-
అనుమానం ఉందని ఎన్నికలపై ఆదేశాలివ్వలేం
న్యూఢిల్లీ: ఈవీఎంల పనితీరుపై అనుమానం ఉందనో, వాటిని నియంత్రణలోకి తీసుకుని ఫలితాలను తలకిందులు చేయొచ్చనే ఆరోపణలతోనో ఎన్నికల ప్రక్రియను నియంత్రించలేమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈవీఎంలో ‘మార్పులు’ చేసే ఆస్కారం ఉందని, అందుకే బ్యాలెట్ పేపర్ విధానమే ఉత్తమం అని వాదించే వారి ఆలోచనను మార్చలేమని కోర్టు వ్యాఖ్యానించింది.ఈవీఎంలో నమోదయ్యే ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చాలంటూ దాఖలైన పలు పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తాల సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషన్దారులు లేవనెత్తిన ప్రశ్నలపై తమ అనుమానాలను నివృత్తిచేసుకునేందుకు జడ్జీలు మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం అధికారి నితేశ్ వ్యాస్ను కోర్టుకు రప్పించి ఐదు ప్రశ్నలు సంధించారు. మైక్రోకంట్రోలర్లను ఎక్కడ బిగిస్తారు? వాటి ప్రోగ్రామ్ను మళ్లీ మార్చొచ్చా? అంటూ ప్రశ్నలు అడిగారు.బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్, కంట్రోల్ యూనిట్లలో మైక్రోకంట్రోలర్లను బిగిస్తామని, వాటి పోగ్రామ్ను సరిచేసేందుకు ఎవరైనా ఓపెన్ చేస్తే పనిచేయకుండాపోతాయని వ్యాస్ వివరణఇచ్చారు. ఈ వివరణతో అసిసోయేషన్ ఫర్ డెమొక్రట్రిక్ రిఫారŠమ్స్ తరఫు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విభేదించారు. ఎన్నికల గుర్తులను అప్లోడ్ చేసేటపుడు తప్పుడు ప్రోగామ్ను అప్లోడ్ చేసే ఆస్కారముందని వాదించారు. దీనిపై జడ్జీ దత్తా కలి్పంచుకుని.. ‘ మీ ఆలోచనలను మేం మార్చలేం. ఈసీ వంటి రాజ్యాంగబద్ధ సంస్థను నియంత్రించలేం’’ అని వ్యాఖ్యానించారు. ఈవీఎంల సోర్స్ కోడ్ను బహిర్గతంచేయాలని మరో పిటిషనర్ తరఫు న్యాయవాది సంతోశ్ వాదించగా కుదరదని జడ్జీ తిరస్కరించారు. -
Supreme Court of India: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా జరగాలి
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా జరగాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా నిర్వహించడానికి తీసుకున్న చర్యలను వివరించాలని ఎన్నికల సంఘానికి సూచించింది. ఎన్నికల విధానంలో పవిత్రత ఉండాలని, ఎటువంటి అనుమానాలు, అపోహలకు ఆస్కారం ఉండొద్దని పేర్కొంది. ఎన్నికల వ్యవస్థలో ఓటర్ల సంతృప్తి, విశ్వాసం అనేవి చాలా ముఖ్యమని వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎంలు) నమోదైన ఓట్లను వీవీ ప్యాట్ స్లిప్పులతో క్రాస్–వెరిఫికేషన్ చేయాలని కోరుతూ అసోసియేసన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్)తోపాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఏడీఆర్ తరపున సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఈవీఎంలు, వీవీప్యాట్లపై అనుమానాలు వ్యక్తం చేశారు. ధర్మాసనం స్పందిస్తూ.. అన్నింటికీ అనుమానించవద్దని సూచించింది. పిటిషన్లపై తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. -
ఆ లేఖ రాయటం తప్పు కాదు...
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: న్యాయమూర్తులపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులతో స్వతంత్ర విచారణ జరిపించాలని, ఆరోపణలు ప్రజల్లోకి వెళితేనే చర్యలకు వీలుంటుందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అభిప్రాయపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయటంలో కానీ, ఆ లేఖను బయటపెట్టడంలో కానీ ఎలాంటి తప్పూ లేదని చెప్పారాయన. అభిశంసన లాంటి అవసరం వస్తే... ఆరోపణల గురించి తెలిస్తేనే కదా పార్లమెంటు సభ్యులు ముందుకొస్తారని వ్యాఖ్యానించారు. ప్రజల గొంతు నొక్కేయడం ద్వారా న్యాయ వ్యవస్థలో విశ్వసనీయత నిలబడదని స్పష్టంచేశారు. తాజా వ్యవహారంపై ప్రధాన న్యాయమూర్తి తప్పనిసరిగా విచారణ జరుపుతారని తాను భావిస్తున్నట్లు చెప్పారాయన. అమరావతి ల్యాండ్ స్కామ్ ఎఫ్ఐఆర్పై హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వటాన్ని తప్పుపట్టిన ప్రశాంత్ భూషణ్... పలు అంశాలపై ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు చెప్పారు. ముఖ్యాంశాలివీ.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ రాయటం తప్పంటారా? నేనైతే తప్పనుకోవటం లేదు. ఎందుకంటే సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయమూర్తి, వచ్చే ఏప్రిల్లో ప్రధాన న్యాయమూర్తి కాబోతున్న వారిపై చేసిన ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ప్రధాన న్యాయమూర్తి తగిన వారు కనుక వారికే లేఖ రాయాలి. ఇంతటి తీవ్రమైన ఆరోపణలొచ్చినప్పుడు ప్రధాన న్యాయమూర్తి తప్పకుండా విచారణ జరపాలి. అత్యంత నిజాయితీ పరులుగా పేరున్న రిటైర్డ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో ఒక స్వతంత్ర కమిటీ వేసి విశ్వసనీయమైన విచారణ జరిపించాలి.. ఈ లేఖను ఏపీ ప్రభుత్వం బహిరంగం చేసింది కదా! ఇది తప్పంటారా? అసలు న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై ఆరోపణలొచ్చినప్పుడు వాటిని రహస్యంగా ఉంచాలా? అలాంటిదేమీ లేదు. ఆరోపణలొచ్చింది న్యాయమూర్తులపై కదా అని వేరేగా చూడకూడదు. వేరేవాళ్లపై ఆరోపణలొచ్చినప్పుడు ఎలా చూస్తామో.. దీన్నీ అలాగే చూడాలన్నది నా అభిప్రాయం. ప్రజలకు దాన్ని తెలియకుండా ఉంచాలనటానికి ఎలాంటి కారణమూ లేదు. రహస్యంగా ఉంచాలనుకోవడమంటే.. తొక్కి పట్టడమే. ఒకవేళ దాన్ని రహస్యంగా ఉంచితే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గానీ, పార్లమెంటు సభ్యులు గానీ దానిపై ఏమీ చేయలేరు. అంటే లేఖలోని విషయాలు బయటకు రాకపోతే చర్యలు తీసుకోలేరా? దీనిపై రెండు రకాలుగా చర్యలు తీసుకోవచ్చు. ఒకటి.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో అంతర్గత కమిటీ ద్వారా విచారణ జరపడం. రెండోది అభిశంసన. మరి అభిశంసన విషయానికొస్తే దాన్లో పార్లమెంటు సభ్యుల పాత్ర ఉంటుంది. విషయం ప్రజల్లోకి రానప్పుడు పార్లమెంటు సభ్యులు కూడా అభిశంసన తీర్మానంపై సంతకం చేసేందుకు ముందుకు రారు. తాము ఏదో చేయాలనే అభిప్రాయానికి రానిపక్షంలో.. కాబోయే సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తికి ఇబ్బంది తెచ్చిపెట్టాలని ఎవరూ అనుకోరు కదా!. కొందరైతే ఇలా న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడాన్ని కోర్టు ధిక్కరణగా వ్యాఖ్యానిస్తున్నారు. అత్యున్నతస్థాయి వ్యక్తులపై ఆరోపణలొస్తే అసలెలా పరిష్కరించాలి? ఆరోపణలు చేయటమంటే కోర్టును అపకీర్తి పాలు చేయడమనే వ్యాఖ్యలు కొందరు చేస్తుంటారు. ఇది పురాతన చట్టం. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇలాగే ఉంది. వలస పాలన నాటి సంప్రదాయాన్ని కొనసాగించేందుకు తగిన కారణాలైతే ఏమీ లేవు. చక్రవర్తుల కాలంలోనైతే న్యాయమూర్తుల్ని రాజుల ప్రతినిధులుగా పరిగణించేవారు. న్యాయవ్యవస్థలోని అవినీతిపై ప్రజల నోళ్లు నొక్కేయడం ద్వారా న్యాయవ్యవస్థలో ఉన్న వారి విశ్వసనీయతను కాపాడలేం. న్యాయవ్యవస్థలోని అవినీతి లేదా ఇతర అంశాలపై కూడా చర్చించేందుకు ప్రజలకు స్వేచ్ఛ ఉండాలి. అమరావతి భూకుంభకోణంలో ఎఫ్ఐఆర్ను మీడియా రిపోర్ట్ చేయకుండా ఏపీ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం, దర్యాప్తు నిలిపివేయటంపై ఏమంటారు? ఎఫ్ఐఆర్ను రిపోర్ట్చేయకుండా మీడియాపై గ్యాగ్ ఆర్డర్ జారీచేయడం హైకోర్టు పనికాదు. ఇలాంటి చర్యలన్నీ భావ ప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకం. సమాచారం తెలుసుకునే ప్రజల హక్కుకు వ్యతిరేకం. ఏం జరుగుతోందో తెలుసుకునే అవసరం ప్రజలకుంది. అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తులపై ఆరోపణలొచ్చినప్పుడు దర్యాప్తు జరగాలా... వద్దా? తప్పనిసరిగా జరగాలి. అవినీతి, లేదా ఇతరత్రా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలొస్తే తప్పకుండా దర్యాప్తు జరగాల్సిందే. ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన ప్రకారం అమరావతి భూకుంభకోణంలో దర్యాప్తు జరపాలి. అలా చేయొద్దనటానికి కారణమేమీ లేదు. దర్యాప్తు నిలిపివేయాల్సిన అవసరమూ లేదు. న్యాయవ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనానికి ఎలాంటి వ్యవస్థ ఉండాలంటారు? న్యాయ వ్యవస్థపై ఫిర్యాదులకు జ్యుడీషియల్ కంప్లయింట్ కమిషన్ అవసరం. న్యాయమూర్తులపై ఎవరికి ఫిర్యాదు చేయాలన్న అంశాన్ని స్పష్టం చేయాలి. కమిషన్లో కనీసం ఐదుగురు సభ్యులుండాలి. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు గానీ, ఇతరులు గానీ ఉండాలి. కానీ న్యాయ వ్యవస్థ నుంచి, ప్రభుత్వం నుంచి స్వతంత్రంగా ఉండాలి. ఎంపిక విషయంలో కూడా ప్రభుత్వం, న్యాయవ్యవస్థ పెత్తనం ఉండకుండా చూడాలి. ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తులపై స్వతంత్ర విచారణ జరిగేలా ఉండాలి. విచారణ అనంతరం తొలగింపు లేదా ఏ ఇతర సిఫారసులైనా పార్లమెంటుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాలి. ఏపీ హైకోర్టు నిష్పాక్షికంగా వ్యవహరించాలన్న ముఖ్యమంత్రి విజ్ఞాపనకు ఎలాంటి పరిష్కారం ఉండాలని భావిస్తున్నారు? ప్రధాన న్యాయమూర్తి దాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారు. ఈ వ్యవహారంలో రాజ్యాంగం ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులతో విచారణ జరిపించాలి. సుప్రీం కోర్టు ప్రవర్తన నియమావళి ప్రకారం సిట్టింగ్ న్యాయమూర్తులతోనే విచారణ జరిపించాలి. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తి సీనియర్. ఆయనకంటే జూనియర్ న్యాయమూర్తులతో విచారణ జరిపిస్తే.. వారు స్వతంత్రంగా విచారణ జరపలేరేమోనన్నదే నా అభిప్రాయం. అందుకని ముగ్గురు రిటైర్డ్ న్యాయమూర్తులతో విచారణ జరిపించడం అవసరం. -
నైతిక సంక్షోభంలో ‘న్యాయం’
భారత పౌరహక్కుల న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కార నేరానికి పాల్పడ్డారన్న అభియోగంపై శిక్షించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించడం– ప్రజల పౌర, రాజకీయ హక్కుల రక్షణకు గ్యారంటీ పడుతూ అంతర్జాతీయ కన్వెన్షన్ ప్రకటించిన భావ ప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధం. కోర్టు ధిక్కార నేరం మోపడానికి రూపొందిం చిన ప్రమాణాలను తక్షణం సమీక్షించాలని కోరిన 1800 మంది భారత న్యాయవాదులతో ఏకీభవిస్తూ అంతర్జా తీయ న్యాయవాదులు, న్యాయ శాస్త్రవేత్తలు, న్యాయమూర్తుల కన్వెన్షన్ సంయుక్త ప్రకటన విడుదల చేసింది. (1–9–2020) ‘సుప్రీంకోర్టుపై తాను అపనిందలు వేశానన్న మిషపైన కోర్టు (జస్టిస్ అరుణ్ మిశ్రా) నాకు ఒక రూపాయి జరిమానా విధించారు. అలాగే నేను కోర్టును క్షమాపణ వేడుకోనందుకూ విమర్శించారు. కానీ, ఆత్మగౌరవం, దాన్ని కాపాడుకోచూసే ఆత్మచైతన్యం, సత్యాన్ని సదా ప్రేమించే ఏ వ్యక్తికైనా రక్షణ కవచాలు కనుకనే తాను రూపాయి జరి మానాను చెల్లించలేద’ని ది హిందూ పత్రిక ప్రత్యేక ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ప్రశాంత్ భూషణ్ జవాబిచ్చారు (7–9–2020) అంటే దీనర్థం ఆ ఒక్క రూపాయి జరిమానాను ప్రశాంత్ భూషణ్ న్యాయవాది దావే చెల్లించి ఉంటారు. పౌరహక్కులకు, సభా హక్కు లకు, పౌరుల భావప్రకటనా స్వేచ్ఛకు హామీపడిన భారత రాజ్యాంగం మౌలిక సూత్రాలకు, వాటిని తు.చ. తప్పకుండా దేశపాలకులు, శాసన కర్తలు ఆచరించడానికి నిర్దేశించిన పౌర ధర్మాల అధ్యాయానికి (డ్యూటీస్ చాప్టర్) విధిగా కట్టుబడి ఉండాల్సిన అవసరాన్ని గుర్తించిన విశిష్ట న్యాయవాది, ప్రజాస్వామ్యవాది భూషణ్. అందుకే పౌరుల విమర్శనా హక్కునే నొక్కి వేయడానికి ‘క్రిమినల్ కంటెంప్ట్ లా’ను న్యాయస్థానాలు వినియోగించడాన్ని ప్రజలముందు అదే న్యాయ స్థానాల ముందు ప్రశాంత్ భూషణ్ కడిగివేయవలసి వచ్చింది. కోర్టుల పరువు ప్రతిష్టలన్నవి న్యాయస్థానాలు వెలువరించే తీర్పులపైన వాటిని అమలు జరిపించే తీరుతెన్నులపైన మాత్రమే ఆధారపడి ఉంటాయిగానీ ప్రజల స్పందనపైన, రియాక్షన్ పైన ఆధారపడి ఉండవు అని ప్రశాంత్ భూషణ్ భావన. అందుకే కనీసం గత మూడు దశాబ్దాల కాలంలో పాలక రాజకీయ వ్యవస్థలో మాదిరే శాసన న్యాయవ్యవస్థా చట్రంలో కూడా.. ప్రజాబాహుళ్యం స్వాతంత్య్ర పోరాటాలలో అనుపమ త్యాగాల ద్వారా సాధించుకున్న మంచి ఫలి తాలు కూడా తారుమారవుతూ వచ్చాయి. చివరికి కనీసం 1997లో ప్రధాన న్యాయమూర్తులు సహా 22 మంది న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థ పనితీరును, న్యాయమూర్తుల ప్రవర్తనను నిర్దేశిస్తూ జాతీయ స్థాయిలో ఒక విశిష్టమైన తీర్మానాన్ని కన్వెన్షన్లో ఏకగ్రీవంగా ఆమో దించారన్న సంగతి జాతీయ, రాష్ట్రాల స్థాయిలో న్యాయ వ్యవస్థలు నిర్వహించే పెద్దలు ఇప్పటికైనా గుర్తించాలి. రాజకీయ ఆర్థిక, సామా జిక ప్రలోభాలకు లోనుకాకుండా నడుచుకోవాలన్న 1997 నేషనల్ కన్వెన్షన్ ఆదేశిక సూత్రాలను తప్పకుండా పాటించాలి. కానీ న్యాయపాలనా జీవిత విలువల పునరుద్ధరణ గురించి ఆ కన్వెన్షన్ నెలకొల్పిన సూత్రాలను న్యాయవ్యవస్థ నిర్వాహకులు పెక్కు మంది పాటించకపోవడం వల్ల గత పాతికేళ్లకు పైగా జరుగుతున్న అక్రమాలకు, అన్యాయాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అలాగని మన న్యాయవ్యవస్థలో రాజకీయ ప్రలోభాలకు లోను కాకుం డానే పెక్కు తీర్పులు చెప్పిన న్యాయమూర్తులూ లేకపోలేదు. 22 మంది న్యాయమూర్తుల చేవ్రాళ్లతో ఆమోదం పొందిన ఆ కన్వెన్షన్ తీర్మానంలో న్యాయమూర్తులకు కీలకమైన 16 నిబంధనలు విధిం చారు. వాటిలో ప్రధానమైనవి.. న్యాయపాలనా జీవితంలో న్యాయ మూర్తులు.. న్యాయస్థానంలో కూర్చున్న న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థలో ప్రజలకు విశ్వాసం కలిగేలా ప్రవర్తించాలని, అదే కోర్టు ఆవరణలో బంధువులతో, తన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సున్నితంగా వ్యవహరించరాదని, తనకు సన్నిహిత బంధువులు, స్నేహితులకు సంబంధించిన కేసులు వినరాదని నిర్దేశించడం జరి గింది. ఎలాంటి బయటి రాజకీయ ప్రలోభాలకు, లోపాయకారీ ఒత్తి ళ్లకూ లొంగరాదనీ, ఏ కంపెనీలలోనూ షేర్లు, స్టాక్ మార్కెట్ లావా దేవీలతో ఎలాంటి సంబంధం ఉండరాదని నేషనల్ కన్వెన్షన్ నిర్దేశిం చింది. ఈ నిబంధనల తీర్మానాలకే ‘న్యాయమూర్తుల జీవిత విలువల పునశ్చరణ’గా పేర్కొన్నారు. ఈ నైతిక విలువల పునరుద్ధరణకు నాటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వర్మ సూత్ర ప్రతిపాదకుడు. దీనర్థాన్ని వివరిస్తూ జస్టిస్ కృష్ణయ్యర్ స్వేచ్ఛ అంటే కేవలం స్వేచ్ఛ అని కాదు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడమని అర్థం కాదని కూడా అన్నారు. అయితే న్యాయవ్యవస్థలో నేడు అనేక రకాల ఉల్లం ఘనలకు కారణం రాజకీయ పాలనా వ్యవస్థల ప్రభావంతో కొన్ని న్యాయస్థానాల్లో (కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ) కొందరు ప్రలోభాలకు లోనవుతుండటమేనని మరికొందరి ఫిర్యాదులు. అసలు ఈ మాలోకానికి ప్రధాన కారణం ఎక్కడ గూడుకట్టుకుని ఉందో జస్టిస్ మార్టిన్ ఇలా కుండబద్ధలు కొట్టినట్టు చెప్పాడు. ‘అసలు మనం చెప్పుకునే స్వతంత్ర న్యాయవ్యవస్థ అనేది భ్రమా, వాస్తవమా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే, న్యాయమూర్తులు వర్గానికి సంబంధం లేకుండానే పాలకవర్గ సభ్యులుగానే వ్యవహరిస్తారు, ప్రభుత్వాల బాడుగ ఉద్యోగులవుతారు. చివరికి తీర్పులలో తమ నిర్ణ యాలను అమలు జరిపే ప్రభుత్వ పాలకుల నిరంకుశాధికారంపై ఆధారపడతారు. అందువల్ల న్యాయవ్యవస్థ సర్వ స్వతంత్ర శక్తిగా వ్యవహరిస్తూ స్వేచ్ఛగా ఉండాలని భావించడం అర్థం లేని విన్యాసం’. బహుశా ఈ కారణం రీత్యానే సుప్రసిద్ధ న్యాయ వ్యవహారాల ‘హిందూ’ పత్రిక విలేకరి వి. వెంకటేశన్ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ఇటీవల కొలువు చాలించుకున్న జస్టిస్ అరుణ్ మిశ్రా సుప్రీంలో అత్యంత పలుకుబడిగల జడ్జిగా ఎలా ఎదుగుతూ వచ్చారో ‘వైర్’ సంస్థకు అందించిన తాజా విశ్లేషణలో వెల్లడించాడు. తరచుగా జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్కే ఎందుకని రాజకీయంగా అత్యంత కీలక మైన కేసులు చేరుతూ వచ్చిందీ వివరిస్తూ ఈ విచిత్ర పరిణామాన్ని ప్రశ్నించేందుకే జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్లోకూర్, జస్టిస్ కురియన్ జోసఫ్ అప్పటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా తీరుపై ధ్వజమెత్తారు. ‘సుప్రీంలో ప్రతీ వ్యవహారం సవ్యంగా లేదు. ఉన్నత న్యాయస్థానంలో బయల్దేరిన ఈ లొసుగుల వల్ల దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడనుంది’ అని ప్రకటిం చారు. అలా జస్టిస్ చలమేశ్వర్ నిలబడినందుకే ఆ తరువాయి ఉన్నత స్థానానికి రావలసిన ఆయనను తగ్గించి, మరో జూనియర్ను ప్రమోట్ చేయటం లోకానికి తెలిసిన సత్యం. సీబీఐ స్పెషల్ జడ్జిగా బీహెచ్ లోయా అనుమానిత హత్య కేసు, బీజేపీ అగ్ర నాయకులలో ఒకరు షొరాబుద్దీన్–కౌసర్బీ హత్య కేసుల్లో నిందితులుగా ఉన్న సమయంలో ఎలాంటి విచారణ లేకుండానే ఒక బొంబాయి హైకోర్టు జడ్జి అవినీతి కారణంగా కేసుల్ని నిర్వీర్యపరిచారో పత్రికలన్నీ కోడై కూశాయని మరవరాదు. ఇలా ఎన్నో కేసులు కొందరు న్యాయమూర్తుల పాక్షిక రాజకీయాల మూలంగా కొలిక్కి రాకుండా వీగిపోతూ వచ్చాయన్నది ఒక బండనిజం. గుజరాత్లో మైనారిటీల హత్యాకాండ విషయంలో నాటి బీజేపీ గుజరాత్ పాల కులపై కేసులన్నీ నిర్వీర్యమైపోవడానికి న్యాయవ్యవస్థ చేతులను అటు కాంగ్రెస్ సహాయంతోనూ, ఇటు బీజేపీ పాలకుల జమానాలోనూ మెలిపెడుతూ రావడమే కారణం. ఒకసారి హైకోర్టు కొట్టివేసిన కేసును మరో కోర్టు తిరగతోడకూడదని రాజ్యాంగంలోని 20(2)వ అధికరణ నిషేధిస్తున్నా కొన్ని కోర్టులు ‘తూ.నా. బొడ్డు’గా భావించటం కూడా ఒక రివాజు అయిపోయింది. ఇక ఈ రాజకీయ–న్యాయస్థానాల మధ్య అతివేలంలో 2019లో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్న రంజన్ గొగోయ్పైన కోర్టు ఉద్యోగిగా ఉన్న మహిళ పెట్టిన వేధింపుల అభియోగం కథను ఎలా కంచికి నడిపించారో కూడా లోకానికి తెలుసు. అనంతరం అనేక కేసుల్లో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు వెలువడటం, రిటైర్మెంట్ తర్వాత ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కూడా రావడం విశేషమే. అలా పరస్పరం ‘వాయినాలు’ ఇచ్చి పుచ్చుకోవడం జయప్రదంగా ముగిశాయని మరవరాదు. కోర్టు కేసుల్లో ప్రభుత్వమే ఫిర్యాదుదారుగా ఉన్నపుడూ జస్టిస్ అరుణ్ మిశ్రా తరచుగా ప్రభుత్వం తరఫునే ఉంటారు. ప్రభుత్వమే ప్రతివాదిగా హాజరైనప్పుడూ మిశ్రా ప్రభుత్వం తరఫున ఉంటూ వచ్చారు. పౌరహక్కుల ఉద్యమ నేతలపై కేసులన్నీ కూడా ఏళ్లూ పూళ్లుగా అతీగతీ లేకుండా పడి ఉండటం మన ‘ప్రజాస్వామ్యం’లో ఓ బంతులాటగా మారింది. మెరుగైన సంప్రదాయాలను కాపాడిన న్యాయవ్యవస్థల తీర్పుల్ని పక్కన పడేసి, విస్మరించడమే జస్టిస్ అరుణ్ మిశ్రా సామాజిక మితవాదంలో కీలకమైన అంశంగా న్యాయ నిపు ణులు, వ్యాఖ్యాతలూ భావించడం విశేషం. దేశ పౌరులకు సంపూర్ణ న్యాయం ఒనగూర్చే అసాధారణ అధికారాన్ని న్యాయవ్యవస్థకు, కోర్టు లకూ రాజ్యాంగంలోని 142వ అధికరణ కల్పిస్తోంది. కానీ, ఈ అధిక రణను కాదని చివరికి పెద్ద బెంచ్ తీర్పును కూడా తోసిపుచ్చి వ్యవ హరించే అవకాశాన్ని కోర్టు చిన్న బెంచ్లకు దఖలుపరుస్తున్న ఉదా హరణలు కూడా దేశంలో చెలామణీలో ఉన్నాయని కొందరు నిపుణుల అభిప్రాయం. ‘ఉపాహార్’ (1997) విషాద ఘట్టంపై విచారణలో సుప్రీం తీర్పును ప్రస్తావిస్తూ ఆ విషాదంలో కోల్పోయిన ఇద్దరు బిడ్డల ఉదం తాన్ని తలచుకుంటూ తల్లిదండ్రులు చేసిన వ్యాఖ్య పాఠకుల గుండెల్ని పిండేస్తుంది: ‘పంతొమ్మిదేళ్లనాడు నాకు దేవుడిలో నమ్మకం పోయింది, ఇప్పుడు భారత న్యాయ వ్యవస్థలో విశ్వాసం పోయింది. న్యాయస్థానా లంటే మాకెంతో గౌరవం. కానీ, ఉపాహార్ సినిమా యజమానులు మాత్రం రూ.60 కోట్లతో తమ స్వేచ్ఛను కొనుక్కోగలిగారు’! బహుశా అబ్రహాం లింకన్ అన్నట్టు ‘కొన్ని తీర్పులు లీగల్గా సమర్థనీయం కావచ్చునేమోగానీ, నైతికంగా సమర్థనీయం కావు’!! ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఇది సబబు కాదు
గత కొన్ని రోజులుగా ప్రశాంత్ భూషణ్ చుట్టూ తిరిగిన కోర్టు ధిక్కార వివాదం సోమవారం సుప్రీంకోర్టు ఆయనకు రూపాయి జరిమానా విధించడంతో ముగిసింది. ఆయన పెట్టిన రెండు ట్వీట్లు న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా వున్నాయని, ఆయన నేరం చేసినట్టు నిర్ధారణ అయిందని సర్వోన్నత న్యాయస్థానం గత నెల 13న తేల్చింది. క్షమాపణ చెబితే సరేసరి...లేనట్టయితే శిక్ష తప్పదని చెబుతూ తుది తీర్పును వాయిదా వేసింది. వేయదగ్గ శిక్షపై ఆ నెల 20నుంచి వాదప్రతివాదాలు నడిచాయి. చివరకు విధించిన శిక్ష–రూపాయి జరిమానా లేదా మూడు నెలల జైలు, మూడేళ్లపాటు న్యాయవాద వృత్తినుంచి సస్పెన్షన్. జరిమానా చెల్లించడానికే ప్రశాంత్ భూషణ్ మొగ్గుచూపారు. కేవలం ఈ శిక్షను సమీక్షించమని కోరడానికి తనకున్న హక్కును వినియోగించుకోవడం కోసమే జరిమానా చెల్లిస్తున్నట్టు ఆయన వివరించారు. సుప్రీంకోర్టు సుమోటాగా ఈ కేసు తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్పై వున్న ఫొటోపై ప్రశాంత్ చేసిన వ్యాఖ్య, గత ఆరేళ్లుగా సుప్రీంకోర్టు తీరుతెన్నులపై చేసిన వ్యాఖ్య ఈ వివాదానికి మూలం. సుప్రీంకోర్టును లేదా న్యాయవ్యవస్థ మొత్తాన్ని అప్రతిష్టపాలు చేసే ఉద్దేశం తనకు లేదని ప్రశాంత్ వాదిస్తే...తగినవిధంగా స్పందించకపోతే దేశవ్యాప్తంగా న్యాయవాదులకూ, కక్షిదారులకూ తప్పుడు సంకేతం వెళ్తుందని ధర్మాసనానికి నేతృత్వంవహించిన జస్టిస్ అరుణ్ మిశ్రా అభిప్రాయపడ్డారు. చూడటానికి ఇది రూపాయితో సరిపెట్టిన దండనగా కనబడవచ్చు. కానీ న్యాయవ్యవస్థపై విమర్శలు సహించబోమన్న సంకేతాలు పంపింది. దేశంలోని కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలతో పోలిస్తే న్యాయవ్యవస్థపై సాధారణ ప్రజానీకంలో ఇప్పటికీ గౌరవప్రపత్తులున్నాయి. అడపా దడపా అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమైన సందర్భాలు లేకపోలేదు. కానీ మొత్తంగా మిగిలిన రెండింటితో పోలిస్తే అది మెరుగన్న అభిప్రాయమే బలంగా వుంది. అందులో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పిన న్యాయమూర్తులే ఇందుకు కారణం. నిజానికి బయటవారితో పోలిస్తే వారే అవినీతిని బాహాటంగా ఎత్తిచూపారు. ఇందుకు జస్టిస్ కృష్ణయ్యర్ మొదలుకొని జస్టిస్ కట్జూ వరకూ ఎందరినో ఉదాహరించవచ్చు. న్యాయమూర్తులుగా పనిచేస్తున్నప్పుడూ, రిటైరయ్యాక కూడా వారు ఈ పని చేశారు. న్యాయపీఠంపై వున్నవారిలో కనీసం 20 శాతంమంది అవినీతిపరులని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ వెంకటాచలయ్య చెప్పిన మాటను ఎవరూ మరిచిపోరు. న్యాయమూర్తుల్లో రెండు రకాలవారున్నారని...న్యాయం తెలిసినవారు, కేంద్ర న్యాయమంత్రి తెలిసినవారు అని విపక్షంలో వున్నప్పుడు బీజేపీ నేత స్వర్గీయ అరుణ్ జైట్లీ చమత్కరించారు. ‘మేం అధికారంలోకొచ్చాక ఆ ధోరణి పూర్తిగా పోయింద’ని ఆ తర్వాత ఆయన ఎక్కడా చెప్పిన దాఖలా లేదు. అలహాబాద్ హైకోర్టుపై పదేళ్ల క్రితం సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు పెను సంచలనానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యలవల్ల నిజాయితీపరులైన న్యాయమూర్తులపై సైతం నీలినీడలు కమ్ముకున్నాయని, వాటిని వెనక్కి తీసుకోవాలని హైకోర్టు తరఫున పిటిషన్ దాఖలైనప్పుడు ‘ఇది స్పందించాల్సిన సమయం కాదు...ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం’ అంటూ ధర్మాసనం దాన్ని తోసిపుచ్చింది. న్యాయవ్యవస్థ అవినీతిపై ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ మూడేళ్లక్రితం నివేదిక విడుదల చేసినప్పుడు సైతం నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కేహార్ నేతృత్వంలోని ధర్మాసనం అది కోర్టు ధిక్కారం కిందకు రాదని తేల్చిచెప్పింది. 1995లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. రామస్వామి ఈ విషయంలో ఇంకాస్త ముందుకెళ్లారు. సదుద్దేశంతో, సంయమనంతో న్యాయమూర్తి ప్రవర్తనను లేదా న్యాయస్థానం ప్రవర్తనను కఠిన పదజాలంతో విమర్శించినా కోర్టు ధిక్కారంకాదన్నారు. అయితే అవి న్యాయమూర్తి వ్యక్తిత్వహననానికి, నిష్పాక్షికతను ప్రశ్నార్థకం చేసే స్థాయికి దిగజారకూడదన్నది జస్టిస్ రామస్వామి గీసిన లక్ష్మణరేఖ. ఇతర వ్యవస్థలకూ, న్యాయవ్యవస్థకూ మధ్య మౌలికంగా వ్యత్యాసం వుంది. మిగతా రెండు వ్యవస్థల్లో పనిచేసేవారు ఇతర వ్యవస్థలపై లేదా తమ వ్యవస్థలపై విమర్శలు చేయలేరు. నిబంధనలు ఒప్పుకోవు. ఒక్క న్యాయవ్యవస్థ మాత్రమే ఎవరిలోపాలనైనా నిశితంగా విమర్శించగలదు. అటువంటి అధికారమూ, హక్కూ వున్న వ్యవస్థ మరీ ఇంత సున్నితంగా వుండటం సబబు కాదు. విమర్శలను మాత్రమే కాదు..ఆ విమర్శలు చేస్తున్నవారెవరో, వారి ఉద్దేశాలేమిటో, అందుకు దారితీస్తున్నవేమిటో కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అలాగని న్యాయమూర్తులను బెదిరిస్తే, కించపరిస్తే సహించాలని ఎవరూ చెప్పరు. న్యాయవ్యవస్థతోసహా వ్యక్తులకైనా, వ్యవస్థలకైనా కావలసింది పారదర్శకత, జవాబుదారీతనం. ఆ రెండూ లోపించినా, అవి తగినంతగా లేకపోయినా విమర్శలు రాకతప్పదు. 2019లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్పై సుప్రీంకోర్టులో పనిచేసే యువతి లైంగిక వేధింపుల ఆరోపణ కేసులో అసలు జరిగిందేమిటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఆమెపై కేసు పెట్టారు. ఢిల్లీ పోలీసు విభాగంలో పనిచేసే ఆమె భర్త, బావలను సస్పెండ్ చేశారు. ఆరోపణల్లో పెద్ద కుట్ర వున్నదని జస్టిస్ గొగోయ్ ఆరోపించారు. తీరా ఏడాది గడిచేసరికి అందరూ ఎవరి ఉద్యోగాల్లో వారు చేరారు. కేసులు రద్దయ్యాయి. పరిస్థితి ఇలా వున్నప్పుడు ప్రశాంత్భూషణ్ వంటివారు న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని సడలేలా చేస్తున్నారని అనడం సబబేనా? అందుకు బదులు ఆయన వ్యాఖ్యలకున్న ప్రాతిపదికేమిటో వెల్లడిస్తే దిద్దుబాటుకు సిద్ధమని లేనట్టయితే తదుపరి చర్యలు తప్పవని చెబితే బాగుండేది. బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో లేదా రిటైర్డ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కమిటీ వేయాల్సింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement