-
మిస్టరీ స్పిన్నర్ మాయాజాలం.. 69 పరుగులకే కుప్పకూలిన ప్రత్యర్ధి
విజయ్ హజారే ట్రోఫీ 2023లో తమిళనాడు బౌలర్, ఐపీఎల్ మిస్టరీ స్పిన్నర్ (కోల్కతా నైట్రైడర్స్) వరుణ్ చక్రవర్తి చెలరేగిపోయాడు. నాగాలాండ్తో ఇవాళ (డిసెంబర్ 5) జరుగుతున్న మ్యాచ్లో అతను ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. వరుణ్ స్పిన్ మాయాజాలం ధాటికి నాగాలాండ్ 19.4 ఓవర్లలో 69 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్లో ఐదు ఓవర్లు వేసిన వరుణ్.. 3 మెయిడిన్లు వేసి కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. Varun Chakravarthy took 5 wickets for 9 runs against Nagaland...!!!! - he has taken 14 wickets from just 6 games in Vijay Hazare 2023. pic.twitter.com/Ex5PI2XRpB — Johns. (@CricCrazyJohns) December 5, 2023 ప్రస్తుత సీజన్లో మంచి ఫామ్లో ఉన్న వరుణ్.. ఇప్పటివరకు జరిగిన 6 మ్యాచ్ల్లో 14 వికెట్లు తీసి టోర్నీ లీడింగ్ వికెట్టేకర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. వరుణ్తో పాటు రవిశ్రీనివాసన్ సాయి కిషోర్ (5.4-0-21-3), సందీప్ వారియర్ (6-1-21-1), టి నటరాజన్ (3-0-15-1) కూడా రాణించడంతో నాగాలాండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆ జట్టులో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సుమిత్ కుమార్ 20, జాషువ ఒజుకుమ్ 13 పరుగులు చేశారు. ఎక్స్ట్రాల రూపంలో లభించిన పరుగులు (15) నాగాలండ్ ఇన్నింగ్స్లో రెండో అత్యధిక స్కోర్ కావడం విశేషం. గ్రూప్-ఈలో ఇప్పటికే ఆడిన 5 మ్యాచ్ల్లో ఐదు పరాజయాలు ఎదుర్కొన్న నాగాలాండ్ మరో ఓటమి దిశగా సాగుతుంది. -
భారత సెలక్టర్లు చాలా పెద్ద తప్పుచేశారు.. అతడు జట్టులో ఉండాల్సింది
చైనా వేదికగా జరగనున్న ఆసియాగేమ్స్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆగస్టు 31 నుంచి ఆసియాకప్ జరగనుండడంతో భారత ద్వితీయ శ్రీణి జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఐపీఎల్లో అదరగొట్టిన యువ ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు కల్పించారు. రింకూ సింగ్ తిలక్ వర్మ, యశస్వీ జైశ్వాల్, ప్రభుసిమ్రాన్కు వంటి ఐపీఎల్ హీరోలకు చోటు దక్కింది. వీరితోపాటు ఆల్రౌండర్ శివమ్ దుబే రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ జట్టుకు యువ ఓపెనర్ రుత్రాజ్ గైక్వాడ్ సారధ్యం వహించనున్నాడు. ఇక ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన భారత జట్టుపై భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా కీలక వాఖ్యలు చేశాడు. ఈ జట్టులో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిను ఎంపిక చేయకపోవడం సెలక్టర్లు చేసిన అతిపెద్ద తప్పిదమని చోప్రా అభిప్రాయపడ్డాడు. "ఆసియాక్రీడలకు భారత సెలక్టర్లు పటిష్టమైన జట్టును ఎంపికచేశారు. రింకూ, జైశ్వాల్, ప్రభుసిమ్రాన్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ జట్టులో వరుణ్ చక్రవర్తికి చోటు దక్కకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఈ విషయంలో మాత్రం సెలెక్టర్లు మాత్రం పెద్ద తప్పు చేశారు. అతడు ప్రపంచంలోనే అత్యుతమ స్పిన్నర్లలో ఒకడు. అతడికి టీ20 ప్రపంచకప్-2021 జట్టులో అవకాశం ఇచ్చారు. అక్కడ విఫలమకావడంతో పూర్తిగా అతడిని పక్కన పెట్టేశారు. వరుణ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో కూడా రాణించాడు. కాబట్టి అతడు చైనాకు వెళ్లే భారత జట్టులో ఉండాల్సింది" అని తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు. చదవండి: Duleep Trophy: ప్రియాంక్ కెప్టెన్ ఇన్నింగ్స్ వృధా.. దులీప్ ట్రోఫీ విజేతగా సౌత్ జోన్ -
నీట్ యూజీ రాష్ట్ర అర్హుల జాబితా విడుదల
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ–2023లో అర్హత సాధించిన రాష్ట్ర విద్యార్థుల జాబితాను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం విడుదల చేసింది. నీట్లో మొత్తం 720 మార్కులకు 720 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ పొందిన బోరా వరుణ్ చక్రవర్తి స్టేట్ టాపర్గా నిలిచాడు. 711 మార్కులతో ఆల్ ఇండియా 25వ ర్యాంకర్ వైఎల్ ప్రవర్ధన్ రెడ్డి రెండో స్థానంలో, 38 ర్యాంకర్ వి.హర్షిల్ సాయి మూడో స్థానంలో నిలిచారు. రాష్ట్రంలో మొదటి పది ర్యాంకులు పొందినవారిలో ఏడుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. రాష్ట్రం నుంచి నీట్ యూజీకి 69,690 మంది దరఖాస్తు చేసుకోగా, 68,578 మంది పరీక్ష రాశారు. వీరిలో 42,836 మంది అర్హత సాధించారు. వారిలో అత్యధికంగా 28,471 మంది అమ్మాయిలు, 14,364 మంది అబ్బాయిలు, ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారు. https:// drysr.uhsap.in వెబ్సైట్లో అర్హత సాధించిన విద్యార్థుల జాబితాను ఉంచారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్విసెస్(డీజీహెచ్ఎస్) అందించిన నీట్ అర్హుల వివరాల ఆధారంగా రాష్ట్ర జాబితాను ప్రదర్శించినట్లు డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వేమిరెడ్డి రాధికరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల కాగానే నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. -
నీట్లో మనోళ్లు టాప్ లేపారు..
సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ‘నీట్’ పరీక్షలో తెలుగు విద్యార్థులు టాప్ లేపారు. జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకుతోపాటు టాప్–50లో ఏడు ర్యాంకులను ఏపీ, తెలంగాణ విద్యార్థులే కైవసం చేసుకున్నారు. ఏపీకి చెందిన బోరా వరుణ్ చక్రవర్తి 720 మార్కులకు 720 సాధించి ఆలిండియా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. తమిళనాడుకు చెందిన ప్రభంజన్ కూడా 720 మార్కులతో మొదటి ర్యాంకును పంచుకున్నాడు. ఇక తెలంగాణ నుంచి కంచాని జయంత్ రఘురామరెడ్డికి 15వ ర్యాంకు, ఏపీకి చెందిన వైఎల్ ప్రవర్థన్రెడ్డి 25వ ర్యాంకు (ఈడబ్ల్యూఎస్ విభాగంలో దేశంలోనే తొలి స్థానం), వి.హర్షిల్సాయి 35వ ర్యాంకు, కె.యశశ్రీ 40వ (ఎస్సీ విభాగంలో రెండో స్థానం), కల్వకుంట్ల ప్రణతిరెడ్డి 45వ ర్యాంకు, తెలంగాణకు చెందిన బోడెద్దుల జాగృతి 49వ ర్యాంకు (మహిళల కేటగిరీలో పదో స్థానం) సాధించారు. ఇక ఆలిండియా 119వ ర్యాంకు సాధించిన ఏపీ విద్యార్థి ఎం.జ్యోతిలాల్ చావన్ ఎస్టీ విభాగంలో దేశంలో టాప్ ర్యాంకు కొల్లగొట్టాడు. తెలంగాణకు చెందిన లక్ష్మి రషి్మత గండికోట 52వ ర్యాంకు (మహిళల కేటగిరీలో 12వ ర్యాంకు) సాధించింది. జాతీయ స్థాయిలో 56.21 శాతం అర్హత నీట్ యూజీ–2023 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం రాత్రి విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 20,38,596 మంది పరీక్ష రాయగా.. 11,45,976 మంది (56.21 శాతం) అర్హత సాధించారు. ఇందులో ఏపీ నుంచి 42,836, తెలంగాణ నుంచి 42,654 మంది ఉన్నారు. నీట్ ఫలితాల్లో తమిళనాడుకు చెందిన కౌస్తవ్ బౌరి 3వ, పంజాబ్కు చెందిన ప్రాంజల్ అగర్వాల్ 4వ, కర్ణాటకకు చెందిన ధ్రువ్ అద్వానీ 5వ ర్యాంకు సాధించారు. ఈసారి పేపర్ కఠినంగా ఉన్నా కటాఫ్ మార్కులు పెరిగాయని నిపుణులు చెప్తున్నారు. గతేడాది అన్ రిజర్వ్డ్, ఈడబ్లు్యఎస్ కటాఫ్ మార్కులు 117 కాగా.. ఈసారి 137కు పెరిగాయి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పీహెచ్, ఎస్సీ పీహెచ్ల కటాఫ్ మార్కులు గతేడాది 93 కాగా.. ఈసారి 107కు పెరిగాయి. వారంలో రాష్ట్రస్థాయి ర్యాంకులు ఆలిండియా కోటాలోని 15 శాతం సీట్లతోపాటు కేంద్ర, డీమ్డ్ యూనివర్సిటీలు, ఈఎస్ఐసీ, ఏఎఫ్ఎంసీ, బీహెచ్యూ, ఏఎంయూ మెడికల్ కాలేజీల్లో సీట్లకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(డీజీసీఏ) కౌన్సెలింగ్ నిర్వహిస్తుందని ఎన్టీఏ స్పష్టం చేసింది. డీజీసీఏ సూచనల మేరకు అభ్యర్థులు కౌన్సెలింగ్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా 85శాతం సీట్లకు రాష్ట్రాల స్థాయిలో భర్తీ చేపడతారు. వారం రోజుల్లో నీట్ తెలంగాణ రాష్ట్ర స్థాయి ర్యాంకులను ప్రకటిస్తామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కలిపి మొత్తంగా 8,340 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నట్టు తెలిపాయి. మార్కులు అవే అయినా.. ర్యాంకులు తగ్గి.. తెలుగు విద్యార్థులకు టాప్ ర్యాంకర్లతో సమానంగా మార్కులు వచ్చినా, పలు అంశాలతో తక్కువ ర్యాంకులను కేటాయించారు. జాతీయస్థాయిలో నాలుగో ర్యాంకర్ మార్కులు 715కాగా.. 15వ ర్యాంకు సాధించిన రఘురామరెడ్డి మార్కులు కూడా 715 కావడం గమనార్హం. అలాగే జాతీయస్థాయి 27వ ర్యాంకర్ నుంచి 49వ ర్యాంకర్ జాగృతి వరకు అందరికీ 710 మార్కులే. ఢిల్లీ ఎయిమ్స్లో ఎంబీబీఎస్ చేస్తా.. మాది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా తోటాడా గ్రామం. నాన్న, అమ్మ ఇద్దరూ టీచర్లే. జాతీయ స్థాయిలో టాపర్గా నిలవడం సంతోషంగా ఉంది. ఢిల్లీ ఎయిమ్స్లో ఎంబీబీఎస్ చదువుతా. – బోర వరుణ్ చక్రవర్తి, 1వ ర్యాంకర్ అమ్మానాన్నల ప్రోత్సాహంతో.. ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్లో ఎంబీబీఎస్ చేయాలని అనుకుంటున్నాను. మాది అనంతపురం జిల్లా తాడిపత్రి. అమ్మానాన్న ఇద్దరూ వైద్యులే. ఇప్పుడు నేనూ వైద్యుడిని కాబోతుండటం సంతోషంగా ఉంది. – రఘురామరెడ్డి, 15వ ర్యాంకర్ డాక్టర్ కావాలన్నది కోరిక నేను డాక్టర్ కావాలని పదో తరగతిలో ఉన్నప్పుడే అనుకున్నాను. అదే లక్ష్యంతో కష్టపడ్డాను. మా నాన్న అమెరికాలో ఇంజనీర్. తల్లిదండ్రులు ఇచి్చన స్వేచ్ఛ, ప్రోత్సాహంతోనే మంచి ర్యాంకు సాధించా. – జాగృతి, 49వ ర్యాంకర్ -
అతడిని వదులుకున్నందుకు చాలా బాధగా ఉంది.. మమ్మల్ని టార్చర్ పెట్టేవాడు: సీఎస్కే కోచ్
ఐపీఎల్-2023లో కోల్కతా నైట్రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి మరో సారి తన స్పిన్ మయాజాలన్ని ప్రదర్శించాడు. తన 4 ఓవర్ల కోటాలో 36 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు సునీల్ నరైన్ కూడా కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు సాధించాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచ్లు ఆడిన వరుణ్.. 19 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక అద్భుతంగా రాణిస్తున్న వరుణ్ చక్రవర్తిపై సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. వరుణ్ చక్రవర్తి నెట్ బౌలర్గా ఉన్నప్పుడు తీవ్ర ఇబ్బంది పెట్టేవాడని ఫ్లెమింగ్ అన్నాడు. సీసీఎస్కే, కేకేఆర్ మ్యాచ్ అనంతరం ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. "వరుణ్ను వదులుకున్నందుకు మేము ఇప్పటికీ బాధపడుతున్నాం. అతడు నెట్స్ లో మమ్మల్ని టార్చర్ పెట్టేవాడు. అతడొక అద్భుతమైన మిస్టరీ స్పిన్నర్. నెట్స్లో అతడి బౌలింగ్ చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం. అయితే దురదృష్టవశాత్తూ వేలంలో అతడిని మేము సొంతం చేసుకోలేకపోయాం. గతేడాది వేలంలో కూడా అతడిని దక్కించుకోవడానికి ప్రయత్నించాం. కానీ మళ్లీ అతడిని కేకేఆర్ భారీ ధరకు సొంతం చేసుకుంది. చెపాక్ వంటి స్పిన్ పిచ్లపై చక్రవర్తి మరింత అద్భుతంగా రాణించగలడు. నేటి మ్యాచ్లో కూడా చక్రవర్తి చాలా బాగా బౌలింగ్ చేశాడు" అతడు పేర్కొన్నాడు. చదవండి: అతడిని భారత జట్టులోకి తీసుకోండి.. సరిగ్గా వాడుకుంటే అద్భుతాలు సృష్టిస్తాడు -
అతడు అద్బుతంగా రాణిస్తున్నాడు.. టీమిండియా రీ ఎంట్రీ పక్కా!
ఐపీఎల్-2023లో కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో మూడు వికెట్లతో వరుణ్ చక్రవర్తి చెలరేగాడు. ఈ మ్యాచ్లో తన నాలుగు ఓవర్ల కోటాలో 26 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు సాధించాడు. ఇక ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన వరుణ్.. 17 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ క్యాష్ రిచ్ లీగ్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న వరుణ్ చక్రవర్తిపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడని, తిరిగి భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తాడని భజ్జీ కొనియాడాడు. "నేను వరుణ్తో కలిసి కేకేఆర్ తరపున ఆడినప్పుడు అతడు తీవ్రమైన మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. ఆసమయంలో అతడు ఇంజెక్షన్లు తీసుకుంటూ, ఐస్ ప్యాక్లు వేసుకుంటూ టోర్నీ మొత్తం కొనసాగాడు. అయినప్పటికీ అతడు ఆ సీజన్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వరుణ్ టీమిండియాకు ఎంపికైనప్పుడు కూడా మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. ఓ సందర్భంలో అతడితో నేను మాట్లాడినప్పుడు బరువు తగ్గించుకోమని సలహా ఇచ్చాను. ఎందుకంటే బరువు కారణంగా అతని మోకాలిపై చాలా ఒత్తిడి పడుతుంది. అతడు బరువు తగ్గాడు. ఇప్పుడు ఎటువంటి సమస్య లేకుండా బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేస్తున్నాడు. కాబట్టి వరుణ్ కచ్చితంగా టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇస్తాడు" అని స్టా్ర్ స్పోర్ట్స్ షోలో హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: ఆర్సీబీతో ముంబై కీలకపోరు.. తిలక్ వర్మ బ్యాక్! అతడు కూడా -
నరాలు తెగే ఉత్కంఠ! అప్పుడు నా హార్ట్బీట్ 200కు చేరువైంది.. అయితే..
IPL 2023 SRH Vs KKR: సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్బుత ఆట తీరు కనబరిచాడు. కీలక సమయంలో ప్రత్యర్థిని కట్టడి చేసి జట్టుకు విజయం అందించాడు. ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో కేకేఆర్ను గెలుపు తీరాలకు చేర్చి.. రైజర్స్పై ప్రతీకారం తీర్చుకునేలా చేశాడు. ఐపీఎల్-2023లో రైజర్స్తో మొదటి ముఖాముఖి పోరులో సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఉప్పల్ వేదికగా సన్రైజర్స్తో మ్యాచ్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగింది. ఆరంభంలోనే ఎదురుదెబ్బలు ఈ క్రమంలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు స్కోరు చేసింది. సొంతమైదానంలో రైజర్స్ రెచ్చిపోతుందనుకుంటే.. ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు అభిషేక్ శర్మ(9)ను శార్దూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్ (18)ను హర్షిత్ రాణా తక్కువ స్కోరుకే పెవిలియన్కు పంపారు. టచ్లోకి వచ్చినట్లు కనిపించిన వన్డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి (9 బంతుల్లో 20 పరుగులు) ఆట ఆండ్రీ రసెల్ బౌలింగ్లో వైభవ్ అరోరాకు క్యాచ్ ఇవ్వడంతో ముగిసింది. క్లాసెన్ ఆకట్టుకున్నా ఈ క్రమంలో రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ (41 బంతుల్లో 40 పరుగులు), హెన్రిచ్ క్లాసెన్ (20 బంతుల్లో 36 పరుగులు) ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యత తీసుకోగా.. మార్కరమ్ను వైభవ్, క్లాసెన్ను శార్దూల్ అవుట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆఖరి ఓవర్లో రైజర్స్ విజయ సమీకరణం 9 పరుగులుగా మారింది. బంతి బంతికీ ఉత్కంఠ క్రీజులో అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్ ఉన్నారు. అప్పుడు కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా బంతిని వరుణ్ చక్రవర్తికి అందించాడు. చివరి ఓవర్.. నరాలు తెగే ఉత్కంఠ నడుమ.. చక్రవర్తి బౌలింగ్లో మొదటి బంతికి అబ్దుల్ సమద్ ఒక పరుగు తీశాడు. రెండో బంతికి లెగ్బై రూపంలో పరుగు వచ్చింది. ఇక మూడో బంతికి వరుణ్ మ్యాజిక్ చేసి సమద్ను అవుట్ చేశాడు. దీంతో క్రీజులోకి వచ్చిన మయాంక్ మార్కండే.. నాలుగో బంతికి ఒక్క పరుగు కూడా రాబట్టలేకపోయాడు. ఐదో బంతికి ఒక పరుగు తీయగా.. ఆఖరి బంతికి భువీ చేతులెత్తేయడంతో కేకేఆర్ విజయం ఖరారైంది. కీలక ఓవర్లో 3 పరుగులే ఇచ్చి జట్టును గెలిపించిన వరుణ్ చక్రవర్తిని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం వరుణ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్ట్బీట్ 200కు చేరింది.. అతడు 2 ఫోర్లు బాదాడు! ‘‘ఆఖరి ఓవర్లో నా హార్ట్బీట్ 200కు చేరువైంది. అయితే.. ఏదేమైనా వాళ్లను కట్టడి చేయాలని ఫిక్సైపోయాను. ఓ వైపు బాలేమో స్లిప్ అవుతోంది. ఎలాగైనా బ్యాటర్లను ట్రాప్ చేసి లాంగ్ షాట్లు ఆడేలా చేయాలని భావించా. నా మొదటి ఓవర్లో 12 పరుగులు ఇచ్చాను. మార్కరమ్ నా బౌలింగ్లో 2 ఫోర్లు బాదాడు. నిజానికి.. గతేడాది నేను గంటకు 85 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాను. లోపాలు సరిచేసుకున్నాను. గత తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకుంటున్నా’’ అని వరుణ్ చక్రవర్తి పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్లలో వరుణ్ 301 పరుగులు ఇచ్చి 14 వికెట్లు పడగొట్టాడు. రైజర్స్తో మ్యాచ్లో నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి కీలక సమయంలో వికెట్ తీశాడు. చదవండి: లక్షలు పోసి కొంటే రెట్టింపు తిరిగి ఇస్తున్నాడు! 4 కోట్లు తీసుకున్న నువ్విలా.. వేస్ట్ ఎక్కడివాళ్లు అక్కడ ఉండాలి.. మధ్యలో దూరడం ఎందుకు: గౌతీపై ఇంగ్లండ్ దిగ్గజం విమర్శలు చిన్నప్పటి నుంచే అశ్విన్కు నాపై క్రష్! స్కూల్ మొత్తం తెలుసు! ఓరోజు.. #KKR clinch a nail-biter here in Hyderabad as Varun Chakaravarthy defends 9 runs in the final over.@KKRiders win by 5 runs. Scorecard - https://t.co/dTunuF3aow #TATAIPL #SRHvKKR #IPL2023 pic.twitter.com/g9KGaBbADy — IndianPremierLeague (@IPL) May 4, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'అతడొక అద్భుతం.. కచ్చితంగా టీమిండియాకు ఆడుతాడు'
ఐపీఎల్-2023లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ యువ స్పిన్నర్ సుయాష్ శర్మ అదరగొట్టాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన సుయాష్ రెండు కీలక వికెట్లు పడగొట్టి.. కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 30 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం19 ఏళ్ల సుయాష్ శర్మపై మరో కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రశంసల వర్షం కురిపించాడు. సుయాష్ భవిష్యత్తులో కచ్చితంగా భారత జట్టుకు ఆడుతాడని చక్రవర్తి కొనియాడాడు. కాగా ఈ మ్యాచ్లో చక్రవర్తి కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. వరుణ్ తన నాలుగు ఓవర్ల కోటాలో మూడు వికెట్లు పడగొట్టి 27 పరుగులిచ్చాడు. "సుయాష్ శర్మ అద్భుతమైన లెగ్ స్పిన్నర్. అతడు జట్టులోకి రావడంతో మా బౌలింగ్ విభాగం మరింత బలపడింది. అదే విధంగా అతడు భవిష్యత్తులో కచ్చితంగా భారత్ తరపున ఆడుతాడు. అతడు దేశీవాళీ క్రికెట్లో ఆడి తన టాలెంట్ను మరింత మెరుగుపరుచుకోవాలని" మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన విలేకురల సమావేశంలో వరుణ్ చక్రవర్తి పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో కేకేఆర్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. చదవండి: IPL 2023 RCB Vs KKR: కోహ్లి కాలికి దండం పెట్టిన రింకూ సింగ్.. ఫోటోలు వైరల్ -
కోల్కతా గెలుపు బాట...
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియం కోల్కతా నైట్రైడర్స్కు మరోసారి కలిసొచ్చిం ది. నాలుగు వరుస పరాజయాలతో డీలా పడిన జట్టుకు కొత్త ఉత్సాహాన్నిచ్చిం ది. సమష్టి ప్రదర్శనతో చెలరేగిన కోల్కతా మళ్లీ గెలుపు బాట పట్టింది. ఈ మైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన గత 11 మ్యాచ్ల్లో ఏడుసార్లు నెగ్గిన కోల్కతా ఈసారీ తమ ఆధిపత్యాన్ని చాటుకొని 21 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు సాధించింది. జేసన్ రాయ్ (29 బంతుల్లో 56; 4 ఫోర్లు, 5 సిక్స్లు), కెప్టెన్ నితీశ్ రాణా (21 బంతుల్లో 48; 3 ఫోర్లు, 4 సిక్స్లు) అదరగొట్టారు. చివర్లో రింకూ సింగ్ (10 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ వీస్ (3 బంతుల్లో 12 నాటౌట్; 2 సిక్స్లు) మెరిశారు. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 179 పరుగులు చేసి ఓడిపోయింది. డుప్లెసిస్ (17; 1 ఫోర్, 2 సిక్స్లు), మ్యాక్స్వెల్ (5; 1 ఫోర్) తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా.. కోహ్లి (37 బంతుల్లో 54; 6 ఫోర్లు), మహిపాల్ (18 బంతుల్లో 34; 1 ఫోర్, 3 సిక్స్లు) దూకుడుగా ఆడినా కీలకదశలో అవుటవ్వడంతో బెంగళూరుకు ఓటమి తప్పలేదు. కోల్కతా బౌలర్లు వరుణ్ చక్రవర్తి (3/27), సుయశ్ శర్మ (2/30), రసెల్ (2/29) బెంగళూరును దెబ్బ కొట్టారు. ధనాధన్ ఆరంభం... టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కతాకు ఓపెనర్లు జేసన్ రాయ్, జగదీశన్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. సిరాజ్ వేసిన తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన రాయ్.. షహబాజ్ వేసిన ఆరో ఓవర్లో ఏకంగా నాలుగు సిక్స్లతో అలరించాడు. తొమ్మిది ఓవర్లకు 82/0తో దూసుకుపోతున్న కోల్కతాకు వైశాక్ బ్రేక్ వేశాడు. పదో ఓవర్లో జగదీశన్ (29 బంతుల్లో 27; 4 ఫోర్లు), జేసన్ రాయ్లను వైశాక్ అవుట్ చేశాడు. రెండు క్యాచ్లు వదిలేసి... ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయినా కోల్కతా అదే దూకుడు కొనసాగించింది. కోల్కతాకు బెంగళూరు ఫీల్డర్ల నిర్లక్ష్యం కూడా కలిసొచ్చిం ది. నితీశ్ రాణా వ్యక్తిగత స్కోరు 5 వద్ద సిరాజ్.. నితీశ్ రాణా వ్యక్తిగత స్కోరు 19 వద్ద హర్షల్ పటేల్ క్యాచ్లు జారవిడిచారు. ఈ రెండు అవకాశాలను సద్వినియోగం చేసుకున్న రాణా కదంతొక్కాడు. హర్షల్ పటేల్ వేసిన 16వ ఓవర్లోని చివరి రెండు బంతులను సిక్స్లుగా మలిచిన రాణా... వైశాక్ వేసిన 17వ ఓవర్లోని చివరి మూడు బంతుల్లో 4,4,6తో మెరిశాడు. 17 ఓవర్లు ముగిసేసరికి కోల్కతా 167/2తో నిలిచింది. అయితే 18వ ఓవర్లో హసరంగ స్పిన్కు నితీశ్ రాణా, వెంకటేశ్ అయ్యర్ (26 బంతుల్లో 31; 3 ఫోర్లు) పెవిలియన్ చేరారు. ఈ ఓవర్లో హసరంగ 3 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అయితే సిరాజ్ వేసిన 19వ ఓవర్ తొలి మూడు బంతుల్లో రింకూ సింగ్ 6,4,4 కొట్టగా... ఐదో బంతికి రసెల్ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్లో వీస్ రెండు సిక్స్లు కొట్టడంతో కోల్కతా స్కోరు 200కు చేరింది. స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (బి) వైశాక్ 56; జగదీశన్ (సి) విల్లీ (బి) వైశాక్ 27; వెంకటేశ్ అయ్యర్ (సి) మ్యాక్స్వెల్ (బి) హసరంగ 31; నితీశ్ రాణా (సి) వైశాక్ (బి) హసరంగ 48; రసెల్ (బి) సిరాజ్ 1; రింకూ సింగ్ (నాటౌట్) 18; డేవిడ్ వీస్ (నాటౌట్) 12; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–83, 2–88, 3–168, 4–169, 5–185. బౌలింగ్: సిరాజ్ 4–0–33–1, విల్లీ 3–0–31–0, హసరంగ 4–0–24–2, షహబాజ్ అహ్మద్ 1–0–25–0, వైశాక్ 4–0–41–2, హర్షల్ పటేల్ 4–0–44–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) వెంకటేశ్ అయ్యర్ (బి) రసెల్ 54; డుప్లెసిస్ (సి) రింకూ సింగ్ (బి) సుయశ్ శర్మ 17; షహబాజ్ అహ్మద్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సుయశ్ శర్మ 2; మ్యాక్స్వెల్ (సి) నితీశ్ రాణా (బి) వరుణ్ 5; మహిపాల్ (సి) రసెల్ (బి) వరుణ్ 34; దినేశ్ కార్తీక్ (సి) రింకూ సింగ్ (బి) వరుణ్ 22; ప్రభుదేశాయ్ (రనౌట్) 10; హసరంగ (సి) అనుకూల్ రాయ్ (సబ్) (బి) రసెల్ 5; విల్లీ (నాటౌట్) 11; వైశాక్ (నాటౌట్) 13; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1–31, 2–51, 3–58, 4–113, 5–115, 6–137, 7–152, 8–154. బౌలింగ్: వైభవ్ అరోరా 2–0–22–0, ఉమేశ్ యాదవ్ 1–0–19–0, సుయశ్ శర్మ 4–0–30–2, వరుణ్ చక్రవర్తి 4–0–27–3, రసెల్ 4–0–29–2, సునీల్ నరైన్ 4–0–41–0, నితీశ్ రాణా 1–0–8–0. ఐపీఎల్లో నేడు రాజస్తాన్ VS చెన్నై (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
Viral Video: ఆహా.. ఏమా మాయాజాలం, కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్సీ క్లీన్ బౌల్డ్
IPL 2023 KKR VS RCB: ఐపీఎల్-2023లో భాగంగా నిన్న (ఏప్రిల్ 7) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ స్పిన్నర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. మిస్టరీ స్పిన్నర్లు సునీల్ నరైన్ (4-0-16-2), వరుణ్ చక్రవర్తి (3.4-0-15-4), సుయాశ్ శర్మ (4-0-30-3) ఆర్సీబీని కకావికలం చేశారు. వీరి ధాటికి ఆర్సీబీ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ICYMI - TWO outstanding deliveries. Two massive wickets. Sunil Narine & Varun Chakaravarthy get the #RCB openers early on. Follow the match - https://t.co/J6wVwbsfV2#TATAIPL | #KKRvRCB pic.twitter.com/GvL1U1GRWW — IndianPremierLeague (@IPL) April 6, 2023 ముఖ్యంగా సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి.. విరాట్ కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్స్వెల్, హర్షల్ పటేల్లను క్లీన్ బౌల్డ్ చేసిన తీరు మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. నరైన్ బౌలింగ్లో కోహ్లి, వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో డుప్లెసిస్ ఒకే రీతిలో క్లీన్ బౌల్డ్ కాగా.. చక్రవర్తి బౌలింగ్లో మ్యాక్సీ, హర్షల్ పటేల్ కూడా ఇంచుమించు అలాగే బౌల్డ్ అయ్యారు. కేకేఆర్ స్పిన్నర్ల మాయాజాలానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు ఆహా.. ఏమా మాయాజాలం అని కామెంట్లు పెడుతున్నారు. Varun Chakravarthy was absolutely unplayable in that spell! 3.4-0-15-4 🔥🔥pic.twitter.com/jvhyU8fOdS — Prasenjit Dey (@CricPrasen) April 6, 2023 ఇదిలా ఉంటే, చారిత్రక ఈడెన్ గార్డెన్స్లో నిన్న జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కోల్కతా నైట్రైడర్స్ 81 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆర్సీబీ 17.4 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కేకేఆర్ ఇన్నింగ్స్లో శార్దుల్ ఠాకూర్ (29 బంతుల్లో 68; 9 ఫోర్లు, 3 సిక్స్లు) శివాలెత్తగా.. గుర్బాజ్ (44 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్లు), రింకూ సింగ్ (33 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్లు) అదరగొట్టారు. ఆర్సీబీ బౌలర్లలో డేవిడ్ విల్లీ, కరణ్ శర్మ తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీని.. వరుణ్ చక్రవర్తి (4/15), సునీల్ నరైన్ (2/16), ఇంపాక్ట్ ప్లేయర్ సుయశ్ శర్మ (3/30) దారుణంగా దెబ్బకొట్టారు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో డెప్లెసిస్ (23) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్కు భారీ ధర.. వాషింగ్టన్ సుందర్కు నామమాత్రపు రేట్
TNPL 2023 Auction: ప్రాంతీయ క్రికెట్ టోర్నీ అయిన తమిళనాడు ప్రీమియర్ లీగ్ సక్సెస్ఫుల్గా ఆరు ఎడిషన్లు పూర్తి చేసుకుని ఏడవ ఎడిషన్ను సిద్ధమవుతుంది. సీజన్ ప్రారంభానికి ముందు నిర్వహకులు తొలిసారి ఆటగాళ్ల వేలాన్ని నిర్వహిస్తున్నారు. ఇవాళ (ఫిబ్రవరి 23), రేపు జరుగబోయే ఈ వేలంలో మొత్తం 942 మంది ఆటగాళ్లు (తమిళనాడుకు చెందిన వారు) తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్లు దినేశ్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్, టి నటరాజన్, వరుణ్ చక్రవర్తి, విజయ్ శంకర్ తదతరులు పాల్గొంటుండగా.. పెద్ద పేర్లలో రిటెన్షన్ చేసుకున్న ఏకైక ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. దిండిగుల్ డ్రాగన్స్ ఫ్రాంచైజీ యాశ్ను 60 లక్షలకు రిటైన్ చేసుకుంది. వేలం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఐ డ్రీమ్ తిరుపూర్ తమిజాన్స్.. టీమిండియా ఆల్రౌండర్, త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్ను 10.25 లక్షల రికార్డు ధరకు సొంతం చేసుకోగా.. ప్రస్తుత భారత పరిమిత ఓవర్ల జట్టు సభ్యుడు వాషింగ్టన్ సుందర్ను మధురై పాంథర్స్ 6.75 లక్షలకు , మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని దిండిగుల్ డ్రాగన్స్ 6.75 లక్షలకు సొంతం చేసుకుంది. వేలంలో పై పేర్కొన్న ఆటగాళ్లు మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది పేరున్న ఆటగాళ్లు ఉన్నారు. సాయ్ కిషోర్, సాయ్ సుదర్శన్, బాబా అపరాజిత్, బాబా ఇంద్రజిత్, మురుగన్ అశ్విన్.. ఇలా దేశవాలీ స్టార్లు చాలా మంది వేలంలో పాల్గొంటున్నారు. కాగా, ఈ వేలంలో ప్రతి జట్టు కనిష్టంగా 16 మందిని, గరిష్ఠంగా 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. లీగ్లో పాల్గొనే 8 జట్లు ఇద్దరు ఇద్దరు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఫ్రాంచైజీల గరిష్ఠ పర్సు విలువ 70 లక్షలుగా నిర్ధారించారు. వేలంలో పాల్గొనే ఆటగాళ్లను నాలుగు కేటగిరీలు విభజించిన నిర్వహకులు.. ఏ కేటగిరి (అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన వారు) ఆటగాళ్లకు 10 లక్షలు, బి కేటగిరి (సీనియర్ బీసీసీఐ దేశవాలీ మ్యాచ్లు ఆడిన వారు) ఆటగాళ్లకు 6 లక్షలు, సి కేటగిరి (పై రెండు కేటగిరిల్లో లేకుండా, కనీసం 30 TNPL మ్యాచ్లు ఆడిన వారు) ఆటగాళ్లకు 3 లక్షలు, డి కేటగిరి (ఇతర ఆటగాళ్లు) ఆటగాళ్లకు 1.5 లక్షల చొప్పున బేస్ ప్రైస్ ఫిక్స్ చేశారు. ఆయా ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలు.. చేపక్ సూపర్ గిల్లీస్ (ఎన్ జగదీశన్) నెల్లై రాయల్ కింగ్స్ (అజితేశ్, కార్తీక్ మణకందన్) ఐ డ్రీమ్ తిరుపూర్ తమిజాన్స్ (తుషార్ రహేజా) లైకా రోవై కింగ్స్ (షారుక్ ఖాన్, సురేశ్ కుమార్) దిండిగుల్ డ్రాగన్స్ (రవిచంద్రన్ అశ్విన్) రూబీ త్రిచీ వారియర్స్ (ఆంటోనీ దాస్) సేలం స్పార్టన్స్ (గణేశ్ మూర్తి) మధురై పాంథర్స్ (గౌతమ్) -
'ఐపీఎల్లో అదరగొడతా.. మళ్లీ తిరిగి టీమిండియాలోకి వస్తా'
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గత కొన్నాళ్లుగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. అతడు చివరి సారిగా టీ20 ప్రపంచకప్-2021లో టీమిండియా తరపున ఆడాడు. ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో అతడిని సెలక్టర్లు గతేడాది ప్రపంచకప్కు ఎంపిక చేశారు. అయితే ఈ మెగా ఈవెంట్లో వరుణ్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ మార్క్యూ ఈవెంట్లో మూడు మ్యాచ్లు ఆడిన అతడు కేవలం ఒకే ఒక్క వికెట్ సాధించాడు. టీ20 ప్రపంచకప్లో విఫలం కావడంతో అప్పటి నుంచి అతడిని సెలక్టర్లు పక్కనబెట్టారు. ఇక ఇది ఇలా ఉండగా.. భారత జట్టులోకి పునరాగమనం చేసి తన సత్తాను నిరూపించుకోవాలని వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం భావిస్తున్నాడు. ఈ విషయాన్ని అతడు స్పోర్ట్స్ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. త్వరలో జరగనున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు ఐపీఎల్-2023లో రాణించి తిరిగి భారత జట్టులోకి వస్తానని ధీమా వ్యక్తం చేశాడు. స్పోర్ట్స్ కీడాతో మాట్లాడుతూ.. "సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నాకు చాలా ముఖ్యమైనది. అక్కడ మెరుగైన ప్రదర్శన చేసి తిరిగి భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్నాను. అదే విధంగా వచ్చే ఏడాది ఐపీఎల్లో అద్భుతంగా రాణించడానికి ప్రయత్నిస్తాను. ఈ రెండు ఈవెంట్లలో నేను బాగా రాణిస్తే.. ఖచ్చితంగా తిరిగి భారత జట్టులోకి చోటు దక్కుతుంది" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: T20 WC 2022: ఎంసీజీ నా హోం గ్రౌండ్.. భారత బ్యాటర్లు నన్ను తట్టుకోలేరు! అవునా?! -
ఉమేశ్ యాదవ్-వరుణ్ చక్రవర్తి సరికొత్త రికార్డు
ఐపీఎల్ 2022లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్లో కేకేఆర్ టెయిలెండర్లు ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు సరికొత రికార్డు నెలకొల్పారు. ఈ మ్యాచ్లో ప్రధాన బ్యాట్స్మెన్ విఫలమైన వేళ ఈ ఇద్దరు కలిసి ఆఖరి వికెట్కు 27 పరుగులు జత చేశారు. విశేషమేమిటంటే.. కేకేఆర్ ఇన్నింగ్స్లో ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. ఉమేశ్ యాదవ్(18), వరుణ్ చక్రవర్తి(10 నాటౌట్) పరుగులు చేశారు. వీరిద్దరు ఆడడంతో కేకేఆర్ 128 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది. కాగా ఐపీఎల్లో ఒక జట్టు తరపున 10,11 బ్యాట్స్మెన్ అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం ఇది ఐదోసారి మాత్రమే. ఇక కేకేఆర్ బ్యాటర్స్లో రసెల్ 25 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అయితే ఉమేశ్ యాదవ్- వరుణ్ చక్రవర్తిలను చూసి ప్రధాన బ్యాటర్స్ బ్యాటింగ్ ఆడడం నేర్చుకోవాలని అభిమానులు కామెంట్స్ చేశారు. చదవండి: Harshal Patel: ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా హర్షల్ పటేల్ IPL 2022: క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూగా మిగిలిపోనుంది -
T20 WC: అలసటా.. టాస్ ప్రభావమా.. అసలు ధోని ఏం చేశాడు? కారణాలేంటి?
Reason Behind India Bad Show In Tourney Explained: తొలి రెండు మ్యాచ్లలో రెండు పెద్ద జట్ల చేతిలో పరాజయం! ఇంకా కోలుకునేందుకు అవకాశం ఎక్కడిది? ఆ తర్వాత చిన్న టీమ్లపై మూడు భారీ విజయాలు సాధించినా అవి సెమీస్ లెక్కకు సరిపోలేదు. ఆట ముగిసిన తర్వాత ‘అలసట’ అని చెప్పినా, ‘టాస్’ ప్రభావం గురించి మాట్లాడినా అవన్నీ ఉత్త మాటలుగానే అనిపిస్తాయి. స్టార్లకు, రికార్డులకు కొదవ లేని జట్టు. సుదీర్ఘ కాలంగా వరుస విజయాలు సాధించి ఊపు మీద కూడా ఉంది. అయినా సరే విరాట్ బృందం మెగా టోర్నీలో చేతులెత్తేసింది. నిజానికి ప్రపంచ కప్కు కొద్ది రోజుల ముందు యూఏఈలో ఆడుతున్న అనుభవం ఎంత ప్రయోజనకరమో, పిచ్లు మన స్పిన్కు ఎంతగా అనుకూలిస్తాయో ఊదరగొట్టినవారు ఇప్పుడు ఓటమి తర్వాత అదే ఐపీఎల్కు వరల్డ్ కప్కు మధ్య కాస్త వ్యవధి ఉంటే బాగుండేదని చెబుతున్నారు! అప్పుడు ఇలాగే.. ►నిజానికి 2016 టి20 ప్రపంచకప్లో కూడా భారత్ ఒకదశలో దాదాపు ఇలాంటి పరిస్థితిలో నిలిచింది. అయితే అప్పుడు కోలుకునే అవకాశం లభించింది. న్యూజిలాండ్ చేతిలో 47 పరుగుల తేడాతో చిత్తుగా ఓడటంతో భారత్ టోర్నీ మొదలైంది. దాంతో ఆపై జరిగే ప్రతీ మ్యాచ్ ‘నాకౌట్’లాగానే సాగింది. ఓడితే నిష్క్రమించే పరిస్థితిలో జట్టు బరిలోకి దిగుతూ వచ్చింది. పాక్పై ఏకపక్షంగా, బంగ్లాపై అనూహ్యంగా గెలిచిన జట్టు ఆసీస్ను అద్భుత రీతిలో ఓడించి సెమీస్ చేరింది. ఈసారి కాస్త మారిన ఫార్మాట్తో (12 జట్లు) మూడు విజయాలు ముందంజ వేసేందుకు సరిపోలేదు. 2012 టి20 ప్రపంచ కప్ తర్వాత ప్రతీ ఐసీసీ టోర్నీ (2013, 14, 15, 16, 17, 19)లో కనీసం సెమీస్ చేరిన టీమిండియా ఇప్పుడు మళ్లీ గ్రూప్ దశకే పరిమితమైంది. .@ImRo45 & @klrahul11 score fifties as #TeamIndia seal a clinical 9⃣-wicket win over Namibia. 👏 👏#T20WorldCup #INDvNAM Scorecard ▶️ https://t.co/kTHtj7LdAF pic.twitter.com/4HgbvFAyWJ — BCCI (@BCCI) November 8, 2021 సమష్టి వైఫల్యమా? ►భారత్ పేలవ ప్రదర్శనకు బ్యాటింగ్ వైఫల్యం కారణమా, బౌలర్లా లేక సమష్టి వైఫల్యమా! చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో మ్యాచ్ అంటే ఆటకు ముందే మనోళ్లు గెలుపు ఖాయం అన్నట్లుగా కనిపించారు. పాత రికార్డులను ముందేసుకొని సరిపెట్టుకుంటూ కొత్తగా మారిన పాక్పై ఎలా ఆడాలనే సన్నద్ధత కనిపించలేదు. లెఫ్టార్మ్ పేసర్ షాహిన్ అఫ్రిది బౌలింగ్లో రోహిత్ ‘డకౌట్’ అందుకు చిన్న ఉదాహరణ మాత్రమే. 151 పరుగులు చేసినా... చివరకు ఒక్కరినీ అవుట్ చేయలేక 10 వికెట్ల తేడాతో ఘోర పరాభవం. ►న్యూజిలాండ్తో గెలిస్తేనే సెమీస్ అవకాశాలు ఉంటాయని తెలిసిన తర్వాత కూడా జట్టు అంతకంటే పేలవ ప్రదర్శన కనబర్చింది. మరీ 110 పరుగులకే పరిమితమైన తర్వాత ఇంకా గెలుపుపై ఆశలు మిగిలి ఉంటాయా! ఈసారి రోహిత్, కోహ్లి, రాహుల్ కలిసికట్టుగా విఫలం కావడంతో అసలు స్కోరు బోర్డు ముందుకే సాగలేదు. ఆపై అఫ్గాన్, స్కాట్లాండ్, నమీబియాలపై ఎంత ప్రతాపం చూపించినా అంతా విఫలప్రయత్నమే! ►టాప్ ఆటగాళ్ల వైఫల్యాలతో పాటు సగం ఫిట్నెస్తో ఉన్న భువనేశ్వర్, హార్దిక్ పాండ్యాలను భారత్ బలవంతంగా కొనసాగించింది. ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ ఎంపికనే ఒక పెద్ద మిస్టరీలాగా అనిపించింది. ఐపీఎల్లో అద్భుతంగా ఆడిన చహల్ను పరిగణలోకి తీసుకోకుండా రాహుల్ చహర్పైనే నమ్మకముంచిన మేనేజ్మెంట్ నాలుగు మ్యాచ్లలో అవకాశమే ఇవ్వలేదు. తాను అలసిపోయినట్లు బుమ్రానే స్వయంగా చెప్పగా, ఈ ఫార్మాట్కు తాను పనికిరానని షమీ నిరూపించేశాడు. అయితే టాస్ను, మంచును నిందించి లాభం లేదు. వీటి ప్రభావం తొలుత బ్యాటింగ్ చేయడంపై ఎలాగూ ఉండదు. కనీస స్కోరు కూడా చేయనప్పుడు దిగ్గజ బౌలర్లు కూడా మ్యాచ్లను రక్షించలేరు. ►ఓవరాల్గా చూస్తే మన బ్యాటింగ్లో పదును లేకపోవడంతో ఈ ని్రష్కమణకు కారణమైంది. సగటు అభిమానులు తాజా ఫలితంపై బాధపడిపోతుండవచ్చు కానీ ఆటగాళ్ల కోణంలో చూస్తే ఇది మరో టోర్నీ మాత్రమే. కనీసం వారు కూడా తప్పుప్పొలను బేరీజు వేసుకునే సమయం కూడా లేకుండా వచ్చే బుధవారం సొంతగడ్డపై న్యూజిలాండ్తో తొలి టి20 మ్యాచ్కు సిద్ధం కావాల్సిందే. ప్రదర్శన ఎలా ఉన్నా భారత క్రికెట్ నిరంతర ప్రవాహంలా సాగిపోతూనే ఉంటుంది. ►చివరగా... మెంటార్ హోదాలో భారీ ఎంట్రీ ఇచ్చిన ధోని ఈ టోర్నీలో సరిగ్గా ఎలాంటి పాత్ర పోషించాడో ఎవరైనా చెప్పగలరా! చదవండి: Virat Kohli: అందరికీ థాంక్స్.. ఆరోజే గనుక వస్తే క్రికెట్ ఆడటం మానేస్తాను.. కోహ్లి ఉద్వేగం -
ధోని వద్దన్నా.. కోహ్లి వినలేదా?
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో మెంటార్ రోల్ను పోషిస్తున్నాడు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని. టీ20 వరల్డ్కప్లో భాగంగా ధోనిని మెంటార్గా తీసుకుంది బీసీసీఐ. ఇటు భారత క్రికెట్ జట్టులో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా, అటు ఐపీఎల్లో సీఎస్కేకు నాలుగు టైటిల్స్ అందించిన సారథిగా ఉన్న ధోనిని మెంటార్గా నియమించుకోవడం సబబే. ప్రధానంగా ధోనిని తీసుకోవడం వెనుక కోహ్లి కూడా ఉన్నాడనేది కాదనలేని వాస్తవం. ఐపీఎల్లో సీఎస్కే ఫైనల్కు చేరిన తర్వాత కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ కోహ్లి వ్యాఖ్యానించడం ఆపై టీమిండియా మెంటార్గా ధోని నియామకం జరిగిపోయాయి. కోహ్లి ప్రత్యేకంగా చెప్పడానికి కారణం? గతవారం పాకిస్తాన్తో మ్యాచ్లో టీమిండియా ఓడిపోయిన తర్వాత ధోని-కోహ్లిల గురించి తీవ్ర చర్చ నడిచింది. నెటిజన్లు ఒక్కోక్కరూ తలో విధంగా స్పందిస్తూ ఈ ఇద్దరే గురించే ఎక్కువ కామెంట్ చేశారు. పాక్తో మ్యాచ్లో భాగంగా ఇషాన్ కిషన్ ద్వారా పంపిన సలహాలు, సూచనలు విరాట్ కోహ్లి పాటించలేదనే దానిపై చర్చ నడిచింది.. కోహ్లితో పాటు రిషభ్ పంత్ క్రీజ్లో ఉన్న సమయంలో ఇషాన్ కిషన్ ఏదో చెప్పగా, దానికి కోహ్లి మరొకటి చెప్పాడు. తాను ఔటైతే హార్దిక్ పాండ్యాను తర్వాత పంపమని, ఒకవేళ రిషభ్ అయితే రవీంద్ర జడేజాను పంపమనే సంకేతాలు ఇచ్చాడు. కాకపోతే వీరిద్దరిలో ఎవరు ఔటైనా హార్దిక్నే తర్వాత పంపుదామనే ధోని సలహాను ఇషాన్ తీసుకురాగా, దానికి కోహ్లి కాస్త భిన్నంగా స్పందించాడాని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. కోహ్లి ప్రత్యేకంగా ఇషాన్ను పిలిచి మరీ చెప్పడం ధోని సలహాను వ్యతిరేకించాడనే దానికి మరింత బలం చేకూర్చేదిగా ఉందని అభిమానుల అభిప్రాయంగా ఉంది. వరుణ్ను ధోని వద్దన్నాడా? ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేస్తూ ఆడపా దడపా భారత జట్టులోకి వస్తున్న లెగ్ బ్రేక్ బౌలర్ వరుణ్ చక్రవర్తి.. అంతర్జాతీయంగా ఇంకా నిరూపించుకోలేకపోయాడు. ఇంకా పరీక్షా సమయాన్ని ఎదుర్కొంటున్న వరుణ్ను.. వరల్డ్ టీ20కి ఎంపిక చేశారు. కానీ పాకిస్తాన్తో పోటీకి వరుణ్ను వద్దనే ధోని అన్నాడనే టాపిక్ వచ్చింది. పెద్దగా అనుభవం లేని వరుణ్ కంటే, రవిచంద్రన్ అశ్విన్ను ఎంపిక చేస్తే మంచిదని ధోని ఒక మెంటార్గా చెప్పాడనేది వీరి భావన. కానీ యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ సెకండ్ ఫేజ్లో వరుణ్ మెరుగైన ప్రదర్శనే చేశాడు. దాంతో వరుణ్ వైపే మొగ్గుచూపాడు కోహ్లి. కానీ అంతర్జాతీయ అనుభవం పెద్దగా లేని వరుణ్ ఎంపిక సరైనది కాదనేది మ్యాచ్ తర్వాత తేటతెల్లమైంది. వరుసగా గాయాల బారిన పడుతున్న వరుణ్ ఎంపికపై ఆదినుంచి డైలమా ఉంది. అతన్ని తీసుకోవాలా వద్దా.. అనే సందిగ్థంలోనే పాక్ వంటి పటిష్టమైన జట్టుతో మ్యాచ్ ఆడేశాడు. కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఫలితంగా కోహ్లి తప్పుచేశాడనే వాదన తెరపైకి వచ్చింది. దీనిపై అభిమానులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. పాక్తో మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసిన వరుణ్..వికెట్లేమీ తీయకుండా 33 పరుగులిచ్చాడు. కోహ్లికి జట్టును ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది కాబట్టి అందులో ధోని తలదూర్చే అవకాశం దాదాపు ఉండదనేది ఒక వాదన. మరి ధోని-కోహ్లిల మధ్య అంతర్గతంగా ఏమి జరిగిందనే వారికే తెలియాలి. మార్పులు తప్పవా? ఈ టీ20 వరల్డ్కప్లో మిగిలిఉన్న మ్యాచ్లు టీమిండియాకు కీలకం. దాంతో కివీస్తో ఆదివారం(ఆక్టోబర్ 31) మ్యాచ్కు భారీ మార్పులు ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్లు తుది జట్టులో ఆడేది అనుమానంగానే ఉంది. వీరిద్దరూ రాణించడం విషయాన్ని పక్కన పెడితే, పాక్ జట్టును పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు.మరొకవైపు షమీ కూడా రాణించలేదు. కానీ టీమిండియా పేస్ విభాగంలో భువీని తప్పించి అతని స్థానంలో శార్దూల్ తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ పరుగులు చేస్తున్నప్పుడు తానొక బ్రేక్-త్రూ బౌలర్ అనే విషయాన్ని శార్దూల్ చాలాసార్లు నిరూపించుకున్నాడు. దాంతో శార్దూల్, అశ్విన్లు తుదిజట్టులో ఆడే అవకాశం ఎక్కువగా ఉంది. కివీస్తో మ్యాచ్కు వరుణ్ వద్దే వద్దు! న్యూజిలాండ్తో మ్యాచ్కు వరుణ్ వేసుకోవద్దని ఇప్పటికే మాజీలు సలహాలు ఇవ్వడం షురూ చేశారు. ఐపీఎల్లో విజయవంతమైన బౌలరే కానీ వరల్డ్కప్ లాంటి మెగా ఈవెంట్లో, అందులోనూ కివీస్తో కీలకమైన మ్యాచ్కు వరుణ్ తీసుకుని మళ్లీ తప్పుచేయవద్దని టీమిండియా మాజీ క్రికెటర్ దిలీప్ దోషి తేల్చిచెప్పాడు. అతనికి విశ్రాంతి ఇవ్వడమే ఉత్తమం అని పేర్కొన్నాడు. ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేసినా అంతర్జాతీయ క్రికెట్ అనేది భిన్నమైనదని పేర్కొన్నాడు. ‘కీలకమైన మ్యాచ్లు టీమిండియా ముందున్న తరుణంలో వరుణ్ను పక్కన పెట్టండి. యూఏఈ పిచ్లపై స్పిన్నర్లు పెద్దగా రాణించలేరు. పాక్తో మ్యాచ్లో ఈ విషయం నిరూపితమైంది. స్పిన్నర్లపై పెద్దగా ఆశలు పెట్టుకోవద్దు’ అని దిలీప్ దోషి పేర్కొన్నాడు. ఇక హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్లు తమ గత ఫామ్ను అందుపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. -
అలాంటి మిస్టరీ బంతులను పాక్లో గల్లీ పోరలు రోజూ ఎదుర్కొంటారు..!
Salman Butt Takes A Dig At Varun Chakaravarthy: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా పాక్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తేలిపోవడంపై పాక్ మాజీ సారధి సల్మాన్ బట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరుణ్ సంధించిన మిస్టరీ బంతులను పాక్లో గల్లీ పోరలు రోజూ ఎదుర్కొంటారని.. వేళ్లతో ట్రిక్స్ చేస్తూ బ్యాట్స్మెన్ను తికమక పెట్టే ప్రయత్నం చేయడం పాక్లో సర్వసాధారణమని.. అందుకే వరుణ్ను పాక్ ఓపెనర్లు సునాయాసంగా ఎదుర్కొన్నారని తెలిపాడు. పాక్పై మిస్టరీ బౌలింగ్ ప్రభావం నామమాత్రమేనని, గతంలో శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండిస్ సైతం పాక్పై పెద్దగా ప్రభావం చూపలేకపోయాడని అన్నాడు. 2003-04 పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు సభ్యుడు ఇర్ఫాన్ పఠాన్పై కూడా అప్పటి పాక్ కోచ్ జావిద్ మియాందాద్ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. ఇర్ఫాన్ లాంటి బౌలర్లు పాక్లో వీధికొకరు ఉంటారని అవమానించాడు. కాగా, నిన్న పాక్తో మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లు బౌల్ చేసి 33 పరుగులు సమర్పించుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ప్రపంచకప్ చరిత్రలో పాకిస్తాన్కు భారత్పై తొలి విజయం దక్కింది. ఆదివారం జరిగిన పోరులో పాక్ 10 వికెట్ల తేడాతో భారత్ను చిత్తు చేసి ప్రపంచ కప్లో శుభారంభం చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (49 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడగా...‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షాహిన్ అఫ్రిది (3/31) టీమిండియాను దెబ్బ తీశాడు. అనంతరం పాక్ 17.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 152 పరుగులు చేసి చారిత్రక విజయం నమోదు చేసింది. ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్ (55 బంతుల్లో 79 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ బాబర్ ఆజమ్ (52 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు. చదవండి: IND Vs PAK: షమీపై నెటిజన్ల దాడి.. ఖండించిన టీమిండియా మాజీలు -
టీ20 ప్రపంచకప్కు ముందు టీమిండియాకు బిగ్ షాక్..!
Varun Chakravarthy Dodgy Knees Became Biggest Head Ache For Team India: త్వరలో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్కు ముందు టీమిండియాకు ఓ షాకింగ్ వార్త పెద్ద తలనొప్పిగా మారింది. యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మెగా టోర్నీలో ఆడటం అనుమానంగా ఉందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ తరఫున ఆడుతున్న వరుణ్..మోకాళ్ల నొప్పులతో సతమతమవుతున్నాడు. పెయిన్ కిల్లర్ లేకుండా అతను బరిలోకి దిగే పరిస్థితి లేదు. దీంతో పొట్టి ప్రపంచకప్కు అతను అందుబాటులో ఉంటాడా లేదా అన్నది అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో వరుణ్ స్థానంలో చహల్ను జట్టులోకి తీసుకునే అంశం బీసీసీఐ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అక్టోబరు 10 వరకు తుది జట్లలో మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, వరుణ్.. ప్రస్తుత ఐపీఎల్లో కేకేఆర్ తరఫున 13 మ్యాచ్ల్లో 15 వికెట్లతో సూపర్ ఫామ్లో కొనసాగుతున్నాడు. 30 ఏళ్ల ఈ మిస్టరీ స్పిన్నర్ టీమిండియా తరఫున 3 టీ20ల్లో 2 వికెట్లు, 27 ఐపీఎల్ మ్యాచ్ల్లో 33 వికెట్లు పడగొట్టాడు. చదవండి: T20 World Cup 2021: ఈ ఐదు తొలిసారిగా.. సరికొత్తగా.. ఆసక్తికర విశేషాలు -
T20 World Cup: టీమిండియాకు అతడే కీలకం: ఇర్ఫాన్ పఠాన్
Irfan Pathan Comments On Varun Chakravarthy: రానున్న టీ20 వరల్డ్కప్లో యువ ఆటగాడు వరుణ్ చక్రవర్తి టీమిండియాకు కీలకంగా మారనున్నాడని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. ఐపీఎల్లో ఆడిన అనుభవం అతడికి ప్రయోజనకరంగా మారనుందని పేర్కొన్నాడు. అయితే, తొలి ప్రపంచకప్ ఆడే సమయంలో ఒత్తిడికి గురవడం సహజమని, దానిని అధిగమిస్తే సత్ఫలితాలు పొందవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా టీ20 వరల్డ్కప్నకై ప్రకటించిన జట్టులో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి చోటు దక్కిన విషయం విదితమే. ఇక ఐపీఎల్-2021లో భాగంగా యూఏఈ వేదికగా సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ బౌలర్ వరుణ్ అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. 4 ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. మాక్స్వెల్, సచిన్ బేబి, వనిందు హసరంగ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో కేకేఆర్ తొమ్మిది వికెట్ల తేడాతో ఆర్సీబీపై ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన వరుణ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ... ‘‘వరల్డ్కప్లో తను కీలకంగా మారే అవకాశం ఉంది. నిజానికి అంతర్జాతీయ క్రికెట్కు... లీగ్ మ్యాచులకు తేడా ఉంటుంది. ఒత్తిడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే, ఐపీఎల్ ఆడటం వల్ల కావాల్సినంత ప్రాక్టీసు దొరుకుతుంది. వరుణ్ కూడా అంతే. నిజానికి వన్డే వరల్డ్ కప్ 2011 సమయంలో జహీర్ ఖాన్ నకుల్ బాల్ వేయడం మొదలుపెట్టాడు. అదొక ఆశ్చర్యకరమైన డెలివరీ. ఇలాంటి సర్ప్రైజ్ ఫ్యాక్టర్ కచ్చితంగా బౌలర్కు మేలు చేస్తుంది. కొత్త విషయాలు కనుగొనడం బౌలర్లకు ఉపయుక్తంగా ఉంటాయి. బహుశా వరుణ్ చక్రవర్తి నుంచి కూడా ఇదే తరహాలో ఏవైనా కొత్త డెలివరీలు ఊహించవచ్చేమో’’ అని పేర్కొన్నాడు. కాగా ఫాస్ట్ బౌలర్లు తమ వేగాన్ని(బంతి) ఒక్కసారిగా తగ్గించి బ్యాట్స్మెన్ను తికమక పెట్టేందుకు విసిరే బంతిని నకుల్బాల్గా పేర్కొంటారన్న సంగతి తెలిసిందే. కాగా అక్టోబరు 17 నుంచి యూఏఈ, ఒమన్ వేదికగా టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. కాగా ఇటీవలి శ్రీలంక పర్యటనతో వరుణ్ చక్రవర్తి టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2021 2nd Phase: అరంగేట్రంలోనే అదరగొట్టిన ఆటగాళ్లు వీరే -
KKR vs RCB: కోల్కతా ధనాధన్ షో.. రసెల్ పడేశాడు, వరుణ్ తిప్పేశాడు
భారత్లో చక్కగా సాగిపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యూఏఈలో మాత్రం పేలవంగా ఆరంభించింది. కోహ్లి, డివిలియర్స్, మ్యాక్స్వెల్లాంటి సూపర్ హిట్టర్లున్న జట్టు కనీసం వంద పరుగులైనా చేయలేకపోయింది. మరోవైపు కోల్కతా నైట్రైడర్స్ జట్టు మాత్రం ధనాధన్ షోతో మ్యాచ్ను ముగించింది. మొదట స్పిన్–పేస్ బౌలింగ్ కలయికతో ప్రత్యర్థి ఆటకట్టించిన నైట్రైడర్స్ లక్ష్యాన్ని మెరుపువేగంతో ఛేదించింది. అబుదాబి: ఐపీఎల్–14 సీజన్ రెండో అంచెలో కోల్కతా నైట్రైడర్స్ బెబ్బులిలా పంజా విసిరింది. కోహ్లి సేనకు ఊహించని షాక్ ఇచ్చింది. బౌలింగ్లో వందలోపే కట్టడి చేసిన మోర్గాన్ బృందం బ్యాటింగ్లో 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఉఫ్మని ఊదేసింది. దీంతో 20–20 ఓవర్ల ఆట కాస్తా 29 ఓవర్లలోనే ముగిసింది. సోమవారం ముందుగా బ్యాటింగ్కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 19 ఓవర్లలో 92 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ చేసిన 22 (20 బంతుల్లో 3 ఫోర్లు) పరుగులే వారి ఇన్నింగ్స్లో టాప్ స్కోర్. రసెల్ (3/9)) నిప్పులు చెరిగే స్పెల్తో... వరుణ్ చక్రవర్తి (3/13) తిప్పేసే మ్యాజిక్తో కోహ్లి సేన చేష్టలుడిగింది. తర్వాత కోల్కతా 10 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 94 పరుగులు చేసి జయభేరి మోగించింది. ఓపెనర్లు శుబ్మన్ గిల్ (34 బంతుల్లో 48; 6 ఫోర్లు, 1 సిక్స్), వెంకటేశ్ అయ్యర్ (27 బంతుల్లో 41 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. వరుణ్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. కోహ్లి 5, డివిలియర్స్ 0 బెంగళూరు దళానికి బ్యాటింగే బలం. అందులోనూ కోహ్లి, డివిలియర్స్ల బ్యాట్ల నుంచి జాలువారే పరుగులు, సిక్సర్లు అభిమానులకు కనువిందు. కానీ... సోమవారం కోల్కతా కసి ముందు ఎవరి ఆటలు సాగలేదు. మ్యాక్స్వెల్ రూపంలో జట్టుకు మరో మెరుపు వీరుడు జతయినప్పటికీ నైట్రైడర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్కు మొత్తం బెంగళూరు ఇన్నింగ్సే చెల్లాచెదురైంది. రెండో ఓవర్లోనే కోహ్లి (5) ఔటయ్యాడు. పవర్ప్లేలో పడిక్కల్ పెవిలియన్ చేరాడు. 6 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 41/2 స్కోరుతో బాగానే కనిపించింది. 9వ ఓవర్ వేసేందుకు రసెల్ వచ్చాక, స్పిన్నర్ వరుణ్ మ్యాజిక్ మొదలయ్యాక బెంగళూరు ఒక్కసారిగా కుదేలైంది. రసెల్ తన తొలి ఓవర్లోనే భరత్ (16), డివిలియర్స్ (0)ను ఔట్ చేశాడు. వరుణ్ కూడా తన సహచరుడినే ఫాలో అయ్యాడు. మ్యాక్స్వెల్ (10), హసరంగ (0)ను ఒకే ఓవర్లో ఔట్ చేశాడు. ఇలా 8 వికెట్లను 41 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. ఓపెనర్లే చితగ్గొట్టారు... అవతలివైపు ఆపసోపాలు పడి చేసిన పరుగుల్ని ఇవతలివైపు ఇద్దరంటే ఇద్దరే బాదేశారు. కోల్కతా ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్, శుబ్మన్ గిల్ పోటీపడి మరీ బౌండరీలు బాదేశారు. దీంతో బెంగళూరు బౌలర్లు అలసిపోకుండా సగం కోటా (ఐదుగురు తలా 2 ఓవర్లు వేశారు)లోనే లక్ష్యం పూర్తయ్యింది. పదో ఓవర్లో గిల్ ఔటైనా... కావాల్సిన 11 పరుగుల్ని మూడు బౌండరీలతో వెంకటేశ్ అదే ఓవర్లో పూర్తి చేయడంతో రసెల్కు బంతిని ఎదుర్కొనే అవకాశమే చిక్కలేదు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (ఎల్బీ) (బి) ప్రసిధ్ కృష్ణ 5; పడిక్కల్ (సి) దినేశ్ కార్తీక్ (బి) ఫెర్గూసన్ 22; శ్రీకర్ భరత్ (సి) గిల్ (బి) రసెల్ 16; మ్యాక్స్వెల్ (బి) వరుణ్ 10; డివిలియర్స్ (బి) రసెల్ 0; సచిన్ బేబీ (సి) నితీశ్ (బి) వరుణ్ 7; హసరంగ (ఎల్బీ) (బి) వరుణ్ 0; జేమీసన్ (రనౌట్) 4; హర్షల్ పటేల్ (బి) ఫెర్గూసన్ 12; సిరాజ్ (సి) వరుణ్ (బి) రసెల్ 8; చహల్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 6; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్) 92. వికెట్ల పతనం: 1–10, 2–41, 3–51, 4–52, 5–63, 6–63, 7–66, 8–76, 9–83, 10–92. బౌలింగ్: వరుణ్ చక్రవర్తి 4–0–13–3, ప్రసిధ్ కృష్ణ 4–0–24–1, ఫెర్గూసన్ 4–0–24–2, నరైన్ 4–0–20–0, రసెల్ 3–0– 9–3. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (సి) సిరాజ్ (బి) చహల్ 48; వెంకటేశ్ (నాటౌట్) 41; రసెల్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (10 ఓవర్లలో వికెట్ నష్టానికి) 94. వికెట్ పతనం: 1–82. బౌలింగ్: సిరాజ్ 2–0–12–0, జేమీసన్ 2–0–26–0, హసరంగ 2–0–20–0, చహల్ 2–0–23–1, హర్షల్ పటేల్ 2–0–13–0. -
టీ20 వరల్డ్ కప్: నా ఓటు అతడికే: ముత్తయ్య మురళీధరన్
కొలంబో: టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్పై శ్రీలంక దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ ప్రశంసలు కురిపించాడు. ఇప్పటికే కుల్దీప్ తన ప్రతిభను నిరూపించుకున్నాడని, అయినా దురుదృష్టవశాత్తూ కొన్నిసార్లు అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిందని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కోల్కతా నైట్రైడర్స్ అతడి సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రానున్న టీ20 వరల్డ్ కప్లో వరుణ్ చక్రవర్తితో పోలిస్తే, కుల్దీప్నకే టీమిండియా తరఫున ఆడే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అతడికే తన ఓటు అని ముత్తయ్య మురళీధరన్ స్పష్టం చేశాడు. కాగా ఐపీఎల్-2021లో కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిథ్యం వహించిన కుల్దీప్నకు యాజమాన్యం అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. స్పిన్ విభాగంలో సునిల్ నరైన్, షకీబ్ అల్ హసన్, వరుణ్ చక్రవర్తిని మాత్రమే ఎక్కువగా వినియోగించుకుంది. ఈ విషయంపై స్పందించిన కుల్దీప్.. ‘‘నేను మరీ అంతపనికిరాని వాడినా? చెత్తగా ఆడతానా?’’ అని మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక భారత జట్టు శ్రీలంక టూర్లో భాగంగా జట్టులో చోటుదక్కించుకున్న అతడు... వన్డే సిరీస్ తొలి మ్యాచ్లో 2 వికెట్లు తీశాడు. రెండో మ్యాచ్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన కుల్దీప్.. చివరి మ్యాచ్లో బెంచ్కే పరిమితమయ్యాడు. అదే విధంగా.. మొదటి టీ20లో ఆడే అవకాశం రాకపోగా.. రెండో టీ20లో 2 వికెట్లతో రాణించాడు. మూడో మ్యాచ్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. అదే విధంగా.. శ్రీలంక పర్యటనలో భాగంగా అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన వరుణ్ చక్రవర్తి.. తొలి రెండు మ్యాచ్లలో ఒక్కో వికెట్ తీశాడు. మూడో మ్యాచ్లో ఖాతా తెరవలేకపోయాడు. ఈ నేపథ్యంలో రానున్న టీ20 వరల్డ్ కప్ అంచనాల గురించి ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ... ‘‘యూఏఈలో జరుగనున్న ఐపీఎల్ పూర్తయ్యేంత వరకు వేచి చూడక తప్పదు. ఎవరు ఫాంలో ఉంటారు.. ఎవరు ఫాం కొనసాగిస్తారన్న అంశాలు తేలతాయి. అయితే, స్పిన్నర్ల విషయంలో నేను మాత్రం కుల్దీప్ యాదవ్ వైపే మొగ్గు చూపుతాను. ఎందుకంటే వికెట్లు తీయగల బౌలర్గా తనను తాను నిరూపించుకున్నాడు. ఇక వరుణ్ చక్రవర్తి విషయానికొస్తే... తను మంచి బౌలర్. టీమిండియా, ఐపీఎల్ జట్లకు తను బెటర్ ఆప్షన్. అయితే, అజంతా మెండిస్, సునీల్ నరైన్ అంతటి స్థాయి వరుణ్కు లేదనే అనుకుంటాను. తను బ్యాట్స్మెన్ను మెస్మరైజ్ చేయలేడు. ఇంకా మెరుగ్గా రాణించాల్సి ఉంది’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్లో భాగంగా ముత్తయ్య మురళీధరన్.. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బౌలింగ్ కోచ్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. -
వికెట్ కీపర్గా మొదలెట్టాడు.. మిస్టరీ స్పిన్నర్లా రాణిస్తున్నాడు
న్యూఢిల్లీ: ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున దుమ్మురేపిన 29 ఏళ్ల వరుణ్ చక్రవర్తి.. మిస్టరీ స్పిన్నర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా, అతని బౌలింగ్లో ఉన్న మిస్టరీ.. అతని జీవన ప్రయాణంలోనూ కొనసాగుతుంది. వికెట్ కీపర్గా క్రికెట్ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన వరుణ్.. ప్రస్తుతం వైవిధ్యమైన బౌలర్గా రాణిస్తున్నాడు. 13 ఏళ్ల వయసులో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా కెరీర్ ప్రారంభించిన అతను 17 ఏళ్ల వరకు అలానే కొనసాగాడు. అయితే వికెట్ కీపర్గా పెద్దగా రాణించకపోవడంతో క్రికెట్ను పక్కనపెట్టేసి చదువుపై దృష్టిసారించాడు. ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీలో అర్కిటెక్చర్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఫ్రిలాన్స్ ఆర్కిటెక్ట్గా పనిచేశాడు. కానీ ఆ పని కిక్ ఇవ్వకపోవడంతో మళ్లీ 23 ఏళ్ల వయసులో టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. అయితే ఈసారి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా కాకుండా మీడియం పేసర్ అవతారమెత్తాడు. టెన్నిస్ బాల్ క్రికెట్లో అద్భుతంగా రాణించాడు. కానీ మొకాలి గాయం కావడంతో పేస్ బౌలింగ్ను వదిలేసి స్పిన్నర్గా అవతారమెత్తాడు. టెన్నిస్ బాల్ క్రికెట్లో స్పిన్నర్స్ను బాగా కొడతారని భావించిన ఈ తమిళనాడు కుర్రాడు.. తన స్పిన్కు పేస్ను జోడించి విభిన్నమైన వేరియేషన్స్లో బౌలింగ్ చేశాడు. లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్, గూగ్లీ, ఫ్లిప్పర్, టాప్ స్పిన్, క్యారమ్ బాల్స్, ఆర్మ్ బాల్స్ ఇలా మొత్తం ఏడు రకాల వేరియేషన్స్ తో బౌలింగ్ చేసేవాడు. ఒకే ఓవర్లో లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్, గూగ్లీ వంటి విభిన్నమై వేరియేషన్స్తో బంతులు వేయడం, దానికి పేస్ జోడించడంతో బ్యాట్స్మెన్ తెగ ఇబ్బంది పడేవారు. అనంతరం 2017లో సీఎస్కే నెట్ బౌలర్గా అవకాశం దక్కించుకున్న వరుణ్.. మాజీ కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ దృష్టిని ఆకర్శించాడు. డీకే పట్టుపట్టి మరీ వరుణ్ను కేకేఆర్ నెట్ బౌలర్గా ఎంపిక చేయించాడు. అక్కడ సునీల్ నరైన్ సాయంతో మెళకువలు నేర్చుకున్న వరుణ్.. మిస్టరీ స్పిన్నర్లా మారాడు. దీంతో 2019 ఐపీఎల్ వేలంలో కింగ్స్ పంజాబ్ జట్టు వరుణ్ను రూ.8.4 కోట్లకు కొనుగోలు చేసింది. అనంతరం 2020 సీజన్లో కేకేఆర్ మేనేజ్మెంట్ వరుణ్ను రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సీజన్లో 13 మ్యాచ్లు ఆడిన అతను 17 వికెట్లు తీశాడు. తాజా సీజన్లోనూ అద్భుతంగా రాణించిన వరుణ్.. 7 మ్యాచ్ల్లో 7 వికెట్లు తీశాడు. కాగా, ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్న వరుణ్.. గతేడాదే టీమిండియా పిలుపు అందుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన టీ20 జట్టులో అతనికి చోటు దక్కింది. కానీ భుజ గాయం కారణంగా ఆ అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్లోనూ అవకాశం దక్కింది. అది కూడా యోయో ఫిట్నెస్ టెస్ట్ అధిగమించకపోవడంతో చేజారింది. -
వీడియో కాల్లో చూసి కోవిడ్ అని చెప్పేసింది..
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఐపీఎల్ సందర్బంగా కరోనా బారిన పడి, ఇటీవలే కోలుకున్న కేకేఆర్ ఆటగాడు సందీప్ వారియర్.. ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. మే 2న అతని భార్యతో వీడియో కాల్ మాట్లాడుతుండగా.. ఆమె అతనికి కరోనా సోకిందని చెప్పినట్లు తెలిపాడు. భార్య ఆర్తి కరోనా రోగులకు చికిత్స అందించే డాక్టర్ కావడంతో.. ఆమె ఈ విషయాన్ని చూపులతో పసికట్టిందని, అంతే కాకుండా ఆమె కూడా గతేడాది కరోనా బారిన పడిందని సందీప్ చెప్పుకొచ్చాడు. కరోనా బారిన పడినప్పుడు ఆమెకున్న లక్షణాలే తనకున్నాయని చెప్పడంతో, టెస్టు రిపోర్ట్ రాకముందే తనకు కరోనాగా నిర్దారించిందని గుర్తు చేసుకున్నాడు. కాగా, సందీప్ వారియర్.. అంతకు ముందే ఓ సారి కరోనా టెస్ట్ చేయించాడు. దీంట్లో అతనికి నెగిటివ్ వచ్చింది. అయితే ఆతర్వాత అతని భార్య సలహా మేరకు రెండో సారి టెస్ట్ చేయించగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. నాటి నుంచి దాదాపు నాలుగు వారాలు మహమ్మారితో పోరాడిన సందీప్.. ఇటీవలే కోలుకొని, పాత విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. ఇదిలా ఉంటే, సందీప్తో పాటు మరో కోల్కతా ఆటగాడు వరుణ్ చక్రవర్తి కూడా కరోనా బారిన పడి కొద్ది రోజుల క్రితమే కోలుకున్నాడు. కాగా, ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ అర్దాంతరంగా ముగిసింది. ఈ సీజన్లో కోల్ కతా 7 మ్యాచ్లు ఆడగా 2 విజయాలు, 5 పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. చదవండి: సచిన్.. నన్ను ఓ జర్నలిస్టులా పరిచయం చేశాడు: భార్య అంజలీ -
షారుక్ భాయ్ మమ్మల్ని వదల్లేదు.. రోజు ఎంక్వైరీ చేసేవాడు
చెన్నై: కరోనా మహమ్మారి సెగతో ఐపీఎల్ 14వ సీజన్ను బీసీసీఐ మధ్యలోనే రద్దు చేసిన సంగతి తెలిసిందే. కేకేఆర్ ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్లు ఇద్దరికి కరోనా పాటిటివ్గా తేలడంతో ముందు జాగ్రత్త చర్యగా ఇద్దరు ఆటగాళ్లను ఐసోలేషన్కు తరలించారు. ఆ తర్వాత సీఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్, ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీల్లో కూడా కరోనా కలకలం రేపడంతో సీజన్ను రద్దు చేయాల్సి వచ్చింది. తాజాగా సందీప్ వారియర్ కరోనా నుంచి కోలుకొని ఇంటికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో సందీప్ వారియర్ కరోనా సమయంలో కేకేఆర్ తనతో పాటు వరుణ్ చక్రవర్తిని ఎలా చూసుకుందనే దానిపై చెప్పుకొచ్చాడు. ''మాకు కరోనా పాజిటివ్ అని తేలగానే చాలా భయపడిపోయాం.అయితే కేకేఆర్ యాజమాన్యం మాకు దైర్యం చెప్పింది. మా జట్టు డాక్టర్ శ్రీకాంత్, వేన్ బెంట్లీ(మేనేజర్) ,రాజు (లాజిస్టిక్స్) మాతో పాటే ఉండి మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నారు. మా ఇద్దరికి నెగెటివ్ వచ్చిన తర్వాతే వారు ఇంటికి వెళ్లారు. అంతేగాక కేకేఆర్ సహ యజమాని షారుక్ ఖాన్ మమ్మల్ని వదల్లేదు. మాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతీరోజు మా ఆరోగ్యం గురించి ఎంక్వైరీ చేసేవాడు. షారుక్ తన జట్టులో ఎవరైనా ఆటగాడు ఏ విషయంలో బాధపడ్డా అతను ఊరుకోడని.. వారి సమస్యను తీర్చేందుకు ముందుకు వస్తాడని తెలిసింది. ఈ విషయం మాకు ఆనందాన్ని కలిగించింది. అయితే మాకు కరోనా సోకిన మరుసటి రోజే లీగ్ వాయిదా పడడంతో కాస్త బాధ వేసింది. ఈ సమయంలో షారుక్ మాకు ఫోన్ చేసి.. ముందు మీరు త్వరగా కోలుకోండి.. ఈ సీజన్ను రద్దు అయిందని బాధపడకండి.. ఒకవేళ నిర్వహించే అవకాశం ఉంటే మీరు ఆడవచ్చు.. ఈ విషయం గురించి మర్చిపోయి రెస్ట్ తీసుకోండి అని ఫోన్లో చెప్పారు.'' అని సందీప్ తెలిపాడు. కాగా ఐపీఎల్ 14వ సీజన్లో 29 మ్యాచ్లు జరగ్గా.. మరో 31 మ్యాచ్లు నిర్వహించాల్సి వచ్చింది. ఇక ఈ సీజన్లో కేకేఆర్ ప్రదర్శన చెప్పుకునేంత స్థాయిలో లేదు. మోర్గాన్ సారధ్యంలోని కేకేఆర్ 7 మ్యాచ్ల్లో 2 విజయాలు.. 5 ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. అయితే కరోనా కారణంగా రద్దు అయిన సీజన్ను సెప్టెంబర్- అక్టోబర్లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుంది. చదవండి: కోహ్లి నన్ను స్లెడ్జ్ చేశాడు.. సంతోషం! ఇంకా పూర్తిగా కోలుకోలేదు: వరుణ్ చక్రవర్తి -
ఇంకా పూర్తిగా కోలుకోలేదు: వరుణ్ చక్రవర్తి
కోల్కతా నైట్రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ ప్రాక్టీస్ చేసే ఫిట్నెస్ లేదన్నాడు. ఇంకా నీరసం, మగత అలాగే ఉన్నాయని...కోవిడ్ తర్వాతి లక్షణాలతో సతమతమవుతున్నానని 29 ఏళ్ల చక్రవర్తి తెలిపాడు. నైట్రైడర్స్ యజమాని షారుక్ఖాన్ వ్యక్తిగతంగా మాట్లాడారని, వైరస్ నుంచి కోలుకునేందుకు తనలో స్థైర్యం నింపారని వరుణ్ చెప్పాడు. ఐపీఎల్లో చక్రవర్తి కరోనా బారిన పడ్డాడు. వరుణ్కు కరోనా రావడమే ఆ తర్వాత ఐపీఎల్ వాయిదాకు కారణమైంది. -
IPL 2021: ఇంటికి చేరుకున్న వరుణ్, సందీప్
న్యూఢిల్లీ: ఐపీఎల్ సమయంలో కరోనా బారిన పడిన కోల్కతా నైట్రైడర్స్ క్రికెటర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్స్ తమ స్వస్థలాలకు చేరుకున్నారు. పది రోజుల క్వారంటైన్ ముగియడంతో వరుణ్ బెంగళూరుకు, సందీప్ త్రిచూర్కు వెళ్లిపోయారు. వారు మళ్లీ కోవిడ్–19 పరీక్షకు హాజరవుతారు. మరో వైపు పాజిటివ్గా తేలిన న్యూజిలాండ్ ఆటగాళ్లు టిమ్ సీఫెర్ట్ ఇంకా ఐసోలేషన్లోనే ఉన్నాడు. వరుణ్, సందీప్ కేసులు బయటపడిన అనంతరమే 2021 ఐపీఎల్ వాయిదా వరకు వెళ్లింది. కాగా బయో బబుల్లో ఉన్నప్పటికీ ఆటగాళ్లు వరుసగా కోవిడ్ బారిన పడుతుండటంతో ఈ సీజన్ను నిరవధింకగా వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక దేశంలో కరోనా తీవ్రత దృష్ట్యా స్థానికంగా టోర్నీ నిర్వహించే అవకాశం లేదని, యూఏఈ లేదా ఇంగ్లండ్లోనే మిగిలిన షెడ్యూల్ను పూర్తి చేసే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. ఇక ఐపీఎల్-2021లో ఇప్పటి వరకు 29 మ్యాచ్లు జరుగగా, ఇంకా 31 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ సీజన్లో ఇప్పటి వరకు 6 విజయాలు నమోదు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. చదవండి: కోవిడ్పై పోరు: సన్రైజర్స్ భారీ విరాళం IPL 2021: నీ వల్లే ఐపీఎల్ ఆగిపోయిందంటూ నెటిజన్ల ఫైర్!
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తొలిసారి ఓటేశారు (ఫొటోలు)
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేతల దాడి
నా ఓటు .. నా హక్కు (ఫొటోలు)
తడిచి మురిసిన ముంబై : భారీ గాలిదుమ్ముతో ఆగిన విమాన సేవలు
మామిడి పండ్లను తినడం వల్ల మొటిమలు వస్తాయా?
IPL: ధోనికి ఇదే చివరి సీజన్?!.. క్లారిటీ ఇచ్చేసిన రైనా
సమయం మించిపోతోంది.. రండి.. ఓటేయండి (ఫొటోలు)
మే 19కల్లా అండమాన్కు రుతుపవనాలు
నాన్నను బతికుండగానే కాలం చేయమని కోరా!: నటుడు
ఓటు హక్కు వినియోగించుకున్న యాంకర్ శ్యామల కుటుంబ సభ్యులు
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement