-
టెన్త్ ఫలితాల్లో సత్తాచాటిన సర్కార్ బడులు
నరసరావుపేట ఈస్ట్: పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో సర్కార్ బడులు సత్తా చాటాయి. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పది ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించారు. ప్రభుత్వం కల్పించిన వసతులను, పథకాలను సద్వినియోగ పరుచుకుని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. సోమ వారం ప్రకటించిన పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలలో పల్నాడు జిల్లా రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచింది. జిల్లాలోని 433 ఉన్నత పాఠశాలల నుంచి 25,207 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 23,792 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థుల ఉత్తీర్ణత 86.05 శాతంగా ఉంది. గత ఏడాది 69.47 ఉత్తీర్ణత శాతం ఉండగా ఈ ఏడాది గత ఏడాది కంటే మరో 16.5 శాతం అధిక ఉత్తీర్ణత సాధించింది. విద్యా వ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులకు ఫలితం కనపడుతున్నది. నూతనంగా జిల్లాలను ఏర్పాటు చేసి ప్రతి జిల్లాకు విద్యాశాఖాధికారిని నియమించటం ద్వారా విద్యార్థులపై విద్యా శాఖాధికారుల పర్యవేక్షణ పెరిగింది. దీనికి తోడు ప్రభుత్వం విద్యార్థులకు అనేక పథకాలను ప్రవేశపెట్టి నాణ్యమైన ఆహారం, విద్యను అందించటంతో విద్యార్థులు కార్పోరేట్ పాఠశాలలతో పోటీపడి ఉత్తమ ఫలితాలు సాధించారు. ప్రభుత్వ పాఠశాలల ఫలితాలలో నరసరావుపేటలోని తిలక్ మున్సిపల్ ఉన్నత పాఠశాలకు చెందిన గాండ్లపర్తి రిషికరెడ్డి 593 మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే పులిపాడు జడ్పీ హైస్కూల్కు చెందిన జమ్మిగుంపుల ప్రమీల 590 మార్కులతో ద్వితీయ స్థానం సాధించింది. వేల్పూరు జడ్పీ హైస్కూల్ విద్యార్థి పి.భువనసాయి సుభాష్ 588, వినుకొండ జడ్పీ విద్యార్థిని బత్తుల గాయత్రి వెంకట హిమజ 587 మార్కులు సాధించారు. మున్సిపల్ బాలికోన్నత పాఠశాలకు చెందిన బృంగి లక్ష్మీ నాగశ్రావ్య 582, షేక్.అంజుమ్గౌసియా, మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన షేక్.నాసర్వలి 579 మార్కులు, ఎస్.వెంకట సహర్ష 557 మార్కులు సాధించారు. మాచర్ల కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయం విద్యార్థిని ఎం.భవాని 582 మార్కులు సాధించింది. చిలకలూరిపేటలోని బాలుర రెసిడెన్షీయల్ పాఠశాల నూరు శాతం ఉత్తీర్ణత సాధించింది. జిల్లా లోని 14 మోడల్ పాఠశాలల్లో చీకటీగలపాలెం పాఠశాల విద్యార్థులు మర్రెడ్డి భానుప్రసన్న 590, చెరుకుచెర్ల పావని 586, వెంకట నాగలక్ష్మీపూజిత 584మార్కులు సాధించారు. ఐఏఎస్ కావడమే లక్ష్యం వినుకొండ టౌన్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యావిధానం తనకు ఎంతో దోహదపడిందని, 10వ తరగతి పరీక్షా ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన బత్తుల గాయత్రి వెంకట హిమజ పేర్కొంది. పల్నాడు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యనభ్యసించిన గాయత్రి 587 మార్కులు సాధించి, వినుకొండ మండల పరిథిలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరి కంటే అత్యధిక మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. రానున్న రోజులలో జెఈఈ మెయిన్స్లో ప్రతిభ కనబరచడమే కాకుండా, సివిల్స్లో ప్రతిభ కనబరిచి ఐఎఎస్ కావాల న్నది తన ప్రధాన లక్ష్యంగా పేర్కొంది. తన ఉత్తీర్ణతకు సహకరించిన తల్లిదండ్రులు నాగేశ్వరరావు, జయశ్రీలకు పాఠశాల ఉపాధ్యాయులకు ప్రత్యేక కృత/్ఞతలు తెలియచేసింది. వినుకొండ రూరల్ నడిగడ్డ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న బత్తుల నాగేశ్వరరావు భార్య జయశ్రీలు తమ కుమార్తె ప్రతిభ కనబరిచి, అత్యధిక మార్కులు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తు, చిన్నారి గాయత్రికి స్వీటు తినపించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. సమష్టి కృషితో ఉత్తమ ఫలితాలు ఉపాధ్యాయుల సహకారం, సమిష్టి కృషితో పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాదించాం. రానున్న రోజుల్లో మరింత కృషి చేసి హాజరు శాతం పెంచటంతో పాటు ఉత్తమ ఫలితాలు సాధిస్తాం. – ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖాధికారి ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న వివిధ పాఠశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణత వివరాలు ఇలా ఉన్నాయి. యాజమాన్యం పాఠశాలల హాజరైన ఉత్తీర్ణులైన ఉత్తీర్ణత శాతం సంఖ్య విద్యార్థులు విద్యార్థులు జడ్పీ హైస్కూల్స్ 179 10,940 9,917 90.64 మున్సిపల్ స్కూల్స్ 05 568 541 95.24 మోడల్ స్కూల్స్ 14 1,089 1,066 97.88 కె.జి.బి.వి. 24 857 806 94.04 ప్రభుత్వ 03 237 202 85.23 ఎయిడెడ్ 20 748 683 91.31 గిరిజన పాఠశాలలు 12 304 282 92.76 సోషల్ వెల్ఫేర్ 10 736 718 97.55 ఏపీ రెసిడెన్షీయల్ 01 33 33 100 బిసీ వెల్ఫేర్ 04 146 141 96.57 ఆశ్రమ 02 80 72 90 జిల్లాకు 18వ స్థానం ఉత్తీర్ణతా శాతం 86.05 గత ఏడాది కంటే 16.5 శాతం అధికం 593 మార్కులు సాధించిన మున్సిపల్ విద్యార్థిని రిషిత రెడ్డి సమష్టి కృషితో ఉత్తమ ఫలితాలు: డీఈఓ పేదింట విద్యా కుసుమం నరసరావుపేట ఈస్ట్: పేదింట విద్యా కుసుమం విరబూసింది. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో నిరుపేద విద్యార్థిని గాండ్లపర్తి రిషిత రెడ్డి 593 మార్కులతో పల్నాడు జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల టాపర్గా నిలిచింది. పట్టణంలోని తిలక్ మున్సిపల్ పాఠశాల విద్యార్ధిని రిషితరెడ్డి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కష్టపడి చదివి అత్యుత్తమ మార్కులు సాధించింది. తండ్రి రంగారెడ్డి చిరు వ్యాపారి. చిన్నచిన్న దుకాణాలకు తినుబండాలను విక్రయిస్తుంటాడు. తల్లి స్వప్న కొబ్బరి మిల్లులో కూలీగా పనిచేస్తుంది. రోజూవారీ వచ్చిన కొద్దిపాటి కూలీ డబ్బుతోనే జీవనాన్ని సాగిస్తూ తమ పిల్లలను చదివిస్తున్నారు. దీనికి తోడు జగనన్న అమ్మఒడి రిషిత చదువుకు ఎంతో ఉపయోగపడుతున్నదని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రిషిత సోదరి బీటెక్ చదువుతోంది. రిషిత చిన్నతనం నుంచి చదువులో ప్రతిభ చాటుతున్నది. తన 8వ తరగతిలో నేషనల్ మెరిట్ స్కాలర్షిప్కు ఎంపికై ఏడాదికి రూ.12 వేలు స్కాలర్షిప్ సాధించింది. పాఠశాల ప్రధానోపా ధ్యాయుడు కుంభా శివనరసింహా రావు, ఉపాధ్యాయులు పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని స్టడీ అవర్స్ నిర్వహించటంతో పాటు వారికి అవసరమైన బోధనను ఎప్పటికప్పుడు అందించటం విద్యార్థులకు ఉపయోగపడింది. పాఠశాలలో 39 మంది పరీక్షకు హాజరు కాగా 35 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 20 మంది 450కు పైగా మార్కులు సాధించారు. -
మోసగాళ్లను మర్చిపోండి
మాచర్ల: రాష్ట్రంలో పేదలకు, పెత్తందార్లకు యుద్ధం జరుగుతోందని, ఇందులో భాగంగా పేదల వైపు సీఎం జగన్ మోహన్రెడ్డి ఉన్నారని, పెత్తందార్లకు కూటమి సపోర్టుగా ఉంటుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి, వైఎస్సార్ సీపీ నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి పోలుబోయిన అనిల్కుమార్ యాదవ్ అన్నారు. సోమవారం పట్టణంలోని పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసి అంబేద్కర్ సెంటర్లో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ఇది రాష్ట్ర చరిత్రలో ఇంత వరకు ప్రజలకు చెప్పింది చేసినట్లు చరిత్ర కలిగిన నాయకుడు ఎవరూ లేరన్నారు. సీఎం జగన్ మోహన్రెడ్డి 2019లో అనేక హామీలిచ్చి అంతకన్నా ఎక్కువ పథకాలను ప్రజలకు ఇవ్వటం జరిగిందన్నారు. ఎక్కడా రాజీపడకుండా పేదలకు న్యాయం చేసిన ఘనత సీఎం జగన్దేనన్నారు. ప్రతి పేదవానికి మేలు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న సీఎం జగన్ని ఎదుర్కొనలేక చంద్రబాబు కుట్రపూరితంగా బీజేపీ, జనసేనతో పొత్తుల పెట్టుకున్నారన్నారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ ఏనాడైనా తన ఫోటోను చూపించి ఓట్లు వేయండని అడిగిన చరిత్ర చంద్రబాబుకు లేదన్నారు. ఓ వైపు వెన్నుపోటు పొడిచిన మామ ఫొటో, మరో వైపు జనసేన నేత పవన్కళ్యాణ్, బీజేపీ అధినేత మోదీ ఫొటోను అడ్డం పెట్టుకుని ఎన్నికలకు దిగాడన్నారు. ఇప్పటి వరకు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని చేసే పేరుతో ఎంతో ముందు చూపు తో వ్యవహరించిన సీఎం జగన్ కావాలా.. పొత్తులతో ప్రజలను మోసగించే చంద్రబాబు కావాలా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించుకుని రాబోయే రోజు ల్లో సీఎం జగన్కు మద్దతు పలికి జే జేలు పలకాలన్నారు. ఓటు ద్వారా కూటమికి బుద్ధి చెప్పాలి వైఎస్సార్సీపీ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి పోలుబోయిన అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడుగా సీఎం జగన్ మోహన్రెడ్డి పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారన్నారు. గతంలో అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు వాగ్దానాలను అమలు చేయటంలో నిర్లక్ష్యం వహించారన్నారు. అలాంటి నాయకుడు మళ్ళీ తిరిగి ఉచిత హామీలిస్తూ మోసగించే పనిలో ఉన్నారన్నారు. మోసగించడం చంద్రబాబు నైజం ప్రభుత్వ విప్ పీఆర్కే మాట్లాడుతూ సీఎం జగన్ని మళ్ళీ సీఎం చేసుకుంటే ఈ రాష్ట్రం సంక్షేమ పథకాలు అమలవుతాయన్నారు. హామీలిచ్చి మోసగించటమనేది చంద్రబాబు నైజమన్నారు. ఈ సభలో రాష్ట్ర వైఎస్సార్ సీపీ యువజన విభాగ ఉపాధ్యక్షుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు మేరాజోత్ హనుమంతు నాయక్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కుర్రి సాయి మార్కొండారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మాచర్ల చిన ఏసోబు, మున్సిపల్ మాజీ చైర్మన్లు, మార్కెట్ యార్డు చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలుతో పాటు వేలాది మంది జనం పాల్గొన్నారు. సీఎం జగన్కు జేజేలు పలకండి వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రభుత్వ విప్ పీఆర్కే, అనిల్కుమార్ యాదవ్ను భారీ మెజార్టీలతో గెలిపించండి -
No Headline
నాదెండ్ల: ఈత సరదా ముగ్గురు మరణాలకు కారణమైంది. ఈ విషాద సంఘటన పల్నాడు జిల్లా కనపర్రు నుంచి సాతులూ రు వెళ్లే మార్గమధ్యలో సోమ వారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. నరసరావుపేట రూరల్ మండలం, మొలకలూరు గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులు గేరా పురుషోత్తం (20), బోరుగడ్డ ఆకాష్(20), చలమల రాజు (20) ఆదివారం ఉదయం ఎండుగుంపాలెంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ముగ్గురు ద్విచక్రవాహనంపై వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో సరదాగా ఈత కొట్టేందుకు ఉపక్రమించారు. కాలువ పక్కనే బైక్ను నిలిపి చెప్పులు, దుస్తులు, సెల్ఫోన్లు గట్టుపై పెట్టి కాలువలోకి దిగారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ తెల్లవారేసరికి ముగ్గురు శవాలుగా తేలారు. సోమవారం ఉదయం అటుగా వెళ్తున్న ఎండుగుంపాలెం వాసులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలాన్ని చిలకలూరిపేట రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డి, నాదెండ్ల ఎస్ఐ జె.బలరామ్రెడ్డి పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈతగాళ్లను పిలిపించి మృతదేహాలను వెలికితీయించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. యువకుల మృతితో మొలకలూరు ఎస్సీ కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. ముగ్గురూ స్నేహితులే... మృతులు ముగ్గురు స్నేహితులు. వేర్వేరు పనులు చేసుకుని జీవిస్తుంటారు. గేరా పురుషోత్తం ఇటీవల ఇంటర్ పరీక్షలు రాశాడు. తండ్రి రాజేష్ వ్యవసాయకూలి. బోరుగడ్డ ఆకాశ్ కార్పెంటర్గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. తండ్రి బాజీ కూలిపనులు చేస్తుంటాడు. చలమల రాజు తెలంగాణలోని నల్గొండ చెక్పోస్టు వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ముగ్గురు మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ముగ్గురు ద్విచక్రవాహనంపై ఆదివారం ఉదయం ఎండుగుంపాలెంలో జరిగే వేడుకకు వెళ్తున్నామని చెప్పి బయలుదేరారు. రాత్రి అయినా ఇంటికి చేరకపోయేసరికి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై వెతుకులాట ప్రారంభించారు. కాలువలో మృతదేహాలున్నాయన్న సమాచారంతో కుటుంబ సభ్యులు తీరని విషాదంలో మునిగిపోయారు. -
వైఎస్సార్ సీపీ అభ్యర్థి నంబూరు నామినేషన్
పెదకూరపాడు: వైఎస్సార్ సీపీ పెదకూరపాడు అసెంబ్లీ అభ్యర్థి నంబూరు శంకరరావు నామినేషన్ జన జాతరను తలపించింది. మండుటెండనూ లెక్క చేయకుండా వృద్ధులు, మహిళలు, చిన్నారులు, యువకులు తరలివచ్చారు. కాలచక్ర రోడ్డు జన సంద్రమైంది. తొలుత తన ఇంటి నుంచి ఉదయం 8 గంటలకు శంకరరావు బయలుదేరారు. శంకరరావుకు భార్య వసతంకుమారి, కుటుంబ సభ్యులు గుమ్మడి కాయలతో హారతి పట్టి విజయతిలకం దిద్దారు. ఆయన కుటుంబ సభ్యులతో కలసి తుళ్లూరు మండలం పెద్ద పరిమిలోని తమ ఇష్టదైవమైన సాయిబాబా, ఆంజనేయస్వామిలకు పూజలు నిర్వహించారు. చర్చికి వెళ్లి ప్రార్థనలు చేశారు. అనంతరం అభిమానులతో కలసి అమరావతి మండలం 14వ మైలు వద్దకు చేరుకుని అక్కడ నుంచి ర్యాలీగా అమరావతి, 75త్యాళ్లూరు మీదగా పెదకూరపాడులోని ఆర్వో కార్యాలయానికి చేరుకోని ఆర్వో కందుల శ్రీరాములుకు నామినేషన్ పత్రాలు అందించారు. అంతకు ముందు శంకరరావు సతీమణి వసంతకుమారి, కుమారుడు కళ్యాణ్ చక్రవర్తిలు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కాలచక్ర రోడ్డు జనమయం అమరావతి–పెదకూరపాడు కాల చక్ర రోడ్డు జనంతో నిండిపోయింది. అమరావతి, లింగాపురం, బలుసుపాడు, పరస, 75త్యాళ్లూరు, అబ్బరాజుపాలెం, పెదకూరపాడు గ్రామాల గుండా ర్యాలీ సాగింది. 75త్యాళ్లూరు వద్ద అభిమానులు గజమాలతో స్వాగతం పలికారు. అమరావతిలోని అంబేడ్కర్ విగ్రహానికి శంకరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. అభివృద్ధి చేసి చూపించా.. గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి చేసి చూపించానని.. అందుకే ధైర్యంగా ఓటు అడుగుతున్నానని వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి నంబూరు శంకరరావు అన్నారు. టీడీపీ ఎన్ని కూటములు కట్టినా పెదకూరపాడులో పార్టీ విజయం ఖాయమని పేర్కొన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసే వారికి మద్దతు ఉంటుందనేందు కు నామినేషన్కు హాజరైన ప్రజలే సాక్ష్య మని అన్నారు. కృతజ్ఞతలు తెలిపారు. అత్యధిక మోజార్టీతో గెలుపు తథ్యం పెదకూరపాడులో ముందే శంకరరావు గెలుపు కనిపిస్తోందని ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం అన్నారు. క్రోసూరు, సత్తెనపల్లి మార్కెట్ యార్డు చైర్మన్లు ఈదా సాంబిరెడ్డి, పెండెం బాబురావు పాల్గొన్నారు.ఇది విజయోత్సవ ర్యాలీ శంకరరావు నామినేషన్కు వచ్చిన జనవాహిని చూస్తే ఇది నామినేషన్ పర్వం కాదు, శంకరరావు విజయోత్సవంగా కనిపిస్తోందని వైఎస్సార్ సీపీ నాయకులు వంగవీటి నరేంద్ర అన్నారు. ఇంత జనాన్ని చూస్తే టీడీపీకి డిపాజిట్లు కూడా వచ్చేలా కనిపించడం లేదన్నారు. అభివృద్ధికి మారుపేరుగా జగనన్న, శంకరన్న నిలిచారన్నారు.పెదకూరపాడులో ఫ్యాన్ ప్రభజనం ఇప్పుడే కనిపిస్తోందన్నారు. -
No Headline
చిలకలూరిపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావటి శివనాగ మనోహర్నాయుడు నామినేషన్ దాఖలు సందర్భంగా సోమవారం నిర్వహించిన ర్యాలీ చిలకలూరిపేటలో నూతన అధ్యాయనానికి నాంది పలికింది. చిలకలూరిపేట చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా నియోజవర్గం నుంచి తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలతో కిలోమీటర్ల మేర జనసంద్రంగా మారింది. వైఎస్సార్ సీపీ శ్రేణులు పార్టీ పతాకాలు చేతపట్టి కదం తొక్కారు. పట్టణంలోని బ్యాంకుకాలనీలో ఉన్న పార్టీ కార్యాలయం నుంచి ఉదయం 9.45 గంటలకు ర్యాలీ ప్రారంభమైంది. ప్రచార రథం పైనుంచి ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్నాయుడు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, పార్టీ నాయకులు విడదల గోపీనాథ్, జ్ఞానేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ షేక్ జాన్సైదా తదితరులు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. నరసరావుపేట సెంటర్, భాస్కర్ సెంటర్, చౌత్రా సెంటర్, రూరల్ పోలీస్స్టేషన్ రోడ్డు, కళామందిర్సెంటర్, గడియార స్తంభం మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకుంది. తీన్మార్ వాయిద్యాల నడుమ కార్యకర్తలు సందడి చేశారు. అడుగడునా భవనాలౖపై నుంచి మహిళలు, అభిమానులు పూల వర్షం కురిపించారు. మహిళలు ప్రచారరథంపై ఉన్న నాయకులకు గుమ్మడికాయలతో దిష్టితీసి, హారతులు పట్టి జయం కలగాలని ఆకాంక్షించారు. సుగా లి మహిళలు సంప్రదాయ వస్త్రాలంకరణతో వచ్చి పాటలు పాడి నృత్యం చేశారు. నామినేషన్ ర్యాలీ జైత్రయాత్రలా కొనసాగింది. ముందుగా పట్టణంలోని బ్యాంకు కాలనీలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో కావటి మనోహర్నాయుడు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి డాక్టర్ పి అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్నాయుడుకు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ లాలూపురం రాము, గుంటూరు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు తదితరులు కలసి అభినందనలు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న కావటి మనోహర్ నాయుడు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి.నారదమునికి అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గొంటు శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు బీపీ నాయుడు, బైరా వెంకటకృష్ణ, బొంతు నాగిరెడ్డి, తాళ్ల అంజిరెడ్డి, పఠాన్ తలహాఖాన్, గుత్తా యాములయ్య, ఘంటా శంకర్, మద్దూరి కోటిరెడ్డి, ఏవీఎం సుభాని, ముస్లిం కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దరియావలి, మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గాదె సుజాత, పార్టీ వివిధ విభాగాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కావటి నామినేషన్ దాఖలు -
తీరని రోదన
వేటపాలెం: ఎదురుగా వేగంగా వచ్చిన లారీ స్కూటీని ఢీ కొట్టిన ఘటనలో అమ్మమ్మ, మనుమరాలు మృతి చెందారు. ఈ ఘటన చీరాల – వేటపాలెం బైపాస్ రోడ్డులో అక్కాయిపాలెం ఐస్ ఫ్యాక్టరీ దగ్గరలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. చిన్నగంజాం మండలం కొత్త పాలేనికి చెందిన స్నేహలత తన ఏడాది కూతురు అన్విత, తల్లి బొడ్డు సుబ్బరావమ్మ (57)ను స్కూటీ పై ఎక్కించుకొని బాపట్ల అత్తగారింటికి బయలుదేరింది. అక్కాయిపాలెం దగ్గరకు రాగానే ఎదురుగా ఒంగోలు వైపు వెళ్తున్న లారీ వీరిని ఢీ కొట్టింది. స్కూటీ వెనక కూర్చొన్న సుబ్బ రావమ్మ, తనఒడిలో ఉన్న ఏడాది పాప లారీ కింద పడ్డారు. దీంతో వీరిద్దరూ అక్కడికక్కడికే మృతి చెందారు. స్నేహలతకు గాయాలయ్యాయి. -
జెండా ఎగురవేస్తాం.. జగనన్నకు కానుకగా ఇస్తాం
● చిలకలూరిపేట వైఎస్సార్ సీపీ అభ్యర్థి కావటి శివనాగ మనోహర నాయుడుచిలకలూరిపేట: ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించి, నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేసి జగనన్నకు కానుకగా ఇస్తామ ని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు చెప్పారు. సోమవారం నామినేషన్ దాఖ లు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కనీవిని ఎరుగని స్థాయిలో అభివృద్ధి, సంక్షేమం అందించిన ముఖ్యమంత్రి జగన్ తిరిగి అధికారం సాధించాలని ప్రజలు ప్రతినబూనారని చెప్పారు. దీనికి ప్రజల నుంచి లభిస్తున్న అపూర్వ ఆదరణే నిదర్శమన్నారు. ఎన్నికల ప్రచారం నిర్వ హిస్తుంటే ప్రతి గడపలోనూ ప్రజలు సీఎం వైఎస్ జగన్ తమను ఎన్నో రకాలుగా ఆదుకున్నారని తెలుపుతున్నారని వెల్లడించారు. గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన వారు సైతం మాకు ఇళ్ల పట్టాలు వచ్చాయి... ఆరోగ్యశ్రీ ద్వారా మేలు జరిగింది... ఎన్నో పథకాలు అందుతున్నాయి, ఈసారి వైఎస్సార్ సీపీకే ఓటు వేస్తాం అని చెబుతున్నారని పేర్కొన్నారు. బెదిరింపులు సహించం... కొంతమంది టీడీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉందని, అలాంటి వారికి తగు రీతిలో గుణపాఠం చెబుతామని కావటి హెచ్చరించారు. టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లా రావు మాటలు నమ్మి దౌర్జన్యాలకు దిగితే తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదన్నారు. దీని కి నిదర్శనం 2019లో ఓటమి చెందాక ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గానికి నాలుగున్నర సంవత్సరాలు దూరంగా ఉన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. 2019 తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను సైతం గాలికి వదిలేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పుల్లారావు, ఆయ న సతీమణి చేసిన అరాచకాలు, అవినీతి నియోజకవర్గ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు. గుడ్డిపత్తి అమ్ముకొనేందుకు ప్రకాశం జిల్లా బొబ్బేపల్లి నుంచి వచ్చిన ప్రత్తిపాటి ఇక్కడి ప్రజల నెత్తిన టోపీ పెట్టి గతంలో ఎమ్మెల్యేగా గెలిచారని, టీడీపీ ఓడిపోవడం ఖాయమని, ఆ తర్వాత పుల్లారావు కనిపించే పరిస్థితి ఉండదని, ఆయనను నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమన్న విషయం ఆ పార్టీ నాయకులకు కూడా తెలుసన్నారు. అయినప్పటికీ బెదిరింపులకు దిగడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. -
పల్నాడు
మంగళవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 20247నేడు చెన్నుని కల్యాణం మాచర్ల: పట్టణంలో గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో మంగళవారం కల్యాణం నిర్వహించనున్నారు. ఉదయం నుంచి స్వామికి ప్రత్యేక పూజలు జరుపుతారు.జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వినుకొండలో బొల్లా బ్రహ్మానాయుడు, పెదకూరపాడులో నంబూరు శంకరరావు, చిలకలూరిపేటలో కావటి మనోహర్ నాయుడులు నామినేషన్లు దాఖలు చేశారు. కార్యక్రమానికి జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. న్యూస్రీల్ మాచర్ల, వినుకొండ, పెదకూరపాడు, చిలకలూరిపేటల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల నామినేషన్ తరలివచ్చిన జనం తీన్మార్, సంప్రదాయ నృత్యాలతో సందడి కార్యక్రమానికి హాజరైన పార్టీ ప్రముఖులు -
వినుకొండలో జన ప్రవాహం
వినుకొండ(నూజెండ్ల): వినుకొండకు జన ప్రవాహం తరలివచ్చింది. వినుకొండ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నామినేషన్ సందర్భంగా 50 వేల మందికి పైగా అభిమానులు, కార్యకర్తలు తరలిరావడంతో పట్టణంలోని ప్రధాన కూడళ్లు కిక్కిరిసిపోయాయి. బొల్లా బ్రహ్మనాయుడు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ యర్రం వెంకటేశ్వరరెడ్డి, యువ నాయకుడు గిరిబాబులతో కలసి సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వరదా సుబ్బారావుకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. తొలుత గుంటి ఆంజనేయస్వామి దేవాలయం, పెద్దమసీదు, ఇమ్మానుయేలు తెలుగు బాప్టిస్ట్ చర్చిలో సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం కారంపూడి రోడ్డులోని బొల్లా కన్వెన్షన్ హాల్ వద్ద నుంచి కుటుంబసభ్యులు బొల్లా ఆదిలక్ష్మి, గిరిబాబులతో కలిసి ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీ బొల్లా కన్వెన్షన్ హాల్ నుంచి సుమారు మూడు కిలోమీటర్ల మేర ర్యాలీ కొనసాగింది. కర్ణాటక కళాకారుల ప్రత్యేక నృత్యాలు, డీజే సౌండ్ల హోరు మధ్య ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. ఈపూరు, బొల్లాపల్లి, శావల్యాపురం, నూజెండ్ల, వినుకొండ రూరల్, వినుకొండ టౌన్ నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడం విశేషం. రహదారి పొడవున బిల్డింగ్లపై నుంచి ప్రజలు అభివాదం చేస్తూ ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు. ప్రధాన సెంటర్లలో మహిళలు గుమ్మడికాయలతో దిష్టి తీసి శుభాకాంక్షలు తెలియజేశారు. ర్యాలీ శివయ్య స్థూపం సెంటర్ వద్దకు రాగానే నాలుగువైపులా రహదారులు ఇసుకేస్తే రాలనంతగా జనం ఎండను సైతం లెక్క చేయకుండా మధ్యాహ్న సమయంలో కూడా కిక్కిరిసిపోయారు. శివయ్య స్థూపం సెంటర్లో 10 భారీ క్రేన్లతో భారీ గజమాలలు ఎమ్మెల్యేకు వేసి అభిమానులు ప్రత్యేక అభిమానం చాటుకున్నారు. కార్యకర్తల త్యాగాలను మరువలేను ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ కార్యకర్తలు చూపిన అభిమానం, ఆదరణ, వారి త్యాగాలను మరువలేనిదన్నారు. మండుటెండలో సైతం తనపై ప్రేమ, అభిమానాలు చూపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటానని, టీడీపీ నాయకులు బెదిరింపులకు భయపడమని అన్నారు. కార్యకర్తల కష్టం ఊరికే పోదని, మరలా మనమే అధికారంలోకి వస్తామని అన్నారు. వినుకొండ అభివృద్ధికి టీడీపీ నాయకులు అడ్డుపడుతున్నారని అన్నారు. లక్ష మంది ప్రజలకు తాగునీరు ఇవ్వాలని నేను సంకల్పిస్తే, సింగరచెరువుకు నీరు రాకుండా అడ్డుకోవడం టీడీపీ వారికే చెల్లిందని అన్నారు. వరికపూడిశెల ప్రాజెక్టు తమ హయాంలోనే పూర్తిచేస్తామన్నారు. టీడీపీ నాయకులు గ్రామాల్లో అలజడులు సృష్టించాలని చూస్తున్నారని, ఎవరూ భయపడవద్దని తమ ప్రాణాలైనా అడ్డువేసి కాపాడతానని అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సహాయసహకారాలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి బొల్లా నామినేషన్ -
నాల్గోరోజు 38 నామినేషన్లు దాఖలు
నరసరావుపేట: సార్వత్రిక ఎన్నికలలో పోటీచేసేందుకు నాల్గోరోజు సోమ వారం జిల్లా వ్యాప్తంగా 38మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో పార్లమెంటు నియోజకవర్గానికి ఎనిమిది మంది నామినేషన్లు వేయగా, మిగతా 30మంది వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు వేశారు. మొత్తంపై నామినేషన్లు వేసిన వారిలో 11 మంది వైఎస్సార్సీపీ అభ్యర్థులు, వారి మద్దతుదారులు నామినేషన్లు వేయగా, నలుగురు టీడీపీ తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున ముగ్గురు నామినేషన్లు వేశారు. పార్లమెంటు సీటుకు లావు శ్రీకృష్ణదేవరాయలు తరపున ముప్పాళ్ల సాంబశివరావు, లావు మేఘన తరపున పూదోట అర్లయ్య(టీడీపీ), డాక్టర్ గోదా రమేష్ కుమార్ (జాతీయ జనసేన పార్టీ), తోకల నాగరాజు (ఆల్ ఇండియా పార్వార్డ్ బ్లాక్), వేంపాటి వీరాంజనేయరెడ్డి, షేక్ అబ్దుల్ రజాక్ (ఇండిపెండెంట్), పప్పుల సాంబశివరావు (నవరంగ్ కాంగ్రెస్ పార్టీ), సంగం శ్రీకాంతరెడ్డి (బీఎస్పీ) నామినేషన్ వేశారు. పెదకూరపాడు అసెంబ్లీకి నంబూరు శంకరరావు, నంబూరు వి.వసంతకుమారి (వైఎస్సార్ సీపీ), పమిడి నాగేశ్వరరావు (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్), షేక్ యునాస్ (ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్), నంబూరు కల్యాణ చక్రవర్తి, శెట్టి సింగరయ్య(ఇండిపెండెంట్లు) నామినేషన్లు వేశారు. చిలకలూరిపేట అసెంబ్లీకి కావటి శివనాగ మనోహరనాయుడు (వైఎస్సార్ సీపీ), నల్లపు కోటేశ్వరరావు (బీఎస్పీ), రావు సుబ్రమణ్యం (నవతరం), ఒంటారి విజయమ్మ(తెలుగు రాజాధికార సమితి) నామినేషన్లు వేశారు. నరసరావుపేట అసెంబ్లీకి మహమద్ మజూర్షేక్ (ఇండిపెండెంట్), గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గోపిరెడ్డి సుష్మితారెడ్డి (వైఎస్సార్సీపీ), తల్లపునేని హరికృష్ణ (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా) నామినేషన్లు వేశారు. సత్తెనపల్లి అసెంబ్లీకి సులమ్ రాజ్యలక్ష్మి(ఇండిపెండెంట్), కన్నా లక్ష్మినారాయణ (టీడీపీ), అంబటి రాంబాబు తరపున అంబటి విజయలక్ష్మి, యెండూరి ఉపేష్ చంద్రచౌదరి (వైఎస్సార్ సీపీ) నామినేషన్లు వేశారు. వినుకొండ అసెంబ్లీకి బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా గిరిబాబు (వైఎస్సార్ సీపీ), ఉస్తల చినకాశయ్య, షేక్ బాజి, దాట్ల అంజిరెడ్డి(ఇండిపెండెంట్లు) నామినేషన్లు వేశారు. గురజాల అసెంబ్లీకి కాసు మహేష్రెడ్డి(వైఎస్సార్ సీపీ), యరపతినేని శ్రీనివాసరావు (టీడీపీ), నీరుమళ్ల శ్రీనివాసరావు(అఖిల భారతీయ జనసంఘ), పసుపులేటి పిచ్చయ్య (ఇండిపెండెంట్) నామినేషన్లు వేశారు. మాచర్ల అసెంబ్లీకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (వైఎస్సార్ సీపీ), యర్రమాల రామచంద్రారెడ్డి, యర్రమాల కృష్ణవేణి(ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) తరపున నామినేషన్లు దాఖలు చేశారు. -
కావటి ఆస్తులు– అప్పులు ఇవే
చిలకలూరిపేట: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కావటి శివనాగ మనోహర్ నాయుడు ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచిన వివరాలు ఇలా ఉన్నాయి. వయసు 47 సంవత్సరాలు. భార్య పేరు కావటి మాధవి. పిల్లలు చతుర్వేద్, తనీష్ శంకర్. మనోహర్ నాయుడు చేతిలో నగదు రూ. లక్ష, బ్యాంకులో, బాండ్లు, ఇతర స్థిర, చరాస్తుల విలువ రూ. 3,75,64,013, అప్పులు రూ. 60,48,693. భార్య మాధవి చేతిలో నగదు రూ. 50వేలు. బ్యాంకు ఖాతాలు, బంగారం, ఇతర స్థిర, చర ఆస్తుల విలువ రూ. 45,38,949గా పొందుపరిచారు. -
No Headline
పిన్నెల్లి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన జనసందోహంమాచర్ల రూరల్: మాచర్ల మహాసంద్రంగా మారింది. మండుటెండను లెక్కచేయక నియోజకవర్గ పరిధిలోని గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. పట్టణంలోని వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాచర్ల నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెండవ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్, నియోజక వర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎ.శ్యాం ప్రసాద్కు నామినేషన్ పత్రాలను అందజేశారు. పిన్నెల్లి వెంట సోదరి జవ్వాజి నాగమణి, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధానకార్యదర్శి మరుమాముల శ్రీనివాసశర్మ, సీనియర్ న్యాయవాది చిలంకూరి నాగిరెడ్డి, మారం వెంకటేశ్వరరావు (లడ్డూ)లు ఉన్నారు. ఆలయాల్లో పూజలు మాచర్ల: ఉదయం రింగురోడ్డులోని ఆంజనేయస్వామి దేవాలయంలో పీఆర్కే ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు మూడు గంటల సేపు దేవాలయం వద్ద వేచి ఉండి వైఎస్సార్సీపీ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి పోలుబోయిన అనిల్కుమార్ యాదవ్, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, సీనియర్ నాయకులు కొమ్మారెడ్డి చలమారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి యెనుముల మురళీధర్రెడ్డిలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తరువాత దేవాలయం నుంచి వేలాది మంది పీఆర్కే వెంట సాగారు. రింగురోడ్డు నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు రోడ్డుకు ఇరువైపులా మహిళలు, రైతులు, యువకులు, వైఎస్సార్సీపీ నాయకులు కేరింతలు కొడుతూ బారులు తీరారు. పార్కు సెంటర్కు చేరుకునే ముందు అతిథులందరికీ భారీ క్రేన్లతో గజమాలలు వేసి సత్కరించారు. వేలాది మందితో పట్టణమంతా కిక్కిరిసిపోయింది. ఎటుచూసిన వైఎస్సార్సీపీ ప్రభంజనం కనబడింది. కార్యక్రమంలో అన్నీ మండలాల ప్రజా ప్రతినిధులు, మార్కెట్ యార్డు చైర్మన్లు, మాజీ చైర్మన్లు, రాష్ట్ర డైరెక్టర్లు, జెడ్పిటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సొసైటీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు భారీ స్థాయిలో పాల్గొన్నారు.పీఆర్కే నామినేషన్ దాఖలు -
మండాదిలో కలెక్టర్ పల్లెనిద్ర
వెల్దుర్తి: మండలంలోని మండాది గ్రామంలో కలెక్టర్ లోతేటి శివశంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్, నియోజక వర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎ. శ్యాం ప్రసాద్లు ఆదివారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మండాది ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్న పోలింగ్ బూత్లను పరిశీలించి పాఠశాలలో ఏర్పాటు చేసి న గదిలో పల్లె నిద్ర చేశారు. సోమవారం ఉదయం గ్రామంలో తిరిగి ఓటు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నిర్భయంగా వారికి నచ్చిన పార్టీలకే వేసుకోవాలన్నారు. గ్రామంలో ఎలాంటి ఒత్తిడిలు, ప్రలోభాలు పెడితే వెంటనే ఎన్నికల అధికారికి సమాచారమివ్వాలన్నారు. అటువంటి వారి పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మండలంలోని గుండ్లపాడులో ఉన్న నాలుగు పోలింగ్ బూత్లను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం గ్రామంలోని పలు ఓటర్లతో మాట్లాడా రు. గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ శ్రీహరిని ఆదేశించారు. సమస్యాత్మక గ్రామాలలో బందోబస్తును ఏర్పాటు చేస్తామన్నారు. -
పారదర్శక విధులే మా లక్ష్యం
నరసరావుపేట: నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, స్వేచ్ఛా వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నా మని జిల్లా పోలీసు అధికారులు తెలియచేశా రు. గురువారం ఓ దినపత్రికలో (సాక్షి కాదు) జిల్లా పోలీసుల వ్యవహారశైలిపై ప్రచురించిన వార్తలో ఎటువంటి వాస్తవం లేదన్నారు. జిల్లా లో ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోనైనా రాజకీయ అల్లర్లు, ఆయా వర్గాల మధ్య వివాదాలు జరిగి ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలిగినప్పుడు తక్షణమే స్పందించి బాధ్యులపై వెంటనే కేసులు నమోదు చేసి ముద్దాయిలను అరెస్ట్ చేసి చట్టపరంగా తగు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. ఆ నేరాలు బెయిలబుల్ నేరాలైతే సీఆర్పీసీ కింద 41 నోటీసులు ఇవ్వడం, నాన్ బెయిలబుల్ నేరాలు అయితే అరెస్టు చేసి రిమాండుకి పంపడం చేస్తున్నారన్నారు. దీనిలో ఏ పార్టీకి, ఏ వర్గంపై పోలీసులు పక్షపాతం చూపించడం లేదని వివరించారు. జిల్లాలో శాంతి భద్రతలకు సంబంధించి ఎటువంటి సమస్య తలెత్తినా పోలీసులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఏదైనా వార్త ప్రచురించే ముందు దానికి సంబంధించి పోలీసుల వివరణ కూడా తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. -
బలహీనవర్గాల సంక్షేమమే జగనన్న ధ్యేయం
సత్తెనపల్లి: బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ధ్యేయమ ని ముదిరాజు కార్పొరేషన్ చైర్మన్ నారాయణ ముదిరాజ్ అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి గ్రామంలో బుధవారం రాత్రి నిర్వహించిన ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా నారాయణ ముదిరాజ్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన నవరత్నాల పథకాల వల్ల బీసీ సామాజిక వర్గాల్లో జరిగిన ఆర్థిక పురోగతిని ప్రతి ఒక్కరికీ తెలియచేసి మళ్లీ వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రావాల ని, తద్వారా బీసీలు లబ్ధి పొందాలన్నారు. బీసీలను బ్యాక్ బోన్గా జగన్ మోహన్ రెడ్డి గుర్తించి గౌరవించారన్నారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి అంబటి రాంబాబుని, నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి, బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో వైఎస్సార్ సీపీని గెలిపించాలన్నారు.సమావేశంలో ముదిరాజు సంఘ నాయకులు కంటు వెంకట్రామ య్య, కంటు సాంబయ్య, నక్క రమణయ్య, కంటు బ్రహ్మయ్య, పేరుబోయిన శ్రీను, కంటు సుబ్బా రావు, ముదిరాజ్ సంఘ నాయకులు, బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. ముదిరాజు కార్పొరేషన్ చైర్మన్ నారాయణ ముదిరాజు కంకణాలపల్లి గ్రామంలో ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనం -
బీ–ఫాం ఏదీ నాయకా?
● తొందరపడి ముందే కదిలిన అభ్యర్థి ● ఆర్వో ఆఫీసుకు వచ్చి తిరుగు పయనం ● కాంగ్రెస్ అభ్యర్థి కంగారుపై కార్యకర్తలు గుర్రు పెదకూరపాడు: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వింతలు, విశేషాలు చోటు చేసుకోవడం సహజమే. అదే కోవలో నియోజకవర్గంలో ఓ వింత గురువారం చోటు చేసుకుంది. పెదకూరపాడు నియోజకవర్గ అభ్యర్థిగా బలుసుపాడుకి చెందిన పమిడి నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ క్రమంలో గురువారం నామినేషన్ల పర్వానికి తెరలేవడంతో రాత్రి నుంచి పెద్దఎత్తున తన బంధువులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇండియా కూటమిలోని మిత్రపక్షాలతో కలసి 30 వాహ నాల్లో సుమారు 300 మందితో నామినేషన్ వేసేందుకు పెదకూరపాడు వచ్చారు. అయితే ఇన్ని వాహనాలకు అనుమతి లేదని అధికారులు పెదకూరపాడులోని అంబేడ్కర్ బొమ్మ వద్దనే వాహనాలు నిలిపివేశారు. ఆగ్రహించిన అభ్యర్థి నాగేశ్వరరావు అధికారులతో కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. చివరికి అనుమతి తీసుకున్న ఐదు వాహనాల్లో తన అనుచరులు, అభిమానులతో ర్యాలీగా ఆర్వో కార్యాలయానికి వచ్చారు. నామ పత్రాలు దాఖాలు చేసే సమయంలో పార్టీ ఇచ్చే బీ–ఫాం ఏదీ అని ఆర్వో ప్రశ్నించగా దాన్ని తీసుకోలేదని, తరువాత ఇస్తానని బదులిచ్చారు. బీ–ఫాం ఉంటేనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గుర్తిస్తామని ఆర్వో స్పష్టం చేయడంతో చేసేది లేక తన అనుచరులతో వెనుదిరిగారు. ఇదేంది నాయక తొందరపడి ముందే కదిలావు అంటూ కార్యకర్తలు కొద్దిసేపు నవ్వుకున్నారు. 300 క్వింటాళ్ల బియ్యం పట్టివేత సత్తెనపల్లి: మండల పరిధిలోని నందిగామ అడ్డరోడ్డు వద్ద 300 క్వింటాళ్ల బియ్యాన్ని సత్తెనపల్లి రూరల్ సీఐ ఎం.రాజేష్ కుమార్ నేతృత్వంలో పోలీసులు గురువారం రాత్రి పట్టుకున్నారు. బాపట్ల నుంచి గుజరాత్కు ఈ బియ్యాన్ని తరలిస్తున్నారు. అయితే బియ్యం నలుపు రంగులో ఉండడంతో ఇవి రేషన్ బియ్యమా? కాదా? అనేది తేలాల్సి ఉంది. ఒక్కో బ్యాగులో 30 కేజీలు చొప్పున వెయ్యి బ్యాగులు లారీలో ఉన్నాయని దీనిపై పౌర సరఫరాల శాఖ అధికారులకు లేఖ రాసినట్లు సీఐ రాజేష్ కుమార్ తెలిపారు. బియ్యం విషయమై డిప్యూటీ తహసీల్దార్ అరుణను సంప్రదించగా బియ్యాన్ని శాంపిల్స్ తీసి నిర్ధారణ నిమిత్తం ల్యాబ్కు పంపామన్నారు. -
ఆటో డ్రైవర్పై పోక్సో కేసు
బల్లికురవ: బాలికను మాయమాటలతో తీసుకెళ్లి లైంగిక దాడి చేసిన ఘటనపై ఆటోడ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు బల్లికురవ పోలీసు స్టేషన్ ఏఎస్ఐ సి.బాలకృష్ణ గురువారం తెలిపారు. మండలంలోని కూకట్లపల్లి ఎస్సీ కాలనీకి చెందిన జొన్నలగడ్డ అవినాష్ కూలీలను ఆటోలో వ్యవసాయ పనులకు వివిధ గ్రామాలకు తీసుకువెళ్తుంటాడు. ఈ క్రమంలో అదే కాలనీకి చెందిన బాలిక ఆటోలో పనులకు వస్తోంది. ఆమెకు మాయమాటలు చెప్పి ఈనెల 15న బయటకు తీసుకెళ్లాడు. మూడు రోజులైనా గ్రామానికి రాకపోవటంతో బాలిక తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. గురువారం ఇంటికి వచ్చిన బాలిక తనపై అవినాష్ అత్యాచారం చేశాడని తల్లిదండ్రులకు వివరించటంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదుతో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏఎస్ఐ వివరించారు. ముస్లిం రిజర్వేషన్లపై కూటమి నోరు విప్పాలి పర్చూరు (చినగంజాం): ముస్లిం రిజర్వేషన్లపై కూటమి నోరు విప్పాలని రాష్ట్ర వక్ఫ్బోర్డు కార్యదర్శి గడ్డం మస్తాన్వలి గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి తీరుతామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారని, అమిత్షా మాటనే ఆయన పేర్కొన్నారన్నారు. ఏపీలోను అదే విధానం అని బీజేపీ నేతలు అంటున్నారని, చంద్రబాబు కూడా రిజర్వేషన్లు రద్దుకు అంగీకరించినట్లు ఆ పార్టీ నేతలు అంటున్నారని తెలిపారు. దీంతో ముస్లిం రిజర్వేషన్లపై రాష్ట్రంలో తీవ్రమైన చర్చ నడుస్తోందన్నారు. వైఎస్సార్ అధికారంలోకి రాగానే నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారని, దాన్ని రద్దు చేస్తామని కిషన్రెడ్డి చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. -
వైఎస్సార్ సీపీలోకి భారీ చేరికలు
వినుకొండ(నూజెండ్ల): వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు, గ్రామాల్లో చేసిన అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలోకి చేరికలు పెరిగాయనీ, పార్టీలో చేరిన ప్రతిఒక్కరికీ సముచిత స్థానం, ప్రాధాన్యం ఉంటుందని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 27, 28 వార్డుల్లో భారీ సంఖ్యలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఆయా వార్డులకు చెందిన 100 కుటుంబాలు పార్టీలో చేరగా ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అదేవిధంగా స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఈపూరు మండలం కొచ్చర్ల తండాకు చెందిన 30 కుటుంబాలు టీడీపీని వీడి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, జగనన్న హయాంలో పార్టీలకతీతంగా ప్రతిఒక్కరికీ మేలు జరిగిందని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ను, ఎమ్మెల్యేగా తనను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ, మండలస్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చిలకలూరిపేటలో... చిలకలూరిపేట: అధికార కాంక్షతో ముస్లిం మైనార్టీలను జగన్నుంచి దూరం చేయాలని చూస్తున్న కూటమి బూటకపు మాటల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని వైఎస్సార్ సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు చెప్పారు. పట్టణంలోని 11 వార్డుకు చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు తమ కుటుంబాలతో టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి కావటి మనోహర్ నాయుడు సమక్షంలో గురువారం చేరారు. వారందరికీ పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కావటి మాట్లాడుతూ నవరత్న సంక్షేమ పథకాల ద్వారా ముస్లిం మైనార్టీలకు రూ. 23వేల కోట్లు, మైనార్టీ విద్య కోసం రూ.25.88 కోట్ల నిధులు అందించినట్లు వెల్లడించారు. 11వ వార్డులో టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి చేరిన ముఖ్య నాయకుల్లో షేక్ రెహమాన్, షేక్ ఖాసిం, షేక్ సుభాని, షేక్ మనన్, షేక్ ఫర్కాన్తో పాటు పలు కుటుంబాలు చేరారు. పేటలోనే స్థిర నివాసం పట్టణంలోని గాంధీపేటలో ఉన్న బీపీ నాయుడు కాంప్లెక్స్లో వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి కావటి మనోహర్నాయుడు మాట్లాడుతూ తాను కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తినని, తనకు కార్యకర్తల కష్టాలు తెలుసని చెప్పారు. చిలకలూరిపేటలోనే సొంత నివాసం ఏర్పాటు చేసుకొని నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మద్దిరాల విశ్వనాధం, రిటైర్డ్ న్యాయమూర్తి కంచర్ల విజయకుమార్, పార్టీ క్రిస్టియన్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాతులూరి కోటి, వేటపాలెం సుభాని, సయ్యద్ బషీర్ మేస్త్రి, తాళ్ల అంజిరెడ్డి, ఏవీఎం సుభాని పాల్గొన్నారు. నరసరావుపేటలో 15 కుటుంబాలు చేరిక నరసరావుపేట: రొంపిచర్ల మండలం కొనకంచివారిపాలెం గ్రామ సర్పంచు పొనుగోటి నాసరరావు, మాజీ సర్పంచ్ పొనుగోటి వెంకటరావు, కొల్లి జగన్నాధరావు ఆధ్వర్యంలో 15 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరాయి. వీరికి గురువారం పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ కాలనీకి చెందిన వీరందరూ పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉందన్నారు. కాలనీకి రూ.50 లక్షలు ఎస్సీ గ్రాంటు నుంచి మంజూరు చేయించి రోడ్లు, డ్రెయిన్ నిర్మాణాలు చేశామన్నారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అమలయ్యాయన్నారు. వలంటీరు వ్యవస్థ ద్వారా ఇళ్లవద్దకే పథకాలు చేరాయన్నారు. దీనికి ఆకర్షితులైన వీరందరూ టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారన్నారు. పార్లమెంటు అభ్యర్థిగా డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఫ్యాన్గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. పెట్లూరివారిపాలెంలో.. నరసరావుపేట: మండలంలోని పెట్లూరివారిపాలెం గ్రామానికి చెందిన ఐదుకుటుంబాల వ్యక్తులు గురువారం టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. వీరందరికీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలతో ఆకర్షితులై పార్టీలో చేరినట్లు గోపిరెడ్డి వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీపీ మోరబోయిన శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు డాక్టర్ కొండపల్లి వెంకటేశ్వర్లు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. కొండూరులో నో జనసేన అచ్చంపేట: మండలంలోని కొండూరులో జనసేన పార్టీ ఇకలేనట్లే కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన అధ్యక్షులు గాదె కాటమరాజు, ఉపాధ్యక్షుడు కుంభా రామాంజనేయులు గురువారం ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. ఇప్పటికే చాలా గ్రామాలలో జనసేన ప్రభావం కనిపించడం లేదు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మేలు చేసిన వారికి ప్రజలు మద్దతిస్తారనడానికి ఇదే ఉదాహరణగా చెప్పొచ్చన్నారు. తాము అన్ని వర్గాలకు మేలు చేశాం కనుకనే పార్టీలకు అతీతంగా తమను ఆశీర్వదిస్తున్నారని, మళ్లీ జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ చిల్కా చంద్రయ్య, మాజీ సర్పంచ్ కంబాల వీరబాబు, అచ్చంపేట సర్పంచ్ జాని, మువ్వా సాంబశివరావు, రౌతు గోపి, దేశెట్టి అనంతరామయ్య, జనార్థన్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో టీడీపీ కుటుంబాలు చేరిక పిడుగురాళ్ల : వైఎస్సార్ సీపీలోకి టీడీపీకి చెందిన పలు కుటుంబాల వారు చేరారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి పోలుబోయిన అనిల్కుమార్ యాదవ్, గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డిల ఆధ్వర్యంలో దాచేపల్లి నగర పంచాయితీలోని 8, 10 వ వార్డులోని టీడీపీకి చెందిన పలు కుటుంబ సభ్యులు చేరారు. టీడీపీ నాయకుల వైఖరితో విసుగు చెంది ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధ్ది, గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీడీపీని వీడి వైఎస్సార్ సీపీ పార్టీలోకి దాచేపల్లి మున్సిపల్ ౖచైర్మన్ కొప్పుల సుబ్బయమ్మ భర్త సాంబయ్య ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో గొట్టిముక్కల విజయరాజు, గొట్టిముక్కల సువర్ణరాజు, తాటిమళ్ల నాగేశ్వరరావు, తాటిమళ్ల రమేష్, దాస్ మైకేల్, కోడిరెక్క గోవర్ధన్, కలుకూరు నాగేశ్వరరావు, కలుకూరి దేవి, పాముల సామేలులుతోపాటు పలువురు పార్టీలో చేరారు. వీరందరికి ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి, నర్సరావుపేట ఎంపీ అభ్యర్ధి అనిల్కుమార్ యాదవ్లు వైఎస్సార్ కాంగ్రె్స్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దాచేపల్లి మున్సిపల్ ఛైర్మన్ కొప్పుల సుబ్బమ్మ భర్త సాంబయ్య, డాక్టర్ అశోక్కుమార్, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేర్వేరు ప్రాంతాల్లో ప్రతిపక్షాలను వీడి.... పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన నేతలు -
ఎన్నికల్లో ిపీఆర్కేను దీవించండి
ిపీఆర్కే మాతృమూర్తి రాములమ్మ దుర్గి : ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తున్న కుమారుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రానున్న ఎన్నికల్లో మద్దతు తెలిపి ఆశీర్వదించాలని ిపీఆర్కే మాతృమూర్తి రాములమ్మ కోరారు. గురువారం మండలంలోని రాజానగర్, గజాపురం, నిదానంపాడు, ఓబులేశునిపల్లె గ్రామాలలో ఆమె కుమార్తె జవ్వాజి నాగమణితో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీనిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులందుకుని ఆయా గ్రామాల్లో గడపగడపకు వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థ్ధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజక వర్గ ప్రజలను తన కుటుంబంలా భావించి ప్రజా సమస్యల పట్ల అనునిత్యం పరిష్కార దిశగా పనిచేస్తూ ప్రజల హృదయాల్లో కొలువై ఉన్న కుమారుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వారి వెంట పార్టీ మండల కన్వీనర్ ఉన్నం పెద్దబ్బాయ్, వైస్ ఎంపీపీ చల్లా శ్రీనివాసరావు, రెంటచింతల ఎంపీపీ సంపూర్ణమ్మ, సర్పంచ్లు నలబోతు చిన్నబ్బాయి, మమ్ము శివ రామకృష్ణ, నాలి రామయ్య, షేక్ హుస్సేన్, గుండాల వెంకట్రామయ్య, జక్కా రమేష్, శ్రీహరిరెడ్డి, కోమటి నాయక్, రాయల మధు, నాగెండ్ల లక్ష్మినారాయణ, చిల్లంచర్ల్ల కృష్ణ, పలువురు మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నేడు కారెంపూడిలో.. కారెంపూడి: మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్ధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (పీఆర్కే) అమ్మ పిన్నెల్లి రాములమ్మ, పీఆర్కే చెల్లి జవ్వాజి నాగమణి కారెంపూడిలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి ఎన్నికల ప్రచార జరుగుతుందని పేర్కొన్నారు. పార్టీ కేడర్, నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో పాల్గొనవల్సిందిగా వెంకటరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. -
గ్రామాలు సమస్యాత్మకం కాకూడదు
నాదెండ్ల: మండలంలోని పలు సమస్యాత్మక గ్రామాల్లో ఎస్పీ బిందు మాధవ్ పర్యటించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. అమీన్సాహెబ్పాలెం, సాతులూ రు, కనపర్రు, చందవరం, గొరిజవోలు గ్రామాల్లో స్పెషల్ బ్రాంచి సీఐ ప్రభాకర్, రూరల్ సీఐ శ్రీనివాస రెడ్డి, సిబ్బందితో కలిసి పోలింగ్ బూత్లు పరిశీలించారు. అమీన్ సాహెబ్పాలెం గ్రామంలో 2014లో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిన ఇరువురు మృతి చెందిన సంఘటన విదితమే. గతంలో సాతులూరు గ్రామంలో ఓ పోలింగ్ బూత్లో బాంబులు వేసిన ఘటనలు ఉన్నాయి. కనపర్రు గ్రామంలో బ్యాలెట్ పత్రాలు గల్లంతు, అదే గ్రామంలో నకిలీ పీవో, ఏపీవోలు పట్టుబడిన సంఘటనలున్నాయి. గొరిజవోలు, చందవరం గ్రామాల్లో ఎన్నికల సమయంలో ఘర్షణలు జరిగిన నేపథ్యంలో ఈ గ్రామాల్లో పర్యటించారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ఈ గ్రామాల్లో స్పెషల్ బలగాలను మోహరించనున్నట్లు చెప్పారు. అన్ని పార్టీల శ్రేణులు ప్రశాంతంగా ఓటింగ్ జరిగేందుకు సహకరించాలని కోరారు. ఆయనతో పాటూ ఎస్సై జె.బలరామ్రెడ్డి ఉన్నారు. ఎస్పీ బిందు మాధవ్ వేర్వేరు గ్రామాల్లో గ్రామస్తులతో భేటీ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన -
వైఎస్సార్సీపీ గెలుపునకు ముదిరాజులు కృషి చేయాలి
ఆంధ్రప్రదేశ్ ముదిరాజుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణ ముదిరాజ్ పిడుగురాళ్ల రూరల్ : వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ గెలుపుకు ముదిరాజులు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముదిరాజుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణ ముదిరాజ్ అన్నారు. మండలంలోని కామేపల్లి గ్రామంలో గురువారం ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలను గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించింది ఏకై క వ్యక్తి సీఎం జగన్మోహన్రెడ్డి అన్నారు. ముదిరాజులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్కు దక్కుతుందన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. ముదిరాజుల సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించి విడుదల రజినికి మంత్రి పదవి ఇవ్వడంతోపాటు, బీసీ మెంబర్గా పదవి ఇచ్చారన్నారు. గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్కుమార్ యాదవ్లను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ముదిరాజుల సోదరులు పాల్గొన్నారు. -
ముగిసిన వసంత నవరాత్రోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో నిర్వహిస్తున్న వసంత నవరాత్రోత్సవాలు గురువారంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతి నిత్యం అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. చివరి రోజు అమ్మవారికి అన్ని రకాల పుష్పాలతో అర్చన చేశారు. దేవస్థాన యాగశాలలో మహా పూర్ణాహుతితో ఉత్సవాలు లాంఛనంగా ముగిసాయి. అమ్మవారికి అర్చన నిర్వహించే పుష్పాలతో ఆలయ ఈవో కెఎస్.రామరావు దంపతులు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఏఈవో రమేష్బాబు, ఇతర అధికారులు ఊరేగింపుగా వేదిక వద్దకు చేరుకున్నారు. పుష్పార్చన వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. భక్తులకు పుష్పాలను పంపిణీ చేశారు. యాగశాలలో ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు యజ్ఞనారాయణ మూర్తి, రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి పర్యవేక్షణలో పూర్ణాహుతి నిర్వహించారు. -
ఈ ఎన్నికలు నా పనితీరుకు రెఫరెండం
సత్తెనపల్లి: నియోజకవర్గంలో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి 20,876 ఓట్ల మెజారిటీతో గెలుపొందాను. ఈసారి ఈ మెజార్టీ కన్నా ఒక్క ఓటు తగ్గినా నాది నైతిక పరాజయంగానే భావిస్తానని వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి అసెంబ్లీ అభ్యర్థి అంబటి రాంబాబు అన్నారు. ఈనెల 24వ తేదీన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ అభ్యర్థిగా మూడోసారి నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో గురువారం మెగా బైక్ ర్యాలీ నిర్వహించారు. సత్తెనపల్లి పట్టణం నుంచి ప్రారంభమైన ర్యాలీ సత్తెనపల్లి రూరల్, రాజుపాలెం, నకరికల్లు, ముప్పాళ్ల మండలాల మీదుగా సత్తెనపల్లి పట్టణానికి చేరుకుంది. అనంతరం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాంబాబు మాట్లాడుతూ ఈ నెలలో నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం రోడ్ షో నిర్వహించిన తర్వాత మా కాన్ఫిడెన్న్స్ లెవెల్ పెరిగిందన్నారు. ఆ రోజు జన సునామీ కనిపించిందన్నారు. ఆ విశ్వాసంతోనే ఈనెల 24వ తేదీన నిర్వహించనున్న నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని నాయకులకు పిలుపునిచ్చేందుకు నియోజకవర్గస్థాయిలో మెగా బైక్ ర్యాలీ నిర్వహించామన్నారు. దీనికి నేను ఊహించని రీతిలో విశేష జన స్పందన లభించిందన్నారు. స్వచ్ఛందంగా కార్యకర్తలు వారి ద్విచక్ర వాహనాలతో మమ్మల్ని వెన్నంటి అండగా నిలబడటం స్ఫూర్తిదాయకమన్నారు. నియోజకవర్గంలో అధికారం కోసం, అవసరాల కోసం పార్టీలు మారిన వారికి ...పార్టీని నమ్ముకున్న వారికి మధ్య జరుగుతున్న బ్యాలెట్ పోరు ఇది అన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో నాపైన, నరసరావుపేట పార్లమెంటులో డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్పైన పోటీ చేస్తున్న వారు ఎవరో మీకు తెలుసన్నారు. విశ్వాసపాత్రులను గెలిపించి విశ్వాస ఘాతకులను ఓడించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఒక ఛానల్ ఇంటర్వ్యూలో నేను మాట్లాడిన మాటలను ప్రతిపక్ష నాయకులు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికలకు ఈ ఐదేళ్లలో నియోజవర్గంలో నా పనితీరుకు రెఫరెండంగా భావిస్తున్నానని స్పష్టం చేశారు. మెగా బైక్ ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ గీతా హాసంతి, జిల్లా గ్రంథా లయ సంస్థ మాజీ చైర్మన్ చిట్టా విజయభాస్కర్రెడ్డి, పల్నాడు జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు అచ్యుత శివప్రసాద్, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ సీపీ అనుబంధ సంఘాల బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు. గత మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా .. నాది నైతిక పరాజయమే సీఎం జగన్మోహన్రెడ్డి పర్యటన తర్వాత ఆత్మవిశ్వాసం పెరిగింది పార్టీలు మారిన వారికి, పార్టీని నమ్ముకున్న వారికి మధ్య పోరు ఇది వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి అసెంబ్లీ అభ్యర్థి అంబటి రాంబాబు -
వినుకొండలో నిలువునా చీలిన జనసేన
సాక్షి, నరసరావుపేట : పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన నాయకులు సహకరించడం లేదు. దీంతో టీడీపీ నేతలు తలలుపట్టుకుంటున్నారు. చేసేది లేక ఆ పార్టీ అభ్యర్థులు బుజ్జగింపుల పర్వాలకు తెరలేపారు. పల్నాడు జిల్లాలో ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా అన్నిచోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే పోటీలో నిలుస్తున్నారు. దీంతో జనసేన, బీజేపీ నేతలు అసంతృప్తిలో ఉన్నారు. జిల్లాలో కనీసం ఒక్క సీటు అయినా కేటాయించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేతలను గెలిపిస్తే మా భవిష్యత్ గ్యారెంటీ ఏంటని కొంతమంది ప్రశ్నిస్తుండగా, ఓడిపోయే అభ్యర్థుల కోసం తాము పోరాడాల్సిన అవసరం ఏంటని మరికొందరు భావిస్తున్నారు. దీంతో కూటమి ప్రచారాలలో టీడీపీ క్యాడరే మాత్రమే కనిపిస్తోంది. పొత్తు ధర్మంలో భాగంగా దేశం నేతలు మూడు పార్టీల కండువాలు మెడలో వేసుకోవడంతోపాటు కార్యకర్తల చేత మూడు పార్టీల జెండాలు మోయిస్తున్నారు. పక్క పార్టీల జెండాలు మోసే దుస్థితి పట్ల తెలుగు తమ్ముళ్లు అసహనంలో ఉన్నారు. ఆ పార్టీలతో పొత్తు వల్ల టీడీపీకి ఉపయోగం కన్నా నష్టమే ఎక్కువని వాపోతున్నారు. అసంతృప్తిలో జనసేన నాయకులు జనసేన పార్టీ నరసరావుపేట ఇన్చార్జి సయ్యద్ జిలానీ తనకు పొత్తులో భాగంగా పేటలో పోటీ చేసే అవకాశం వస్తుందని బాగా ప్రచారం చేసుకున్నారు. నియోజకవర్గంలో ముఖ్య నాయకుల ఇళ్లకు వెళ్లి సహకరించమని కోరారు. తీరా సీటు టీడీపీ నేత చదలవాడ అరవింద్బాబుకు కేటాయించడంతో జిలానీ కొన్ని రోజులు ఎవరికి అందుబాటులో లేకుండాపోయారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న జనసేన కార్యాలయం ఫ్లెక్సీలను తొలగించి తాత్కాలికంగా మూసేశాారు. తరువాత ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయులు రహస్యమంతనాలు జరపడంతో మొక్కుబడిగా ప్రచారాలకు హాజరవుతున్నారు. మరోవైపు సత్తెనపల్లి నుంచి పోటీ చేయాలని చూసిన జనసేన నేత బొర్రా వెంకటఅప్పారావు శుక్రవారం పార్టీకి రాజీనామాకు చేశారు. టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణను ఓడించి తీరుతానని తన అనుచరులతో వ్యాఖ్యానించారట. ప్రాధాన్యత ఇవ్వడంలేదు.. పెదకూరపాడు కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్కు సహకరించేది లేదని రెండు వారాల క్రితమే జనసేన, బీజేపీ నేతలు తేల్చి చెప్పారు. పొత్తులో తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానిస్తున్నారని వాపోతున్నారు. మరోవైపు గురజాలలో యరపతినేనికి టికెట్ ఇవ్వడం పట్ల ఆగ్రహంతో జనసేన ముఖ్యనేతలు ఇటీవల వైఎస్సార్సీపీలోకి వెళ్లారు. మాచర్ల, చిలకలకూరిపేట నియోజకవర్గాలలోనూ నెలకొంది. క్షేత్రస్థాయి కార్యకర్తల అభిష్టానికి వ్యతిరేకంగా టీడీపీతో పొత్తుపెట్టుకోవడం, ఒక్కసీటు కూడా కేటాయించకపోవడం పట్ల బీజేపీ నేతలు తీవ్ర అసహనంలో ఉన్నారు. కూటమి ప్రచారాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో టీడీపీ నేతలు పొత్తు వల్ల ఒరిగిందేమి లేదని వాపోతున్నారు. ఆ రెండు పార్టీలకు పల్నాడులో ఒక్క సీటు కేటాయించని టీడీపీ జనసేన పార్టీకి సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి బొర్రా రాజీనామా నరసరావుపేటలో జనసేన పార్టీ కార్యాలయం మూసివేత భాష్యం ప్రవీణ్కి సహకరించబోమని తేల్చిచెప్పిన పెదకూరపాడు బీజేపీ, జనసేన నేతలు రెండుగా విడిపోయిన వినుకొండ జనసేన నేతలు కూటమి పార్టీ నేతల తీరుతో తలలుపట్టుకుంటున్న టీడీపీ నేతలురాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా రెండు జనసేన కార్యాలయాలు వినుకొండలో నడుస్తున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి నిశ్శంకరావు శ్రీనివాసరావు పార్టీలో క్రియాశీలక నాయకుడిగా ఎదుగుతున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అతనికి పోటీగా కొణిజేటి నాగశ్రీనుని తెరమీదకు తీసుకొచ్చారనేది ఆ పార్టీ నాయకుల్లో నడుస్తున్న చర్చ. జనసేన రెండు పార్టీలుగా విడిపోవడానికే మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుదే కారణమని కాపు నాయకులే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. దీంతో జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా టీడీపీకి ఎంతవరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. -
కలెక్టరేట్లో వ్యయ విభాగాల పరిశీలన
నరసరావుపేట: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గానికి వ్యయ పరిశీలకులుగా నియమించబడిన సుమీత్ కుమార్, అసెంబ్లీ నియోజకవర్గాలకు నియమించబడిన గౌతమన్ గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి ఎల్.శివశంకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల వ్యయ పరిశీలకుల విభాగం, కమాండ్ కంట్రోల్ సెంటర్, మీడియా సెంటర్ను తనిఖీ చేశారు. పలు రికార్డుల్ని పరిశీలించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ రూం సిబ్బందికి, వ్యయ పరిశీలక విభాగ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. యార్డులో 88,176 బస్తాల మిర్చి కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు గురువారం 88,176 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 83,908 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.8,000 నుంచి రూ. 17,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.8,000 నుంచి 19,300 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.11,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 68,946 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు ఇన్చార్జి కార్యదర్శి కాకుమాను శ్రీనివాసరావు తెలిపారు.హనుమజ్జయంతి ఏర్పాట్లకు శ్రీకారం హనుమాన్జంక్షన్రూరల్: కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లోని ప్రసిద్ధ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ఏటా వైభవంగా నిర్వ హించే హనుమజ్జయంతి ఉత్సవాల ఏర్పాట్లకు గురువారం శ్రీకారం చుట్టారు. ఉత్సవాల ఏర్పాట్లను దేవస్థానం ప్రాంగణంలో రాటా ఉత్సవంతో ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకుడు మారేపల్లి సీతారామానుజాచార్యు లు, అర్చకుడు శృంగారం వెంకట శేషారామానుజాచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉత్సవ పందిరి ఏర్పాటుకు రాటా కర్ర ను ప్రతిష్టించారు. హనుమజ్జయంతి ఉత్సవాలను మే 27వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కూచిపూడి శ్రీనివాస్ తెలిపారు. దెందులూరు ఏఎంసీ చైర్మన్ అప్పక కనకదుర్గాప్రసాద్, ఆలయ పాలకమండలి మాజీ చైర్మన్లు నెరుసు భూషణం, కొండేటి కనకదుర్గారావు, పుర ప్రముఖులు సుంకర సుభాష్చంద్రబోస్, నండూరు సత్య వెంకటేశ్వర శర్మ, మేడేపూ డి రామ్మోహనరావు, తాడి రంగారావు పాల్గొ న్నారు. నిత్యాన్నదానానికి రూ.10 లక్షల విరాళం మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కృష్ణాజిల్లా మోపిదేవిలోని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో నిర్వహించే నితాతత్యాన్నదానానికి విజయవాడకు చెందిన కేతినేని రత్నాకరరావు, లక్ష్మీ శమంతకమణి దంపతులు రూ.10 లక్షలు విరాళంగా సమర్పించారు. గురువారం ఉదయం స్వామివార్లను దర్శించుకున్న అనంతరం శాశ్వత నిత్యాన్నదాన పథకం కింద ఈ విరాళాన్ని ఆలయ ఏసీ ఎన్ఎస్ చక్రధరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. దాత కుటుంబ సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. నిమ్మకాయల ధరలు తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.4,500, గరిష్ట ధర రూ.6,400, మోడల్ ధర రూ.5,500 వరకు పలికింది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
చెత్త అంపైరింగ్.. డుప్లెసిస్ది క్లియర్గా నాటౌట్! వీడియో
చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..!
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement