-
Ranji- శార్దూల్ ఏమన్నాడో విన్నాను: ద్రవిడ్
దేశవాళీ క్రికెట్లో మ్యాచ్ల మధ్య ఎక్కువ విరామం ఉండాలన్న టీమిండియా పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ వ్యాఖ్యలపై హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. శార్దూల్ మాదిరే మెజారిటీ ఆటగాళ్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే తప్పక పరిగణనలోకి తీసుకోవాలని బీసీసీఐకి సూచించాడు. కాగా జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనప్పుడు రంజీల్లో కచ్చితంగా ఆడాలంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆటగాళ్లను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముంబై తరుఫు బరిలోకి దిగిన శార్దూల్ ఠాకూర్ సెమీ ఫైనల్లో అదరగొట్టాడు. అలా అయితే కష్టమే కదా తమిళనాడుతో జరిగిన ఈ మ్యాచ్లో సంచలన సెంచరీ(109)తో జట్టును ఫైనల్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. ‘‘కేవలం మూడు రోజుల గ్యాప్లో వరుసగా 10 మ్యాచ్లు ఆడటం అంటే దేశవాళీ క్రికెటర్లకు చాలా కష్టం. ముఖ్యంగా ఫాస్ట్బౌలర్లు ఎక్కువగా గాయాలబారిన పడే అవకాశం ఉంటుంది. గతంలో రెగ్యులర్ మ్యాచ్లకు మూడు రోజులు, నాకౌట్ మ్యాచ్లకు ఐదు రోజుల విరామం ఉండేది. కానీ.. ఇప్పుడు అన్నింటికి కేవలం మూడు రోజుల వ్యవధే ఉంటోంది’’ అని పేర్కొన్నాడు. శరీరాలను పణంగా పెడుతోంది వాళ్లే ఈ నేపథ్యంలో... ఇంగ్లండ్పై టీమిండియా 4-1 సిరీస్ విజయం తర్వాత హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్కు ఈ విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ఈ కామెంట్లు చేసింది శార్దూల్ అనుకుంటా.. అతడే కాదు చాలా మంది క్రికెటర్లు ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఇండియాలో లాంటి పెద్ద దేశంలో ప్రయణాలు, విరామం లేని షెడ్యూళ్లు అంటే కష్టమే. ఆటగాళ్ల ఇబ్బందుల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే.. విరామం లేని ఆట కోసం వారి శరీరాల(ఆరోగ్యాన్ని)ను పణంగా పెడుతోంది వాళ్లే. కాబట్టి.. ఇలాంటి అంశాల్ని లేవనెత్తుతూ వారు గళం వినిపించినపుడు తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా పలు మార్పులు చేర్పులు ఉండేలా షెడ్యూళ్లను ఎలా ప్లాన్ చేసుకోవాలో ఆలోచించుకోవాలి’’ అని రాహుల్ ద్రవిడ్ శార్దూల్ ఠాకూర్ వంటి ఆటగాళ్లకు అండగా నిలిచాడు. ఆధునిక యుగంలో అవసరం లేదనుకున్న కొన్ని టోర్నీల నిర్వహణ గురించి.. ఆటగాళ్లు, కోచ్ల నుంచి అభిప్రాయాలు సేకరించి పునరాలోచన చేస్తే బాగుంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. చదవండి: షూ కొనుక్కోవడానికీ డబ్బు లేదు.. అతడే ఆదుకున్నాడు -
షూ కొనేందుకు డబ్బు లేదు.. అతడే ఆదుకున్నాడు: శార్దూల్ భావోద్వేగం
“When I did not have money to buy shoes: ‘‘ఇదే తన చివరి ఫస్ట్క్లాస్ మ్యాచ్. తనతో పాటు నాకు కూడా భావోద్వేగ సమయం. చిన్ననాటి నుంచే అతడి ఆటను గమనిస్తూ ఉన్నాను. బౌలింగ్లో నాకెన్నో నైపుణ్యాలు నేర్పించాడు. అంతేకాదు.. షూ కొనడానికి నా దగ్గర డబ్బు లేని సమయంలో.. తన దగ్గర ఉన్న బూట్ల జతలు నాకు ఇచ్చాడు. కెరీర్ ఆరంభంలో నాకెంతో సహాయం చేశాడు’’ అని టీమిండియా క్రికెటర్, ముంబై ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఉద్వేగానికి లోనయ్యాడు. I.C.Y.M.I The Mumbai team gave a Guard Of Honour on Day 1 to Dhawal Kulkarni, who is playing his final first-class game 👏@dhawal_kulkarni | @IDFCFIRSTBank | #Final | #MUMvVID Follow the match ▶️ https://t.co/k7JhkLhOID pic.twitter.com/LTCs0142fc — BCCI Domestic (@BCCIdomestic) March 11, 2024 కాగా రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఫైనల్కు చేరుకున్న ముంబై.. టైటిల్ కోసం విదర్భతో పోటీ పడుతోంది. ఇరు జట్ల మధ్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ మొదలైంది. టాస్ ఓడిన ముంబై తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా(46), భూపేన్ లల్వాణి(37) మెరుగైన ఆరంభమే అందించినా.. విదర్భ బౌలర్ల దెబ్బకు మిడిలార్డర్ కుప్పకూలింది. ఫలితంగా 111 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన శార్దుల్ ఠాకూర్ (69 బంతుల్లో 75; 8 ఫోర్లు, 3 సిక్స్లు) విదర్భ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 37 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసిన శార్దుల్ చివరి వికెట్గా వెనుదిరిగాడు. దీంతో 224 పరుగుల వద్ద ముంబై తొలి ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం.. తొలి రోజే బ్యాటింగ్కు దిగిన విదర్భను ముంబై పేసర్ ధవళ్ కులకర్ణి దెబ్బకొట్టాడు. The experience of Dhawal Kulkarni provides Mumbai a wicket in the evening session! Vidarbha lose the crucial wicket of Karun Nair. Follow the match ▶️ https://t.co/L6A9dXYmZA#RanjiTrophy | #MUMvVID | #Final | @IDFCFIRSTBank pic.twitter.com/VNk7HAkgSU — BCCI Domestic (@BCCIdomestic) March 10, 2024 ధవళ్ కులకర్ణిని అభినందిస్తున్న సహచరులు (PC: PTI) మరో పేసర్ శార్దూల్ ఠాకూర్ కూడా రాణించాడు. తొలిరోజు ఆట ముగిసే ధవళ్ రెండు, శార్దూల్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆట పూర్తయ్యేసరికి విదర్భ 3 వికెట్లు కోల్పోయి 31 పరుగులు మాత్రమే చేసింది. ధవళ్ కులకర్ణి రిటైర్మెంట్ ఇదిలా ఉంటే.. 35 ఏళ్ల ధవళ్ కులకర్ణి ఈ మ్యాచ్ తర్వాత ఫస్ట్క్లాస్ క్రికెట్ నుంచి కూడా సెలవు తీసుకోకున్నాడు. ఇప్పటికే రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన ఈ రైటార్మ్ పేసర్.. మోహిత్ అవస్థి గాయం కారణంగా విదర్భతో ఫైనల్ మ్యాచ్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో తొలి రోజు ఆట అనంతరం శార్దూల్ ఠాకూర్ మాట్లాడుతూ.. ధవళ్ కులకర్ణితో తన అనుబంధం గురించి గుర్తుచేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాను బాధపడిన సమయంలో కులకర్ణి తనకు అండగా నిలబడ్డాడంటూ అభిమానం చాటుకున్నాడు. చదవండి: Ind vs Eng 2024: టీమిండియా నయా సంచలనాలు.. ధనాధన్ దంచికొట్టి హీరోలుగా! -
మరోసారి రెచ్చిపోయిన శార్దూల్ ఠాకూర్
టీమిండియా ఆల్రౌండర్, ముంబై ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ రంజీల్లో చెలరేగిపోతున్నాడు. ఇటీవల తమిళనాడుతో జరిగిన సెమీఫైనల్లో మెరుపు శతకం (104 బంతుల్లో 109) బాది జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన శార్దూల్.. ప్రస్తుతం విదర్భతో జరుగుతున్న ఫైనల్లో విధ్వంసకర అర్దసెంచరీ (69 బంతుల్లో 75; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ను అందించాడు. Century in the semi-final& a brilliant 75 when the team was struggling at 111-6 in finalLORD @imShard show in #RanjiTrophy2024 🔥pic.twitter.com/U1vjWvk9Ws— CricTracker (@Cricketracker) March 10, 2024 ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. విదర్భ బౌలర్లు రెచ్చిపోవడంతో 224 పరుగులకే పరిమితమైంది. హర్ష్ దూబే (3/62), యశ్ ఠాకూర్ (3/54), ఉమేశ్ యాదవ్ (2/43), ఆదిత్య థకారే (1/36) ముంబై పతనాన్ని శాశించారు. ముంబై ఇన్నింగ్స్లో శార్దూల్ ఠాకూర్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ముంబై ఇన్నింగ్స్కు ఓపెనర్లు పృథ్వీ షా (46), భూపేన్ లాల్వాని (37) శుభారంభాన్ని అందించినప్పటికీ.. మిడిలార్డర్ వైఫల్యం ఆ జట్టు కొంప ముంచింది. ముషీర్ ఖాన్ (6), అజింక్య రహానే (7), శ్రేయస్ అయ్యర్ (7), హార్దిక్ తామోర్ (5), షమ్స్ ములానీ (13) తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరారు. భీకరఫామ్లో ఉన్న 10, 11వ ఆటగాళ్లు తనుశ్ కోటియన్ (8), తుషార్ దేశ్పాండే (14) ఈ మ్యాచ్లో చేతులెత్తేశారు. బ్యాటింగ్లో రాణించిన శార్దూల్.. బౌలింగ్లోనూ సత్తా చాటాడు. ముంబై ఇన్నింగ్స్ అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భను శార్దూల్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. శార్దూల్ విదర్భ ఓపెనర్, ఇన్ ఫామ్ బ్యాటర్ దృవ్ షోరేను డకౌట్ చేసి పెవిలియన్కు పంపాడు. నాలుగు ఓవర్ల అనంతరం విదర్భ స్కోర్ వికెట్ నష్టానికి నాలుగు పరుగులుగా ఉంది. -
తమిళనాడును చిత్తు చేసిన ముంబై.. రికార్డు స్థాయిలో 48వ సారి ఫైనల్లోకి ప్రవేశం
ముంబై క్రికెట్ జట్టు రంజీ ట్రోఫీలో తమ గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఈ జట్టు రికార్డు స్థాయిలో 48వ సారి ఫైనల్లోకి ప్రవేశించింది. రంజీ ట్రోఫీ చరిత్రలో ఏ జట్టు ఇన్ని సార్లు ఫైనల్స్కు అర్హత సాధించలేదు. ముంబై తర్వాత ఆత్యధికంగా (14) కర్ణాటక/మైసూర్ ఫైనల్స్కు చేరింది. ఈ రెండు జట్ల తర్వాత ఢిల్లీ (15), మధ్యప్రదేశ్/హోల్కర్ (12), బరోడా (9), సౌరాష్ట్ర (5), విదర్భ (2), బెంగాల్ (15), తమిళనాడు/మద్రాస్ (12), రాజస్థాన్ (10), హైదరాబాద్ (5) అత్యధిక సార్లు ఫైనల్స్కు అర్హత సాధించాయి. దేశవాలీ టోర్నీలో 48 సార్లు ఫైనల్స్కు చేరిన ముంబై ఏ జట్టుకు ఊహకు సైతం అందని విధంగా 41 సార్లు టైటిల్ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్గా సౌరాష్ట్ర ఉంది. ఈ జట్టు అనూహ్య రీతిలో క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టింది. మ్యాచ్ విషయానికొస్తే.. ఇవాళ (మార్చి 4) ముగిసిన రెండో సెమీఫైనల్లో ముంబై తమిళనాడును ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో చిత్తు చేసింది. శార్దూల్ ఠాకూర్ ఆల్రౌండ్ షోతో (109, 4 వికెట్లు) ముంబై గెలుపులో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు తొలి ఇన్నింగ్స్లో 146 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ముంబై తొలి ఇన్నింగ్స్లో 378 పరుగుల భారీ స్కోర్ చేసింది. శార్దూల్ ఠాకూర్ మెరుపు సెంచరీతో విరుచుకుపడ్డాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో సైతం చేతులెత్తేసిన తమిళనాడు 162 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్న శార్దూల్ ఠాకూర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మరోవైపు మధ్యప్రదేశ్తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో విదర్భ 199 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఆట మూడో రోజు కొనసాగుతుంది. -
శార్దూల్, హిమాన్షు శతకాలు.. ముంబై, మధ్యప్రదేశ్ పైచేయి
రంజీ ట్రోఫీ 2024 సెమీఫైనల్స్లో ముంబై, మధ్యప్రదేశ్ జట్లు పైచేయి సాధించాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఈ రెండు జట్లు.. తమతమ ప్రత్యర్దుల కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. ముంబై తమిళనాడుపై.. మధ్యప్రదేశ్ విదర్భపై ఆధిక్యతను ప్రదర్శిస్తున్నాయి. హిమాన్షు సూపర్ సెంచరీ.. నాగ్పూర్లో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో విదర్భ రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెకెండ్ ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది. ఈ జట్టు మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 69 పరుగులు వెనుకపడి ఉంది. అథర్వ తైడే (2) ఔట్ కాగా.. దృవ్ షోరే (10), అక్షయ్ వాఖరే (1) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు హిమాన్షు మంత్రి (126) సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులు చేసింది. హిమాన్షు మినహా మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్లో ఎవరూ రాణించలేకపోయారు. ఉమేశ్ యాదవ్ (3/40), యశ్ ఠాకూర్ (3/51), వాఖరే (2/68), సర్వటే (1/48) మధ్యప్రదేశ్ పతనాన్ని శాశించారు. దీనికి ముందు ఆవేశ్ ఖాన్ (4/49) విజృంభించడంతో విదర్భ తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే ఆలౌటైంది. కరుణ్ నాయర్ (63) టాప్ స్కోరర్గా నిలిచాడు. శతక్కొట్టిన శార్దూల్.. ముంబై వేదికగా తమిళనాడుతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో ముంబై ఆధిక్యత ప్రదర్శిస్తుంది. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన శార్దూల్ (109) మెరుపు శతకంతో విరుచుకుపడటంతో ముంబై తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. 10, 11 స్థానాల్లో వచ్చి సెంచరీలతో (క్వార్టర్ ఫైనల్స్లో) సంచలనం సృష్టించిన తనుశ్ కోటీయన్ (74), తుషార్ దేశ్ పాండే (17) క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం ముంబై 207 పరుగుల లీడ్లో కొనసాగుతుంది. సాయికిషోర్ ఆరేసి (6/97) ముంబైను దెబ్బకొట్టాడు. అంతకుముందు తమిళనాడు తొలి ఇన్నింగ్స్లో 146 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లు సంయుక్తంగా రాణించడంతో తమిళనాడు ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. తుషార్ దేశ్ పాండే 3, ముషీర్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, తనుశ్ కోటియన్ తలో 2 వికెట్లు, మోహిత్ అవస్థి ఓ వికెట్ పడగొట్టారు. తమిళనాడు ఇన్నింగ్స్లో విజయ్ శంకర్ (44), వాషింగ్టన్ సుందర్ (43) కాస్త పర్వాలేదనిపించగా.. మిగతా వాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. -
సెంచరీ సాధించిన శార్దూల్ ఠాకూర్.. మొట్టమొదటిది
ముంబై ఆటగాడు, టీమిండియా ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ సెంచరీతో (109) మెరిశాడు. రంజీ ట్రోఫీ 2024లో భాగంగా తమిళనాడుతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో అతను ఈ ఫీట్ను సాధించాడు. జట్టు కష్టాల్లో (106/7) ఉన్నప్పుడు బరిలోకి దిగిన శార్దూల్.. బాధ్యతాయుతంగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీని అతను కేవలం 89 బంతుల్లోనే సాధించాడు. ఇందులో 13 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. రంజీల్లో శార్దూల్కు ఇది మొదటి సెంచరీ. Shardul Thakur 🫡pic.twitter.com/6ySG9JOwcA — CricTracker (@Cricketracker) March 3, 2024 శార్దూల్ సెంచరీతో కదంతొక్కడంతో ముంబై తమ తొలి ఇన్నింగ్స్లో గౌరవప్రదమైన స్కోర్ చేసింది. 88 ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసి, 157 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. తనుశ్ కోటియన్ (40), తుషార్ దేశ్పాండే క్రీజ్లో ఉన్నారు. ముంబై ఇన్నింగ్స్లో ముషీర్ ఖాన్ (55) అర్ద సెంచరీతో రాణించగా.. హార్దిక్ తామోర్ (35) పర్వాలేదనిపించాడు. సాయికిషోర్ (6/79) ముంబైని ముప్పుతిప్పలు పెట్టాడు. కుల్దీప్ సేన్ 2, సందీప్ వారియర్ ఓ వికెట్ దక్కించకున్నారు. దీనికి ముందు తొలి ఇన్నింగ్స్లో తమిళనాడు 146 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లు సంయుక్తంగా రాణించడంతో తమిళనాడు ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. తుషార్ దేశ్ పాండే 3, ముషీర్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, తనుశ్ కోటియన్ తలో 2 వికెట్లు, మోహిత్ అవస్థి ఓ వికెట్ పడగొట్టారు. తమిళనాడు ఇన్నింగ్స్లో విజయ్ శంకర్ (44), వాషింగ్టన్ సుందర్ (43) కాస్త పర్వాలేదనిపించగా.. మిగతా వాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. -
రికార్డుల్లోకెక్కిన తమిళనాడు కెప్టెన్
తమిళనాడు రంజీ జట్టు కెప్టెన్ సాయికిషోర్ రికార్డు పుటల్లోకెక్కాడు. ముంబైతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో 6 వికెట్లు తీయడం ద్వారా ప్రస్తుత సీజన్లో తన వికెట్ల సంఖ్యను 52 పెంచుకున్నాడు. తద్వారా ఓ రంజీ సీజన్లో 50 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన మూడో తమిళ బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. అలాగే ప్రస్తుత సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గానూ నిలిచాడు. ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో సాయికిషోర్ తర్వాత అజిత్ రామ్ (41), ధరేంద్ర సిన్హ్ జడేజా (41), హితేశ్ వాలుంజ్ (41), గౌరవ్ యాదవ్ (41) ఉన్నారు. ఇదిలా ఉంటే, ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో తమిళనాడు తడబాటుకు గురైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న తమిళనాడు.. ముంబై బౌలర్లు సంయుక్తంగా రాణించడంతో 146 పరుగులకే కుప్పకూలింది. తుషార్ దేశ్ పాండే 3, ముషీర్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, తనుశ్ కోటియన్ తలో 2 వికెట్లు, మోహిత అవస్థి ఓ వికెట్ పడగొట్టారు. తమిళనాడు ఇన్నింగ్స్లో విజయ్ శంకర్ (44), వాషింగ్టన్ సుందర్ కాస్త పర్వాలేదనిపించగా.. మిగతా వాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై... శార్దూల్ ఠాకూర్ (82 నాటౌట్), ముషీర్ ఖాన్ (55) రాణించడంతో రెండో రోజు మూడో సెషన్ సమయానికి 8 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. హార్దిక్ తామోర్ (35) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. శార్దూల్కు జతగా నుశ్ కోటియన్ (20) క్రీజ్లో ఉన్నాడు. సాయికిషోర్ (6/79) ముంబైని ముప్పుతిప్పలు పెట్టాడు. సందీప్ వారియర్, కుల్దీప్ సేన్ తలో వికెట్ దక్కించకున్నారు. ప్రస్తుతం ముంబై 108 పరుగుల లీడ్లో ఉంది. -
దుమ్ములేపిన శార్దూల్, తుషార్.. విఫలమైన పృథ్వీ షా
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ రెండో సెమీ ఫైనల్లో ముంబై- తమిళనాడు తలపడుతున్నాయి. శరద్ పవార్ క్రికెట్ అకాడమీలో శనివారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన తమిళనాడు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ముంబై పేసర్ల దెబ్బకు కేవలం 146 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. తొలుత.. ‘లార్డ్’ శార్దూల్ ఠాకూర్.. తమిళనాడు ఓపెనర్ సాయి సుదర్శన్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని డకౌట్గా వెనక్కిపంపాడు. ఆ తర్వాత మరో ఇద్దరు ఫాస్ట్బౌలర్లు మోహిత్ అవస్థి, తుషార్ దేశ్పాండే తమిళ బ్యాటర్ల పనిపట్టారు. మోహిత్.. ఎన్ జగదీశన్(4) రూపంలో వికెట్ దక్కించుకోగా.. ప్రదోష్ పాల్(8), కెప్టెన్ సాయి కిషోర్(1), ఇంద్రజిత్ బాబా(11) వికెట్లు పడగొట్టాడు. ఇక ప్రమాదకరంగా మారుతున్న విజయ్ శంకర్(44)ను శార్దూల్ ఠాకూర్ అవుట్ చేసి మరోసారి బ్రేక్ అందించగా.. అర్ధ శతకం దిశగా వెళ్తున్న వాషింగ్టన్ సుందర్(43)ను స్పిన్నర్ తనుశ్ కొటియాన్ పెవిలియన్కు పంపాడు. ఓవరాల్గా తమిళనాడు తొలి ఇన్నింగ్స్లో పేసర్లు శార్దూల్ రెండు, తుషార్ దేశ్పాండే మూడు, మోహిత్ అవస్థి ఒక వికెట్ తీయగా.. స్పిన్నర్లు తనుశ్ కొటియాన్, ముషీర్ ఖాన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో తొలిరోజే తమిళనాడు ఆలౌట్ చేసి.. బ్యాటింగ్ మొదలుపెట్టిన ముంబైకి కూడా శుభారంభం లభించలేదు. ఓపెనర్లు పృథ్వీ షా(5), భూపేన్ లల్వానీ(15) పూర్తిగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం నాటి ఆట పూర్తయ్యేసరికి ముంబై తమ తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. తమిళనాడు కంటే ప్రస్తుతం 101 పరుగులు వెనుకబడి ఉంది. Early Breakthroughs for Mumbai 🙌 Shardul Thakur and Mohit Avasthi get the big wickets of Sai Sudharsan and N Jagadeesan, respectively 👌👌@IDFCFIRSTBank | #RanjiTrophy | #MUMvTN | #SF2 Follow the match ▶️ https://t.co/697JfqUC9i pic.twitter.com/H1cgkXWzpO — BCCI Domestic (@BCCIdomestic) March 2, 2024 -
రెచ్చిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు
రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 16) మొదలైన వేర్వేరు మ్యాచ్ల్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్ ఇరగదీశారు. సర్వీసెస్తో జరుగుతున్న మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ (మహారాష్ట్ర) తృటిలో సెంచరీ (96) చేజార్చుకోగా.. అసోంతో జరుగుతున్న మ్యాచ్లో శివమ్ దూబే మెరుపు శతకంతో (95 బంతుల్లో 101 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఇదే మ్యాచ్లో మరో సీఎస్కే ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ బంతితో వీరవిహారం చేశాడు. శార్దూల్ కేవలం 21 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇలా ఒకే రోజు ముగ్గురు సీఎస్కే ఆటగాళ్లు సత్తా చాటడంతో ఆ ఫ్రాంచైజీ అభిమానులు సంబురపడిపోతున్నారు. ఈసారి కూడా ప్రత్యర్దులకు దబిడిదిబిడే అంటూ రచ్చ చేస్తున్నారు. సీఎస్కే ఆటగాళ్లు ఇదే ఫామ్ను కొనసాగిస్తే.. టైటిల్ నిలబెట్టుకోవడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. గతేడాది ఐపీఎల్లో ధోని నేతృత్వంలో సీఎస్కే ఐదో సారి ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. రాబోయే సీజన్కు సంబంధించి సీఎస్కే ఇప్పటికే ట్రైనింగ్ క్యాంప్ను స్టార్ట్ చేసింది. కెప్టెన్ ధోనితో పాటు అందుబాటులో ఉన్న ప్లేయర్లతో క్యాంప్ నడుస్తుంది. కాగా, సీఎస్కే ఆటగాళ్లు రాణించడంతో అసోంతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై పట్టుబిగించింది. శార్దూల్ ఠాకూర్ ఆరేయడంతో అసోం తొలి ఇన్నింగ్స్లో 84 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ముంబై.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. 101 పరుగులతో దూబే, 2 పరుగులతో శార్దూల్ క్రీజ్లో ఉన్నారు. ఇప్పటికే ఆ జట్టు 133 పరుగుల లీడ్లో ఉంది. సర్వీసెస్తో జరుగుతున్న మ్యాచ్లో రుతురాజ్ రాణించినప్పటికీ మహారాష్ట్ర తడబడింది. సర్వీసెస్ బౌలర్లు అర్జున్ శర్మ (5/59), వరుణ్ చౌదరీ (4/39) విజృంభించడంతో ముంబై 225 పరుగులకే ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సర్వీసెస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. -
మెరుపు శతకంతో విరుచుకుపడిన శివమ్ దూబే
రంజీ ట్రోఫీ 2024లో భాగంగా అసోంతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఆటగాడు శివమ్ దూబే మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 87 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో శతక్కొట్టాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగిన దూబే అసోం బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. ముంబై ఇన్నింగ్స్లో రెండో అత్యధిక స్కోర్ 31 పరుగులు (షమ్స్ ములానీ) కాగా.. దూబే ఒక్కడే వన్ మ్యాన్ షో నడిపించాడు. గత మ్యాచ్లో రెస్ట్ తీసుకున్న దూబే రీఎంట్రీలో అదగొట్టాడు. ఈ ఇన్నింగ్స్లో 95 బంతులు ఎదుర్కొన్న దూబే 101 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతనితో పాటు శార్దూల్ ఠాకూర్ (2) క్రీజ్లో ఉన్నాడు. ముంబై ఇన్నింగ్స్లో పృథ్వీ షా 30, భుపేన్ లాల్వాని 0, హార్దిక్ తామోర్ 22, కెప్టెన్ అజింక్య రహానే 22, సుయాంశ్ షేడ్గే 0, షమ్స ములానీ 31 పరుగులు చేసి ఔటయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ముంబై స్కోర్ తొలి ఇన్నింగ్స్లో 217/6గా ఉంది. అసోం బౌలర్లలో దిబాకర్ జోహ్రి, రాహుల్ సింగ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. సునీల్ లచిత్, కునాల్ శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇవాళే మొదలైన ఈ మ్యాచ్లో అసోం టాస్ ఓడి ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. అసోం బ్యాటర్లను శార్దూల్ ఠాకూర్ ఉతికి ఆరేశాడు (6/21). శార్దూల్తో పాటు షమ్స్ ములానీ (2/8), తుషార్ దేశ్పాండే (1/32), మోహిత్ అవస్థి (1/10) కూడా చెలరేగడంతో అసోం ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆ జట్టు 84 పరుగులకే ఆలౌటైంది. అసోం ఇన్నింగ్స్లో అభిషేక్ ఠాకూరీ (31), సాహిల్ జైన్ (12), అబ్దుల్ అజీజ్ ఖురేషి (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
నిప్పులు చెరిగిన శార్దూల్ ఠాకూర్.. 84 పరుగులకే కుప్పకూలిన ప్రత్యర్ది
రంజీ ట్రోఫీ 2024లో భాగంగా ఆసోంతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై మీడియం పేసర్ శార్దూల్ ఠాకూర్ నిప్పులు చెరిగాడు. కేవలం 21 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా అసోం 84 పరుగులకే కుప్పకూలింది. శార్దూల్తో పాటు షమ్స్ ములానీ (2/8), తుషార్ దేశ్పాండే (1/32), మోహిత్ అవస్థి (1/10) కూడా చెలరేగడంతో అసోం ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. అసోం ఆటగాళ్లలో అభిషేక్ ఠాకూరీ (31), సాహిల్ జైన్ (12), అబ్దుల్ అజీజ్ ఖురేషి (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. SHARDUL THAKUR MASTERCLASS 🤯 - Thakur took 6 wickets for just 21 runs against Assam in Ranji Trophy. pic.twitter.com/usthQsPu2Z — Johns. (@CricCrazyJohns) February 16, 2024 అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై టీ విరామం (24.4 ఓవర్లు) సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. ముంబై ఓపెనర్లలో పృథ్వీ షా వేగంగా 30 పరుగులు చేసి ఆకట్టుకోగా.. భుపేన్ లల్వాని డకౌటయ్యాడు. వన్డౌన్లో బరిలోకి దిగిన హార్దిక్ తామోర్ 22 పరుగులు చేయగా.. ఐదో నంబర్ ఆటగాడు సుయాంశ్ షేడ్గే డకౌటయ్యాడు. కెప్టెన్ అజింక్య రహానే (18), శివమ్ దూబే (26) క్రీజ్లో ఉన్నారు. అసోం బౌలర్లలో రాహుల్ సింగ్ 2, సునలీ లచిత్, దిబాకర్ జోహ్రి తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. -
శివం దూబే దూరం.. శార్దూల్ ఠాకూర్ ఎంట్రీ!
Ranji Trophy 2023-24: ముంబై తాత్కాలిక కెప్టెన్ శివం దూబే జట్టుకు దూరమయ్యాడు. కండరాల నొప్పితో బాధపడుతున్న అతడికి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. కాగా అఫ్గనిస్తాన్తో టీమిండియా టీ20 సిరీస్ ముగించుకున్న తర్వాత ఆల్రౌండర్ శివం దూబే ఫస్ట్క్లాస్ క్రికెట్పై దృష్టి పెట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్తో పాటు టీమిండియా టెస్టు రేసులోనూ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా ముంబై తరఫున రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ బరిలో దిగాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లలో రెండు హాఫ్ సెంచరీలతో పాటు ఓ శతకం(117) బాదాడు. బౌలింగ్లోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. బెంగాల్తో మ్యాచ్లో కెప్టెన్గా హిట్ ఈ క్రమంలో అజింక్య రహానే గైర్హాజరీలో ఆఖరిగా ముంబై ఆడిన మ్యాచ్లో కెప్టెన్గా వ్యవహరించే అవకాశం దక్కించుకున్నాడు. బెంగాల్తో ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్లో దూబే 72 పరుగులు సాధించాడు. అదే విధంగా రెండు వికెట్లు కూడా తీసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, బెంగాల్తో మ్యాచ్ సందర్భంగా శివం దూబే కండరాలు పట్టేసినట్లు సమాచారం. ఈ విషయం గురించి ముంబై చీఫ్ సెలక్టర్ రాజు కులకర్ణి మాట్లాడుతూ.. ముందు జాగ్రత్త చర్యలో భాగంగానే దూబేకు రెస్ట్ ఇచ్చినట్లు తెలిపాడు. శార్దూల్ ఠాకూర్ ఎంట్రీ నాకౌట్ మ్యాచ్ల సమయానికి అతడు అందుబాటులోకి వస్తాడని తెలిపాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ ముంబై తరఫున రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. సౌతాఫ్రికా టూర్లో గాయపడిన అతడు రంజీ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఫిబ్రవరి 9 నుంచి ఛత్తీస్గఢ్తో మ్యాచ్కు కెప్టెన్ అజింక్య రహానే తిరిగి జట్టుతో చేరనున్నాడు. చదవండి: అరిచీ.. అరిచీ.. నా గొంతు పోయింది: రోహిత్ శర్మ వ్యాఖ్యలు వైరల్ -
IND Vs SA: 'దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు.. అతడి కంటే అశ్విన్ను తీసుకోవడమే బెటర్'
కేప్ టౌన్లోని న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో ఘోర ఓటమి చవిచూసిన టీమిండియా.. ఈ మ్యాచ్లో తిరిగి పుంజుకుని సిరీస్ను సమం చేయాలని పట్టుదలతో ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా మాత్రం తమ సొంత గడ్డపై మరోసారి భారత్ను చిత్తు చేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే కేప్టౌన్కు చేరుకున్న భారత జట్టు మంగళవారం తమ ఆఖరి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనుంది. ఇక తొలి మ్యాచ్కు దూరమైన స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దీంతో అతడు రెండో టెస్టుకు భారత తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. జడ్డూ ప్లేయింగ్ ఎలెవన్లోకి వస్తే వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్పై వేటు పడే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రెండో టెస్టులో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్కు బదులుగా అశ్విన్ ఆడించాలని శ్రీకాంత్ సూచించాడు. అశ్విన్ను రెండో టెస్టులో కూడా కొనసాగించాలి. శార్దూల్ ఠాకూర్ కంటే అశ్విన్ బెటర్ అని నేను భావిస్తున్నాను. జడేజా ఫిట్నెస్ సాధించినప్పటికీ శార్దూల్ స్థానంలో అశ్విన్ను ఆడించాలి. అశ్విన్ ఐదు వికెట్ల హాల్స్ సాధించికపోయినప్పటికీ.. ఒకట్రెండు వికెట్లైనా తీయగలడు. అతడు జడేజాతో కలిసి ప్రత్యర్ధి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. వీరిద్దరూ కలిసి నాలుగు-ఐదు వికెట్ల తీయగలరు. కేప్టౌన్లో దక్షిణాఫ్రికా బ్యాటర్లను కట్టడి చేయాలంటే స్పిన్నర్లే కీలకం. భారత్ గట్టిగా ప్రయత్నిస్తే అక్కడ కూడా సఫారీలను ఓడించవచ్చు. కేవలం ఒక్క టెస్టు మాత్రమే ఆడిన పేసర్ ప్రసిద్ద్ కృష్ణను పక్కనపెట్టడం సరైన నిర్ణయం కాదు. కాబట్టి తొలి టెస్టులో దారుణంగా విఫలమైన శార్ధూల్పై వేటు వేయడం బెటర్ అని తన యూట్యూబ్ ఛానల్లో శ్రీకాంత్ పేర్కొన్నాడు. చదవండి: Aus Vs Pak 3rd Test: వార్నర్ ఫేర్వెల్ టెస్టు.. ఆస్ట్రేలియా తుది జట్టు ప్రకటన -
టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఆల్రౌండర్కు గాయం
సెంచూరియన్: తొలి టెస్టులో ఓడిన భారత్కు మరో దెబ్బ! బౌలింగ్ ఆల్రౌండర్గా సెంచూరియన్ టెస్టు ఆడిన శార్దుల్ ఠాకూర్ గాయపడ్డాడు. అయితే ఇది మ్యాచ్ సమయంలో కాదు! నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా అతని ఎడమ భుజానికి గాయమైంది. వెంటనే జట్టు ఫిజియో ఐస్ ప్యాక్తో ఉపశమన సపర్యలు చేశాడు. అనంతరం మళీ ప్రాక్టీస్కు దిగలేదు. దీంతో అతను కేప్టౌన్లో జనవరి 3 నుంచి జరిగే ఆఖరి టెస్టుకు దూరమయ్యే అవకాశముంది. గాయం తీవ్రతను తెలుసుకునేందుకు శార్దుల్ భుజానికి స్కానింగ్ తీయాల్సి ఉంది. దీన్నిబట్టే అతను అందుబాటులో ఉంటాడ లేదా అనే విషయంపై స్పష్టత వస్తుంది. సఫారీ బౌలర్ కొయెట్జీ అవుట్ దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కొయెట్జీ రెండో టెస్టుకు దూరమయ్యాడు. 23 ఏళ్ల బౌలర్ పొత్తికడుపు నొప్పితో సతమతమవుతున్నాడు. ఈ నొప్పితోనే తొలిటెస్టు ఆడటంతో వాపు మొదలైందని జట్టు వర్గాలు తెలిపాయి. దీంతో కొయెట్జీ కేప్టౌన్ టెస్టుకు అందుబాటులో లేడని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సోషల్ మీడియా ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది. ఇదివరకే రెగ్యులర్ కెపె్టన్ బవుమా కూడా గాయంతో రెండో టెస్టుకు గైర్హాజరు కానున్నాడు. కొయెట్జీ స్థానాన్ని ఎన్గిడి, ముల్డర్లలో ఒకరితో భర్తీ చేసే అవకాశముంది. -
నెట్స్లో రోహిత్ ప్రాక్టీస్.. టీమిండియా స్టార్కు గాయం
South Africa Vs India 2nd Test: సౌతాఫ్రికాతో తొలి టెస్టులో చిత్తుగా ఓడిపోయిన టీమిండియా రెండో మ్యాచ్కు సన్నద్ధం అవుతోంది. లోపాలు సవరించుకుని ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు వీలుగా నెట్స్లో చెమటోడుస్తోంది. ముఖ్యంగా సెంచూరియన్ టెస్టులో ఓపెనర్గా విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ మరింత కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. హిట్మ్యాన్ కఠిన ప్రాక్టీస్ నెట్స్లో వైవిధ్యమైన బంతులు ఎదుర్కొంటూ కేప్టౌన్ టెస్టుకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే.. ప్రాక్టీస్ సందర్భంగా భారత పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ గాయపడినట్లు సమాచారం. త్రోడౌన్స్ ఎదుర్కొంటూ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతడి భుజానికి గాయమైనట్లు తెలుస్తోంది. The Indian skipper @ImRo45 at Centurion nets. #INDvSA Video Courtesy: @kushansarkar pic.twitter.com/p0pvmbkyEX — Kushan Sarkar (@kushansarkar) December 30, 2023 షార్ట్ బాల్ను ఆడటంలో విఫలమైన శార్దూల్.. బంతి ఎడమ భుజానికి తాకడంతో నొప్పితో విలవిల్లాడగా.. ఫిజియో వచ్చి ఐస్ప్యాక్ పెట్టాడు. అయితే, నొప్పి నుంచి పూర్తిగా ఉపశమనం లభించకపోవడంతో అతడు మళ్లీ బౌలింగ్ ప్రాక్టీస్కు కూడా అందుబాటులో ఉండలేకపోయాడు. పూర్తిగా విఫలమైన శార్దూల్.. యువ పేసర్ ఎంట్రీ! ఒకవేళ నొప్పి తీవ్రతరమైతే అతడిని స్కానింగ్ పంపాలని వైద్య సిబ్బంది భావిస్తోంది. కాగా ఒకవేళ గాయం కారణంగా శార్దూల్ ఠాకూర్ రెండో టెస్టుకు దూరమైతే అతడి స్థానంలో ఆవేశ్ ఖాన్ లేదంటే ముకేశ్ కుమార్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అలా గాకుండా శార్దూల్ అందుబాటులో ఉన్నా కూడా మేనేజ్మెంట్ అతడిపై వేటు వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తొలి టెస్టులో ఆల్రౌండర్గా అతడి ప్రదర్శన దారుణంగా ఉండటమే ఇందుకు కారణం. సెంచూరియన్లో జరిగిన బాక్సింగ్ డే మ్యాచ్లో శార్దూల్ 19 ఓవర్ల బౌలింగ్లో ఏకంగా 100 పరుగులు ఇచ్చి పూర్తిగా నిరాశపరిచాడు. ఇక బ్యాటర్గా తొలి ఇన్నింగ్స్లో 24 పరుగులతో పర్వాలేదనిపించిన శార్దూల్ ఠాకూర్.. రెండో ఇన్నింగ్స్లో కేవలం రెండు పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా- టీమిండియా మధ్య జనవరి 3 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. చదవండి: Future Legend: గిల్ సూపర్ టాలెంట్.. దిగ్గజ ఆటగాడిగా ఎదుగుతాడు! రచిన్ సైతం... STORY | Shardul Thakur gets hit on shoulder at nets in South Africa READ: https://t.co/CCreEtNC8Q VIDEO: #INDvsSA pic.twitter.com/4357zyDm3J — Press Trust of India (@PTI_News) December 30, 2023 -
IND Vs SA: దక్షిణాఫ్రికా బౌలర్ రాకాసి బౌన్సర్.. శార్దూల్కు తప్పిన ప్రమాదం
సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి రోజు ఆటముగిసింది. మొదటి రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్లో సఫారీ పేసర్లు భారత బ్యాటర్లకు చుక్కలు చూపించారు. నిప్పులు చెరిగే బంతులను సంధించారు. ఈ క్రమంలో టీమిండియా బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్కు పెను ప్రమాదం తప్పింది. ఏమి జరిగిందంటే? భారత తొలి ఇన్నింగ్స్ 44 ఓవర్లో మూడో బంతిని గంటకు 148 కిలోమీటర్ల వేగంతో ప్రోటీస్ యువ పేసర్ కోయిట్జీ బౌన్సర్గా సంధించాడు. శార్ధూల్ ఆ బంతిని ఫుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతిని అంచనా వేయడంలో శార్ధూల్ విఫలమయ్యాడు. దీంతో బంతి బ్యాట్కు మిస్స్ అయ్యి అతడి హెల్మెట్కు బలంగా తాకింది. ఠాకూర్ నుదిటిపై వాపు వచ్చింది. మైదానంలో నొప్పితో విల్లావిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి కంకషన్ టెస్టు చేశాడు. ఆ తర్వాత శార్దూల్ మళ్లీ బ్యాటింగ్ ప్రారంభించాడు. రబాడ వేసిన ఓవర్లో మళ్లీ బంతి శార్ధూల్ చేతికి తగిలింది. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. అయితే దెబ్బ తగిలిన తర్వాతి బంతికే శార్దూల్ (33 బంతుల్లో 24) ఔటయ్యాడు. చదవండి: IND vs SA 1st Test: టీమిండియాతో తొలి టెస్టు.. దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్ -
IPL 2024: స్టార్క్, కమిన్స్లకు భారీ ధర.. శార్దూల్ ఠాకూర్కు జాక్పాట్..!
ఐపీఎల్ 2024 వేలం రేపు (డిసెంబర్ 19) దుబాయ్లోని కోకాకోలా ఎరీనాలో జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ వేలం రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతుంది. ఈ వేలానికి ముందు ఇవాళ (డిసెంబర్ 18) అదే వేదికపై మాక్ ఆక్షన్ (డమ్మీ వేలం) జరిగింది. ఈ వేలంలో పలువురు స్టార్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కోసం ఆర్సీబీ చిన్న సైజ్ యుద్దమే చేసింది. ఆ జట్టు ప్రతినిధి మైక్ హెస్సన్ స్టార్క్ను 18.5 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నాడు. మాక్ వేలంలో ఇదే అత్యధిక ధర. స్టార్క్ తర్వాత సౌతాఫ్రికా యంగ్ గన్ గెరాల్డ్ కొయెట్జీ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. చివరికి కొయెట్జీని గుజరాత్ టైటాన్స్ 18 కోట్లకు దక్కించుకుంది. వీరిద్దరి తర్వాత ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. అంతిమంగా కమిన్స్ను 17.5 కోట్లకు సన్రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఈ మాక్ ఆక్షన్లో ఎవరూ ఊహించని ధరకు లార్డ్ శార్దూల్ ఠాకూర్ అమ్ముడుపోయాడు. శార్దూల్ను పంజాబ్ కింగ్స్ 14 కోట్లకు దక్కించుకుంది. లంక పేసర్ దిల్షన్ మధుషంక, లంక స్పిన్నర్ వనిందు హసరంగ, ఆసీస్ స్టార్ బ్యాటర్, వరల్డ్కప్ హీరో ట్రవిస్ హెడ్ల కోసం కూడా ఫ్రాంచైజీలు తెగ పోటీపడ్డాయి. మధుషంకను కేకేఆర్ (10.5 కోట్లు), హ్యారీ బ్రూక్ను గుజరాత్ టైటాన్స్ ( 9.5 కోట్లు), హసరంగను (8.5 కోట్లు), ట్రవిస్ హెడ్లను (7 కోట్లు) సీఎస్కే దక్కించుకున్నాయి. మిచెల్ స్టార్క్- 18.5 కోట్లు (ఆర్సీబీ) గెరాల్డ్ కొయెట్జీ-18 కోట్లు (గుజరాత్ టైటాన్స్) పాట్ కమిన్స్- 17.5 కోట్లు (సన్రైజర్స్ హైదరాబాద్) శార్దూల్ ఠాకూర్-14 కోట్లు (పంజాబ్ కింగ్స్) దిల్షన్ మధుషంక-10.5 కోట్లు (కేకేఆర్) హ్యారీ బ్రూక్- 9.5 కోట్లు (గుజరాత్ టైటాన్స్) వనిందు హసరంగ-8.5 కోట్లు (సీఎస్కే) ట్రవిస్ హెడ్- 7 కోట్లు (సీఎస్కే) కాగా, మాక్ వేలంలో లభించిన ధర డమ్మీ ధర అయినప్పటికీ.. పై పేర్కొన్న ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడటం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. రేపు జరుగబోయే అధికారిక వేలంలో ఈ ఆటగాళ్లపై కనక వర్షం కురువడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరితో పాటు వరల్డ్కప్ హీరో, న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర కోసం కూడా ఫ్రాంచైజీలు ఎగబడవచ్చు. ఐపీఎల్ 2024 వేలం తేదీ: డిసెంబర్ 19, 2023 సమయం: మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం (భారతకాలమానం ప్రకారం) వేదిక: దుబాయ్లోని కోకాకోలా ఎరీనా ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ (టీవీ) డిజిటల్: జియో సినిమా మొత్తం స్లాట్లు: 77 వేలంలో పాల్గొంటున్న మొత్తం ఆటగాళ్లు: 333 భారతీయ ఆటగాళ్లు: 214 విదేశీ ఆటగాళ్లు: 119 -
IPL 2024: ఫ్రాంచైజీలు వదిలించుకున్న ఖరీదైన ఆటగాళ్లు వీరే..! (ఫొటోలు)
-
WC 2023: టీమిండియాకు భారీ షాక్! హార్దిక్ పాండ్యా ఇక..
ICC WC 2023: వన్డే వరల్డ్కప్-2023లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా చీలమండ గాయం తీవ్రతరమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇంగ్లండ్తో మ్యాచ్కు దూరమైన పాండ్యా.. మరికొన్ని మ్యాచ్లకు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు.. ‘‘పాండ్యా ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో నితిన్ పటేల్ నేతృత్వంలోని వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది. లిగమెంట్ టియర్(మోకాలి జాయింట్లో) కూడా ఉందనిపిస్తోంది. కాబట్టి కనీసం రెండు వారాల పాటు విశ్రాంతి అవసరమవుతుంది. గాయం పూర్తిగా తగ్గకముందు ఎన్సీఏ అతడిని ఆడేందుకు అస్సలు పంపించదు. అయితే, వైద్య బృందం నిరంతరం పాండ్యాను పర్యవేక్షిస్తూ మేనేజ్మెంట్కు ఎప్పటికపుడు అప్డేట్ ఇస్తోంది. అతడు కోలుకునేందుకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే అతడు మైదానంలో దిగేలా కృషి చేస్తోంది’’ అని పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో వెల్లడించింది. అయితే, పాండ్యా లీగ్ దశ ముగిసేనాటికి అందుబాటులోకి వస్తాడని భావిస్తున్న మేనేజ్మెంట్ అతడి స్థానాన్ని వేరే ప్లేయర్తో భర్తీ చేసేందుకు సుముఖంగా లేనట్లు తెలిపింది. కాగా ప్రపంచకప్-2023లో హార్దిక్ పాండ్యా బ్యాట్తో రాణించడంతో పాటు కీలక వికెట్లు తీసి బౌలింగ్లోనూ రాణించాడు. అయితే, మరో పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ అందుబాటులో ఉన్నప్పటికీ పాండ్యా స్థానాన్ని అతడు పూర్తి స్థాయిలో భర్తీ చేయలేకపోవచ్చు. చదవండి: WC 2023: ఇంగ్లండ్తో మ్యాచ్.. స్టార్ పేసర్కు రెస్ట్! జట్టులోకి అశ్విన్.. -
‘శార్దూల్ ఎందుకు? సిరాజ్ను ఎందుకు ఆడిస్తున్నారు?.. అసలేంటి ఇదంతా?’
ICC WC 2023- Team India: టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్కు భారత మాజీ పేసర్ శ్రీశాంత్ అండగా నిలిచాడు. మేనేజ్మెంట్ అన్నీ ఆలోచించిన తర్వాతే తుదిజట్టును ఎంపిక చేస్తుందని.. మ్యాచ్ సాగుతున్న తీరును బట్టి విమర్శలు చేయడం సరికాదని హితవు పలికాడు. కొంతమంది ‘టోపీ మాస్టర్లు’ మాత్రం అంతా తమకే తెలుసునన్నట్లు మాట్లాడతారంటూ సిరాజ్ను విమర్శించిన వారిపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో టీమిండియా ఆరంభ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై సిరాజ్ ఒక వికెట్ తీయగలిగాడు. అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో ధారాళంగా పరుగులిచ్చి పవర్ ప్లేలో మ్యాజిక్ చేయలేకపోయినప్పటికీ 6.3 ఓవర్లలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి పొదుపుగానే బౌలింగ్ చేశాడు. అయితే, రెండో మ్యాచ్లో మాత్రం ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అఫ్గనిస్తాన్తో ఢిల్లీలోని అరుణ్జైట్లీ మైదానంలో బుధవారం జరిగిన మ్యాచ్లో సిరాజ్ ఏకంగా 76 పరుగులిచ్చాడు. 9 ఓవర్ల బౌలింగ్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో.. మహ్మద్ షమీని కాదని సిరాజ్ను ఎంపిక చేసి మేనేజ్మెంట్ తప్పుచేసిందంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన కేరళ మాజీ బౌలర్ శ్రీశాంత్.. ‘‘మ్యాచ్ మొదలుకావడానికి ముందు.. అసలేంటి ఇదంతా? ‘‘అయ్యో.. శార్దూల్ను ఎందుకు ఆడిస్తున్నారు? అంటూ గగ్గోలుపెట్టారు. మ్యాచ్ మొదలైన తర్వాత.. సిరాజ్ పరుగులిస్తూ ఉంటే.. ‘‘ఈరోజు సిరాజ్ను ఎందుకు ఆడిస్తున్నారు?’’ అంటూ కామెంట్లు చేశారు. వాళ్లంతా ‘టోపీ మాస్టర్లు’. ఇదిలా ఉంటే.. కెమెరా మాటిమాటికీ షమీ, అశ్విన్పైకి గురిపెట్టి చూపిస్తూనే ఉండటం దేనికి సంకేతం. యాజమాన్యం ఎంపిక చేసిన జట్టుకు మనం మద్దతుగా నిలవాలి కదా!’’ అని స్పోర్ట్స్కీడాతో చెప్పుకొచ్చాడు. కాగా అఫ్గన్తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. తదుపరి పాకిస్తాన్తో వెటరన్ స్పిన్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో.. పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆడాడు. ఈ క్రమంలో అశూను కాదని శార్దూల్ను ఎందుకు ఆడిస్తున్నారంటూ సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు కెప్టెన్ రోహిత్ శర్మ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మరికొందరు సిరాజ్ను టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో శ్రీశాంత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక ఆసీస్ మీద 6, అఫ్గనిస్తాన్ మీద 8 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా అక్టోబరు 14న పాకిస్తాన్తో మ్యాచ్కు సిద్ధమవుతోంది. చదవండి: WC: క్యాన్సర్తో పోరాడుతూ వరల్డ్కప్ ఆడాను.. డెంగ్యూ వల్ల గిల్..: యువీ -
Ind vs Pak: అతడి బ్యాటింగ్ అంతగొప్పగా ఏమీ ఉండదు.. షమీని ఆడించండి!
ICC WC 2023- Ind vs Pak: ‘‘శార్దూల్ ఠాకూర్.. మహ్మద్ షమీ వీరిద్దరిలో ఎవరిని ఆడిస్తారనే చర్చ ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. అయితే, చాలాసార్లు మేనేజ్మెంట్ శార్దూల్ వైపే మొగ్గు చూపుతుంది. ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్ చేస్తాడు గనుక షమీని కాదని అతడిని తీసుకుంటారని ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. అయితే, అఫ్గనిస్తాన్ వంటి జట్టుతో మ్యాచ్లో కూడా నంబర్ 8లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుందా? అంటే లేదనే సమాధానం చెప్పొచ్చు. లేదంటే.. కొంతమంది బిగ్షాట్లు ఆడే ప్లేయర్లు ఉంటారు.. వాళ్లు లేకపోతే ఓటమి ఎదురవుతుందనే సందర్భాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. అంత గొప్ప బ్యాటరేమీ కాదు! కానీ.. ఇలాంటి టీమ్స్తో ఆడినపుడు లోయర్ ఆర్డర్ వరకు బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉందనుకుంటే పొరబడినట్లే! నిజానికి శార్దూల్ ఏమీ గొప్ప బ్యాటర్ కాదు. ఎనిమిదో నంబర్లో అతడు కేవలం రన్-ఏ- బాల్ ప్లేయర్ మాత్రమే. 20 బంతుల్లో 45 పరుగులు రాబట్టే రకమేమీ కాదు. అతడు అలా ఆడలేడు కూడా! ఏదేమైనా బ్యాటింగ్ ఆర్డర్లో ఎనిమిదో స్థానం వరకు డెప్త్ ఉండాలనుకుంటే వాళ్లు శార్దూల్ ఆడిస్తారు. కానీ నా అభిప్రాయం ప్రకారం పాకిస్తాన్తో మ్యాచ్లో శార్దూల్ కంటే షమీ అవసరమే ఎక్కువగా ఉంటుంది. తదుపరి మ్యాచ్లో అతడిని తప్పక ఆడించాలి’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో చెన్నైలో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. చెపాక్లో అశ్విన్.. ఢిల్లీలో శార్దూల్ చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ‘లోకల్ స్టార్’ రవిచంద్రన్ అశ్విన్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, ఢిల్లీలో అఫ్గనిస్తాన్తో రెండో మ్యాచ్లో అశ్విన్ స్థానంలో పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ను జట్టులోకి తీసుకుంది. అరుణ్జైట్లీ స్టేడియంలో అదనపు సీమర్ అవసరమన్న విశ్లేషణల నడుమ ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న శార్దూల్ వైపు మొగ్గు చూపింది. అయితే, అఫ్గనిస్తాన్పై మంచి రికార్డు ఉన్న షమీని కాదని శార్దూల్ను తీసుకోవడం సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలకు నచ్చలేదు. పాక్తో మ్యాచ్లో షమీని ఆడిస్తేనే బెటర్ ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. తన యూట్యూబ్ చానెల్ వేదికగా పైవిధంగా స్పందించాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో మహ్మద్ షమీని ఆడిస్తేనే జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నాడు. కాగా ఆసీస్పై 6 వికెట్లు, అఫ్గన్పై 8 వికెట్ల తేడాతో గెలుపొంది ఫుల్జోష్లో ఉన్న టీమిండియా అక్టోబరు 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో పోరుకు సిద్ధమవుతోంది. అహ్మదాబాద్లోని దాదాపు లక్ష సీట్ల సామర్థ్యం గల నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక. ఇక పాకిస్తాన్ సైతం ఆడిన రెండు మ్యాచ్లలో విజయాలు సాధించి జోరు మీదున్న విషయం తెలిసిందే. సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి చదవండి: WC 2023- Ind Vs Pak: పాకిస్తాన్తో మ్యాచ్కు ముందు టీమిండియాకు గుడ్న్యూస్! కానీ.. -
ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. భారత జట్టులో కీలక మార్పు! యువ పేసర్ ఎంట్రీ
తొలి వన్డేలో ఆసీస్పై విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు అదే జట్టుతో మరో కీలక పోరుకు సిద్దమైంది. ఇండోర్ వేదికగా ఆదివారం జరగనున్న రెండో వన్డేలో ఆసీస్తో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి 2-0 తేడాతో సిరీస్ను సొంతం చేసుకోవాలని రాహుల్ సేన బావిస్తోంది. ఇక రెండో వన్డేలో భారత ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. రెండో వన్డేలో విఫలమైన శార్ధూల్ ఠాకూర్ స్ధానంలో పేసర్ ప్రసిద్ద్ కృష్ణకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. మొదటి మ్యాచ్లో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన ఠాకూర్ 7.80 ఏకానమితో ఏకంగా 78 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. ఈ క్రమంలోనే అతడిపై వేటు వేయాలని జట్టు మేనెజ్మెంట్ భావిస్తున్నట్లు వినికిడి. మరోవైపు ఆస్ట్రేలియా రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు పలురిపోర్టులు పేర్కొంటున్నాయి. తొలి వన్డేకు దూరమైన మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, కారీ .. ఇండోర్ వన్డేకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అబాట్, షార్ట్, ఇంగ్లీస్ బెంచ్కు పరిమిత మయ్యే ఛాన్స్ ఉంది. పిచ్ రిపోర్ట్ ఇండోర్ పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం. ఈ వికెట్పై భారీ స్కోర్లు నమోదు అవ్వడం ఖాయం. అయితే ఈ వికెట్పై కాస్త బౌన్స్ కూడా ఉంటుంది. ఇది బౌలర్లకు సానుకూలాంశం. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. తుది జట్లు(అంచనా) భారత్: శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషేన్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మాక్స్వెల్, ఆడమ్ జంపా -
ఇదేమి బౌలింగ్రా బాబు.. ఇతడితోనా వరల్డ్కప్ ఆడేది! రోహిత్ సపోర్ట్తోనే!!
వరల్డ్కప్ సన్నాహాకాల్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. మొహాలీ వేదికగా ఆసీస్తో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో భారత్ విజయ భేరి మోగించింది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించినప్పటికీ.. ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్ ప్రదర్శన మాత్రం అందరనీ కలవరపెడుతోంది. మొహాలీ వన్డేలో శార్ధూల్ ఘోరమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్లో శార్ధూల్ పూర్తిగా తేలిపోయాడు. 10 ఓవర్లు బౌలింగ్ చేసిన ఠాకూర్ 7.80 ఏకానమితో ఏకంగా 78 పరుగులు సమర్పించుకున్నాడు. మిగితా నలుగురు బౌలర్లు కనీసం ఒక్క వికెట్ అయినా పడగొట్టగా.. శార్ధూల్ మాత్రం ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు. వికెట్ మాట పక్కన పెడితే.. తన బౌలింగ్తో బ్యాటర్లను కనీసం కట్టడి కూడా చేయలేకపోయాడు. ఆసీస్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన శార్ధూల్ ఏకంగా 13 పరుగులు ఇచ్చాడు. అర్ష్దీప్ను ఎంపిక చేయాల్పింది.. కాగా వరల్డ్కప్కు ఎంపిక చేసిన భారత జట్టులో శార్ధూల్ భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే వరల్డ్కప్కు ముందు ఇటువంటి ప్రదర్శన చేసిన శార్ధూల్పై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అతడు ప్రపంచకప్ వంటి మెగా టోర్నీకి ఆర్హుడు కాదని, అతడిలో ఏమి టాలెంట్ చూసి సెలక్టర్లు ఎంపిక చేశారో అర్ధం కావడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. Shardul Thakur potentially will bowl at the death for us in the World Cup..#INDvsAUS pic.twitter.com/B3Dz3VI2NO — Sanchit Desai (@sanchitd43) September 22, 2023 అతడి స్ధానంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్దీప్ను ఎంపిక చేయాల్సందని భారత ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి కొంతమంది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సపోర్ట్తోనే శార్థూల్ జట్టులో కొనసాగతున్నాడని కామెంట్లు చేస్తున్నారు. ఇక రెండో వన్డేకు అతడిపై వేటు పడే ఛాన్స్ ఉంది. What a shame that shardul thakur will be our third Pacer in the world cup, he is nothing without luck!😭#INDvsAUS pic.twitter.com/AVBkuns8pC — Y𝕏 Samar (@Yrtweets) September 22, 2023 -
పాక్ను ఓడించాలంటే అతడిపై వేటు పడాల్సిందే! లేదంటే..
Asia Cup 2023- Pakistan vs India: పాకిస్తాన్ను ఓడించాలంటే టీమిండియా ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగక తప్పదని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. నంబర్ 8లోనూ బ్యాటింగ్ ఆప్షన్ ఉండాలని కోరుకుంటే మాత్రం దాయాదిపై గెలవడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. కాగా ఆసియా కప్-2023లో తొలి మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడిన టీమిండియా స్థాయికి తగ్గట్లు బ్యాటింగ్ చేయలేకపోయింది. పాక్ పేసర్ల ధాటికి పాక్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షా, హ్యారిస్ రవూఫ్ విజృంభణతో 266 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, భారత ఇన్నింగ్స్ తర్వాత వర్షం తెరిపినివ్వకపోవడంతో పాక్ బ్యాటింగ్ సాధ్యం కాలేదు. దీంతో మ్యాచ్ రద్దు కాగా ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ నేపథ్యంలో నేపాల్పై గెలుపొందిన టీమిండియా, పాకిస్తాన్ సూపర్-4లో ఆదివారం మరోసారి పోటీపడనున్నాయి. కాగా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తాడంటూ పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ను జరిగిన రెండు మ్యాచ్లలోనూ తుదిజట్టులోకి తీసుకుంది మేనేజ్మెంట్. షమీని కాదని శార్దూల్ను తీసుకుంటే ఇందులో భాగంగా పాక్తో మ్యాచ్లో సీనియర్ పేసర్ మహ్మద్ షమీపై వేటు వేసింది. అయితే, అతడిని కాదని శార్దూల్ తీసుకున్నా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కేవలం 3 పరుగులకే అతడు అవుటయ్యాడు. షమీ- శార్దూల్ (PC: BCCI) ఇక నేపాల్తో మ్యాచ్కు జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడంతో షమీకి చోటు దక్కగా.. అతడు 7 ఓవర్ల బౌలింగ్లో 4.10 ఎకానమీతో ఒక వికెట్ తీశాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. పాకిస్తాన్తో తదుపరి మ్యాచ్లో షమీని ఆడిస్తేనే టీమిండియా అనుకున్న ఫలితం రాబట్టగలదని పేర్కొన్నాడు. పాక్ను ఓడించాలంటే అతడిపై వేటు వేయాల్సిందే ‘‘బౌలింగ్ విభాగంలో కచ్చితంగా మార్పులు చేయాలి. శార్దూల్ ఠాకూర్ స్థానంలో మహ్మద్ షమీని ఆడించాలి. గత మ్యాచ్ సాగిన తీరు బట్టే నేను ఈ మాట చెబుతున్నా. జట్టులో కనీసం ముగ్గురు నాణ్యమైన పేసర్లు ఉండాలి. అలా కాకుండా.. పాకిస్తాన్తో మ్యాచ్లో మళ్లీ బ్యాటింగ్ ఆర్డర్లో నంబర్ 8 వరకు ఆటగాళ్లు ఉండాలని కోరుకుంటే మాత్రం కష్టం. పాక్ను ఓడించాలంటే కచ్తిచంగా మంచి ఫాస్ట్బౌలర్లు జట్టులో ఉండాలి’’ అని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తుదిజట్టులో కచ్చితంగా బుమ్రా, సిరాజ్లతో పాటు షమీ కూడా ఉండాలని పేర్కొన్నాడు. రిజర్వ్ డే కాగా శ్రీలంకలోని కొలంబోలో భారత్- పాక్ తమ తదుపరి మ్యాచ్ ఆడనున్నాయి. అయితే, అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మరోసారి చిరకాల ప్రత్యర్థుల పోరుకు వర్షం అడ్డంకి మారే అవకాశం ఉన్న నేపథ్యంలో రిజర్వ్ డేను కేటాయించింది ఆసియా క్రికెట్ కౌన్సిల్. చదవండి: Ind Vs Pak: మాకు కూడా కావాలన్న కోచ్లు! మా అంగీకారంతోనేనన్న బోర్డులు.. ఇదేం ట్విస్టు? -
IND Vs PAK: ప్రాక్టీస్లో టీమిండియా.. శ్రేయస్ అయ్యర్ ‘గెలుపు’! కానీ..
Asia Cup 2023 Ind vs Pak: ఆసియా కప్-2023లో భాగంగా పాకిస్తాన్తో మ్యాచ్కు టీమిండియా సన్నద్ధమవుతోంది. చిరకాల ప్రత్యర్థిపై గెలవాలనే పట్టుదలతో నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు భారత ఆటగాళ్లు. ముఖ్యంగా పాకిస్తాన్ పేస్ త్రయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే క్రమంలో లెఫ్టార్మ్, రైట్ ఆర్మ్ ఫాస్ట్బౌలర్ల బౌలింగ్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. పెనాల్టీ షూటౌట్ ఇక ఆదివారం(సెప్టెంబరు 10) నాటి మ్యాచ్ కోసం గురవారం నుంచే నెట్ సెషన్ ఆరంభించిన టీమిండియా.. శుక్రవారం కూడా ప్రాక్టీసులో తలమునకలైంది. శుబ్మన్ గిల్, శార్దూల్ ఠాకూర్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ తదితరులు ఓవైపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూనే మరోవైపు.. పెనాల్టీ షూటౌట్తో సరదాగా గడిపారు. అయ్యర్ గెలిచాడు భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్ దిలీప్తో కలిసి ఫుట్బాల్ను కిక్ చేస్తూ పోటీపడ్డారు. ఇందులో సూర్య, గిల్, శార్దూల్ ఓడిపోగా.. శ్రేయస్ అయ్యర్ మిడిల్ స్టంప్ను హిట్ చేయగా.. దిలీప్ తన్నిన బంతి మూడు స్టంప్స్ను తాకింది. దీంతో వాళ్లిదరిని ఎత్తుకుని విన్నర్స్ అంటూ సెలబ్రేట్ చేశారు మిగతా ఆటగాళ్లు. పాక్తో ఆ మ్యాచ్ రద్దు.. ఈసారి ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘లక్ష్యం చేరుకోవడంలో అలసత్వం లేదు. ఎప్పటికప్పుడు నూతనోత్సాహంతో మున్ముందుకు’’ అంటూ దీనికి #TeamIndia #AsiaCup హ్యాష్ట్యాగ్లతో క్యాప్షన్ జతచేసింది. కాగా పాకిస్తాన్తో పల్లెకెలె మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు పాక్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షా, హ్యారిస్ రవూఫ్లను ఎదుర్కోవడంలో తడబడ్డారు. ఈ క్రమంలో రోహిత్ సేన 266 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో ఫలితం తేలలేదు. ఇక మరి కొలంబోలో ఆదివారం ఏం జరుగుతుందో చూడాలి! చదవండి: గేల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాలి!; రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు View this post on Instagram A post shared by Team India (@indiancricketteam)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement