచ్చు కూడా ♦ డెలివరీ ఎగ్జిక్యూటివ్ నుంచి మీ ఆర్డర్ను స్వీకరించండి. మీ ఆహారాన్ని ఆస్వాదించండి. మీ అనుభవం ఆధారంగా రేటింగ్ రివ్యూ కూడా ఇవ్వొచ్చు. -
ఆ యాప్ ద్వారా ఫ్రీ ఫుడ్, మందు.. క్షణాల్లోనే వందల ఆర్డర్స్
వాషింగ్టన్: ఆఫర్లో తక్కువ ధరకే ఏదైనా వస్తువు వస్తుందంటేనే జనాలు ఎగబడతారు. అలాంటిది ఉచితంగా ఆహారం, మందు వస్తుంటే ఊరుకుంటారా? ఓ యాప్ ద్వారా ఉచితంగా ఫుడ్, లిక్కర్ వస్తోందని తెలుసుకుని వందల మంది ఆర్డర్ చేశారు. క్షణాల్లోనే కుప్పలు తెప్పలుగా ఆర్డర్లు రావటంతో నిర్వహకులు అవాక్కయ్యారు. ఈ సంఘటన అమెరికాలో జరిగింది. డోర్డాష్ అనే ఫుడ్ డెలివరీ యాప్లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల ఈ సంఘటన ఎదురైంది. ఆ యాప్లో పేమెంట్ గేట్వే లేకుండానే ఆర్డర్లు బుక్కయ్యాయి. ఈ ఆఫర్ తెలుసుకున్న పలువురు ఆర్డర్ చేయటమే కాదు.. తాము ఉచితంగా పొందామని తమ ఆర్డర్ చిత్రాలను ఆన్లైన్లో పోస్ట్ చేశారు. అందులో టెకిలా వంటి అత్యంత ఖరీదైనవి సైతం ఉండటం గమనార్హం. దీంతో శుక్రవారం మధ్యాహ్నానికి డోర్డాష్ యాప్ ట్విట్టర్లో ట్రెడింగ్లోకి వచ్చింది. అయితే.. ఈ సమయంలో ఎంత మంది పేమెంట్ లేకుండా ఆర్డర్ చేశారనేది మాత్రం తెలియరాలేదు. అయితే.. అలాంటి ఆర్డర్లను తొలగిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలపటం ఉచితంగా ఆహారం, మందు పొందాలనుకున్న వారిని నిరాశకు గురి చేసింది. 'జులై 7న సాయంత్రం డోర్డాష్ యాప్లో పేమెంట్ సమస్య తలెత్తింది. ఆ తర్వాత కొద్ది సేపు ఎలాంటి పేమెంట్ లేకుండానే పలువురు యూజర్లు ఆర్డర్ బుక్ చేయగలిగారు. అలా కొందరు వినియోగదారులు ఆర్డర్ చేశారని తెలుసుకుని.. వెంటనే సమస్యను పరిష్కరించాం.' అని డోర్డాష్ ప్రతినిధి ఒకరు తెలిపారు. Doordash glitch went crazy im all stocked up free of charge pic.twitter.com/3gvtGZXPtL — annabelle. (@oomfabelle) July 8, 2022 Ain’t gone be a wing left in Chicago with this DoorDash glitch going on 🤦🏾♂️🤦🏾♂️🤦🏾♂️ pic.twitter.com/ghqIyF2Ktj — Follow Da Realest (@Cameron_773) July 8, 2022 ఇదీ చదవండి: అధ్యక్షుడి భవనంలో కరెన్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు -
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీసులోకి అమెజాన్
బెంగళూరు: ఆన్లైన్ దిగ్గజం, అమెజాన్డాట్కామ్ భారత్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వ్యాపారంలోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ఐటీ ఇండస్ట్రియలిస్ట్, నారాయణ మూర్తి స్థాపించిన కాటమరన్ వెంచర్ ఫండ్తో ఈ వ్యాపారానికి సంబంధించి ప్రస్తుతం అమెజాన్డాట్కామ్ చర్చలు జరుపుతోందని సమాచారం. . ఈ వ్యాపారంలోకి రావడానికి ఇప్పుడిప్పుడే ఉద్యోగులను నియమించుకుంటోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్లో పండుగల సీజన్ మొదలయ్యే సెప్టెంబర్ నుంచి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు అమెజాన్ ప్రయత్నాలు చేస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు 176 శాతం అప్... భారత్లో మధ్య తరగతి వర్గాలు పెరుగుతుండటంతో ఆన్లైన్ ఫుడ్ డెలివరీకి డిమాండ్ జోరుగా పెరుగుతోంది. గత ఏడాది ఆన్లైన్ ఆర్డర్లు 176 శాతం పెరిగాయి. భారత్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వ్యాపారంలో స్విగ్గీ, జొమాటోలు అగ్రస్థానంలో ఉన్నాయి. ట్యాక్సీ అగ్రిగేటర్ ఉబెర్, ఓలాలు కూడా ఫుడ్ డెలివరీ సర్వీసులను ఆరంభించాయి. ఉబెర్ సంస్థ, 2017లో ఉబెర్ ఈట్స్ పేరుతో ఈ పుడ్ డెలివరీ సర్వీసులను ప్రారంభించినప్పటికీ, స్విగ్గీ, జొమాటోలతో పోటీపడలేకపోతోంది. ఉబెర్ ఈట్స్ను అమెజాన్ కొనుగోలు చేయనున్నదని కూడా వార్తలు వచ్చాయి. మరోవైపు ఈ వ్యాపారం నుంచి వైదొలగాలని ఓలా నిర్ణయించుకుంది. కాగా పోటీ తీవ్రత అధికంగా ఉండటంతో అమెరికాలో తన ఫుడ్ డెలివరీ సర్వీసుల విభాగాన్ని అమెజాన్ మూసేసింది. అమెజాన్ సంస్థ 2016లో ప్రైమ్ సర్వీసులను భారత్లో ప్రారంభించింది. వీడియో, మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసులను అందిస్తోంది. ఇటీవలనే కిరాణా సరుకుల డెలివరీ సర్వీసుల వ్యాపారాన్ని కూడా ఆరంభించింది. అమెజాన్లో 5 లక్షల మంది విక్రేతలు చండీగఢ్: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్లాట్ఫాం ద్వారా విక్రయించే విక్రేతల సంఖ్య అయిదు లక్షలు దాటింది. భారత్లో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన సుమారు అయిదేళ్లలోనే ఈ మైలురాయి సాధించగలిగామని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (సెల్లర్ సర్వీసెస్) గోపాల్ పిళ్లై తెలిపారు. భారత మార్కెట్కు అనువైన సాధనాలను ప్రవేశపెట్టడం వల్లే ఇది సాధ్యపడిందని, ద్వితీయ.. తృతీయ శ్రేణి పట్టణాల నుంచి కూడా పెద్దయెత్తున విక్రేతలు తమ ప్లాట్ఫాంలో భాగమయ్యారని ఆయన పేర్కొన్నారు. విక్రేతలందరికీ పారదర్శకంగా, సమానమైన అవకాశాలను అమెజాన్ కల్పిస్తోందని పిళ్లై వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో విక్రయాలకు తోడ్పాటు అందించే అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రాం (ఏజీఎస్పీ)లో నమోదైన విక్రేతల్లో 80 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు చెందినవారే ఉన్నారని ఆయన చెప్పారు. ఏజీఎస్పీ ద్వారా ఇప్పటిదాకా 1 బిలియన్ డాలర్ల దాకా విలువ చేసే ఎగుమతులు జరిగాయని, 2023 నాటికి దీన్ని 5 బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చాలని నిర్దేశించుకున్నామని పిళ్లై చెప్పారు. -
ఇక ధరల యుద్ధమే: అమెజాన్ వచ్చేస్తోంది!
న్యూఢిల్లీ : బిగ్ బజార్ లాంటి సూపర్ మార్కెట్ దిగ్గజాలకు అలారమ్ బెల్ మోగింది. అమెజాన్ ఆన్లైన్ ఫుడ్ రిటైలింగ్ బిజినెస్లలోకి వచ్చేస్తోంది. ఈ దివాళి సీజన్లో దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఫుడ్ రిటైలింగ్ను ప్రారంభించాలని అమెజాన్ ప్లాన్ చేస్తోందని సంబంధిత వర్గాలు చెప్పాయి. సబ్సిడరీ అమెజాన్ రిటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కంపెనీ ఎంట్రీ ఇవ్వనుందని, అంతేకాక పనిలో పనిగా ప్రైవేట్ గ్రోసరీ లేబుల్ను భారత్లో ప్రారంభించాలని ప్లాన్ చేస్తుందని తెలిపాయి. అమెజాన్ ఎంట్రీతో ఆఫ్లైన్గా ఫుడ్ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న రిటైలర్లకు, ఆన్లైన్ గ్రోసరీ కంపెనీలకు తీవ్రమైన ధరల యుద్ధం చోటుచేసుకోనుందని వెల్లడవుతోంది. అమెజాన్కు ఇటీవలే భారత్లో ఆన్లైన్గా కానీ, ఆఫ్లైన్ ద్వారా కానీ ఫుడ్, గ్రోసరీలను విక్రయించేందుకు, నిల్వచేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. ఈ రంగంలో వచ్చే ఐదేళ్లలో అమెజాన్ రిటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కంపెనీ 500 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయాలని కూడా ప్లాన్చేస్తోంది. భారత్ కూడా ఫుడ్ రిటైల్లో 100 శాతం ఎఫ్డీఐలకు అనుమతి ఇస్తోంది. దీంతో స్థానికంగా తయారుచేసిన, ప్యాక్ చేసిన ఆహారోత్పత్తులను థర్డ్ పార్టీల నుంచి విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సొంత ప్రైవేట్ లేబుల్ కింద వీటిని విక్రయించనుంది. అమెజాన్ తొలి ప్రైవేట్ గ్రోసరీ లేబుల్ను అమెరికాలో గతేడాదే లాంచ్ చేసింది. ప్రైవేట్ లేబుల్ ఉత్పత్తులను ఎక్స్క్లూజివ్గా ప్రైమ్ మెంబర్షిప ద్వారా విక్రయిస్తోంది. అంతేకాక ఆఫ్లైన్ అమెజాన్ గో స్టోర్ల ద్వారా తమ దేశంలో గ్రోసరీ వ్యాపారాలను విస్తరించబోతుంది. అమెజాన్ కూడా ఆఫ్లైన్ స్టోరు తెరవాలని మన ప్రభుత్వం ఆశిస్తోంది. కానీ ఇంకా దీనిపై కంపెనీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సంబంధిత వర్గాలుచెప్పాయి. కంపెనీ ప్రతినిధి కూడా అమెజాన్ భవిష్యత్తు ప్రణాళికలపై స్పందించడం లేదు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement