-
పిచ్చి పట్టిందా నీకు...
‘మంచిగా కనపడేవాళ్లందరూ మంచివాళ్లు కాదురా... ఫర్ ఎగ్జాంపుల్ నేను’ అంటూ మొదలవుతుంది ‘మనమే..’ సినిమా టీజర్. శర్వానంద్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఇది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. శుక్రవారం ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. ప్లేబాయ్ మనస్తత్వం ఉండే అబ్బాయి, బాధ్యతగా జీవించాలనుకునే ఓ అమ్మాయి జీవితాల్లోకి విక్రమాదిత్య అనే ఓ పిల్లవాడు వచ్చినప్పుడు వారి జీవితాలు ఎలా ప్రభావితం అయ్యాయి? అన్నదే ఈ చిత్రం కథాంశమన్నట్లుగా యూనిట్ చెబుతోంది. ‘వాడప్పట్నుంచి ఆపకుండా ఏడుస్తున్నాడు. అసలేం చేశావ్... (కృతీ శెట్టి), ‘తాగటానికెళ్లొచ్చా..’ (శర్వానంద్), ‘ఇల్లు చూసుకోవడం రాదు... పిల్లవాడిని చూసుకోవడం రాదు... పిచ్చిపట్టిందా నీకు...’ (కృతీ శెట్టి), ‘ఇద్దరిలో ఒకళ్లు ఏడ్వండి’ (శర్వానంద్) వంటి సంభాషణలు విడుదలైన టీజర్లో ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, సహ–నిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
శర్వానంద్, కృతీ శెట్టి కొత్త సినిమా టీజర్ విడుదల
శర్వానంద్, కృతీ శెట్టి జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ‘మనమే’. శర్వానంద్ 35వ సినిమాగా విడుదలకు సిద్దంగా ఉంది. లండన్ నేపథ్యంలో, కొత్తతరం ప్రేమకథతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై వస్తున్న ఈ చిత్రంలో బాలనటుడు విక్రమ్ ఆదిత్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. శర్వానంద్, కృతీ శెట్టి ఈ చత్రంలో భార్యాభర్తలుగా నటించినట్లు తెలుస్తోంది. వారిద్దరి కుమారుడిగా విక్రమ్ ఆదిత్య ఉన్నాడు. టీజీర్లో చాలా ముద్దుగా కనిపిస్తున్న ఆ బాబుకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. శమంతకమణి, దేవదాస్,భలే మంచి రోజు వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన శ్రీరామ్ ఆదిత్య 'మనమే' చిత్రంతో ఈ సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మనమే చిత్రం తర్వాత శర్వానంద్ మరో రెండు చిత్రాలను లైన్లో పెట్టారు. అభిలాష్ కంకర దర్శకత్వంలో మాళవికా నాయర్ హీరోయిన్గా తన 36వ సినిమాగా రానుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నుంచి 37వ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇలా వరుస సినిమాలతో శర్వా బిజీగా ఉన్నారు. -
కుమార్తెను పరిచయం చేసిన శర్వానంద్ (ఫొటోలు)
-
శర్వానంద్ జోరు.. ఒకే రోజు మూడు సినిమాల అప్డేట్స్
హీరో శర్వానంద్ బర్త్ డే (మార్చి 6) సందర్భంగా మూడు చిత్రాల అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. శర్వానంద్ నటిస్తున్న 35వ చిత్రానికి ‘మనమే’ అనే టైటిల్ ఖరారు చేయగా, 36వ సినిమా బుధవారం ప్రారంభమైంది. అలాగే శర్వా నటించనున్న 37వ సినిమా ప్రకటన కూడా వెల్లడైంది. శర్వానంద్, కృతీ శెట్టి జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ‘మనమే’ టైటిల్ ఖరారు చేసి, గ్లింప్స్ విడుదల చేశారు. అలాగే శర్వానంద్ 36వ సినిమా ఆరంభమైంది. అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్. విక్రమ్ సమర్పణలో వంశీ–ప్రమోద్ నిర్మిస్తున్నారు. శర్వా 37వ సినిమాని రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇక శర్వానంద్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే గత ఏడాది రక్షితను వివాహం చేసుకున్నారు. ఇటీవల పాపకు జన్మనిచ్చారు రక్షిత. పాపకు లీలాదేవి అని నామకరణం చేసినట్లు బుధవారం వెల్లడించారు. -
తండ్రైన టాలీవుడ్ యంగ్ హీరో.. అప్పుడే పేరు కూడా!
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. జూన్ 3న రక్షితారెడ్డిని పెళ్లాడారు. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జైపుర్లోని లీలా ప్యాలెస్ వేదికగా వీరి పెళ్లి ఘనంగా జరిగింది. సుమారు రెండు రోజుల పాటు జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో రామ్చరణ్తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. తాజాగా ఇవాళ శర్వానంద్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. శర్వానంద్- రక్షితా రెడ్డి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఈ విషయాన్ని తన పుట్టిన రోజు సందర్భంగా ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అంతే కాదు తమ ముద్దుల పాపకు లీలా దేవి మైనేని అనే పేరు కూడా పెట్టినట్లు వెల్లడించారు. కాగా.. గతేడాది నవంబర్లో రక్షితారెడ్డి ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఈ విషయాన్ని ఎక్కడా రివీల్ చేయకుండా శర్వానంద్ జాగ్రత్తపడ్డారు. తాజాగా శర్వానంద్ బర్త్ డే సందర్భంగా ఏకంగా బిడ్డ పుట్టిన విషయాన్ని రివీల్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా శర్వానంద్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చేశాయి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు ‘మనమే’ అనే టైటిల్ను ఖరారు చేస్తూ ఫస్ట్లుక్ టీజర్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా నటించనుంది. దీంతో పాటు 36వ సినిమాకు సంబంధించిన తాజాగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో మాళవిన నాయర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాలో శర్వానంద్ బైక్ రైడర్గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన గతంలో ఈ బ్యానర్పై రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్రాజా , మహానుభావుడు వంటి హిట్ సినిమాల్లో నటించారు. View this post on Instagram A post shared by Sharwanand (@imsharwanand) View this post on Instagram A post shared by Sharwanand (@imsharwanand)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
కలసిన చేతులు.. కలవని మనసులు
యువత.. నవ జనత
శిక్షణలో నేర్పించే అంశాలు
విధులకు హాజరు కాకపోతే క్రమశిక్షణ చర్యలు
3.2 కిలోల వెండి తొడుగు సమర్పణ
ఓటర్ల చైతన్యంతో ప్రజాస్వామ్యం బలోపేతం
ప్రజలు ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
కృష్ణావర్సిటీలో శరవేగంగా భవనాల నిర్మాణ పనులు
చల్లబడ్డ వాతావరణం
తప్పక చదవండి
Advertisement