-
తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ రిలీజ్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మధ్యంత బెయిల్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే శుక్రవారం(మే10) సాయంత్రం ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటికి వచ్చిన ఆయన కారులో నుంచి ఆప్ కార్యకర్తలకు అభివాదం చేశాారు. నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇది ప్రజాస్వామ్యం సాధించిన విజయమని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో ఆప్ తరపున ప్రచారం చేయడానికి గాను సుప్రీంకోర్టు కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే మధ్యంతర బెయిల్పై ఉన్న సమయంలో సీఎంగా ఎలాంటి బాధ్యతలు నిర్వహించొద్దని, ఫైల్స్ చూసేందుకు వీలులేదని కోర్టు స్పష్టం చేసింది. తిరిగి జూన్2న కేజ్రీవాల్ లొంగిపోవాలని కోర్టు తెలిపింది. మే 25న ఢిల్లీలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుండటంతో ప్రచారం కోసం కేజ్రీవాల్కు దేశ అత్యున్నత కోర్టు మధ్యంతర బెయిల్ రూపంలో భారీ ఊరటనిచ్చింది. కాగా, లిక్కర్స్కామ్ కేసులో మార్చి 21న అరెస్టయిన కేజ్రీవాల్ అప్పటి నుంచి జైలులో ఉన్న విషయం తెలిసిందే. -
పవిత్ర గ్రంథంగా.. వైఎస్సార్సీపీ మేనిఫెస్టో విడుదల (ఫొటోలు)
-
బీజేపీ మేనిఫెస్టోలో కీలక అంశాలు ఇవే..
-
APPSC Group 2 Prelims Result: గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
సాక్షి,విజయవాడ: గ్రూప్- 2 పరీక్ష ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ బుధవారం(ఏప్రిల్10) ప్రకటించింది. ఫలితాలను ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. జులై 28న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష జరగనుందని తెలిపింది. 1:100 నిష్పత్తిలో గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. గత ఏడాది డిసెంబర్ 7న గ్రూప్ -2 నోటిఫికేషన్ జారీ అయింది. ఫిబ్రవరి 25న గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్ధాయిలో ఏడు వారాల్లో గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలీను ఏపీపీఎస్సీ ప్రకటించింది. రాష్డ్ర వ్యాప్తంగా 899 పోస్టులకి గ్రూప్-2 పరీక్షలను నిర్వహిస్తున్నారు. మొత్తం 4,04,037 మంది అభ్యర్ధులు గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షలు రాయగా 92 వేల మంది క్వాలిఫై అయ్యారు. త్వరలోనే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలను కూడా ఏపీపీఎస్సీ ప్రకటించనుంది. ఇదీ చదవండి.. వాలంటీర్లకు గాలం వేయడం నీ తరం కాదు -
కల్యాణి... వచ్చా వచ్చా...
‘కల్యాణి.. వచ్చా వచ్చా...’ అంటూ పాట పాడేస్తున్నారు విజయ్ దేవరకొండ. ఆయన హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘కల్యాణి.. వచ్చా వచ్చా...’ అంటూ సాగే రెండో పాటని విడుదల చేశారు మేకర్స్. వివాహ వేడుకల్లో భాగంగా వచ్చే ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, మంగ్లీ, కార్తీక్ పాడారు. ‘కల్యాణి... వచ్చా వచ్చా, పంచ కల్యాణి తెచ్చా తెచ్చా.. సింగారీ చెయ్యందించా, ఏనుగంబారీ సిద్ధంగుంచా..’ అంటూ ఈ పాట సాగుతుంది. ‘‘వినోదాత్మకంగా రూపొందిన చిత్రం ఇది. ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి కెమెరా: కేయూ మోహనన్, క్రియేటివ్ ప్రోడ్యూసర్: వాçసూ వర్మ. -
ఓహ్... మేడమ్...
నచ్చిన అమ్మాయి మనసు దోచేయడానికి ‘ఓహ్... మేడమ్...’ అంటూ పాట అందుకున్నారు ‘అల్లరి’ నరేశ్. ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రం కోసమే ఈ పాట. ‘అల్లరి’ నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న చిత్రం ఇది. మల్లి అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం నరేశ్–ఫరియాపై చిత్రీకరించిన తొలి పాట ‘ఓహ్.. మేడమ్’ను సంగీతదర్శకుడు ఎస్ఎస్ తమన్ విడుదల చేశారు. గోపీచందర్ స్వరపరచిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి పాడారు. హీరోయిన్ పట్ల హీరో వ్యక్తపరిచే భావోద్వేగాల నేపథ్యంలో ఈ పాట ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ఈ నెల 22న ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
తెలంగాణ డీఎస్సీ కొత్త నోటిఫికేషన్ విడుదల
-
గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదల
-
‘గురుకుల’కు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు విడుదల చేసింది. గురువారం తెల్లవారుజామున 3గంటల సమయంలో సంక్షేమ గురకుల డిగ్రీ కాలేజీల్లోని ఫిజికల్ డైరెక్టర్లు(పీడీ), లైబ్రేరియన్ ఉద్యోగాలకు, సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్లు(పీడీ), లైబ్రేరియన్ ఉద్యోగాలకు సంబంధించి 1:2 నిష్పత్తిలో ప్రాథమిక జాబితాలను టీఆర్ఈఐఆర్బీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అదేవిధంగా గురువారం రాత్రి గురుకుల పాఠశాలల్లోని ఫిజికల్ డైరెక్టర్లు(పీడీ), లైబ్రేరియన్, పోçస్టుగ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన టీఆర్ఈఐఆర్బీ.... వాటిని బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. 1:2 నిష్పత్తిలో అర్హత సాధించిన అభ్యర్థులకు గురుకుల బోర్డు ఫోన్లలో సంక్షిప్త సమాచారం(ఎస్ఎంఎస్) ద్వారా సమాచారంఇచ్చింది. సాంకేతిక కారణాలతో టీఆర్ఈఐఆర్బీ వెబ్సైట్ మొరాయించడంతో అభ్యర్థులు జాబితాలను పరిశీలించుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. గురువారం సాయంత్రం తర్వాత వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు అధిగమించడంతో వెబ్సైట్ తిరిగి తెరుచుకుంది. నేటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన... ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ ఉద్యోగాలకు సంబంధించి టీఆర్ఈఐఆర్బీ 1:2 నిష్పత్తిలో విడుదల చేసిన ప్రాథమిక జాబితాలో ఉన్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను శుక్రవారం నుంచి ప్రారంభించనుంది. వివిధ కేటగిరీల్లో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 9వ తేదీన ఉదయం 9గంటల నుంచి చైతన్యపురి లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల న్యాయ కళాశాల(ఉమెన్)లో ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం కానుంది. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు రెండు సెట్ల జిరాక్సుపత్రాలు, సెల్ఫ్ అటెస్టేషన్ పత్రంతో హాజరు కావాల్సి ఉంటుంది. చెక్లిస్టును బోర్డు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని గురుకుల బోర్డు కన్వినర్ అభ్యర్థులకు సూచించారు. 10 నుంచి డెమో పరీక్షలు... ప్రస్తుతం విడుదల చేసిన 1:2 జాబితాల్లో ఎంపికైన అభ్యర్థులకు డెమో పరీక్షలను గురుకుల బోర్డు నిర్వహించేందుకు కసరత్తు వేగవంతం చేసింది. గురుకుల జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలకు సంబంధించి ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ ఉద్యోగాలకు అదేవిధంగా పాఠశాలల్లో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాలకు ప్రాథమికంగా అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 10వ తేదీ నుంచి డెమో పరీక్షలు నిర్వహిస్తారు. తుది జాబితాలో అర్హత సాధించిన వారికి ఈనెల 14వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు సంక్షేమ శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. -
ఇది కనులు కల గన సాధ్యమా...
‘నిజమా.. ఇది కనులు కల గన సాధ్యమా..’ అంటూ ప్రేమ పాట పాడుకున్నారు చైతన్యా రావు, హెబ్బా పటేల్. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘హనీమూన్ ఎక్స్ప్రెస్’ చిత్రంలోని పాట ఇది. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ (యుఎస్ఎ) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్పై కేకేఆర్, బాలరాజ్ నిర్మించారు. బాల రాజశేఖరుని దర్శకుడు. ఈ చిత్ర సంగీతదర్శకుడు కల్యాణీ మాలిక్ స్వరపరచి, సునీతతో కలిసి పాడినన ‘నిజమా...’ పాటను దర్శకుడు రామ్గోపాల్ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘నిజమా..’ పాట చాలా మెలోడియస్గా ఉంది. లొకేషన్స్ బాగున్నాయి. కొత్త కాన్సెప్ట్తో వస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘రామ్గోపాల్ వర్మగారితో ‘బ్యూటీ ఆఫ్ ఫ్యాషన్, ఆట’ అనే రెండు హాలీవుడ్ చిత్రాలకు పనిచేశాను. నేను దర్శకుడు కావడానికి ‘శివ’ చిత్రం స్ఫూర్తి. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు బాల రాజశేఖరుని. -
అందుకేనేమో ఎర్ర సముద్రం అంటారు!
‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్–డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘దేవర’. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం తొలి భాగం ‘దేవర పార్ట్ 1’ ఏప్రిల్ 5న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. కాగా ఈ సినిమా గ్లింప్స్ను ఆయా భాషల్లో సోమవారం విడుదల చేశారు మేకర్స్. ‘ఈ సముద్రం సేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువ సూసుండాది.. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్తో గ్లింప్స్ రిలీజైంది. ‘‘దేవర’ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆ అంచనాలను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్, కెమెరా: రత్నవేలు. -
మరో 68,990 మందికి సంక్షేమ ఫలాలు
సాక్షి, అమరావతి : జనం చెంతకే సంక్షేమం.. అర్హతే ప్రామాణికంగా అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశమిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి 68,990 మంది అర్హులకు రూ.97.76 కోట్లను బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేయనున్నారు. ఇలా ఏటా రెండు పర్యాయాలు.. జనవరి–జూన్ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారికి జూన్–జూలైలోను.. అలాగే, జూలై నుంచి డిసెంబర్ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్–జనవరిలో సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. గత ఆగస్టు 2023 నుండి డిసెంబర్ 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలు అందని 68,990 మంది అర్హులకు రూ.97.76 కోట్లను సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేయనున్నారు. దరఖాస్తు చేసుకోవడం ఎలా? ► అర్హత ఉండి ఆయా పథకాల లబ్ధి పొందని వారు వాటిని అందించిన నెలలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ► అవసరమైతే వలంటీర్ సేవలు వాడుకోవచ్చు లేదా 1902కి ఫోన్చేస్తే వారు తగు సూచనలు ఇస్తారు. ► సచివాలయాల్లో అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేశాక వెరిఫికేషన్ చేస్తారు. ► ఆ తర్వాత ఆరు నెలలకోసారి సంక్షేమ పథకాల లబ్ధి అందిస్తారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత.. ► సోషల్ ఆడిట్ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాల ను ప్రదర్శిస్తారు. ► లంచాలకు, కుల, మత, వర్గ, పార్టీల వివక్షకు తావులేకుండా రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పథకాలను అమలుచేస్తోంది. ► నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో అర్హులందరికీ పథకాల లబ్ధి చేకూరుస్తోంది. -
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల కానుంది. 29న పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్యేలుగా ఎన్నికయిన కడియం శ్రీహరి, పాడి కౌశిక్రెడ్డి ఎమ్మెల్సీలుగా రాజీనామాతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీరిద్దరూ ఎమ్మెల్యే కోటా కిందనే ఎన్నికయ్యారు. దీంతో ఈ రెండు స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. ►జనవరి 11న నోటిఫికేషన్ ►నామినేషన్ల దాఖలుకు చివరితేదీ జనవరి 18 ►జనవరి 19న నామినేషన్ల స్క్రూట్నీ ►నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ జనవరి 22 ►జనవరి 29న ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్, కౌంటింగ్ -
వైఎస్సార్ సీపీ ఇంచార్జిల రెండో జాబితా విడుదల
-
నన్ను చూసినావే పిల్ల!
సంపూర్ణేష్ బాబు, సంజోష్,ప్రాచీ బంసాల్, ఆర్తి గుప్తా ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం ‘సోదరా’. మన్మోహన్ మేనంపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. క్యాన్స్ ఎంటర్టైన్మెంట్స్, మాంక్ ఫిల్మ్స్పై చంద్ర చగంలా నిర్మిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నన్ను చూసినావే పిల్ల.. నా కలలే నిజమయ్యేలా...’ అంటూ సాగే రెండో పాటని విడుదల చేశారు మేకర్స్. ‘‘సోదరా’ నుంచి ఇప్పటికే రిలీజైన ‘అన్నంటే దోస్తే సోదరా..’ అనే తొలి పాటకి మంచి స్పందన వచ్చింది. ‘నన్ను చూసినావే పిల్ల..’ పాట ఫ్రెష్ ఫీల్తో మంచి లవ్ రొమాంటిక్గా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: జాన్. -
ఆ భయం లేదు!
‘‘లాక్డౌన్ తర్వాత ప్రేక్షకులు వినోదాన్ని ఆస్వాదించే విధానం మారింది. కథ, నటీ నటుల పాత్రల్లో కొత్తదనం ఉంటేనే చూస్తున్నారు. అందుకే ప్రయోగాత్మక, కొత్త తరహా పాత్రలే చేయాలనుకుంటున్నాను. కథ నచ్చి, అందులో నా పాత్ర బలంగా ఉంటే గ్లామరస్ పాత్రలు చేయడానికి కూడా రెడీ’’ అన్నారు ఖుషీ రవి. శ్రీరామ్, ఖుషీ రవి జంటగా సాయికిరణ్ దైదా దర్శకత్వంలో యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన హారర్ చిత్రం ‘పిండం’. ఈ చిత్రం ఈ నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఖుషీ రవి మాట్లాడుతూ– ‘‘నటిగా కన్నడంలో ‘దియా’ నా తొలి చిత్రం. ఆ చిత్రం తర్వాత పెళ్లి చేసుకున్నాను. నాకో పాప ఉంది. ఇక ‘పిండం’ సినిమా విషయానికి వస్తే... ఈ సినిమాలో నేను మేరీ పాత్రలో నటించాను. కథ రీత్యా ఇద్దరు కుమార్తెలు నాకు. మూడో ప్రసవం కోసం గర్భిణిని. కెరీర్ప్రారంభంలోనే తల్లి పాత్రæచేస్తే నా కెరీర్ ఏమౌతుందోననే భయం, అభద్రతాభావం నాకు లేవు. నా మరో చిత్రం ‘రుద్ర’లో ట్రాన్స్జెండర్ పాత్ర చేస్తున్నాను. సవాల్ అనిపించే పాత్రలు చేయడం నాకు ఇష్టం’’ అని చెప్పుకొచ్చారు. -
నా ఎనిమిదేళ్ల కల నెరవేరింది
విరాజ్ అశ్విన్, పూజితా పోన్నడ జంటగా అను ప్రసాద్ దర్శకత్వంలో నిరీష్ తిరువీధుల నిర్మించిన చిత్రం ‘జోరుగా హుషారుగా..’. ఈ చిత్రం నేడు విడుదలవు తోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్లతో అను ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘తూర్పుగోదావరిలోని పెద్దాపురం స్వస్థలం. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చాను. జూనియర్ ఆర్టిస్టు, లైట్మేన్గా చేశాను. ఎడిటింగ్లో నైపుణ్యం ఉంది. నా దర్శకత్వంలో వచ్చిన షార్ట్ ఫిల్మ్ చూసి, నిరీష్గారు చాన్స్ ఇచ్చారు. అలా దర్శకుడ్ని కావాలనుకున్న నా ఎనిమిదేళ్ల కల ‘జోరుగా హుషారుగా’తో నెరవేరింది. నా మిత్రుడి జీవితంలో జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ సినిమా కథ రాశాను. ఓ గ్రామం నుంచి పట్నానికి వచ్చిన సంతోష్ (విరాజ్ పాత్ర) జీవితంలో జరిగన ఓ ఘటన అతని జీవితాన్ని ఏ విధంగా మార్చింది? తన కుటుంబాన్ని సంతోష్ ఏ విధంగా కాపాడుకున్నాడు? అన్నది ఈ సినిమా. మంచి హాస్యం, భావోద్వేగం, సంగీతం ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చారు. -
నా కంటి రెప్పలో కాటుక ముగ్గు నువ్వే...
‘‘నా కాఫీ కప్పులో షుగరు క్యూబు నువ్వే నువ్వే.. నా కంటి రెప్పలో కాటుక ముగ్గు నువ్వే నువ్వే..’’ అంటూ సాగుతుంది ‘గుంటూరు కారం’ సినిమాలోని ‘ఓ మై బేబీ’పాట. హీరో మహేశ్బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇది. శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి మరో హీరోయిన్. బుధవారం ‘‘ఓ మై బేబీ.. నీ బుగ్గలు పిండాలి.. ఓ మై బేబీ నీకు ముద్దులు పెట్టాలి..’’ అంటూ సాగే ‘ఓ మై బేబీ..’పాట పూర్తి లిరికల్ వీడియోను విడుదల చేశారు. సంగీత దర్శకుడు తమన్ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈపాటను శిల్పారావు ఆలపించారు. సూర్యదేవర రాధాకృష్ణ (చిన్నబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస. -
స్నేహానికి హద్దు లేదురా
ఆశిష్ గాంధీ, అశోక్, వర్ష, హ్రితిక హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘హద్దు లేదురా..’. రాజశేఖర్ రావి దర్శకత్వంలో వీరేష్ గాజుల బళ్లారి నిర్మించారు. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ని దర్శకుడు క్రిష్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘హద్దు లేదురా..’ టైటిల్ బాగుంది. ఫస్ట్ లుక్, సినిమా థీమ్ వైవిధ్యంగా ఉన్నాయి. సినిమా హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘అలనాటి కృష్ణార్జునులు స్నేహితులు అయితే ఎలా ఉంటారో తెలిపే కథ, కథనంతో ‘హద్దు లేదురా..’ రూ΄పొందింది. ఫైట్స్, పాటలు, సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు, క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అన్నారు రాజశేఖర్ రావి. ‘‘జనవరిలో మా సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు గాజుల వీరేశ్. ‘‘స్నేహం నేపథ్యంలో రూ΄పొందిన ‘హద్దు లేదురా..’ మా యూనిట్కి మంచి పేరు తీసుకొస్తుంది’’ అన్నారు ఆశిష్ గాంధీ. తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాత: రావి మోహన్ రావు. -
అయోధ్య రామ మందిరం గర్భగుడి ఫోటో విడుదల
ఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఆలయ గర్భగుడి ఫోటోలను రామ్ మందిర్ ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ ట్విట్టర్(ఎక్స్)లో ఫొటోలు పోస్ట్ చేశారు. రామాలయ ప్రారంభోత్సవ వేడుక జనవరి 22న అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దశాబ్దాల సమస్య తీరిపోయి అయోధ్యలో దివ్యమైన రామ మందిర నిర్మాణం శరవేగంగా నిర్మాణం జరిగింది. దీంతో ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని యూపీ ప్రభుత్వం భారీ సన్నాహాలు చేస్తోంది. प्रभु श्री रामलला का गर्भ गृह स्थान लगभग तैयार है। हाल ही में लाइटिंग-फिटिंग का कार्य भी पूर्ण कर लिया गया है। आपके साथ कुछ छायाचित्र साझा कर रहा हूँ। pic.twitter.com/yX56Z2uCyx — Champat Rai (@ChampatRaiVHP) December 9, 2023 వేద మంత్రాల నడుమ కన్నుల పండువగా జరిగే శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి దేశంలోని 8వేల మంది ప్రముఖులను కూడా ఆహ్వానిస్తున్నారు. ఇదీ చదవండి: అయోధ్య రామాలయం రెడీ -
AP: గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్ర స్థాయిలో అత్యున్నత సర్వీసులైన గ్రూప్–1 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 81 గ్రూప్–1 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. గురువారం 897 గ్రూప్–2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన సర్వీస్ కమిషన్ తాజాగా గ్రూప్–1 పోస్టులకుసైతం నోటిఫికేషన్జారీ చేసింది. అభ్యర్థులు తమ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్) ఆధారంగా జనవరి 1 నుంచి 21వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. కొత్త అభ్యర్థులు తొలుత కమిషన్ వెబ్సైట్లో తమ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుని, ఓటీపీఆర్తో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో మార్చి 17న ఆఫ్లైన్లో నిర్వహించనున్నట్టు సర్వీస్ కమిషన్ పేర్కొంది. డిస్క్రిప్టివ్ విధానంలో జరిగే మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను త్వరలో ప్రకటించనుంది. కమిషన్ ప్రకటించిన గ్రూప్–1 విభాగంలో 9 డిప్యూటీ కలెక్టర్లు, 18 అసిస్టెంట్ ట్యాక్స్ కమిషనర్స్ పోస్టులు, 26 డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్స్, ఆర్టీవో, గ్రేడ్–2 మున్సిపల్ కమిషనర్స్, జిల్లా బీసీ సంక్షేమ వంటి ఉన్నత స్థాయి పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో రెండు పేపర్లు సైతం ఆఫ్లైన్లో ఆబ్జెక్టివ్ విధానంలోనే నిర్వహించనున్నారు. మొత్తం పోస్టులు, వేతనం, అర్హతలతో కూడిన పూర్తి సమాచారం కమిషన్ వెబ్సైట్ https://psc.ap.gov.inలో ఉంచినట్టు కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు. కాగా, ఇప్పటికే ఆర్థికశాఖ అనుమతినిచ్చిన మరికొన్ని పోస్టులకు ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ ప్రణాళిక సిద్ధం చేసింది. వివాదరహితంగా పోస్టుల భర్తీ గతంలో ఉండే అనేక న్యాయపరమైన వివాదాలను, చిక్కులను పరిష్కరించి ప్రభుత్వం సర్వీస్ కమిషన్లో సంస్కరణలు తీసుకొచ్చింది. దాంతో గతేడాది ఏపీపీఎస్సీ ఇచ్చిన గ్రూప్–1 నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి వివాదాలకు తావులేకుండా 11 నెలల కాలంలో పూర్తి పారదర్శకంగా మెయిన్స్, ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేసింది. గ్రూప్–1 పరీక్షలు, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక సమర్థవంతంగా నిర్వహించి, హేతుబద్ధంగా అభ్యర్థుల వాస్తవిక నైపుణ్యాన్ని అంచనా వేసి ఎంపిక చేశారు. ఈ నియామకాలు అతి తక్కువ సమయంలోనే కమిషన్ పూర్తి చేసింది. ఇదే తరహాలో ఇప్పుడు ప్రకటించిన నోటిఫికేషన్లలో ఇచ్చిన పోస్టులు సైతం సమర్థవంతంగా, సత్వరం భర్తీ చేసేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. -
AP: గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల
సాక్షి, విజయవాడ: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. గ్రూప్ -2 నోటిఫికేషన్ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 897 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566. ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది. ఈ నెల 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నూతన సిలబస్, నూతన నియామక ప్రక్రియలో ఈసారి గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు. నూతన సిలబస్, నూతన నియామక ప్రక్రియలో ఈసారి గ్రూప్–2 నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదీ చదవండి: ‘ఇంగ్లిష్’లో మనమే టాప్! -
సక్సెస్ను హ్యాండిల్ చేయడం కష్టం
‘‘బుల్లితెర షోలకు టీఆర్పీ రేటింగ్స్కు ఎక్కువ ప్రాంధాన్యత ఉంటుంది. కానీ సినిమాలకైతే దర్శకుల భవిష్యత్, నిర్మాత డబ్బులు, వినోదాన్ని ఆశించి థియేటర్స్కు వచ్చే ప్రేక్షకులు.. ఇలా చాలా విషయాలు ఆలోచించాలి. నా ‘గాలోడు’ సినిమా అంత పెద్ద సక్సెస్ అవుతుందని ఊహించలేదు. ఫెయిల్యూర్ను హ్యాండిల్ చేయడం సులభమే. కానీ సక్సెస్ను హ్యాండిల్ చేయడం కష్టం’’ అన్నారు ‘సుడిగాలి’ సుధీర్. అరుణ్ విక్కీరాల దర్శకత్వంలో ‘సుడిగాలి’ సుధీర్ హీరోగా రూపొందిన చిత్రం ‘కాలింగ్ సహస్ర’. విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘సుడిగాలి’ సుధీర్ మాట్లాడుతూ– ‘‘కాలింగ్ సహస్ర’ కథ చెప్పినప్పుడు ఇందులోని ఓ పాయింట్ కొత్తగా అనిపించింది. నా కెరీర్లో ఇది ప్రయోగాత్మక సినిమా’’ అని చెప్పుకొచ్చారు. -
అన్నదమ్ముల మధ్య ఈగోలు ఉండకూడదు: మంచు మనోజ్
సంపూర్ణేష్ బాబు, సంజోష్,ప్రాచీబంసాల్, ఆరతి గుప్త ప్రధాన తారాగణంగా మన్ మోహన్ మైనంపల్లి దర్శకత్వంలో చంద్ర చాంగల నిర్మిస్తున్న చిత్రం ‘సోదరా’. ఈ సినిమాలోని ‘అన్నంటే దోస్తే సోదరా.. సీక్రేట్సే లేవురా..చిన్నోడై పుడితే సోదరా.. జన్మంత జాతర’ అంటూ సాగేపాటను హీరో మంచు మనోజ్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘అన్నదమ్ముల మధ్య ఈగోలు, డబ్బు సమస్యలు ఉండకూడదు. హ్యూమన్స్ ఎమోషన్స్ నేపథ్యంలో ‘సోదర’ సినిమా తీయడం నాకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘మంచు మనోజ్ నన్ను ఓ సొంత సోదరుడిలా భావించి, ఈ సాంగ్ ఈవెంట్కు వచ్చినందుకు ధన్యవాదాలు’’ అన్నారు సంపూర్ణేష్బాబు. ‘‘అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు మన్ మోహన్. ‘‘ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు సంజోష్, చంద్ర చగంలా. ఈ సినిమాకు సంగీతం: సునీల్ కశ్యప్. -
దుబాయ్లో యానిమల్
రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘యానిమల్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. గుల్షన్ కుమార్, టి.సిరీస్ సమర్పణలో భద్రకాళి పిక్చర్స్, సినీ 1 స్టూడియోస్పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషణ్ కుమార్, మురాద్ ఖేతాని నిర్మించారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబరు 1న విడుదలవుతోంది. ఈ సినిమాలోని ‘అర్జన్ వైలీ..’ అనే పాటను దుబాయ్లోని ఐకానిక్ గ్లోబల్ విలేజ్లో అభిమానుల మధ్య ఘనంగా విడుదల చేశారు మేకర్స్. ఈ వేడుకలో రణబీర్ కపూర్, బాబీ డియోల్ పాల్గొన్నారు. వేదికపై ‘అర్జన్ వైలీ...’ పాటకు స్టార్ కాస్ట్తో పాటు అభిమానులు చేసిన డ్యాన్స్ వైరల్గా మారింది.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
టీడీపీ అభ్యర్థి ఆఫీస్ను ముట్టడించిన మహిళలు
మదర్స్ డే స్పెషల్: 47 ఏళ్ల నాటి ఫోటో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్
రాజస్తాన్ను చిత్తు చేసిన చెన్నై.. ప్లే ఆఫ్స్ రేసులో మున్ముందుకు
చంద్రబాబు, ఈనాడు, ఆర్ టీవీపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
గొప్ప మనసుకు చాటుకున్న అనంత్ అంబానీ.. ఏం చేసారో తెలుసా?
ఎన్నికల భయం.. 10 రోజుల్లో రూ. 17,000 కోట్లు వెనక్కి..
ప్రకాశం: ఎస్పీని కలిసిన బాలినేని, చెవిరెడ్డి
పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ మూకలు
ఓటు వేయకపోతే ఆ దేశాల్లో ఎలాంటి శిక్షలు విధిస్తారో తెలుసా!
తప్పక చదవండి
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement