-
ఖాతాదారులకు అలర్ట్: పోస్టాఫీసుల్లో కొత్త మార్పులు
Post Office Account New Rules: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే పోస్టాఫీసులకు దేశవ్యాప్తంగా విస్తృతమైన నెట్వర్క్ ఉంది. మారుమూల గ్రామాల్లోనూ శాఖలు ఉన్నాయి. కోట్లాది మంది ఖాతాదారులు ఉన్నారు. అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు పోస్టాఫీసుల ద్వారానే అమలవుతున్నాయి. బ్యాంకుల మాదిరిగానే, పోస్టాఫీసులు కూడా ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనది సేవింగ్స్ అకౌంట్. ఈ అకౌంట్ల ఓపెనింగ్, విత్డ్రాయల్, వడ్డీ లెక్కింపు, చెల్లింపులకు సంబంధించి కొన్ని మార్పులు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. జాయింట్ అకౌంట్ హోల్డర్ల పరిమితి పోస్టాఫీసులో జాయింట్ అకౌంట్ హోల్డర్ల పరిమితిని పెంచారు. ఇప్పటి వరకూ ఇద్దరు వ్యక్తులు మాత్రమే జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు వీలుండేది. ఇప్పుడు మార్చిన నిబంధనల ప్రకారం, జాయింట్ అకౌంట్ను ముగ్గురు వ్యక్తులు కలిసి తెరవవచ్చు. నగదు విత్డ్రా సేవింగ్స్ ఖాతా నుంచి నగదు విత్డ్రాకు సంబంధించి కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి. ఖాతాల నుంచి నగదు విత్డ్రా కోసం కస్టమర్లు ఫారం-2, అకౌంట్ పాస్బుక్ సమర్పించేవారు. ఇక నుంచి నగదు విత్డ్రా చేయాలంటే ఫారం-3ని నింపి, పాస్బుక్తో పాటు సమర్పించాల్సి ఉంటుంది. వడ్డీ లెక్కింపు, చెల్లింపు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాల్లోని డిపాజిట్లపై వడ్డీ లెక్కింపు, చెల్లింపులోనూ కీలక మార్పులు వచ్చాయి. దీని ప్రకారం ప్రతి నెలా 10వ తేదీ నుంచి ఆ నెలలో చివరి రోజు వరకు ఉన్న అతి తక్కువ డిపాజిట్ మొత్తం మీద 4 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఆ వడ్డీ మొత్తాన్ని ఏడాదికి ఒకసారి, ఆ సంవత్సరం చివరిలో సేవింగ్స్ ఖాతాలో జమ చేస్తారు. ఒకవేళ, సంవత్సరం పూర్తి కాకముందే ఖాతాదారు మరణిస్తే, సేవింగ్స్ అకౌంట్ మూసివేసిన నెలకు ముందు నెలాఖరులో ఆ వ్యక్తి ఖాతాలోకి వడ్డీ డబ్బును జమ చేస్తారు. -
ఖాతాదారులకు గట్టిషాకిచ్చిన పంజాబ్ నేషనల్ బ్యాంక్..!
ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఖాతాదారులకు గట్టి షాక్ను ఇచ్చింది. ఖాతాదారుల సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సవరించిన వడ్డీ రేట్లు ఏప్రిల్ 4, 2022 నుంచి అమలులోకి రానుంది. ఖాతాదారులకు నిరాశపరుస్తూ వడ్డీరేట్లను పీఎన్బీ తగ్గించింది. 10 లక్షల లోపు బ్యాలెన్స్ ఉన్న సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను ఏడాదికి గాను 2.70 శాతానికి తగ్గించినట్లు పీఎన్బీ ప్రకటించింది. అంతేకాకుండా రూ.10 లక్షల నుంచి రూ.500 కోట్ల మధ్య బ్యాలెన్స్ ఉన్న సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటును ఏడాదికి 2.75 శాతానికి తగ్గిస్తూ పీఎన్బీ నిర్ణయం తీసుకుంది. సవరించిన వడ్డీ రేట్లు డొమెస్టిక్, ఎన్ఆర్ఐ ఖాతాదారులకు వర్తించనుంది. పీఎన్బీ తీసుకున్న నిర్ణయంతో లక్షల మంది డిపాజిటర్లను ప్రభావితం చేయనుంది. వీరిలో చాలా మందికి రూ.10 లక్షల కంటే తక్కువ ఖాతా నిల్వలు ఉన్నాయి. రెండు నెలల సమయంలో రెండోసారి డిపాజిట్దారుల పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును పీఎన్బీ మరింత తగ్గించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన పొదుపు ఖాతాపై రేటు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రెండు రోజుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల వారీ ద్రవ్య విధాన కమిటీ సమావేశం జరిగే నేపథ్యంలో పీఎన్బీ వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో భాగంగా స్వల్పకాలిక డిపాజిట్లపై 0.5 శాతం నుంచి 0.75 శాతం వరకు వడ్డీ రేట్లు ఇస్తోంది. మధ్యస్థ, దీర్ఘకాలిక డిపాజిట్లపై సంవత్సరానికి 2.25 శాతం, 2.5 శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది. చదవండి: స్టాక్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నది తెలుగువారే.. -
మినిమం బ్యాలెన్స్ నిబంధన తొలగింపు
సాక్షి, ముంబై: ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు తీపి కబురు అందించింది. ఇకపై మినిమం బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. తాజా ప్రకటన ప్రకారం ఎస్బీఐ ఖాతాదారులు తమ పొదుపు ఖాతాలలో కనీస నిల్వను (నెలవారీ) పాటించాల్సిన అవసరం లేదు. దీంతో ఖాతాదారులకు భారీ ఊరట లభించింది. అలాగే పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును సంవత్సరానికి 3 శాతంగా నిర్ణయించింది. దేశంలో ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ప్రోత్సాహ చర్యల్లో భాగంగా మొత్తం 44.51 కోట్ల ఎస్బీఐ ఖాతాల్లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ చార్జీలను రద్దు చేస్టున్నట్టు తెలిపింది. అలాగే ఎస్ఎంఎస్ ఛార్జీలను కూడా మాఫీ చేసింది. కాగా ఎస్బీఐ సేవింగ్స్ బ్యాంక్ వినియోగదారుల మెట్రో, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో వరుసగా రూ. 3వేలు, రూ. 2 వేలు, వెయ్యి రూపాయల నెలవారీ కనీస నిల్వను ఉంచాలి. లేదంటే పన్నులతో పాటు 5 నుంచి 15 రూపాయల వరకు జరిమానా వసూలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎస్బీఐ బుధవారం ఎంసీఎల్ఆర్ రేట్లను, డిపాజిట్లపై బ్యాంకు చెల్లించే వడ్డీరేట్లను తగ్గించింది. -
సేవింగ్స్ ఖాతాలు రెండు చాలు!!
మనలో చాలా మందికి ఒకటికి మించిన బ్యాంకు ఖాతాలుండటం ఇపుడు సహజమైపోయింది. అయితే, ఇలా ఎక్కువ ఖాతాలుండటం లాభదాయకమేనా? ఇది ప్రతి ఒక్కరూ ఓ సారి ఆలోచించుకోవాల్సిన అంశం. ఎందుకంటే ప్రతి ఖాతాలో కనీస నగదు నిల్వలుచడం తప్పనిసరి. దీనికి తోడు ఏటీఎం, డెబిట్కార్డు వార్షిక చార్జీలు, ఎస్ఎంఎస్ అలర్ట్స్ చార్జీల రూపంలో రకరకాల ఛార్జీల భారాన్ని మోయాల్సి వస్తుంది. కనుక ఒకటికి మించి ఖాతాలుండే వారు ఓసారి పునః పరిశీలన చేసుకోవాలనేది నిపుణుల సూచన. ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి తమ సంస్థ తరఫున వేతన ఖాతాలుంటాయి. అయితే, ఒకే సంస్థలో శాశ్వతంగా ఉద్యోగం చేసే వారు తక్కువ మందే. ఎక్కువ మంది తరచూ సంస్థలు మారుతుంటారు. దీంతో వీరికి ఆయా సంస్థల తరఫున వేతన ఖాతాల సంఖ్య పెరిగిపోతుంటుంది. ఇక ఉద్యోగ జీవితానికి ముందే తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ప్రారంభించిన ఖాతాలు సైతం ఉండొచ్చు. కనుక నిజంగా వీటిల్లో ఎన్నింటి అవసరం ఉందన్న దానిపై ఒక్కసారి దృష్టి సారించాల్సి ఉంది. జీరో బ్యాలన్స్ ఆఫర్ కనిపించిందనో, మరేదో కారణంతోనో సేవింగ్స్ ఖాతా ప్రారంభించే ముందు ఎంత ఉపయోగం ఉందో ఓ సారి గుర్తించండి. ఒక్కో అవసరానికి ఒక్కో బ్యాంకు ఖాతాను కేటాయించుకోవడం వల్ల సులభంగా ఉంటుందేమో కానీ, ఖాతాల సంఖ్య పెరిగితే గందరగోళానికీ కారణమవుతుంది. నిజానికి గరిష్టంగా ఒక్కొక్కరికి మూడు ఖాతాలకు మించి అవసరం లేదన్నది నిపుణుల సూచన. ఆర్థిక నిపుణుల సూచనల ప్రకారం... వేతనం కోసం ఒకటి, ఖర్చుల కోసం మరొకటి, పెట్టుబడుల కోసం మరో ఖాతా ఉంటే సరిపోతుంది. వేతనంతో పాటు డివిడెండ్ సైతం ఒకే ఖాతాలో ఉండాలనేది వారి సూచన. ఇంటి అవసరాల కోసం చేసే అన్ని ఖర్చులకూ ఒక ఖాతాను ఉపయోగించుకోవాలి. బిల్లుల చెల్లింపులు, గ్రోసరీ కొనుగోళ్లు, ఔషధ కొనుగోళ్లు అన్నీ ఈ ఖాతా నుంచే చేయాలి. ఇక పూర్తిగా పెట్టుబడులు, పొదుపు నిధుల కోసం మూడో ఖాతాను ఉపయోగించుకోవాలి. క్రమశిక్షణకు కట్టుబడే వారు అయితే రెండు బ్యాంకు ఖాతాలు సరిపోతాయన్నది నిపుణుల సూచన. ఒకటి ఆదాయం, పెట్టుబడుల కోసం, రెండో ఖాతా ఖర్చుల కోసం. ఖాతాలు ఎక్కువైతే... సేవింగ్స్ ఖాతాలు ఉచితంగా ఏమీ రావు. ప్రతీ ఖాతాకు సంబంధించి కొన్ని చార్జీలుంటాయి. ప్రతీ ఖాతాలోనూ నెలవారీ కనీస సగటు బ్యాలన్స్ నిర్వహించాలి. లేదంటే పెనాల్జీ చార్జీలను బ్యాంకులు వసూలు చేస్తాయి. అలాగే ఖాతాలతోపాటు వచ్చే డెబిట్ కార్డుకు వార్షిక నిర్వహణ చార్జీలు, నెలవారీ ఉంచాల్సిన కనీస బ్యాలన్స్పై రాబడులు తక్కువేనని పైసాబజార్ డాట్ కామ పేమెంట్ ప్రొడక్ట్స్ హెడ్ సహిల్ అరోరా పేర్కొన్నారు. ‘‘ఎక్కువ ఖాతాలు మీరు కలిగి ఉంటే, కనీస బ్యాలన్స్ రూపంలో ఎక్కువ మొత్తాన్ని ఉంచాల్సి వస్తుంది. కనీస బ్యాలన్స్ రూ.5,000–10,000 వరకు ఉన్నాయి. ఐదు ఖాతాలు ఉంటే కనీసం రూ.25,000. ఇవి 3–4 శాతం రాబడులనే ఇస్తాయి. ఇలా ఎక్కువ ఖాతాల్లో ఉంచే బ్యాలన్స్ను అధిక రాబడులను ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు’’ అని బ్యాంకు బజార్ చీఫ్ డెవలప్మెంట్ అధికారి నవీన్ చందాని తెలిపారు. జాయింట్ ఖాతా మంచిదే... ఉమ్మడిగా మరొకరితో కలసి ఖాతా తెరిచే వారూ ఉన్నారు. ‘‘అందరికీ ఆర్థిక విషయాల పట్ల అవగాహన ఉండి, ఉమ్మడి లక్ష్యాలతో ఉంటే జాయింట్ అకౌంట్ మంచి నిర్ణయం అవుతుంది. ఇద్దరూ కలిసి లేదా ఎవరో ఒకరు ఆపరేట్ చేసే ఆప్షన్ ఎంచుకోవడం మంచిది’’ అని సృజన్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకులు దీపాలిసేన్ తెలిపారు. ముఖ్యంగా జీవిత భాగస్వాములు ఉమ్మడి ఖాతాను నిర్వహించడం వల్ల ఎన్నో సౌలభ్యాలు ఉంటాయి. అలాగే ఉమ్మడి ప్రయోజనాల రీత్యా ఏర్పడే సంఘాల సభ్యుల మధ్య ఆర్థిక పారదర్శకతకూ ఉమ్మడి అకౌంట్ దోహదపడుతుంది. నామినీ తప్పనిసరి... ఇక 10–15 ఏళ్ల క్రితం ఖాతాలు తెరిచి మరిచిపోయే వారూ ఉంటారు. అందులో కొంత నగదు ఉండి మర్చిపోతే దాన్ని కోల్పోయినట్టే. ఎందుకంటే ఏటా వివిధ చార్జీలను బ్యాంకులు ఆ బ్యాలన్స్ నుంచి మినహాయించుకుంటూ ఉంటాయి. ఇక ఖాతాదారుడు మరణిస్తే వారి పేరిట ఐదారు ఖాతాలుంటే, అన్నింటికీ నామినీ రిజిస్టర్ చేసి లేకపోతే కుటుంబ సభ్యులకు ఎన్నో సమస్యలు కలిగించిన వారవుతారు. అందుకని అవసరానికి మించి ఉండే ఖాతాలు మూసేయడంతోపాటు ముఖ్యమైన ఖాతాలకు నామినీగా జీవిత భాగస్వామి లేదా ఇతర కుటుంబ సభ్యుల పేరును రిజిస్టర్ చేయించుకోవడం మర్చిపోవద్దు. -
బ్యాంకు చార్జీలకే 10వేల కోట్లు
పొదుపు ఖాతాలో కనీస నిల్వ లేకపోవడం, పరిమితికి మించిన ఏటీఎం లావాదేవీలు నిర్వహించడం వల్ల బ్యాంకులు ఖాతాదారుల నుంచి చార్జీల రూపంలో వసూలు చేసిన మొత్తం అక్షరాలా రూ.పది వేల కోట్లు. ప్రభుత్వ రంగ బ్యాంకులు గత మూడున్నరేళ్లలో ఖాతాదారుల నుంచి ఈ సొమ్ము వసూలు చేశాయని, అయితే, ప్రైవేటు బ్యాంకులు ఇంకా భారీగానే రాబట్టి ఉంటాయని పార్లమెంట్లో ప్రభుత్వం ప్రకటించింది. కనీస నిల్వ నిబంధనను ఎస్బీఐ 2012వ సంవత్సరంలో ఆపివేసింది. 2017 ఏప్రిల్ నుంచి మళ్లీ వసూలు చేయడం మొదలు పెట్టింది. మిగతా బ్యాంకులు కూడా అదేబాటను అనుసరిస్తున్నాయి. ఈ పదివేల కోట్లలో ఖాతాదారు అకౌంట్లో కనీస నిల్వ లేనందుకు రూ.6,246 కోట్లు, పరిమితికి మించి ఏటీఎం లావాదేవీలు జరిపినందుకు రూ.4,145 కోట్లు వసూలు చేశాయి. ఇందులో ఎస్బీఐ వాటా.. కనీస నిల్వకు సంబంధించి రూ.2,894 కోట్లు, ఏటీఎం లావాదేవీలకు సంబంధించి రూ.1,554 కోట్లు. జన్థన్ ఖాతాలకు, బేసిక్ పొదుపు ఖాతాలకు కనీస నిల్వ పరిమితి లేదు. ఏటీఎం లావాదేవీలకు సంబంధించి మెట్రో నగరాల్లో నెలకు మూడు లావాదేవీలు(ఇతర బ్యాంకు ఏటీఎంలలో), మిగతా చోట్ల ఐదు లావాదేవీలు ఉచితం. ఈ పరిమితి దాటితే కనీసం రూ.20 చొప్పున ప్రతి లావాదేవీకి వసూలు చేస్తున్నాయి. ఖాతా ఉన్న బ్యాంకు ఏటీఎంలలో ఉచిత లావాదేవీలు ఐదు వరకు చేసుకోవచ్చు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
హస్తిన ‘దండు’యాత్ర
హార్సిలీహిల్స్ ఘాట్రోడ్డుపై తలకిందులైన కారు
వివాహితపై అత్తింటివారి దాడి
Lok sabha elections 2024: లాలూ వర్సెస్ రోహిణి!
ESI scam: అవినీతి మరక.. అచ్చెన్నకు ఎరుక
వేడుకునేది ఓటర్ని కాదు! సూర్యుడ్ని!!
సాంఘిక విప్లవ నాయకుడు
Association for Democratic Reforms: మూడో విడతలో... మహిళలు 9 శాతమే
ఆనందంతో డైరెక్టర్ని హత్తుకున్నాను: సుహాస్
జాలీ రైడ్
తప్పక చదవండి
- జయరాం.. రాం!
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
Advertisement