breaking news
Venezuela
-
ట్రంప్నకు మచాడో నోబెల్ శాంతి బహుమతి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు తన నోబెల్ శాంతి బహుమతిని అందజేశారు వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడో. గురువారం వైట్ హౌస్లో జరిగిన సమావేశంలో ట్రంప్నకు తన నోబెల్ శాంతి బహుమతి మెడల్ను అందజేసినట్లుగా ఆమె తెలిపారు.వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ దేశ రాజకీయ భవిష్యత్తుపై తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. గంటకు పైగా సాగిన సమావేశం తర్వాత మచాడో వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆమెకు మద్దతుదారులు ఉత్సాహంగా స్వాగతం పలికారు. “మనం అధ్యక్షుడు ట్రంప్పై ఆధారపడవచ్చు” అని ఆమె పేర్కొన్నారు. అనంతరం “థ్యాంక్ యూ, ట్రంప్” అంటూ నినాదాలు చేయించారు.అయితే ఆమె సమర్పించిన నోబెల్ పతకాన్ని ట్రంప్ స్వీకరించారా లేదా అనే ప్రశ్నకు మచాడో సమాధానం ఇవ్వలేదు. ఈ చర్యపై గత కొన్ని వారాలుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే నోబెల్ శాంతి బహుమతి బదిలీ చేయడం లేదా ఇతరులకు అందజేయడం సాధ్యం కాదని నోబెల్ అవార్డుల నిబంధనలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. నార్వేజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్ కూడా ఈ విషయాన్ని పునరుద్ఘాటించింది. -
వెనుజుల అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన ప్రకటన..!
-
ఆలస్యం కాకముందే మేల్కోండి
వాషింగ్టన్: వెనెజువెలా నుంచి చమురు కానీ, నిధులు కానీ కావాలంటే తమతో త్వరగా ఒప్పందం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యూబాకు తేల్చిచెప్పారు. వెనెజువెలా చమురుకు అతిపెద్ద వినియోగదారు క్యూబా. వెనెజువెలాలో నికోలస్ మదురో ప్రభుత్వాన్ని ట్రంప్ సైన్యం కూలదోసిన సంగతి తెలిసిందే. డెల్సీ రోడ్రిగ్స్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం కొలువుదీరింది. వెనెజువెలాలోని అపారమైన చమురు నిల్వలపై ఆధిపత్యం అమెరికా చేతుల్లోకి వచ్చింది. ఇకపై తమతో ఒప్పందం చేసుకుంటే తప్ప చమురు దక్కదని క్యూబాకు ట్రంప్ స్పష్టంచేశారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఆలస్యం కాకముందే మేల్కోవాలని, ఒప్పందానికి సిద్ధం కావాలని పేర్కొన్నారు. వెనెజువెలా నుంచి వస్తున్న చమురు, డబ్బుతోనే క్యూబా మనుగడ సాగిస్తోందని పేర్కొన్నారు. ఒకవేళ ఒప్పందం గనుక చేసుకోకపోతే అవన్నీ ఆగిపోతాయని క్యూబాను ట్రంప్ హెచ్చరించారు. అయితే, ట్రంప్ హెచ్చరికపై క్యూబా స్పందన ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. క్యూబా లొంగిపోయే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు క్యూబా ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. వెనెజువెలా నుంచి చమురు, నిధులు రాకపోతే పూర్తిగా కుప్పకూలడం తథ్యం. ఈ నేపథ్యంలో అమెరికాతో డీల్కు సిద్ధపడుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా ట్రంప్ విదేశాంగ మంత్రి రూబియో సామర్థ్యాన్ని కొనియాడుతూనే.. ఆయన భవిష్యత్తులో క్యూబాకు అధ్యక్షుడయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. రూబియో తల్లిదండ్రులు 1950వ దశకంలో క్యూబాలోని బాటిస్టా నియంతృత్వ పాలన నుంచి తప్పించుకుని అమెరికాకు వలస వచి్చన వారు కావడం గమనార్హం. కాగా, ట్రంప్ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక పక్క సరదాగా చేసిన వ్యాఖ్యలని కొందరు అంటుంటే, క్యూబా పట్ల ట్రంప్ ప్రభుత్వ కఠిన వైఖరికి ఇది సంకేతమని మరికొందరు విశ్లేíÙస్తున్నారు. -
అక్షరాలా ఊచకోతే!
వాషింగ్టన్: అమెరికా ఇటీవల వెనెజువెలా రాజధాని కారకస్పై మెరుపు దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికొలస్ మదురోను సతీసమేతంగా నిర్బంధించడం, న్యూయార్క్కు మెరుపువేగంతో తరలించిన ఘటనకు సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంత పెద్ద కిడ్నాప్, తరలింపు ఆపరేషన్ను అగ్రరాజ్యం కేవలం అరగంటలో ముగించిన తీరు చూసి ప్రపంచమంతా నోరెళ్లబెట్టింది. అయితే అమెరికా స్పెషల్ ఫోర్సెస్ ఆ సందర్భంగా మదురో అంగరక్షకులను, ఇతర సెక్యూరిటీ సిబ్బందిని అక్షరాలా ఊచకోతే కోశాయట! రంగంలోకి దిగింది కేవలం 20 మందే అయినా వందలాది మంది రక్షణ సిబ్బందిని పిట్టల్లా కాల్చి చంపారట. ఆ సమయంలో విధుల్లో ఉన్న మదురో సెక్యూరిటీ సిబ్బందిని ఉటంకిస్తూ అమెరికా అధికార భవనం వైట్హౌస్ ప్రెస్ మహిళా సెక్రెటరీ కరోలిన్ లెవిట్ శనివారం ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ‘మీరు ఏం చేస్తున్నా సరే, అర్జెంటుగా ఆపేసి ఇదోసారి చదవండి...’ అంటూ క్యాప్షన్ కూడా జోడించారు. అప్పుడేం జరిగిందో సదరు సెక్యూరిటీ గార్డు ఇంటర్వ్యూ తరహాలో చెప్పుకొచ్చారు. ‘‘అంతా హఠాత్తుగా మొదలైంది. ఉన్నట్టుండి మా రాడార్ వ్యవస్థలన్నీ మూగబోయాయి. ఏమైందా అని చూస్తుండగానే మా మీదుగా అసంఖ్యాకంగా డ్రోన్లు ఎగరసాగాయి. ఇదంతా రెప్పపాటులో జరిగిపోయింది. ఎలా స్పందించాలో తెలియక మేం తికమక పడుతుండగానే హెలికాప్టర్లు ప్రత్యక్షమయ్యాయి. వాటినుంచి దాదాపు 20 మంది సైనికులు దిగారు. మేం చాలామందిమి ఉన్నా వారి దగ్గరున్న అత్యాధునిక ఆయుధాల ముందు మా సంఖ్యా బలం ఎందుకూ కొరగాకుండా పోయింది. మా జీవితంలో అలాంటి వారితో అప్పటిదాకా ఎప్పుడూ పోరాడలేదు. నేలపై కాలు పెట్టిన క్షణం నుంచీ వారు అక్షరాలా ఊచకోతకు దిగారు. అత్యంత వేగంగా, అంతకుమించిన కచ్చితత్వంతో కాల్పులు సాగించారు. ఒక్కొక్కరూ నిమిషానికి కనీసం ఏకంగా 300 రౌండ్లకు పైగా కాల్చారు’’ అని చెప్పుకొచ్చాడు.జీవాయుధమా?దాడి సందర్భంగా అమెరికా సైనికులు తామె న్నడూ చూడని ఒక అత్యాధునిక ఆయుధాన్ని సైతం ఉపయోగించినట్లు మదురోకు రక్షణ విధుల్లో ఉన్న భద్రతాసిబ్బందిలో ఒకరు చెప్పడం విశేషం. ‘‘ ఆ అత్యాధునిక ఆయుధం నుంచి అత్యంత తీవ్రతతో కూడిన శబ్ద తరంగాలు వెలువడ్డాయి. వాటి తీవ్రతకు నా తల బద్దలవుతుందా అనిపించింది. మా ముక్కులోంచి రక్తం కారసాగింది. కొందరైతే రక్తం కక్కుకున్నారు. ఆ శబ్దం దెబ్బకు కదల్లేని పరిస్థితిలోకి జారుకున్నాం. వాళ్లలో కనీసం ఒక్కరంటే ఒక్కరిని కూడా కనీసం గాయపరచలేకపోయాం. మాలో వందల మందిని పొట్టన పెట్టుకున్నారు’’ అని వివరించారు. ‘‘అమెరికాతో పోరాడగలమని ఇప్పటికీ నమ్ముతున్న లాటిన్ అమెరికా దేశాలన్నింటికీ ఒకటే చెబుతున్నా. అమెరికా సైనిక సామర్థ్యం గురించి మీకసలు ఏమీ తెలియదు’’ అంటూ సదరు గార్డు హెచ్చరికలు కూడా చేయడం విశేషం. -
ఇరాన్ సుప్రీంని బంధిస్తే జరిగేది ఇదే?
డొనాల్డ్ ట్రంప్ పేరు ఇప్పుడు వరల్డ్వైడ్గా చర్చనీయాంశమయ్యింది. వెనిజువెలా అధ్యక్షున్ని వారి దేశంలోనే బంధించి అమెరికాకు లాక్కెళ్లి ట్రంప్ తన రౌడీయిజం ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించాడు. అయితే ఈ నేపథ్యంలో ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఇరానే అని బలంగా చర్చ నడుస్తోంది. అక్కడ జరుగుతున్న నిరసనలు ఈ వాదనకు కొంత మేర బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ ట్రంప్ ఇరాన్ సుప్రీంని బంధిస్తే జరిగే పరిణామాలు తెలుసుకోవానుందా? అయితే ఈ కథనం చదవండి.ప్రస్తుతం ఇరాన్లో పరిస్థితులు తీవ్ర ఆందోళనకరంగా మారాయి. అక్కడ ద్రవ్యోల్బణం, పేదరికం, అవినీతి కారణంగా విసిగిపోయిన ప్రజలు ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఖమేని పాలన అంతం అవ్వాలని నినాదాలు ఇస్తున్నారు. అక్కడి మహిళలు సైతం ఇస్లాం సంప్రదాయం ప్రకారం ధరించే హిజాబ్లను తొలగించి వాటిని తగలబెడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం నిరసనకారులపై జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు మృతిచెందారు. దీంతో ట్రంప్ రంగంలోకి దిగారు. నిరసనకారులపై దాడులు చేస్తే అమెరికా రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇరాన్పై దాడికి దిగి ఆదేశ సుప్రీం ఖమేనీని బంధిస్తారా? అనే ఊహాగానాలు మెుదలయ్యాయి.ఇరాన్ సైనిక శక్తివెనిజువెలాతో పోలిస్తే ఇరాన్ సైనిక పరంగా ఎంతో బలమైంది. దాదాపుగా ఆరు లక్షలకు పైగా ఆర్మీ ఆ దేశ సొంతం. అంతేకాకుండా 15 బిలియన్ల డాలర్లకు పైగా ఆర్మీ బడ్జెట్ కలిగి ఉంది. 10 వేలకు పైగా యుద్ధ ట్యాంకులు, మూడు వందలకు పైగా యుద్ధ విమానాలు, జలాంతర్గాములు పటిష్ఠమైన నేవీ విభాగం ఇరాన్ సొంతం. అన్నిటి కంటే ప్రధానంగా ఇరాన్ వద్ద అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ మిస్సైల్స్ దాదాపు 2000 కిలోమీటర్ల రేంజ్ కవర్ చేసేవి ఉన్నాయి. వీటితో ఇరాన్ బలమైన ప్రాంతీయ శక్తిగా అవతరించింది. అంతేకాకుండా అణుబాంబు తయారికి ఇరాన్ ప్రయత్నాలు జరుపుతుందని వాదనలు ఉన్నాయి.ఆర్మీ పరంగా ఇంత బలంగా ఉన్నప్పటికీ వరల్డ్ సూపర్ పవర్గా ఉన్న అమెరికాను ఎదిరించడం ఇరాన్కు కష్టమే.. అయితే వెనిజువెలా అధ్యక్షున్ని బంధించినంత తేలికగా ఖమేనీని అదుపులోకి తీసుకోలేరనేది కాదనలేని వాస్తవం. ఒకవేళ ఖమేనీని ట్రంప్ కిడ్నాప్ చేస్తే ఇరాన్ పూర్తి స్థాయి యుద్దానికి దిగే అవకాశం ఉంది. దీంతో ఇరు వైపులా భారీ నష్టంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి.ఇస్లాం దేశాల మద్ధతుఇరాన్కు ఇస్లాం దేశాల పూర్తి మద్దతు లభించడం కష్టం ఎందుకంటే ఇరాన్ ప్రజలు షియా మతాన్ని అవలంభిస్తారు. ప్రపంచంలో షియామతం పాటించే దేశాలు ఇరాన్, ఇరాక్, లెబనాన్, సిరియా, బహ్రెయిన్ యెమెన్ దేశాల సహాకారం లభించే అవకాశం ఉంది. అదే సున్నీ మతం పాటించే సౌదీ అరేబియా, టర్కీ, కువైట్, యెమన్ తదితర దేశాలు చాలా వరకూ ఇరాన్కు సపోర్టుగా నిలువవు. అయితే మిలటరీ పవర్స్ అయినా రష్యా, చైనా దేశాలతో ఇరాన్కు మంచి సంబంధాలున్నాయి. అయితే ఆ సపోర్ట్ అమెరికాకు ఎదురు నిలిచి నేరుగా యుద్ధంలో పాల్గొనేంతగా ఉంటుందా అంటే కాదనే సమాధానమే వస్తోంది.మూడో ప్రపంచ యుద్ధంఅయితే ప్రస్తుతం ట్రంప్ మామ మంచి జోరుమీదున్నారు. వెనిజువెలా అధ్యక్షున్ని బంధించిన తనను ఎవరూ ప్రశ్నించలేదు అని ఫీలవుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఇరాన్లో పరిస్తితులు ఏమాత్రం బాగాలేవు. దేశంలో తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. సుప్రీం లీడర్ ఖమేనీపై అక్కడి ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఖమేనీని బంధిస్తే పెద్ద వ్యతిరేకత ఎదురుకాకపోవచ్చు. అంతే కాకుండా మూడోప్రపంచ యుద్దం వచ్చే అవకాశాలు దాదాపు లేవనే చెప్పవచ్చు. అయితే ఈ కిడ్నాప్ వెనిజువెలా అధ్యక్షున్ని బంధించినంత తేలికగా మాత్రం ఉండదు అనేది కాదనలేని సత్యం. -
ట్రంప్ ఆశలు ఇక అడియాశలేనా?
గత ఏడాది(2025)లో నోబెల్ శాంతి బహుమతి పొందిన వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో ట్రంప్కు ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు బంధించిన నేపథ్యంలో, తన నోబెల్ పురస్కారాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు అంకితం ఇస్తున్నట్లు ఆమె ప్రకటించడం సంచలనం రేపింది.మచాడో నోబెల్ బహుమతిని ట్రంప్కు ఇచ్చేస్తారా అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ క్రమంలో నోబెల్ కమిటీ స్పందించింది. నోబెల్ బహుమతిని పంచుకోవడం, రద్దు చేయడం, బదిలీ చేయడం సాధ్యం కాదంటూ నార్వేజియన్ నోబెల్ కమిటీ తేల్చి చెప్పింది. ఒకసారి నోబెల్ ప్రకటించిన తర్వాత, ఆ నిర్ణయం శాశ్వతంగా ఉంటుందంటూ కమిటీ పేర్కొంది. కాగా, నోబెల్ శాంతి బహుమతిని అందుకునేందుకు తనకంటే అర్హుడు ఈ చరిత్రలో ఎవరూ లేరంటూ వ్యాఖ్యానించిన ట్రంప్.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. ఏమీ చేయకపోయినా ఆయనకు ఆ గౌరవం దక్కిందంటూ వ్యాఖ్యానించారు.వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో నోబెల్ గురించి శనివారం ట్రంప్ మరోసారి ప్రస్తావిస్తూ.. మాచాడో తన నోబెల్ బహుమతిని ఇవ్వాలనే ఆఫర్పై ఆమెతో చర్చిస్తానని తెలిపారు. వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలాస్ మదురో పట్టుబడి అమెరికాకు తరలించబడిన తర్వాత, అమెరికా–వెనిజులా ఉద్రిక్తతలు అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి. ఆమె రావాలని అనుకోవడం మంచిదేనంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. నా దృష్టి అంతా ప్రజల ప్రాణాలు కాపాడటం పైనే ఉందన్న ట్రంప్ యుద్ధాలను ఆపడం ద్వారా కోట్లాది మందిని రక్షించానంటూ మరోసారి గొప్పలు చెప్పుకున్నారు. -
ట్రంప్ కు బిగ్ షాక్ ఇకపై అనుమతి తీసుకోవాల్సిందే!
-
ఆపరేషన్ మదురో: అంత ఈజీగా ఎలా పట్టుకెళ్లారంటే..
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అంత ఈజీగా ఎలా బంధించిందబ్బా?.. వారం గడిచినా కూడా ఈ ప్రశ్న ప్రపంచాన్ని వేధిస్తూ ఉండొచ్చు. అయితే ఇందుకు అమెరికా సైన్యం ఉపయోగించిన ట్రిక్ ఏమిటో ఇప్పుడు బయటకు వచ్చింది!. ముందుగా సైబర్ ఎటాక్ చేసి.. ఆ తర్వాత భౌతిక దాడులకు దిగిందట. అయితే అదేం ఆషామాషీగా జరగలేదు. అందుకోసం తెర వెనుక పెద్ద తతంగమే నడిచింది. అదెంటో చూసేద్దాం మరి.. వెనెజువెలాకు ఉన్న రష్యా తయారీ ఎస్-300 గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణి విధ్వంసక వ్యస్థలను అమెరికా అసలు అంత తేలికగా ఎలా చేధించగలిగింది?. సైబర్ దాడితో అమెరికా నిర్వీర్యం చేసిందా? రాడార్లను స్పూఫింగ్ చేసి మరీ కారకాస్లోకి చొచ్చుకుపోయాయా?..ఈ ప్రశ్నలకు అమెరికా సైబర్ నిపుణులు అవుననే సమాధానమిస్తున్నారు. అమెరికా సైనిక చర్య మొదలు కావడానికి.. అరగంట ముందు సైబర్ ఎటాక్తో అసలు తతంగం నడిచినట్లు వివరిస్తున్నారు.నెలల తరబడి నిఘా!అమెరికా సేనలు నెలల తరబడి వెనెజువెలా అధ్యక్షుడు మదురో నివాసంపై నిఘా పెట్టాయి. ఏ సమయంలో అతను ఏ గదిలో ఉంటాడు? పడక గదికి చేరుకునే మార్గాలేమిటి? రాత్రిళ్లు ఎంతమంది అంగరక్షకులుంటారు? నిఘా ఏ విధంగా ఉంటుంది? పనివాళ్లు, వంటవాళ్ల వివరాలు.. ఇలా అన్ని అంశాలపై సమాచారాన్ని సేకరించించాయి. నిజానికి వెనెజువెలాపై అమెరికా ఈ నెల 3న దాడులు జరిపినా.. కొన్ని నెలల ముందే క్షేత్రస్థాయిలో 90శాతానికి పైగా ఆపరేషన్ పూర్తి చేసిందట. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఆ వివరాలు కూడా అందాయని తెలుస్తోంది. అందులో దాడి మొదలు పెడితే.. ఎంత సమయంలో టాస్క్ పూర్తవుతుందో వివరించారట. అన్నీ ఓకే అనుకున్నాక ట్రంప్ పచ్చజెండా ఊపగానే.. అమెరికా సేనలు రంగంలోకి దిగాయి.అమెరికా సైబర్ కమాండ్ ద్వారా..సైబర్ ప్రపంచంలో అమెరికా తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ.. డొమైన్ సుప్రమసీగా కొనసాగుతోందని తెలిసిందే. వెనెజువెలాపై ఆపరేషన్లో భాగంగా.. కారకస్లోని మదురో నివాసంపై దాడికి అరగంట ముందే.. అమెరికా సైబర్ కమాండ్ కంట్రోల్ కేంద్రం యాక్టివేట్ అయ్యింది. సైబర్ కమాండ్ సిబ్బంది తొలుత వెనెజువెలా రాజధాని కారకస్కు విద్యుత్తు సరఫరా చేసే వ్యవస్థ (SCADA – Supervisory Control and Data Acquisition)పై సైబర్ ఎటాక్ చేశారు. దాంతో.. ఆ నగరం అంధకారంలో మునిగిపోయింది. ఆలస్యం చేయకుండా.. ఆ వెంటనే రక్షణ వ్యవస్థను టార్గెట్ చేశారు. రాడార్ స్పూఫింగ్ జరగడంతో.. అమెరికా సేనలు 150 యుద్ధ విమానాల్లో వెనెజువెలా సరిహద్దుల్లోకి ప్రవేశించినా ఒక్కటంటే ఒక్క రాడార్ కూడా పసిగట్టలేకపోయింది. దాంతో.. రష్యా సరఫరా అయిన ఎస్-300 గగనతల రక్షణ వ్యవస్థలు నిర్వీర్యంగా మారిపోయాయి. ఈ ఆపరేషన్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ‘‘మా ప్రత్యేక నైపుణ్యం కారణంగా.. కారకస్లో విద్యుత్తు నిలిచిపోయేలా చేశాం’’ అంటూ పోస్ట్ చేయడం తెలిసిందే. అంతేకాదు.. ఈ దాడి తర్వాత వెనెజువెలా కూడా తమ జాతీయ పవర్గ్రిడ్ (గురి డ్యామ్ నెట్వర్క్)ను అమెరికా టార్గెట్గా చేసుకుందని ప్రకటించింది. విద్యుత్తు నిలిచిపోవడం వల్ల వెనెజువెలా సైన్యం కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా పనిచేయలేదని తెలుస్తోంది.సైబర్ ఎటాక్ ఎలా చేశారంటే.. అమెరికా సైబర్ కమాండ్ ఈ దాడిలో విజయం సాధించడం ఒక్కరోజుతో జరిగిన పని కాదు. వెనెజువెలా పవర్గ్రిడ్ కార్పొరేషన్పై నిఘా ఏళ్ల తరబడిగా కొనసాగుతోందని ఇప్పుడు వెల్లడైంది. తొలుత.. కంప్యూటర్లు, విద్యుత్తు సరఫరా వ్యవస్థల్లో మాల్వేర్ను చొప్పించారు. ఈ మాల్వేర్ ద్వారా అమెరికా సైబర్ కమాండ్ విద్యుత్తు వ్యవస్థ కంట్రోలర్లలోకి చొరబడి.. ‘పింగ్’ చేశారు. అంతే.. యావత్ విద్యుత్తు వ్యవస్థ ఢమాల్ అయిపోయింది. మొత్తం కారకస్ నగరానికి విద్యుత్తు నిలిచిపోయింది. అయితే.. ఈ ఆపరేషన్కు అమెరికా తన సొంత మాల్వేర్ ‘నైట్రోజ్యూస్’, రష్యా తయారీ అయిన ‘ఇండస్ట్రియర్’ ఈ రెండు మాల్వేర్లను ఒకదాన్ని వాడినట్లు తెలుస్తోంది.అత్యంత చాకచక్యంగా..నిజానికి అమెరికా సేనలు పెద్ద ప్రమాదాలను దాటుకుంటూనే వెనెజువెలా గగనతలంలోకి ప్రవేశించాయి. ఎస్-300 గగనతల వ్యవస్థలు విద్యుత్తు నిలిచిపోగానే ఆగిపోయినట్లు సమాచారం. నిజానికి ఈ వ్యవస్థలు ఉన్న ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా ఉంటుంది. ఒకవేళ విద్యుత్తు సరఫరా జరగకపోతే.. డీజిల్ జనరేటర్లతో బ్యాకప్ చేస్తారు. అయితే..ఇందుకు ఐదు నిమిషాల దాకా సమయం పడుతుంది. అంటే.. ఈ ఐదు నిమిషాల వ్యవధిలోనే అమెరికా యుద్ధ విమానాలు సరిహద్దులను దాటి.. కారకస్కు రావాల్సి ఉంటుంది. సైబర్ కమాండ్ అధికారులు తమ పనిని పూర్తిచేయగానే.. అమెరికా విమానాలు వెనువెంటనే రంగంలోకి దిగాయి. అత్యంత చాకచక్యంగా జరిగిన ఈ రాడార్ల విషయంలో జరిగిన ఆపరేషన్ విషయాల్ని అమెరికా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డాన్ కెయిన్ కూడా ధృవీకరించడం గమనార్హం..!కలిసొచ్చిన సూటర్సాధారణంగా క్షిపణి వ్యవస్థలు సాఫ్ట్వేర్తో పనిచేస్తాయి. ఇక్కడే అమెరికా సూటర్ అనే టెక్నాలజీని వాడింది. ఒక్కసారి రాడార్ వ్యవస్థలకు విద్యుత్తు నిలిచిపోగానే.. అమెరికా సైబర్ కమాండ్ సూటర్ టెక్నాలజీ ద్వారా రాడార్ స్పూఫింగ్కు పాల్పడింది. అంటే.. రాడార్ సిగ్నళ్లను జామ్ చేసింది. ఫలితంగా సూటర్ రాడార్ నెట్వర్క్ యాక్టివేట్ అయ్యింది. దాంతో.. డీజిల్ జనరేటర్ల ద్వారా ఎస్-300 రక్షణ వ్యవస్థలను తిరిగి యాక్టివేట్ చేసినా.. అవి స్పూఫింగ్ ప్రభావంతో స్తబ్ధుగా ఉండిపోయాయి.భారత్ ఎంత వరకు సురక్షితం?వెనెజువెలా ఉదంతం తర్వాత.. ప్రపంచదేశాలు సందిగ్ధంలో పడ్డాయి. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో.. రష్యా అధినేత పుతిన్ను ఇలాగే కిడ్నాప్ చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు విన్నపాలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ అధినేత బెంజమిన్ నెతన్యాహును నిర్బంధించాలంటూ అమెరికా మిత్రదేశం పాకిస్థాన్ బహిరంగంగా కోరింది. అలాగే రష్యాతో చమురు వాణిజ్యం.. టారిఫ్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ విషయంలోనూ ట్రంప్ అసంతృప్తిగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ఒకవేళ ఇలాంటి దాడులే ఒకవేళ భారత్పై జరిగితే ఎలా ఉంటుంది?.. ఐదేళ్ల క్రితం చైనా మాల్వేర్ కారణంగా మహారాష్ట్రలో గ్రిడ్ వైఫల్యం చెందిన విషయం తెలిసిందే..!. మనదేశంలో విద్యుత్తు వ్యవస్థలో చైనాకు చెందిన పరికరాలు, హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ను వాడుతున్న దాఖలాలున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా వాడినటువంటి మాల్వేర్ను జిత్తుల మారి చైనా కూడా జొప్పించి ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి 2021లో మనదేశంలో పవర్ గ్రిడ్లలో మాల్వేర్పై మోదీ సర్కారు ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. లోపాలను ఇప్పటికే సరిచేసి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆపరేషన్ సిందూర్ సమయంలోనే.. మన గగనతల రక్షణ వ్యవస్థలు ఎంతో ముందంజలో ఉన్నట్లు తేలింది. అంతెందుకు.. అమెరికాకు చెందిన ఎఫ్-35 ఫైటర్ జెట్ కోచి తీరంలో తచ్చాడితే.. మన వైమానికదళం వెంటనే గుర్తించి హెచ్చరికలు పంపింది. అత్యంత అధునాతన స్టెల్త్ విమానంగా అమెరికా తన ఎఫ్-35కు పట్టం కట్టింది. అలాంటి విమానాన్ని కూడా భారత్ గుర్తించడంతో.. సాంకేతికలోపాల పేరుతో తిరువనంతపురంలో నెలరోజులపాటు ఆ విమానాన్ని ల్యాండ్ చేసిన విషయం తెలిసిందే..! ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ అటు అఫెన్స్ లోనూ.. ఇటు డిఫెన్స్ లోనూ 99% కచ్చితత్వాన్ని కలిగి ఉందని, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్కు కూడా ఇంతటి రికార్డు లేదని తేలింది. సైబర్ అలర్ట్ లో మన సెర్ట్ ఎంతో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో వెనెజువెలా తరహా దాడుల విషయంలో భారత్ అత్యంత సురక్షితంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.:: హెచ్.కమలాపతిరావు -
USA: మరో షిప్ సీజ్!
వాషింగ్టన్: వెనెజువెలాకు రాకపోకలు సాగిస్తున్న చమురు నౌకలను అదుపులోకి తీసుకునే ధోరణిని అమెరికా కొనసాగిస్తూనే ఉంది. ఆ దేశానికి చెందినదిగా భావిస్తున్న ఒలీనా అనే మరో నౌకను దిగ్బంధించినట్టు అమెరికా సైన్యం శుక్రవారం వెల్లడించింది. కరీబియన్ సముద్ర జలాల్లో శుక్రవారం తెల్లవారుజామున యూఎస్ మెరీన్స్, నేవీ సంయుక్తంగా ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్టు తెలిపింది. దీన్ని హోంలాండ్ సెక్యూరిటీ విభాగం పర్యవేక్షించినట్టు వెల్లడించింది. అమెరికా సైనిక హెలికాప్టర్ ఆ నౌకపై దిగుతున్న, సైనిక సిబ్బంది డెక్పై సోదాలు సాగిస్తున్న ఫుటేజీని యూఎస్ సదరన్ కమాండ్ విడుదల చేసింది. వెనెజువెలాకు చెందినవంటూ అమెరికా అదుపులోకి తీసుకున్న ఐదో నౌక ఇది. గత మూడు రోజుల్లో మూడో నౌక. అయితే ఇది నిజంగా ఆ దేశానిదేనా అన్న ప్రశ్నలకు సైనిక అధికార ప్రతినిధి నేరుగా బదులివ్వలేదు. -
అమెరికా దాడిలో 100 మంది మృతి
కరాకస్: గత శనివారం శత్రు దుర్భేద్యమైన సైనిక స్థావరంపై విచక్షణారహితంగా బాంబులేసి అధ్యక్షభవనంలో చొరబడి అధ్యక్షుడు నికొలస్ మదురో దంపతులను ఎత్తుకెళ్లిన అమెరికా బలగాలు జరిపిన దాడిలో ఏకంగా 100 మంది ప్రాణాలు కోల్పోయారని వెనెజువెలా అంతర్గత మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. కొత్త అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ సారథ్యంలోని వెనెజువెలా ప్రభుత్వం ఈ మరణాల సంఖ్యను అధికారికంగా వెల్లడించడం ఇదే తొలిసారి. తమ అధ్యక్షుడిని అమెరికా సైన్యం చేతికి చిక్కకుండా రక్షించుకునే క్రమంలో మదురో అంగరక్షకుల్లో చాలా మంది వీరమరణం పొందారని వెనెజువెలా అధికారులు ప్రకటించారు. ‘‘ అమెరికా మెరుపుదాడి వేళ మా సైన్యం, అమెరికా సైనికుల మధ్య జరిగిన కాల్పులు, ఘర్షణాత్మక వాతావరణంలో మదురో కాలికి గాయమైంది. మదురో భార్య సిలియా ఫ్లోరెస్ తలకు బలమైన గాయమైంది’’ అని అంతర్గత మంత్రి డియాస్డాడో క్యాబెల్లో చెప్పారు. వెనెజువెలా ఆర్మీ ఇప్పటికే 23 మంది మృతుల పేర్లను తమ వెబ్సైట్లో ప్రచురించడం తెల్సిందే. వెనెజువెలా సైనిక, పౌర అవసరాలు తీర్చేందుకు ఆ దేశానికి పంపించిన తమ సైనికులు 32 మంది చనిపోయారని క్యూబా ఇప్పటికే ప్రకటించింది. మరణించిన తమ సైనికుల అంత్యక్రియలను వెనెజువెలా సైన్యం బుధవారం కరాకస్ నగరంలో అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. నేషనల్ గార్డ్ సభ్యులు, మృతుల కుటుంబసభ్యులు, బంధువులు, వందలాది మంది స్థానికులు దారిపొడవునా మృతులకు ఘననివాళులర్పించారు. మృతులను స్మరిస్తూ అధ్యక్షురాలు డెల్సీ ఏడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించారు. ‘‘ వెనెజువెలా ఏనాటికీ శత్రుదేశం ఎదుట తలవంచదు. ఘన చరిత్ర, వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఈ దేశమూ ఆ పనిచేయదు’’ అని మంత్రి క్యాబెల్లో వ్యాఖ్యానించారు. -
వెనెజువెలా చమురు.. అంత వీజీ కాదు ట్రంపూ!
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సెలియా ఫ్లోరెస్ను అరెస్ట్ చేసి ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది అమెరికా. ఆపై ఆ దేశపు చమురు నిల్వలు పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంటాయని.. అదీ నిరవధికంగానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. ఈ పరిణామంపై వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. అయితే..ఈ భూమ్మీద అత్యధిక చమురు నిల్వలు(సుమారు 300 బిలియన్ బ్యారెల్స్) వెనెజువెలాలోనే ఉన్నాయి. అందునా ఎక్కువగా ఒరినోకో బెల్ట్ ప్రాంతంలో లభిస్తున్నాయి. కానీ, వెనెజువెలాలో లభించే చమురు హెవీ సోర్ క్రూడ్.. అంటే మందంగా, మరీ చిక్కగా ఉంటుంది. డర్టీ ఆయిల్గా ఇక్కడి చమురు నిక్షేపాలకు ఓ పేరుంది. పైగా ప్రతి బ్యారెల్కి ప్రపంచ సగటు కంటే రెండింతలు ఎక్కువ కాలుష్యం కలిగిస్తోంది. అలాగే..ఇంతకాలం వెనెజువెలా చమురును ఆవిరితో కరిగించి.. లైట్ క్రూడ్ ఆయిల్తో కలిపి అమెరికా, చైనా, ఇండియా వంటి దేశాల రిఫైనరీలకు పంపించి వాడుకున్నారు. కానీ ఇది ఖరీదైనది.. కాలుష్యం ఎక్కువగా కలిగించే ప్రక్రియ కూడా.కాబట్టి ఎలా చూసుకున్నా ఈ చమురును శుధ్ది చేసి పెట్రోల్, డీజిల్గా మార్చడం అత్యంత కష్టంతో కూడుకున్న పని. దీనికి ఎక్కువ ఎనర్జీ అవసరం పడుతుంది. కాబట్టి అడ్డగోలుగా ఖర్చు చేయాల్సి వస్తుంది. వీటన్నింటికి తోడు.. వెనెజువెలాలో ప్రస్తుతం చమురు శుద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాతది. పైగా మీథేన్ లీకేజీలు, అగ్నిప్రమాదాలకు ఆస్కారం ఉంది. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు విడుదలయ్యే.. మీథేన్ వాయువు కార్బన్ డయాక్సైడ్ కంటే 80 రెట్లు ప్రమాదకరం కూడా. అయితే.. తమ దగ్గర ఉన్న ఆధునిక సాంకేతికతతో ఉద్గారాలను తగ్గించగలమని అమెరికా అంటోంది. అయినప్పటికీ కూడా అమెరికా చమురు ఉత్పత్తి చేస్తే కూడా పర్యావరణంపై భారీ ప్రభావం తప్పదని నిపుణులు అంటున్నారు. వెనెజువెలా చమురు మొత్తాన్ని తీయడం అమెరికాకు ఆర్థిక భారమే కాదు.. ప్రపంచ వాతావరణ ప్రతికూల మార్పు మరింత వేగవంతం అవుతుందని హెచ్చరిస్తున్నారు. -
పెట్రోల్ కంటే.. పాలు, నీళ్ల ధరలే ఎక్కువ!.. ఎక్కడంటే?
ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశంగా వెలుగొందిన వెనెజువెలా.. నికోలస్ మదురో అరెస్టు తర్వాత తీవ్ర సంక్షోభంతో సతమతమవుతోంది. దీంతో నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందనంత స్థాయికి చేరిపోయాయి. పెట్రోల్ ధరల కంటే.. వాటర్ బాటిల్, పాలు ధరలు ఎక్కువైపోయాయి.ధరలు ఇలా..ఒక లీటరు పెట్రల్: రూ. 45.10ఒక లీటరు పాలు: రూ. 160.60ఒక లీటరు వాటర్ బాటిల్: రూ. 223.70ఒక లీటరు వంట నూనె: రూ. 315 నుంచి రూ. 405అమెరికా ఆంక్షలు, సరఫరా గొలుసులను తీవ్రంగా దెబ్బతినడంతో ఆర్ధిక సంక్షోభం ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానే తాగు నీరు కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందని అంటున్నారు. ఇక్కడ కరెన్సీకి విలువ తగ్గిపోవడం వల్ల.. లావాదేవీలు కూడా కష్టతరం అయిపోయింది.వెనెజువెలా ఆర్ధిక పతనానికి కారణాలు➤వ్యవసాయం, తయారీ రంగాలను విస్మరించి.. ఎక్కువగా చమురుపైనే ఆధారపడటం.➤నైపుణ్యం లేనివారికి పదవులు కట్టబెట్టడం వల్ల, నిర్వహణ లోపాలు తలెత్తాయి.➤ఆదాయం లేకపోవడంతో.. ప్రభుత్వం విచ్చలవిడిగా కరెన్సీ ముద్రించింది. దీనివల్ల దేశ కరెన్సీ ఎక్కువైంది. విలువ పెరిగిపోయింది.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే బంపరాఫర్.. ప్రయాణికులకు శుభవార్త! -
వెనెజువెలా చమురు మాదే
కారకాస్: వెనెజువెలాలోని అపారమైన చము రు నిల్వలను దోచుకోవడానికే ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో దంపతులను అక్రమంగా నిర్బంధించారంటూ ప్రపంచమంతటా ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వెనెజువెలా చమురు తమదేనని తేల్చిచెప్పారు. అయితే, మార్కెట్ ధరకే కొనుగోలు చేయబోతున్నామని వెల్లడించారు. 30 మిలియన్ల నుంచి 50 మిలియన్ల బ్యారెళ్ల అత్యధిక నాణ్యత కలిగిన చమురును వెనెజువెలా మధ్యంతర ప్రభుత్వం నుంచి స్వీకరిస్తామని తెలిపారు. ఈ మేరకు ట్రంప్ మంగళవారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఎలాంటి ఖర్చు లేకుండా బలప్రయోగంతో చమురును సొంతం చేసుకోవడానికి ట్రంప్ కుట్రలు సాగిస్తున్నారంటూ వస్తున్న విమర్శలను పరోక్షంగా ఖండించారు. ‘‘స్టోరేజీ నౌకల్లో చమురును వెనెజువెలా నుంచి నేరుగా అమెరికాలోని అన్లోడింగ్ కేంద్రాలకు తరలిస్తాం. అమెరికా అధ్యక్షుడిగా నా నియంత్రణలో ఉన్న డబ్బును వెనెజువెలా, అమెరికా ప్రజలకు కచి్చతంగా మేలు జరిగేలా ఖర్చు చేస్తాం’’ అని ట్రంప్ తేల్చిచెప్పారు. గొప్ప పని చేశావంటూ క్రెడిట్ ఇస్తారు వెనెజువెలాపై దాడి చట్టవిరుద్ధం, అన్యాయం అంటూ ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను ట్రంప్ తిప్పికొట్టారు. డ్రగ్స్ టెర్రరిజం కేసులో నికోలస్ మదురోను అరెస్టు చేయాలని మాజీ అధ్యక్షుడు బైడెన్ ఆదేశించినట్లు గుర్తుచేశారు. తాను చేసింది తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. వాషింగ్టన్లో ఓ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. వెనెజువెలాపై విజయవంతంగా సైనిక ఆపరేషన్ నిర్వహించినందుకు తనను ప్రశంసించాల్సిందిపోయి తప్పుపట్టడం సరైంది కాదని అన్నారు. మదురోను చట్టబద్ధమైన అధ్యక్షుడిగా అమెరికా ప్రభుత్వం ఏనాడూ గుర్తించలేదని వెల్లడించారు. ప్రతిపక్ష నాయకులు ఏదో ఒకరు తనను పొగిడేస్తారని, గొప్ప పని చేశావంటూ క్రెడిట్ ఇస్తారని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ హెచ్చరికలను వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు రోడ్రిగ్స్ కొట్టిపారేశారు. తన విధిని నిర్ణయించేది భగవంతుడే తప్ప మరొకరు కాదని స్పష్టంచేశారు. తనను బెదిరించేవారు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని ఆమె అన్నారు. బ్యారెల్కు 56 డాలర్లు? వెనెజువెలా చమురును అమెరికా సర్కార్ బ్యారెల్ 56 డాలర్ల ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ చెప్పినట్లుగా రోజుకు సగటున 20 మిలియన్ల బ్యారెల్స్ కొనుగోలు చేయొచ్చు. 2.8 బిలియన్ డాలర్ల విలువైన చమురు, చమురు సంబంధిత ఉత్పత్తులను అమెరికా దిగుమతి చేసుకోనుంది. అంతా అనుకున్నట్లు జరిగితే రోజువారీ అవసరాల కంటే ఎక్కువ చమురే వెనెజువెలా నుంచి దిగుమతి కానున్నట్లు యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మిని్రస్టేషన్ తెలియజేసింది. రేపు వైట్హౌస్లో కీలక భేటీ! వెనెజువెలా చమురును అమెరికాకు తరలించే ప్రక్రియ ఊపందుకుంటోంది. వెనెజువెలా చమురు కంపెనీల ప్రతినిధులతో శుక్రవారం వైట్హౌస్ ఓవల్ ఆఫీసులో కీలక సమావేశం జరగనున్నట్లు సమాచారం. స్వయంగా అమెరికా ప్రభుత్వమే ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా చమురు దిగ్గజ సంస్థలు ఎక్సాన్, చెవ్రాన్, కొనాకోఫిలిప్స్ ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. వెనెజువెలా, అమెరికా మధ్య చమురు వాణిజ్యంపై ఈ సమావేశంలో చర్చిస్తారని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. అయితే తమ రాజధాని కారకాస్పై ఈ నెల 3న అమెరికా నిర్వహించిన దాడిలో కనీసం 24 మంది భద్రతా సిబ్బంది మరణించారని వెనెజువెలా అధికారులు వెల్లడించారు. అలాగే 32 మంది క్యూబా సైనికులు, పోలీసు అధికారులు మృతిచెందినట్లు తెలియజేశారు. -
దాపరికం లేని సామ్రాజ్యవాదం
ఇందులో కొత్తగా అర్థం చేసుకోవలసిన విషయాలేమీ లేవు. వెనిజులాపై సైనిక దాడి, అధ్యక్షుడు నికోలస్ మదురో అపహరణలో ఉన్నది తమ సామ్రాజ్యవాద ప్రయోజనాలేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తానే వివరించి చెప్పారు. అదీగాక, లాటిన్ అమెరికాతో కూడిన పశ్చిమార్ధ భూగోళం 1823 నాటి ‘మన్రో డాక్ట్రిన్’ నిర్దేశించినట్లు ఎప్పటికీ తమదిగానే ఉంటుందనీ, అందుకు అదనంగా ఇపుడు ‘ట్రంప్ డాక్ట్రిన్’ ప్రకారం అందుకోసం సైనిక బలాన్ని వినియోగించగలమనీ బాహాటంగా ప్రకటించారు. వెనిజులా ఆపరేషన్ తర్వాత ‘అందుకు విరుద్ధంగా మాట్లాడే ధైర్యం ఇక ఎవరికీ ఉండద’ని హెచ్చరించారు. నిజానికి ఈ ఆపరేషన్కు ముందు నవంబర్లో విడుదల చేసిన ‘జాతీయ భద్రతా వ్యూహ పత్రం’లో ఉన్నది కూడా ఇదే!ఏ చట్టాలూ పాటించరా?వెనిజులాలో అమెరికాది అతి నగ్నమైన సామ్రాజ్యవాద చర్యను ఇంత సూటిగా, అన్ని కోణాల నుంచి ట్రంప్ వివరించినట్లు ఆయన విమర్శకులు కూడా చెప్పలేరేమో! అమెరికా అధ్యక్షునిది అన్ని విషయాలలోనూ దాపరికం లేనితనమే. అందుకు ఆయనను అభినందించవచ్చు కూడా! ఒక్క విషయంలో మాత్రం మదురోపై అసత్య ప్రచారాలు చేశారు. ఆయన మాదక ద్రవ్యాలు ఉత్పత్తి చేసి, అందుకోసం స్వయంగా ఒక కంపెనీని నడుపుతూ, అమెరికాకు పెద్ద ఎత్తున రవాణా చేస్తున్నారని! ఇవి తప్పుడు ఆరోపణలని అమెరికన్ మీడియాయే పలుమార్లు రాసినందున ఆ విషయమై చర్చించటం వృథా. పైగా, డ్రగ్స్ రవాణా కేసులలో శిక్షలు సైతం పడిన హోండురాస్ మాజీ అధ్యక్షుడు జువాన్ ఓర్లాండో తదితరులకు క్షమాభిక్ష ప్రకటించి జైలు నుంచి విడుదల చేసిన ట్రంప్, మాదక ద్రవ్యాల కారణంగా మదురోపై చర్య తీసుకుంటున్నట్లు వాదించటం హాస్యాస్పదమని అమెరికన్ మీడియా కొట్టివేస్తున్నది. మాదకద్రవ్యాల రవాణా జరుగుతున్నదంటూ ఇటీవలి వారాలలో సుమారు 30 వెనిజులా పడవలపై బాంబింగ్ చేసి, 100 మందికి పైగా ప్రాణాలు తీసినదంతా ఎటువంటి ఆధారాలు చూపకుండా, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా జరిగిన విషయాన్ని అదే మీడియా గుర్తు చేస్తున్నది. అమెరికా ప్రజాప్రతినిధులు, నిపుణులు పలువురు కూడా అదే విమర్శలు చేస్తున్నారు. వారిలో ట్రంప్కు చెందిన రిపబ్లికన్లు సైతం ఉన్నారు. చర్చలకు సిద్ధమని మదురో ప్రకటించిన కొద్ది రోజులకే ఈ చర్య జరగటం గమనించదగ్గది.ఈ విధమైన దాడి చేయవలసిన అగత్యం ఇపు డేమి ఏర్పడింది? చమురు నిల్వల స్వాధీనం మాత్ర మేనా, మరేమైనా ఉందా? మదురోను పదవీచ్యుతు డిని చేయటంతో వెనిజులా తమ అధీనంలోకి వచ్చి నట్లేనా? మదురో స్థానంలోకి వచ్చిన ఉపాధ్యక్షు రాలు డెల్సీ రోడ్రిగ్జ్ తాము కోరుకున్నట్లు పాలించ గలరన్న సూచన జరిగేదేనా? అంతిమంగా అధికారం ‘భద్రంగా, సవ్యంగా, న్యాయబద్ధంగా’ మరొకరికి బదిలీ కావటం అంటే ఏమిటి? అంతవరకు వెని జులాను ‘తామే పాలించగల’మన్న ట్రంప్ ప్రకటన ఆచరణ సాధ్యమేనా? ఈ చర్యకుగానీ, ఆయన చేసిన ప్రకటనలకు గానీ అర్థం, అమెరికా తమ సామ్రాజ్య వాద ప్రయోజనాల కోసం తన చట్టాలకు గానీ,అంతర్జాతీయ చట్టాలకు గానీ ఎంతమాత్రం కట్టుబడి ఉండబోదని స్పష్టంగా ప్రకటించటమేనా?మేమే బాస్!దాడికి కారణం చమురు నిల్వలన్నది విస్తారంగా వినవస్తున్న మాట. కానీ అది ఒక కోణం. ‘మన్రో డాక్ట్రిన్’ ప్రకారం తమ ఇలాకాగా పరిగణించే లాటిన్ అమెరికాలో తమను ధిక్కరించే ప్రభుత్వాలు గానీ, వామపక్ష ప్రభుత్వాలు గానీ ఏర్పడితే కూలదోయటం గత 70 ఏళ్లలో కనీసం 15 సార్లు జరిగింది. వెనిజులా ప్రభుత్వం కూల్చివేతకు హ్యూగో ఛావేజ్ కాలం నుంచి 20 ఏళ్లకు పైగా ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఇది నేపథ్యం కాగా, వెనిజులా సహా పలు లాటిన్ అమెరికన్ దేశాలలో కొంత కాలంగా రష్యా, చైనాల ప్రాబల్యం క్రమంగా పెరుగుతుండటం ట్రంప్కు అన్నింటికీ మించిన ఆందో ళనగా మారింది. ప్రస్తుత దాడి సందర్భంగా ఆయన మన్రో డాక్ట్రిన్, ట్రంప్ డాక్ట్రిన్ ప్రస్తావనలు, పశ్చిమార్ధ గోళం వైపు ఇక ఎవరూ కన్నెత్తి చూసే సాహసం చేయలేరన్న హెచ్చరికలు, తమ సైనిక బలం గురించిన మాటలు, ఇవన్నీ అటువంటి ఆందోళన నుంచి వచ్చినవే. చమురు ఆ తర్వాతి సంగతి. అమెరికా ప్రాబల్యం ఇతరత్రా కూడా ప్రపంచవ్యాప్తంగా కొంతకాలంగా బలహీనపడుతున్నందున, పశ్చిమార్ధ గోళంలో, దానితో పాటు పశ్చిమాసియాలో తమ బలాన్ని ఏ విధంగానైనా నిలుపుకొని తీరాలన్నది ట్రంప్ పట్టుదల. వెనిజులాపై దాడి, అదే పని చేయగలమంటూ ఇరాన్కు హెచ్చరికలు, ఇజ్రాయెల్ ద్వారా పాలస్తీనా ఆక్రమణ వంటి చర్యల ద్వారా ఆ లక్ష్యం దీర్ఘకాలంలో ఎంతవరకు నెరవేరగలదన్నది వేచి చూడాల్సిన విషయం.పోతే, వెనిజులాలో ఉపాధ్యక్షురాలి నాయకత్వాన కొనసాగుతున్న ప్రభుత్వం, సైన్యం కూడా ట్రంప్ దాడిని ఖండిస్తూ, ‘తమ దేశం ఎప్పటికీ అమెరికన్ వలస కాబోద’ని స్పష్టం చేశాయి. అటువంటి స్థితిలో అధి కారం ‘భద్రంగా న్యాయబద్ధంగా’ బదిలీ కావటం ఏ విధంగా ఆచరణ సాధ్యం? బలమైన సోషలిస్టు శక్తులు, ఆ ప్రాంతమంతటా గెరిల్లా గ్రూపులు, అదే మూడ్లో ఉన్న వెనిజులా సైన్యం దృష్ట్యా పరిణామాలు ఏవిధంగా ఉండవచ్చు? కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఆర్థిక, రాజకీయ, సైనిక జోక్యాలు, ఎన్నికైన ప్రభుత్వాలను ‘నియంతృత్వ’మనే ప్రచారాలతో పడగొట్టడాలతో లాటిన్ అమెరికా అంతటా ప్రజాభిప్రాయం చాలావరకు అమెరికాకు వ్యతిరేకంగా ఉంది. అమెరికాపై విమర్శలు యూరప్ సహా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ప్రపంచం దృష్టి నుంచి అంతిమంగా తేలే ప్రశ్న: రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఉదారవాద వ్యవస్థలు, అంతర్జాతీయ వ్యవస్థలు, అంతర్జాతీయ నియమ నిబంధనల మేరకు పరస్పర సంబంధాలు, దేశాల స్వాతంత్య్రం, సార్వభౌమాధికారం వంటివి బలహీనపడుతున్నా ఇంకా నిలిచి ఉంటాయా, లేక అమెరికా సామ్రాజ్యవాదానికి మరింత బలవుతాయా అన్నది. బలి చేయటమేనన్నది నిర్ణయమైతే ట్రంప్ గురి క్రమంగా బహుళ ధ్రువ ప్రపంచం, బ్రిక్స్, ఎస్సీఓ, డీ–డాలరైజేషన్ ప్రయత్నాల వైపు మళ్లుతుంది. టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
వెనెజువెలా సంక్షోభం.. రంగంలోకి రష్యా
అదొక పాతబడిన.. తుప్పుబట్టిన ఖాళీ డొక్కు ఆయిల్ ట్యాంకర్. అట్లాంటిక్లో అమెరికా కోస్ట్గార్డ్ దానిని వెంబడించింది. విషయం తెలిసి రష్యా అప్రమత్తమైంది. దాని రక్షణ కోసం ఓ సబ్ మెరీన్ను, ఇతర నావికాదళ నౌకలు పంపింది. అయినా కూడా అమెరికా కనుసన్నల నుంచి అది తప్పించుకోలేకపోయింది. ఫలితంగా.. సీజ్ అయ్యింది. ప్రస్తుతం సంక్షోభం ఎదుర్కొంటున్న వెనెజువెలా తీరంలో జరిగిన ఈ నాటకీయ పరిణామాలు ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి.బెల్లా-1 ఒక పెద్ద క్రూడ్ ఆయిల్ ట్యాంకర్. తొలినాళ్లలో వెనిజువెలా, ఆ తర్వాత ఇరాన్.. ప్రస్తుతం రష్యా ఆధీనంలో చమురు రవాణా కోసం ఉపయోగిస్తున్నారు. అయితే.. గత రెండు వారాలుగా ఇది వెనెజువెలా తీరంలో దీని డాక్కు అనుమతి లభించడం లేదు. ఇందుకు అమెరికా ఆంక్షలే ప్రధాన కారణం. ఆంక్షల కింద ఉన్న ఆయిల్ ట్యాంకర్లను వెనెజువెలా తీరంలో అమెరికా కోస్ట్గార్డ్ అడ్డుకుంటోంది. ఆ లిస్ట్లో బెల్లా కూడా ఉండడమే ఇందుకు ప్రధాన కారణమైంది. డిసెంబర్ 21వ తేదీన కరేబియన్ తీరంలో రష్యా జెండాతో కనిపించిన బెల్లా.. అమెరికా ఛేజ్తో దిశ మార్చుకుని గ్రీన్లాండ్ లేదంటే ఐస్ల్యాండ్ తీరానికి చేరొచ్చని భావించారు. అయితే అనూహ్యంగా అమెరికా కోస్ట్గార్డ్ దానిని సీజ్ చేసినట్లు తెలుస్తోంది. బెల్లా ఎందుకు ప్రత్యేకం.. బెల్లా 1 అనేది 2002లో నిర్మించబడిన ఒక పెద్ద క్రూడ్ ఆయిల్ టాంకర్. ఇది గతంలో వెనిజులా, ఇరాన్తో పాటు మరికొన్ని దేశాల ఆయిల్ రవాణాలో ఉపయోగించబడింది. ప్రస్తుతం ఇది రష్యా జెండా కింద నడుస్తోంది. అయితే తమ ఆంక్షలకు వ్యతిరేకంగా ఇది "షాడో ఫ్లీట్"లో భాగమైందని అమెరికా ఆరోపిస్తోంది. 2024 నుంచి దీనిని నిషేధిత జాబితాలో చేర్చింది. అందుకే అమెరికా ప్రతిస్పందనకు భయపడి వెనిజులా పోర్ట్లు కూడా డాక్ అనుమతిని ఇవ్వలేదు.Wall Street Journal నివేదిక ప్రకారం.. రష్యా నడిపే బ్లాక్ మార్కెట్ ఆయిల్ వాణిజ్యాన్ని అడ్డుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. అయితే మిడిల్ ఈస్ట్ రీజియన్లోని సంపన్న దేశాలు మాత్రం రష్యా ఆయిల్ వాణిజ్యానికి మద్దతు ఇస్తూ.. పాశ్చాత్య దేశాల ఆంక్షలకు సవాలు విసురుతున్నాయి. షాడో ప్లీట్ అంటే..షాడో ఫ్లీట్” (Shadow Fleet) అనేది రష్యా, ఇరాన్, వెనెజువెలా వంటి ఆంక్షలున్న ఎదుర్కొంటున్న దేశాలు ఆయిల్ను రహస్యంగా రవాణా చేయడానికి ఉపయోగించే ట్యాంకర్ల నెట్వర్క్. ఇందుకోసం పాత నౌకలను వినియోగించడం.. నకిలీ రిజిస్ట్రేషన్లు, జీపీఎస్ ట్రాకింగ్ను ఆఫ్ చేయడం లాంటివి చేస్తారు. షాడో ఫ్లీట్ ద్వారానే రష్యా.. చైనా, ఇండియా, టర్కీ వంటి దేశాలకు ఆయిల్ సరఫరా చేస్తోంది, ఈ నెట్వర్క్కు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయిన యూఏఈ, సౌదీ అరేబియాలు ఫైనాన్షియల్ ఛానెల్స్ అందిస్తున్నాయి. అయితే..ఈ నెట్వర్క్ ప్రపంచ ఆయిల్ మార్కెట్పై గణనీయమైన ప్రభావం చూపుతోంది. దీనివల్ల చమురు ధరల స్థిరత్వం దెబ్బతింటోంది. ఆంక్షల అమలు కష్టతరమవుతోంది. వీటికి తోడు ప్రపంచ రాజకీయాల్లోనూ మార్పులు సంభవిస్తున్నాయి. 2025 నాటికి.. ఈ ఫ్లీట్లో 978 టాంకర్లు ఉన్నట్లు ఓ లెక్క. ఇది ప్రపంచ ఆయిల్ టాంకర్ సామర్థ్యంలో దాదాపు 19శాతం.అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్పై ప్రభావం ఎంతంటే.. ధరల స్థిరత్వం దెబ్బతినడం.. G7 దేశాలు రష్యా ఆయిల్పై ధర పరిమితి (price cap) విధించాయి. కానీ షాడో ఫ్లీట్ ద్వారా ఈ పరిమితిని తప్పించుకుని, మార్కెట్లో తక్కువ ధరలకు ఆయిల్ విక్రయిస్తోంది. ఫలితంగా, అధికారిక మార్కెట్ ధరలు, బ్లాక్ మార్కెట్ ధరలు మధ్య వ్యత్యాసం పెరుగుతోంది.అయితే.. పాత, రిజిస్ట్రేషన్ లేని నౌకలు సముద్రంలో ప్రమాదకరంగా మారుతున్నాయని, పైగా పర్యావరణానికి (oil spills), సముద్ర రవాణా భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయని పాశ్చాత్య దేశాలు అంటున్నాయి.సవాల్కు ప్రతి సవాల్షాడో ఫ్లీట్ లిస్ట్లో ఉందని చెబుతున్న బెల్లా-1 ద్వారా అమెరికా ఆంక్షలను తప్పించుకుని ఆయిల్ను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారనేది అమెరికా ఆరోపణ. అందుకే రష్యా దీన్ని సవాలుగా తీసుకుని రక్షణ కల్పించింది. రక్షణ ఇవ్వడం ద్వారా వెనిజులాకు ఆర్థిక, రాజకీయ మద్దతు చూపించినట్లయ్యింది. అంతేకాదు “మా మిత్రదేశాల ఆయిల్ రవాణాను మీరు అడ్డుకోలేరు.” అనే సందేశాన్ని పంపించింది. అయితే ఈ సవాల్ను స్వీకరించిన అమెరికా.. దానిని విజయవంతంగా అడ్డుకున్నట్లు స్పష్టమవుతోంది. అలాగని అమెరికా షాడో ప్లీట్లను అడ్డుకోవడం ఇదే తొలిసారేం కాదు. వెనెజువెలాకు చమురు ఆదాయం కోత పెట్టే ఉద్దేశంతో ట్రంప్ సర్కార్ ఈ తరహా ట్యాంకర్లను అడ్డుకోవడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో డిసెంబర్ 10వ తేదీన స్కిప్పర్, సెంచురీస్ అనే రెండు ఆయిల్ ట్యాంకర్లను సీజ్ చేశాయి. ఈ నేపథ్యంలో.. తాజా పరిణామాలు రాబోయే రోజుల్లో.. రష్యా–US మధ్య సముద్రం వేదికగా కొత్త ఉద్రిక్తతలకు దారితీయొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
నెక్ట్స్ టార్గెట్ ఇరాన్? అదే జరిగితే..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు మారు మోగిపోతుంది. వెనెజువెలా అధ్యక్షున్ని ఆయన దేశంలోనే నిర్భంధించి అమెరికా జైల్లో పడేయడంతో.. ట్రంప్ మాటలే కాదు చేతలూ చేయగలడని అంతా అనుకుంటున్నారు. దీంతో అమెరికా అధ్యక్షుడి నెక్స్ట్ టార్గెట్ ఏ దేశమా? అనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆర్థిక వేత్త జెప్రీ సాచస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఇరానే అయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవేళ అదే జరిగితే పరిస్థితులు చాలా భయంకరంగా ఉండే అవకాశం ఉందన్నారు.ట్రంప్ రెండవసారి అధికారం చేపట్టినాటి నుంచి అమెరికాతో సత్సంబంధాలు లేకున్నా ఆ దేశానికి వ్యతిరేకంగా ఉన్నా అస్సలు సహించడం లేదు. 'మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్' అనే భావనతో చాలా దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. అధిక పన్నులు వేయడంతో పాటు ప్రత్యక్ష యుద్దాలకు వెనుకాడడం లేదు. తనకు అనుకూలంగా లేని దేశాలను ఇన్ని రోజులు మాటలతో హెచ్చరించిన ట్రంప్ తాజాగా తన సత్తా ఎంటో చూపాడు. అమెరికాకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే నెపంతో వెనిజువెలా అధ్యక్షుడిని బంధించి అమెరికా తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలో తన నెక్స్ట్ టార్గెట్ ఇరాన్ దేశం అయి ఉండవచ్చని ప్రముఖ ఆర్థిక వేత్త జేప్రీసాచ్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఆయన ఏమన్నారంటే.. "ప్రస్తుతం ట్రంప్ అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నారు. ఆయన మెుదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ‘‘నేను వెనెజువెలాపై ఎందుకు దాడి చేయకూడదు’’ అని అనుకున్నారు. అంటే ఆ భావన ఎప్పటి నుంచో ఆయనలో ఉందన్నమాట. అయితే ఇటీవల జరిగిన కొత్త సంవత్సర వేడుకలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుతో కలిసి ‘‘ఇరాన్.. నెక్స్ట్ నువ్వే’’ అన్నారు. బహుశా ట్రంప్ తదుపరి టార్గెట్ ఇరానే అయి ఉండవచ్చు. ఒకవేళ అదే జరిగితే పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఇరాన్ వద్ద అత్యాధునిక హైపర్ సోనిక్ మిసైల్స్ ఉండడంతో పాటు ఆ దేశానికి ప్రధాన శక్తుల అండ ఉంది. ఇది ప్రపంచ వినాశనానికి దారి తీయవచ్చు" అని ఆయన అన్నారు.అమెరికా విదేశాంగ విధానాన్ని అక్కడే పెంటగాన్ నడిపిస్తోంది అన్నారు. అదేవిధంగా యూఎస్ కంటే ఇజ్రాయెల్ మరింత ప్రమాదకరమైన దేశమన్నారు. ఇండియా నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెప్రీ సాచస్ పైన పేర్కొన్న వివరాలు పంచుకున్నారు. కాగా గతేదాడి ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరగగా అమెరికా మధ్యలో ఎంట్రీ ఇచ్చింది. ఆదేశానికి చెందిన బి-2 స్పిరిట్ బాంబర్లతో ఇరాన్లోని అణుకేంద్రాలపై దాడులు నిర్వహించింది. దీనికి ప్రతీకారంగా ఖతార్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. తర్వాత ట్రంప్ ఎంట్రీతో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే అణు ఒప్పంద విషయంలో మాత్రం ట్రంప్ ఇరాన్పై ఇంకా అసంతృప్తితోనే రగిలిపోతున్నారు. -
సత్యసాయి బాటలో వెనెజువెలా నేతలు.. కారణం ఇదే..
సాధారణంగా వామపక్ష, కమ్యూనిస్టు భావజాలం కలిగిన దేశాల్లో దైవచింతన అంతగా ఉండదని అందరూ అనుకుంటారు. అయితే వెనెజువెలా దేశం విషయంలో ఈ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఆ దేశాధినేతలు ఒకవైపు తమ వామపక్ష రాజకీయ సిద్ధాంతాలను కొనసాగిస్తూనే, మరోవైపు పుట్టపర్తి సత్యసాయి బాబాపై తమ అపారమైన భక్తిని చాటడం విశేషంగా మారింది.ప్రశాంతి నిలయంలో రోడ్రిగ్జ్వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన మహిళా నేత రోడ్రిగ్జ్ కూడా సత్యసాయి బాబా భక్తురాలే కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా నిలిచింది. ఆమె 2024లో ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో గల ప్రశాంతి నిలయాన్ని సందర్శించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాబాపై ఆమెకున్న భక్తి, ఆధ్యాత్మిక అనుబంధం ఈ పర్యటన ద్వారా వెల్లడయ్యింది.మదురో కార్యాలయంలో సత్యసాయి ఫొటోవెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో సత్యసాయి బాబాకు పరమ భక్తుడన్న విషయం కూడా ఇటీవలే విపరీతంగా వ్యాప్తిలోకి వచ్చింది. ఆయన కేవలం భక్తుడిగానే కాకుండా, తన అధికారిక కార్యాలయంలో కూడా బాబా ఫోటోను పెట్టుకుంటారు. 2005లో మదురో తన భార్యతో కలిసి పుట్టపర్తిని సందర్శించి, బాబా ఆశీస్సులు అందుకున్నారు.‘ఆయన ఆధ్యాత్మిక గురువు’మదురో తన పుట్టపర్తి పర్యటన సమయంలో సత్యసాయి బాబాను ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువుగా, గొప్ప మానవతావాదిగా పేర్కొన్నారు. సత్యసాయి బోధనలు తన జీవితంపై, ఆలోచనా దృక్పథంపై ఎంతో ప్రభావం చూపాయని ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నారు. మదురో రాజకీయాలకు అతీతంగా సత్యసాయి మార్గాన్ని అనుసరిస్తుంటారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.చావెజ్ నాయకత్వంలో..వెనెజువెలా పాలకుల్లో ఈ ఆధ్యాత్మిక చింతన ఇప్పటిది కాదు.. మదురో కంటే ముందు అధ్యక్షునిగా ఉన్న హ్యూగో చావెజ్ హయాం నుండే అక్కడి ప్రభుత్వ ఉన్నతాధికారుల్లో సత్యసాయిపై భక్తి ఏర్పడింది. చావెజ్ నాయకత్వంలోని పలువురు కీలక నేతలు సత్యసాయి బాబా సందేశాలకు అమితంగా ఆకర్షితులై, పుట్టపర్తికి రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుత వెనెజువెలా మధ్యంతర అధ్యక్షురాలు రోడ్రిగ్జ్ రెండేళ్ల క్రితం ప్రశాంతి నిలయంలో తిరుగాడిన దృశ్యాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.కమ్యూనిస్టు సిద్ధాంతాలకు విరుద్ధంగా..సాధారణంగా కమ్యూనిస్టు సిద్ధాంతాలు భౌతికవాదానికి ప్రాధాన్యత ఇస్తాయి. అయితే వెనెజువెలా నేతలు.. తమ వామపక్ష రాజకీయ సిద్ధాంతాలను పాటిస్తూనే, సత్యసాయి బాబా చూపిన ఆధ్యాత్మిక మార్గంలో నడవటం ఒక అరుదైన విషయంగా మారింది. వెనెజువెలాలో అధికారంలో ఉన్నవారే కాకుండా, అక్కడి ప్రతిపక్ష నేతలు కూడా పుట్టపర్తిని సందర్శించడం విశేషం. ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం వారు సత్యసాయి బాబా వైపు చూడటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. రోడ్రిగ్జ్ నుంచి మదురో.. ఇప్పుడు రోడ్రిగ్జ్ వరకు అందరూ సత్యసాయి బాబాను ఒక గొప్ప మానవతావాదిగా గౌరవించడం భారత్-వెనెజువెలా మధ్య ఉన్న ఆధ్యాత్మిక వారధికి చిహ్నంగా కనిపిస్తోంది. ఇది కూడా చదవండి: కిమ్ క్షిపణి గర్జనల వేళ.. ‘డ్రాగన్-కొరియా’ షాకింగ్ ట్విస్ట్! -
‘చమురు వెనెజువెలాదే.. కానీ పెత్తనం చేసేది నేనే’
వాషింగ్టన్ డీసీ: సహజ సంపదలతో అలరారే వెనెజువెలా ..ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కర్రపెత్తనంతో చిగురాకుటాలా వణికిపోతోంది. ఆ దేశ చమరును, దాని ద్వారా వచ్చే ఆదాయాలపై తానే పెత్తనం చెలాయిస్తానంటూ అధికారిక ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వెనెజువెలాతో కీలక చమురు ఒప్పందాన్ని ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం, వెనెజువెలా 30 నుంచి 50 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ను అమెరికాకు ఇవ్వనుంది. వాటి ధర, అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలన్నింటిని అమెరికానే పర్యవేక్షిస్తుందని సోషల్ ట్రూత్ వేదికగా స్పష్టం చేశారు. ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ ఎనర్జీ సెక్రటరీ క్రిస్రైట్కు ఆదేశాలు జారీ చేశారు. ప్రణాళిక తక్షణమే అమలు చేయండి. వెనెజువెలా చమురును షిప్పుల్లో నింపండి. వాటిని అమెరికా డాక్లలో స్టోర్ చేయండి’అని స్పష్టం చేశారు. ట్రంప్ ఆదేశాలతో ఇప్పటికే వెనెజులాలో వెలికి తీసిన చమురును బ్యారెల్స్లో నింపారు. నౌకల ద్వారా అమెరికా గల్ఫ్ కోస్ట్ ప్రాంతంలోని రీఫైనరీలకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. -
గ్రీన్ ల్యాండ్ పై ట్రంప్ కన్ను
-
ట్రంప్ ‘హిట్ లిస్ట్’
కొలంబియా ట్రంప్ తరచూ పేర్కొనే ‘డ్రగ్స్ ధూర్త’దేశాల్లో ఇదొకటి. వెనెజువెలా రాజధాని కరాకాస్పై అమెరికా దాడి చేసిన కొద్ది గంటల్లోనే కొలంబియాకు కూడా ఆయన అల్టిమేటం జారీ చేశారు. ఈ బెదిరింపుల వెనక ఉన్నది కూడా ‘చమురు’ఆకాంక్షలేనన్నది పరిశీలకుల అంచనా. ఎందుకంటే వెనెజువెలాకు పశ్చిమాన ఉండే కొలంబియా కూడా భారీ చమురు నిక్షేపాలకు ఆలవాలమే. పైగా వెనెజువెలా మాదిరిగానే అది కూడా నిత్యం కల్లోలంగా ఉండే దేశమే. ట్రంప్ నిజంగా దాడికే నిర్ణయించుకుంటే ఇది ఆయన పనిని సులభతరం చేసే అంశమే. ట్రంప్ పదేపదే మొత్తుకుంటున్న డ్రగ్స్ భూతం నిజంగానే కొలంబియాలో విశ్వరూపం దాల్చింది.మొత్తం లాటిన్ అమెరికాలోనే డ్రగ్స్ వ్యాపారానికి కేంద్రబిందువు ఆ దేశమే! ముఖ్యంగా కొకైన్ అక్కడ ఏరుగులా పారుతుంటుంది. ఈ డ్రగ్స్ను కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో విచ్చలవిడిగా అమెరికాలోకి గుమ్మరిస్తున్నారన్నది ట్రంప్ ప్రధాన అభియోగం. ఈ కారణంగానే ఆయనపై గత అక్టోబర్లో ట్రంప్ భారీ ఆంక్షలు కూడా విధించారు. ‘‘కొలంబియాను ఓ శాడిస్టు పాలిస్తున్నాడు. అతని హయాం ఇంకెంత కాలమో సాగబోదు’’అని ఆదివారం ఆయన మీడియా సాక్షిగా ప్రకటించారు. దీన్నిబట్టి చూస్తుంటే కొలంబియాలో ఉన్నట్టుండి అమెరికా బలగాలో, ప్రత్యేక దళాలో దిగినా ఆశ్చర్యం లేదన్నది పరిశీలకుల అంచనా!ఇరాన్ ప్రస్తుతం భారీ ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతున్న దేశమిది. ఇటీవల ఇజ్రాయెల్తో ఇరాన్ ‘12 రోజుల’ఘర్షణల సందర్భంగా అమెరికా కూడా ఆ దేశంపై క్షిపణుల వర్షం కురిపించడం తెలిసిందే. ముఖ్యంగా అక్కడి అణు స్థావరాలు, మౌలిక సదుపాయాలను తుత్తునియలు చేసింది. తాజా ఆందోళనలను కూడా మరోసారి తనకు అనువుగా ఉపయోగించుకునే దిశగా ట్రంప్ పావులు కదుపుతున్నారు. ఆందోళనకారులను పొట్టన పెట్టుకుంటే సహించేది లేదని, భారీ స్థాయిలో దాడులు చేస్తామని ఇరాన్ను బెదిరించారాయన.‘‘ఇరాన్ గతంలోలా తన సొంత ప్రజలను పొట్టన పెట్టుకుంటామంటే ఊరుకోబోం. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం’’అని కూడా చెప్పుకొచ్చారు. గత వారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫ్లోరిడాలో ట్రంప్ జరిపిన సుదీర్ఘ భేటీలో ప్రధాన చర్చనీయాంశం ఇరానే అని కూడా చెబుతున్నారు! త్వరలో ఇరాన్పై ఇజ్రాయెల్ భారీ ఎత్తున దాడులకు దిగేలా ఆ భేటీలో పథక రచన కూడా జరిగిందని అంటున్నారు! అదే నిజమైతే సందట్లో సడేమియా మాదిరిగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండగానే అమెరికా కూడా మరోసారి ఇరాన్పై పెద్దపెట్టున విరుచుకుపడే అవకాశాలు లేకపోలేదు. మెక్సికోట్రంప్ తొలినుంచీ ద్వేషిస్తూ వస్తున్న దేశం. 2016లో తొలిసారి అధ్యక్ష బరిలో దిగినప్పుడు ఆయన ప్రధాన నినాదం, ఎజెండా కూడా దక్షిణాన మెక్సికోతో సరిహద్దు పొడవునా గోడ కడతాననే! గతేడాది రెండోసారి అధికార పగ్గాలు చేపట్టగానే ట్రంప్ చేసిన తొలి సంతకం గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చిన ఫైలు మీదే! ఆ దేశమంటే ఆయనకు ఆ స్థాయిలో విద్వేషం!! డ్రగ్స్తో పాటు అక్రమ వలసదారులు కూడా మెక్సికో నుంచి అమెరికాలోకి విచ్చలవిడిగా పోటెత్తుతున్నారన్నది ట్రంప్ ప్రధాన అభియోగం.దీని కట్టడికి ఆ దేశం ఉద్దేశపూర్వకంగానే గట్టి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు. ‘‘మెక్సికోలోని డ్రగ్ కార్టెల్స్ చాలా శక్తిమంతమైనవి. వాటి కట్టడికి ఇక అమెరికానే ఏదో ఒకటి చేయాలి’’అని ఆదివారం మీడియా భేటీలోనే ట్రంప్ కుండబద్దలు కొట్టారు. ‘వాటిపై పోరుకు అమెరికా సైన్యాన్ని పంపుతానంటే మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్బామ్ తిరస్కరించారు’అంటూ అసహనం కూడా వెలిబుచ్చారు.క్యూబా అమెరికాకు కూతవేటు దూరంలో ఉండే ఈ బుల్లి కమ్యూనిస్టు దేశం దశాబ్దాలుగా దానికి కంట్లో నలుసుగా మారింది. ఫలితంగా 1960ల నుంచీ అమెరికా నుంచి భారీ ఆంక్షలను ఎదుర్కొంటోంది. వెనెజువెలాతో క్యూబాకు అత్యంత సన్నిహిత బంధముంది. వెనెజువెలా ఇప్పుడు అమెరికా చేతుల్లోకి వెళ్లిన నేపథ్యంలో అక్కడి నుంచి క్యూబాకు చమురు సరఫరా నిలిచిపోయినట్టే. ఇది ఆ బుల్లి దేశపు ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసేలా కని్పస్తోంది. బహుశా అందుకేనేమో, ‘‘క్యూబా ఆదాయమంతటికీ వెనెజువెలా నుంచి వస్తున్న చమురే ఆధారం. ఆ మార్గం మూసుకున్న కారణంగా అదిప్పటికే కుప్పకూలుతున్న దేశం. కనుక దానిపై సైనిక చర్య కూడా అనవసరమేమో’’అంటూ ట్రంప్ తాజాగా కామెంట్ చేశారు.క్యూబాలో అధికార మారి్పడి అత్యవసరమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పదేపదే చెబుతుండటం తెలిసిందే. గత శనివారం వెనెజువెలాపై అమెరికా దాడి చేసి మదురో దంపతులను బందీలుగా పట్టుకున్న అనంతరం రూబియో మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను గనక ఇప్పుడు (క్యూబా రాజధాని) హవానాలో ఉంటే, అక్కడి ప్రభుత్వంలో భాగస్వామిని అయ్యుంటే కాస్త ఆందోళనలోనే పడి ఉండేవాన్ని’అన్నారు. తద్వారా, క్యూబాపై అమెరికా ఇప్పటికే గురి పెట్టిందని చెప్పకనే చెప్పారు. ఇంతా చేస్తే, రూబియోది క్యూబా నుంచి అమెరికాకు వలస వచి్చన కుటుంబం కావడం విశేషం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్ మలి గురి... గ్రీన్లాండ్?
నయా సామ్రాజ్యవాది అవతారమెత్తిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తదుపరి లక్ష్యం గ్రీన్లాండేనా? ఆయన వ్యాఖ్యలు, దూకుడు, సహచర గణం ప్రకటనలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను అర్ధరాత్రి వేళ సొంత నివాసం నుంచి నిర్బంధించి తీసుకొచ్చిన ట్రంప్ తెంపరితనం ప్రపంచాన్ని విస్మయానికి లోనుచేయడం తెలిసిందే. తానక్కడితో ఆగేది లేదని, దారికి తేవాల్సిన దేశాలు ఇంకొన్ని ఉన్నాయని ఓ జాబితానే చదివారు ట్రంప్. వాటిలో కొలంబియా, క్యూబాతో పాటు మెక్సికో వంటివాటిని చేర్చడమే గాక, ‘అవసరమైతే వాటిపై ఏ క్షణమైనా విరుచుకుపడతాం’అంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు.అయితే వీటన్నింటి కంటే ముందు ట్రంప్ తదుపరి లక్ష్యం డెన్మార్క్ అధీనంలోని గ్రీన్లాండ్ కానుందన్నది విశ్లేషకుల అంచనా. ఆదివారం మీడియాతో ట్రంప్ మాటతీరు కూడా దాన్ని బలపరిచేవిగానే ఉంది. ‘‘ఒక 20 రోజులాగండి, గ్రీన్లాండ్ గురించి మనమంతా మాట్లాడుకుందాం’’అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారాయన. అంతేకాదు, ‘‘గ్రీన్లాండ్ మాక్కావాల్సిందే. అమెరికా భద్రత దృష్ట్యా ఇది అత్యంత కీలకం. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు.ఒకట్రెండు నెలల్లో దీనిపై గట్టిగానే దృష్టి సారిస్తాం’’అంటూ కుండబద్దలు కొట్టారు కూడా. నిజానికి ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉండగానే 2019లోనే గ్రీన్లాండ్ను కొనుగోలు చేస్తామంటూ డెన్మార్క్కు ప్రతిపాదించారు. కానీ అక్కడి ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఇక రెండోసారి అధ్యక్షుడు అయినప్పటినుంచీ గ్రీన్లాండ్ ఆక్రమణ కాంక్షను ఆయన ఎప్పుడూ దాచుకోలేదు. ఇటీవల పలుమార్లు మీడియాముఖంగానే తన మనోగతాన్ని స్పష్టం చేస్తూ వచ్చారు. గ్రీన్లాండ్ స్వా«దీనానికి అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనకాడబోమని కూడా ప్రకటించారు! అంతేకాదు, గ్రీన్లాండ్ను అమెరికాలో కలిపేసుకోవాలని తీవ్రంగా వాదించే లూసియానా గవర్నర్ జెఫ్ లాండ్రీని ఏరికోరి ఆ ప్రాంతానికి ప్రత్యేక రాయబారిగా పంపారు కూడా! ఎందుకంత ఆసక్తి? గ్రీన్లాండ్పై ట్రంప్ ఆసక్తి వెనక బోలెడన్ని కారణాలున్నాయి. యూరప్, ఉత్తర అమెరికా ఖండాలకు అది సరిగ్గా మధ్యలో ఉంటుంది. దాంతో అమెరికా సైన్యానికి వ్యూహాత్మకంగా ఈ ప్రాంతం చాలా కీలకం. అంతేగాక ఖండాంతర క్షిపణుల ముందస్తు హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటుకు కూడా ఇది అత్యంత అనువైనది. వాయవ్య గ్రీన్లాండ్లోని పిటుఫిక్లో అమెరికాకు ఇప్పటికే సైనిక స్థావరముంది. ఇక్కడి నుంచి రష్యా నావికా దళ కదలికలపై అమెరికా అనునిత్యం స్పష్టంగా కన్నేసి ఉంచవచ్చు కూడా. అపార ఖనిజ నిల్వలు గ్రీన్లాండ్ అపారమైన ఖనిజ, చమురు, సహజవాయు నిల్వలకు ఆలవాలం. అత్యంత అరుదైనవిగా ప్రకటించిన 34 ఖనిజాల్లో గ్రాఫైట్, లిథియం వంటి ఏకంగా 25 ఖనిజాలు గ్రీన్లాండ్లో అపారంగా ఉన్నట్టు తేలింది. విద్యుత్ వాహనాల తయారీలో ఇవి చాలా కీలకమన్నది తెలిసిందే. అమెరికా ఈ ఖనిజాల కోసం చాలాకాలంగా చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. చైనాపై విధించిన భారీ టారిఫ్లను కూడా అంతే వేగంగా ట్రంప్ వెనక్కు తీసుకోవడానికి ఈ ఖనిజాల ఎగుమతిపై డ్రాగన్ నిషే«ధం విధించడమే ప్రధాన కారణం. గ్రీన్లాండ్ తమకు చిక్కితే ఇకపై ఆ ఖనిజాల కోసం చైనాను బెదిరించే దురవస్థ ఉండదన్నది ట్రంప్ యోచన. ఇక గ్రీన్లాండ్లో చమురు, సహజవాయు నిల్వలు కూడా అపారంగా ఉన్నా, పర్యావరణ కారణాల రీత్యా వాటి వెలికితీతపై నిషేధం కొనసాగుతోంది. ఆ ప్రాంతాన్ని ఆక్రమించి వాటిని కూడా సొంతం చేసుకోవాలన్నది ట్రంప్ వ్యూహం. అతి పెద్ద ద్వీపం గ్రీన్లాండ్. ప్రపంచంలోనే అతి పెద్ద దీవి. 1953లో డెన్మార్క్లో భాగంగా మారింది. అయితే 2009లో దానికి విస్తృత స్వయంపాలిత ప్రతిపత్తి దక్కింది. దాని ప్రకారం గ్రీన్లాండ్వాసులు రిఫరెండం ద్వారా పూర్తి స్వాతంత్య్రం పొందవచ్చు కూడా. కాకపోతే అదిప్పటికీ డెన్మార్క్ నియంత్రణలోనే ఉంది. ఇంతా చేస్తే గ్రీన్లాండ్ జనాభా కేవలం 57 వేలు! – సాక్షి, నేషనల్ డెస్క్ నాటో భవితవ్యమేమిటో?! గ్రీన్లాండ్ విషయమై అమెరికా, డెన్మార్క్ మధ్య మొదలైన రగడ నాటో కూటమి అస్తిత్వంపైనే ప్రశ్నలు లేవనెత్తుతోంది. అత్యంత శక్తిమంతమైన నాటో కూటమిలో అవి రెండూ సభ్య దేశాలేనన్నది తెలిసిందే. కూటమిలోని ఏ దేశంపై దాడి జరిగినా అది అందులోని దేశాలన్నిటిపైనా దాడిగానే పరిగణించి అంతా కలసికట్టుగా ఎదుర్కోవాలన్నది నాటో ఒప్పందం. అలాంటప్పుడు అమెరికా ఏకంగా తోటి సభ్య దేశంపైనే దాడికి దిగితే అది కూటమి మూల, వ్యవస్థాపక సూత్రాలకే విరుద్ధమవుతుంది.అందుకే, అమెరికా దాడి నాటోకు అంతమేనన్న డెన్మార్క్ ప్రధాని హెచ్చరికల నేపథ్యంలో నాటోలోని యూరప్ దేశాలు వెంటనే స్పందించాయి. ‘‘ఆర్కిటిక్ ప్రాంతమంతా యూరప్ ప్రయోజనాలకు అతి కీలకం. అందుకే అక్కడ మా దేశాల ఉనికి, కార్యకలాపాలతో పాటు పెట్టుబడులను కూడా నానాటికీ విస్తరిస్తూ వస్తున్నాం. దాన్ని సురక్షితంగా ఉంచడానికే మా ప్రాధాన్యం. డెన్మార్క్తో పాటు గ్రీన్లాండ్ కూడా నాటోలో భాగమే’’అంటూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అమెరికాయే కీలకం నాటో కూటమిలో అమెరికాయే కీలకంగా వ్యవహరిస్తూ వస్తోంది. కూటమి రక్షణ బడ్జెట్లో 17 శాతం వాటా ఆ దేశానిదే. కనుకనే గ్రీన్లాండ్ రక్షణ, సంరక్షణ కూడా తమ బాధ్యతే కావాలన్నది ట్రంప్ సలహాదారు స్టీఫెన్ వాదన. -
ట్రంప్ను రెచ్చగొడుతున్న మరో దేశాధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే.. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను తీసుకెళ్లినట్లుగానే తనను ఎత్తుకెళ్లాలని, ఆ క్షణం కోసం తాను ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు వెటకారంగా సవాల్ విసిరారాయన.వెనెజువెలా దాడి తర్వాత ట్రంప్ మాట్లాడుతూ.. కొలంబియాను డ్రగ్స్ విక్రయించే వ్యక్తి పాలిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. ‘‘కొలంబియా బాగా నష్టపోయింది. ఓ చెడ్డోడు ఆ దేశాన్ని పాలిస్తున్నాడు’’ అని కామెంట్ చేశాడు. పైగా కొలంబియాపై ఆపరేషన్ ప్రారంభించడం తనకు మంచిగా అనిపిస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఇది సహజంగానే అవతలి వాళ్లను కోపం తెప్పించింది.ట్రంప్ బెదిరింపులను కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్రంగా ఖండించారు. ‘‘నేను ఇక్కడే మీ కోసం ఎదురు చూస్తుంటా. దమ్ముంటే వచ్చి మదురోను పట్టుకున్నట్లు నన్ను పట్టుకోండి. అది అంత సులువు అనుకుంటే వాళ్లు పొరబడినట్లే. ఒకవేళ కొలంబియాపై అమెరికా గనుక దాడులు చేస్తే.. ఇక్కడి పర్వతాల్లో ఉండే రైతులు ఆయుధాలు పడతారు. తాము గౌరవించే అధ్యక్షుడ్ని బంధిస్తే ఈ దేశ ప్రజలు చిరుతల్లా ముందుకు దూకుతారు’’ అంటూ ప్రకటించారు. నేను మళ్లీ ఆయుధం ముట్టుకోనని గతంలో ప్రమాణం చేశాను. కానీ నా మాతృభూమి కోసం అవసరమైతే నేను మళ్లీ ఆయుధం చేపడతా అంటూ భావోద్వేగంగా మాట్లాడారాయన.గుస్తావో ఫ్రాన్సిస్కో పెట్రో ఉర్రెగో (Gustavo Petro) ఒకప్పుడు M-19 గెరిల్లా ఉద్యమంలో సభ్యుడుగా ఉన్నారు. ఆ తర్వాత ఆయుధాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చి, బొగోటా మేయర్, సెనేటర్గా పనిచేశారు. 2022లో ఆయన కొలంబియాకు తొలి వామపక్ష అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 1990లలో నిరాయుధీకరణ సమయంలో ఆయన మళ్లీ ఆయుధం ముట్టనంటూ ప్రతినబూనారు.గత శనివారం(జనవరి 3న) వెనెజువెలాపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించి.. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అమెరికాకు బందీలుగా పట్టుకెళ్లారు. వీరిద్దరిపై నార్కో టెర్రరిజం, అక్రమ ఆయుధాల కేసుల్ని మోపింది. డ్రగ్స్ ముఠాకు మదురో నాయకుడని.. యూఎస్లోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాడని ట్రంప్ ఆరోపించారు. అయితే.. వెనెజువెలాలో ఉండే చమురు, అదరుదైన ఖనిజాల కోసంమే ట్రంప్ ఈ కుట్రకు తెరదీశాడని మరికొందరు ఆరోపిస్తున్నారు.అయితే.. అమెరికా సైనిక చర్య కంటే ముందు ఒక కార్యక్రమంలో మదురో మాట్లాడుతూ.. ‘‘దమ్ముంటే, నన్ను పట్టుకెళ్లండి’’ అంటూ ట్రంప్కు సవాల్ చేశారు. ఆ తర్వాతే అమెరికా వెనిజులా రాజధాని కారకస్పై దాడులు చేసి మదురోను బంధించింది. ఈ నేపథ్యంలో.. కొలంబియా అధ్యక్షుడి సవాల్కు ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి. -
వెనెజువెలా బాధ్యతపై ట్రంప్ సంచలన ప్రకటన
వెనెజువెలా భవిష్యత్తుపై ట్రంప్ తన ప్లాన్ను ప్రకటించారు. ఆదేశంలో ఇప్పట్లో ఎన్నికలు ఉండవని తెలిపారు. ప్రస్తుతం ఆ దేశంలో శాంతియుత పరిస్థితులు నెలకొనాలని మౌళిక సదుపాయాలు, సంస్థాగత నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. వెనెజువెలా బాధ్యత ఎవరూ చూసుకుంటారు అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఇట్స్..మీ అని ట్రంప్ బదులిచ్చారు.కొద్దిరోజుల క్రితం వెనెజువెలాపై యుఎస్ దాడి చేసి.. అక్కడి అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెనెజువెలా తదుపరి అధ్యక్షుడు ఎవరు? అక్కడి పాలన, తదితర పరిస్థితులు, ఎన్నికల నిర్వహణ తదితర విషయాలపై అందరిలోనూ సందేహాలు నెలకొన్నాయి. అయితే ఆ దేశ భవిష్యత్తుపై ట్రంప్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఆ దేశంలో ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ లేదని తెలిపారు.ట్రంప్ మాట్లాడుతూ.. "మనం మెుదటగా దేశాన్ని సరిచేయాలి, ప్రజలు ఓటు వేయలేని పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించకూడదు. ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలి. ఇక్కడి ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరించేలా యుఎస్ ఆయిల్ కంపెనీలు ప్రధాన పాత్ర వహిస్తాయి. మెుదటగా యుఎస్ ఆయిల్ కంపెనీలు వెనెజువెలాలో పెట్టుబడులు పెడతాయి. అనంతరం ఆ మెుత్తాన్ని దాని రెవెన్యూ ద్వారా రీయంబర్స్మెంట్ చేసుకుంటాయి." అని అన్నారు.ఈ వ్యవస్థ మెుత్తం సెట్ కావడానికి 18 నెలల వరకూ సమయం పడుతుందని ట్రంప్ తెలిపారు. వెనెజువెలాతో అమెరికా యుద్ధం చేయబోతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని డ్రగ్స్ అమ్మేవారితో అమెరికా ఎప్పుడు యుద్ధం చేయదని తెలిపారు. ఆ దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు ఆదేశ నాయకత్వమే కారణమని తెలిపారు.అయితే అక్కడే ఉన్న ఒక జర్నలిస్టు అంతిమంగా వెనెజువెలా ఛార్జ్ ఎవరు తీసుకుంటారు అని ప్రశ్నించగా ట్రంప్ దానికి బదులిస్తూ అది 'నేనే' అని తెలిపారు. తన సెక్రటరీ స్పానిష్ భాష చాలా బాగా మాట్లాడుతుందని ఆ వ్యవహారాలు తాను చూసుకుంటుందని తెలిపారు. ఒకవేళ వెనెజువెలాలో పరిస్థితులు అదుపులో లేకపోతే మరోసారి దాడి చేయడానికి యుఎస్ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ట్రంప్ హెచ్చరించారు. -
వెనెజువెలాలో 'ఏంజెల్' జలపాతం..! చేరుకోవడం అంత ఈజీ కాదు..
అగ్రరాజ్యం అమెరికా సైనిక చర్యతో వెనెజువెలాపై విరుచుకుపడి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వెనెజువెలా దేశం గత కొన్ని రోజులుగా వార్తల్లో హాట్టాపిక్ నిలిచింది. ఒక రకంగా అమెరికా ఈ దుందుడుకు చర్య కారణంగా వ్యతిరేకతనే ఎక్కువగా మూటగట్టుకుంది. ఇదంతా ఎలా ఉన్నా..అందమైన దేశం చిక్కుల్లో పడటం పర్యాటక ప్రేమికులనే కాదు ఇతర దేశాలను సైతం కదిలిచింది. ఎన్నో ప్రకృతి అద్భుతాలకు నెలవైన వెనెజువెలా ఇదివరకటిలా పరిస్థితి చక్కబడలని ఆశిస్తూ..అక్కడ అత్యంత పేరుగాంచిన ఏంజెల్ జలపాతం విశేషాల గురించి తెలుసుకుందామా..!.వెనెజువెలాలో ఉన్న ఏంజెల్ జలపాతం అధికారికంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతం. దాదాపు 979 మీటర్ల నుంచి పడుతుంది ఈ జలపాతం. భూమిపై ఉన్న అత్యంత ఎత్తైన, నిరంతర జలపాతంగా పేరొందింది ఇది. అంతేగాదు నయాగరా జలపాతం కంటే 16 రెట్లు ఎత్తులో ఉంటుందట. ఈ నీరు ఆయాన్-టెపుయ్ అనే చదునైన పర్వతం పై నుండి పడిపోతుంది. ఇక్కడ మాత్రమే కనిపించే పురాత టేబుల్ పర్వతం ఇది. నిజానికి ఇది జలపాతాన్ని చూస్తున్నట్లుగా ఉండదు. మేఘాలు గాల్లో కరిగిపోతున్నట్లుగా కనిపిస్తుంది. దీనికి యునెస్కో గుర్తింపు కూడా ఉంది. ఆ అందమైన జలపాతం కనైమా నేషనల్ పార్క్లో ఉంది. దీని చుట్టూ పెద్ద నగరాలు, రహదారులు, జనసముహం ఉండుదు. దట్టమైన అడవి, వంకరలు తిరిగిన నదులు దాటి..నేరుగా కొండల నడుమ అందంగా కొలువుదీరి ఉంటుంది ఈ జలపాతం.ఆ పేరు ఎలా వచ్చిందంటే..1930లలో గాలి నుంచి జలపాతాన్ని మొదటిసారిగా గుర్తించిన అమెరికన్ పైలట్ జిమ్మీ ఏంజెల్ కారణంగా వచ్చిందట. అయితే, స్థానిక ప్రజలు దీనిని ఎల్లప్పుడూ 'కెరెపాకుపై మేరు' అని పిలుస్తారు. దీని అర్థం 'లోతైన ప్రదేశంలోని జలపాతం'. చమత్కారంగా ఈ రెండు పేర్లు దాని అద్భుతం, శక్తి గురించి చెప్పకనే చెబుతున్నాయి కదూ..!.ఎలా చేరుకోవాలంటే..ఏంజెల్ జలపాతాన్ని చేరుకోవడం అనేది ఒక సాహసం. ముందుగా సియుడాడ్ బోలివర్ లేదా ప్యూర్టో ఓర్డాజ్కు వెళ్లాలి. అక్కడి నుంచి నేషనల్ పార్కు లోపల ఉన్న కనైమా క్యాంప్కు వెళ్లే చిన్న విమానంలో ఎక్కాలి. ఆ తర్వాత వంకరలు తిరుగుతున్న నదులలో పడవ ప్రయాణం చేసి.. వర్షారణ్యం గుండా ఒక చిన్న నడక. అయితే వర్షాకాలంలో నదులు నిండి ఉంటాయి అందువల్ల పడవ ప్రయాణం సులభతరమవుతుంది.సందర్శించడానికి తగిన సమయంఏంజెల్ జలపాతాన్ని చూడాలనుకుంటే జూన్, నవంబర్ మధ్య సందర్శించడం మంచిది. వర్షాలు జలపాతాన్ని మరింత అందంగా చూపిస్తాయి. వర్షాలు లేని నెలల్లో కూడా ఇది అద్భుతమైన దృశ్యమే.చూడాల్సిన కమనీయ ప్రదేశాలు..ఏంజెల్ జలపాతం చూడటం హైలైట్, కానీ ఈ ప్రాంతం దీంతోపాటు మరిన్ని జాయ్ఫుల్నెస్నిచ్చేవి ఎన్నో ఉన్నాయి ఇక్కడ . పడవలో అడవి నదులలో మునిగిపోవడం, సహజ కొలనులలో ఈత కొట్టడం లేదా సమీపంలోని స్పష్టమైన నీటి మడుగులను అన్వేషించడం తదితరాలెన్నో ఉన్నాయి. అరుదైన వన్యప్రాణుల కోసం పార్క్ గుండా నడవాలి. ఉత్కంఠభరితమైన వైమానిక వీక్షణ కోసం చిన్న విమానంలో జలపాతం మీదుగా వెళ్లడం పర్యాటకులకు ఓ థ్రిల్.(చదవండి: వామ్మో ఇదేం విచిత్రం..జుట్టు ఆరోగ్యం కోసం ఆలయమా..?!) -
‘నా నోబెల్ ట్రంప్కే..’ మచాడో సంచలనం
కరాకస్: వెనెజువెలాలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి 2025 నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న విపక్ష మహిళా నేత మరియా కొరినా మచాడో సంచలన నిర్ణయం తీసుకున్నారు.వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు బంధించిన నేపథ్యంలో, తన నోబెల్ పురస్కారాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు అంకితం ఇస్తున్నట్లు ఆమె ప్రకటించారు.ఫాక్స్ న్యూస్తో మాట్లాడిన మచాడో.. నోబెల్ గౌరవాన్ని ట్రంప్తో పంచుకునేందుకు లేదా పూర్తిగా ఆయనకే ఈ బహుమతిని ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. వెనెజువెలా రాజధాని కరాకస్లో జనవరి 3న అమెరికా చేపట్టిన సైనిక చర్యను మచాడో చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ‘జనవరి 3వ తేదీ చరిత్రలో నిరంకుశత్వంపై న్యాయం సాధించిన విజయంగా నిలిచిపోతుంది. ఇది మొత్తం మానవాళికే ఒక గొప్ప ముందడుగు’ అని ఆమె పేర్కొన్నారు. చాలా మంది అసాధ్యమని భావించిన పనిని ట్రంప్ సుసాధ్యం చేశారని, అందుకే తన నోబెల్ బహుమతిని ఆయనకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించారు.మదురో అరెస్ట్ తర్వాత వెనెజువెలాలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంలో మచాడో కీలక పాత్ర పోషిస్తారని అందరూ భావించారు. అయితే ట్రంప్ ఈ విషయంలో భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు. మచాడోకు దేశంలో తగినంత మద్దతు లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆమె చాలా మంచి మహిళ అని, కానీ దేశంలో ఆమెకు తగినంత గౌరవం, ఆదరణ లేదన్నారు. ఆమె దేశానికి నాయకత్వం వహించడం కష్టమని భావిస్తున్నానంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.గత నెలలో నోబెల్ పురస్కారాన్ని అందుకునేందుకు నార్వే వెళ్లిన మచాడో, నాటి నుండి వెనిజులాకు తిరిగి చేరుకోలేదు. అయితే, మదురో పతనం తర్వాత.. అతి త్వరలోనే స్వదేశానికి చేరుకుంటానని ఆమె ప్రకటించారు. వెనిజులా ప్రజల తరపున ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఆమె రాక వెనిజులా రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తున్నదనేది ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: ఇక కొండపై కార్తీక దీపం.. మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ -
వెనెజువెలాపై మరొకసారి కాల్పుల మోత
వెనిజువెలా రాజధాని కారకాస్లోని మిరా ఫ్లోరెస్ అధ్యక్ష ప్యాలెస్ సమీపంలో మరొకసారి భారీ కాల్పులు మోత మోగింది. అమెరికా సైన్యం వెనెజువెలా అధ్యక్షుడు మడురోను పట్టుకున్న రెండు రోజుల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. భారత కాలమాన ప్రకారం సోమవారం(జనవరి 5వ తేదీ) రాత్రి ఈ ఘటన జరిగింది. ప్యాలెస్పై డ్రోన్లు దాడి చేశాయి. వాటిని చూసి వెనెజువెలా భద్రతా దళాలు సైతం కాల్పులు జరిపాయి. ఇందుకు కారణం తెలియపోయినా ఇది అమెరికా దాడి తర్వాత ఏర్పడిన ఉద్రిక్తతల భాగంగా భావిస్తున్నారు.అమెరికా సైన్యం జనవరి 3న మడురో మరియు ఆయన భార్యను పట్టుకుని న్యూయార్క్కు తరలించింది. - : వెనిజువెలా పార్లమెంట్ డెల్సీ రోడ్రిగ్స్ను తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయించింది. గ అమెరికాతో సహకరించడానికి సిద్ధమని సంకేతాలు ఇచ్చారు రోడ్రిగ్స్ అమెరికాతో సహకరించడానికి సిద్ధమని సంకేతాలు ఇచ్చారు, కానీ మడురోను అమెరికా బంధీగా పేర్కొన్నారు., మడురోపై డ్రగ్ ట్రాఫికింగ్ కేసులు న్యూయార్క్ కోర్టులో కొనసాగుతున్నాయి. -
‘మీరు.. వెనెజువెలాలో ఏం జరిగిందో చూశారుగా..’
నిన్న మొన్నటి వరకూ ఇరాన్ లక్ష్యంగా దాడులు చేసిన ఇజ్రాయిల్.. ఇప్పుడు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. వెనెజువాలాలో గత వారంగా జరుగుతున్న పరిణామాలు ఉదహరిస్తూ ఇరాన్కు వార్నింగ్ ఇచ్చింది. ‘ మీరు దారికి రాకపోతే వెనెజువెలాలో ఏం జరిగిందో అదే జరుగుతుంది’ అని ఇజ్రాయిల్ ప్రతిపక్ష నాయకుడు యేర్ లాపిడ్ పేర్కొన్నారు..అమెరికా సైన్యం.. వెనిజులా అధ్యక్షుడు నికోలాస్ మడురోను అరెస్ట్ చేసిన ఘటనను ఉదాహరణగా చూపిస్తూ,ఇరాన్ పాలకులు వెనిజులాలో జరుగుతున్న పరిణామాలను గమనించాలి” అని స్పష్టంగా పేర్కొన్నారు. దీని ఫలితంగా అమెరికా ఒక దేశాధ్యక్షుడిని అరెస్ట్ చేయగలిగితే, ఇరాన్ పాలకులు కూడా ఇలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి రావచ్చనే సంకేతాలు పంపారు లాపిడ్. ఇది ఇరాన్క ఒక హెచ్చరిక లాంటిదిగా పేర్కొన్నారు. ఇరాన్ పాలకులు తమ చర్యలకు గణనీయమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ భేటీ తర్వాత.. వెనెజువాలాపై అగ్రరాజ్యం దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడైన మదురోను నిర్బంధించింది. ఆయనపై నార్కో-డ్రగ్స్ ముద్ర వేసి న్యూయార్క్లో తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు ఇరాన్ను ఇజ్రాయిల్ ప్రతిపక్ష నాయకుడు హెచ్చరించడం మరోసారి చర్చనీయాంశమైంది. అయితే.. తమపై దాడికి దిగితే అందుకు మూల్యం భారీగా చెల్లించుకోవాల్సి వస్తుందని ఇరాన్కు మాటల ప్రతిదాడికి దిగింది. ఒకవేళ అమెరికాతో తమపై యుద్ధానికి దిగితే కచ్చితంగా తిప్పి కొడతామని ఇరాన్ పార్లమెంట్ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. తాము మీ దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఈ తాజా పరిణామాలు ఇజ్రాయిల్-ఇరాన్ల మధ్య మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని భావిస్తున్నారు విశ్లేషకులు.. -
మాకు అడ్డొస్తే ఇంతే..!
అమెరికా అంటే చాలా దేశాలకు తెలియని వణుకు. అటు ఆర్థికపరంగా, ఇటు సైనిక పరంగా కూడా ఆ దేశం బలమైన దేశం. అందుకే అమెరికాతో కాస్త జాగ్రత్తగా ఉండాలని ఇతర దేశాలు కోరుకోవడం తప్పులేదు.అనవసరంగా వారితో తలనొప్పి తెచ్చుకోవడం ఎందుకనే బావన మిగతా పెద్ద దేశాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ అమెరికాను చాలెంజ్ చేసినా అవి మాటల వరకే ఉంటాయి. ఏవో కొన్నిదేశాలు తప్పితే అమెరికా వ్యవహారంలో ఎవరూ పెద్దగా జోక్యం చేసుకోరు. ఏదైనా దేశం అమెరికాను ఎదిరించే మాట్లాడితే వారు నియంత పోకడలకు పోతున్నారనే అపవాదు వేస్తుంది అగ్రరాజ్యం. ఇలా అమెరికా ఆగ్రహానికి తాజాగా గురైన దేశం వెనెజువెలా. ఆ దేశంపై దాడి చేసి అధ్యక్షుడు మదురోను నిర్బంధించడమే ఇందుక ఉదాహరణ. మరి అమెరికా ఇప్పుడే ఇలా చేసిందా అంటే కాదనే చెప్పాలి. గతంలో చాలా సందర్భాల్లో వేరే దేశాలను తమ మాట వినేలా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ‘మొండోడికి నిండా కూడు’ అన్న సామెత అమెరికా అచ్చంగా సరిపోతుందంటే అతిశయోక్తి కాదేమో.అమెరికా గతంలో అనేక విదేశీ నాయకులను నియంతలగా ముద్ర వేసి సైనిక చర్యలు లేదా రహస్య ఆపరేషన్ల ద్వారా పదవి నుంచి తొలగించింది. ముఖ్యంగా లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్యం, ఆసియా ప్రాంతాల్లో అమెరికా జోక్యాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి.మొహమ్మద్ మోసాదేఘ్ (ఇరాన్, 1953)ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రధాని.అమెరికాకు వ్యతిరేకంగా గళం విప్పిన ప్రధానిఅమెరికా, బ్రిటన్ మద్దతుతో జరిగిన కూప్ ద్వారా తొలగించారు.ఇరాన్ చమురు పరిశ్రమను జాతీయీకరించడమే ఇందుకు కారణంజాకోబో ఆర్బెన్స్ (గ్వాటెమాలా, 1954)ప్రజాస్వామ్యంగా ఎన్నికైన అధ్యక్షుడు.అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (Central Intelligence Agency)) మద్దతుతో జరిగిన కూప్ ద్వారా పదవి నుంచి తొలగించారు.అతని భూసంస్కరణలు అమెరికా యునైటెడ్ ఫ్రూట్ కంపెనీకి నష్టం కలిగించాయి. అందుచేత అమెరికా అతన్ని ప్రత్యేక ఆపరేషన్ ద్వారా పదవీ వీచ్యుతుడిని చేసింది. న్గో డిన్ డియెమ్ (వియత్నాం, 1963)దక్షిణ వియత్నాం అధ్యక్షుడు.అమెరికా మద్దతుతో జరిగిన సైనిక తిరుగుబాటులో హత్య చేయబడ్డాడు.అతని నియంతృత్వ పాలన, బౌద్ధులపై దమనకాండే ఇందుకు కారణంసాల్వడోర్ అల్లెండే (చిలీ, 1973)సోషలిస్టు అధ్యక్షుడు.అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మద్దతుతో సైనిక కూప్ జరిగింది.అతని సోషలిస్టు విధానాలు, చమురు, రాగి పరిశ్రమల జాతీయీకరణ, భూసంస్కరణలు అమెరికాతో పాటు స్థానిక ఎలైట్ వర్గాలకు ముప్పుగా భావించబడ్డాయి.మాన్యువెల్ నోరియేగా (పనామా, 1989)పనామా అధ్యక్షుడు మరియు సైనిక నియంత.అమెరికా "ఆపరేషన్ జస్ట్ కాజ్" ద్వారా అతన్ని పట్టుకుని అమెరికాకు తీసుకెళ్లింది.తరువాత మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసుల్లో శిక్ష పడింది.సద్దాం హుస్సేన్ (ఇరాక్, 2003)ఇరాక్ యుద్ధంలో అతని ప్రభుత్వాన్ని అమెరికా కూల్చింది.తరువాత పట్టుకుని విచారణ జరిపి మరణశిక్ష అమలు చేశారు.నికోలాస్ మడురో (వెనిజులా, 2026)అమెరికా ప్రత్యేక దళాలు అతన్ని కారాకస్లో పట్టుకుని అమెరికాకు తరలించాయి.అతనిపై నార్కో-టెర్రరిజం కేసులు నమోదు చేశారు.అమెరికా జోక్యాలు ఎక్కువగా కమ్యూనిజం వ్యాప్తిని అడ్డుకోవడం, చమురు తరహా ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకోవడం, లేదా మాదకద్రవ్యాల నియంత్రణ అనే కారణాలతో జరిగాయి. ఈ చర్యలు సంబంధిత దేశాల్లో అస్థిరత, పౌర యుద్ధాలు, దీర్ఘకాలిక రాజకీయ సంక్షోభాలుకి దారితీశాయి.గడాఫీ పతనంలో అమెరికా పరోక్ష పాత్ర2011లో లిబియాలో గడాఫీ పతనంలో అమెరికా నేరుగా చేసిన రెజీమ్ చేంజ్ ఆపరేషన్ కాదు. అమెరికా సైన్యం లిబియాపై దాడి చేసింది, కానీ అది ఐక్యరాజ్యసమితి మద్దతుతో నాటో కూటమి చర్యలో భాగం. గడాఫీని చివరికి పట్టుకుని హత్య చేసినది లిబియన్ తిరుగుబాటు దళాలు, అమెరికా వైమానిక దళం.. లిబియాలో గడాఫీ సైనిక స్థావరాలపై బాంబులు వేసింది.- గడాఫీ సైనిక శక్తిని బలహీనపరిచి, తిరుగుబాటు దళాలకు మద్దతుఉ ఇచ్చింది. నాటో కూటమిలో భాగంగా నావికా దళాలు, వైమానిక దళాలు ఉపయోగించారు. 2011లో గడాఫీ తన స్వస్థలమైన సిర్తేలో తిరుగుబాటు దళాల చేత పట్టుబడ్డాడు. అతన్ని తిరుగుబాటు దళాలు హత్య చేశారు. గడాఫీ మరణం తర్వాత లిబియాలో కేంద్ర ప్రభుత్వం కూలిపోయింది.దేశం అస్థిరత, సాయుధ గుంపుల మధ్య పోరాటం, ISIS వంటి ఉగ్రవాద గ్రూపుల ఆవిర్భించడానికి నాంది పలికింది గడాఫీ పతనం.స్వప్రయోజనలే ప్రధాన కారణమా?అమెరికా జోక్యం ఎప్పుడూ మానవ హక్కుల కోసం మాత్రమే కాదు; చాలా సందర్భాల్లో స్వప్రయోజనాలు ప్రధాన కారణం. ఈ జోక్యాలు సంబంధిత దేశాల్లో అస్థిరత, అంతర్గత యుద్ధాలు, దీర్ఘకాలిక రాజకీయ సంక్షోభాలుకి దారితీసాయి. ఇరాక్లో సద్దాం హుస్సేన్ పతనం తర్వాత ISIS ఉద్భవం, లిబియాలో గడాఫీ మరణం తర్వాత అస్థిరత చోటు చేసుకుంది.కొసమెరుపు..ఏది ఏమైనా తమకు అడ్డొస్తే ఇలానే ఉంటుందనే సంకేతాలను అమెరికా ఇలా పంపుతూనే ఉంది. అమెరికా ఇలా వ్యహరించిన ప్రతీసారి కొన్ని దేశాలు మాత్రం వారి వైఖరిని ఖండిస్తాయి. కానీ చివరకు అమెరికాతో మనకెందుకులే అని ఊరుకుంటాయి.ఇది చదవండి:‘ అందాల’ దేశం.. ఏమిటో ఈ పరిస్థితి..! -
నేను వెనెజువెలా అధ్యక్షుడిని..
న్యూయార్క్: వెనెజువెలా పదవీచ్యుత అధ్యక్షుడు నికొలస్ మదురో అమెరికా గడ్డపై బందీగా ఉన్నా ఏమాత్రం జంక లేదు. ‘నేను వెనెజువెలా అధ్యక్షుడిని. కారకాస్లోని నా ఇంట్లో ఉండగా బంధించి తీసుకువచ్చారు. నేనెలాంటి తప్పూ చేయలేదు. అమాయకుడిని. మర్యాదస్తుడిని’ అని సోమవారం మన్హట్టన్ కోర్టులో చెప్పుకున్నారు. వ్యాపార లావాదేవీలను తప్పుగా చూపారంటూ నమోదైన కేసులో 2024లో డొనాల్డ్ ట్రంప్ సైతం ఇదే కోర్టు బోనులో నిలుచోవడం విశేషం. మదురో కేసులో క్లింటన్ హయాంలో నియమితులైన 92 ఏళ్ల అల్విన్ హెల్లెర్స్టీన్ వాదనలు విన్నారు. సరిగ్గా 12 గంటల సమయంలో కాళ్లకు మాత్రమే గొలుసులుండగా చేతులు వెనక్కి పెట్టుకుని భద్రతా సిబ్బంది వెంటరాగా మదురో కోర్టు హాల్లోకి ప్రవేశించారు.ౖ మదురో, సిలియాలు హెడ్ఫోన్లు పెట్టుకుని ఇంగ్లిష్ నుంచి స్పానిష్లోకి కోర్టు ప్రొసీడింగ్ అనువాదాలను వింటూ ఉన్నారు. జడ్జి అల్విన్ హెల్లెర్స్టీన్ పరిచయం అనంతరం మదురో.. వెనెజువెలా అధ్యక్షుడినంటూ జడ్జికి స్పానిష్ భాషలో పరిచయం చేసుకున్నారు. తానెలాంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు. తనను బందీగా మార్చారంటూ స్పానిష్లో మదురో చెప్పారు. ఆయన మాటలను కోర్టు రూం రిపోర్టర్ అనువాదం చేసి జడ్జికి తెలిపారు. మదురో భార్య సిలియా ఫ్లోరెస్ కూడా తాను వెనెజువెలా ప్రథమ మహిళనంటూ చెప్పుకున్నారు. ఎలాంటి తప్పూ చేయలేదని స్పానిష్లో తెలిపారు. వీరిద్దరూ జైలు నుంచి విడుదలను గానీ, బెయిల్ను గానీ కోరడం లేదని లాయర్లు తెలిపారు. జడ్జి ఆదేశాల మేరకు అభియోగాలకు సంబంధించిన పత్రాలను అధికారులు ఇద్దరికీ అందించారు. అనంతరం, తదుపరి విచారణ మార్చి 17న ఉదయం 11 గంటలకు ఉంటుందని జడ్జి ప్రకటించారు. మదురోపై విచారణ చేపట్టిన కోర్టు సముదాయం వెలుపల పెద్ద సంఖ్యలో జనం గుమికూడారు. మదురోను విడుదల చేయాలని కొందరు, ట్రంప్ కింగ్.. అంటూ మరికొందరు నినాదాలు చేశారు. అంతకుముందు, బ్రూక్లిన్ జైలు నుంచి సోమవారం ఉదయం 7.15 గంటల సమయంలో మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ను జైలు నుంచి అత్యంత భారీ భద్రతతో కూడిన వాహన శ్రేణిలో దగ్గర్లోని అథ్లెటిక్ ఫీల్డ్కు తీసుకెళ్లారు. హెలికాప్టర్ లోకి వారిని ఎక్కించారు. ఆ హెలికాప్టర్ మన్హ ట్టన్ హెలిపోర్టులో ల్యాండయ్యింది. హెలికాప్టర్ నుంచి దించి సాయుధ వాహనంలో వారిని కూర్చో బెట్టుకుని కోర్టుహౌస్ కాంప్లెక్స్లోకి తీసుకెళ్లారు. శనివారం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో కారకాస్ లోని మిలటరీ బేస్లోని నివాసం నుంచి మదురో, సిలియాలను అమెరికా బలగాలు న్యూయార్క్కు తీసుకురావడం తెల్సిందే. మాదక ద్రవ్యాలతో పాటు ఆయుధాల అక్రమ రవాణా ఆరోపణలను వారిద్దరిపైనా మోపారు. కాగా, మదురో భార్య సిలియా డ్రగ్స్ అక్రమ రవాణాదారుల నుంచి 2007లో భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఎవరీ పొలాక్..?మదురో తరఫున వాషింగ్టన్కు చెందిన ప్రముఖ లాయర్ బ్యారీ పొలాక్ వాదనలు వినిపించారు. వికీలీక్స్ ఫౌండర్ జూలియన్ అసాంజే తరఫున దీర్ఘకాలం ప్రాతినిథ్యం వహించింది ఈయనే. అమెరికా గూఢచర్య చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న అసాంజేను జైలు నుంచి విడుదల చేయించి, సొంతదేశం ఆస్ట్రేలియాకు పంపించడంలో కీలకంగా ఉన్నారు. అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయగలరని ఈయనకు పేరుంది. -
ఆ డ్యాన్సులే కొంప ముంచాయా?
వాషింగ్టన్: డ్యాన్సు స్టెప్పులు వేసి మరీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అనవసరంగా రెచ్చగొట్టడమే వెనెజువెలా నియంత నికోలస్ మదురో కొంప ముంచిందా? అవుననే అంటోంది న్యూయార్క్ టైమ్స్ వార్తా పత్రిక. నృత్యాలతో తమను ఎద్దేవా చేయడమే గాక ఏం చేసుకుంటారో చేసుకోండంటూ ఆయన బాహాటంగా సవాలు విసిరినట్టు కూడా ట్రంప్ యంత్రాంగం భావించిందట. గత నవంబర్లో మదురో పలుమార్లు టీవీల్లో కనిపించారు. ‘యుద్ధం వద్దు, శాంతే కావాలి’ అంటూ తాను చేసిన ప్రసంగం తాలూకు మ్యూజికల్ రీమిక్స్కు సరదాగా స్టెప్పులు వేశారు. ‘మతిలేని యుద్ధం వద్దే వద్దు (నో క్రేజీ వార్)’ అనే లైన్లకు కూడా అలాగే పాదాలు కదిపారు. అమెరికాను, ట్రంప్ను, ప్రత్యక్ష దాడి తప్పదన్న ఆయన హెచ్చరికలను తేలిగ్గా తీసుకుంటున్నాననే అర్థం వచ్చేలా ఆ సందర్భంగా పదే పదే నవ్వుతూ కన్పించారు. ఇదంతా ట్రంప్కు తీవ్ర ఆగ్రహం కలిగించిందని వైట్హౌస్ అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ‘‘నిజానికి మదురో అధికారిక నివాసంపై నేరుగా దాడి చేసి ఆయనను ఎత్తుకొచ్చేందుకు అప్పటికి కొద్ది నెలలుగా అమెరికా సైన్యం తాలూకు స్పెషల్ ఫోర్సెస్ రిహార్సల్స్లో మునిగి తేలుతూనే ఉన్నాయి. కాకపోతే నిజంగా అలాంటి ప్రత్యక్ష చర్యకు దిగే విషయంలో మాత్రం అప్పటిదాకా ట్రంప్ కాస్త సంశయంలోనే ఉన్నారు. కానీ మదురో డ్యాన్సింగ్ సవాళ్లు చూసి ఆయనకు చిర్రెత్తుకొచ్చింది’’అని తెలిపింది. దాంతో, ‘‘మదురో స్టెప్పులు మరీ శ్రుతి మించాయి. ఇక గుణపాఠం నేర్పి తీరాల్సిందే’అని ట్రంప్తో పాటు ఆయన యంత్రాంగంలోని ఉన్నతాధికారులు కూడా నిర్ణయానికి వచ్చారట. అలా ట్రంప్ను అనవసరంగా పరిధి దాటి రెచ్చగొట్టి, ఆ ఫలితాన్ని మదురో ఇలా అనుభవిస్తున్నారన్నది న్యూయార్క్ టైమ్స్ కథనం! గత శనివారం అర్ధరాత్రి అమెరికా ప్రత్యేక సైనిక దళాలు మెరుపు ఆపరేషన్ చేపట్టి మదురోను ఆయన భార్య సిలియా ఫ్లోరెస్తో పాటు బెడ్రూంలో నుంచి లాక్కొచ్చి మరీ న్యూయార్క్కు తరలించడం తెలిసిందే. ఇప్పుడాయన విచారణ కోసం ఎదురుచూస్తూ న్యూయార్క్ జైల్లో కాలం గడుపుతున్నారు. మదురో దంపతులతో పాటు వారి కుమారునిపై కూడా అమెరికా డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పలు అభియోగాలు మోపింది. సైనిక చర్యకు ముందు పలుమార్లు మదురోకు దేశం వీడి ఏ తుర్కియేలోనో ఆశ్రయం పొందాల్సిందిగా ట్రంప్ ఆఫర్ ఇచ్చారు. వాటిని మదురో నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తూ వచ్చారు. -
వెనెజువెలా నూతన సారథి..పులిబిడ్డ
‘ముళ్ల కిరీటం’ అనే మాట వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ విషయంలో అక్షరాలా సరిపోతుంది. ఒకవైపు అగ్రరాజ్యం అమెరికా కన్నెర్ర చేస్తోంది. ‘ఇలా చేయాలి...ఇలా మాత్రమే చేయాలి’ అంటూ శాసనాలు చేసే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు తన దేశ సార్వభౌమాధికారాన్ని, తమ జాతి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఏటికి ఎదురీదే ప్రయత్నం చేస్తున్నారు డెల్సీ రోడ్రిగ్స్...నార్కో–టెర్రరిజం కుట్ర, కొకైన్ దిగుమతి... మొదలైన ఆరోపణలతో వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురో, ఆయన భార్య సిలియాను అమెరికన్ సైన్యం నిర్బంధించింది. ఈ నేపథ్యంలో ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలిగా, ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ను నియమిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించడంతో ‘ఎవరీ డెల్సీ రోడ్రిగ్స్?’ అనే ఆసక్తి మొదలైంది.→ బాల్యం నుంచే పోరాట పాఠాలుతండ్రి ఒడిలో చిన్నప్పటి నుంచి పోరాట పాఠాలు వింటూనే పెరిగిన డెల్సీ రోడ్రిగ్స్ వెనెజువెలా సుప్రసిద్ధ జన నాయకురాలిగా ఎదిగారు. తండ్రి జార్జ్ ఆంటోనియో వెనెజువెలాలోని ప్రసిద్ధ లెఫ్ట్–వింగ్ గెరిల్లా ఫైటర్. 1976లో ఆయన హత్యకు గురయ్యాడు.→ చరిత్ర సృష్టించి...సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ వెనెజువెలా(యుసీవి) నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన డెల్సీ స్టూడెంట్ లీడర్గా చురుగ్గా ఉండేవారు. ఆ తరువాత కాలంలో ‘సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ వెనెజువెలా’లో ప్రొఫెసర్గా, ‘వెనెజువెలా అసోసియేషన్ ఆఫ్ లేబర్ లాయర్స్ ప్రెసిడెంట్’గా పనిచేశారు. 2002లో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఒక్కోమెట్టు ఎక్కుతూ మంత్రి స్థాయికి ఎదిగారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో డెల్సీని 2014లో ‘పాపులర్ పవర్ ఫర్ ఫారిన్ రిలేషన్స్’ మంత్రిగా నియమించారు. వెనెజువెలా చరిత్రలో ఆ పదవి చేపట్టిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు డెల్సీ.→ ఉపాధ్యక్షురాలిగా...వెనెజువెలా ఉపాధ్యక్షురాలిగా 2018లో నియామకం అయ్యారు డెల్సీ. వెనెజువెలా నిఘా సంస్థ బొలివేరియన్ ఇంటెలిజెన్స్ సర్వీస్కి హెడ్ అఫీషియల్గా కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు. 2020లో ‘పాపులర్ పవర్ ఫర్ ఎకనామిక్ అండ్ ఫైనాన్స్ ఆఫ్ వెనెజువెలా’ మంత్రిగా పనిచేశారు. చమురు, ఆర్థిక శాఖల మంత్రిగా దేశాన్ని ద్రవ్బోల్బణం బారిన పడకుండా చూశారు.దేశాన్ని రక్షించుకుందాం...వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా నియామకం అయిన డెల్సీ రోడ్రిగ్స్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన హెచ్చరికలతో, తమ చెప్పుచేతల్లో ఉండాలని చెప్పకనే చె΄్పాడు. అయితే ట్రంప్ హెచ్చరికలను 56 ఏళ్ల డెల్సీ ఆట్టే ఖాతరు చేయలేదు. నికొలస్ మదురో, అతడి భార్యను నిర్బంధించడాన్ని ఆమె ఖండించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘మదురోను కిడ్నాప్ చేశారు’ అని ఆరోపిస్తున్న డెల్సీ రోడ్రిగ్స్ ‘వెనెజువెలాని రక్షించుకోవడానికి, దేశంలో శాంతిభద్రతలు కాపాడుకోవడానికి ఐక్యంగా ఉండాలి’ అని పిలుపునిచ్చారు. దేశ వనరులను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. గ్రేట్ ఫైటర్నికోలస్ మదురోకు డెల్సీ రోడ్రిగ్స్ ప్రతిభాపాటవాలన్నా, నాయకత్వ సామర్థ్యమన్నా ఇష్టం. ఒకానొక సందర్భంలో ఆమెను ‘టైగర్’ అని అభివర్ణించారు. డెల్సీ ఉపా«ధ్యక్షురాలిగా నియమితురాలైన సందర్భంలో నికోలస్ మదురో ఆమెను...‘ధైర్యం మూర్తీభవించిన మహిళ. రాజకీయాల్లో తలపండిన అనుభవజ్ఞురాలు. అమరవీరుడి కుమార్తె. వెయ్యి యుద్ధాలతో పరీక్షించబడిన విప్లవకారిణి’ అని ఆకాశానికి కెత్తారు. డెల్సీని ‘టైగర్’ విత్ డిజైనర్ ఫ్యాషన్ టేస్ట్స్ అంటుంటారు. కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్గా పనిచేసిన డెల్సీకి ఫ్యాషన్ డిజైనింగ్పై మంచి అవగాహన ఉంది.ఏక్ లవ్స్టోరీ!గతంలో డెల్సీ రోడ్రిగ్స్, నటుడు ఫెర్నాండో కారిల్లో ప్రేమికులు. ఈ జంట 2007 వరకు కలిసే ఉంది. టీవీ సోప్ ఒపేర స్టార్గా ఫెర్నాండో సుపరిచితుడు. ‘నేను ఆమెను ఏదో ఒకరోజు వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. అత్యంత తెలివైన మహిళలలో ఆమె ఒకరు’ అని డెల్సీ గురించి చెబుతుండే వాడు ఫెర్నాండో కారిల్లో. వినోదం, రాజకీయం అనే భిన్న ప్రపంచాలు ఒకే ప్రపంచం కావడానికి ఏర్పడిన వైరుధ్యాలో? ఇతరత్రా కారణాలో... తెలియదుగానీ వారు ఎక్కువ కాలం కలిసి ఉండలేక΄ోయారు. తాజా విషయానికి వస్తే... డెల్సీ రోడ్రిగ్స్ వెనెజువెలా అధ్యక్షురాలిగా నియామకం అయిన నేపథ్యంలో, ఆ రోజుల్లో డెల్సీపై ఫెర్నాండో కారిల్లో తన ప్రేమను ప్రకటించిన రోజును గుర్తు చేసుకుంటున్నారు నెటిజనులు. -
సామ్రాజ్యవాద దురహంకారం
తన దుందుడుకు చర్యతో, దుష్ట పోకడతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని సంక్షోభం ఊబిలోకి నెట్టేశారు. వెనిజులా రాజధాని కారకాస్తో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి అమెరికా సైన్యం భీకర దాడులకు దిగి అధ్యక్షుడు నికోలస్ మదురోనూ, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్నూ కళ్లకు గంతలు కట్టి, బేడీలు వేసి అపహరించుకుపోయింది. ఆయన ‘మాదకద్రవ్య ఉగ్రవాదానికి’ పాల్పడినట్టు తప్పుడు ఆరోపణలు చేసి న్యూయార్క్లో బంధించింది. అమెరికా సామ్రాజ్యవాద దురహంకారం ప్రపంచానికి కొత్తగాదు. ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా ఖండ దేశాలు అనేకం దాని వాతబడ్డాయి. కుట్రలు చేసి దేశాధినేతల్ని హతమార్చటం, ప్రజాస్వామ్యం డ్రామాలు నడిపి వ్యవస్థల్ని కూల్చేయటం దానికి మంచినీళ్ల ప్రాయం. నాలుగు దశాబ్దాల నాడు తానే అధికారంలో ప్రతిష్ఠించిన పనామా అధ్యక్షుడు ఆంటోనియో నొరీగాను ఇదేవిధంగా దాడిచేసి అరెస్టు చేసింది. కానీ నొరీగా దాని కీలుబొమ్మ. అమెరికా చర్యల పర్యవసానంగా ఇటీవలి దశాబ్దాల్లో ఇరాక్, లిబియా, అఫ్గానిస్తాన్ నెత్తుటి ముద్దలయ్యాయి. ట్రంప్ తాజా చర్య వాటన్నిటినీ తలదన్నింది.వందలాది మంది సీఐఏ ఏజెంట్ల ద్వారా అధ్యక్షుడి భద్రతను చూస్తున్న దళాలను లోబరు చుకుని, అధ్యక్షుణ్ణి భార్యాసమేతంగా అపహరించటం నికృష్టం. ఆయన స్థానంలో తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన డెల్సీ రోడ్రెజ్ను ‘మదురోను మించిన ప్రారబ్ధం చవిచూడాల్సి వస్తుంద’ని హెచ్చరించటం, ఆమె ఈ అవమానాన్ని దిగమింగు కుని ‘కలిసి పనిచేద్దామ’ని స్నేహహస్తం చాచడం ఈ విషాదానికి కొనసాగింపు.దేశాల మధ్య సమస్యలొస్తే శాంతియుతంగా పరిష్కరించుకోవటానికి సిద్ధపడకుండా ఏకపక్షంగా దాడులకు పాల్పడటం, దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించి అధినేతను అపహరించటం ఉగ్రవాదం. అలాంటి చర్యలు ప్రపంచ శాంతిని భగ్నం చేస్తాయి. కానీ పాశ్చాత్య దేశాలూ, అమెరికా ప్రధాన స్రవంతి మీడియా ఈ పరిణామాలను సాధారణ విషయంగా చూపే ప్రయత్నం చేస్తున్నాయి. మదురో పెద్ద నియంతంటూ ప్రచారం లంకించుకున్నాయి. ట్రంప్ దరిదాపుల్లోకి రాగల నియంత ప్రపంచంలో ఉంటాడా? చావెజ్ వారసుడిగా 2013లో అధికారంలోకొచ్చిన మదురో నియంత అనటం పచ్చి బూటకం. 2019 ఏప్రిల్లో ‘తిరుగుబాటు’ చేసి అధికారంలోకొచ్చానని ప్రకటించుకున్న గెయిడో సాయుధ బృందం రక్షణలో రాజధాని కారకాస్ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నా జనం నవ్వుకున్నారు. పోలీసులూ, సైనికులూ అతగాణ్ణి ఏమీ అనలేదు. చివరకు మదురో స్వయంగా పిలిచి నవ్వుతూ తలమీద ఒక్కటిచ్చి పొమ్మన్నారు. వేరే దేశంలో ఎక్కడైనా అది ఉరికంబం ఎక్కేంత తీవ్ర నేరం. కనీసం యావజ్జీవం జైల్లో మగ్గేంత అపరాధం.వెనిజులా ప్రజలు 1999లో హ్యూగో చావెజ్ అధికారంలోకొచ్చాక దశాబ్దాల దారిద్య్రం నుంచి విముక్తులయ్యారు. ఆయన హయాంలో దారిద్య్రం ఒక్కసారిగా 70 శాతానికిపైగా తగ్గింది. నిరుద్యోగం సగానికి సగం పడిపోయింది. పెన్షన్లు నాలుగు రెట్లు పెరిగాయి. అక్షరాస్యత వంద శాతానికి చేరుకుంది. విద్య, వైద్యం, ఉపాధి కల్పన, ఆహారభద్రత అక్కడ ప్రాథమిక హక్కులు. దాదాపు వందేళ్లపాటు దేశ సంపదనంతా తరలించుకుపోయిన అమెరికా చమురు కంపెనీలను చావెజ్ స్వాధీనం చేసుకోవటంవల్లే ఇదంతా సాధ్యమైంది. అప్పటినుంచి అమెరికా కడుపుమంట మొదలైంది. అమెరికా ఆంక్షల వల్ల వెనిజులా దీర్ఘకాలంగా సమస్యలకు ఎదురీదుతోంది. ప్రాణావసర మందులు కరువై లక్షమంది ప్రజలు మరణించారు. దారిద్య్రాన్ని తట్టుకోలేక 80 లక్షల మంది దేశం వదిలిపోయారు. ఇటీవల మదురో చర్యలు వ్యాపార వర్గాల ప్రయోజనాలకు తోడ్పడుతున్నాయన్న విమర్శలున్నాయి. అయితే మదురో చైనా కరెన్సీ యువాన్లలో వాణిజ్యం నెరపడం, చైనా, రష్యా, ఇరాన్లతో జతకట్టడం, బ్రిక్స్లో చేరేందుకు సంసిద్ధం కావటం అమెరికాను కలవరపరిచాయి. అత్యధిక చమురున్న దేశం ఎదిగేలా కనబడటంతో డాలర్ను కాపాడుకోవటానికి అమెరికా ఈ తప్పుడు చర్యకు దిగింది. ఇవాళ వెనిజులా వంతు. రేపు మెక్సికో, క్యూబా, గ్రీన్ల్యాండ్... ఏదైనా కావొచ్చు. అందుకే అమెరికా చర్యను ప్రపంచం ముక్తకంఠంతో ఖండించాలి. ఆధునిక కాలంలో అనాగరిక పోకడలు చెల్లబోవని చాటాలి. -
స్టార్లింక్ సేవలు ఫ్రీ.. మస్క్ కీలక ప్రకటన
అమెరికా, వెనెజులాకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో.. ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్ 'ఎలాన్ మస్క్' కీలక ప్రకటన చేశారు. స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను వెనిజులా ప్రజలకు ఉచితంగానే అందిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.'స్టార్లింక్ ఫిబ్రవరి 3 వరకు వెనెజులా ప్రజలకు ఉచిత బ్రాడ్బ్యాండ్ సేవలను అందిస్తుంది, ఇది నిరంతర కనెక్టివిటీని నిర్ధారిస్తుంది' అని స్టార్లింక్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించగా.. మస్క్ 'వెనెజులా ప్రజలకు మద్దతుగా' అని పేర్కొన్నారు.In support of the people of Venezuela 🇻🇪 https://t.co/JKxOFWsikP— Elon Musk (@elonmusk) January 4, 2026వెనెజులా అధ్యక్షుడు నికొలస్ మదురోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్యకు ఆదేశాలు జారీ చేయడంతో.. అమెరికా సైన్యం మదురోను, ఆయన సతీమణి సిలియా ఫ్లోరెస్ను ఎత్తుకొచ్చింది. ఈ పరిణామం తరువాత మస్క్ ఫ్రీ స్టార్లింక్ సర్వీస్ అందిస్తున్నట్లు చేసిన చర్చనీయాంశంగా మారింది.వెనెజులా దేశంలో ప్రస్తుతం సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రజలకు కనెక్టివిటీని పెంచేందుకు మస్క్ స్టార్లింక్ సేవలను ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్నెట్ సౌకర్యానికి అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు, మారుమూల గ్రామాల్లో మొబైల్ టవర్లు పనిచేయనప్పుడు స్టార్లింక్ సేవలను ఉపయోగించుకోవచ్చు.ఇదీ చదవండి: 70/10/10/10 ఫార్ములా: ఇలా పొదుపు చేస్తే.. నెల మొత్తం హ్యాపీ! -
మదురో బయటపడేందుకు ఏకైక మార్గం ఇదేనా!
ప్రపంచానికి తానే పోలీసోడినని.. జడ్జినని ట్రంప్ నేతృత్వంలోని అమెరికా అనుకుంటోందా?. అందుకే వేరే దేశాల్లోకి చొరబడి మరీ అధినేతలను ఎత్తుకొస్తోందా?. నిన్న వెనెజువెలా?.. రేపు మరో దేశానికి ఈ పరిస్థితి రాకుండా ఉంటుందా?.. ఇలాంటి ప్రశ్నలతో కూడిన చర్చ నడుస్తోంది ఇప్పుడు. మొన్నటిదాకా అధ్యక్ష హోదాలో గౌరవం అందుకున్న నికొలస్ మదురో.. ఇప్పుడు ఈ భూమ్మీద నరకంగా పేరున్న న్యూయార్క్ బ్రూక్లిన్ జైల్లో ఖైదీగా ఉన్నారు. ఆయన అక్కడి నుంచి బయటపడే మార్గం ఉందా?.. మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్పై ‘నార్కో-టెర్రరిజం’ కేసు నమోదు చేసింది అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్. నార్కో-టెర్రరిజం కుట్ర, కొకైన్ దిగుమతి, మెషీన్ గన్స్, విధ్వంసకర ఆయుధాలను కలిగి ఉండటం వంటి అభియోగాలను మోపారు. డ్రగ్స్ రవాణా కోసం కిడ్నాప్లు, వాళ్లపై దాడులు చేయడంవంటి కేసులనూ పెట్టారు. వారు డబ్బులు ఇవ్వకపోవడంతో వారిని హింసించేవారని అదనపు అభియోగాలు నమోదు చేశారు. ఈ పరిస్థితుల్లో ఆయన బయటపడే మార్గాలు చాలా పరిమితంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మదురో ముందున్న అమెరికా కోర్టులో తాను నిర్దోషినని నిరూపించుకోవడం.. ఇది అత్యంత కఠినమైన మార్గం. ఎందుకంటే అది అమెరికా ఫెడరల్ కోర్టు. పైగా ట్రంప్ ప్రభుత్వం ఎలాగైనా సరే బలమైన సాక్ష్యాలు సమర్పించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో.. ఆయన నేరం ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా శిక్ష తప్పించుకోవడం చాలా కష్టమే. అయితే మరణశిక్ష పడకపోవచ్చని.. అమెరికా చట్టాల ప్రకారం జీవితఖైదే పడొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండోది.. కుదిరితే రాజకీయ ఒత్తిళ్లు కుదరకుంటే దౌత్య చర్చలు. వెనెజువెలా తాత్కాలిక ప్రభుత్వం లేదంటే దాని మిత్రదేశాలు అమెరికాపై ఒత్తిడి తెచ్చి మదురో విడుదల కోసం ప్రయత్నించవచ్చు. మూడోది ప్రత్యేక ఒప్పందం (deal). అమెరికా-వెనెజువెలా మధ్య ఏదైనా రాజకీయ లేదంటే వ్యూహాత్మక ఒప్పందం కుదరడం. అప్పుడు ఆయన విడుదలకు అవకాశం ఉంటుంది. మూడు ఆప్షన్లలో మూడో దానికే ఎక్కువ ఆస్కారం ఉండొచ్చని విశ్లేషకులూ చెబుతున్నారు. మదురోకు అత్యంత విశ్వసనీయురాలైన డెల్సీ రోడ్రిగ్జ్ ప్రస్తుతానికి వెనెజువెలా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆమెకు అమెరికా చమురు పరిశ్రమలోని రిపబ్లికన్లతో, అలాగే వాల్స్ట్రీట్తోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె తల్చుకుంటే డీల్ కుదిరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ముమ్మాటికీ అక్రమ అరెస్టే!ఎక్స్ట్రాడిషన్ అనేది ఒక దేశం నుండి మరొక దేశానికి నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అప్పగించే చట్టపరమైన ప్రక్రియ. ఒక దేశాధినేతను మరొక దేశం సైనిక చర్య ద్వారా పట్టుకోవడం అంతర్జాతీయ చట్టానికి విరుద్ధం. అయితే అమెరికా దృష్టిలో ఇది తమ దేశానికి సంబంధించిన భద్రతా చర్య. ఇదే విషయంపై ఫెడరల్ కోర్టుల్లో ట్రంప్ సర్కార్ వాదనలు వినిపించొచ్చు. కానీ, అంతర్జాతీయ చట్టం ప్రకారం ఇది ఆ దేశ సార్వభౌమాధికార ఉల్లంఘన.. అక్రమ అరెస్టే అవుతుందని నిపుణులు చెబుతున్నారు . మదురో అక్రమ అరెస్ట్కు మద్దతు కంటే ఆందోళనే ఎక్కువగా వ్యక్తం అవుతోంది. అమెరికా చర్యను యూరోపియన్ యూనియన్ ఖండించింది. ఛాథమ్ హౌస్ (UK Think Tank).. ఇలాంటి చర్యలకు అంతర్జాతీయ చట్టంలో ఎలాంటి న్యాయబద్ధత లేదని స్పష్టంగా పేర్కొంది. కాబట్టి అమెరికా సైనిక చర్య అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కిందకే వస్తుంది. అయితే.. యూఎన్ చార్టర్ ప్రకారం ఒక దేశం మరొక దేశంపై సైనిక చర్య తీసుకోవడానికి భద్రతా మండలి అనుమతి అవసరం. కానీ, ట్రంప్ అలాంటి అనుమతులు తీసుకోకుండానే వెనెజువెలా అధ్యక్షుడిని బంధించారు. దీనిపై ఆయన ఎలాంటి వివరణ ఇచ్చుకుంటారో చూడాలి. అదే సమయంలో.. ఇవాళ జరగబోయే అత్యవసర సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. అమెరికా చట్టసభలోనూ..అటు అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్లోనూ).. ఈ అక్రమ అరెస్ట్ చట్టబద్ధతపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వెనెజువెలా పడవలపై దాడులు చేయడాన్ని డెమొక్రట్లతో పాటు ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్లూ ఖండించారు. ఇప్పుడు వాళ్లకు తెలియకుండా ఆ దేశంపై విరుచుకుపడటం, అధ్యక్షుడిని తీసుకురావడంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అనుమతి లేకుండా చేపట్టిన ఈ ఆపరేషన్ను కోర్టుల్లోనూ తేల్చుకునే అవకాశం లేకపోలేదు.ఐసీజేలో..అంతర్జాతీయ న్యాయస్థానం సాధారణంగా ఇలాంటి వ్యవహారాల్లో తనంతట తానుగా జోక్యం చేసుకోదు. వెనెజువెలాగానీ ఏదైనా ఇతర దేశాలుగానీ అమెరికా చర్యపై అధికారికంగా కేసు వేస్తే విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. అదే జరిగితే.. మదురో అరెస్ట్ అమెరికాతో పాటు అంతర్జాతీయ భద్రత కోసం అవసరం అని వాదించే అవకాశం లేకపోలేదు. -
వెనెజువెలా: ఇప్పుడైతే యుద్ధం.. రోజూ రాత్రి వేళ లక్ష మెరుపులు!
అమెరికా తన సైనిక చర్యతో వెనెజువెలాపై విరుచుకుపడింది. ‘ఆపరేషన్ అబ్జల్యూట్ రిజాల్వ్’ పేరుతో భీకర బాంబులతో తెగబడింది. అమెరికాలోకి మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాలకు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోనే నాయకుడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. ఈ నేపధ్యంలోనే వెనెజువెలాపై దాడులకు ఆదేశాలిచ్చారు. ఈ నేపధ్యంలో వెనెజువెలా రాజకీయ సంక్షోభం నెలకొంది. ఈ విషయాన్ని అటుంచితే వెనెజువెలాకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇవి ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు ఆకర్షిస్తుంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.పెట్రోల్ ధరలు చవకఅపారమైన చమురు నిల్వలు, ప్రకృతి సౌందర్యానికి దక్షిణ అమెరికా దేశమైన వెనిజులా పేరొందింది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతుంటే.. వెనెజువెలాలో మాత్రం లీటర్ పెట్రోల్ ధర సుమారు మూడు రూపాయలు (భారత కరెన్సీలో)మాత్రమే. ప్రపంచ పెట్రోల్ ధరల సగటుతో పోలిస్తే ఇది అత్యల్పం.ఆర్కిడ్ పూలు, జీవవైవిధ్యంలో టాప్ప్రకృతి సంపదలోనూ వెనెజువెలా ముందు వరుసరలో నిలుస్తుంది. ప్రపంచంలోని 17 అత్యంత జీవవైవిధ్యం (Megadiverse) కలిగిన దేశాలలో వెనెజువెలా ఒకటి. ఈ దేశంలో 25 వేల జాతులకు పైగా ఆర్కిడ్ పూలు పుష్పిస్తాయి. ఈ దేశపు జాతీయ పుష్పం ‘ఫ్లోర్ డి మేయో ఆర్కిడ్’. వెనెజువెలా భూభాగంలో 53శాతం ప్రాంతాన్ని వన్యప్రాణుల సంరక్షణ కోసం రక్షిత ప్రాంతంగా కేటాయించడం విశేషం.ఆరు ‘మిస్ వరల్డ్’ కిరీటాలుఅందగత్తెలకు, అద్భుతమైన పర్యాటక ప్రాంతాలకు వెనిజులా పెట్టింది పేరు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఆరు ‘మిస్ వరల్డ్’ కిరీటాలను గెలుచుకున్న దేశం ఇదే.అత్యంత ఎత్తైన జలపాతంప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతం ‘ఏంజెల్ ఫాల్స్’ (979 మీటర్లు) ఇక్కడే ఉంది. ఈ జలపాతాన్ని 1950ల నాటి వరకు ఎవరూ గుర్తించలేదు. జేమ్స్ క్రాఫోర్డ్ ఏంజెల్ అనే పైలట్ దీనిని కనుగొన్నారు.రోజూ రాత్రి వేళ లక్షకు పైగా మెరుపులు ఈ దేశంలో కనిపించే మరో అద్భుతం ఏమిటంటే.. కాటాటుంబో నది ముఖద్వారం వద్ద ప్రతి రోజూ రాత్రి లక్షకు పైగా మెరుపులు సంభవిస్తాయి. దీనిని ‘నిత్యం మెరిసే మెరుపు’ (Everlasting Lightning) అని పిలుస్తారు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డులలో కూడా చోటు సంపాదించుకుంది.స్కేటింగ్ చేస్తూ క్రిస్మస్ వేడుకలువెనెజువెలాలో క్రిస్మస్ వేడుకలు ఎంతో విభిన్నంగా జరుగుతాయి. ఇక్కడి ప్రజలు క్రిస్మస్ రోజున చర్చికి ‘రోలర్ స్కేట్స్’పై వెళ్లడం ఒక ఆచారంగా పాటిస్తున్నారు. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ముందుగా అన్ని రోడ్లను కూడా క్లియర్ చేస్తుంది. క్రిస్మస్ నాడు చిన్న పిల్లలు తాము పడుకునేటప్పుడు ఒక తాడును తమ కాలి వేలికి కట్టుకుని, దానిని కిటికీ బయటకు వేలాడదీస్తారు. ఉదయం స్కేటింగ్ చేస్తూ వెళ్లేవారు ఆ తాడును నెమ్మదిగా లాగి, పిల్లలను నిద్ర నుంచి మేల్కొలుపుతారు.30కి పైగా స్వదేశీ భాషలుదేశ సాంస్కృతిక రంగం విషయానికి వస్తే ‘క్వాట్రో’ (చిన్న గిటార్ వంటిది) వీరి జాతీయ వాయిద్యం. 'జొరోపో' అనేది వీరి జాతీయ నృత్యం. ఇక్కడ స్పానిష్ అధికార భాష అయినప్పటికీ, మరో 30కి పైగా స్వదేశీ భాషలు వాడుకలో ఉన్నాయి.ఘన పోరాట చరిత్రవెనెజువెలా చరిత్ర పోరాటాలతో ముడిపడివుంది. ఫ్రాన్సిస్కో డి మిరాండా తదితర వీరులు స్పెయిన్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి, తొలి స్వతంత్ర జెండాను రూపొందించారు. 1830లో ఈ దేశం సంపూర్ణ స్వాతంత్ర్యం పొందింది.ఒకవెపు గన్ ఫైరింగ్.. మరోవైపు రోడ్డు ప్రమాదాలుప్రస్తుతం వెనెజువెలా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రపంచంలో గన్ ఫైరింగ్ సంబంధిత మరణాల్లో ఇది రెండో స్థానంలో ఉంది. అలాగే రోడ్డు ప్రమాదాల మరణాల రేటు ఇక్కడ ప్రతి లక్ష మందికి 37.2 శాతంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. రాజధాని నగరం కారకస్లోని ‘హెలిక్స్’ అనే భవనం జైలుగా మారగా, ఇక్కడి ‘టవర్ ఆఫ్ డేవిడ్’ ఒకప్పుడు ప్రపంచంలోనే పెద్ద మురికివాడగా పేరొందింది. ఇది కూడా చదవండి: విమానాలకు పవర్ బ్యాంకుల ముప్పు -
వెనెజువెలాను మేమేం పాలించబోం
వెనెజువెలా విషయంలో అమెరికా యూటర్న్ తీసుకుంది. సురక్షితంగా అధికారాల బదిలీ జరిగేదాకా వెనెజువెలాను తామే నడిపిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఆ విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. వెనెజువెలాను తాము పాలించబోమని.. తమ ఉద్దేశాలు వేరని స్పష్టం చేసింది. వెనెజువెలాను మేమే నడిపిస్తాం.. తర్వాత సురక్షితమైన అధికార బదిలీ చేస్తాం అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పందించారు. "నడిపించడం" అంటే నేరుగా పాలన చేపట్టడం కాదు. వెనిజులా చమురు పరిశ్రమపై అమెరికా విధించిన ఆయిల్ బ్లాకేడ్ (oil blockade) ద్వారా ఒత్తిడి తెచ్చి మార్పులు సాధించడం అని అన్నారు. ‘దేశం సురక్షితమని భావించే వరకూ, సరైన, న్యాయమైన అధికారాల బదిలీ జరిగే వరకూ మా పాలనే ఉంటుంది. అమెరికా సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేవారికి, అమెరికా ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేసే వారికి ఇదో హెచ్చరిక. అత్యంత విజయవంతమైన ఆపరేషన్ను నిర్వహించాం’ అని ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. అయితే ఆ ఉద్దేశం వేరని రూబియో అన్నారు. ‘‘అమెరికా ఇప్పటికే వెనెజువెలా చమురు ట్యాంకర్లపై ఆంక్షలు విధించింది. వాటిని కొనసాగిస్తూ.. డ్రగ్ ట్రాఫికింగ్ ఆపడం, ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా చమురు పరిశ్రమను నడపడం మాత్రమే అమెరికా ముందు ఉన్న లక్ష్యం’ అని రూబియో తెలిపారు. వెనెజువెలాలో చమురు వ్యాపారం అస్తవ్యస్తంగా ఉందని, అమెరికాలోని పెద్ద కంపెనీలు అక్కడికి వెళ్లి మౌలిక వసతులను కల్పించి దేశం కోసం ఆదాయాన్ని సంపాదిస్తాయి అని ట్రంప్ చెప్పిన విషయాన్ని రూబియో ప్రదానంగా ప్రస్తావించారు. అలాగే.. అమెరికా ప్రస్తుతం ఉన్న సైనిక శక్తి డ్రగ్ బోట్లు, ఆంక్షల ట్యాంకర్లను అడ్డుకోవడానికి సరిపోతుందని.. అవసరమైతే సైనిక ఉనికిని పెంచవచ్చని రూబియో తెలియజేశారు.ట్రంప్ మరో వార్నింగ్.. ఒకవైపు రూబియో ప్రకటన వెలువడిన గంటల వ్యవదిలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వెనెజువెలాను రెండో సైనిక దాడి హెచ్చరికలు జారీ చేశారు. వెనెజువెలా తాత్కాలిక నాయకత్వం గనుక తమ ఆదేశాలను పాటించకపోతే మరోసారి దాడి జరగవచ్చని స్పష్టం చేశారాయన. ‘‘నికోలాస్ మదురోను అధికారంలో నుండి తొలగించిన తర్వాత వెనెజువెలా అమెరికా పర్యవేక్షణలోనే ఉంది. ఆ దేశాన్ని సరిచేయడం మా లక్ష్యం. అవసరమైతే మళ్లీ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అలాంటి పరిస్థితి రాకూడదనే కోరుకుంటున్నా’’ అని అన్నారాయన. ‘‘వాషింగ్టన్ ఇప్పుడు ఆ నేలపై పరిస్థితిని పూర్తిగా నియంత్రిస్తోంది. అయితే ఎవరు బాధ్యత వహిస్తున్నారు? అని మాత్రం అడగకండి. ఎందుకంటే నేను చెప్పే సమాధానం చాలా వివాదాస్పదంగా ఉంటుంది’’ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. ఇదిలా ఉంటే.. మదురోకు నమ్మకస్తురాలిగా పేరున్న డెల్సీ రోడ్రిగ్జ్ వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆ దేశ ఉపాధ్యక్షురాలు, చమురు, ఆర్థికశాఖల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుప్రీం కోర్టు సూచన, ఆర్మీ విజ్ఞప్తి, మరోవైపు వెనెజువెలా చట్టాల ప్రకారం ఆమె అధికార బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 90 రోజులపాటు ఆమె అధికారంలో ఉంటారని రక్షణ మంత్రి పాడ్రినో పేరిట అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. అయితే అధికారికంగా ఎక్కడా దీనిపై ప్రకటన వెలువడలేదు. అయితే.. అమెరికాతోనూ ఆమెకు మంచి సంబంధాలు ఉన్నట్లు కొన్ని విశ్లేషణాత్మక కథనాలు వెలువడుతుండడం గమనార్హం.ఇక అమెరికా చేస్తున్న ప్రకటనలను వెనెజువెలా ఒక్కొక్కటిగా ఖండిస్తూ వస్తోంది. తమ అధ్యక్షుడిని పట్టుకెళ్లడాన్ని అక్కడి ప్రభుత్వం "ఇంపీరియలిస్టు చర్య"గా అభివర్ణిస్తోంది. ప్రస్తుతం న్యూయార్క్లోని బ్రూక్లిన్ జైల్లో మదురో, ఆయన సతీమణిని అమెరికా ఉంచింది. అక్కడి నుంచే ఆయన్ని డ్రగ్స్ ట్రాఫికింగ్ అభియోగాలపై విచారణ జరపనుంది ఫెడరల్ కోర్టు.నేడు భద్రతా మండలి భేటీఅమెరికా దాడులపై చర్చించేందుకు సోమవారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశం కానుంది. రష్యా, చైనాల మద్దతుతో.. అత్యవసరంగా సమావేశం కావాలని కొలంబియా చేసిన విజ్ఞప్తితో ఈ సమావేశం ఏర్పాటైంది. -
'వెనిజులా నేనే పాలిస్తా' ఇది సాధ్యమేనా? ట్రంప్ తప్పుకు భారీ శిక్ష?
-
చమురు అంత ఈజీ కాదు
వాషింగ్టన్: వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అనూహ్య దాడితో బంధించి పట్టితీసుకొచ్చాక ఆ దేశంలోని చమురు నిల్వలపై అమెరికా దిగ్గజ కంపెనీలన్నింటికీ అజమాయిషీ లభించేలా అన్ని చర్యలూ తీసుకుంటామని అమెరికాఅధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కానీ ఇది ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని చమురు రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. వెనెజువెలా చమురు పరిశ్రమ కొన్నేళ్లుగా దాదాపుగా పడకేసింది. మదురో హయాంలో చమురు వెలికితీత వ్యవస్థల్లో చాలావరకు పదేళ్లకు పైగా నిరుపయోగంగా ఉండిపోయాయి. దాంతో అవేవీ ఇప్పటికిప్పుడు చమురు వెలికితీత పనుల్లోకి దిగే పరిస్థితుల్లో లేవు. వాటిని తిరిగి ఓ రూపానికి తెచ్చి సిద్ధం చేసేందుకు చాలా సంవత్సరాల సమయం పడుతుందని అంచనా. ఈ పరిస్థితికి ఒకరకంగా అమెరికాయే కారణం కావడం విశేషం. ఈ దేశంపై అమెరికా విధించిన తీవ్ర ఆంక్షల వల్లే చాలా దేశాలకు వెనెజువెలా చమురును విక్రయించలేకపోయింది. చైనా, భారత్ తదితర కొద్ది దేశాలు మాత్రమే వెనిజువెలా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నాయి. అమెరికా ఆంక్షలకు జడిసి చాలా దేశాలు వెనెజువెలా చమురును కొనేందుకు సాహసించలేదు. కొనేందుకు ఎవరూ రాక, గిరాకీ లేక చమురు వెలికితీతను వెనిజువెలా భారీగా తగ్గించుకోవాల్సి వచ్చింది. అలా ప్రస్తుతం కేవలం రోజుకు 11 లక్షల బ్యారెళ్ల చమురు వెలికితీస్తోంది. అదే ఆంక్షల ఊసు లేని రోజుల్లో అంటే 1999 ఏడాదిదాకా రోజుకు ఏకంగా 40 లక్షల బ్యారెళ్ల దాకా ముడిచమురును వెలికితీసేది. వెనెజువెలా చమురు క్షేత్రాలకు మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలంటే కనీసం 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి, పదేళ్ల శ్రమ అవసరం అవుతాయని అమెరికాలోని ‘రైస్ యూనివర్సిటీ’లో లాటిన్ అమెరికా ప్రాంత ఇంధన విభాగ డైరెక్టర్ ఫ్రాన్సిస్కో మొనాల్డీ అంచనావేశారు.కంపెనీలు ముందుకొచ్చేనా?వెనిజువెలాలో ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో చమురు నిల్వలు ఉన్నాయి. కనీసం 303 బిలియన్ బ్యారెళ్ల మేరకు చమురు ఉందని ఒక అంచనా. యావత్ ప్రపంచ చమురు నిల్వల్లో ఇది ఏకంగా 17 శాతానికి సమానం. ఇంతటి అపార చమురు నిల్వలపై అజమాయిషీ, పూర్తిస్థాయి గుత్తాధిపత్యం సాధించేలా అన్ని చర్యలూ తీసుకునేందుకు ట్రంప్ సన్నద్ధమవుతున్నారు. అయితే నాయకత్వ సంక్షోభం తలెత్తితే మాత్రం ట్రంప్ ఎంత నచ్చజెప్పినా అమెరికా చమురు దిగ్గజాలు అక్కడ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఏ మేరకు ముందుకొస్తాయన్నది అనుమానమే. రాజకీయ అనిశ్చితి కొనసాగే పరిస్థితుల్లో బిలియన్ల కొద్దీ డాలర్లను వెచ్చించి రిస్కు తీసుకునేందుకు అవి వెనకాడవచ్చు. ప్రస్తుతానికైతే ఈ విషయంలో అత్యంత సందిగ్ధ పరిస్థితే నెలకొని ఉంది. దీనికి ట్రంప్ ఎలాంటి పరిష్కారం చూపుతారన్నది ఆసక్తికరం. ఒకవేళ అమెరికా కంపెనీలు రంగంలోకి దిగి చమురు క్షేత్రాల పునరుద్ధరణపై భారీ మొత్తాలే వెచ్చించినా అవన్నీ సిద్ధమయ్యేందుకు చాలాకా లమే పడుతుందని ఇంధనధరల సరళిపై అధ్యయ నం చేసే గ్యాస్బడ్డీ సంస్థలో ప్రధాన పెట్రోలియం విభాగ నిపుణుడు ప్యాట్రిక్ డీ హాన్ వ్యాఖ్యానించారు. ‘‘చమురు వెలికితీత వ్యవస్థల పునరుద్ధణ ఒక అంశమైతే, రాజకీయ సుస్థిరత అత్యంత కీలకమైన మరో అంశం. తమ పెట్టుడులకు భరోసా కల్పించే సుస్థిరమైన ప్రభుత్వం ఉందని విశ్వసిస్తేనే బడా కంపెనీలు వెనిజువెలాలో అడుగుపెడతాయి. ఆ నమ్మకం లేనంతకాలం పెట్టుబడుల వరద పారడం చాలా కష్టం’’ అని మొనాల్డీ విశ్లేషించారు. బహుశా ఈ పరిస్థితులను ఊహించే మదురోను నిర్బంధించే క్రమంలో అమెరికా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. శనివారం నాటి క్షిపణి, బాంబు దాడుల్లో వెనిజువెలా కీలక చమురు క్షేత్రాల్లో కనీసం ఒక్కటి కూడా దెబ్బ తినకుండా జాగ్రత్త పడింది. వెనెజులా నుంచి ముడిచమురు వెలికితీతను అనూహ్యవేగంగా మొదలెడితే చమురురంగంలో గల్ఫ్ దేశాలను తోసిరాజని అమెరికాయే కింగ్మేకర్గా మారడం ఖాయంగా కన్పిస్తోంది. భారీ పరిమాణంలో చమురు అందుబాటులోకి వస్తుంది గనుక ఇప్పటికే నేలచూపులు చూస్తున్న చమురు ధరలు కనీసం మరికొన్నేళ్లపాటు చౌకగానే అందుబాటులో ఉండే అవకాశం ఉంది.నాణ్యమైన చమురువెనెజువెలాలో దొరికేది హెవీ క్రూడ్గా పేర్కొ నే అత్యంత నాణ్యమైన చమురు. దాని నుంచి డీజిల్తో పాటు భారీ పరికరాల కోసం వాడే అస్ఫాల్ట్ తదితర ఇంధనాలు తయా రవుతాయి. అందుకే అక్కడి చమురుపై భారీ ఇంధన కంపెనీలన్నింటికీ మొదటినుంచీ ఆసక్తి. ఒకప్పట్లా మళ్లీ భారీ పరిమాణంలో అంతర్జాతీయ మార్కెట్లోకి వచ్చిందంటే ప్రధానంగా నష్టపోయేది రష్యానే. అమెరికా, యూరప్ దేశాలు ఆంక్షలు విధించినా రష్యా తట్టుకుని నిలుస్తోందంటే చమురు విక్రయాల పుణ్యమే. చట్టపరమైన చిక్కులువెనిజువెలా చమురును అమెరికా చేజిక్కించుకోవడం అంత సులువేమీ కాదని న్యాయ నిపుణులు వాదిస్తున్నారు. ‘‘ట్రంప్ చర్యను వెనిజువెలా కచ్చితంగా అంతర్జాతీయ న్యాయ వ్యవస్థల ముందు సవాలు చేయవచ్చు. చమురు ఉత్పత్తి పెరుగుదలతో ప్రధానంగా నష్టపోయే రష్యానో, లేదంటే ఏ ఇతర దేశమో కూడా మదురో నిర్బంధాన్ని సవాలు చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆస్కారం లేకపోలేదు. -
వెనెజువెలాపై చర్య అనైతికం
వాషింగ్టన్: వెనెజువెలాపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన సైనిక ఆపరేషన్ను అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు, రిపబ్లికన్ పార్టీ నేత కమలా హారిస్ తీవ్రంగా ఖండించారు. ఈ ఆపరేషన్ చట్టవిరుద్ధం, అనైతికం అని తేల్చిచెప్పారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలతో అమెరికాకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. దేశం భద్రంగా, సౌభాగ్యవంతంగా, బలంగా ఉండాలంటే వైఖరి మార్చుకోవాలని ట్రంప్కు సూచించారు. నికోలస్ మదురో నిరంకుశ పాలకుడే అయినప్పటికీ ఆయనను పదవి నుంచి తొలగించడం సరైంది కాదన్నారు. వెనెజువెలాలో ఉన్న చమురు కోసమే మదురోను నిర్బంధించారని ఆరోపించారు. డ్రగ్స్ నియంత్రణ, ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ సాకులు చెబుతున్నారని ఆక్షేపించారు. ఇతర దేశాల్లో బల ప్రయోగంతో ప్రభుత్వాలను మార్చేయడం, చమురు దోచుకోవడం అమెరికాకు నష్టం కలిగిస్తాయన్నారు. అంతిమంగా అమెరికా ప్రజలే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని కమలా హారిస్ స్పష్టంచేశారు. డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టడం, వెనెజువెలాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం అనే ఆశయాలు ట్రంప్ అజెండాలో లేవన్నారు. ఆయన మనసంతా చమురుపై ఉందని ఆక్షేపించారు. వెనెజువెలాపై సైనిక చర్యను అమెరికా ప్రజలు కోరుకోలేదన్నారు. అబద్ధాలు వినీవినీ వారు ఆలసిపోయారని పేర్కొన్నారు. తనను తాను బలమైన నాయకుడిగా నిరూపించుకోవాలని ట్రంప్ ఆరాటపడుతున్నారని విమర్శించారు. ప్రాంతీయంగా అస్థిరత సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలని ట్రంప్కు సూచించారు. అమెరికా సైనిక దళాలను ప్రమాదంలోకి నెట్టొద్దని కోరారు. వారి ప్రాణాలను బలి పెట్టాలనుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. ఇతర దేశాల్లో ఆపరేషన్ల కోసం కోట్లాది డాలర్లు ఖర్చు వృథా చేయడం ఏమిటని ప్రశ్నించారు. -
కరెంటు లేదు.. ఆహారం దొరకదు
కరాకస్: వెనెజువెలా రాజధాని కరాకస్తోపాటు సమీప నగరాలు, పట్టణాల్లో ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. అమెరికా సైన్యం వైమానిక దాడులకు పాల్పడడం, అధ్యక్షుడు మదురోను అరెస్టు చేసి విదేశానికి తరలించడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సూపర్ మార్కెట్లు, దుకాణాలు మూతపడ్డాయి. ఆహారం, నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికా దాడుల్లో విద్యుత్ గ్రిడ్లు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. మళ్లీ విద్యుత్ సరఫరా ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అధికారులు చేతులెత్తేశారు. కమ్యూనికేషన్ వ్యవస్థలు పనిచేయడం లేదు. రాత్రయితే అంధకారంలో జీవించాల్సి వస్తోంది. వీధులు నిర్మానుష్యంగా మారాయి. కొన్నిచోట్ల సరకులు, మందుల దుకాణాలు తెరవడంతో ఆహారం, ఔషధాల కోసం జనం బారులు తీరారు. ఎక్కడ చూసినా అనిశ్చితి, భయాందోళన కనిపించాయి. ప్రజా రవాణా వ్యవస్థ సేవలను రద్దు చేశారు. జన జీవనం స్తంభించింది. విద్యుత్ సదుపాయం ఉన్నచోట సెల్ఫోన్లను చార్జింగ్ చేసుకొనేందుకు జనం ఎగబడుతున్న దృశ్యాలు కనిపించాయి. చార్జింగ్ కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అందడం లేదని, అంతటా గందరగోళం నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరాకస్లో నివసిస్తున్న భారతీయుల కోసం భారత రాయబార కార్యాలయం వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసింది. వారి సూచనలు జారీ చేస్తోంది. అందరూ అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది. నిత్యం రాత్రి, పగలు జనంతో కిటకిటలాడే రాజధాని కరాకస్ సిటీలో ఆదివారం నిశ్శబ్దం, గందరగోళం రాజ్యమేలాయి. -
న్యూయార్క్ జైలుకు మదురో
కరాకస్: ఏళ్ల తరబడి వెనెజువెలాను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ చిట్టచివరకు అమెరికా జైలులో విచారణ ఖైదీలుగా మారిపోయారు. అమెరికాలోకి మాదక ద్రవ్యాలను పోటెత్తిస్తున్నారన్న ప్రధాన ఆరోపణలతో అపహరించి బందీలుగా పట్టుకొచ్చిన ట్రంప్ ప్రభుత్వం వీళ్లిద్దరినీ న్యూయార్క్లోని బ్లూక్లిన్ ప్రాంతంలోని మెట్రోపాలిటన్ నిర్బంధ కేంద్రంలో ఉంచింది. శనివారం తెల్లవారుజామున వెనెజువెలా రాజధాని కారకాస్పై అమెరికా సైన్యం మెరుపు దాడులు చేసి మదురో దంపతులు బంధించి రాత్రి కల్లా విమానంలో న్యూయార్క్ శివారు ఎయిర్పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి హెలికాప్టర్ మన్హట్టన్కు తీసుకెళ్లారు. తర్వాత డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మిని్రస్టేషన్(డీఈఏ) ఆఫీసుకు చేర్చారు. అక్కడ కొద్దిసేపు ఆయనను ప్రశ్నించారు. ఇద్దరు డీఈఏ ఏజెంట్లు మదురో చేతులు పట్టుకొని తీసుకెళ్తున్న వీడియోను వైట్హౌస్ విడుదల చేసింది. ఇందులో మదురో నవ్వుతూ కనిపిస్తున్నారు. డ్రగ్స్ టెర్రరిజం కేసులో సోమవారం ఆయనను మన్హట్టన్ ఫెడరల్ కోర్టులో హాజరుపర్చబోతున్నారు. వెనెజువెలాపై దాడి చట్టవిరుద్ధం అమెరికాలోకి మాదక ద్రవ్యాలను చేరవేసినందుకు తమ దేశ చట్టాల ప్రకారమే మదురోను విచారించి, శిక్షిస్తామని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. మదురో దంపతులపై త్వరలో విచారణ ప్రారంభించనున్నారు. ట్రంప్పై అమెరికాలోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వెనెజువెలా అధ్యక్షుడిని నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ వైట్హౌస్ బయట నిరసనకు దిగారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా రోడ్రిగ్స్ ప్రమాణం వెనెజువెలా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ ఆదివారం తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రమాణంచేశారు. అధ్యక్షురాలిగా ఆమెతో సుప్రీంకోర్టు ప్రమాణ స్వీకారం చేయించింది. అమెరికాను తామే పాలిస్తామంటూ ట్రంప్ ప్రకటించినప్పటికీ కొత్త అధ్యక్షురాలు ప్రమాణం చేయడం గమనార్హం. మరో దేశానికి తమ దేశం ఒక వలసకాలనీగా ఉండబోదని ఆమె కరాఖండీగా తేల్చి చెప్పారు. అమెరికా దాడిలో తమ పౌరులు, సైనికులు మరణించారని రోడ్రిగ్స్ ఆగ్రహంగా మాట్లాడారు. ఎంతమంది అనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. అమెరికా ఆధిపత్యం తమపై చెల్లదని వెనెజువెలా రక్షణ మంత్రి జనరల్ వ్లాదిమిర్ పాడ్రినో స్పష్టంచేశారు. దేశ సార్వ¿ౌమత్వాన్ని కచ్చితంగా కాపాడుకుంటామని వ్లాదిమిర్ చెప్పారు. సమష్టిగా పాలన: ట్రంప్ మదురోను అదుపులోకి తీసుకొని, పదవి నుంచి దించేయడం ద్వారా ప్రమాదకరమైన డ్రగ్స్ రవాణాను కట్టడి చేసే విషయంలో ముందడుగు వేశామని ట్రంప్ చెప్పారు. ‘‘వెనెజువెలా ప్రభుత్వ పగ్గాలను మరొకరికి భద్రంగా అప్పగించేదాకా సమష్టిగా ఆ దేశాన్ని పరిపాలిస్తాం. ఇందుకు మదురో సన్నిహితుల సాయం కూడా తీసుకుంటాం. పాలనలో వారి భాగస్వామ్యం ఉంటుంది’’ అని అన్నారు. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన రోడ్రిగ్స్కు ట్రంప్ అభినందనలు తెలియజేయడం విశేషం. ముప్పుగా మారిన వారిని శిక్షించక తప్పదు ఇతర దేశాలకు పెద్ద ఎత్తున చమురు సరఫరా చేయబోతున్నామని ట్రంప్ ప్రకటించారు. వెనెజువెలాలోని అపారమైన చమురు నిల్వలపై పెత్తనం చెలాయించబోతున్నట్లు సంకేతాలిచ్చారు. వెనెజువెలా ఇప్పటికే తమ అ«దీనంలో ఉందని వెల్లడించారు. అమెరికా సార్వ¿ౌమత్వానికి, ప్రజల జీవితాలకు ముప్పుగా మారిన వారిని శిక్షించి తీరుతామని తేల్చిచెప్పారు. అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్న లాటిన్ అమెరికా దేశాలకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ ఫ్లోరిడాలో మిన్నంటిన సంబరాలు మదురోను బంధించిన వార్త తెలిసి అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో స్థానికులు ఆనందంలో మునిగిపోయారు. వీరంతా ఒకప్పుడు వెనెజువెలా నుంచి వలసవచ్చిన వాళ్లే. వెనెజువెలా జాతీయ జెండాలు చేతబూని ర్యాలీ నిర్వహించారు. హింసకు తాళలేక స్వదేశం వీడామని, ఇకపై నిర్భయంగా స్వదేశం చేరుకుని బంధువులను కలుస్తామని వాళ్లు ఆనందంతో చెప్పారు. మదురో పతనాన్ని కళ్లారా చూడాలని ఎప్పటినుంచో నిరీక్షిస్తున్నామని తెలిపారు. ఇప్పుడ తమ కల నేరవేరిందన్నారు. తన పాలనను వ్యతిరేకించేవారిపై మదురో ఉక్కుపాదం మోపారు. దాంతో చాలామంది ప్రాణభయంతో విదేశాలకు వెళ్లిపోయారు. భయంకరమైన కారాగారం మదురోను నిర్బంధించిన మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్కు భయంకరమైన కారాగారంగా పేరుంది. కరడుగట్టిన నేరగాళ్లు ఇక్కడ శిక్ష అనుభవ్చిస్తుంటారు. ప్రస్తుతం 1,336 మంది ఖైదీలు ఉన్నారు. వీరందరి మధ్యనే మదురో కాలం గడపాల్సి ఉంది. ఈ జైలులో పరిస్థితులు దారుణంగా ఉంటాయి. శుభ్రత, మౌలిక సదుపాయాలు అంతంత మాత్రమే. ఖైదీల పట్ల సిబ్బంది రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. ఖైదీల మధ్య ఘర్షణలు జరగడం సర్వసాధారణం. హంతకులు, రేపిస్టులు, డ్రగ్స్ స్మగ్లర్లను ఈ జైలులో నిర్బంధిస్తుంటారు. వెనెజువెలాలో ఎగసిన జ్వాలలు శత్రుదేశ సైన్యం అమాంతం అధ్యక్షభవనంపై దాడి చేసి మదురోను ఎత్తుకెళ్లడంతో వెనెజువెలా వాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అమెరికా దమనకాండను నిరసిస్తూ వేలాది మంది స్థానికులు దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఆందోళనలు చేపట్టారు. నిరసన ర్యాలీలు ఆదివారం పెద్ద ఎత్తున కొనసాగాయి. మదురోను పదవీచ్యుతుడిని చేయడంపై ఆయన మద్దతుదారులు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రంప్కు వ్యతిరేకంగా నినదించారు. మదురోను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే మదురోను అమెరికా నిర్బంధించడం పట్ల కొందరు సంతోషం వ్యక్తంచేయడం గమనార్హం. కొందరు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. నియంతృత్వపాలన ముగిసిపోయిందని ఆనందం వ్యక్తంచేశారు. వెనెజువెలాలో అమెరికా చర్యలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సోమవారం చర్చ జరుగనున్నట్లు తెలిసింది. యూఎస్ మీడియాకు ముందే తెలుసు!వాషింగ్టన్: వెనెజువెలా రాజధాని కరాకస్పై ట్రంప్ ప్రభుత్వం సైన్యంతో చేయించిన రహస్య మెరుపు దాడి విషయం అమెరికా మీడియాకు ముఖ్యంగా వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ వార్తా సంస్థలకు ముందే తెలుసని వార్తలొచ్చాయి. తమకు ముందే తెల్సిపోయిందన్న అత్యుత్సాహంలో విషయాన్ని లీక్చేసి కథనాలు ప్రచురించి అందరికీ బహిరంగపరిస్తే ఆ రహస్య ఆపరేషన్లో పాల్గొనే అమెరికా సైనికుల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని గ్రహించాయి. అందుకే మీడియా సంస్థలు ఈ విషయంలో గోప్యత పాటించినట్టు సమాచారం. అమెరికా అధ్యక్షభవనం వర్గాలకు, మీడియా సంస్థలకు ముందే తెలుసు అని అమెరికా న్యూస్ వెబ్సైట్ ‘సెమఫర్’ ఘటన తర్వాత ఒక కథనంలో పేర్కొంది. ఈ విషయాన్ని బయట పెట్టడమా, లేదా అనే విషయంలో రెండు వార్తా సంస్థల్లో సీనియర్ ఎడిటర్ల స్థాయిలో గట్టి చర్చలే జరిగాయట. చివరికి గుట్టుగానే ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్టు సెమఫర్ చెప్పుకొచ్చింది. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల్లో అమెరికా మీడియా సాంప్రదాయికంగా ఈ వైఖరినే పాటిస్తూ వస్తోందని సెమఫర్ గుర్తు చేసింది. ట్రంప్కు, ప్రధాన మీడియా సంస్థలకు నడుమ పచ్చగడ్డి వేసినా భగ్గుమంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ ‘ఆపరేషన్ రిజాల్వ్’ విషయంలో సంయమనం పాటించడం గొప్ప విషయమేనని ఇతర మీడియా సంస్థలు వ్యాఖ్యానించాయి.సవాలు విసిరి దొరికిపోయాడు‘దమ్ముంటే పట్టుకో’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు బహిరంగంగా సవాలు విసిరిన నికోలస్ మదురో అదే అమెరికా సేనలకు దొరికిపోయాడు. ఆయన గత ఏడాది ఆగస్టులో తన అధికారిక నివాసంలో ట్రంప్ను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘రా.. నిజంగా దమ్ముంటే వచ్చి నన్ను అరెస్టు చేసుకో. నీకు కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నా. ఇంకా ఆలస్యం చేయకు.. పిరికిపంద’ అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. దాంతో ట్రంప్ సైన్యం అనుకున్నంత పని చేసి చూపించింది. శనివారం మదురోను, ఆయన భార్యను వారి నివాసంలోనే అరెస్టు చేసి, న్యూయార్క్కు తరలించింది. మదురోపై అమెరికాలో సెటైర్లు పేలుతున్నాయి. మదురోపై వ్యంగ్యాస్త్రాలు విసురుతూ వైట్హౌస్ ఆదివారం ‘ఎక్స్’లో ఒక వీడియో పోస్టుచేసింది. ట్రంప్కు మదురో విసిరిన చాలెంజ్తోపాటు అమెరికా సైనిక ఆపరేషన్, ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్ దృశ్యం ఇందులో ఉంది. ‘చివరకు ఏం జరిగిందో చూశారుగా, అరెస్టయ్యే అవకాశం మదురోకు దక్కింది’ అంటూ వైట్హౌస్ ముక్తాయింపునిచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హ్యాపీ న్యూ ఇయర్ యూఎస్ అధికారులకు మదురో విషెస్ ‘హ్యాపీ న్యూ ఇయర్’! అమెరికా నిర్బంధంలో ఉన్న కొలంబియా తాజా మాజీ అధ్యక్షుడు నికొలస్ మదురో అమెరికా అధికారులతో పలికిన మాటలివి. శనివారం రాత్రి పొద్దుపోయాక యూఎస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆయనను న్యూయార్క్లోని తమ సంస్థ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా వారికి మదురో న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. తన జైలు గదికి చేరుకున్నాక వారికి గుడ్నైట్ సైతం చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. అందులో మదురో నలుపు రంగు హుడీ షర్టు వేసుకుని చేతులకు బేడీలతో ఓ హాల్ గుండా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో కలిసి నడుస్తూ కన్పిస్తున్నారు. -
జ్యోతిష్య శాస్త్రం ముందే చెప్పింది.. మదురో పతనం తప్పదని!
లిమా: ప్రపంచ రాజకీయాలపై ఆధ్యాత్మిక జ్యోతిష్యం మరోసారి చర్చనీయాంశమైంది. బల్గేరియాకు చెందిన వంగాబాబా గతంలో యుద్ధాలు, విపత్తులు, నాయకుల పతనాలను ముందుగానే చెప్పి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు అదే తరహా జోస్యాలతో పెరూ శామన్లు రంగంలోకి వచ్చారు. కొత్త సంవత్సరం ముందు వారు వెనెజువెలా అధ్యక్షుడు నికోలాస్ మదురో త్వరలో అధికారాన్ని కోల్పోతారని ప్రకటించగా.. ఐదు రోజుల్లోనే అమెరికా ప్రత్యేక దళాలు ఆయనను అదుపులోకి తీసుకోవడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిందిఆధ్యాత్మిక జ్యోతిష్యం అనేది ప్రపంచ రాజకీయాలు, నాయకుల భవిష్యత్తు, దేశాల మార్పులు వంటి అంశాలను ఆధ్యాత్మిక దృష్టితో విశ్లేషించే ప్రత్యేక పద్ధతి. పెరూ దేశంలోని శామన్లు (ఆధ్యాత్మిక జ్యోతిష్కులు) ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరానికి ముందు ఇలాంటి జోస్యాలు చెబుతారు. ఆశ్చర్యకరంగా.. మదురోపై ఆధ్యాత్మిక జ్యోతిష్యం వెలుగులోకి వచ్చిన ఐదు రోజులకే అమెరికా వెనెజువెలాలో గోప్యంగా ఆపరేషన్ నిర్వహించింది.ఈ చర్యలో మదురోను, ఆయన భార్యను అదుపులోకి తీసుకోవడం అంతర్జాతీయంగా పెద్ద చర్చాంశమైంది. సుదీర్ఘకాలంగా అమెరికా, పాశ్చాత్య దేశాలకు మదురోకు మధ్య వైరం కొనసాగుతోంది. దీనికి తోడు ఆయన పాలనపై అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘనలు, ఆర్థిక సంక్షోభం వంటి ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రత్యేక దళాలు మదురోను అదుపులోకి తీసుకున్నాయి.పెరూ శామన్ల జోస్యం చెప్పిన కొద్ది రోజుల్లోనే మదురోను అమెరికా ప్రత్యేక దళాలు పట్టుకోవడం వెనెజువెలాలో రాజకీయ పరిస్థితులను పూర్తిగా మార్చేసింది. లాటిన్ అమెరికా దేశాలు ఈ సంఘటనపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. కొందరు మదురో పతనాన్ని ప్రజాస్వామ్య విజయంగా భావిస్తుండగా, మరికొందరు అమెరికా జోక్యాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.ఇలాంటి ఆధ్యాత్మిక జోస్యాలు గతంలో కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. బల్గేరియాకు చెందిన వంగాబాబా ‘బాల్కన్ నోస్ట్రడామస్’గా ప్రసిద్ధి పొందారు. ఆమె చేసిన అనేక జోస్యాలు.. ప్రపంచ యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, ఆర్థిక సంక్షోభాలు నిజమయ్యాయని అనేక మంది విశ్వసిస్తారు. వంగాబాబా జోస్యాలు ఒకప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచినట్లే, ఇప్పుడు పెరూ శామన్ల జోస్యాలు అంతర్జాతీయ చర్చనీయాంశమవుతున్నాయి. -
‘ అందాల’ దేశం.. ఏమిటో ఈ పరిస్థితి..!
ప్రపంచవ్యాప్తంగా వెనెజువెలాకు అందాల భామల దేశంగా పేరుంది. ఇందుకు కారణం. ఆ దేశం ఇప్పటివరకూ 7 మిస్ యూనివర్శ్ టైటిల్స్. 6 మిస్ వరల్డ్ టైటిల్స్ గెలుచుకుంది. ఇదే కాదు.. వెనెజువెలా ప్రకృతి సౌందర్యం కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం, లాస్ రోక్యూస్ దీవులు, ఒరినుకో డెల్టి వంటి సహజ అద్భుతాలు ఈ దేశాన్ని మరింత ప్రత్యేకంగా నిలుపుతాయి.ఇకపై వెనెజువెలాను మేమే పాలిస్తాంవెనెజువెలాలో పాలకుల నియంతృత్వం పోకడలు ఒకటైతే, ఆ దేశాన్ని ఇకపై తామే పాలిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం ఏంటి? ఒక దేశాధ్యక్షుడిని నిర్భందించి మరొక దేశంలో ఉంచొచ్చా? అనేది ప్రస్తుత ప్రశ్న. ఇది ట్రంప్ విపరీత ధోరణికి కూడా అద్దం పడుతోంది. ఒక దేశ అధ్యక్షుడిని మరొక దేశం అరెస్ట్ చేయొచ్చా అంటే చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఐక్యరాజ్యసమిత భద్రతా మండలి అనుమతి కావాలి. అందుకు సహేతుకమైన కారణాలు ఉండాలి. అయితే ఐక్యరాజ్యసమితికి ట్రంప్ నుంచి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఆ దేశంపై యుద్ధం చేయడం, ఆ దేశాధ్యాక్షుడిని భార్య సమేతంగా అరెస్ట్ చేయడం జరిగిపోయింది. అమెరికా కాంగ్రెస్కు కూడా సమాచారం ఇవ్వలేదు ట్రంప్. అంటే ఇక్కడ నియంతృత్వ పోకడ తనలో కూడా ఉందని ట్రంప్ నిరూపించుకున్నట్లే అయ్యింది. ఒక దేశాన్ని మరొక దేశం పాలించొచ్చా?1945 అక్టోబర్లో ఐక్యరాజ్యసమితి రూపొందించిన అంతర్జాతీయ నియమావళిపై అమెరికానే తొలి సంతకం చేసింది. ఆ నియమావళిలో ముఖ్యంగా పేర్కొంది ఏమిటంటే.. ఒక దేశం మరొక దేశంపై సైనిక శక్తిని ఉపయోగించకూడదు. రెండోది ఆ దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. మరి వీటిని ట్రంప్ తుంగలో తొక్కారు. ‘ఐక్యరాజ్యసమితి లేదు.. ఏమీ లేదు.. అంతా మేమే’ అనే అగ్రరాజ్య పోకడను ప్రదర్శించారు. ఒక దేశంపై మరొకదేశం బల ప్రయోగం చేయడం నేరం. సహేతుకమైన కారణాలు ఏవీ కూడా యూఎన్ఓకు సమర్పించకుండా ఇలా చేయడం ఇంకా పెద్ద నేరం. పైనిక చర్యలకు ప్రత్యేక పరిస్థితి..ఒక దేశం.. మరొక దేశంపై సైనిక చర్యగా దిగాలంటే.. అది వారిని వారు కాపాడుకునే క్రమంలోనే చేయాలి. అంటే ఒక దేశం నుంచి ముప్పు ఏర్పడిన సమయంలో ఆత్మరక్షణ కోసం యుద్ధం చేయవచ్చు. ఇక్కడ అదే రూల్ను ట్రంప్ అప్లై చేసినట్లు కనబడుతోంది. వెనెజువెలాను నార్కో-టెర్రరిస్టుగా అభివర్ణిస్తున్న ట్రంప్.. ఇప్పుడు ఆ బూచిని వారిపైకి తోసి అందుకే యుద్ధం చేశామని తన వైఖరిని ఐక్యరాజ్యసమితి ముందు సమర్ధించుకోవచ్చు. అయితే ఈ విషయం కూడా యూఎన్ఓకు ముందుగానే చెప్పాలి. మరి ఇలా చేయలేదు కాబట్టి.. అమెరికాపై యూఎన్ఓ ఆంక్షలు విధించే అవకాశాలు కూడా ఉన్నాయి. వేరే దేశాలు చేస్తే.. శాంతి మంత్రంవేరే దేశాలు ఏమైనా వారి వారి అంతర్గత సమస్యలతో యుద్ధం వరకూ వెళ్తే అక్కడ ట్రంప్ ఎంటర్ అయ్యిపోతారు. ఇప్పటివరకూ అదే జరుగుతూ వస్తుంది. భారత్-పాక్ యుద్ధం, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ఇరాన్- ఇజ్రాయిల్ యుద్ధం ఇలా ఏమి జరిగినా తాను ఉన్నానంటూ ఒక శాంతి కటింగ్ ఇస్తారు ట్రంప్. మరి ఇప్పుడు ఆ శాంతి మంత్రం పక్కకు వెళ్లిపోయిందా.. అనేది మరొక ప్రశ్న. అమెరికాకు అనుకూలంగా ఉన్నవారికే..ఇప్పుడు తమ అనుకూలరితో వెనెజువెలాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తున్న ట్రంప్. అందుకు మచాడోను ఎన్నుకోవచ్చు. ఎప్పట్నుంచో ట్రంప్కు మచాడో అనుకూలంగా మాట్లాడటం, నోబెల్ పురస్కారం గెలుచుకున్న సమయంలో కూడా ట్రంప్కు ఆ బహుమతిని ఇస్తానని ఆమె ప్రకటించడం వంటి వ్యాఖ్యలు అమెరికాపై భక్తిని చాటుకున్నాయి. ముందుగా అక్కడ తమకు అనుకూలంగా ఉన్న వారితో ఏర్పాటు చేసి తాము చెప్పినట్లు ఉండేలా చేయడమే ట్రంప్ లక్ష్యంగా కనబడుతోంది. ట్రంప్ చేతిలో మరింత నలిగిపోయే ప్రమాదం..!మరి ఇప్పుడు ఆ దేశం పరిస్థితి అధ్వానంగా మారింది. పాలకుల కారణంగా గత కొన్నేళ్లుగా వెనెజువెలా పయనం తిరోగమనంలోనే ఉంది. ఆ దేశ అధ్యక్షుడు మధురోను అమెరికా న్యూయార్క్ జైల్లో పెట్టినా అతనికి మద్దతు రాకపోగా, అక్కడ శాంతి వచ్చిందంటూ ఆ దేశానికే చెందని నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మచాడో వ్యాఖ్యానించడం ఆ దేశ పాలకుల చర్యలకు అద్దం పడుతోంది. ఇప్పుడు ట్రంప్ మద్దతుతోనే అక్కడ ప్రభుత్వం ఏర్పడితే వెనెజువెలా శాంతి వస్తుందా?, శాంతి బహుమతి గెలిచిన మచాడో దేశాధ్యక్షురాలిగా ఎన్నికతై గాడిలో పెట్టగలరా?, ఆ దేశ చమురు నిల్వలను వెనెజువెలాకే పరిమితమవుతాయా? లేక అమెరికా చేతుల్లోకి వెళ్లిపోతాయా? అన్నది కాలమే చెబుతుంది. -
నికోలస్ మదురో సత్యసాయి భక్తుడు
కరాకస్: అత్యంత సాదాసీదా నేపథ్యం. పుట్టింది ఓ సామాన్య కార్మికుని కుటుంబంలో పనిచేసింది బస్సు డ్రైవర్గా. అలాంటి స్థాయి నుంచి ఏకంగా దేశాధ్యక్ష పీఠం దాకా! చివరికి నియంతగా అప్రతిష్ట మూటగట్టుకుని ఏ పెద్ద దేశం అధ్యక్షునికీ జరగని రీతిలో పరాయి దేశ బందీగా మారిన దైన్యం. వెనెజువెలా తాజా మాజీ అధ్యక్షుడు నికొలస్ మదురో ప్రస్థానం ఆద్యంతం ఆసక్తికరంనికొలస్ మదురో 1962లో వెనెజువెలా రాజధాని కరాకాస్లో అతి సామాన్య కుటుంబంలో పుట్టారు. ఆయన బాల్యం సాధారణంగానే గడిచింది. చదువు హైసూ్కలు స్థాయి దాటలేదు. క్యూబాలో ఏడాది పాటు వామపక్ష సిద్ధాంతాల్లో శిక్షణ పొంది వచ్చారు. కార్మిక సంఘం నేత అయిన తండ్రి నుంచి నాయకత్వ వాసనలను మదురో బాగా వంటబట్టించుకున్నారు. 1992లో మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ అధికార కైవసానికి విఫలయత్నం చేసిన రోజుల్లో ఆయన బస్సు డ్రైవర్గా పని చేస్తున్నారు. జైలుపాలైన చావెజ్ విడుదల కోసం జరిగిన ఉద్యమంలో ముందుండి నడిచారు.మదురో జీవితంలో అదే కీలక మలుపు. చూస్తుండగానే చావెజ్ వామపక్ష ఎజెండాకు గట్టి మద్దతుదారుగా మారారు. ఆ క్రమంలో తండ్రిలా తానూ కార్మిక సంఘ నేత అయ్యారు. అనంతరం చావెజ్ సారథ్యంలోని యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనెజువెలాలో చేరి చకచకా కీలక స్థానానికి ఎదిగారు.సత్యసాయి బాబా భక్తుడుమదురోకు భారత్తో ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన పుట్టపర్తి సత్యసాయి బాబా భక్తుడు. సత్యసాయి బాబా బోధనలు, ఆధ్యాత్మికత ఆయనపై ప్రభావం చూపాయి. మదురో తరచుగా బాబా ఆశ్రమాన్ని సందర్శించేవారని, ఆయన బోధనలను తన జీవితంలో అనుసరించేవారని చెబుతారు. -
‘దమ్ముంటే పట్టుకోమన్న మదురో… పడకగదిలోనే పట్టుకున్న ట్రంప్’
వాషింగ్టన్: ‘.. ప్లేసు నువ్వు చెప్పినా సరే, టైమ్ నువ్వు చెప్పినా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే… దమ్ముంటే నన్ను పట్టుకో’అంటూ సినిమా స్టైల్లో సవాలు విసిరిన వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్యకు ఆదేశాలు జారీ చేశారు. తమ నివాసంలో నిద్రిస్తున్న మదురోను, ఆయన సతీమణి సిలియా ఫ్లోరెస్ను అమెరికా సైన్యం ఎత్తుకొచ్చింది. ఆ తర్వాత ప్రెస్మీట్ పెట్టి మరి మదరు ఛాలెంజ్ను గుర్తు చేసింది. వెనెజువెలా అప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. అవినీతి, కరువు, చమురు అమ్మకాలపై ఆధారపడే ఆర్థిక వ్యవస్థ ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ పరిస్థితుల్లో అమెరికా ఆంక్షలు విధించడం దేశాన్ని మరింత కుదేలు చేసింది. గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం, అంతర్జాతీయ వాణిజ్యాన్ని అడ్డుకోవడం వెనెజువెలా ప్రజలకు మరింత భారంగా మారింది.రివార్డు ప్రకటన, సవాలుఆ తర్వాత మదురోను పట్టుకునేందుకు వీలుగా సమాచారం అందిస్తే భారత కరెన్సీలో రూ.400 కోట్లు రివార్డు ఇస్తామని అమెరికా ప్రకటించింది. ఈ ప్రకటనతో మదురో మరింత రెచ్చిపోయారు. డొనాల్డ్ ట్రంప్కు బహిరంగంగా సవాలు విసిరారు. ‘పిరికోడా.. నేనిక్కడే మిరాఫ్లోర్స్ (వెనెజువెలా) అధ్యక్ష భవనంలో ఉంటా. ఆలస్యం చేయొద్దు, వచ్చి పట్టుకోండి’అంటూ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.Nicolas Maduro had his chance — until he didn’t.The Trump Admin will always defend American citizens against all threats, foreign and domestic. 🇺🇸🦅 pic.twitter.com/eov3GbBXf4— The White House (@WhiteHouse) January 4, 2026 ఆపరేషన్ అబ్సల్యూట్ రిసాల్వ్మదురోను పట్టుకునేందుకు అమెరికా ‘ఆపరేషన్ అబ్సల్యూట్ రిసాల్వ్’ పేరుతో సైనిక చర్యకు దిగింది. శనివారం తెల్లవారు జామున (స్థానిక సమయం) వెనెజువెలా రాజధాని కరాకస్ నడిబొడ్డున అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో, మందమైన స్టీల్డోర్లు, కిటికీలతో కూడిన కోటలాంటి ప్యాలెస్లో ఉన్నారు. తనను ఎవరూ ఏమీ చేయలేరని అనుకున్నారు. కానీ మా స్పెషల్ ఫోర్సెస్ పెద్ద ఎత్తున విమానాలు,ఫైటర్ జెట్లు హెలికాప్టర్లతో దాడులు చేశాయి. మెరుపు వేగంతో టియునా మిలిటరీ కాంపౌండ్ ప్యాలెస్లో పడక గదిలో నిద్రిస్తుండగా మదురో దంపతులను ఎత్తుకొచ్చాయి. చివరికి అమెరికా సైన్యం మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ను అదుపులోకి తీసుకుంది. ఈ సంఘటనను ట్రంప్ ప్రెస్మీట్లో ప్రకటించారు. మదురో చేసిన వ్యాఖ్యల వీడియోలను ప్రదర్శించి..‘సవాలు చేసిన వారిని మేం పట్టుకున్నాం’ అంటూ జాయింట్ చీఫ్స్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అయ్యాయి.భార్యపై కేసులువారిపై నార్కో-టెర్రరిజం యునైటెడ్ స్టేట్స్లోకి టన్నుల కొద్దీ కొకైన్ దిగుమతి, అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం వంటి అభియోగాలు మోపబడ్డాయి. ప్రస్తుతం మదురో దంపతులు బ్రూక్లిన్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో ఉంచారు. వారిని విచారిస్తున్నారు. మదురో చేసిన హాస్య వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే బూమరాంగ్ అయ్యాయి.‘నన్ను పట్టుకోగలిగితే పట్టుకో’ అన్న సవాలు చివరికి ఆయనను అమెరికా జైలులోకి నెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Operation Absolute Resolve. pic.twitter.com/KOtW0C0V1O— The White House (@WhiteHouse) January 3, 2026 -
బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యూఎస్ సైన్యం వెనెజువెలా రాజధాని కారకాస్పై భారీ దాడులు చేసి, అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బంధించిన సంఘటన (US attack on Venezuela) ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి వంటి సేఫ్ హెవెన్ ఆస్తుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.బంగారం, వెండి ధరలపై ప్రభావంభౌగోళిక ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారం, వెండి వైపు మళ్లుతారు. ఈ దాడి కారణంగా అనిశ్చితి పెరిగి, సేఫ్ హెవెన్ డిమాండ్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.ప్రస్తుత ధరలు (జనవరి 4 నాటికి భారత మార్కెట్లో) 24 క్యారెట్ బంగారం 10 గ్రాములకు సుమారు రూ.1,35,800 నుంచి రూ.1,37,000 వరకు (MCX ఫ్యూచర్స్ ప్రకారం) ఉంది. అలాగే 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ.1,24,500. ఇక వెండి కిలోకు సుమారు రూ.2,40,000 నుంచి రూ.2,46,000 వరకు ఉంది.మరింత పెరిగే అవకాశంనిపుణుల అంచనా ప్రకారం.. ఈ ఉద్రిక్తతలు కొనసాగితే బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్కు 4,380 నుంచి 4,500 డాలర్లకు చేరవచ్చు. భారత్లో 10 గ్రాముల ధర రూ.1,40,000 స్థాయిని తాకే అవకాశం ఉంది.వెండి ధరలు మరింత గణనీయంగా పెరిగి, అంతర్జాతీయంగా ఔన్స్కు 75-78 డాలర్లకు చేరవచ్చని అంచనా. ఇది సప్లై చైన్ డిస్టర్బెన్స్ (వెనెజువెలా ప్రాంత షిప్పింగ్ రూట్లు ప్రభావితం) కారణంగా కూడా జరుగవచ్చు. అయితే, ఈ పెరుగుదల తాత్కాలికమే కావచ్చు. ఉద్రిక్తతలు తగ్గితే ధరలు స్థిరపడవచ్చు లేదా కొద్దిగా పడిపోవచ్చు. 2026లో మొత్తంగా బంగారం ధరలు ఔన్స్కు 5,000 డాలర్లకు చేరే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
వెనిజువెలా ఘటన.. భారత్ రియాక్షన్ ఇదే..!
వెనిజువెలాలో ప్రస్తుత పరిస్థితులపై భారత ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. వెనిజువెలాలోని ఇండియా ఎంబసీ అక్కడి భారతీయులకు అన్ని విధాలుగా సహాయం చేస్తుందని తెలిపింది.శుక్రవారం వెనిజువెలాపై అమెరికా ఆకస్మిక దాడులు జరిపింది. ఆ దేశంలోని కరాకస్ నగరంపై మిసైళ్లతో విరుచుకపడింది. సైనికస్థావరాలు, జనావాసాలపై పెద్దఎత్తున దాడులు చేసింది. అనంతరం ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య సిలియా ఫ్లోరెస్నూ బందీలుగా పట్టుకొని న్యూయార్క్ తరలించింది. అయితే తాజాగా భారత్ ఈ ఘటనపై స్పందించింది. వెనిజువెలాపై దాడి చేయడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది.ఈ ఘటనపై భారత్ స్పందిస్తూ... "ప్రస్తుతం వెనిజువెలాలో జరుగుతున్న పరిస్థితులపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. అక్కడ జరుగుతున్న పరిస్తితులను భారత్ నిశితంగా గమనిస్తుంది. ఇరువర్గాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి" అని భారత్ ప్రకటన విడుదల చేసింది. వెనిజువెలాలో శాంతి, స్థిరత్వం కోసం అక్కడి ప్రజలకు భారత్ పూర్తి మద్ధతు అందిస్తుందని తెలిపింది.అదేవిధంగా వెనిజువెలా, కారకస్లోని ఇండియా ఎంబసీ అక్కడి ప్రజలతో సంప్రదింపులు జరుపుతుందని తెలిపింది. ఎవైనా సమస్యలుంటే వెంటనే అక్కడి రాయభార కార్యాలయాన్ని సంప్రదించాలని అక్కడి భారత ప్రజలకు సూచించింది. -
వెనెజువెలాకు స్వేచ్ఛ తిరిగొచ్చింది: మచాడో
నికొలస్ మదురోను అమెరికా నిర్బంధించిన తర్వాత వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో తొలిసారిగా స్పందించారు. అమెరికా హామీని నిలబెట్టుకుందన్న మచాడో.. ఆ దేశాధ్యక్షుడు నికొలస్ మదురో, ఆయన భార్యను అమెరికా సైన్యం బందీగా తీసుకెళ్లడంతో వెనెజువెలాకు స్వేచ్ఛ తిరిగి వచ్చిందంటూ ప్రకటించారు.వెనెజువెలా ప్రజలను ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టిన మచాడో.. వెనెజువెలా ప్రజలు, ఇతర దేశాల పౌరులపై జరిగిన దారుణమైన నేరాలకు నికొలస్ మదురో ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారన్నారు. ‘‘మదురోపై మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నార్కో-టెర్రరిజం ఆరోపణలు ఉన్నాయి. చర్చలతో సమస్య పరిష్కారానికి ఆయన నిరాకరించాడు. దీంతో అమెరికా తన హామీని నిలబెట్టుకుంది’ అని మచాడో ట్వీట్ చేశారు.ప్రజాస్వామ్యం కోసం కొన్నేళ్లుగా తాను చేసిన పోరాటం ఫలించిందన్న మచాడో.. శాంతియుతంగా, ప్రజస్వామ్యబద్ధంగా అధికార మార్పిడికి ప్రజలు సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. కాగా, వెనెజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ను వెనెజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. నెజువెలా అధ్యక్షుడు మదురోను బందీగా పట్టుకెళ్లాక ఆ దేశ పరిపాలనా బాధ్యతలను తామే చూసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.‘‘అధ్యక్షుడిని ఇప్పటికే బంధించాం. ఇక పరిపాలనా బాధ్యతలను మేమే చూసుకుంటాం. మా కనుసన్నల్లో ఎవరి చేతుల మీదుగా పరిపాలన జరగబోతోందనేది త్వరలోనే ప్రకటిస్తాం. నూతన ప్రభుత్వం ఏర్పడి భద్రంగా, సవ్యంగా, పారదర్శకంగా అధికార బదిలీ జరిగేదాకా పరిపాలన బాధ్యత మాదే. పరిపాలన సవ్యంగా సాగేలా చూసుకుంటాం’’ అని ట్రంప్ అన్నారు. విపక్ష నేత మరియా కొరీనా మచాడోకు పాలనా బాధ్యతలు అప్పగిస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘ఆమె సారథ్యంలో పాలన కష్టమేమో. ఆమెకు వెనెజువెలా ఇంటా, బయటా పూర్తిస్థాయి మద్దతు లేదు. అయినా ఆమె చాలా మంచి మనిషి’’ అని పేర్కొన్నారు. ‘వెనెజువెలా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రెజ్తో మాట్లాడా.. అమెరికా ఏమి అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె నాతో చెప్పారు’’అని ట్రంప్ వెల్లడించారు. -
మరో మూడు దేశాలకు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా వెనెజువెలాకు చుక్కలు చూపింది. అనంతరం.. వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అమెరికా సైన్యం బంధీగా తీసుకెళ్లింది. మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్లను అమెరికా యుద్ధ నౌక ఐవో జిమాలో న్యూయార్క్కు తరలిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అక్కడే వారికి ప్రాసిక్యూట్ చేస్తామని వెల్లడించారు. అమెరికా చట్టాల ప్రకారం మదురో దంపతులను శిక్షిస్తామని తెలిపారు. ఇదే సమయంలో లాటిన్ అమెరికా దేశాలను ట్రంప్ హెచ్చరించారు.మెక్సికో, క్యూబా, కొలంబియా సైతం మాదకద్రవ్యాలను తయారు చేస్తూ.. అక్రమంగా అమెరికాలోకి సరఫరా చేస్తున్నాయని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అనేక ముఠాలకు కూడా ఈ దేశాలు ఆశ్రయమిస్తున్నాయన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే తర్వాత వెనెజువెలా పరిస్థితే ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఆయా దేశాలలోని డ్రగ్స్ ఉత్పత్తి చేసే ప్రయోగశాలపై దాడులు చేయడానికి కూడా వెనుకాడనని ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తీరు మార్చుకోకపోవతే వారిపై తగిన చర్యలు, దాడులు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.మెక్సికోపై ఆరోపణలు: దేశం కార్టెల్ల చేతిలో నడుస్తోందని, అమెరికా జోక్యం అవసరమని అన్నారు.కొలంబియాపై ఇలా: కొకైన్ ఉత్పత్తి కేంద్రంగా ఉంది. మూడు ప్రధాని కొకైన్ ఫ్యాక్టరీలను నడుపుతున్నారు. కొకైన్ను అమెరికాలోకి సరఫరా చేస్తున్నారు. అమెరికా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.క్యూబాపై తీవ్ర విమర్శలు: విఫలమవుతున్న దేశం అని అన్నారు. క్యూబా ప్రజలను అమెరికా ఆదుకుంటుంది. అమెరికా సైనిక చర్యలు జరగవచ్చని అని సూచించారు.ఇదిలా ఉండగా.. వెనెజువెలా బాధ్యతలను తామే చూసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దాడుల తర్వాత శనివారం మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ‘‘అధ్యక్షుడిని ఇప్పటికే బంధించాం. ఇక పరిపాలనా బాధ్యతలను మేమే చూసుకుంటాం. మా కనుసన్నల్లో ఎవరి చేతుల మీదుగా పరిపాలన జరగబోతోందనేది త్వరలోనే ప్రకటిస్తాం. నూతన ప్రభుత్వం ఏర్పడి భద్రంగా, సవ్యంగా, పారదర్శకంగా అధికార బదిలీ జరిగేదాకా పరిపాలన బాధ్యత మాదే. పరిపాలన సవ్యంగా సాగేలా చూసుకుంటాం’’ అని ట్రంప్ అన్నారు.లాటిన్ అమెరికా దేశాలే టార్గెట్.. మరోవైపు.. బ్రిటిష్ పాలన నుంచి 1776లో స్వాతంత్య్రం ప్రకటించుకున్న అమెరికా.. ఆ తర్వాత కాలంలో లాటిన్ అమెరికా దేశాలపై ఉక్కు పిడికిలి బిగించింది. 1798 మొదలు తాజాగా వెనెజువెలా ఉదంతం వరకు 700లకు పైగా సందర్భాల్లో సైనిక జోక్యం చేసుకుంది. మెక్సికో, పనామా దేశాల భూభాగాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు పలు దేశాల్లో ప్రభుత్వాధి నేతలను మార్చడం, తనకు అనుకూలమైన వ్యక్తులను అధికారంలోకి తీసుకురావడానికి అమెరికా బలప్రయోగానికి పాల్పడింది. ఈ క్రమంలో లాటిన్ అమెరికా, కరీబియన్ దీవుల్లో 65వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని చరిత్రకారులు చెబుతున్నారు. అదృశ్యమైన వ్యక్తులు, లెక్కల్లో చేరని మరణాలు మరింత ఎక్కువ సంఖ్యలోనే ఉంది. -
వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్
కరాకస్: వెనెజువెలాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికా వైమానిక దాడుల అనంతరం, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరస్లను అమెరికా ప్రత్యేక దళాలు అదుపులోకి తీసుకున్నాయి. 150 యుద్ధ విమానాలతో నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్లో 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అధ్యక్షుడు నికోలస్ మదురో అందుబాటులో లేని ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో.. వెనెజువెలా సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ను వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.నార్కో టెర్రరిజం (మాదకద్రవ్యాల ఉగ్రవాదం) ఆరోపణల కింద మదురో దంపతులను న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో హాజరుపరచనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. మదురో దంపతులు తమకు లొంగిపోయారని, ప్రస్తుతం వారు అమెరికా రక్షణ విభాగం అదుపులో ఉన్నారని జనరల్ డాన్ కేన్ వెల్లడించారు.పగ్గాలు చేపట్టిన డెల్సీ రోడ్రిగ్జ్వెనెజువెలా పరిపాలనా కొనసాగింపును, సార్వభౌమాధికారాన్ని కాపాడటం కోసం ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ను వెనెజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించడం తప్పనిసరి అయ్యిందని న్యాయస్థానం పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన 56 ఏళ్ల డెల్సీ రోడ్రిగ్జ్, నికోలస్ మదురోకు అత్యంత సన్నిహితురాలు. 1969లో కారకాస్లో జన్మించిన ఈమె, విప్లవ నేత జార్జ్ ఆంటోనియో రోడ్రిగ్జ్ కుమార్తె. వృత్తిరీత్యా న్యాయవాది అయిన డెల్సీ, గత దశాబ్ద కాలంలో వెనెజువెలా రాజకీయాల్లో కీలక మహిళా నేతగా పేరొందారు.గతంలో సమాచార మంత్రిగా, విదేశాంగ మంత్రిగా సేవలందించిన డెల్సీ రోడ్రిగ్జ్ 2018 నుంచి ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తన సోదరుడు, నేషనల్ అసెంబ్లీ చీఫ్ జార్జ్ రోడ్రిగ్జ్తో కలిసి ఆమె మదురో ప్రభుత్వ విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. డెల్సీ రోడ్రిగ్జ్ కేవలం రాజకీయాల్లోనే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థపైనా పట్టు సాధించారు. 2024 ఆగస్టులో ఆమెకు చమురు శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. అమెరికా ఆంక్షల నడుమ దేశ ప్రయోజనాలను కాపాడేందుకు ఆమె ఎంతో కృషి చేశారు.ఇది కూడా చదవండి: వెనుజువెలాలో అప్పటి దాకా మా పాలనే.. ట్రంప్ ప్రకటన -
వెనుజువెలాలో అప్పటి దాకా మా పాలనే.. ట్రంప్ ప్రకటన
వాషింగ్టన్: వెనెజువెలా అధ్యక్షుడు మదురోను బందీగా పట్టుకెళ్లాక ఆ దేశ పరిపాలనా బాధ్యతలను తామే చూసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దాడుల తర్వాత శనివారం మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ‘‘అధ్యక్షుడిని ఇప్పటికే బంధించాం. ఇక పరిపాలనా బాధ్యతలను మేమే చూసుకుంటాం. మా కనుసన్నల్లో ఎవరి చేతుల మీదుగా పరిపాలన జరగబోతోందనేది త్వరలోనే ప్రకటిస్తాం. నూతన ప్రభుత్వం ఏర్పడి భద్రంగా, సవ్యంగా, పారదర్శకంగా అధికార బదిలీ జరిగేదాకా పరిపాలన బాధ్యత మాదే. పరిపాలన సవ్యంగా సాగేలా చూసుకుంటాం’’ అని ట్రంప్ అన్నారు. విపక్ష నేత మరియా కొరీనా మచాడోకు పాలనా బాధ్యతలు అప్పగిస్తారా? అని మీడియా ప్రశ్నించింది.‘‘ఆమె సారథ్యంలో పాలన కష్టమేమో. ఆమెకు వెనెజువెలా ఇంటా, బయటా పూర్తిస్థాయి మద్దతు లేదు.అయినా ఆమె చాలా మంచి మనిషి’’అని అన్నారు. ‘‘వెనెజువెలా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రెజ్తో మాట్లాడా. అమెరికా ఏమి అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె నాతో చెప్పారు’’అని ట్రంప్ వెల్లడించారు. ‘‘గగనతల, భూతల, సముద్రమార్గాల్లో వెనెజువెలాపై అమెరికా తన అమేయ సాయుధశక్తి, యుక్తులను అసాధారణ స్థాయిలో ఉపయోగించింది. వెనెజువెలా సైనికకోట అయిన కరాకస్లో శత్రు దుర్భేద్యమైన సైనికస్థావరం నుంచి విజయవంతంగా మదురోను బంధించి తీసుకొచ్చి అమెరికా న్యాయదేవత ఎదుట నిలబెట్టాం. అమెరికా చేసిన ఘనకార్యాన్ని ప్రపంచంలో గతంలో ఏ దేశమూ చేయలేకపోయింది. మా ధాటికి వెనెజువెలా సైనికశక్తి నిర్వీర్యమైంది. నిజానికి మేం రెండో దఫా దాడి చేయాలనుకున్నాం.కానీ తొలిదెబ్బకే వెనెజువెలా బలగాలు గుడ్లు తేలేశాయి. దీంతో మా రెండో దఫా దాడుల నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాం. మదురో దంపతులను సదరన్ డి్రస్టిక్ట్ ఆఫ్ న్యూయార్క్ కోర్టులో విచారిస్తాం. సముద్రమార్గంలో అమెరికాలోకి వచ్చే మాదకద్రవ్యాల్లో 97 శాతాన్ని అడ్డుకున్నాం. ఒక్కో పడవలో వచ్చే డ్రగ్స్ కారణంగా సగటున 25,000 మంది అమెరికన్లు చనిపోతున్నారు. వెనెజువెలాలోని ముడిచమురు కుంభస్థలాన్ని అమెరికా కొట్టబోతోంది. అమెరికా కంపెనీలు అక్కడికెళ్లి వ్యాపారం మొదలెట్టి చమురు తవ్వకం, అమ్మకాలతో వెనెజువెలా ‘చమురు మౌలికవసతి’ని పునరుద్ధరిస్తాయి. చమురు అమ్మకాలతో వచ్చిన సంపదతో వెనెజువెలాను బాగుచేస్తాయి. అమెరికా భాగస్వామ్యంతో వెనెజువెలా వాసులు ఇకపై ధనవంతులుగా, స్వతంత్రంగా, సురక్షితంగా జీవిస్తారు. అమెరికా పాలనలో వెనెజువెలా ఎంతో సంతోషంగా ఉండబోతోంది. వాళ్ల కష్టాలన్నీ తొలగిపోనున్నాయి. అమెరికాలోకి ప్రమాదకర డ్రగ్స్ను సరఫరాచేసే మదురో నిజానికి ఒక నియంత. డీ లోస్ సోలెస్ డ్రగ్స్ ముఠాకు మదురోనే పెద్ద. మదురోను బంధించాక వెనెజువెలా ప్రజలు స్వేచ్ఛాజీవులయ్యారు. మా చట్టాల ప్రకారం శిక్షిస్తాం..మదురోను తమ అదుపులోకి తీసుకున్నాక అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండీ శనివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘డ్రగ్స్ మాఫియాతో మదురో దంపతులకూ సంబంధం ఉంది. అందుకే వాళ్లను బంధించి తీసుకొచ్చాం. న్యూయార్క్ చట్టాల ప్రకారం అమెరికా చట్ట నిబంధనల మేరకే అమెరికా గడ్డపై మదురో దంపతులకు శిక్ష పడేలా చేస్తాం’’ అని పామ్ అన్నారు. ఈ మేరకు అమెరికా న్యాయ విభాగం శనివారం మదురో దంపతులపై నేరారోపణలు చేసింది. ‘‘అవినీతి సర్కార్ దశాబ్దాల తరబడి అధికార దుర్వినియోగానికి పాల్పడింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో మునిగిపోయింది. ప్రపంచంలో అత్యంత ప్రమాదకర మాదకద్రవ్యాల రవాణా ముఠాలతో స్వయంగా దేశ ప్రభుత్వం చేతులు కలిపింది’’ అని యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ పేర్కొంది. మరోవైపు సముద్రమార్గంలో అమెరికాలోకి మాదకద్రవ్యాలను తరలిస్తున్న నౌకలపై దాడులు పెంచామని శుక్రవారం నాటికి మొత్తంగా 35 నౌకలను నాశనం చేశామని.. సిబ్బంది సహా అందులోని సాయుధులను మొత్తంగా 115 మందిని అంతమొందించామని అమెరికా శనివారం ప్రకటించింది. కరాకస్లో మొదలైన ఆందోళనలు దేశాధ్యక్షుడిని బందీగా అమెరికా పట్టుకెళ్లడంపై కరాకస్ సిటీలో పౌరులు ఆందోళనకు దిగారు. అధికార పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో కార్యకర్తలు రోడ్లపైకి చేరుకొని నిరసన మొదలెట్టారు. వెనెజువెలాపై దాడి నేపథ్యంలో సమీప దేశమైన కొలంబియా అప్రమత్తమైంది. తమ దేశంలోకి వచ్చి పడే వెనెజువెలావాసులను అడ్డుకునేందుకు సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. ఈ మేరకు కొలంబియా అధ్యక్షుడు గస్తోవ్ పెట్రో జాతీయ భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. తరచూ అమెరికాపై, ట్రంప్పై విమర్శలు గుప్పించే గస్తోవ్ తమ దేశం మీదా దాడి జరగొచ్చన్న అంచనాతో సైన్యాన్ని అప్రమత్తం చేశారు. అమెరికా సైతం వెనెజువెలాలో ఉన్న తమ పౌరుల రక్షణ కోసం ఒక అడ్వైజరీని జారీ చేసింది. ‘‘అమెరికన్లు ఎవరైనా వెనెజువెలాలో ఉంటే తక్షణం వెనక్కి వచ్చేయాలి. ఆ దేశం వైపు ఎవరూ వెళ్లొద్దు’’ అని పేర్కొంది. -
వెనెజువెలాపై దాడి.. ట్రంప్కు చైనా హెచ్చరిక
బీజింగ్: వెనెజువెలాపై అమెరికా దాడులను చైనా తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘అమెరికా దుస్సాహసానికి తెగబడింది. సార్వభౌమ దేశమైన వెనెజువెలాపై సైనికశక్తిని దుర్వినియోగం చేయడం నేరం. ఇది అంతర్జాతీయ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుంది.అలాగే, అమెరికా పాల్పడే ఇలాంటి చర్యలు లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతాల్లో శాంతిభద్రతలకు గొడ్డలిపెట్టుగా తయారవుతున్నాయి. మేం ఈ దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అంతర్జాతీయ న్యాయ నిబంధనలను అమెరికా తూచా తప్పకుండా పాటించాల్సిందే. ఐరాస నిబంధనలు, చట్టాలు, చార్టర్కు విలువ ఇచ్చి తదనుగుణంగా నడుచుకోవాల్సిందే. తమతో విబేధించే దేశాల సార్వభౌమత్వం, భద్రతను ముప్పువాటిల్లేలా ప్రవర్తించే పెడపోకడలకు అమెరికా స్వస్తిపలకాలి’’ అని చైనా ఘాటు వ్యాఖ్యలు చేసింది. మరోవైపు.. వెనెజువెలాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలను ప్రపంచదేశాలు ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించాయి. సార్వభౌమదేశంపై ఏకపక్షంగా దాడులు చేసే అధికారం అమెరికాకు ఎవరిచ్చారని నిలదీశాయి. దాడులపై ఐక్యరాజ్యసమితి సైతం తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఇదిలా ఉండగా.. మదురో శకానికి తెర పడటం ఖాయమైన నేపథ్యంలో అమెరికా ఆశీస్సులున్న మచాడోయే అధ్యక్ష పీఠం ఎక్కడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే విపక్ష నేత మచాడోకు అమెరికా మొదటినుంచీ దన్నుగా నిలుస్తూ వస్తోంది. తన నోబెల్ బహుమానాన్ని ట్రంప్కు అంకితమిస్తున్నట్టు ఆమె చేసిన ప్రకటనపై ఆశ్చర్యం వ్యక్తమైంది. అంతా భావిస్తున్నట్టుగా అమెరికా ఆశీస్సులతో మచాడో గద్దెనెక్కినా అగ్రరాజ్యం పడగ నీడన దేశవాసుల ప్రజాస్వామిక ఆకాంక్షలను నెరవేర్చడం, దేశ పరిస్థితులను గాడిన పెట్టడం ఆమెకు కత్తిమీద సామే కానుంది. -
వెనెజువెలాపై అమెరికా భీకర దాడులు... దేశాధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ను అదుపులోకి తీసుకొని న్యూయార్క్కు తరలించిన అమెరికా సేనలు
-
మదురో దంపతుల.. యుద్ధనౌకలో న్యూయార్క్కు తరలింపు
కరాకస్: ఎన్నో యుద్ధాలను ఆపానంటూ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడనని జబ్బలు చరుచుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందుకు పూర్తి భిన్నంగా సమీప దేశంపై ఏకపక్షంగా దాడి చేసి ఏకంగా దేశాధినేతను బందీగా పట్టుకొని ప్రపంచ దేశాలను విస్మయపరిచారు. అమెరికాలోకి మాదకద్రవ్యాల సరఫరాను హోరెత్తించి పరోక్షంగా హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపిస్తూ వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో నివాసంపై శుక్రవారం అర్ధరాత్రి దాటాక అమెరికా సైన్యం మెరుపుదాడులు చేసింది. మదురోతోపాటు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్నూ బందీలుగా పట్టుకుంది. కరాకస్ సిటీలోని ఫోర్ట్ టియూనా సైనిక స్థావరంలోని సొంతింట్లో ఉన్న మదురో దంపతులను అమెరికా సైన్యం బందీలుగా పట్టుకున్నట్లు వెనెజువెలా అధికార పార్టీ నేత నహూమ్ ఫెర్నాండెజ్ వెల్లడించారు. అంతకుముందు కరాకస్ సిటీపై అమెరికా యుద్ధవిమానాలు బాంబుల వర్షం కురిపించాయి. భారీ స్థాయిలో క్షిపణులు, రాకెట్లను ప్రయోగించి వెనెజువెలా సైనిక స్థావరాలు, జనావాసాలను భూస్థాపితం చేశాయి. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోయారని, పెద్ద సంఖ్యలో జనం గాయాలపాలయ్యారని వార్తలొచ్చాయి. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న కరాకస్వాసులు పేలుళ్ల కారణంగా నిద్రలోనే కన్నుమూశారు. ఒక్కసారిగా బాంబులు పేలుతున్న శబ్దాలు, నేలమట్టమవుతున్న భవనాలతో జనం ప్రాణభయంతో పరుగులుతీశారు. సైనిక స్థావరాలు, పలు భవనాలు అగ్నికి ఆహుతవుతున్న, దట్టంగా పొగలు వెలువుడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దాడుల ధాటికి ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి గాఢాందకారం అలుముకుంది. ‘‘అర్ధరాత్రి పుట్టినరోజు పార్టీకి వెళ్లి తిరిగొస్తూ బంధువులతో కలిసి రోడ్డుపై నడుస్తుంటే హఠాత్తుగా బాంబుల వర్షం కురిసింది. అవి పేలిన ధాటికి భూమి కూడా కంపించింది. ప్రతి ఒక్క వస్తువు కదిలిపోయింది. మిస్సైళ్లు, మంటలు, విమాన శబ్దాలతో మా ప్రాంతం ఒక్కసారిగా యుద్దభూమిగా మారిపోయింది’’అని 21 ఏళ్ల కార్మీకురాలు కార్మెన్ హిదాల్గో ఏడుస్తూ చెప్పారు. మాదకద్రవ్యాల రవాణా కట్టడికి, ద్వైపాక్షిక చర్చలుజరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మదురో ప్రభుత్వం ప్రకటించిన కొద్ది గంటలకే అమెరికా దాడులు చేయడం గమనార్హం. సైనిక ఆపరేషన్ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా అమెరికా నుంచి వీక్షిస్తున్న ట్రంప్ యుద్ధనౌకలో తరలిస్తున్నాం: వెనెజువెలాపై సైనిక దాడి విష యాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా తన సొంత సా మాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ప్రకటించారు. ‘‘వెనెజువెలాపై అమెరికా అతిపెద్ద దాడిని విజయవంతంగా పూర్తిచేసింది. వాళ్ల అధ్యక్షుడు మదురో, ఆయన సతీమణిని బంధించి వెనెజులా నుంచి దూరంగా వేరే దేశానికి మా ‘అయోమా జిమా’ యుద్ధ నౌకలో తరలిస్తున్నాం. నౌక న్యూయార్క్కు చేరుకోబోతోంది. వాళ్లను న్యూయార్క్ చట్టాల ప్రకారం శిక్షిస్తాం. దాడి సందర్భంగా అమెరికా సైనికులు సైతం గాయపడ్డారు. కానీ ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఒక హెలికాప్టర్ బాగా దెబ్బతింది. అయినాసరే మా సైనికులు అందరూ క్షేమంగా తిరిగొచ్చారు. దాడులు చేయక తప్పలేదు. ఎందుకంటే ఇది యుద్ధం’’ అని ట్రంప్ పెట్టిన పోస్ట్ను అమెరికా శ్వేతసౌధం తన ‘ఎక్స్’ ఖాతాలో జతచేసింది. ‘‘మదురోను అదుపులోకి తీసుకున్నాక వెనెజువెలాను అలా వదిలేయలేం. మదురో మాకు ముఖ్యం కాదు. ఆ దేశం నుంచి డ్రగ్స్ ఆగడమే మాకు కావాలి. డ్రగ్స్ ముఠాలను కట్టడిచేసే దమ్మున్న ప్రభుత్వం అక్కడ నెలకొనాలి. ఇంకెవరో అనామకుడు పరిపాలిస్తామంటూ ఊరుకునేది లేదు. అక్కడ ఎవరు పరిపాలించాలనేదే మేం నిర్ణయిస్తాం. దాడులపై అమెరికా కాంగ్రెస్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదన్న డెమొక్రాట్ల వాదనలో పసలేదు. డెమొక్రాట్లు అసమర్థులు, తెలివితక్కువ వాళ్లు. నిజానికి గొప్ప పని చేశావని నన్ను పొగడాలి. కానీ చట్టవ్యతిరేకమని తిడుతున్నారు. ఏళ్ల తరబడి ఇవే మాటలు వినీవినీ చెవుడు వచ్చేస్తోంది’’ అని తర్వాత ఫాక్స్న్యూస్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఎగతాళిగా మాట్లాడారు. ఒక పరాయిదేశంపై దాడి చేసి ఏకంగా అగ్రనేతను అపహరిచడం అమెరికా చరిత్రలో గత 4 దశాబ్దాల్లో ఇదే తొలిసారి. చివరిసారిగా 36 ఏళ్ల క్రితం పనామా దేశ నాటి సైనిక పాలకుడు ఆంటోనియో నోరిగాను అమెరికా సైన్యం దాడిచేసి పట్టుకొచ్చింది. ‘‘మెక్సికో సైతం డ్రగ్స్ భరతం పడితే మంచిది. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్బమ్ చేతులు ముడుచుకుని కూర్చుంటే మెక్సికో మీద సైనిక చర్యకు అమెరికా రంగంలోకి దిగక తప్పదేమో’’అని ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు. మదురో దంపతుల జాడ తెలీదు..: అమెరికా వైమానిక దాడుల తర్వాత మదురో దంపతుల జాడ తెలియకుండా పోయిందని వెనెజువెలా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రెజ్ శనివారం ఉదయం ప్రకటించారు. ‘‘శత్రుదేశం దాడుల తర్వాత మదురో, ఫ్లోరెస్ల జాడ తెలియడం లేదు. వాళ్ల క్షేమ సమాచారం అందుబాటులో లేదు. వాళ్ల యోగక్షేమాల వివరాలను అమెరికా తక్షణం బయటపెట్టాలి. దేశంపై దాడుల నేపథ్యంలో సాయుధ బలగాలన్నింటినీ రంగంలోకి దింపుతున్నాం. సైనిక చర్యకు దీటుగా స్పందిస్తాం. ప్రజలు సైతం దేశాధ్యక్షుడి కిడ్నాప్ను నిరసిస్తూ వీధుల్లోకి వచ్చి నిరసన తెలపాలి’’ అని రోడ్రెజ్ పిలుపునిచ్చారు. అత్యయిక విదేశీ విధ్వంసక స్థితిని రోడ్రెజ్ ప్రకటించారు.పడక గది నుంచి బరబరా లాక్కెళ్లి..వాషింగ్టన్: కరాకస్లోని కట్టుదిట్టమైన భద్రత ఉన్న సైనికస్థావరంలోని ఇంట్లో అర్ధరాత్రి పడగదిలో నిద్రిస్తున్న మదురో దంపతులను అమెరికా సైనికులు మెరుపువేగంతో బంధించి హెలికాప్టర్లోకి ఎక్కించి అక్కడి నుంచి యుద్ధనౌకలోకి తరలించామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్ వీకెండ్ కార్యక్రమంలో ట్రంప్ ఈ వివరాలను వెల్లడించారు. ‘‘ అమెరికా సైన్యంలోని డెల్టా ఫోర్స్ విభాగం నేతృత్వంలో ఈ ఆపరేషన్ మొత్తం జరిగింది. అధ్యక్ష ప్రాసాదాన్ని సైనికబలగాలతో శత్రుదుర్బేధ్య కోటలా మార్చేశారు. అలాంటి చోట కూడా మా బలగాలు అద్భుతంగా అరగంటలో పని ముగించాయి’’ అని అన్నారు. ఆపరేషన్ పూర్తి వివరాలనుఅమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డ్యాన్ కెయిన్ వెల్లడించారు. ‘‘ ఈ ఆపరేషన్కు అబ్సల్యూట్ రిసాల్వ్ అని పేరుపెట్టాం. ఏదైనా తేడా జరిగి భారీ ప్రతిదాడి చేయాల్సి వస్తే స్పందించేందుకు వీలుగా పశ్చిమార్థగోళంలో ఎఫ్–18, ఎఫ్–22, ఎఫ్–35 యుద్ధ విమానాలు సహా బీ–1 బాంబర్లు, డ్రోన్లను మొహరించాం. ట్రంప్ ఆదేశించగానే శుక్రవారం రాత్రి 10.46 గంటలకు ఆపరేషన్ మొదలెట్టాం. అర్ధరాత్రి దాటాక సరిగ్గా 1.01 గంటలకు మదురో ఉంటున్న అధికారభవనం ప్రాంగణంలోకి అమెరికా డెల్టా ఫోర్స్ సైనికులు అడుగుపెట్టారు. మెరికల్లాంటి సైనికులు ఇందులో పాల్గొన్నారు. సరైన సమయం కోసం వేచి ఉండి తర్వాత మదురో ఇంట్లోకి చొరబడి బెడ్రూమ్లో ఉన్న దంపతులను బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. ఈలోపే వెనెజులా సైనికులు మాపైదాడి చేశారు. మా హెలికాప్టర్ ఒకటి దారుణంగా దెబ్బతింది. అయినాసరే వేగంగా స్పందించి వాళ్ల సైనికులను నిలువరించాం. 3.29 గంటలకు మా హెలికాప్టర్లోకి మదురో దంపతులను ఎక్కించాం. వెంటనే హెలికాప్టర్ యుద్దనౌక వైపు మెరుపువేగంతో వెళ్లిపోయింది. అంతా అనుకున్నట్లే జరిగింది. చాలాకాలం క్రితమే ఇందుకు ప్లాన్ చేశాం. మళ్లీ మళ్లీ రిహార్సల్స్ చేశాం. చివరకు విజయం సాధించాం’’ అని ఆయన అన్నారు. ఆలోపే పట్టేసుకున్నాం: ‘‘మదురో అధికార భవనంలో ఒక సురక్షిత గదిని ఏర్పాటు చేసుకున్నారు. అందులోకి వెళ్తే పట్టుకోవడం అసాధ్యం. అది అత్యంత కఠినమైన ఉక్కు గోడలతో తయారుచేసి ఉంటుంది. అందులోకి ఆయన వెళ్లేలోపే పట్టేసుకున్నాం. అతను రోజూ ఏం చేస్తాడు? ఎన్ని గంటలకు నిద్రపోతాడు? ఏం తింటారు? ఆయనకు పెంపుడు జంతువులు ఏమేం ఉన్నాయి? ఆయన ఎలాంటి బట్టలేసుకుంటాడు? ఇలా ప్రతీది మాకు తెలుసు’’అని ట్రంప్ చెప్పారు. -
డెల్టా ఫోర్స్దే కీలక పాత్ర
వాషింగ్టన్: వెనెజువెలాపై దాడుల్లో అమెరికా డెల్టా ఫోర్స్ కీలక పాత్ర పోషించింది. ఇది అమెరికా సైన్యంలో అత్యున్నత ప్రత్యేక మిషన్ యూనిట్. 1977లో డెలాŠట్ దళాన్ని స్థాపించారు. ఉత్తర కరోలినాలోని ఫోర్ట్ బ్రాగ్ కేంద్రంగా పనిచేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సమర్థత కలిగిన, రహస్య మిలటరీ యూనిట్గా డెల్టా ఫోర్స్కు పేరుంది. యూఎస్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ ఆధ్వర్యంలో కార్యకలాపాలు సాగిస్తోంది. జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్కు జవాబుదారీగా ఉంటోంది. అమెరికా సైనికాధికారి కల్నల్ చార్లెస్ బెక్విత్ బ్రిటన్కు చెందిన 22వ స్పెషల్ ఎయిర్ సరీ్వసెస్ రెజిమెంట్ను స్ఫూర్తిగా తీసుకొని డెల్టా దళాన్ని స్థాపించారు. ఈ దళం డెల్టా అని కాకుండా కొన్ని సందర్భాల్లో వేర్వేరు పేర్లతో ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఉగ్రవాదులపై ఆపరేషన్ల కోసం.. డెల్టా ఫోర్స్కు కొన్ని ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. అధిక రిస్్కతో కూడిన భారీ ఆపరేషన్లకు ఈ దళాన్ని రంగంలోకి దించుతారు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు, బందీలను విడిపించడం, ఉగ్రవాద ముప్పును నిర్మూలించడం, ఉగ్రవాదులను ప్రాణాలతో అదుపులోకి తీసుకోవడం వంటివి ప్రధాన బాధ్యతలు. ఉగ్రవాదులపై పోరాటం కోసం సృష్టించిన దళాన్ని వెనెజువెలాలో సైనిక ఆపరేషన్కు ఉపయోగించడం గమనార్హం. సంప్రదాయేతర యుద్ధ రీతుల్లోనూ ఈ దళానికి శిక్షణ ఇచ్చారు. ప్రత్యేక సందర్భాల్లో అత్యున్నత పదవుల్లో ఉన్నవారికి రక్షణ కల్పించాల్సి ఉంటుంది. విమానాలు, నౌకలు, రైళ్లు, ఇతర వాహనాల్లో ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేయడంలో డెల్టా దళానికి గుర్తింపు ఉంది. అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా పని చేస్తుంది. డెల్టా ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్ల గురించి బయటకు తెలిసింది చాలా తక్కువ. చాలావరకు ఆపరేషన్లు రహస్యంగానే పూర్తయిపోయాయి. 2001లో ఆపరేషన్స్ ప్రైమ్ చాన్స్ను ఈ దళం నిర్వహించింది. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కోసం వేట సాగించింది. 2019లో ఐసిస్ ఉగ్రవాది అబూ బాకర్ అల్–బగ్దానీని అంతం చేసింది. డెల్టా ఫోర్స్లో చేరడం అంత సులభం కాదు. యూఎస్ ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్, 75వ రేంజర్ రెజిమెంట్ నుంచి జవాన్లను ఈ దళంలోకి తీసుకుంటారు. అందుకోసం రకరకాల పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తి సమర్థత, అంకితభావం ఉన్నవారికే డెల్టా దళంలో ప్రవేశం లభిస్తుంది. -
తప్పుడు సందేశం
న్యూఢిల్లీ: వెనెజువెలాపై అమెరికా మెరుపు దాడికి దిగి అధ్యక్షుడు నికొలస్ మదురోను నిర్బంధించి విచారణ పేరిట తమ దేశానికి తరలించిన తీరును అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల నిపుణులు పూర్తిగా తప్పుబడుతున్నారు. ‘‘ఇది అస్సలు సరికాదు. అత్యంత దారుణమైన, అంతకుమించిన ప్రమాదకరమైన చర్య. ప్రపంచానికే తప్పుడు సంకేతాలు పంపే ఉదంతం. ఒక దేశం మరో సార్వభౌమ దేశ రాజధానిపై ఉరుముల్లేని పిడుగులా విరుచుకుపడి దేశాధినేతను భార్యాసమేతంగా ఎత్తుకెళ్లిపోవడమా? దీన్నసలు ఎలాంటి నీతిగా అర్థం చేసుకోవాలి? అమెరికాను చూసి స్ఫూర్తి పొంది ఇతర శక్తిమంతమైన దేశాలు తమ ఇరుగు పొరుగు ప్రత్యర్థి దేశాల్లో కంట్లో నలుసుగా మారిన అధినేతలను అడ్డు తప్పించుకునేందుకు ఈ మార్గాన్నే అందిపుచ్చుకునే ప్రమాదముంది. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా కల్లోల పరిస్థితులు చెలరేగుతాయి’’అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జరిగింది ఇప్పటికీ నమ్మశక్యంగా లేదంటూ భారత మాజీ దౌత్యవేత్త, వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు రాజీవ్ డోగ్రా విస్మయం వ్యక్తం చేశారు. ‘‘అంతర్జాతీయ చట్టాలు, సంప్రదాయాలు, పద్ధతులను పూర్తిగా తుంగలో తొక్కుతూ పొరుగు దేశాధినేతను ఎత్తుకెళ్లిపోవడమా? అమెరికా చర్య ఎవరికీ ఇంకా పూర్తిగా జీర్ణం కావడం లేదు. ఇటువంటివి బహుశా ఓ వందేళ్ల క్రితం దాకా రాజుల జమానాలో జరిగి ఉంటాయేమో! ఇటీవలి కాలంలో మాత్రం కచ్చితంగా కనీవినీ ఎరుగని సంఘటనే ఇది’’అని అన్నారాయన. మదురోను బందీకృతుణ్ణి చేసే క్రమంలో ట్రంప్ అన్ని సంప్రదాయాలను, చట్టాలనూ అడ్డంగా కాలదన్నారంటూ డోగ్రా దుయ్యబట్టారు. ‘‘మదురో పట్ల వెనెజువెలావాసులకు ఎలాంటి అభిప్రాయముందన్నది పూర్తిగా వారి అంతర్గత వ్యవహారం. ఆ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సింది అక్కడి ప్రజలే. కానీ తనకు ఇలాంటివేవీ అస్సలు పట్టవని ట్రంప్ ఇప్పటికే చాలాసార్లు, చాలా విషయాల్లో రుజువు చేసుకున్నారు. ముఖ్యంగా రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ తన ఏకపక్ష పోకడలతో ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తున్నారు’’అని ఆయన విమర్శించారు. ఇంత దారుణంగా వ్యవహరించేందుకు మదురో కనీసం సైనిక నియంత కూడా కాదని మరో వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు బ్రిగేడియర్ రాహుల్ కె.¿ోంస్లే గుర్తు చేశారు. ట్రంప్ తన మతిలేని దూకుడును సమర్థించుకోవడం కూడా కష్టమేనని అభిప్రాయపడ్డారు. -
డ్రైవర్ నుంచి అధ్యక్ష పీఠం దాకా
అత్యంత సాదాసీదా నేపథ్యం. పుట్టింది ఓ సామాన్య కార్మికుని కుటుంబంలో పనిచేసింది బస్సు డ్రైవర్గా. అలాంటి స్థాయి నుంచి ఏకంగా దేశాధ్యక్ష పీఠం దాకా! చివరికి నియంతగా అప్రతిష్ట మూటగట్టుకుని ఏ పెద్ద దేశం అధ్యక్షునికీ జరగని రీతిలో పరాయి దేశ బందీగా మారిన దైన్యం. వెనెజువెలా తాజా మాజీ అధ్యక్షుడు నికొలస్ మదురో ప్రస్థానం ఆద్యంతం ఆసక్తికరం... నికొలస్ మదురో 1962లో వెనెజువెలా రాజధాని కరాకాస్లో అతి సామాన్య కుటుంబంలో పుట్టారు. ఆయన బాల్యం సాధారణంగానే గడిచింది. చదువు హైసూ్కలు స్థాయి దాటలేదు. క్యూబాలో ఏడాది పాటు వామపక్ష సిద్ధాంతాల్లో శిక్షణ పొంది వచ్చారు. కార్మిక సంఘం నేత అయిన తండ్రి నుంచి నాయకత్వ వాసనలను మదురో బాగా వంటబట్టించుకున్నారు. 1992లో మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ అధికార కైవసానికి విఫలయత్నం చేసిన రోజుల్లో ఆయన బస్సు డ్రైవర్గా పని చేస్తున్నారు. జైలుపాలైన చావెజ్ విడుదల కోసం జరిగిన ఉద్యమంలో ముందుండి నడిచారు. మదురో జీవితంలో అదే కీలక మలుపు. చూస్తుండగానే చావెజ్ వామపక్ష ఎజెండాకు గట్టి మద్దతుదారుగా మారారు. ఆ క్రమంలో తండ్రిలా తానూ కార్మిక సంఘ నేత అయ్యారు. అనంతరం చావెజ్ సారథ్యంలోని యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనెజువెలాలో చేరి చకచకా కీలక స్థానానికి ఎదిగారు. 1998లో చావెజ్తో పాటు తానూ జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత అసెంబ్లీ అధ్యక్షుడయ్యారు. చావెజ్ అధ్యక్షుడయ్యాక ఆయన కేబినెట్లో విదేశాంగ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రపంచమంతా కలియదిరిగి అంతర్జాతీయంగా వెనెజువెలాకు మద్దతు పెంచడంలో మదురో కీలకపాత్ర పోషించారు. అమెరికా కర్రపెత్తనాన్ని, ఆంక్షలను ఎదుర్కొనేందుకు లాటిన్ అమెరికా–కరీబియన్ కూటమి ఏర్పాటు చేశారు. ఈ దశలోనే చావెజ్కు అత్యంత నమ్మకస్తునిగా మారారు. ఫలితంగా 2012లో వెనెజువెలా ఉపాధ్యక్షుడయ్యారు. మదురోను తన రాజకీయ వారసునిగా చావెజ్ ప్రకటించారు. 2013లో అనారోగ్యంతో చావెజ్ మరణించడంతో మదురో తొలుత తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలుపొంది అధ్యక్ష పీఠాన్ని పదిలపరుచుకున్నారు. నాటినుంచి పాలకునిగా కొనసాగుతూనే ఉన్నారు. అయితే ఆ క్రమంలో ప్రతి ఎన్నికల్లోనూ విపరీతమైన అక్రమాలకు పాల్పడ్డారన్న అపకీర్తి మూటగట్టుకున్నారు. 2013 నాటి తొలి ఎన్నికల నుంచే ఆయనపై ఈ ఆరోపణలున్నాయి. చివరకు ఇలా నేలకు! చావెజ్ మరణానంతరం అధ్యక్షుడు కాగలిగినా పరిస్థితులన్నీ క్రమంగా మదురోకు ప్రతికూలించసాగాయి. అసలు ఆయన అధ్యక్ష జీవితమంతా వివాదాలు, సమస్యలమయంగానే సాగింది. ముఖ్యంగా వెనెజువెలా ఆర్థిక పతనం ఆయనకు పెద్ద సవాలుగా మారింది. అమెరికా ఆంక్షలకు తోడు అంతర్జాతీయ చమురు ధరలు పతనం కావడంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. ఆర్థిక సంస్కరణలు, భారీగా నోట్ల ప్రింటింగ్ వంటివి మరిన్ని సమస్యలకే దారితీశాయి. ద్రవ్యోల్బణం చుక్కలనంటింది. తిండి గింజలు కూడా లేక జనం అలమటించారు. దాంతో లక్షలాదిగా పొట్ట చేతపట్టుకుని పొరుగు లాటిన్ అమెరికా దేశాలకు వలసపోయారు. ఈ క్రమంలో 2014, 2017ల్లో వెనెజువెలా చరిత్రలోనే అతి పెద్ద ఆందోళనలు, నిరసనలు, ప్రదర్శనలు జరిగాయి. వాటన్నింటినీ ఉక్కుపాదంతో అణచేసి మదురో మరింత అప్రతిష్ట మూటగట్టుకున్నారు. నిరసనలన్న మాటే విని్పంచకుండా లక్షలాది మందిని జైళ్లలో కుక్కేశారు. రాజకీయ ప్రత్యర్థులను తీవ్రాతి తీవ్రంగా హింసించారు. మానవ హక్కుల హననానికి దేశాన్ని మారుపేరుగా మార్చేశారు. ఇవన్నీ చాలవన్నట్టు 2020లో అమెరికా మదురోను అవినీతి ఆరోపణల్లో దోషిగా తేలి్చంది. ఇన్ని ప్రతికూలతల మధ్యే 2024 ఎన్నికల్లో కిందామీదా పడి వరుసగా మూడోసారి అధ్యక్షునిగా ఎన్నికయ్యారాయన. కానీ ఆ క్రమంలో కనీవినీ ఎరగని అక్రమాలకు పాల్పడి అభాసుపాలయ్యారు. ప్రత్యర్థి ఎడ్మండో గొంజాలెజ్కు చాలాచోట్ల ఏకంగా 85 శాతం కంటే ఎక్కువ ఓట్లు పోలైనట్టు తేలినా మదురో మాత్రం తానే గెలిచానని ప్రకటించుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులను వెంటాడి వేటాడే ప్రయత్నం చేశారు. దాంతో గొంజాలెజ్తో పాటు జనాదరణ ఉన్న విపక్ష నేత మరియా కొరీనా మచాడో వంటివారు అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. 2018లో సైనిక పరేడ్లో ప్రసంగిస్తుండగా డ్రోన్ల సాయంతో జరిగిన హత్యాయత్నం నుంచి త్రుటిలో బయటపడ్డారు. చివరికి ఓ పెద్ద దేశాధ్యక్షుడెవరూ ఇప్పటిదాకా ఎదుర్కోని దయనీయ పరిస్థితుల్లో అమెరికా సైన్యానికి భార్యాసమేతంగా పట్టుబడి నిస్సహాయునిగా దేశం వీడారు.భర్తకు చేదోడువాదోడుగా... రాజకీయాల్లో ఫ్లోరెస్ ఉత్థాన పతనాలు కరాకస్: సిలియా ఫ్లోరెస్. అప్రతిష్టాకర రీతిలో అమెరికాకు పట్టుబడ్డ వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురో భార్య. రాజకీయాల్లో భర్త అడుగుజాడల్లోనే నడిచారామె. మదురో మాదిరిగానే ఆమెదీ అతి సాధారణ నేపథ్యమే. వాయవ్య వెనెజువెలాలో టినాక్విలో అనే చిన్న పట్టణంలో 1956లో ఒక పేద కుటుంబంలో పుట్టారు ఫ్లోరెస్. జరుగుబాటు కోసం ఆమె కుటుంబం కరాకస్కు మారింది. అక్కడే ఆమె న్యాయ పట్టా పుచ్చుకున్నారు. పోలీస్ స్టేషన్లో పార్ట్టైం జాబ్ చేసే క్రమంలో ఓ డిటెక్టివ్ను పెళ్లాడి ముగ్గురు పిల్లల్ని కన్నారు. మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ వ్యక్తిగత లాయర్గా మారడం ఆమె జీవితంలో కీలక మలుపు. అక్కడినుంచీ రాజకీయంగా క్రమంగా ఒక్కో మెట్టూ ఎక్కారు. 2000లో తొలిసారి నేషనల్ అసెంబ్లీకి ఎన్నికైన ఫ్లోరెస్, 2007కల్లా దాని ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. ఆ క్రమంలో మదురోతో జరిగిన పరిచయం కాస్తా ప్రణయంగా మారింది. రెండు దశాబ్దాల సన్నిహిత జీవితం అనంతరం 2013లో ఇద్దరూ తమ జీవిత భాగస్వాములకు విడాకులిచ్చి ఒకటయ్యారు. మదురో అధ్యక్షుడయ్యాక ఆయన నిర్ణయాలన్నింట్లోనూ ఫ్లోరెస్ కీలకపాత్ర పోషిస్తూ వస్తున్నారు. నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ చీఫ్గా బలమైన అధికార కేంద్రంగా వ్యవహరించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
పంతం నెగ్గించుకున్న ట్రంప్
ఒక అగ్రరాజ్యపు దురాశ. సొంత పాలకుల నియంతృత్వ, పెడపోకడలు. ఫలితంగా దశాబ్దాలుగా నలిగిపోతూ సాగుతున్న వెనెజువెలా ప్రస్థానం కాస్తా, ఏకంగా అధ్యక్షుడు మదురోను అమెరికా అదుపులోకి తీసుకోవడంతో తాజాగా మరో మలుపు తిరిగింది. అత్యాశ, అధికార లాలస నడుమ జరిగిన ఆరాట పోరాటాల్లో అక్కడి ప్రజల స్వేచ్ఛాకాంక్షలు మరోసారి సమాధయ్యాయి. ట్రంప్ విపరీత మనస్తత్వం దృష్ట్యా ఇకపై వెనెజువెలా భవితవ్యం ఎలా ఉండనుందన్నది ఎవరి అంచనాలకూ అందని పరిస్థితి... ఆది నుంచీ అంతంతే... అమెరికాతో వెనెజువెలా సంబంధాలు ముందునుంచీ ఉప్పూ నిప్పుగానే సాగుతూ వస్తున్నాయి. వెనెజువెలాలోని అపార చమురు నిల్వలపై అమెరికాకు తొలి నుంచీ కన్నుంది. అగ్రరాజ్యపు చమురు దోపిడీని 1999లో వెనెజువెలా అధ్యక్షుడైన హ్యూగో చావెజ్ అడ్డుకోవడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బీటలువారాయి. నాటినుంచీ పరిస్థితి క్రమంగా దిగజారుతూనే వస్తోంది. వెనెజువెలాపై అమెరికా ఎడాపెడా ఆంక్షలు విధిస్తూ, వాటిని నానాటికీ పెంచేస్తూ వస్తోంది. తొలుత చావెజ్, ఆ తర్వాత తాజాగా పదవీచ్యుతుడైన నికొలస్ మదురో ఇద్దరూ నియంతృత్వ పోకడలతోనే పాలించారు. దాంతో పాతికేళ్లకు పైగా దేశం తిరోగమన బాటలోనే సాగుతూ వస్తోంది. అమెరికాలోకి విచ్చలవిడిగా వచ్చిపడుతున్న డ్రగ్ కార్టెల్స్ మూలాలన్నీ వెనెజువెలాలోనే ఉన్నాయన్నది ట్రంప్ ఆరోపణ. ఇది చాలదన్నట్టు వెనెజువెలా నుంచి తమ దేశంలోకి జనం విపరీతంగా వలస వచ్చిపడుతున్నారంటూ కొంతకాలంగా ఆయన మండిపడుతున్నారు. డ్రగ్స్ మోసుకెళ్తున్నాయనే సాకుతో కొన్నాళ్లుగా వెనెజువెలా చమురు నౌకలను అడ్డుకుంటూ, పేల్చేస్తూ వస్తున్న అమెరికా చివరికి తాజాగా అధ్యక్షుడే లక్ష్యంగా సైనిక చర్యకే దిగి భార్యాసమేతంగా నిర్బంధంలోకి తీసుకుంది. వ్యతిరేకులతో దోస్తీ! వెనెజువెలా విషయంలో అమెరికా దూకుడును అడ్డుకోవడానికి ఆ దేశాధ్యక్షులు అన్నిరకాలుగా ప్రయత్నిస్తూ వచ్చారు. చావెజ్ తన హయాంలో యూఎస్ వ్యతిరేక శక్తులైన రష్యా, ఇరాన్, క్యూబా వంటి దేశాలతో చెలిమి చేశారు. మిగతా విషయాలు ఎలా ఉన్నా దేశ ఆర్థిక పరిస్థితి మాత్రం దిగజారకుండా చూసుకోగలిగారు. అలా తనపై జనాగ్రహం ప్రబలకుండా జాగ్రత్త పడ్డారు. చమురు విక్రయాలతో వచ్చే మొత్తాలతో దేశంలో పేదరికాన్ని చాలావరకు తగ్గించారు. కానీ మదురోలో ఆ ముందుచూపు లోపించిందంటారు పరిశీలకులు. ఆయన హయాంలో దేశంలో అన్ని రంగాల్లోనూ పరిస్థితి క్రమంగా దిగజారుతూ వచ్చింది. ఇటు ద్రవ్యోల్బణం చుక్కలనంటింది. అటు ట్రంప్ రాకతో అమెరికా దూకుడు పెరిగింది. దాంతో రాజకీయంగానే గాక ఆర్థికంగానూ వెనెజువెలా పరిస్థితి దయనీయంగా మారింది. ఒక దశలో దేశంలో ఆహార నిల్వలు దాదాపుగా నిండుకున్నాయి. దాంతో బతుకుదెరువు కోసం జనం భారీగా దేశం వీడటం పరిపాటిగా మారింది. గత పదేళ్లలో కోటిమందికి పైగా విదేశాల బాట పట్టినట్టు అంచనా. విచ్చలవిడిగా పెరిగిపోయిన అధికారుల అవినీతిని అదుపు చేయడం మదురో తరం కాలేదు. దీనికితోడు వెనెజువెలా చమురు అమ్మకాలన్నింటినీ అమెరికా దాదాపుగా అడ్డుకుంది. దాంతో ప్రధాన ఆదాయ వనరు మూసుకుపోయి మదురో సమస్యలు రెట్టింపయ్యాయి. కొంతకాలంగా చైనా వంటి దేశాలకు కారుచౌకగా చమురు విక్రయించుకుంటూ నెట్టుకొస్తున్న పరిస్థితి. అంతర్గత సమస్యలు ఇలా చేయి దాటుతుండగానే ట్రంప్ ఒక్కసారిగా రూటు మార్చి వెనెజువెలాపై గత సెప్టెంబర్ నుంచే సైనిక చర్యలకు శ్రీకారం చుట్టారు. వెనెజువెలా గగనతలాన్ని మూసేస్తున్నట్టు గత నవంబర్లో ప్రకటించారు. వెనెజువెలా చుట్టూ సైన్యం మోహరింపులను పెంచేశారు. చివరికి మదురోను క్రిమినల్గా పేర్కొనడమే గాక, ఆయన్ను పట్టిస్తే ఏకంగా 5 కోట్ల డాలర్ల నజరానా ప్రకటించారు. మచాడో ఫ్యాక్టర్! మదురో దంపతులను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకుందన్న వార్తలపై వెనెజువెలాలో ఆగ్రహావేశాలు దేవుడెరుగు, పెద్దగా వ్యతిరేకత కూడా వ్యక్తం కావడం లేదు. ఇది మదురో స్వయంకృతమే అయినా, ఆయన పట్ల జనంలో నెలకొన్న వ్యతిరేకతను ఆగ్రహావేశాలుగా మార్చడంలో వెనెజువెలా విపక్ష నేత మరియా కొరినా మచాడో పాత్ర కీలకమే. మదురో హయాంలో దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన కనీవినీ ఎరగని రీతిలో జరిగింది. దీనిపై అంతర్జాతీయ సంస్థలన్నీ గగ్గోలు పెట్టే పరిస్థితి. మదురోకు వ్యతిరేకంగా గళమెత్తిన వారంతా రాత్రికి రాత్రే మాయం కావడం, తీవ్ర నిర్బంధానికి గురవడం షరామామూలుగా మారింది. అలాంటి సమయంలో తెరపైకి వచ్చిన మచాడో ప్రజా గళంగా మారారు. మదురో నియంతృత్వ పోకడలపై ఏళ్లుగా మడమ తిప్పని పోరాటం చేస్తున్నారు. ప్రజల సొత్తయిన అపార వనరులన్నింటినీ మదురో, ఆయన అనుయాయులు అయినకాడికి దోచుకుంటున్నారంటూ ఆమె చేసిన ఉద్రేకపూరిత ప్రసంగాలకు ప్రజల్లో గొప్ప స్పందన వచ్చింది. చూస్తుండగానే మచాడోకు ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. 2024లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆమె విజయం ఖాయమనే దాకా వెళ్లింది. ఈ ముప్పును ముందే పసిగట్టిన మదురో, మచాడోపై హాస్యాస్పదమైన అవినీతి, దాంతోపాటు దేశద్రోహం తదితర ఆరోపణలు మోపారు. చివరికి ఎన్నికల్లో పోటీ కూడా చేయకుండా అనర్హత వేటు వేయించారు. ఎన్నికల్లో భారీ రిగ్గింగ్ తదితరాల సాయంతో తిరిగి ఎన్నికయ్యారు. అవి అత్యంత ఏకపక్ష ఎన్నికలంటూ అంతర్జాతీయంగా విమర్శలు రేగినా పట్టించుకోలేదు. మచాడోపై పలుమార్లు హత్యాయత్నాలూ జరిగాయి. దాంతో ప్రాణరక్షణ కోసం ఆమె అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఏడాది తనకు ప్రకటించిన నోబెల్ శాంతి బహుమానం అందుకునేందుకు మారువేషంలో నార్వే వెళ్లే ప్రయత్నంలో మచాడో పడవ ప్రమాదానికి గురై గాయపడ్డారు. అమెరికా దన్ను మదురో శకానికి తెర పడటం ఖాయమైన నేపథ్యంలో అమెరికా ఆశీస్సులున్న మచాడోయే అధ్యక్ష పీఠం ఎక్కడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే విపక్ష నేత మచాడోకు అమెరికా మొదటినుంచీ దన్నుగా నిలుస్తూ వస్తోంది. తన నోబెల్ బహుమానాన్ని ట్రంప్కు అంకితమిస్తున్నట్టు ఆమె చేసిన ప్రకటనపై ఆశ్చర్యం వ్యక్తమైంది. అంతా భావిస్తున్నట్టుగా అమెరికా ఆశీస్సులతో మచాడో గద్దెనెక్కినా అగ్రరాజ్యం పడగ నీడన దేశవాసుల ప్రజాస్వామిక ఆకాంక్షలను నెరవేర్చడం, దేశ పరిస్థితులను గాడిన పెట్టడం ఆమెకు కత్తిమీద సామే కానుంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
వెనెజువెలా.. టార్గెట్ ఆయిలా
డ్రగ్స్ .. వలసలపై పోరు, దేశ భద్రతకు ముప్పు మొదలైన అంశాల వల్లే వెనెజువెలాపై దాడికి పాల్పడినట్లు అమెరికా చెబుతున్నప్పటికీ నిజంగా కారణాలు అవేనా? లేక వేరే ఏవైనా ఉన్నాయా? అనే సందేహాలు నెలకొన్నాయి. వెనెజువెలాలో పుష్కలంగా ఉన్న చమురు నిల్వలే టార్గెట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పోరుకు తెరతీసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. తద్వారా ప్రపంచ ముడిచమురు మార్కెట్లో ఒపెక్ (ఆయిల్ ఎగుమతి దేశాల) ఆధిపత్యానికి గండి కొట్టి, అమెరికా కొత్త ఆయిల్ కింగ్గా మారే ప్రయత్నం చేయొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వెనెజువెలాపై అమెరికా దాడి దరిమిలా ప్రపంచ ముడిచమురు మార్కెట్లో చోటు చేసుకునేందుకు అవకాశమున్న పరిణామాలపై కథనం. – సాక్షి, బిజినెస్ డెస్క్అమెరికాకు ఎందుకు ఆసక్తి..ప్రపంచంలోనే అమెరికా అత్యధికంగా రోజుకు 20–22 మిలియన్ బ్యారెళ్లు (ఎంఎంబీపీడీ) ఉత్పత్తి చేస్తున్నప్పటికీ వెనెజువెలా తయారు చేసే రకం ఆయిల్ని కొంత దిగుమతి చేసుకుంటోంది. అమెరికా తయారు చేసే లైట్ స్వీట్ రకం ముడిచమురు.. పెట్రోల్లాంటి వాటి తయారీకి మాత్రమే ఉపయోగపడుతుంది. డీజిల్తో పాటు ఫ్యాక్టరీలు ఇతరత్రా అవసరాలకు కావాల్సిన ప్రొడక్టులను ఉత్పత్తి చేయాలంటే వెనెజువెలా సరఫరా చేసే హెవీ, సోర్ రకం క్రూడాయిల్ ముఖ్యం. పలు అమెరికన్ రిఫైనరీలు.. వెనెజువెలా హెవీ ఆయిల్ని ప్రాసెస్ చేయడానికి అనువుగా నిర్మితమై ఉన్నాయి.తమ దేశపు ఆయిల్తో పోలిస్తే వెనెజువెలా ఆయిల్తోనే అవి సమర్ధవంతంగా పని చేయగలవు. దానికి తగ్గట్లుగానే మిగతా దేశాలతో పోలిస్తే సమీపంలోనే ఉన్న వెనెజువెలా నుంచి అమెరికా రోజుకు 1.02 లక్షల బ్యారెళ్ల ఆయిల్ని దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు ఈ దాడి వల్ల అగ్రరాజ్యానికి, దాని మిత్ర దేశాలకు, ముఖ్యంగా వెనెజువెలా ఎకానమీకి కూడా ప్రయోజనాలు చేకూరవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అమెరికా తదితర దేశాలకు చెందిన ఆయిల్ కంపెనీలు వెనెజువెలాలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు పెరుగుతాయని, తద్వారా ఆ దేశంలో ఉత్పత్తి కూడా గణనీయంగా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఫలితంగా ధరలు అదుపులో ఉంటాయంటున్నారు.అపార ఆయిల్.. ఖనిజ నిల్వలుప్రపంచంలోనే అత్యధికంగా వెనెజువెలాలో 303 బిలియన్ బ్యారెళ్లకు పైగా చమురు నిక్షేపాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు నిక్షేపాల్లో ఇది అయిదో వంతు. అదే అమెరికా, రష్యాలో చెరి 80 బిలియన్ బ్యారెళ్లు ఉండగా.. సౌదీ అరేబియాలో 267 బిలియన్ బ్యారెళ్ల మేర నిక్షేపాలు ఉన్నాయి. అత్యధికంగా చమురు నిల్వలు ఉన్నప్పటికీ, వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునే పరిస్థితి లేక వెనెజువెలా ఆయిల్ పరిశ్రమ అనేక సంవత్సరాలుగా సమస్యలతో కొట్టుమిట్టాడుతూనే ఉంది. సరైన నాయకత్వం లేకపోవడం, అవినీతి, అమెరికా ఆంక్షలు, పరిశ్రమలోకి పెట్టుబడులు రాకపోవడం మొదలైనవి ఇందుకు కారణం.ఫలితంగా, 25 ఏళ్ల క్రితం రోజుకు 3 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేసిన వెనెజువెలా ప్రస్తుతం ఒక మిలియన్ బ్యారెళ్ల స్థాయికి పడిపోయింది. ఇలా ఉత్పత్తి చేసే ఆయిల్లో సింహభాగాన్ని (రోజుకు 6,00,000 బ్యారెళ్లు) చైనా దిగుమతి చేసుకుంటోంది. వెనెజువెలా ప్రభుత్వానికి రుణాలు ఇవ్వడం ద్వారా ఆ దేశపు ఆయిల్ రంగంలో చైనా గణనీయంగా ఇన్వెస్ట్ చేసింది. ఇక వెనెజువెలాలో ముడిచమురుతో పాటు అరుదైన ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ ఖనిజ సంపద విలువ దాదాపు 1.36 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉంటుందని అంచనా.రష్యాకు చెక్..రష్యా ఆయిల్ కూడా దాదాపు వెనెజువెలా క్రూడాయిల్ తరహాలోనే ఉంటుంది. అందుకే భారత్, చైనాలాంటి దేశాలు అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. వెనెజువెలాలో ఉత్పత్తి పెరిగితే అది రష్యాకి ప్రత్యామ్నాయంగా తయారవుతుంది. ఇప్పటిదాకా రష్యా దగ్గర కొంటున్న దేశాలు నెమ్మదిగా వెనెజువెలావైపు మళ్లుతాయి. ఫలితంగా రష్యా ఎకానమీ దెబ్బతింటుంది. అలాగే ఉక్రెయిన్ మీద యుద్ధం చేసే సామర్థ్యాలు కూడా సన్నగిల్లుతాయి. ఆ విధంగా రష్యాని అమెరికా కట్టడి చేసినట్లవుతుంది.అదే సమయంలో అత్యధిక నిల్వలున్న వెనెజువెలాను గుప్పిట్లో ఉంచుకోవడం ద్వారా అంతర్జాతీయంగా క్రూడాయిల్ మార్కెట్పైనా ఆధిపత్యం దక్కించుకునేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే అగ్రరాజ్యంలో షెల్ ఆయిల్ ఉత్పత్తి బూమ్ వల్ల మార్కెట్ ఆధిపత్యం ఒపెక్ దేశాల నుంచి కొంత అమెరికాకు వెళ్లిపోయింది. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద ఉత్పత్తిదారుగా అమెరికా మారింది. రాబోయే రోజుల్లో వెనెజువెలాలోని చమురు నిక్షేపాలు, అమెరికా, దాని మిత్ర దేశాల చేతిలోకి వెళ్తే.. అంతర్జాతీయంగా ఆయిల్ మార్కెట్ తీరుతెన్నులు మారిపోవచ్చు. భవిష్యత్తులో ఒపెక్, దాని మిత్ర దేశాల సామర్థ్యాలను బలహీనపర్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.మనపై ఎఫెక్ట్ ఏంటంటే..భారత్కి కూడా వెనెజువెలా నుంచి రోజుకు సుమారు 60,000 నుంచి 1,00,000 బ్యారెళ్ల (బీపీడీ) మేర సరఫరా అవుతోంది. మనం క్రూడాయిల్ దిగుమతుల్లో ఇది సుమారు 2–3 శాతం ఉంటుంది. 2024లో వెనెజువెలా నుంచి 1.76 బిలియన్ డాలర్ల విలువ చేసే ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంది. ఒకవేళ వెనెజువెలా ఆయిల్పై పూర్తి స్థాయిలో ఆంక్షలు అమలైతే మధ్యప్రాచ్యదేశాల నుంచి ఖరీదైన ప్రత్యామ్నాయాలను కొనుగోలు చేయాల్సి రావచ్చు.దీనితో సుమారు 10 బిలియన్ డాలర్ల వరకు దిగుమతుల బిల్లు భారం పెరగొచ్చని అంచనా. అటు వెనెజువెలా కోవకి చెందినది కాకపోయినప్పటికీ రష్యా నుంచి కూడా చమురు దిగుమతులను పెంచుకోవడం ద్వారా లోటును భర్తీ చేసుకునే వీలున్నా, ప్రస్తుతం రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేయాలంటూ మనపై అమెరి కా ఒత్తిడి తెస్తున్న కారణంగా ఇలాంటి అవకాశాలపై కొంత సందేహాలు నెలకొన్నాయి.తాత్కాలికంగా రేట్లకు రెక్కలు..వెనెజువెలా సరఫరా చేసేది స్వల్పమే అయినా అది కూడా నిల్చిపోతే చమురు రేట్లు తాత్కాలికంగా, బ్యారెల్కి 3–5 డాలర్ల మేర పెరిగే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే మార్కెట్లో ఓవర్–సప్లై నెలకొనడంతో పాటు ఒపెక్ దేశాలు ఆ మేరకు అదనంగా ఉత్పత్తి పెంచితే ధరలు మళ్లీ సాధారణ స్థాయికి తిరిగి రావచ్చు. అయితే, వెనెజువెలా ఉత్పత్తి చేసే క్రూడాయిల్ రకం ప్రత్యేకమైనది కావడం వల్ల దానిపైనే ఆధారపడిన వర్గాలపై కొంత ప్రభావం పడనుంది. -
International news: వెనెజువెలాపై అమెరికా ఎయిర్ స్ట్రైక్?
-
వెనెజువెలా అధ్యక్షుడిని నిర్ణయించేది మేమే: ట్రంప్
కరాకస్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి పేరిట అమెరికా వెనెజువెలాపై వైమానిక దాడులతో విరుచుకు పడింది. వెనెజువెలా రాజధాని కరాకస్తో సహా నాలుగు నగరాలను అమెరికా శనివారం రాత్రి లక్ష్యంగా చేసుకుంది. వీటిలో కరాకస్తో పాటు మిరాండా, అరగ్వా,లా గ్వైరా రాష్ట్రాల్లోని సైనిక స్థావరాలపై అమెరికా ఏడు వైమానిక దాడులు చేసింది. ఫలితంగా వెనెజువెలాలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ట్రంప్ ఆదేశాల మేరకు దాడులు చేస్తున్నట్లు అమెరికా సైన్యం అధికారిక ప్రకటన చేసింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తొలి దాడి జరిగింది. అమెరికా మీడియా సీబీఎస్ న్యూస్ ప్రకారం, వెనెజువెలా లోపల సైనిక స్థావరాలు, అనేక నిర్దిష్ట ప్రదేశాలపై దాడికి ట్రంప్ ఆదేశించారు. ఈ దాడికి సంబంధించిన వైరల్ వీడియోలో సుమారు పదుల సంఖ్యలో హెలికాప్టర్లు చక్కెర్లు కొట్టాయి. -
అమెరికా దాడులు.. వెనెజులాలో ఎమర్జెన్సీ విధింపు
అమెరికా వైమానిక దాడులతో దక్షిణి అమెరికా దేశం వెనెజులా దద్దరిల్లింది. భారత కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం ఆ దేశ రాజధాని కరాకస్తో దాడులు మొదలయ్యాయి. అసలేం జరగుతుందో అర్థంకాక జనం వీధుల్లోకి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భారీ పేలుళ్ల తర్వాత.. కరాకస్ సిటీ అంధకారంగా మారింది. కీలకమైన పోర్ట్, ఎయిర్పోర్టులు సహా మౌలిక సదుపాయాలపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. కరాకస్ నుంచి మొదలైన దాడులు.. క్రమక్రమంగా ఇతర రాష్ట్రాల్లోనూ(మిరాండా, అరాగ్వా, లా గువైరా) కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ దాడులు అమెరికా పనేనని ఆరోపించిన వెనెజులా జాతీయ అత్యవసర పరిస్థితి(Emergency in Venezuela) ప్రకటించింది. సైనిక స్థావరాలతో పాటు జనావాసాలపైనా దాడులు జరుగుతున్నట్లు చెబుతోంది. పలుచోట్ల రక్షణ దళాలను మోహరింపజేసింది. అమెరికా సైన్యం వెనిజులాపై దాడులు ప్రారంభించిందని ఫాక్స్ న్యూస్ వర్గాలు వాషింగ్టన్ అధికారులను ఉటంకిస్తూ నివేదించాయి. ఈ దాడుల లక్ష్యం దేశంలోని చమురు, ఖనిజ వనరులను స్వాధీనం చేసుకోవడం కోసమేనని, రాజకీయ స్వాతంత్ర్యాన్ని దెబ్బతీయడం అని వెనెజులా ఆరోపించింది. అయితే, గతంలోలాగే ఈ ప్రయత్నాలు ఈ ప్రయత్నాలు కూడా విఫలమవుతాయని అంటోంది. అయితే అమెరికా ఈ దాడులపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ వేకువజామున కరాకస్లో మొత్తం ఏడు చోట్ల పేలుళ్లు సంభవించినట్లు ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్ కథనం ప్రచురించింది. విమానం తక్కువ ఎత్తులో ఎగురుతున్నట్లు శబ్దాలూ వినిపించాయని స్థానికులు చెప్పినట్లు ఆ కథనం ఉటంకించింది.que dios bendiga a todas las personas inocentes que quedaron en medio del bombardeo en caracas - venezuela pic.twitter.com/etH1wbo1sa— haaland erling (@gxldehaalandd) January 3, 2026ఇదిలా ఉంటే.. మాదకద్రవ్యాల అక్రమ రవాణా విషయంలో కొంతకాలంగా వెనెజువెలాను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. ట్రంప్ ఆదేశాల మేరకు డ్రగ్స్ను తరలిస్తున్న పడవలు, జలాంతర్గాములపై దాడుల్ని ముమ్మరం చేసింది. కఠినమైన ఆంక్షలను అమలు చేస్తోంది. దీనికి కౌంటర్గా అమెరికన్ పౌరులను వెనెజులా అరెస్ట్ చేయడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అయ్యాయి. ఈ పరిణామాల నడుమ వైమానిక దాడులకు దిగడం గమనార్హం.వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో.. చైనా ప్రత్యేక దౌత్యవేత్త క్వీ గ్సియాగితో భేటీ అయిన కొద్దిగంటలకే ఈ దాడులు జరిగాయి. వెనెజులా అధ్యక్ష భవనం లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం అందుతోంది. ఈ పేలుళ్ల ఆ చుట్టుపక్కల ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.ఈ పేలుళ్ల గురించి ట్రంప్నకు స్పష్టమైన సమాచారం ఉందని సీబీఎస్ వార్తా సంస్థ ఒక కథనం ప్రచురించింది. పేలుళ్ల నేపథ్యంతో అమెరికా తమ దేశ విమానాలు వెనెజులా గగనతలం నుంచి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది. స్థానికంగా ఉండే సీఎన్ఎన్ జర్నలిస్ట్ ఒకరు పేలుడుకు సంబంధించిన పోస్ట్ ఒకటి చేశారు. శక్తివంతమైన పేలుళ్లు సంభవించాయని.. ఆ ధాటికి తాను ఉంటున్న కిటికీ అద్దాలు పగిలిపోయాయని చెప్పుకొచ్చారు. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఈ పేలుళ్లపై స్పందించారు. వెనెజులా రాజధాని క్షిఫణుల దాడులతో మారుమోగుతోందని.. ప్రపంచం ఈ విషయం గమనించాలని అన్నారు. ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్(OAS), ఐక్యరాజ్య సమితి తక్షణమే సమావేశం నిర్వహించాల్సి ఉందంటూ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్చేశారాయన. -
టెన్షన్ టెన్షన్: వెనిజులా వైమానిక దళంలో ఇరాన్ యుద్ధ డ్రోన్లు!
ఇరాన్ యొక్క మొహజెర్-6 స్ట్రైక్ డ్రోన్లు వెనిజులా వైమానిక దళంలో కనిపించడంతో యుద్ధం వాతావరణానికి ఆజ్యం పోస్తుంది. ఉక్రెయిన్లో ఉపయోగించే హమాస్తో అనుసంధానించబడిన ఈ ఇరాన్ యుద్ధ డ్రోన్లు ఇప్పుడు వెనిజులా వైమానిక స్థావరంలో చక్కర్లు కొడుతున్నాయి. ఇవి యూఎస్కు కొన్ని మైళ్లు దూరంలో ఉండటంతో మరింత ఆందోళన కల్గిస్తోంది. దక్షిణ అమెరికా దేశం వెనిజులాలోని అపార చమురు నిల్వలపై కన్నేసిన ట్రంప్, వాటిని ఎలాగైనా చేజిక్కించుకునే ప్రయత్నాలకు మరింత పదును పెడుతున్నారు. అందులో భాగంగా ఆ దేశానికి చమురు నౌకల రాకపోకలపై పూర్తి నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. సాగర జలాల్లో భారీగా నేవీ, సైన్యాన్ని మొహరించి ప్రతి చమురు నౌకనూ అడ్డుకుని తీరుతామని ట్రంప్ పేర్కొన్నారు. దాంతో అమెరికా యుద్ధానికి దిగే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో వెనిజులా దానికి ప్రతిగా సన్నద్ధమవుతుందన్న దానికి బలం చేకూరుస్తోంది. ఈ క్రమంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. దీన్ని బట్టి ఇరు దేశాల మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. -
వెనిజులాపై ట్రంప్... పూర్తిస్థాయి యుద్ధం?
వాషింగ్టన్: దక్షిణ అమెరికా దేశం వెనిజులాలోని అపార చమురు నిల్వలపై కన్నేసిన ట్రంప్, వాటిని ఎలాగైనా చేజిక్కించుకునే ప్రయత్నాలకు మరింత పదును పెడుతున్నారు. అందులో భాగంగా ఆ దేశానికి చమురు నౌకల రాకపోకలపై పూర్తి నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. సాగర జలాల్లో భారీగా నేవీ, సైన్యాన్ని మొహరించి ప్రతి చమురు నౌకనూ అడ్డుకుని తీరుతామని సొంత సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’ఖాతాలో మంగళవారం ఆయన పోస్ట్ పెట్టారు. ‘వెనిజులాను అన్నివైపుల నుంచి దిగ్బంధించాం. కనీవినీ ఎరగనంతటి సంఖ్యలో సైన్యం ఆ దేశాన్ని చుట్టుముట్టనుంది. వెనిజులా చమురు విక్రయ సొమ్మంతా అమెరికాలోకి డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటివాటికే ఉపయోగపడుతోంది. ఇది మా దేశ భద్రతకే సవాలుగా మారింది. అందుకే ఈ దిగ్బంధం. న్యాయబద్ధంగా అమెరికాకు చెందాల్సిన వెనిజులాలోని అపార చమురు నిల్వలు, భూములు, ఆస్తులు అన్నింటినీ మాకు అప్పగించేదాకా వదలం’ అని స్పష్టం చేశారు. గత నెలలో కూడా వెనిజులా తీర సమీపంలో ఆ దేశ చమురు నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. ట్రంప్ తీరుపై వెనిజులా మండిపడింది. ‘ఒక సార్వభౌమ దేశంలోని ఆస్తులు, చమురు క్షేత్రాలు తమావేవని అంటారా? అంతర్జాతీయ చట్టాలను, స్వేచ్ఛా వాణిజ్య సూత్రాలను ట్రంప్ తుంగలో తొక్కుతున్నారు. దీనిపై ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేస్తాం’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. ట్రంప్ అసలు ఉద్దేశం డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ కట్టడి కాదని స్వయానా ఆయన చీఫ్ ఆఫ్ స్టాఫ్ సుసీ వైల్స్ స్పష్టం చేశారు. మాట వినని ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దింపడమేనని ఆయన అసలు లక్ష్యమని కుండబద్దలు కొట్టారు! ఈ మేరకు వానిటీ ఫెయిర్ వైల్స్కు ఇచ్చిన సంచలనాత్మక ఇంటర్వ్యూ మంగళవారం ప్రచురితమైంది. మదురో కాళ్ళబేరానికి వచ్చి తప్పుకునేదాకా వెనిజులా చమురు నౌకలను పేల్చేస్తూనే ఉంటామని కూడా ఆయన స్పష్టం చేయడం విశేషం! వెనిజులాలో ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వకున్న విషయం తెలిసిందే. ఆ దేశం ఏకంగా రోజుకు 10 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తుంది. అక్కడి ఆర్థిక వ్యవస్థకు చమురు ఆదాయమే జీవనాడి. -
వెనిజులాపై అమెరికా యుద్ధోన్మాదం
వెనుకబడిన, బలహీనమైన చిన్న దేశా లను, ఆ దేశాల ప్రభుత్వాలను ఆయుధ బలంతో తన చెప్పుచేతుల్లో పెట్టుకోవడం, తన మాట వినని ప్రభుత్వాలు కూలిపోయేలా చేయడం, అది సాధ్యం కాకపోతే యుద్ధం ద్వారా తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, తరు వాత ఆ దేశాల సహజ వనరులను తరలించుకుపోవడం అమెరికా అనుసరిస్తున్న విధానంగా ఉంది.నేడు వెనిజులాపై దాని యుద్ధ సన్నాహాలు ఆ విధానంలో భాగమే. దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాపై దాడి చేయడానికి అమె రికా అధ్యక్షుడు ట్రంప్ కరేబియన్ దీవులకు 8 వార్షిప్లతో పాటు అతిపెద్ద విమాన వాహక నౌకను, 10 వేల మంది సైనికులనుపంపాడు. ఇది ఇలా ఉండగా 2025 సెప్టెంబర్ 2 నాడు వెనిజులా నుంచి పోతున్న పడవలపై అమెరికా దాడి చేసి 11 మంది ప్రాణాలు తీసింది. ఈ దాడికి కారణం పడవల్లో వెనిజులా మాదక ద్రవ్యాలను రవాణా చేయడమే అంటున్నది.వెనిజులాపై అమెరికా వ్యతిరేకత చాలా కాలంగా కొనసాగు తున్నది. ఆ దేశ భూగర్భంలో చమురు, సహజ వాయువు నిక్షేపాలు, వజ్రాలు, బంగారం వంటివి అపారంగా ఉన్నాయి. తన బహుళ జాతి సంస్థల ద్వారా వాటిని తరలించుకు పోతున్న అమెరికాకు, 1999లో వెనిజులా అధ్యక్షునిగా ఎన్నికైన హ్యూగో చావేజ్ అడ్డు కట్ట వేశాడు. ప్రభుత్వ సంస్థలను జాతీయం చేయడాన్ని వ్యతిరేకిస్తున్న పెట్టుబడిదారీ అనుకూల ముఠా చావేజ్ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రయత్నాలకు మద్దతిచ్చింది.ఆ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. బొలీ వియా దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక సమూహాలకు ఒక అమెరికా రాయబారి సహకరించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆ దేశానికి మద్దతుగా 2008లో అమెరికా రాయబారిని వెనిజులా దేశం నుంచి బహిష్కరించింది. చావేజ్ మరణం తర్వాత వరుసగా మూడు సార్లు నికోలస్ మదురో అధ్యక్షుడయాడు. తమ దేశ పెట్టుబడిదారులకు చెందిన వెనిజులాలోని సంస్థలనూ, గను లనూ ఆ దేశం జాతీయం చేసినందుకు నష్టపరిహారం చెల్లించాలని అమెరికా కోర్టులు తీర్పులు వెల్లడించాయి. సార్వభౌమాధికారం గల ఒక దేశానికి సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది. వెనిజులా అలాంటి దేశం కాబట్టి చమురు పరిశ్రమలను, ఖనిజాల గనులను జాతీయం చేసింది. ఆ దేశ నిర్ణయాలపై అమెరికా కోర్టులు తీర్పులు ఎలా ఇస్తాయి? వెని జులా నుంచి ఎవరూ చమురు కొనవద్దని అమెరికా ఆంక్షలు (2023) విధించి ఆర్థికంగా దాన్ని దెబ్బతీస్తోంది.అలాగే వెనిజులాపై యుద్ధానికి సిద్ధమై ఆ దేశ గగన స్థలాన్ని మూసి వేస్తున్నట్లు ప్రకటించింది అమెరికా. అధ్యక్షుడు నికోలస్ మదురో దేశం విడిచిపెట్టి పోవాలని, అతని మంత్రి వర్గ ముఖ్య సహచరులను కాపాడుకోమని ట్రంప్ బెదిరించినట్లు ‘హెరాల్డ్’ పత్రిక పేర్కొంది. ట్రంప్ ప్రభుత్వ ప్రకటనను వెనిజులా తీవ్రంగా ఖండించింది. ఇది ఏకపక్ష చర్య అని పేర్కొంది. ట్రంప్ ప్రకటన నేపథ్యంలో విమాన సర్వీసులను నిలిపి వేసిన స్పెయిన్, పోర్చుగల్, కొలంబియా, చిలీ, బ్రెజిల్, తుర్కియే దేశాలపై వెనిజులా ఆగ్రహం వ్యక్తం చేసి ఆ దేశాలకు సంబంధించిన విమాన సంస్థలపై శాశ్వత నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.సార్వభౌమాధికారం గల ఒక దేశ గగన స్థలాన్ని మరొక దేశం మూసి వేస్తున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయ ఒడంబడికలకు విరు ద్ధమైనది. ఒక స్వతంత్ర దేశమైన వెనిజులా అధ్యక్షుణ్ణి పట్టి అప్పగించమని అమెరికా కోరడం, నికోలస్ మదురో సమాచారం ఇస్తే ఏకంగా 5 కోట్ల డాలర్ల బహుమతి ప్రకటించడం దాని హంతక మనస్తత్వానికి నిదర్శనం. – బొల్లిముంత సాంబశివరావురైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు -
అమ్మకు బదులు అమ్మాయి
ఓస్లో: వెనెజులాలో ప్రజాస్వామ్యం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న సాహసి, ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడో.. ఆ నిప్పుకణిక లేకుండానే.. నోబెల్ శాంతి బహుమతి ప్రదానోత్సవం బుధవారం ఓస్లోలో జరిగింది. భయంకరమైన పరిస్థితుల నడుమ రాలేకపోయినప్పటికీ, ఆమె కూతురు అనా కొరినా సోసా.. వేదికపై తల్లి తరపున ఆ చారిత్రక గౌరవాన్ని స్వీకరించారు. మచాడో ఈ ఏడాది జనవరి 9 నుండి అజ్ఞాతంలో ఉన్నారు. అదేరోజు, ఆమె వెనెజులా రాజధాని కారకాస్లో తన మద్దతుదారులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. త్వరలో మనతో మారియా.. నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్, జోర్జెన్ వాట్నే ఫ్రైడ్నెస్ సభలో చేసిన వ్యాఖ్యలు ఆహూతులను కదిలించాయి. ‘మారియా కొరినా మచాడో ఈ రోజు వేడుకకు హాజరయ్యేందుకు తన శక్తి మేరకు ప్రయతి్నంచారు. ఆమె రాలేకపోయినా, సురక్షితంగా ఉన్నారని ధ్రువీకరించడానికి ఎంతో సంతోíÙస్తున్నాం. ఆమె త్వరలోనే ఓస్లోలో మనతో ఉంటారు’.. అని ప్రకటించగానే సభ చప్పట్లతో దద్దరిల్లింది. ముందుగా నోబెల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, మచాడో ప్రతినిధి ఆమె రాలేకపోతున్నారని ప్రకటించారు. ఈ సందర్భంగా మచాడో కుమార్తె అనా కొరినా సోసా.. తన తల్లి స్థానాన్ని అలంకరించారు. ఈ బహుమతి వెనెజులా ప్రజలందరిది నోబెల్ వెబ్సైట్లో విడుదలైన మచాడో ప్రసంగం ఆద్యంతం ఉద్వేగాన్ని నింపింది. ‘నేను ఓస్లో చేరుకోవడానికి ఎందరో ప్రాణాలను పణంగా పెట్టారు. వారికి నేను కృతజ్ఞురాలిని. ఈ గుర్తింపు వెనెజులా ప్రజలకు ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తుంది’.. అన్న ఆమె గొంతులో పోరాట స్ఫూర్తి ప్రతిధ్వనించింది. ‘ఈ బహుమతి మొత్తం వెనెజులా ప్రజలందరిది. నేను రాగానే, రెండేళ్లుగా చూడని నా కుటుంబ సభ్యులను, నా పిల్లలను కౌగిలించుకుంటాను’.. అని ఉద్వేగంతో ఆమె చెప్పారు. ఐదుగురూ నిర్బంధంలోనే.. గతంలో కూడా ఐదుగురు నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు (నర్గెస్ మొహమ్మది–2023, అలెస్ బియాలియాట్సి్క–2022, లియు జియాబో–2010, ఆంగ్ సాన్ సూ కీ–1991, కార్ల్ వాన్ ఒసియెట్జీ్క–1935) నోబెల్ అవార్డు ప్రకటించే సమయానికి జైలులో లేదా నిర్బంధంలో ఉండటం గమనార్హం. -
గగనతలం మూసివేత.. అసలు ఆ హక్కు ఎవరిది?
వెనిజులా అమెరికా మధ్య ఉద్రిక్తతల్లో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో ఫోన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో మాట్లాడాడని.. అది హాట్హాట్గా సాగిందని.. పరిస్థితి మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. ఈ తరుణంలో.. గగనతలం మూసివేత అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది.. వెనిజులా గగనతలం మూసివేయమని ట్రంప్ ప్రకటించారు. అయితే దీనిని వెనిజులా తీవ్రంగా ఖండించింది. ఇది చెల్లదని.. ట్రంప్ ప్రకటన తమ దేశ సార్వభౌమాధికారంపై దాడేనని అభివర్ణించింది. అసలు గగనతలంపై నిషేధం విధించే అధికారం ఎవరికి ఉంటుంది?.. ఎవరు ఎవరిపై విధిస్తారు? దానికంటూ ఏమైనా ప్రత్యేక మార్గదర్శకాలు ఉన్నాయా? .. ఈ నిర్ణయంతో కలిగే నష్టాలేంటి?.. పరిశీలిస్తే.. గగనతలం మూసివేత అంటే.. ఒక దేశం తన భూభాగం పై ఉన్న ఆకాశాన్ని (airspace) ఇతర దేశాల విమానాలకు పూర్తిగా లేదంటే కొంతవరకు నిషేధించడం. అది పరిస్థితులను బట్టి ఆ దేశం తీసుకుంటుంది. ఒక దేశం భద్రతా కారణాలు, యుద్ధ పరిస్థితులు, రాజకీయ నిరసనల కారణంగా గగనతలాన్ని మూసేసుకోవచ్చు. అప్పుడు ఆ దేశం మీదుగా ఇతర దేశాలకు సంబంధించిన విమానాలేవీ ప్రయాణించకూడదు. కానీ, ట్రంప్ అందుకు భిన్నంగా ఇతర దేశాన్ని(వెనిజులా) ఎయిర్స్పేస్ని మూసేయాలని ఆదేశించారు. ఒక దేశం మరొక దేశం గగనతలాన్ని మూసివేయమని చెప్పే హక్కు లేదు. దీంతో ఇది చెల్లదని.. కేవలం రాజకీయ ఉద్రిక్తతల్లో భాగమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ ఎందుకు ప్రకటించారుట్రంప్ గగనతలం మూసివేతకు చూపిస్తున్న కారణాలు అనేకం ఉన్నాయి. వెనిజులా గగనతలం ద్వారా నార్కో-టెర్రరిస్ట్ గ్రూపులు డ్రగ్ స్మగ్లింగ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారాయన. డ్రగ్ ట్రాఫికింగ్తో పాటు మానవ అక్రమ రవాణా అరికట్టడం కోసమేనని చెబుతున్నారు. వెనిజులా గగనతలాన్ని పూర్తిగా మూసివేయాలని ఎయిరలైన్స్, పైలట్స్, డ్రగ్ డీలర్స్, హ్యూమన్ ట్రాఫికర్స్కు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా కరేబియన్ ప్రాంతంలో భారీ సైనిక దళాలను (ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ సహా) మోహరింపజేశారు.రూల్స్ ఇవిగో.. ప్రతి దేశానికి తన ఆకాశంపై సార్వభౌమాధికార హక్కు ఉంటుంది. చికాగో కన్వెన్షన్ (1944) అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) ఆధారంగా రూపొందిన ఒప్పందం ఈ విషయంలో ప్రస్తుతానికి అమల్లో ఉంటోంది. ఇందులో భాగంగా.. ఆర్టికల్ 1: ప్రతి దేశానికి తన భూభాగం పై గగనతలంపై పూర్తి సార్వభౌమాధికార హక్కు ఉంటుంది.ఆర్టికల్ 9: ఒక దేశం భద్రతా కారణాలు, యుద్ధ పరిస్థితులు, అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేయవచ్చు.ఆర్టికల్ 89: యుద్ధం లేదా జాతీయ అత్యవసర పరిస్థితుల్లో, దేశాలు ICAO నిబంధనలను పక్కన పెట్టి తమ గగనతలాన్ని నియంత్రించవచ్చు.గతంలో.. తమ జాతీయ భద్రతా కారణాల వల్ల గగనతలాన్ని మూసివేయడం సమర్థిస్తాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల సమయంలో తరచూ ఇది చూసిందే. అలాగే.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ సమయంలో యూరప్ దేశాలు రష్యా విమానాలకు గగనతలాన్ని మూసివేశాయి. మొన్నీమద్యే ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్-పాక్ నడుమ కూడా ఎయిరోస్పేస్ మూసివేత కనిపించింది. అయితే.. గగనతలం మూసివేతను తాత్కాలిక, అవసరమైన చర్యగా మాత్రమే ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు సమర్థిస్తాయి. విమర్శకులు మాత్రం దీన్ని రాజకీయ ఒత్తిడి సాధనంగా ఉపయోగించడం అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని అంటుంటారు.ప్రభావం.. తమ గగన తలం నుంచి విమానాలు ప్రయాణించకూడదని ఒక దేశం ఆంక్షలు విధించడం లాంటిదే ఈ నిర్ణయం. దీంతో అంతర్జాతీయ విమానాలు ఆ దేశం మీదుగా ప్రయాణించడానికి వీలుండదు. అవి మార్గం మార్చుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణాలకు సమయం.. ఇంధన ఖర్చు పెరుగుతాయి. ఫ్లైట్ షెడ్యూల్స్ ఆలస్యం అవుతాయి. అంతర్జాతీయ కనెక్టివిటీలో అంతరాయంతో ప్రయాణికులు ఇబ్బంది పడొచ్చు. అలాగే.. ఆర్థిక నష్టాలకూ అవకాశం ఉంది. ఈ నిర్ణయం వల్ల వాణిజ్యం, పర్యాటకం దెబ్బతింటాయి.ఎయిర్లైన్స్ ఆదాయం తగ్గుతుంది. కొన్నిసార్లు ఇది యుద్ధ ముప్పుగా కూడా మారొచ్చు. గగనతలం మూసివేత అనేది ఒక దేశం తన సార్వభౌమాధికారాన్ని వినియోగించే చర్య. ఇందుకు చికాగో కన్వెన్షన్ రూల్స్ ఉన్నాయి. కానీ అమెరికా–వెనిజులా ఉద్రిక్తతల్లో ఇది అంతర్జాతీయ చట్టానికి విరుద్ధం. అధికారిక ICAO రూల్స్ ప్రకారం చెల్లుబాటు కాదు. దీని వల్ల విమానయాన రంగం, ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవితం అన్నీ ప్రభావితం అవుతాయనే అందోళన వ్యక్తమవుతోంది. -
అమెరికా హెచ్చరికలు.. వెనిజులాకు పలు దేశాల షాక్!
కారకాస్: వెనిజులాలో భద్రతా పరిస్థితులు మరింతగా దిగజారడానికి తోడు, ఆ దేశ గగనతలంలో అమెరికా సైనిక కార్యకలాపాలు పెరగడంతో, ప్రపంచంలోని పలు ప్రధాన విమానయాన సంస్థలు తమ విమాన సర్వీసులను వెనిజులాకు నిరవధికంగా రద్దు చేశాయి. యునైటెడ్ స్టేట్స్కు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ఇటీవల పైలట్లకు కీలక హెచ్చరిక జారీ చేసింది. దేశంలో విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో, అలాగే అన్ని ఎత్తులలో విమానాలకు బెదిరింపులు ఎదురయ్యే అవకాశాలున్నాయని దానిలో పేర్కొంది.ఒంటరిని చేసి..ఈ పరిణామాల దరిమిలా వెనిజులాలోని ఎయిర్లైన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తెలిపిన వివరాల ప్రకారం, టీఏపీ, ఎల్ఏటీఏఎం, ఏవియాంకా, ఇబెరియా, గోల్, కరేబియన్ తదితర ఆరు ప్రధాన క్యారియర్లు ఇప్పటికే తమ విమానాలను నిలిపివేశాయి. టర్కిష్ ఎయిర్లైన్స్ కూడా తాత్కాలికంగా నవంబర్ 24 నుండి 28 వరకు తమ సర్వీసులను రద్దు చేసింది. ఈ సంక్షోభం ప్రధానంగా ట్రంప్ పరిపాలనా విభాగం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై ఒత్తిడి పెంచడంతో ఏర్పడింది. మదురోను దక్షిణ అమెరికా దేశానికి చట్టబద్ధమైన నాయకునిగా అమెరికా పరిగణించడం లేదు. దీనిలో భాగంగానే అమెరికా సైన్యం వెనిజులా తీరం వరకు బాంబర్ విమానాలను మోహరించింది. విమానాల రద్దుపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్రంగా స్పందించారు. వెనిజులాకు అంతర్జాతీయ అనుసంధానాన్ని నిలిపివేయడాన్ని ఆయన ఖండించారు. ఈ చర్యలు తమ దేశానికి అంతర్జాతీయంగా ఒంటరితనాన్ని పెంచుతాయని, తద్వారా సామాన్య పౌరులు ఇబ్బందులు పడతారని పెట్రో అభిప్రాయపడ్డారు.వెనిజులాతో వివాదానికి కారణం ఇదే..అమెరికా- వెనిజులా మధ్య ఘర్షణ ప్రధానంగా నికోలస్ మదురో నాయకత్వం చుట్టూ తిరుగుతోంది. 2018 ఎన్నికల ఫలితాలను అమెరికా అంగీకరించకపోవడానికి తోడు ప్రతిపక్ష నేత జువాన్ గైడోకు మద్దతు ఇవ్వడంతో ఈ వివాదం మొదలైంది. మదురో ప్రభుత్వంపై మానవ హక్కుల ఉల్లంఘనలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలు చేస్తూ, అమెరికా ఆ దేశంలోని చమురు రంగంతో సహా పలు కీలక రంగాలపై భారీ ఆర్థిక ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు వెనిజులా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. దీనికితోడు అమెరికా.. కరేబియన్ సముద్రంలో యుద్ధ నౌకలను, బాంబర్ విమానాలను మోహరించి, సైనిక ఒత్తిడిని పెంచుతోంది. ఈ ఉద్రిక్తతతలకు తొడు గగనతలంలో భద్రతపై అమెరికా జారీ చేసిన హెచ్చరికల కారణంగానే అంతర్జాతీయ విమానయాన సంస్థలు వెనిజులాకు తమ సర్వీసులను రద్దు చేసుకున్నాయి. అమెరికా మదురోను అధికారంలో నుండి తొలగించేందుకు యోచిస్తుండగా, మదురో తన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ నేపధ్యంలో వెనిజులా ప్రజలు పలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇది కూడా చదవండి: Delhi: మోగిన ప్రమాద ఘంటికలు.. ఉదయాన్నే ఆగిన ఊపిరి -
యుద్ధంలోకి అమెరికా?.. వణికిపోతున్న ప్రపంచం
చరిత్ర మళ్లీ తన రక్తపు పుటలను తిరగేస్తోంది. మరో యుద్ధం మన కళ్ల ముందు పుడుతోంది. ఈసారి ఇది చిన్న దేశాల మధ్య కాదు.. ఏకంగా అమెరికా యుద్ధరంగంలోకి అడుగుపెడుతోందన్న వార్త ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. వెనిజులా తీరప్రాంతాల్లో సముద్రం మంటల్లో కరిగిపోతున్న వేళ.. అమెరికా నౌకాదళం పేల్చిన బుల్లెట్లు ఆకాశాన్ని ఎర్రగా మార్చేశాయి. ఇది మాదకద్రవ్యాల నౌక అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ.. వెనిజులా మాత్రం ఇది తమ ప్రజల నౌక అని గట్టిగా చెబుతోంది. ఆ అగ్నిజ్వాలల మధ్య మానవ శరీరాలు ముక్కలై పోయాయి. ఇటు వెనిజులా డిక్టెటర్ నికోలాస్ మడూరో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మాస్కో, బీజింగ్, టెహ్రాన్కి రహస్య పత్రాలు పంపించారు. ఆయుధాలు, క్షిపణులు పంపాలని రష్యా, చైనా, ఇరాన్ దేశాలను కోరారు. వెనిజులా కోసం రష్యా ఇప్పటికే రాడార్లను సిద్ధం చేస్తోందని సమాచారం.. ఇటు చైనా తన సాంకేతికతను పరిశీలిస్తుంటే.. అటు ఇరాన్ తన డ్రోన్లను గాల్లోకి ఎగరేస్తోంది. మరోవైపు ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఓ భారీ స్టేట్మెంట్ వదిలారు. మడూరో తన చివరి రోజులు లెక్కబెట్టుకుంటున్నారని ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.యుద్ధ క్షేత్రంలా కరేబియన్ సముద్రంఇటు కరేబియన్ సముద్రం యుద్ధ క్షేత్రంలా మారిన సమయంలో.. అమెరికా నౌకలు వరుసగా కదులుతున్నాయి. ఆకాశంలో ఫైటర్ జెట్లు తిప్పుకుంటున్నాయి. ఈ మొత్తం పరిణామాలను ప్రపంచం ఊపిరిబిగపట్టి చూస్తోంది. ఒకవైపు అమెరికా శక్తి.. మరోవైపు రష్యా, చైనా, ఇరాన్ మిత్రబలగాలు...! ఏ క్షణానైనా మొదటి క్షిపణి ప్రయాణించే అవకాశం ఉంది. ఒక తప్పు నిర్ణయం, ఒక తప్పు అంచనా ప్రపంచాన్ని మళ్లీ అగ్నిగుండంలోకి నెట్టేసే ఛాన్స్ ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచం మరోసారి యుద్ధపు నీడలోకి జారిపోతోంది. దశాబ్దాల క్రితమే..నిజానికి అమెరికా-వెనిజులా మధ్య ఘర్షణ ఈరోజు పుట్టిన గొడవ కాదు. దశాబ్దాల క్రితమే ఈ మంటలు మొదలయ్యాయి. 1999లో హ్యుగో చావెజ్ అధికారంలోకి వచ్చారు. ఆయన అమెరికా ఆధిపత్యాన్ని బహిరంగంగా సవాలు చేశారు. వెనిజులా ఆయిల్ సంపదను ప్రజల కోసం ఉపయోగిస్తానని ప్రకటించడం.. అమెరికా ఆర్థిక వ్యవస్థను ఆ నాడు కుదిపేసింది. అప్పటి నుంచే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. చావెజ్ తర్వాత మడూరో బాధ్యతలు స్వీకరించగానే అమెరికా ఆంక్షల వర్షం కురిపించింది. ఇక 2019లో మడూరోను అధ్యక్షుడిగా అంగీకరించకుండా జువాన్ను వెనుజులా ప్రెసిడెంట్గా అమెరికా గుర్తించింది. అమెరికా ఆంక్షలతో ఒకప్పుడు బలంగా నిలిచిన దేశం.. ఆ తర్వాత ఆకలితో విలవిల్లాడే స్థితికి చేరింది. ఆయిల్ నిల్వలు ఉన్నా వాటిని అమ్మే దేశాలు లేకుండాపోయాయి. కరెన్సీ విలువ నేలమట్టమైన సమయంలో... దేశం ఆర్థికంగా కూలిపోయింది. అయితే మడూరో వెనక్కి తగ్గకుండా.. రష్యా, చైనా, ఇరాన్ వైపు తిరిగారు.సరిహద్దు సముద్రంలో పేలుళ్లుఇక 2025లో అమెరికా వెనిజులా మధ్య సరిహద్దు సముద్రంలో పేలుళ్లు మొదలయ్యాయి. అమెరికా సైన్యం వెనిజులా నౌకలపై అనేకసార్లు దాడుల చేసింది. ఈ ఘటనల్లో పదుల సంఖ్యలో వెనుజులా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత మడూరో ప్రజల ముందు వచ్చి అమెరికాను నేరుగా హెచ్చరించారు. అదే సమయంలో రష్యా, చైనా, ఇరాన్ నాయకులతో అత్యవసర చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించాయి. వెనిజులాకు క్షిపణి వ్యవస్థలు అందించడానికి పుతిన్ సర్కార్ అంగీకరించింది. రాడార్ నెట్వర్క్ విస్తరణకు చైనా సహకరిస్తానని చెప్పగా.. ఇరాన్ తన డ్రోన్ టెక్నాలజీని అందిస్తానని ప్రకటించింది. ఈ చర్యలతో అమెరికా మరింత కఠినంగా మారింది. ఈ మూడు దేశాల చర్యలను నార్కో టెరరిజంగా ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో అమెరికా నౌకాదళం.. కరేబియన్ సముద్రంలో తన సైనిక బలగాలను రెండింతలు పెంచింది. రహస్య గూఢచార వాహనాలు వెనిజులా గగనతలంలో ఇప్పటికే తిరుగుతున్నాయని సమాచారం.అమెరికా ఆధిపత్యానికి సవాలుఇక రష్యా, చైనా, ఇరాన్ ఈ ఘటనను అమెరికా ఆధిపత్యానికి సవాలుగా చూస్తున్నాయి. వెనిజులా తమకు వ్యూహాత్మక కేంద్రంగా మారుతుందని భావిస్తున్నాయి. రష్యా ఇప్పటికే నౌకాశ్రయ ఒప్పందం సిద్ధం చేసుకుంది. చైనా.. వెనిజులా ఆయిల్ బాకీలకు బదులుగా మిలిటరీ సదుపాయాలు కోరుతోంది. ఇరాన్.. వెనిజులాలోని గగనతల కేంద్రాలను డ్రోన్ నియంత్రణ స్థావరాలుగా మార్చే పనిలో ఉంది. ఇటు ఈ మొత్తం వ్యవహారంలో లాటిన్ అమెరికా అంతా ఆందోళనలో నిండిపోయింది. బ్రెజిల్, కొలంబియా, పెరూ దేశాలు భయంతో మౌనంగా ఉండిపోయాయి. ఇటు యూరప్తో పాటు యునైటెడ్ నేషన్స్ ఈ ఘర్షణను ఆపేందుకు ప్రయత్నిస్తున్నాయి కానీ..ట్రంప్ గారు వెనక్కి తగ్గేలా కనిపించడంలేదండి. ఇలా చూస్తే.. ప్రపంచం ఇప్పుడు ఒక కొత్త యుద్ధం అంచున నిలబడి ఉందనే చెప్పవచ్చు. ఒకవైపు అమెరికా ఆధిపత్యం, మరోవైపు రష్యా-చైనా-ఇరాన్ కూటమి. ఎవరు వెనక్కి తగ్గినా అది ఓటమే అవుతుంది.. ఎవరు ముందుకు కదిలినా అది యుద్ధానికి ప్రారంభమవుతుంది..! మరి చూడాలి ఏ క్షణాన ఏం జరుగుతుందోననే టెన్షన్ మాత్రం ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: రోజుకు 15 మందిని చంపేస్తున్న అతివేగం -
తదుపరి గురి వెనిజులా?
ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు గల లాటిన్ అమెరికా దేశం వెనిజులాను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు అమెరికా ఇపుడు సన్నాహాలు ప్రారంభించినట్లు కనిపిస్తున్నది. ఉక్రెయిన్, గాజా యుద్ధాల తర్వాత ఈ కొత్త పరిణామాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తు న్నాయి. తమ సన్నాహాలలో భాగంగా అమెరికా ఇటీవలి వారాలలో వెనిజులా సమీపంలోని కరీబియన్ సముద్రానికి 10 యుద్ధ నౌకలను, 10 ఎఫ్–35 యుద్ధ విమానాలను, ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక యుద్ధ నౌకను, ఒక అణుశక్తి జలాంత ర్గామిని మోహరించింది. ఇందుకు అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్న కారణాలు అదే ప్రాంతంలో గల ట్రినిడాడ్ దేశంతో కలిసి యుద్ధ విన్యాసాలు జరపటం, అదే విధంగా వెనిజులా నుంచి మాదక ద్రవ్యాల రవాణాను నిలువరించటం! కానీ, గత 35 సంవత్సరా లుగా ఎన్నడూ లేని స్థాయిలో సాగుతున్న మోహరింపుల ఉద్దేశం అదేనని ఎవరూ నమ్మటం లేదు.చమురు కోసమేనా?వెనిజులాలోని చమురు నిల్వలు 303 బిలియన్ బ్యారల్స్ అని అంచనా. వాటితో పోల్చినపుడు సౌదీ అరేబియా నిల్వలు 267 బిలియన్లు, ఇరాన్వి 208 బిలియన్లు, రష్యావి 80 బిలియన్లు కావ టాన్ని బట్టి పరిస్థితిని ఊహించవచ్చు. అయితే, పాశ్చాత్య దేశాల ఆంక్షలు, పెట్టుబడులకు – మౌలిక ఏర్పాట్లకు గల కొరత కారణంగా అక్కడ ఉత్పత్తి స్వల్పంగానే జరుగుతున్నది. మరొకవైపు అక్కడి నిల్వలను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు పాశ్చాత్య దేశాల కంపెనీల ప్రయత్నాలు నెరవేరటం లేదు. ఆ నిల్వలన్నింటి యాజ మాన్యం అక్కడి ప్రభుత్వ సంస్థ చేతిలో ఉంది. సోషలిస్టు పార్టీకి చెందిన హ్యూగో చావెజ్ ప్రభుత్వం లోగడ తీసుకున్న ఈ నిర్ణ యాన్ని, ఆయన వారసుడైన ప్రస్తుత అధ్యక్షుడు నికోలస్ మదురో కొనసాగిస్తున్నారు. ఇది ఎంతమాత్రం సరిపడని ట్రంప్, ఆయనను పడగొట్టేందుకు తన మొదటి పాలనా కాలంలోనూ ప్రయత్నించారు గానీ వీలుపడలేదు.వెనిజులాలో సోషలిస్టు పార్టీ బలమైనది. తమ దేశంలోగానీ, మొత్తం లాటిన్ అమెరికాలో గానీ అమెరికా జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చావెజ్ తన రోజులలో ప్రపంచవ్యాప్తంగా పేరు పడ్డారు. ఆయన మరణం తర్వాత అధ్యక్షుడైన మదురో స్వరంలో అటువంటి తీవ్రత లేకపోయినా, విధానాలలో ఎటువంటి మార్పూ లేదు. మదురో సమాజంలోని అడుగుస్థాయి నుంచి ఎదిగి వచ్చిన వాడు. 2013 నుంచి ఇప్పటికీ వరుసగా అధ్యక్షునిగా ఎన్నికవు తున్నారు. ఆయనకు ప్రజల మద్దతు సరేసరి కాగా, సమాజంలోని ఎగువ తరగతులు, పట్టణవాసులతోపాటు సైన్యం సమర్థన కూడా పూర్తిగా ఉందన్నది అంచనా. అందువల్లనే ఆయన్ని అమెరికా అనేక ఇతర లాటిన్ అమెరికా దేశాలలో చేసినట్లు అంతర్గత కుట్రల ద్వారా పడగొట్టలేక పోతున్నదనే అభిప్రాయం ఉంది. మాదక ద్రవ్యాల సాకుతో...ఒక విశేషం చెప్పుకోవాలి. గత ఎన్నికలలో మదురోతో పోటీ చేసి ఓడిన మరియా కొరీనా మచాడోకు ఇటీవలి నోబెల్ శాంతి బహుమతిని అందజేశారు. వెనిజులా సమీపాన అమెరికా సేనల మోహరింపుపై, ‘యుద్ధాన్ని మదురో ప్రారంభించారు, ట్రంప్ ముగించనున్నారు’ అని వ్యాఖ్యానించి ఆమె అందరినీ ఆశ్చర్య పరిచారు. ఈ నేపథ్యం ఇట్లుండగా, వెనిజులాపై చర్యలకు ట్రంప్ సాకులు వెతకటం మొదలుపెట్టారు. అందులో మొదటిది నిరుటి అధ్యక్ష ఎన్నికలలో అక్రమాలు జరిగాయనీ, అందువల్లనే మరియా మచాడో ఓడిందనీ ఆయన ఆరోపణ. మరొక దేశపు ఎన్నికల సక్ర మాలు, అక్రమాలను నిర్ధారించటమనే సాకుతో తమకు సరిపడని ప్రభుత్వాలను పడగొట్టజూడటం అమెరికాకు గతం నుంచి ఉన్న సంప్రదాయమే! అంతెందుకు? వెనిజులాకు సరిగా పొరుగునే గల బ్రెజిల్లో, ఎన్నికలలో గెలిచిన అధ్యక్షుడు లూలాతో ఓడిన బోల్సొ నారో తిరుగుబాటును, ఆయనపై కోర్టు చర్యలను ట్రంప్ బాహాటంగా వ్యతిరేకించారు. తన మిత్రుడైన బోల్సొనారోపై చర్యలు తీసు కున్నందుకు బ్రెజిల్పై సుంకాలను 50 శాతం పెంచారు. అమెరికా ఉద్దేశంలో ఇదంతా ప్రజాస్వామ్య పరిరక్షణ. కనుక ఇపుడు వెనిజులా ఎన్నికలు, మచాడో ఫిర్యాదులు అమెరికా అధ్యక్షునికి సాకులుగా ఉపయోగపడుతున్నాయి. అయితే, గత ఏడాదిగా సాగుతున్న ఈ ప్రయత్నాలు నెరవేరక పోతుండటంతో ట్రంప్ ఇటీవల కొత్త సాకు ముందుకు తెస్తున్నారు. వెనిజులా నుంచి తమ దేశంలోకి కొకైన్, ఫెంటానిల్ వంటి డ్రగ్స్ భారీగా రవాణా అవుతున్నాయంటున్నారు!మాదక ద్రవ్యాల సమస్య అమెరికాలో తీవ్రంగా ఉంది. కానీ అందులో వెనిజులా పాత్ర ఏమిటన్నది ప్రశ్న. అమెరికా సంస్థ ప్రక టించిన మాదక ద్రవ్యాల నివేదిక – 2025లో వెనిజులా ప్రస్తావన లేదు. కొకైన్, ఫెంటానిల్ తదితరాలన్నీ ఉత్పత్తి అవుతున్నది కొలంబియా, పెరూ, బొలీవియా, మెక్సికో వంటి చోట్ల. రవాణా మాత్రం స్వల్పస్థాయిలో వెనిజులా మీదుగా జరుగుతున్నది. ఇతరత్రా కూడా బయటి నిపుణుల అభిప్రాయం అదే.ఏకపక్ష దాడులుఈ వివరాలన్నీ గమనించినపుడు, అమెరికా అధ్యక్షుని లక్ష్యం మదురో ప్రభుత్వాన్ని పడగొట్టి తమ అనుకూలురను అధికారానికి తేవటమని తేలికగా అర్థం చేసుకోవచ్చు. ఆ మాట ట్రంప్ గత పర్యాయమే అన్నట్లు పైన చూశాము. అదే మాటను ఈసారి డొంక తిరుగుడుగా చెబుతుండగా, తన విదేశాంగ మంత్రి మార్కో రూబియో సూటిగానే అంటున్నారు. ఇటీవలి వారాలకు వస్తే, అక్కడ జోక్యం చేసుకుని రహస్య కార్యకలాపాలు సాగించవలసిందిగా సీఐఏను ఆదేశించినట్లు ట్రంప్ బాహాటంగానే ప్రకటించారు. మాదక ద్రవ్యాలు రవాణా అవుతున్నాయంటూ వెనిజులా తీరంలో పది బోట్లపై వైమానిక దాడులు జరిపి సుమారు యాభైమంది ప్రాణాలు తీశారు. ఆ రవాణా అబద్ధమని, అవన్నీ మామూలు బోట్లని మదురో ఖండించారు. మాదక ద్రవ్యాలకు ఆధారాలు దాడికి ముందుగానీ, తర్వాతగానీ ఉన్నాయా అన్న మీడియా ప్రశ్నలకు ట్రంప్ సమాధానమివ్వలేదు. ఐక్యరాజ్యసమితి సముద్రయాన, సముద్ర తీర చట్టాల ప్రకారం అసలు అటువంటి దాడుల అధికా రమే లేదని నిపుణులు స్పష్టం చేశారు. అయినా ఇదంతా ప్రపంచపు అమాయకత్వంగాని, అమెరికా ప్రయోజనాలకు ఎప్పుడు ఏది ప్రతిబంధకమైంది గనుక!టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
టేకాఫ్ అవుతూ కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్
కారాకస్: వెనెజులాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విమానం టేకాఫ్(Venezuela plane crash) అవుతూ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి.వివరాల ప్రకారం.. వెనెజులాలోని టాచిరాలోని పరమిల్లో ఎయిర్పోర్ట్లో విమానం టేకాఫ్ అయ్యింది. విమానం రన్వే నుంచి ఎగరగానే ఒక్కసారిగా గింగిరాలు తిరుగుతూ కిందపడిపోయింది. అనంతరం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.Ongoing: a PA-31 crashed in San Cristóbal (Venezuela), all 2 aboard died. Aircraft registration was YV1443 (Via pro_plane_pilot) pic.twitter.com/7Vjul7DDgw— Air Safety #OTD by Francisco Cunha (@OnDisasters) October 22, 2025 -
శాంతి సమరం ఇంటి పాఠమే!
‘ఇంటి నుంచే మొదలు కావాలి’ అని నైతిక విలువలకు సంబంధించి చెప్పే మాట. నైతిక విలువల నుంచి సామాజిక నిబద్ధత, సాహస ప్రవృత్తి వరకు ఇంట్లో నుంచే నేర్చుకుంది నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మరియా కొరినా. కుటుంబ వారసత్వం, కుటుంబ బంధాలు, ఉద్యమ బంధాల గురించి ఐరన్ లేడి మరియా మాటల్లోనే..నాన్న అడుగు జాడల్లో నడవాలనుకున్నాను కానీ...రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. నాన్న గొప్ప ఇంజినీర్, వ్యాపారవేత్త. దార్శనికుడు. ఎన్నో కంపెనీలు ప్రారంభించాడు. ఎంతోమందికి ఉపాధి కల్పించాడు.నాన్న ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవారు...‘దేశభవిష్యత్, దాని శ్రేయస్సు ఒక సంస్థ అభివృద్ధి, లాభాల కంటే ఎక్కువ. కంపెనీని ఎవరైనా స్థాపించవచ్చు. డబ్బులు సంపాదించడం కూడా సులభం. అయితే నైతిక ప్రమాణాలు ముఖ్యం’ కుటుంబ వారసత్వం అనేది నా బలం. నా పూర్వీకులు, అనేక తరాల వాళ్లు తమ మాతృదేశం కోసం ప్రతీది చేశారు. జైలు జీవితం అనుభవించారు. తరతరాల సందేశం ఒక్కటే... దేశాన్ని ప్రేమించు, బాధ్యతతో ప్రవర్తించు.దేశ చరిత్రను మా ఇల్లు చెప్పేది!నా చిన్నప్పుడు మా ఇల్లు వెనెజువెలా చరిత్రను చెప్పే ఉపాధ్యాయురాలిగా అనిపించేది. ఆ ఇల్లు దేశచరిత్రలో ఎన్నో కీలక ఘట్టాలకు సాక్షిగా నిలిచింది. ఒక విధంగా చె΄్పాలంటే వెనెజువెలా చరిత్రతో కలిసి పెరిగాను! మా అమ్మమ్మ ప్రఖ్యాత పుస్తకం ‘వెనెజువెలా హీరోయిక’ రచయిత ఎడ్వర్డో బ్లాంకో మనవరాలు, వెనెజువెలా మొదటి అధ్యక్షుడు జోస్ ఆంటోనియో పేజ్ సహాయకురాలు. చిన్నప్పుడు నేను విద్యార్థి నాయకుడు అరామండో జులోగా బ్లాంకో వీరాభిమానిని. విసెంటే గోమేజ్ నియంతృత్వంలో 24 సంవత్సరాల వయసులో బ్లాంకో హత్యకు గురయ్యాడు.నన్ను టెర్రరిస్ట్ అన్నారు!నేను గెలుస్తానని మొదట్లో చాలామంది నమ్మలేదు. ‘మీరు మహిళ కదా!’ ‘మీరు ఇంజినీర్ కదా! ‘మీది బాగా డబ్బున్న కుటుంబం కదా!’....ఇలాంటి మాటలే వినిపించేవి. లాటిన్ అమెరికాలోని పితృస్వామ్య భావజాల ప్రభావం వారి మాటల్లో కనిపించేది. ఒకానొక సమయంలో నన్ను టెర్రరిస్ట్గా ముద్ర వేస్తూ బెదిరింపు మెసేజ్లు అదేపనిగా రావడం మొదలయింది. నన్ను నేను రక్షించుకోవడానికి జాగ్రత్త పడడం తప్పనిసరి అనిపించింది. ఏ వ్యక్తీ అజ్ఞాతవాసంలో ఉండాలని నేను కోరుకోను. అయితే మరో కోణంలో చూస్తే మనల్ని మనం మరింతగా తెలుసుకోవడానికి, సవాళ్లను అధిగమించే శక్తిని సమకూర్చుకోవడానికి అజ్ఞాతవాసం అనేది ఒక అవకాశం.మాటలు మాత్రమే చాలవురాజకీయాలు, రాజకీయ నాయకులను అదేపనిగా విమర్శించడం ఒక్కటే సరిపోదు. మనవంతు కార్యాచరణ తప్పనిసరిగా ఉండాలి. ప్రజాస్వామ్యం, న్యాయం, స్వాతంత్య్రం కోసం పోరాడే సాహసికులు ఒక ప్రాంతం, దేశం అని కాదు ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రజలకు తరగని స్ఫూర్తిని ఇస్తారు. భయం చుట్టుముట్టిన సమయంఒక సభలో ప్రభుత్వ అవినీతి గురించి మాట్లాడుతున్నాను. హఠాత్తుగా నా కుమార్తె గుర్తుకు వచ్చింది. మాటలు ఆగిపోయాయి. కొన్ని నిమిషాలు మౌనం దాల్చాను. నా కుమార్తె ఎక్కడ ఉంది? క్షేమంగా ఉందా? నేను సభల్లో ప్రభుత్వ అవినీతిపై గొంతెత్తడం వల్ల నా బిడ్డకు హాని జరుగుతుందా?... ఇలా ఎన్నో ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. ఇంటికి వెళ్లి నా కుమార్తెను చూసుకునే వరకు నా మనసు మనసులో లేదు. ‘కుటుంబ బాధ్యతలు, ఉద్యమం అనే రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాను. ఇలా చేస్తే రెండిటికీ న్యాయం చేయలేను’ అనిపించింది.అమ్మ మాట‘నాకు దేవుడు ఎన్నో అద్భుత అవకాశాలు ఇచ్చాడు. నాకు ఎలాంటి లోటూ లేదు. నాకు ఎంతో మంది మద్దతు ఉంది... అనుకునేవాళ్లు తమ వంతుగా ఈ సమాజానికి తిరిగి ఇవ్వాలి’ అని చిన్నప్పుడు అమ్మ చెబుతుండేది. అమ్మానాన్నల మాటల సారాంశం ఒక్కటే... మనం వ్యక్తిగతంగా ఏ స్థాయిలో ఉన్నా సమాజ హితాన్ని మరవకూడదు. -
ట్రంప్కు నోబెల్ నిరాశ
వాషింగ్టన్: నోబెల్ శాంతి బహుమతిని బలవంతంగానైనా సాధించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చివరకు భంగపాటే ఎదురయ్యింది. తానే ప్రపంచంలో అతిపెద్ద శాంతి దూతనని, ఏడు యుద్ధాలను ఆపి ప్రపంచంలో శాంతిని నెలకొల్పానని, అందువల్ల తనకే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలన్న ఆయన వాదనను నోబెల్ కమిటీ ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారాన్ని వెనెజువెలా ప్రతిపక్ష నేత, ప్రజాస్వామ్య ఉద్యమకారిణి మరియా కొరినా మచాడోకు ప్రకటించటంతో ట్రంప్ కార్యవర్గంపై నోబెల్ కమిటీపై అక్కసు వెళ్లగక్కింది. నోబెల్ కమిటీ అసలైన శాంతి పరిరక్షకులకంటే రాజకీ యాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చిందని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్హౌస్ శుక్రవారం ఓ ప్రకటనలో విమర్శలు గుప్పించింది. మరోవైపు ‘మీడియా ప్రచారాన్ని నమ్మి నోబెల్ ఇవ్వం’ అని నోబెల్ కమిటీ స్పష్టం చేసింది. నోబెల్ కోసం ట్రంప్ డిమాండ్నోబెల్ శాంతి పురస్కారంపై ట్రంప్ ఆసక్తి ఇప్పటిది కాదు. ఆయన మొదటిసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచే దానిపై మనసు పారేసుకున్నారు. రెండోసారి అధ్యక్షుడయ్యాక ఏకంగా తనకు నోబెల్ పురస్కారం ఇచ్చి తీరాలని డిమాండ్ చేయటం మొదలుపెట్టారు. తనకు ఆ పురస్కారం రాకపోవటంకంటే తన రాజకీయ ప్రత్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఇవ్వటమే ట్రంప్ను అధికంగా మనోవేదనకు గురిచేస్తున్నట్లు ఆయన మాటల్లో స్పష్టమవుతోంది. ఈ ఏడాది మొదట్లో అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచే ఆయన నోబెల్ శాంతిబహుమతిపై కన్నేశారు. పలు దేశాలను బెదిరించి మరీ తనకు నామినేషన్ వేయించుకున్నారు. పది నెలల తన పాలనా కాలంలో ఏడు యుద్ధాలను ఆపానని, ఇంతకంటే శాంతి ప్రదాత ఎవరు ఉంటారని ప్రశ్నిస్తూ వచ్చారు. తనకు నోబెల్ ఇవ్వకుంటే అమెరికాను అవమానించినట్లేనని ఇటీవలే వ్యాఖ్యానించారు. పురస్కార ప్రకటనకు ఒక్క రోజు ముందు కూడా ఆయన దీనిపై స్పందించారు. ‘ఒబామా ఏమీ చేయకుండానే నోబెల్ పురస్కారం ఇచ్చారు. అమెరికాను ధ్వంసం చేసినందుకు ఆయనకు ఇచ్చారు. సరే.. వాళ్లు ఇప్పుడు ఏం చేయగలరో చేయనివ్వండి. ఏ నిర్ణయం ప్రకటించినా మంచిదే. దానికోసం (అవార్డు కోసం) నేను పనిచేయలేదు. ఎంతోమంది ప్రజల ప్రాణాలు కాపాడేందుకే నేను ఇదంతా (యుద్ధాలను ఆపటం) చేశాను’అని గురువారం తెలిపారు. నోబెల్ కోసం సొంత టీమ్తో ప్రచారం చేయించుకున్న ట్రంప్.. ఈ ఏడాది జూలైలో ఏకంగా నార్వే ఆర్థికమంత్రి జెన్స్ స్టాల్టె్టన్బెర్గ్కు స్వయంగా ఫోన్ చేసి తనకు నోబెల్ ఇవ్వకుంటే టారిఫ్లు తప్పవన్నట్లు మాట్లాడారని నార్వే మీడియా పేర్కొంది.గడువు ముగిసిన తర్వాత నామినేషన్లుఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారానికి ఫిబ్రవరి 1వ తేదీతో నామినేషన్ల గడువు ముగిసిపోయింది. ట్రంప్ తరఫున అనేక నామినేషన్లు వచ్చినప్పటికీ, చాలావరకు ఈ గడువు ముగిసిన తర్వాత వచ్చినవే ఉన్నాయి. ఈ ఏడాది మేలో చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో చావు దెబ్బ తిన్న పాక్ను ట్రంప్ చేరదీసి భరోసా ఇవ్వ టంతో.. ఆ తర్వాత పాకిస్తాన్.. ట్రంప్కు నోబెల్ శాంతిపురస్కారం ఇవ్వాలని ప్రతిపాదించింది. ఇజ్రాయెల్తో కూడా బ లవంతంగా గత నెలలో ట్రంప్ నామి నేషన్ ఇప్పించుకున్నారు. అయితే, ఈ పురస్కా రం కోసం ట్రంప్ యంత్రాంగం గత ఏడాది డిసెంబర్ నుంచే ప్రచారం మొద లుపెట్టింది. అందుకోసం అధ్యక్ష కార్యాల యం ఓవల్ ఆఫీస్నే కేంద్రంగా చేసు కోవటం గమనార్హం.నోబెల్ కమిటీపై వైట్హౌస్ ఫైర్ ట్రంప్కు నోబెల్ పురస్కారం ఇవ్వకపోవటంపై అధ్యక్ష భవనం వైట్హౌస్ ప్రతినిధి స్టీవెన్ చెంగ్ అక్కసు వెళ్లగ క్కారు. ‘శాంతి ఒప్పందాలు కుదురుస్తూ, యుద్ధాలు ఆపుతూ, ప్రజల ప్రాణాలు కాపాడే పనిని అధ్యక్షుడు ట్రంప్ కొనసాగిస్తూనే ఉంటారు. ఆయనది గొప్ప మానవతా హృదయం. తన సంకల్ప శక్తితో పర్వతాలను సైతం కదిలించగల ఆయనలాంటి వ్యక్తి మరొకరు ఉండదు. నోబెల్ కమిటీ శాంతికంటే రాజకీయాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది’అని విమర్శించారు. అయితే, శాంతి పురస్కా రానికి అభ్యర్థి ఎంపికపై నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్మన్ జోర్డాన్ స్పష్టత ఇచ్చారు. ‘నాకు తెలిసి ఈ కమిటీ ఇలాంటి ప్రచారాలు, మీడియా రిపోర్టులను చాలా చూసే ఉంటుంది. శాంతి స్థాపన కోసం అది చేశాం, ఇది చేశామని పేర్కొంటూ మాకు ఏటా వేల లేఖలు వస్తాయి. నోబెల్ పురస్కా రాలు పొందిన గొప్ప వ్యక్తుల చిత్రపటాలతో నిండిన ఓ గదిలో ఈ కమిటీ కూర్చుని చర్చిస్తుంది. ఆ గది సమగ్రత, ధైర్యసాహసాలతో నిండి ఉంటుంది. ఆల్ఫ్రెడ్ నోబెల్ సేవలు, ఆయన రాసిన విల్లులోని అంశాల ఆధారంగానే మేం నిర్ణయాలు తీసుకుంటాం’అని స్పష్టంచేశారు. -
ప్రజాస్వామ్య గళానికి శాంతి నోబెల్
ఓస్లో: ఎవరిని వరిస్తుందా అని ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నోబెల్ శాంతి బహుమతి 2025 సంవత్సరానికి వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో (57)కు లభించింది. ఓస్లోలో నోబెల్ కమిటీ శుక్రవారం ఈ మేరకు ప్రకటన చేసింది. ‘చుట్టూ చీకట్లు ముసురుకుంటున్నా ధైర్యంగా నిలబడి ప్రజాస్వామ్య అగ్నిజ్వాలను ఆరిపోకుండా రగిలించారు. లక్షల మందికి ఆదర్శంగా నిలిచారు’అని మచాడోను నోబెల్ కమిటీ ప్రశంసల్లో ముంచెత్తింది. ప్రపంచవ్యాప్తంగా ఏడు యుద్ధాలు ఆపిన తనకే నోబెల్ శాంతి బహుమతి దక్కాలని ఎంత బలంగా వాదించినా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నిరాశే ఎదురయ్యింది. నిర్బంధాలను ఎదిరించి నిలిచిన నేతకమ్యూనిస్టు వెనెజువెలాలో ప్రజాస్వామ్యం కోసం మరియా కొరినా మచాడో పోరాడుతున్నారు. నికొలాస్ మదురోకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసి పోరాటం చేస్తున్నారు. దీంతో ఆమెపై మధురో ప్రభుత్వం తీవ్ర నిర్బంధం విధించింది. ఇతర విపక్ష నేతలంతా అరెస్టులకు భయపడి దేశం విడిచి వెళ్లిపోయినా ఆమె మాత్రం సొంత దేశంలోనే ఉండి ప్రజాస్వామ్య వాదులకు స్ఫూర్తినిస్తున్నారు. గత సంవత్సరం వెనెజువెలాలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అధ్యక్షుడు మదురోకు పోటీగా ఎన్నికల్లో నిలబడుతున్నట్లు మరియా ప్రకటించారు. కానీ, ఆ దేశ ఎన్నికల సంఘం ఆమె అభ్యర్థిత్వాన్ని తిరస్కరించింది. దీంతో ఆమె మరో ప్రతిపక్ష నేత ఎడ్ముండో గోంజాలెజ్కు మద్దతు పలికారు. కానీ, ఎన్నికల్లో మదురో 51.95 శాతం ఓట్లు సాధించి విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మదురో వరుసగా మూడోసారి అధ్యక్షుడ య్యారు. ఆ వెంటనే ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్ష నేతలపై ఉక్కుపాదం మోపారు. దీంతో చాలామంది దేశం విడిచి వెళ్లిపోవటమో, అజ్ఞాతంలోకి వెళ్లటమో జరిగింది. మరియా కూడా ఏడాది కాలంగా అజ్ఞాతంలోనే ఉన్నారు. గోంజాలెజ్ స్పెయిన్లో రాజకీయ ఆశ్రయం పొందారు. అయితే, ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. గోంజాలెజ్ 67 శాతం ఓట్లు సాధించి స్పష్టమైన విజయం సాధించారని మరియా ఎన్నికల తర్వాత వాల్స్ట్రీట్ జర్నల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించారు. ఇంజనీర్ నుంచి రాజకీయ నేతగామరియా మచాడో వెనెజువెలా రాజధాని కారకాస్లో అక్టోబర్ 7, 1967లో జన్మించారు. ఇండస్ట్రియల్ ఇంజనీర్గా కెరీర్ ప్రారంభించిన ఆమె.. 2002లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ సంవత్సరమే ఆమె రాజకీయ హక్కులు, ఎన్నికల పర్యవేక్షణ కోసం సుమటే పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. దాని ద్వారా వెనెజువెలాలో ప్రజాస్వామ్య పోరాటం చేస్తున్నారు. ‘బుల్లెట్ల స్థానంలో బ్యాలెట్ను ప్రోత్సహించటమే నా లక్ష్యం’అని గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మచాడో వెనెజువెలా కులీన (ప్రభువర్గం) వర్గానికి చెందినవారు. వెనెజువెలా మూడో మార్వి్కజ్ ఆఫ టోరో (ఆ దేశంలో ప్రభువులకు ఇచ్చే బిరుదు) సెబాస్టియన్ జోష్ ఆంటోనియో రోడ్రిగేజ్ డెల్ టోరో యే అసానియో వారసురాలు. ఆ దేశ ప్రముఖ రచయిత, రాజకీయ నాయకుడు ఎడ్వార్డో బ్లానో ఆమెకు ముత్తాత అవుతారు. ఆమె ఆండ్రెస్ బెల్లో క్యాథలిక్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చది వారు. ఇన్స్టిట్యూటో డి ఎస్టుడియోస్ సుపీరియరెస్ డి అడ్మినిస్ట్రాసియోలో మాస్టర్స్ చేశారు. ఆమెకు ముగ్గురు సంతానం. 1992లో ఈటెనా ఫౌండేషన్ను స్థాపించారు. అయితే, 2002 నుంచి సుమటే కార్యక్రమాలతో ఆమెకు దేశంలో మంచి పేరు వచ్చింది. 2011 నుంచి 2014 వరకు ఆ దేశ నేషనల్ అసెంబ్లీ సభ్యురాలిగా కొనసాగారు. ప్రస్తుతం ‘వెంటే వెనెజువెలా’రాజకీయ పార్టీకి సమన్వయకర్తగా కొనసాగుతున్నారు. ఆ పార్టీ తరఫున ఆమె 2012లోనే అధ్యక్ష బరిలో దిగారు. కానీ, ప్రైమరీ ఎన్నికల్లోనే ఓడిపోయారు. 2023లో మరోసారి ప్రైమరీ ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష అభ్యర్థిగా నిలిచారు. కానీ, ఆమె అభ్యర్థిత్వాన్ని ఎన్నికల సంఘం రద్దు చేసింది. గత దశాబ్ద కాలంగా అధ్యక్షుడు మదురోకు వ్యతిరేకంగా జరుగు తున్న ప్రజాస్వామ్య పోరాటాలకు ఆమె నాయకత్వం వహిస్తున్నారు.ఒక అసాధారణ మహిళమరియా మచాడో సేవలను నోబెల్ కమిటీ గొప్పగా ప్రశంసించింది. ‘ఇటీవలి కాలంలో లాటిన్ అమెరికాలో అసాధారణ పౌర సాహసికుల్లో మచాడో ఒకరు’అని కొనియాడింది. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా గొప్పగా పోరాడుతున్నారని జోర్డాన్ వాట్నీ పేర్కొన్నారు. ఓస్లోలో ఈ అవార్డు ప్రకటించిన సమయంలో వెనెజువెలాలో రాత్రి సమయం కావటంతో ఆమె ఒక గుర్తు తెలియని ప్రాంతంలో నిద్రపోతున్నారు. నోబెల్ కమిటీ సభ్యులు ఆమెకు నేరుగా ఫోన్ చేసి విషయం చెప్పగానే షాక్కు గురయ్యారు. ‘దేవుడా.. నాకు మాటలు రావటం లేదు. ఇది ఒక ఉద్యమం, మొత్తం సమాజం సాధించిన ఫలితం ఇది. నేను కేవలం ఒక వ్యక్తిని మాత్రమే. వ్యక్తిగతంగానే ఈ పురస్కారానికి నేను అర్హురాలిని కాదు’అని పేర్కొన్నారు. మచాడోకు నోబెల్ పురస్కారం రావటంపై వెనెజువెలాలోని ఆమె మద్దతుదారులు సంబరాలు చేసుకుంటుంటే, మదురో మద్దతు దారులు నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. ‘దేశంలో పరిస్థితిని మెరుగుపర్చటం ఎలాగో నాకు తెలియదు కానీ, నోబెల్ శాంతి పురస్కారానికి ఆమె (మచాడో) మాత్రం సంపూర్ణంగా అర్హురాలు’అని సాండ్రా మార్టినెజ్ అనే 32 ఏళ్ల మహిళ సంతోషం వ్యక్తంచేశారు. -
ట్రంప్కు దక్కని నోబెల్!
ప్రకటించటానికి ముందే రివాజుకు భిన్నంగా అందరి నోళ్లలోనూ నానిన నోబెల్ శాంతి పురస్కారం ఈ ఏడాది వెనిజులా విపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడోకుదక్కింది. ఆ దేశంలో ప్రజాస్వామిక హక్కుల కోసమూ... నిరంకుశత్వం నుంచి ప్రజాస్వా మ్యానికి న్యాయమైన, శాంతియుతమైన పరివర్తన సాధించేందుకూ ఆమె చేస్తున్న పోరాటానికి గుర్తింపుగా దీన్ని అందిస్తున్నట్టు నార్వే నోబెల్ కమిటీ తెలియజేసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ పురస్కారంపై బాగా ఆశలు పెట్టుకున్నారు గనుక సహజంగానే ఈ నిర్ణయాన్ని వైట్ హౌస్ తప్పుబట్టింది. శాంతికన్నా రాజకీయాలకే కమిటీ ప్రాధాన్యమిచ్చిందని విమర్శించింది. కమిటీపై ఈ మాదిరి విమర్శలు గతంలో చాలా వచ్చాయి. మేధావులూ, సామాజిక అధ్యయనకారులూ ఆ పని చేసేవారు. అమెరికా, పాశ్చాత్య దేశాలు ప్రాధాన్యతా అంశంగా భావించే వైపు ప్రపంచ ప్రజల చూపు మర ల్చటం కోసం నోబెల్ కమిటీ ప్రయత్నిస్తున్నదని విమర్శించేవారు. ఇప్పటికే ట్రంప్ వెనిజులాను అష్టదిగ్బంధం చేశారు. గత నెల మొదట్లో వెనిజులా స్పీడ్ బోట్లు రెండింటిపై అమెరికా సైన్యం విరుచుకు పడటంతో 17 మంది మరణించారు. ఇంతవరకూ అవి మాదక ద్రవ్యాలున్న బోట్లని చెప్పే ఆధారాలేమీ అమెరికా ప్రకటించలేదు. ఇది కేవలం మొదటి దశ అని, రెండో దశ వెనిజులా గడ్డపై ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. అది సైనిక జోక్యం కావొచ్చన్న అంచనాలున్నాయి. అమెరికా ఆర్థిక ఆంక్షలతో ఆ దేశం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. వీటన్నిటిపైనా మచాడో స్పందనేమిటో తెలియదు. నిజానికి ఈ ఏడాది సూడాన్లో అత్యవసర సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థ, ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ, డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ ఈ రేసులో ఉంటా యని పలువురు అనుకున్నారు. యుద్ధాన్ని వ్యతిరేకించటమో, కాల్పుల విరమణ సాధించటమో పురస్కారానికి అర్హత సాధించిపెడుతుందని ట్రంప్ అనుకున్నందుకు ఆయన్ను నిందించి ప్రయోజనం లేదు. అందుకు నోబెల్ కమిటీ బాధ్యత కూడా ఉంది. గతంలో కమిటీ ఇచ్చిన కొన్ని పురస్కారాలు గమనిస్తే ఈ సంగతి బోధపడుతుంది. 2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఈ పురస్కారం ప్రకటించే నాటికి ఆయన అధికారంలోకొచ్చి తొమ్మిది నెలలైంది. ‘విశ్వ మానవాళి ఆకాంక్షల పరిరక్షణలో అమెరికా నిర్ణయాత్మక పాత్రను ఈ పురస్కారం ధ్రువీకరిస్తున్నద’ని ఒబామా ఘనంగా చెప్పుకొన్నారు. కానీ ఆ బహుమతి తనకెందుకిచ్చారో ఇప్పటికీ తెలియటం లేదని 2016లో ఆయన నిజాయతీగా ఒప్పుకొన్నారు. బుష్ మొదలెట్టిన యుద్ధాలను ఆయన మరింత ముందుకు తీసుకుపోయారు. ఒబామా ఏలుబడిలో లిబియా, సిరియా, సోమాలియా, అఫ్గాన్లలో అమెరికా సైన్యం దాడుల్లో వేలాదిమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో నోబెల్ ఎంపిక కమిటీ కార్యదర్శిగా వ్యవహరించిన గీర్లెండ్స్టెడ్ అది ఘోర తప్పిదమని 2015లో అంగీకరించారు. వాస్తవానికి 1973లో నాటి అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్కు శాంతి బహుమతి ప్రకటించినప్పుడు ప్రపంచం నివ్వెరపోయింది. 1971లో బొలీవియా, 1973లో చిలీ దేశాల్లో సైనిక తిరుగు బాట్లకు పథక రచన చేయటం, బంగ్లాదేశ్లో పాక్ సైన్యం సాగించిన నరమేధానికిఅండదండలీయటం, అనేక చోట్ల నియంతృత్వ ప్రభుత్వాలకు చేయూతనందించటం వగైరాల్లో ఆయన పాత్ర అత్యంత దారుణమైనది. నిరాయుధీకరణకూ, అంతర్జాతీయ సౌభ్రాతృత్వానికీ చిత్తశుద్ధితో పనిచేసేవారికి మొదట్లో ఆ బహుమతి ఇచ్చేవారు. అటుతర్వాత ఇతరేతర ప్రయోజనాలూ, ఉద్దేశాలూ వచ్చిచేరాయి. వర్తమానంలో ఆయుధాలు పోగేసుకోవటం, బెదిరించటం, క్షిపణులూ, బాంబులతో విధ్వంసం సృష్టించటం ఘనకార్యాలుగా చలామణీ అవుతున్నాయి.అలాంటి అధినేతలు దృఢమైన నాయకులుగా నీరాజనాలందుకుంటున్నారు. ఆ దృక్ప థాన్ని మార్చి శాంతి అంటే యుద్ధం లేకపోవటం మాత్రమే కాదనీ, సమాజంలో సమానత్వ సాధనకు కృషి చేయటం, ప్రపంచ శాంతికి దోహదపడటం అని అందరూ గుర్తించేందుకు నోబెల్ కమిటీ తన వంతు ప్రయత్నించిన దాఖలా లేదు. మరి ఈ పురస్కారాల పరమార్థం ఏమిటో ఆ కమిటీయే ఆత్మవిమర్శ చేసుకోవాలి. -
అంతా ట్రంప్ చలవే.. మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం: ‘నోబెల్ శాంతి’ విజేత
నోబెల్ శాంతి పురస్కారం ప్రకటన తర్వాత వైట్హౌస్ నుంచి విమర్శల వాన కురిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కాకుండా వెనెజులా ప్రతిపక్ష నేత, ఆ దేశంలో ప్రజాస్వఘ్యానికి పాటుబడ్డ మరియా కొరీనా మచోడాకు నోబెల్ శాంతి పురస్కారం లభించడమే అందుకు కారణం.నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించే క్రమంలో సదరు కమిటీ రాజకీయ దురుద్దేశంతోనే మరియాకు ఆ ప్రతిష్టాత్మక బహుమతిని కేటాయించిందని మండపడింది వైట్హౌస్. శాంతి అవార్డుల్లో కూడా పాలిటిక్స్ను జోడించారని విమర్శించింది. ఇదిలా ఉంచితే, మరియా పదే పదే ట్రంప్పై గతంలో ప్రశంసలు కురిపించిన ట్వీట్లు ఇప్పుడు వైరల్గా మారాయి. వెనెజులా శాంతి స్థాపనలో ట్రంప్ కృషి వెలకట్టలేనిదని నోబెల్ శాంతి పురస్కారం గెలుచుకున్న మరియా ప్రశంసించిన ట్వీట్లు ఇప్పుడు వైరల్గా మారాయి. ‘ అంతా మీ చలవే.. ట్రంప్ను గుర్తుపెట్టుకుంటాం’ అంటూ ఆమె చేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారాయి. 2025 నోబెల్ శాంతి పురస్కారం విజేత మరియా కొరీనా మచాడో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి పలు సందర్భాల్లో కొనియాడారు. ముఖ్యంగా వెనిజులా ప్రజాస్వామ్య పోరాటానికి ఆయన మద్దతును కొనియాడారు.. ట్రంప్ను “వెనిజులా స్వేచ్ఛకు అత్యంత గొప్ప అవకాశంగా” ఆమె అభివర్ణించారు. ట్రంప్ పాలనలో మడురో ప్రభుత్వంపై అంతర్జాతీయ ఒత్తిడి పెరిగి, ప్రజాస్వామ్య స్వేచ్ఛకు దోహదపడిందన్నారు.President Trump,Your unwavering support for Venezuela’s fight for democracy is deeply valued. With extraordinary courage, the Venezuelan people have consistently defied fear and brutal repression, standing united to reject a criminal regime desperate to cling to power and… https://t.co/7EVCvHiQ2v— María Corina Machado (@MariaCorinaYA) January 11, 2025 ఇక ట్రంప్కు నోబెల్ శాంతి పురస్కారం దక్కకపోవడంతో రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ‘ నా నోబెల్ నాకు కావాలి’ అంటూ ట్రంప్ను ట్రోల్స్ చేస్తున్నారు. ఇవి కూడా చదవండి: మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారంనోబెల్ బహుమతి వెనుక రాజకీయ కుట్ర?.. ట్రంప్ సంచలన ఆరోపణ! -
నోబెల్ బహుమతి అంటే పేరు మాత్రమే కాదు.. కోట్ల రూపాయల ప్రైజ్ మనీ కూడా!
ఓస్లో: ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి మరియా కొరనీ మచాడోను వరించింది. వెనెజువెలాకు చెందిన మరియా కొరీనా ప్రజాస్వామ్య హక్కల కోసం పోరాడినందుకు గానూ నార్వే నోబెల్ కమిటీ ఆమెకు ఈ బహుమతి అందిస్తున్నట్లు తెలిపింది.ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత అరుదైన నోబెల్ శాంతి పురస్కారం పొందిన గ్రహితలకు అందే ప్రొత్సహకాలపై చర్చ మొదలు కాగా.. వాటి వివరాలు నోబెల్ పీస్ ప్రైజ్ వెబ్సైట్లో ఉన్నాయి. వాటి ఆధారంగా ఎవరైతే నోబెల్ శాంతి బహుమతి పొందారో వారికి ప్రైజ్ మనీ కింద 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్ (SEK) అందుతుంది. అంటే ఇండియన్ కరెన్సీలో అక్షరాల రూ.10 కోట్లు పైచిలుకు మొత్తాన్ని దక్కించుకోవచ్చు. స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ కోరిక మేరకు 1901 నుంచి అవార్డుల ఇవ్వడం ప్రారంభమైంది. మానవాళికి ప్రయోజనం చేకూర్చుతూ పాటుపడిన శాంతి, సాహిత్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యం, ఆర్థిక శాస్త్రాలు ఆరురంగాల వారికి అందిస్తూ నిర్ణయం తీసుకున్నారు.తన మరణానికి ఒక సంవత్సరం ముందు, 1895 నవంబర్ 27న తన వీలునామాపై సంతకం చేసిన ఆల్ఫ్రెడ్ నోబెల్, తన సంపదలో ఎక్కువ భాగాన్ని, SEK 31 మిలియన్లకు పైగా (నేడు సుమారు SEK 2.2 బిలియన్లు) సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టారు. ఆ పెట్టుబడి నుంచి వచ్చిన ఆదాయాన్ని ఏటా మానవాళికి గణనీయంగా ప్రయోజనం చేకూర్చిన వారికి బహుమతులుగా పంపిణీ చేసేలా వీలునామాలో పేర్కొన్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ఆధారంగా పైన పేర్కొన్న ఆరు రంగాల్లో విశేష కృషి చేసినందుకు నోబెల్ బహుమతి అందివ్వడం ఆనవాయితీగా వస్తుంది. నోబెల్ బహుమతి పొందిన వారికి భారీ మొత్తంలోప్రైజ్ మనీ దక్కనుంది.పతకం రూపకల్పన నోబెల్ శాంతి బహుమతి పతకాన్ని నార్వేజియన్ శిల్పి గుస్తావ్ విజిలాండ్, స్వీడిష్ శిల్పి ఎరిక్ లిండ్బర్గ్ సహకారంతో రూపొందించారు. ఈ పతకం మొదట 1902లో అవార్డు వేడుకలో ఉపయోగించారు. ఆరంభంలో.. 23-క్యారెట్ బంగారంతో తయారు చేశారు. బరువు 192 గ్రాములు 1980 తర్వాత.. 18 క్యారెట్ బంగారంగా మార్చారు. బరువు కొద్దిగా పెరిగి 196 గ్రాములు అయ్యింది.వ్యాసం: 6.6 సెంటీమీటర్లు ఇది స్థిరంగా ఉంది.పతకం రూపం,చిహ్నాలు:నోబెల్ ప్రైజ్ ముందు భాగం ఆల్ఫ్రెడ్ నోబెల్ పోర్ట్రెయిట్ఆయన పేరు, జనన తేదీ, మరణ సంవత్సరంవెనుక భాగం:ముగ్గురు నగ్న పురుషులు కౌగిలించుకున్న దృశ్యంఇది అంతర్జాతీయ సోదరభావానికి చిహ్నంలాటిన్ శాసనం: Pro pace et fraternitate gentium ‘ప్రజల మధ్య శాంతి, సోదరభావం కోసం’అంచు:5 మిల్లీమీటర్ల మందపాటి అంచు చుట్టూసంవత్సరం, అవార్డు గ్రహీత పేరు చెక్కబడి ఉంటుందిఈ పతకం రూపకల్పన, దాని చిహ్నాలు, దాని వెనుక ఉన్న భావన నోబెల్ శాంతి బహుమతికి ఉన్న ఆధ్యాత్మికత, గౌరవం, ప్రపంచ శాంతికి అంకితభావాన్ని ప్రతిబింబిస్తాయి. -
మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారం
వెనెజులాకు చెందిన ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారం వరించింది. చీకటిలో ప్రజాస్వామ్య జ్వాలను వెలిగించే సాహసిగా శాంతి కోసం ఆమె చేసిన విశేష కృషికి గాను ఈ పురస్కారం లభించింది. 1967 అక్టోబర్ 7న జన్మించిన మరియా కొరీనా మచాడో.. 2002లో రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో ఆమె చేసిన కృషికి వెనిజులా ఐరన్ లేడీగా కూడా ఆమె పేరు పొందారు, టైమ్ మ్యాగజైన్ -'2025లో 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు' జాబితాలో ఆమె చోటు సంపాదింకున్నారు కూడా. 2012లో వెనుజులా అధ్యక్ష పదవి కోసం పోటి చేసిన మరియా.. 2014లో దేశంలో ఆందోళనలకు న్యాయకత్వం వహించారు .వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో ఆమె అవిశ్రాంత కృషి, నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యానికి న్యాయమైన, శాంతియుత పరిష్కారాన్ని సాధించడానికి చేసిన పోరాటం కోసం మచాడోను గుర్తిస్తున్నట్లు నోబెల్ కమిటి స్పష్టం చేసింది. పెరుగుతున్న చీకటిలో ప్రజాస్వామ్య జ్వాలను వెలిగించే సాహసిగా, నిబద్ధత కలిగిన శాంతి విజేతగా మచాడోను కమిటీ ప్రశంసించింది.రాజకీయ పాత్ర..Vente Venezuela అనే రాజకీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. Súmate అనే సంస్థ స్థాపించి స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం పనిచేశారు2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హత పొందిన తర్వాత, ప్రత్యామ్నాయ అభ్యర్థికి మద్దతు ఇచ్చి ప్రజలలో చైతన్యం కలిగించారు.ఎన్నికల మోసాలను బయటపెట్టేందుకు స్వయంగా పర్యవేక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.విద్యా నేపథ్యం:ఇండస్ట్రీయల్ ఇంజినీరింగ్ఫైనాన్స్ స్పెషలైజేషన్యేలె యూనివర్శిటీ వరల్డ్ ఫెల్లోస్ ప్రోగ్రామ్అంతర్జాతీయ గుర్తింపుబీబీసీ-100 మంది అత్యంత ప్రభావంతుల జాబితాలో చోటు(2018)చార్లెస్ టి. మానాట్ ప్రైజ్(2014)లిబరల్ ఇంటర్నేషనల్ ఫ్రీడమ్ ప్రైజ్(2019)ఇదీ చదవండి: బిగ్ షాక్.. డొనాల్డ్ ట్రంప్కి దక్కని నోబెల్ శాంతి బహుమతి -
వెనిజులాలో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు
కారాకస్: దక్షిణ అమెరికాలోని వెనిజులాలో(venezuela) భారీ భూకంపం సంభవించింది. భూకంపం(Earthquake) తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదు అయినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. భూకంప తీవ్రత కారణంగా ప్రజలందరూ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో వెనిజులాలో భూకంపం సంభవించింది. జులియా రాష్ట్రంలోని మెనేగ్రాండే ప్రాంతానికి తూర్పు-ఈశాన్య దిశలో 24 కిలోమీటర్ల (15 మైళ్లు) దూరంలో, రాజధాని కారకాస్ కు పశ్చిమాన 370మైళ్లు (600 కిలోమీటర్లు)కంటే ఎక్కువ దూరంలో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. భూకంపం ఐదు మైళ్లు (7.8కిలో మీటర్లు) లోతులో ఉందని ఏజెన్సీ నివేదించింది. మెనే గ్రాండే దేశ చమురు పరిశ్రమకు ముఖ్యమైన ప్రాంతమైన మారకైబో సరస్సుకు తూర్పున భూకంప కేంద్రం ఉంది.BREAKING: A powerful M6.2 earthquake has struck northwest Venezuela near Maracaibo, Zulia state.•Depth: just 7.8 km (very shallow)•230,000+ people felt strong to very strong shaking•USGS: 10–100 deaths possible, major damage likely•Tremors reached Caracas and parts of… pic.twitter.com/j3Ysx1sTK5— Sarcasm Scoop (@sarcasm_scoop) September 25, 2025కాగా, భూకంపం ప్రభావంతో పలు ప్రాంతాల్లోని ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఆస్తి, ప్రాణ నష్టంపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు.. వెనిజులాలోని అనేక రాష్ట్రాలతోపాటు పొరుగున ఉన్న కొలంబియా, కరీబియన్ నెదర్లాండ్స్, కరసౌ, అరుబాలతోపాటు మొత్తం ఆరు దేశాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ముఖ్యంగా వెనిజులా, కొలంబియాలో భూకంప తీవ్రత ఎక్కువగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Un fuerte terremoto de magnitud 6.1 sacude varias regiones en Venezuela este miércoles. pic.twitter.com/D8lrT4WqaU— Diario La Noticia (@lanoticiahn) September 25, 2025Blast evacuates Caracas subway as massive quake pummels VenezuelaNO reports the earthquake caused metro shutdown pic.twitter.com/SDgmCjmLBH— RT (@RT_com) September 25, 2025 -
సొంతగడ్డపై ఆఖరి మ్యాచ్లో...
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ సొంతగడ్డకు ఘనంగా వీడ్కోలు పలికాడు. కెరీర్కు ఇంకా రిటైర్మెంట్ ప్రకటించనప్పటికీ అర్జెంటీనాలో మాత్రం ఇదే తన ఆఖరి పోరని ఇది వరకే స్పష్టం చేసిన మెస్సీ సొంత అభిమానులను 2 గోల్స్తో మురిపించాడు. దీంతో శుక్రవారం జరిగిన దక్షిణ అమెరికా జోన్ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్లో అర్జెంటీనా 3–0తో వెనిజులాపై ఘనవిజయం సాధించింది. తొలి అర్ధభాగంలో 39వ నిమిషంలో, ద్వితీయార్ధంలో 80వ నిమిషంలో మెస్సీ గోల్స్ కొట్టాడు. మరో గోల్ను మార్టినెజ్ (76వ నిమిషంలో) చేశాడు. మెస్సీ కుమారులు, కుటుంబసభ్యులు ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా మైదానానికి వచ్చి తిలకించారు. వచ్చే ఏడాది ప్రపంచకప్ కోసం దక్షిణ అమెరికా నుంచి తాజాగా ఉరుగ్వే, కొలంబియా, పరాగ్వే జట్లు మెగా ఈవెంట్కు అర్హత సాధించాయి. అర్జెంటీనా మార్చిలోనే క్వాలిఫై అయ్యింది. -
పడవలో తెగిపడిన తలలు యుద్ధం ఆరంభం
-
‘మదురో అరెస్టు’ బహుమతి రెట్టింపు
వాషింగ్టన్: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టుకు సమాచారం ఇచ్చిన వారికి రూ.438 కోట్లు బహుమానంగా ఇస్తామని అమెరికా ప్రకటించింది. మదురోను ప్రపంచంలోనే అతి పెద్ద డ్రగ్ స్మగ్లర్గా అభివర్ణించింది. గతంలో రూ.250 కోట్లుగా ఉన్న బహుమతిని మళ్లీ పెంచినట్లు అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండీ ప్రకటించారు. మదురోకి డ్రగ్స్ స్మగ్లర్లతో నేరుగా సంబంధాలున్నాయని ఆమె ఆరోపించారు. మదురో, అతని సహచరులతో సంబంధం ఉన్న 30 టన్నుల కొకైన్ను డ్రగ్ ఎన్పోర్స్మెంట్ అడ్మిని్రస్టేషన్ (డీఈఏ) స్వా«దీనం చేసుకుందని, అందులో 7 టన్నులు మదురోకి చెందినవని అన్నారు. ఈ ఆరోపణలను వెనిజులా విదేశంగ మంత్రి ఇవాన్ గిల్ ఖండించారు. బహుమతి ప్రకటనను రాజకీయ ప్రచారంగా అభివరి్ణంచారు. తమ దేశ గౌరవం అమ్మకానికి లేదన్నారు. జెఫ్రీ ఎపిస్టీన్ కేసు వ్యవహారంలో విమర్శల నుంచి దృష్టి మళ్లించేందుకే బోండీ ఈ చర్య తీసుకున్నారని ఆయన ఆరోపించారు. మొదటి పదవీకాలం నుంచే.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మదురోపై చాలాకాలంగా విమర్శలు చేస్తున్నారు. తన తొలి పదవీకాలంలోనే మదురో, పలువురు ఉన్నతాధికారులపై డ్రగ్ ట్రాఫికింగ్, నార్కో టెర్రరిజం, అవినీతి ఆరోపణలు మోపారు. మదురో కొలంబియా రెబెల్ గ్రూప్ ‘ఫార్క్’తో కలిసి కొకైన్ను అమెరికాకు పంపేందుకు ప్రయతి్నంచారని ఆరోపించారు. ఆ సమయంలో మదురో అరెస్టుకు రూ.150 కోట్ల బహుమతిని ప్రకటించారు. బైడెన్ పాలనలో ఆ మొత్తాన్ని 250 కోట్లకు పెంచింది. 2024 జూలై 29న వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో నికోలస్ మదురో గెలిచారు. ప్రతిపక్ష అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్పై విజయం సాధించారు. మూడోసారి అధ్యక్షపీఠాన్ని అధిష్టించారు. బస్సు డ్రైవర్ నుంచి రాజకీయవేత్తగా ఎదిగిన మదురో వివాదాస్పదంగా నిలిచారు. హ్యూగో చావెజ్ మరణం తరువాత 2013లో యునైటెడ్ సోషలిస్టు పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలతో అమెరికా వెనిజులాపై ఆంక్షలు విధించింది. మదురోను అధ్యక్షుడిగా తిరస్కరించింది. అమెరికాతోపాటు యురోపియన్ యూనియన్, యూకే కూడా వెనిజులా చర్యలను ఖండించాయి. తమ దేశంలో తవ్వకాలు జరిపేందుకు అమెరికా చమురు దిగ్గజం చెవ్రాన్ను అనుమతించడంతో వెనిజులాపై కొన్ని ఆంక్షలను సడలించింది. -
ట్రంప్కు బిగ్ షాక్.. అమెరికా సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
వాషింగ్టన్: అమెరికాలో 1798 నాటి ఎలియన్ ఎనిమీస్ చట్టం కింద నిర్బంధానికి గురైన వెనిజులా పౌరులకు భారీ ఊరట లభించింది. వారిని బలవంతంగా వెనక్కి పంపించకుండా అమెరికా సుప్రీంకోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తేల్చిచెప్పింది.కాగా, ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ఉత్తర టెక్సాస్లో 261 మంది వెనిజులా పౌరులను ఎలియన్ ఎనిమీస్ చట్టం–1798 కింద నిఘా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అరెస్టు చేశారు. ఈ 261 మందిని ట్రంప్ ప్రభుత్వం ఎల్సాల్వెడార్ దేశంలో భూలోక నరకంగా పరిగణించే ఓ జైలుకు తరలించింది. తర్వాత వారందరినీ వెనిజులాకు పంపించాలని నిర్ణయించింది. దీంతో బాధితులకు మద్దతుగా అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ కార్యకర్తలు న్యాయ పోరాటం ప్రారంభించారు. కోర్టులను ఆశ్రయించారు. 261 మందిని వారి స్వదేశానికి తరలించకుండా తాత్కాలికంగా నిలిపివేస్తూ కింది కోర్టు మార్చి 15న ఆదేశాలిచ్చింది.అయితే, వారిని వెనక్కి పంపించడానికి 1798 నాటి వార్టైమ్ చట్టాన్ని ట్రంప్ ఉపయోగించుకోవచ్చని స్పష్టంచేస్తూ సుప్రీంకోర్టు ఈ నెల 8న తీర్పు వెలువరించింది. కానీ, డిపోర్టేషన్ను సవాలు చేసే అవకాశం వారికి ఇవ్వాలని స్పష్టంచేసింది. దాంతో సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలయ్యింది. ఈ పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం డిపోర్టేషన్ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. వెనిజులా పౌరులకు ఇది అతిపెద్ద విజయమని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ కార్యకర్తలు పేర్కొంటున్నారు.వెనిజులా వాసులు ప్రస్తుతానికి ఎల్ సాల్వెడార్ జైలులోనే ఉండనున్నారు. 216 మందిలో 137 మందిపై ఎలియన్ ఎనిమీస్ చట్టం–1798ను తొలగించినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో విదేశీయులను అక్రమ వలసదార్లను గుర్తించి, అరెస్ట్ చేసి డొనాల్ట్ ట్రంప్ ప్రభుత్వం అమెరికా నుంచి బయటకు పంపిస్తున్న సంగతి తెలిసిందే. The US Supreme Court just blocked President Trump from Deporting illegals under the Alien Enemies Act.Thomas & Alito dissented.They did this while we weren't looking and they did this before the 5th or the 4th circuit could dismiss the appeals.Barack Obama deported 3… pic.twitter.com/aTJvfUhsSJ— Matthew Zimmerman 🇺🇸 (@MattZimmerman26) April 19, 2025 -
సైనిక నిర్బంధంలో వెనిజులా వలసదారులు
వాషింగ్టన్: గ్వాంటనామో బేలోని వలసదారుల నిర్బంధ కేంద్రానికి చేరుకున్న వెనిజులా వలసదారుల పర్యవేక్షణా బాధ్యతలను సాధారణ ఇమ్మిగ్రేషన్ సిబ్బందికి బదులు సైనిక అధికారులు చూస్తున్నారు. వలసదారులు ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కస్టడీలో ఉన్నారని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ వలసదారులను సైనిక బలగాలు, వైద్యుల బృందాలు చూసుకుంటున్నాయని తాజాగా న్యూయార్క్టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. గ్వాంటనామోలో వలసదారుల నిర్బంధ కేంద్రాలను విస్తరించే ప్రణాళికలను ట్రంప్ ప్రకటించిన తరువాత ఇటీవల కొందరు వలసదారులను గ్వాంటనామోకు పంపిన విషయం తెల్సిందే. గ్వాంటనామోలో ఉంచిన వలసదారులకు సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వెల్లడించిన వివరాల్లో వారి జాతీయత మినహా మరే సమాచారం లేదు. ఆరో నంబర్ వలసదారుల శిబిరంలో 53 మంది పురుషులను ఉంచారు. గతంలో ఈ శిబిరంలో అల్ఖైదా అనుమానిత ఉగ్రవాదులను నిర్బంధించారు. ఈ శిబిరంలో సౌకర్యాలు అధ్వానంగా ఉన్నట్లు తెలుస్తోంది. సౌకర్యాలులేని శిబిరంలో వలసదారులను ఉంచారని, తాజా ఆహారం అందించకుండా ప్యాక్చేసి తీసుకొచ్చిన సైనిక ఆహారాన్నే వలసదారులకు అందిస్తున్నట్లు తెలుస్తోంది. చట్టవిరుద్ధంగా రావడమే నేరం: ట్రిసియా దాదాపు 100 మందిని గ్వాంటనామో కేంద్రానికి తీసుకొచ్చాం. వీరందరికీ బహిష్కరణ ఉత్తర్వులు అందాయి. చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించి ప్రతి ఒక్కరూ నేరానికి పాల్పడ్డారు. వీరిలో హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడిన ముఠా సభ్యులు, అక్రమ విదేశీయులు ఉన్నారు’’అని హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రతినిధి ట్రిసియా మెక్ లాఫ్లిన్ చెప్పారు. అయితే, బందీలందరూ చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించలేదని, కొందరు శరణార్థులుగా పరిగణించి ఆశ్రయం కల్పించాలని కోరగా వారి అభ్యర్థనను అమెరికా ప్రభుత్వం తిరస్కరించి వారిని కూడా అరెస్ట్చేసిందని వార్తలొచ్చాయి. -
ఆయన అరెస్టుకు ఆధారాలిస్తే రూ.215 కోట్ల రివార్డు!
వెనిజులా అధ్యక్షునిగా నికోలస్ మదురో మూడవసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే వెనిజులా ఎన్నికల్లో ఆయన ఓడిపోయారనడానికి స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఈ నేపధ్యంలో మదురోను అరెస్టు చేసేందుకు తగిన అధారాలు అందించినవారికి ఇచ్చే బహుమతి మొత్తాన్ని 25 మిలియన్ డాలర్లకు(సుమారు 215 కోట్ల రూపాయలు) పెంచినట్లు బైడెన్ పరిపాలనా విభాగం ప్రకటించింది.మదురోను వెనిజులాకు అధ్యక్షునిగా అమెరికా గుర్తించలేదు. 2024, జూలై జరిగిన ఎన్నికల్లో తాను గెలిచినట్లు మదురో(Nicolás Maduro) ఎటువంటి ఆధారాలను సమర్పించలేదు. అయితే అతని ప్రత్యర్థి ఎడ్ముండో గొంజాలెజ్ అందుబాటులోవున్న ఓట్ల లెక్కింపు ఆధారాలను సమర్పించారు. ఇవి అతను అత్యధిక ఓట్లు గెలుచుకున్నారని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో గొంజాలెజ్.. వెనిజులా అధ్యక్షునిగా ఎన్నికయ్యారని యునైటెడ్ స్టేట్స్ ప్రకటించింది. అలాగే మదురోను పదవి నుంచి తప్పుకోవాలని కోరింది.కాగా తాత్కాలిక రక్షిత హోదాతో యునైటెడ్ స్టేట్స్లో నివసిస్తున్న దాదాపు 600,000 మంది వెనిజులా వలసదారులకు మరింత రక్షణ కల్పిస్తున్నట్లు బైడెన్ పరిపాలనా విభాగం ప్రకటించింది. ఈ వలసదారులు అదనంగా మరో 18 నెలలు ఉండడానికి బైడెన్ హామీనిచ్చారు. జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ(John Kirby) మీడియాతో మాట్లాడుతూ మదురో అరెస్టుకు ఆధారాలు సమర్పించినవారికి బహుమతిని పెంచే నిర్ణయం వెనుక వెనిజులా ప్రజలకు సంఘీభావం అందించడమే ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఈ బహుమతిని పెంచడం ద్వారా మదురోతో పాటు అతని ప్రతినిధులపై ఒత్తిడిని కొనసాగించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలను మరింత పెంచామన్నారు.కాగా వెనిజులా వలసదారులకు తాత్కాలిక రక్షిత హోదా పొడిగింపును వారికి మద్దతు ఇచ్చే ప్రయత్నంగా బైడెన్(Biden) పరిపాలన ప్రతినిధి అభివర్ణించారు. 2020లో మదురోపై అమెరికాలో పలు కేసులు నమోదయ్యాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న నార్కో-టెర్రరిజం, అంతర్జాతీయ కొకైన్ అక్రమ రవాణా కుట్రలో మదురో నిందితుడు. మదురో తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నిమిషాలకే, అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఎనిమిది మంది వెనిజులా అధికారులపై పలు ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది.ఇది కూడా చదవండి: అయోధ్యలో ఘనంగా ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవాలు -
మదురో హత్యకు సీఐఏ కుట్ర!
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో హత్యకు అమెరికా నిఘా సంస్థ సీఐఏ కుట్ర పన్నిందా? అవునని వెనిజులా అంతర్గత వ్యవహారాల మంత్రి డియోస్డాడో కాబెల్లో ఆరోపించారు. తమ దేశాన్ని అస్థిరపరచడానికి కుట్ర పన్నారనే ఆరోపణలతో ఒక యూఎస్ నేవీ సీల్ ఆఫీసర్తో సహా ఆరుగురు విదేశీయులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. వారిలో అమెరికన్లు ఇద్దరు స్పెయిన్, ఒక చెక్ పౌరుడు ఉన్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా 400 అమెరికా రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ కుట్రలో సీఐఏతో పాటు స్పెయిన్ జాతీయ నిఘా విభాగం కూడా పాలుపంచుకుందని కాబెల్లో ఆరోపించారు. వీటిని అమెరికా విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. మదురోను గద్దె దించే కుట్రలో తమ ప్రమేయముందన్న వాదనలు పూర్తిగా అవాస్తవమని వైట్హౌస్ అధికార ప్రతినిధి ఒకరన్నారు. వెనిజులా రాజకీయ సంక్షోభానికి ప్రజాస్వామ్య పరిష్కారం కోసం అమెరికా మద్దతిస్తూనే ఉంటుందన్నారు. దీనిపై అదనపు సమాచారం కోరుతున్నట్లు తెలిపారు. తాము కూడా దీనిపై వెనిజులాను సమాచారం అడుగుతున్నట్లు స్పెయిన్ విదేశాంగ శాఖ తెలిపింది. మదురో ఇటీవలే అధ్యక్ష ఎన్నికల్లో వివాదాస్పద రీతిలో గెలవడం తెలిసిందే. ఆ విజయాన్ని గుర్తించడానికి వెనిజులా ప్రతిపక్షంతో పాటు అమెరికా కూడా నిరాకరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. – కారాకస్ -
స్పెయిన్కు పరారైన... వెనిజులా విపక్ష నేత
వెనిజులాలో నికొలస్ మదురో నియంత పాలనకు ముగింపు ఖాయమని ఆశించిన ఆ దేశ ప్రజలకు మరింత నిరాశ కలిగించే పరిణామమిది. అధ్యక్ష ఎన్నికల్లో విపక్షాల సంయుక్త అభ్యరి్థగా మదురోతో తలపడ్డ ఎడ్మండో గొంజాలెజ్ తాజాగా దేశం వీడి స్పెయిన్లో ఆశ్రయం పొందారు. జూలైలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వాస్తవ విజేత గొంజాలెజేనని విపక్షాలతోపాటు పలు విదేశీ ప్రభుత్వాలు కూడా పేర్కొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. గొంజాలెజ్కు ఆశ్రయం కలి్పంచేందుకు స్పెయిన్ అంగీకరించిందని వెనిజులా ఉపాధ్యక్షుడు డెల్సీ రొడ్రిగెజ్ ప్రకటించారు. దీనిపై గొంజాలెజ్ గానీ ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో గానీ స్పందించలేదు. ఎన్నికల్లో పోటీ చేయకుండా మచాడోపై మదురో ప్రభుత్వం నిషేధం ప్రకటించడంతో ఆఖరి దశలో గొంజాలెజ్ రంగంలోకి దిగడం తెలిసిందే. అయితే, వెనిజులా వీడాలన్నది గొంజాలెజ్ నిర్ణయం మాత్రమేనని, తాము పంపిన ఎయిర్ఫోర్స్ విమానంలో తమ దేశం చేరుకున్నారని స్పెయిన్ ప్రభుత్వం తెలిపింది. ఆయన వినతి మేరకే ఆశ్రయం కలి్పంచామని స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బారెస్ చెప్పారు. ‘వెనిజులా ప్రజల హక్కుల కాపాడటానికి కట్టుబడి ఉన్నాం. గొంజాలెజ్ వెనిజులా హీరో. ఆయన భద్రత బాధ్యతను స్పెయిన్ తీసుకుంటుంది’ అని స్పష్టం చేశారు. వెనిజులాకు రావడానికి కొద్ది రోజుల ముందే రాజధాని కారకాస్లోని తమ రాయబార కార్యాలయంలో గొంజాలెజ్ తలదాచుకున్నారని వెల్లడించారు. ఓటరు జాబితాను ఫోర్జరీ చేశారంటూ వచి్చన ఆరోపణలపై విచారణకు రావాలంటూ మూడు పర్యాయాలు సమన్లు పంపినా హాజరు కాలేదని దేశ అటార్నీ జనరల్ గొంజాలెజ్పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో, ఆయన స్పెయిన్ రాయబార కార్యాలయంలో తలదాచుకోవాల్సి వచి్చంది. మడురో నిరంకుశ విధానాలతో ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలు స్పెయిన్లో ఆశ్రయం పొందారు. ఈ ఏడాదిలో మొదటి ఆరు నెలల్లోనే దాదాపు 45 వేల మంది వెనిజులా నుంచి స్పెయిన్కు వలస వెళ్లారు. 2022 గణాంకాల ప్రకారం వెనిజులా వాసులు కనీసం 2.12 లక్షల మంది స్పెయిన్లో ఉంటున్నారు. – కారకాస్ -
మదురో విమానం సీజ్
వాషింగ్టన్: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో విమానాన్ని అమెరికా సీజ్ చేసింది. వెనిజులాపై అమెరికా విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఈ విమానాన్ని సమకూర్చుకున్నారని, ఇతర క్రిమినల్ అభియోగాలతో మదురో విమానాన్ని డొమినికన్ రిపబ్లిక్లో అమెరికా స్వా«దీనం చేసుకుంది. దాన్ని సోమవారం ఫ్లోరిడాకు తరలించింది. వెనిజులా– అమెరికాల మధ్య చాలాఏళ్లుగా సంబంధాలు బెడిసికొట్టాయి. వెనిజులాపై ఆర్థిక ఆంక్షలే కాకుండా పలుఇతర ఆంక్షలను కూడా అమెరికా విధించింది. వెనిజులాలో బతుకు దుర్భరమై లక్షల మంది మెక్సికో– అమెరికా సరిహద్దు ద్వారా అగ్రరాజ్యంలోకి ప్రవేశిస్తున్నారు. ఇటీవలి వివాదాస్పద అధ్యక్ష ఎన్నికల్లో మదురో విజయానికి సంబంధించి సందేహాలను వ్యక్తం చేస్తూ అమెరికా వెనిజులా నుంచి నిర్దిష్ట పోల్ డేటాను కోరింది. వెనిజులాకు చెందిన ఈ డసాల్డ్ ఫాల్కన్ 900 విమానం ఖరీదు రూ.109 కోట్లు. కొద్దినెలలుగా ఇది డొమినికన్ రిపబ్లిక్లో ఉందనే సమాచారంతో రంగంలోకి దిగిన అమెరికాకు చెందిన వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు మదురో విమానాన్ని స్వా«దీనం చేసుకొని ఫ్లోరిడాకు తరలించాయి. అమెరికా దీన్ని జప్తు చేసుకొనేందుకు చర్యలు చేపట్టింది. -
40 ఏళ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్స్లో...
పారిస్: ఒలింపిక్స్లో ఆటగాళ్ల విజయగాథలే కాదు... వీటిలో పాల్గొనే వారిలో ఎన్నో భిన్నమైన, ఆసక్తికర నేపథ్యాలు కూడా ఉంటాయి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. వెనిజులాకు చెందిన షూటర్ లియోనెల్ మార్టినెజ్ పారిస్లో ట్రాప్ ఈవెంట్లో పోటీ పడ్డాడు. ఓవరాల్గా 28వ స్థానంతో ముగించాడు. అయితే అతను పోటీల్లో పాల్గొనడం విశేషం కాదు... 60 ఏళ్ల వయసున్న మార్టినెజ్ 40 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఒలింపిక్స్ బరిలోకి దిగడమే అసలు ఘనత! 20 ఏళ్ల కుర్రాడిగా 1984 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో మార్టినెజ్ పాల్గొన్నాడు. ఆ తర్వాత ఆటకు దూరమై పలు వ్యాపారాల్లో స్థిరపడ్డాడు. అయితే చాలా ఏళ్ల తర్వాత అతనికి మళ్లీ షూటింగ్ వైపు మనసు మళ్లింది. మొదటి నుంచి రెగ్యులర్గా జిమ్కు వెళుతూ తన శరీరాన్ని ఫిట్గా ఉంచుకున్న మారి్టనెజ్కు మరోసారి క్రీడల్లోకి అడుగు పెట్టడం కష్టం కాలేదు. తన షూటింగ్కు పదును పెట్టుకున్న అతను 2023 పాన్ అమెరికన్ క్రీడల్లో రజతం సాధించి పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. 2028 లాస్ ఏంజెలిస్లో జరిగే ఒలింపిక్స్లోనూ పాల్గొనాలనేదే మారి్టనెజ్ తర్వాతి లక్ష్యం. అప్పటికి 64 ఏళ్లు వచ్చినా సరే... ఎక్కడ మొదలు పెట్టానో అక్కడే ముగిస్తాను అంటూ అతను ఘంటాపథంగా చెబుతున్నాడు. మారి్టనెజ్కు ముందు జపాన్ ఈక్వె్రస్టియన్ ఆటగాడు హొకెసు హిరోషి మాత్రమే రెండు ఒలింపిక్స్ మధ్య ఎక్కువ విరామం (44 ఏళ్లు) తీసుకున్నవాడిగా నిలిచాడు. తొలిసారి 1964 ఒలింపిక్స్లో పాల్గొన్న అతను ఆ తర్వాత 2008 బీజింగ్ ఒలింపిక్స్లో మళ్లీ బరిలోకి దిగాడు. -
మస్క్ వర్సెస్ మడురో: ఆయన గెలిస్తే గనుక..
వెనిజులా అధ్యక్షుడు(నూతన)నికోలస్ మడురో విసిరిన సవాల్కు ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ స్పందించారు. మడురోపై పోటీకి తాను సిద్ధమని అన్నారాయన. పోటీకి ఎక్కడైనా, ఎప్పుడైనా నేను సిద్ధం అంటూ ఎక్స్ వేదికగా ప్రకటించారాయన.నాతో పోరాడాలనుకుంటే బరిలో దిగమని మస్క్కు నికోలస్ మడురో సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దీంతో టెస్లా సీఈవో మస్క్ తాను సిద్ధమని ప్రకటించారు. ఆయన ఎక్కడ పోటీ అంటే అక్కడికి వస్తానని, తన వెంట మడురో ప్రియమైన గాడిదను కూడా తీసుకొస్తానంటూ వ్యంగ్యంగా బదులిచ్చారాయన. ఒకవేళ మడురో ఓడిపోతే.. ఆయన రాజకీయ సన్యాసం చేయాలి. తాను ఓడిపోతే గనుక ఉచితంగా ఆయన్ని మార్స్ ప్రయాణానికి తీసుకెళ్తానని స్పేస్ ఎక్స్ అధినేత ప్రకటించారు. వెనిజులా ఎన్నికల్లో మడురో విజయం సాధించారు. అయితే ఆయన అప్రజాస్వామ్యిక పద్ధతుల్లో గెలిచారంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శలకు మస్క్ మద్దతు ఇవ్వడంతో.. మడురో ఆయన్ని లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. వెనిజులాలో మస్క్ కంప్యూటర్ల హ్యాకింగ్కు పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలకు దిగారు. దీంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య పరస్పర మాటల యుద్ధం జరుగుతోంది. -
Venezuela presidential election: వెనిజులాలో... మళ్లీ పాత కథే!
కారకాస్: వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో అంతా ఊహించిందే జరిగింది. అధ్యక్షుడు నికొలస్ మదురో వరుసగా మూడోసారి విజయం సాధించినట్టు ఆ దేశ ఎన్నికల సంఘం (సీఎన్ఈ) ప్రకటించింది. ఆదివారం జరిగిన దేశవ్యాప్త పోలింగ్ అనంతరం రాత్రి ఓట్ల లెక్కింపు చేపట్టారు. 80 శాతం ఓట్లను లెక్కించేసరికి మదురోకు విజయానికి అవసరమైన 51 శాతం ఓట్లు లభించినట్టు సీఎన్ఈ చీఫ్ ఎల్విస్ అమోరోసో అర్ధరాత్రి అనంతరం ప్రకటన విడుదల చేశారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్కు 44 శాతం ఓట్లొచ్చినట్టు వెల్లడించారు. దీనిపై విపక్షాలన్నీ తీవ్రంగా మండిపడ్డాయి. ఓట్ల లెక్కింపును ప్రహసనప్రాయంగా మార్చేసి ప్రజాస్వామ్యాన్ని మరోసారి మంటగలిపారని విపక్ష నేత మరియా కొరీనా మచాడో దుమ్మెత్తిపోశారు. ‘‘మదురోను ఓడించేందుకు జనమంతా వెల్లువలా కదిలొచ్చి గొంజాలెజ్కు ఓటేశారు. ఆయన కనీసం మూడింట రెండొంతుల ఓట్లతో ఘనవిజయం సాధించారు. మా బూత్లవారీ విశ్లేషణలో కూడా అదే తేలింది. ఓటింగ్ సరళిని చూసిన మీదట ఓటమి ఖాయమని మదురోకు అర్థమైపోయింది. ఫలితాలను తారుమారు చేసేందుకు పథకం ప్రకారం విపక్ష కూటమి పర్యవేక్షకులను పోలింగ్ బూత్ల నుంచి తరిమేశారు. అనంతరం మదురో చేతిలో కీలుబొమ్మ అయిన సీఎన్ఈ చీఫ్ ఫలితాలను ఆయనకు అనుకూలంగా వక్రీకరించారు’’ అంటూ ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తక్షణం దేశవ్యాప్తంగా మొత్తం 30 వేల పోలింగ్ బూత్లవారీగా పోలైన ఓట్ల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. సీఎన్ఈ మాత్రం అందుకు సుముఖంగా లేదు. దీనికితోడు పోలింగ్ ముగిశాక ఫలితాల వెల్లడిని నిర్ధారిత సమయం కంటే ఏకంగా ఆరు గంటలపాటు ఆలస్యం చేశారు. ఫలితాలను మదురోకు అనుకూలంగా మార్చేందుకే ఇలా చేశారని విపక్ష కూటమి దుయ్యబట్టింది. ఫలితాలను చట్టపరంగా సవాలు చేస్తామని ప్రకటించింది. మదురో మాత్రం విదేశీ శక్తులతో కలిసి కొందరు కుట్ర పన్ని ఈవీఎంలను హాక్ చేసేందుకు ప్రయతి్నంచారంటూ విపక్షాలపై ప్రత్యారోపణలకు దిగారు. శాంతిభద్రతలకు భంగం కలిగించజూస్తే ఏం చేయాలో పోలీసులు, సైన్యం చూసుకుంటాయని హెచ్చరించారు. వెనిజులాలో పాతికేళ్లుగా యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ పాలనకు తెర దిచేందుకు విపక్షాలన్నీ మచాడో సారథ్యంలో ఒక్కతాటిపైకి వచ్చి పోటీ చేశాయి.ఫలితాలపై దేశాల పెదవి విరుపు వెనిజులా ఎన్నికల ఫలితాలు అస్సలు నమ్మశక్యంగా లేవని అమెరికా, చిలీ,ఉరుగ్వేతో పాటు చాలా దేశాలు పేర్కొన్నాయి. అవి ప్రజల మనోగతాన్ని, ఓటింగ్ సరళిని ప్రతిఫలించడం లేదని స్పష్టం చేశాయి. చిలీ అధ్యక్షుడు గేబ్రియెల్ బోరిక్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్తో పాటు బ్రిటన్ కూడా ఈ మేరకు ప్రకటన చేసింది. -
Venezuela presidential election: సామ్యవాద కోటలో నారీ భేరి
వెనిజులా. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిక్షేపాలున్న లాటిన్ అమెరికా దేశం. అయినా అత్యంత నిరుపేద దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. పాతికేళ్లుగా సాగుతున్న స్వయం ప్రకటిత సామ్యవాద కూటమి నియంతృత్వ పాలనే అందుకు ప్రధాన కారణం. నిరసనలపై ఉక్కుపాదం, హక్కుల అణచివేత, విపక్ష నేతలకు సంకెళ్లు తదితరాలతో వెనిజులా యువత విసిగిపోయింది. దీనికి తోడు అంతర్జాతీయ సమాజం ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి ఉపాధి అవకాశాలూ లేకపోవడంతో కట్టకట్టుకుని దేశం వీడుతోంది. నిండా 3 కోట్ల జనాభా కూడా లేని దేశంలో గత పదేళ్లలో ఏకంగా 80 లక్షల మంది విదేశీ బాట పట్టారు! సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి కీలక వ్యవస్థలన్నింటినీ ప్రభుత్వమే గుప్పెట్లో పెట్టుకోవడంతో పాతికేళ్లుగా వెనిజులాలో అధ్యక్ష ఎన్నికలు కూడా ఏకపక్షమే. 2018 ఎన్నికల్లోనైతే విపక్షాలన్నీ కట్టకట్టుకుని ఎన్నికలనే బహిష్కరించేంతగా ప్రభుత్వ అధికార దురి్వనియోగం శ్రుతి మించిపోయింది. దాంతో ప్రహసనప్రాయంగా సాగిన ఆ ఎన్నికల్లో అధ్యక్షుడు నికొలస్ మదురో తిరుగులేని మెజారిటీ సాధించి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. అలాంటి వెనిజులాలో ఆరేళ్ల అనంతరం ఆదివారం మళ్లీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కానీ పరిస్థితులు మాత్రం ఎప్పట్లా లేవు! విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి మదురోపై ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాయి. విపక్షాల ప్రచార సభలకు జనం విరగబడుతున్నారు. ఎన్నికల ప్రక్రియపై ఎప్పుడూ లేనంత ఆసక్తి, ఉత్సుకత వారిలో కనిపిస్తున్నాయి. దాంతో అంతర్జాతీయ సమాజం కూడా ఈసారి ఎన్నికలను అత్యంత ఆసక్తితో వీక్షిస్తోంది. ఇన్ని మార్పులకు కారణం ఒక్క మహిళ. ఒకే ఒక్క మహిళ. మదురోకు ముచ్చెమటలు పోయిస్తున్న ఆమే...విపక్ష నేత మరియా కొరీనా మచాడో. అనర్హత వేటేసినా... వెనిజులా అధ్యక్ష ఎన్నికల బరిలో 10 మంది ఉన్నారు. ప్రధాన పోటీ 61 ఏళ్ల మదురో, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్ రూపంలో ఇద్దరి మధ్య కేంద్రీకృతమైంది. కానీ అసలు పోటీలోనే లేని 56 ఏళ్ల మచాడో పేరు మాత్రమే దేశమంతటా మారుమోగిపోతోంది! ఎన్నికల ప్రచారం పొడవునా ఆమే సెంటరాఫ్ అట్రాక్షన్గా నిలిచారు. అటు అధికార యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనిజులా, ఇటు విపక్ష ‘యూనిటరీ ప్లాట్ఫాం’ కూటమి ప్రచారమంతా ఆమెనే కేంద్రంగా చేసుకుని సాగడం విశేషం. ముఖ్యంగా మదురో ప్రసంగాలన్నీ ఆద్యంతం మచాడోను విమర్శిస్తూనే సాగాయి. ఆమె ఎన్నికల పోటీకి దూరమైన వైనమూ ఆసక్తికరమే. విపక్ష అభ్యర్థిని తేల్చేందుకు గతేడాది జరిగిన ప్రైమరీలో దేశవ్యాప్తంగా జనం వెల్లువలా వచ్చి మచాడోకు ఓటేశారు. దాంతో ఆమె రికార్డు స్థాయిలో ఏకంగా 93 శాతం ఓట్లు సాధించారు. ఆ వెంటనే ప్రభుత్వం ఆమెపై అవినీతి ఆరోపణలు మోపి ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా ప్రకటించింది. విపక్ష ప్రైమరీనే చట్టవిరుద్ధంగా ప్రకటించింది. మచాడో మద్దతుదారులైన నాయకులు, జర్నలిస్టులు, హక్కుల నేతలు తదితరులందరినీ జైలుపాలు చేసింది. ప్రభుత్వ గుప్పెట్లో ఉన్న సుప్రీంకోర్టు కూడా వేటునే సమరి్థంచింది. అయినా మచాడో వెనక్కు తగ్గకుండా పెద్ద జనాకర్షణ శక్తి లేని మాజీ దౌత్యవేత్త గొంజాలెజ్ను తనకు బదులుగా రేసులో దించారు. తనపై వేటునే అతి పెద్ద ప్రచారాస్త్రంగా మలచుకుని సుడిగాలి ప్రచారంతో హోరెత్తించారు. మదురో ప్రభుత్వ అవినీతి, అస్తవ్యస్త పాలనపై ఆమె విమర్శలకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన లభించింది. దాంతో అందరి దృష్టీ ఆదివారం జరిగే పోలింగ్ మీదే కేంద్రీకృతమైంది. 40 లక్షల మంది ఓటర్లపై ‘వేటు’ వెనిజులా మొత్తం ఓటర్లే 2.1 కోట్లు. వారిలో 40 లక్షల మందికి పైగా విదేశాల్లో ఉన్నారు. మదురో పాలనపై వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో వారెవరూ ఓటేసే వీల్లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. లెక్కలేనన్ని కొత్త నిబంధనలు తేవడంతో ప్రవాసుల్లో 69 వేల మంది మాత్రమే ఓటింగ్కు అర్హత పొందారు! బస్సు డ్రైవర్ నుంచి అధికార పీఠం దాకా... నికొలస్ మదురో మోరోస్. ఒకప్పుడు సాదాసీదా బస్సు డ్రైవర్. అనంతరం కార్మిక సంఘాల నేతగా మారారు. మెల్లిగా రాజకీయంగా ఒక్కో మెట్టే ఎక్కుతూ అధ్యక్ష పీఠం దాకా ఎదిగారు. 2000లో నేషనల్ అసెంబ్లీకి ఎన్నికవడం మదురో కెరీర్లో కీలక మలుపు. వెనిజులా చరిత్రలో అత్యంత జనాకర్షక నేతగా పేరొందిన హ్యూగో చావెజ్ అభిమానం చూరగొనడంతో ఆయన దశ తిరిగింది. చావెజ్ హయాంలో నేషనల్ అసెంబ్లీ స్పీకర్గా, విదేశాంగ మంత్రిగా చేసి 2012లో దేశ ఉపాధ్యక్షుడయ్యారు. ఏడాదికే చావెజ్ క్యాన్సర్ బారిన పడ్డారు. 2013లో మదురోను తన తాత్కాలిక వారసునిగా ప్రకటించి మరణించారు. మదురో గద్దెనెక్కుతూనే అధ్యక్ష పదవికి తూతూ మంత్రంగా ప్రత్యేక ఎన్నికలు జరిపించి తనకు 50 శాతానికి పైగా ఓట్లొచ్చాయని ప్రకటించుకున్నారు. నాటినుంచి నేటిదాకా అధికారంలో కొనసాగుతున్నారు. ఆయన 11 ఏళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లోనూ కుప్పకూలిందంటూ జనం ఆగ్రహంగా ఉన్నారు. కొన్నేళ్లుగా మదురోపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత తీవ్రతరమవుతోంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ దేశానికి వెళ్లొద్దు.. అమెరికా హెచ్చరిక
వెనిజులా దేశ సందర్శనకు ఎవరూ వెళ్లొద్దని అమెరికా తమ పౌరులను హెచ్చరించింది. పౌర అశాంతి, నియంతృత్వం వైపు పయనించడం, నిరంతర ఉగ్రవాద బెదిరింపులు, అమెరికా వ్యతిరేక సెంటిమెంట్ పెరుగుతన్న నేపథ్యంలో వెనిజులా సందర్శన విషయంలో అమెరికా అత్యున్నత స్థాయి ప్రయాణ సలహాను మరోసారి జారీ చేసింది.వెనిజులా సందర్శనలో అత్యవసర పరిస్థితులు ఎదురైతే తాము ఏమీ చేయలేమని అమెరికా పౌరులను ఆ దేశ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. అక్కడ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని, తప్పనిసరై వెనిజులాను సందర్శించాలనుకునేవారు తమ కుటుంబ సభ్యులు, కావాల్సినవారితో 'ప్రూఫ్ ఆఫ్ లైఫ్' ప్రోటోకాల్ను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నాన్నారు. ఎవరైనా కిడ్నాప్, అపహరణ లేదా నిర్బంధానికి గురైనప్పుడు ఆ వ్యక్తి ఇంకా జీవించి ఉన్నాడా లేదా అని ధ్రువీకరించుకునేందుకు పాటించే ప్రక్రియే ఈ ప్రూఫ్ ఆఫ్ లైఫ్ ప్రోటోకాల్. వెనిజులాలో అమెరికా పౌరులను అక్రమంగా నిర్బంధించే ప్రమాదం ఉందని, అక్కడి భద్రతా దళాలు అమెరికా పౌరులను ఐదేళ్ల వరకు నిర్బంధించాయని విదేశాంగ శాఖ తెలిపింది.విస్తారమైన కరేబియన్ సముద్రతీరానికి, సుందరమైన ద్వీపాలకు వెనిజులా ప్రసిద్ధి. ఒకప్పుడు ఏటా లక్షలాది అమెరికన్ పర్యాటకులు ఈ దేశాన్ని సందర్శించేవారు. 2013లో నియంత హ్యూగో చావెజ్ మరణం తరువాత నికోలస్ మదురో అధికారం చేపట్టినప్పటి నుంచి సందర్శకుల సంఖ్య బాగా క్షీణించింది. 2019లో వెనిజులా నుంచి అమెరికా సిబ్బందిని ఉపసంహరించుకోవడం ప్రారంభించినప్పుడు మొదటిసారి ఇలాంటి హెచ్చరికను జారీ చేసిన అమెరికా.. ఇప్పుడు మరోసారి తమ పౌరులను హెచ్చరించింది. -
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లేజర్ ఎయిర్లైన్స్ ప్రయాణికులకు షాకింగ్ ఘటన ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న విమానంలో పొగలు రావడంతో.. అత్యవసర స్లైడ్ ద్వారా విమానం నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రయాణికులు గాయపడ్డారు. వెనెజులా రాజధాని కారకాస్ శివారులోని మైక్వేటియా సైమన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాలు లేజర్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం వెనెజులా నుంచి డొమినికన్ రిపబ్లికన్కు బయలుదేరింది. ప్రయాణ సమయంలో విమానంలో 91 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా ఉన్నట్టుండి విమానంలో పొగలు గుర్తించిన సిబ్బంది వెంటనే ప్రయాణికుల్ని అప్రమత్తం చేశారు. విమానాన్ని ఖాళీ చేయాల్సిందిగా ప్రకటన చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.కొందరు వెంటనే అత్యవసర స్లైడ్ ద్వారా బయట పడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో విమానం నుంచి స్లైడ్ ద్వారా బయటపడే సమయంలో తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని ఎయిర్పోర్ట్ సిబ్బంది వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించారు. విమానంలో పొగకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Following an APU failure aboard a <a href="https://twitter.com/laserairlines?ref_src=twsrc%5Etfw">@laserairlines</a> MD-80, passengers were evacuated due to smoke in the cabin. Regrettably, most passengers exited with their carry-on luggage, resulting in avoidable hazards. <a href="https://t.co/7FsfZ3Zkuk">pic.twitter.com/7FsfZ3Zkuk</a></p>&mdash; Enrique Perrella (@Enrique77W) <a href="https://twitter.com/Enrique77W/status/1784737773464735912?ref_src=twsrc%5Etfw">April 29, 2024</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script> -
ప్రపంచంలోనే అత్యంత వృద్దుడి కన్నుమూత
కారకాస్ (వెనెజులా): ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా గిన్నిస్ రికార్డుకెక్కిన వెనెజులాకు చెందిన 114 ఏళ్ల జువాన్ విసెంటీ పెరీజ్ మోరా మంగళవారం మరణించారు. ఆయనకు ఆరుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. ఏకంగా 41 మంది మనవలు, మనవరాళ్లు, 18 మంది మునిమనవలు, మనవరాళ్లున్నారు! ఆ తర్వాత తరంలోనూ ఇంకో 12 మంది వారసులుండటం విశేషం. జువాన్ 1909 మే 27న పుట్టారు. చనిపోయేదాకా పొలంలో పనిచేశారు. బాల్యం నుంచీ రోజూ పొలం పని, త్వరగా నిద్రపోవడం, రోజూ ఒక మద్యం తన దీర్ఘాయు రహస్యమనేవారు! -
వెనెజులాలో ట్రక్కు బీభత్సం.. 16 మంది మృతి
కారకాస్: వెనెజులా రాజధాని కారకాస్ను కలిపే జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ట్రక్కు పలు కార్లను ఢీకొట్టుకుంటూ ముందుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 17 వాహనాలు ఒకదానినొకటి ఢీకొట్టి కుప్పగా రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. మంటల్లో చిక్కుకున్న వాహనాలు, ఉవ్వెత్తున ఎగసిన పొగతో కూడిన ఫొటోలు బుధవారం ఉదయం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఘటనలో 16 మంది చనిపోగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా మారడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. -
దక్షిణ అమెరికాలోనూ యుద్ధ మేఘాలు!
అటు రష్యా–ఉక్రెయిన్. ఇటు ఇజ్రాయెల్–పాలస్తీనా. ఇలా ఇప్పటికే రెండు యుద్ధాలతో దాదాపు రెండేళ్లుగా ప్రపంచం అల్లకల్లోలమవుతోంది. ఇవి చాలవన్నట్టు దక్షిణ అమెరికా ఖండంలో కూడా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వాతావరణం అంతర్జాతీయ సమాజాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది. బుల్లి దేశమైన గయానా అదీనంలో ఉన్న ఎసెక్విబో ప్రాంతంలోని అపార చమురు నిల్వలపై పొరుగు దేశం వెనెజులా కన్నేసింది. ఈ వివాదాస్పద ప్రాంతాన్ని పూర్తిగా కబళించే దిశగా పావులు కదుపుతోంది. ఈ పరిణామం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. గయానాకు అమెరికా దన్నుగా నిలుస్తుండటంతో పరిస్థితులు క్రమంగా ముదురు పాకాన పడుతున్నాయి... దక్షిణ అమెరికాలోని ఎసెక్విబో ప్రాంతం రెండు శతాబ్దాలుగా వెనెజులా, గయానా మధ్య వివాదాలకు కారణంగా ఉంటూ వస్తోంది. ఇది తమదంటే తమదని రెండు దేశాలూ వాదిస్తున్నాయి. కాకపోతే దాదాపు గత వందేళ్లుగా ఈ ప్రాంతం గయానా అ«దీనంలోనే ఉంది. దీని విషయమై కొద్ది దశాబ్దాలుగా ఇరు దేశాల నడుమ అడపాదడపా కీచులాటలు సాగుతూనే వస్తున్నాయి. ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెడుతున్నట్టు 2004లో అప్పటి వెనెజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ ప్రకటనతో పదేళ్లపాటు ఉద్రిక్తతలు చల్లారాయి. కానీ ఎసెక్విబోను ఆనుకుని ఉన్న అట్లాంటిక్ సముద్ర జలాల్లో ఏకంగా 11 బిలియన్ బ్యారెళ్ల చమురు నిక్షేపాలున్నట్టు 2015లో బయట పడటంతో పరిస్థితి మళ్లీ మొదటికొచి్చంది. ఆ నిల్వలపై కన్నేసిన వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఎసెక్విబో నిజానికి తమదేనన్న వాదనను తిరగదోడారు. దీన్ని ఇంటా బయటా పదేపదే ప్రస్తావిస్తూ వచ్చారు. ఎసెక్విబోను వెనెజులాలో కలిపేసుకుంటామని ప్రకటించి తాజాగా ఉద్రిక్తతలకు తారస్థాయికి తీసుకెళ్లారు. విలీనంపై వెనెజులాలో రిఫరెండం నిర్వహిస్తామని ప్రకటించడంతో గయానా అంతర్జాతీయ న్యాయస్థానానికి ఫిర్యాదు చేసింది. ఎలాంటి దుందుడుకు చర్యలూ చేపట్టొద్దన్న కోర్టు ఆదేశించిన రెండు రోజులకే వాటిని బేఖాతరు చేస్తూ మదురో డిసెంబర్ 3న వెనెజులావ్యాప్తంగా రిఫరెండం జరిపారు. ఏకంగా 95 శాతం మంది ఎసెక్విబో విలీనానికి జై కొట్టినట్టు ప్రకటించారు. వెంటనే ఆ ప్రాంతాన్ని గయానా ఎసెక్విబా పేరిట వెనెజులాలో నూతన రాష్ట్రంగా చూపు తున్న కొత్త మ్యాపులను మదురో విడుదల చేసేశారు! రంగంలోకి అమెరికా గయానాపై వెనెజులా సైనిక చర్యకు దిగవచ్చన్న వార్తలు కొద్ది రోజులుగా జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా హుటాహుటిన రంగంలోకి దిగింది. గయానాకు అన్నివిధాలా బాసటగా నిలుస్తామని ప్రకటించింది. డిసెంబర్ 7 నుంచి ఆ దేశంలో సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేస్తూ వెనెజులాకు హెచ్చరికలు పంపుతోంది. దీని వెనక అమెరికా స్వీయ చమురు ప్రయోజనాలు దాగున్నాయి. ఎసెక్వెబోలో చమురు నిల్వలను గుర్తించిన ఎక్సాన్మొబిల్ అమెరికా చమురు దిగ్గజమే. ఒక్క 2022లోనే చమురు వెలికితీత ద్వారా ఆ కంపెనీకి ఏకంగా 600 కోట్ల డాలర్ల ఆదాయం సమకూరింది! వాటిని వదులుకోవడం అగ్ర రాజ్యానికి సుతరామూ ఇష్టం లేదు. దట్టమైన అడవులతో కూడిన ఎసెక్విబోపై దాడి చేయాలంటే సముద్ర మార్గమే వెనెజులాకు శరణ్యం. లేదంటే ఇరు దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న బ్రెజిల్ గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్రెజిల్ కూడా వెనెజులాతో తమ సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. శాంతియుతంగా తేల్చుకోవాలని బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా మదురోకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 14న ఆయన సమక్షంలో సమావేశమై వివాదంపై చర్చించుకునేందుకు మదురో, గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ అంగీకరించినట్టు చెబుతున్నారు. శతాబ్దాల వివాదం... వెనెజులా, గయానా మధ్య ఎసెక్విబో వివాదం ఈనాటిది కాదు. వెనెజులా అప్పట్లో స్పెయిన్ వలస రాజ్యంగా ఉన్న రోజుల్లో ఈ ప్రాంతం వెనెజులా అ«దీనంలోనే ఉండేది. 1899 దాకా అలాగే కొనసాగింది. 1899లో జరిగిన అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం గయానాకు దఖలు పడింది. కానీ అది మోసపూరిత ఒప్పందని వెనెజులా ఆరోపిస్తూ వస్తోంది. తమ ప్రాతినిధ్యం లేకుండా తమ తరఫున అమెరికా, బ్రిటన్ దీనికి తలూపాయని చెబుతోంది. రాజకీయ ఎత్తుగడే! నిజంగా గయానాపై దండెత్తడం మదురో ఉద్దేశం కాదని పరిశీలకులు భావిస్తున్నారు. 2013 నుంచీ అధికారంలో ఉన్న మదురోపై వెనెజులాలో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది. ఆయన పదేళ్ల పై చిలుకు పాలనలో దేశం పేదరికం కోరల్లో చిక్కిందన్న అభిప్రాయముంది. ఈ నేపథ్యంలో యుద్ధం పేరిట భావోద్వేగాలు రెచ్చగొట్టడం ద్వారా ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించి, అధ్యక్ష ఎన్నికలను వీలైనంత కాలం వాయిదా వేసేందుకే ఆయన ఈ ఎత్తు వేశారని చెబుతున్నారు. సహజ వనరుల గని ► ఎసెక్విబో ప్రాంతం అపార సహజ వనరులకు ఆలవాలం ► దీని విస్తీర్ణం దాదాపు 1.59 లక్షల చదరపు కిలోమీటర్లు ► గయానా మొత్తం భూభాగంలో మూడింట రెండొంతులు ఈ ప్రాంతమే విస్తరించి ఉంది ► కానీ గయానా మొత్తం జనాభా దాదాపు 8 లక్షలైతే అందులో ఎసెక్విబోలో ఉన్నది 1.2 లక్షల మందే ► ఈ ప్రాంతం నిండా దట్టమైన అమెజాన్ వర్షారణ్యాలే విస్తరించి ఉన్నాయి ► భారీ పరిమాణంలో బంగారం, రాగి తదితర ఖనిజ నిల్వలు కూడా ఉన్నాయి – సాక్షి, నేషనల్ డెస్క్ -
బతికుండగానే అంత్యక్రియలు, మోడల్ అరియానా కన్నుమూత
బ్యూటీ క్వీన్, వెనిజులా మోడల్ అరియానా వీర రోడ్డుప్రమాదంలో మరణించింది. జూలై 13న ఫ్లోరిడాలో జరిగిన కారు యాక్సిడెంట్లో తీవ్ర గాయాలపాలైన ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందిస్తున్న క్రమంలో ఆమెకు గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచింది. కారు నడిపే క్రమంలో అలసటకు లోనైన అరియానా డ్రైవింగ్లో రెప్పవాల్చడంతోనే ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని అరియానా తల్లి వివియన్ ఓచోవా మీడియాకు వెల్లడించింది. తను ఎంతోమందికి సాయం చేసిందని, అలాంటి నా కూతుర్ని భగవంతుడు త్వరగా తీసుకెళ్లిపోయాడంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. కాగా ఈ బ్యూటీ మే నెలలో అంత్యక్రియల వీడియో పోస్ట్ చేసింది. 'నా వీడియోలను నేనే తీసుకుంటాను. నేను చనిపోయాక నా అంత్యక్రియలను ఎవరైనా రికార్డు చేస్తారో లేదో? అందుకే ఎప్పుడో జరగాల్సిన నా అంత్యక్రియలను ఓసారి నేనే రికార్డు చేసి పెట్టుకుంటున్నాను' అంటూ సదరు వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. కాగా అరియానా మోడల్ మాత్రమే కాదు, రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఆమెకు ప్రావీణ్యం ఉంది. తను ఫుల్ హౌస్ క్లీనింగ్ సర్వీస్ అనే కంపెనీ కూడా నిర్వహిస్తోంది. ఇకపోతే అక్టోబర్లో జరగబోయే 'మిస్ లాటిన్ అమెరికా ఆఫ్ ద వరల్డ్ 2023' పోటీల్లో అరియానా.. వెనిజులా తరుపున ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. అంతలోనే ఈ దారుణం జరగడంతో అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. View this post on Instagram A post shared by Ariana Valentina (@arianaviera__) View this post on Instagram A post shared by Ariana Valentina (@arianaviera__) చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే? -
World Athletics Championship: ‘ట్రిపుల్’ ధమాకా
యుజీన్ (అమెరికా): వెనిజులా స్టార్ అథ్లెట్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత యులిమర్ రోజస్ మరోసారి అద్భుత ప్రదర్శనతో ట్రిపుల్ జంప్లో సత్తా చాటింది. వరుసగా మూడో ప్రపంచ చాంపియన్షిప్లోనూ రోజస్ స్వర్ణంతో మెరిసింది. ఫైనల్లో రోజస్ 15.47 మీటర్ల దూరం దూకి మొదటి స్థానంలో నిలిచింది. ఈ పోటీలో షనీకా రికెట్స్ (అమెరికా – 14.89 మీ.) రజతం సాధించగా, టోరీ ఫ్రాంక్లిన్ (అమెరికా – 14.72 మీ.) కాంస్యం గెలుచుకుంది. అథ్లెటిక్స్ ప్రపంచ చాంపియన్షిప్లో రోజస్కు ఇది హ్యాట్రిక్ స్వర్ణం కావడం విశేషం. 2017 (లండన్), 2019 (దోహా)లలో కూడా ఆమె కనకపు పతకాన్ని అందుకుంది. ట్రిపుల్ జంప్లో ప్రస్తుత ప్రపంచ రికార్డు (15.74 మీటర్లు) రోజస్ పేరిటే ఉంది. తన రెండో ప్రయత్నంలోనే 15.47 మీటర్లు నమోదు చేసిన రోజస్ తర్వాతి నాలుగు ప్రయత్నాల్లో కూడా దానిని దాటలేకపోయింది. దాంతో పోలిస్తే చాలా తక్కువ దూరం ఆమె దూకగలిగినా...ఈ మెగా ఈవెంట్లో బంగారం గెలుచుకునేందుకు అది సరిపోయింది. ‘రికార్డు స్థాయిలో ఎక్కువ దూరం దూకాలనే బరిలోకి దిగినా అది సాధ్యం కాలేదు. అయితే తాజా ఫలితంతో చాలా సంతోషంగా ఉన్నా. ఇంత మంది ప్రేక్షకుల మధ్య మళ్లీ పోటీలో నిలవడం గొప్పగా అనిపిస్తోంది. పెద్దగా సన్నాహకాలు లేకుండానే ఇక్కడికి వచ్చాను. గాయాలతో కూడా ఇబ్బంది పడ్డాను. అయితే వాటన్నింటినీ అధిగమించి ఇక్కడ గెలవగలిగాను’ అని రోజస్ వ్యాఖ్యానించింది. సబ్లేకు 11వ స్థానం పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్లో భారత అథ్లెట్ అవినాశ్ ముకుంద్ సబ్లే తీవ్రంగా నిరాశపర్చాడు. ఫైనల్ను 8 నిమిషాల 31.75 సెకన్లలో పూర్తి చేసిన సబ్లే 11వ స్థానంలో నిలిచాడు. ఇదే సీజన్లో తన అత్యుత్తమ ప్రదర్శనతో జాతీయ రికార్డు (8 నిమిషాల 12.48 సెకన్లు)ను నెలకొల్పిన అతను దాంతో పోలిస్తే చాలా పేలవ ప్రదర్శన నమోదు చేశాడు. ఏడో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించిన సబ్లే...అసలు పోరులో ప్రభావం చూపలేకపోయాడు. 2019లో దోహాలో జరిగిన గత ప్రపంచ చాంపియన్షిప్లో అతను 13వ స్థానం సాధించాడు. ఈ విభాగంలో ఒలింపిక్ చాంపియన్, మొరాకోకు చెందిన సూఫియాన్ బకాలి (8 నిమిషాల 25.13 సె.), లమేచా గిర్మా (ఇథియోపియా – 8 నిమిషాల 26.01 సె.), కాన్సెస్లన్ కిప్రు టో (కెన్యా – 8 నిమిషాల 27.92 సెకన్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. -
ఇదేం పిచ్చో.. బాల్కనీ అంతా దెయ్యం బొమ్మలతో నింపేశాడు!
బొమ్మలతో మనం మాట్లాడితే పర్వాలేదు. అవే బొమ్మలు మనతో మాట్లాడితే భయపడక తప్పదు. ఇలా బొమ్మలతో భయపెట్టే సినిమాలు ఎన్నో! విచిత్రంగా ఓ సామాన్యుడు కూడా బొమ్మలతో భయపెట్టిస్తున్నాడు. నిజానికి అతని ఉద్దేశం వేరే అయినా స్థానికులు మాత్రం అతని ఇంటిలోపలికి కాదుకదా కనీసం కింద నుంచి బాల్కనీ వైపు చూడ్డానికి కూడా భయపడుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. వెనెజులా రాజధాని కారకస్కు చెందిన విజువల్ ఆర్టిస్ట్ ఎటాన్లస్ గోన్సాల్వెజ్కు ఓ డ్రైవర్తో మంచి స్నేహం ఉండేది. అతని కారులో ఎప్పుడూ బొమ్మలు ఉండేవి. అది చూసిన గోన్సాల్వెజ్ కొడుకు తనకు కూడా ఇలా బొమ్మలను ఒక చోట సెట్ చేయమని కోరాడు. దీంతో, గోన్సాల్వెజ్ మూడేళ్లపాటు శ్రమించి బాల్కనీ నిండా బొమ్మలతో విచిత్రంగా నింపాడు. అయితే, ఆ బొమ్మల బాల్కనీ చూసిన కొడుకు సంతోషించినా, స్థానికులు మాత్రం కలవరపడుతున్నారు. అచ్చం దెయ్యం బొమ్మల్లా కనిపించే వాటిని చూసి, అతనేదో క్షుద్రపూజలు చేస్తున్నాడని, వాటిని తీసేయాల్సిందే అంటూ గొడవకు దిగారు. ఇలా కొన్ని నెలలపాటూ ఈ బొమ్మలపై గొడవ జరిగింది. ఏం చేసినా గోన్సాల్వెజ్ వెనక్కి తగ్గకపోవడంతో.. స్థానికులే సైలెంటైపోయారు. దీంతో, ప్రస్తుతం ఈ బొమ్మల బాల్కనీ అక్కడ ఓ ల్యాండ్ మార్క్గా మారింది. కొంతమంది కేవలం ఆ బాల్కనీని చూడ్డానికి అదేపనిగా వస్తున్నారు. ప్రస్తుతం అతను ఇంటిలోనికి అనుమతించడటం లేదు కానీ, కింద నుంచి చూసే అవకాశం మాత్రం ఉంది. -
పెద్దలు దోచుకుంటే వెనిజులా కాదా?
పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసినా.. పేదల ఖాతాల్లో ప్రభుత్వాలు నేరుగా నగదు బదిలీ చేసినా.. గుండెలు బాదేసుకోవడం ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది. ‘ఏంటి పేదల్ని సోమరిపోతులుగా మార్చేస్తారా?’ అని ప్రశ్నిస్తున్నారు. ‘ఇలాగే పోతే రాష్ట్రం వెనిజులాగా మారిపోతుం’దంటూ అంతర్జాతీయ మేధావుల్లా శాపాలూ పెట్టేస్తున్నారు. ఎంత దుర్మార్గమైన వ్యాఖ్యలివి? రెక్కలు ముక్కలు చేసుకుంటేనే కానీ బతుకు బండి ముందుకు నడవని పేదలు ఎప్పటికీ సోమరిపోతులు కారు. కాలేరు. వారి గురించి ఎవరూ బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు. మరి సోమరిపోతులెవరు? బ్యాంకులకు వేల కోట్ల రూపాయల బాకీలు ఎగ్గొట్టి.. అరెస్ట్ చేసే ముందు పాలకుల అండతో విదేశాలకు చెక్కేసే విజయ్ మాల్యాలూ.. నీరవ్ మోదీలు.. మొహుల్ ఛోక్సీలే నిజానికి సోమరిపోతులు. ఎందుకంటే వాళ్లు ఏనాడూ ఎండలో ఓ గంట సేపు కష్టపడిన వారు కాదు. ఏసీ గదుల్లో కూర్చుని.. బ్యాంకుల్లో ఏసీ గదుల్లో ఉన్నతాధికారులను బుట్టలో వేసుకుని వేల కోట్ల రూపాయల రుణాలు కొట్టేసి వాటిని దారి మళ్లించేసి అసలు వ్యాపారాలు దివాలా తీశాయని కాగితాలపై కట్టుకథలు రాసే కార్పొరేట్ దొంగలే సోమరిపోతులు. రాష్ట్రాలైనా..దేశాలైనా ఇలాంటి వారి వల్లనే దివాళా తీస్తాయి కానీ నిరుపేద రైతులు, శ్రామిక వర్గాల కిచ్చే చిల్లర పైసల వల్ల కాదు. అసలు వెనిజులా విషయంలోనూ వీళ్లకి అవగాహన లేదు. వెనిజులా దివాలా తీయడానికి కారణం కేవలం సంక్షేమ పథకాలు కాదు. చమురు ధరలు పడిపోవడంతో ఆదాయం తగ్గింది. అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం ఉంది కాబట్టి అమెరికా పగబట్టింది. వెనిజులాకి ఆహార ఉత్పత్తులు, మందులు సరఫరా చేయకుండా తన మిత్ర దేశాలపై పరోక్ష ఆంక్షలు విధించింది అమెరికా. అటువంటి వెనిజులాను బూచిలా చూపించి పేదల నోళ్లు కొట్టేయడానికి మన దగ్గర చాలా మంది మేధావులు పేట్రేగిపోతున్నారు. ఏ దేశంలోనైనా రాష్ట్రంలోనైనా ఆర్థిక అసమానతలు పెరిగిపోయినపుడు ధనవంతులు మరింత ధనవంతులుగానూ పేదలు మరింత పేదలుగానూ మారిపోతున్నప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలో ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్పారు. పేదల దగ్గర కొనుగోలు శక్తి లేకపోతే అన్ని వ్యవస్థలూ.. ఉత్పాదక సంస్థలు దివాలా తీస్తాయి. అది ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీస్తుంది. అటువంటి సమయాలలో ఏదో ఒక రూపంలో ప్రజల చేతుల్లో డబ్బులు చేరేలా చేయడం ద్వారా కొనుగోలు శక్తి పెంచాలి. అలా పెంచడం వల్లనే ఆర్థిక వ్యవస్థ పడిపోకుండా నిలబడుతుంది. కరోనా వంటి సంక్షోభ కాలంలో మహా మహా ఆర్థిక శక్తులే కుప్పకూలిపోయాయి. కోట్లాదిమంది ఉపాధి కోల్పోయారు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో పేదల ఖాతాల్లో డబ్బులు జమ చేయడమొక్కటే వ్యవస్థను కాపాడుకోడానికి మార్గమని ఆర్థిక మేధావులు అంటున్నారు. దాన్నే ‘హెలికాప్టర్ మనీ’ అంటారు. మన అధికార యంత్రాంగాలు ఎలా ఆలోచిస్తాయంటే రైతులకు రుణమాఫీ ఇవ్వాలని డిమాండ్ వస్తే.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా వ్యవహరించిన అరుంధతీ భట్టాచార్య ‘అయ్య బాబోయ్ రుణమాఫీయే.. అలా అయితే రైతుల్లో ఆర్థిక క్రమశిక్షణ అనేదే ఉండదు. అది ఎంత మాత్రం కుదరదు‘ అని నిర్మొహమాటంగా చెప్పేశారు. ఇదే అరుంధతీ భట్టాచార్య బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన విజయ్ మాల్యాకి సంబంధించిన అయిదున్నర వేల కోట్ల బాకీని మాత్రం రైటాఫ్ చేసేశారు. అలా చేస్తూ.. ‘పాపం వ్యాపారంలో నష్టపోయినపుడు ఆదుకోకపోతే ఎలాగ?‘ అన్నారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు పేదలపై ఎంత చులకన భావం ఉంటుందో.. పెద్దలపై ఎంత ప్రేమ ఉంటుందో అర్థం చేసుకోడానికి. పేదల జేబుల్లోకి రూపాయి వెళ్తోందంటే చాలు నయా మేధావులు చాలా బెంగపెట్టేసుకుంటారు. మాల్యా వంటి పెద్దలు కోట్లకు కోట్లు ఎగనామం పెట్టేసి ఆ భారాన్ని ప్రభుత్వ ఖజానాలపై మోదేసినా ఎవ్వరూ మాట్లాడరు. మాట్లాడితే వెనిజులా అనే వాళ్లు అందరికీ ఉచిత విద్యుత్ను అందించే క్యూబా గురించి మాట్లాడరు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఏడు దేశాల్లో పన్నుల్లేకపోయినా.. విద్య, వైద్యాలు ఉచితంగానే అందిస్తోన్నా... ‘ఇలా ఎలా ఇస్తారు‘ అని ఎవ్వరూ అడగరు. కమ్యూనిస్టు దేశాలు ఉండకూడదని అమెరికా ఎలా అనుకుంటుందో.... అలానే పేదలకు సంక్షేమ పథకాలు ఉండనే కూడదని వీళ్లు అనుకుంటారు. పేదలపై ఎందుకో మరి అంత కోపం? పేదరికం అంటే ఎందుకో అంత ఏహ్యభావం! నిజానికి మాల్యాల వంటి వాళ్లు అదే పనిగా దోచుకుంటే దేశం వెనిజులాగా కాదు... సోమాలియాలా మారిపోయే ప్రమాదం ఉంది. అందరూ దృష్టి సారించాల్సింది దానిపై మాత్రమే. – సి.ఎన్.ఎస్. యాజులు మొబైల్ : 95055 55384 -
విషాదం: ఈ తల్లి త్యాగానికి చేతులెత్తి మొక్కాల్సిందే!
Venezuela Mother Sacrifice Story: మనిషికి మాత్రమే కాదు.. మిగతా జీవరాశికి తల్లి స్పర్శే మొదటి ప్రేమ. అమ్మ ప్రేమ జీవికి ఆప్యాయతను పరిచయం చేస్తుంది. ‘అమ్మ’.. మాటల్లో వర్ణించలేని ఓ మధురానుభూతి. అందుకేనేమో తల్లికి మాత్రమే సాధ్యపడే త్యాగానికి ఆమె సిద్ధపడింది. ప్రాణం పోతోందని తెలిసి కూడా సాహసానికి పూనుకుంది. తాను నరకం అనుభవిస్తూ.. బిడ్డల ఆకలిని తీర్చింది. చివరికి ప్రాణ త్యాగంతో పిల్లల్ని బతికించుకుని.. మృత్యువు ఒడిలోకి ఒదిగిపోయింది. ఆ తల్లి గాథ సోషల్ మీడియాలో ఇప్పుడు అందరితో కంటతడి పెట్టిస్తోంది. వెనిజులా బోట్ ప్రమాదం.. సెప్టెంబర్ 3న కరేబియన్ దీవులవైపు వెళ్లిన వెనిజులా టూరిస్ట్ క్రూజ్ బోట్ ఒకటి అదృశ్యం అయ్యిందని నావికా అధికారులకు సమాచారం అందింది. దీంతో సిబ్బంది సహాయక చర్యలు మొదలుపెట్టారు. నాలుగు రోజుల తర్వాత ‘లా టార్టు’ దీవి సమీపంలో ఓ చిన్నసైజు లైఫ్ బోట్ను గుర్తించి.. దగ్గరి వెళ్లి ఆ దృశ్యాన్ని చూసి సిబ్బంది నిశ్చేష్టులయ్యారు. తల్లి మృతదేహం పక్కనే ఒదిగిన ఇద్దరు చిన్నారుల్ని గుర్తించి వెంటనే కాపాడారు. ఆ తల్లి పేరు మార్లేస్ బీట్రిజ్ చాకోన్ మర్రోక్విన్. తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి సరదా ట్రిప్ కోసం వెళ్తే.. అది కాస్త వాళ్ల జీవితాల్లో విషాదాన్ని నింపింది. నరకం ఓర్చుకుంది.. భారీ అలల కారణంగా క్రూజ్ దెబ్బతినగా.. చిన్న లైఫ్ బోట్ సాయంతో మార్లేస్, తన బిడ్డల్ని రక్షించుకునే ప్రయత్నం చేసింది. వెనిజులా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అక్వాటిక్ స్పేసెస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగాక నాలుగు రోజులపాటు ఆ తల్లీబిడ్డలు ఆ చిన్న లైఫ్బోట్లోనే ఉన్నారు. తన ఇద్దరు బిడ్డల్ని(ఒకరికి రెండేళ్లు, ఒకరికి ఆరేళ్లు) డీహైడ్రేషన్, అలల నుంచి కాపాడుకునేందుకు మార్లేస్ వీలైనంత ప్రయత్నం చేసింది. వాళ్ల ఆకలి తీర్చేందుకు పాలు పట్టింది. తన మూత్రాన్ని తానే తాగి ఆకలి తీర్చుకుంది. వేడికి ఆమె ఒళ్లంతా మంటలు పుట్టాయి. అయినా ఓర్చుకుంది. తనకేమైనా పర్వాలేదనుకుని.. బిడ్డల్ని అక్కున చేర్చుకుని వేడి తగలకుండా చూసుకుంది. చివరికి డీహైడ్రేషన్ కారణంగా అవయవాలు దెబ్బతిని ప్రాణం విడిచిందామె. మొత్తం తొమ్మిది మంది లైఫ్ బోటులో తల్లి మృతదేహంలో ఒదిగి పడుకున్న పిల్లలను.. కారాకస్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పిల్లల ఒంటిపై సూర్య తాపానికి బొబ్బలు వచ్చాయి. తిండి లేక నీరసించిపోయిన ఆ పిల్లల్ని తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చారు కూడా. మరోవైపు ఈ ఇద్దరు పిల్లల్ని చూసేందుకు నియమించిన యువతి వెరోనికా మార్టినెజ్(25).. పక్కనే ఓ ఐస్ బాక్స్లో పడుకుని బతికి బట్టకట్టింది. ప్రస్తుతం కోలుకున్న ఆ యువతి.. మానసికంగా మాత్రం కోలుకోలేకపోతోంది. అయితే ఆ మార్లేస్ భర్త రెమిక్ డేవిడ్ కాంబ్లర్ ఆచూకీ మాత్రం తెలియరాలేదు. సరదా ట్రిప్లో భాగంగా వెనిజులా హిగుయిరోట్ నుంచి లా టార్టుగా ఐల్యాండ్(కరేబియన్ దీవులు) వైపు తొమ్మిది మందితో వెళ్లింది. భారీ అల కారణంగా మొదట పాడైన బోటు.. ఆ తర్వాత అలల ధాటికి చెల్లాచెదురై ఉంటుందని, సుమారు 70 మైళ్ల దూరం కొట్టుకుని పోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రమాదంలో మిగిలిన వాళ్లెవరూ బతికే అవకాశాలు లేవని అధికారులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 11న ఆ మాతృమూర్తికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. చదవండి: ఇలాంటి కూతురు చచ్చినా పర్లేదు అన్నారు -
ఒక రూపాయికే పెట్రోలు.. ఎక్కడ?
సాక్షి, న్యూఢిల్లీ: రికార్డు స్థాయికి చేరిన పెట్రోలు ధరలు వాహనదారులను వణికిస్తున్నాయి. ఇటీవలికాలంగా వరుసగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా సెగలు రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100దాటేసింది. ఫిబ్రవరి నెలలోనే అత్యధికంగా 13 సార్లు ధరలు పెరిగాయంటేనే ధరల మంట తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దీంతో పెట్రో ధరలపై ఇటీవల బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్గా మారింది. తాజాగా మరో వార్త ఆసక్తికరంగా మారింది. ఒకపక్క పొరుగు దేశాలతో పోలిస్తే దేశీయంగా పెట్రో ధరలు మండిపోతున్నాయి. మరోపక్క దక్షిణ అమెరికా దేశాల్లో ఒకటైన వెనిజులాలో లీటరు పెట్రోల్ ధర కేవలం రూపాయి మాత్రమే. ప్రపంచంలో వెనకబడిన దేశమైన వెనిజులాలో లీటర్ పెట్రోల్ ధర 0.020 డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ.1.45గా ఉండటం విశేషంగా నిలిచింది. అత్యంత చౌకగా పెట్రోలు విక్రయించే మొదటి పది దేశాల్లో ఐదు ఆసియాలో, నాలుగు ఆఫ్రికాలో, దక్షిణ అమెరికాలో ఒకటి ఉన్నాయి. మరోవైపు 2.40 డాలర్ల వద్ద హాంకాంగ్లో పెట్రోలు అత్యంత ఎక్కువ రేటు పలుకుతోంది. తరువాత స్థానాల్లో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ , నెదర్లాండ్స్ ఉన్నాయి. (బాబోయ్ పెట్రోలు : 11వ రోజూ వాత) పొరుగు దేశాలలో పెట్రోల్ ధర భారత్తో పోలిస్తే, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ , భూటాన్ దేశాల్లో పెట్రోల్ తక్కువ రేటుకేఅందుబాటులోఉంది. ముఖ్యంగా భూటాన్లో పెట్రోలు ధర బాగా చౌక. భారత కరెన్సీ ప్రకారం, పాకిస్తాన్లో పెట్రోల్ ధర లీటరుకు 51.14 రూపాయలు. భూటాన్లో పెట్రోల్ లీటరుకు రూ .49.56 వద్ద లభిస్తుంది. శ్రీలంకలో పెట్రోల్ ధర రూ .60.26. బంగ్లాదేశ్లో రూ. 76.41 రూపాయలు, నేపాల్లో 68.98 రూపాయలు వద్ద ఉంది. ఇరాన్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.4.50 ఉండగా, అంగోలాలో రూ.17.78 ఉంది. అల్జీరియాలో రూ.25.10 ఉండగా, కువైట్ లో రూ.25.18 ఉన్నది. సూడాన్ లో రూ.27.50, నైజీరియాలో రూ.31.65 గా ఉన్నది. మనదేశంలో ఒక్క ఫిబ్రవరిలో ఇప్పటివరకు పెట్రోల్ రూ .3.24, డీజిల్ రూ .3.47 పెరిగింది. మొత్తంమీద ఏడాది కాలంలో పెట్రోల్ ధర లీటరుకు రూ .17 పెరగడం గమనార్హం. -
మిస్టరీ: ఒడ్డుకు కొట్టుకొచ్చిన బంగారం..
కారకాస్: ఆశ్చర్యపరిచే సంఘటన... ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతూ సామాన్యుడికి అందనంత దూరంలో ఉంది. కానీ ఈ దేశంలో మాత్రం బంగారం నెలకు దిగొచ్చి సామన్యుడి చేతికందొచ్చింది. భారీ స్థాయిలో బంగారం సముద్రపు అలలతో ఒడ్డుకు కొట్టుకొచ్చింది. నమ్మశక్యం కానీ ఈ సంఘటన వెనిజులాలో చోటుచేసుకుంది. ఆదివారం గ్వాకలోని సముద్ర తీరానికి బంగారు, వెండి ఆభరణాలు వేల సంఖ్యలో కొట్టుకొచ్చాయట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 2 వేలకు పైగా మత్స్యాకార కుటుంబాలు ఈ బీచ్ వద్ద నివసిస్తుంటాయి. ఈ క్రమంలో ఓ మత్స్యకారుడు చేపల వేట కోసం ఉదయాన్నే తీరానికి రాగా అతడికి ఒడ్డున ఇసుకలో మెరుస్తున్న వస్తువు కనిపించింది. అదేంటని చేతిలోకి తీసుకుని చూడగా అది బంగారు ఆభరణం. (చదవండి: వైరల్: కూతురి వేళ్లు కొరుక్కుతిన్న తల్లి!) దాంతో ఆశ్చర్యపోయిన ఆ మత్స్యకారుడు బంగారం దొరికిందోచ్..! అంటూ గట్టిగా కేకలు వేశాడు. అతడి కేకలు విన్న మిగతా గ్రామస్తులు, మత్స్యకారులు వచ్చి చూసేసరికి బీచ్ ఒడ్డున ఇసుకల్లో బంగారం, వెండి ఆభరణాలు కనిపించాయి. అనంతరం గ్రామస్తులు బీచ్ మొత్తం జల్లెడ పట్టడం ప్రారంభించారు. బంగారు ఆభరణాలు దొరకడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ.. ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదని, ఇదే మొదటిసారని చెప్పారు. ఈ బంగారం ఒడ్డుకు ఎలా వచ్చిందో, అసలు సముద్రంలోకి ఎలా చేరాయో ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసిన వెనిజులా నిపుణులు ఒడ్డుకు బంగారు ఆభరణాలకు ఎలా కొట్టుకువచ్చాయని శోధించే పనిలో పడ్డారట. (చదవండి: పాకిస్తాన్: ‘అందుకే విగ్రహం ధ్వంసం చేశా’) -
డెలివరీ బాయ్గా మారిన అంతర్జాతీయ క్రికెటర్
ఒలింపిక్ చాంపియన్... ఈ ఒక్క మాట చాలు ఆటగాళ్ల రాతను మార్చేందుకు... మనలాంటి దేశంలో అయితే ఒలింపిక్ స్వర్ణం సాధించిన ఆటగాడు మిగతా జీవితం గురించి ఆలోచించాల్సిన, బెంగ పడాల్సిన పనే ఉండదు. కోట్ల రూపాయలు, కానుకలతో కనకాభిషేకం కురుస్తుంది. కానీ అన్ని దేశాల్లో ఇలాంటి పరిస్థితి ఉండదు. ఒలింపిక్ విజయం సాధించినా సరే... అవసరమైనప్పుడు బతుకుతెరువు కోసం ఎలాంటి చిన్న పనికైనా సిద్ధం కావాల్సిందే. అదీ వెనిజులా లాంటి దేశం నుంచి వచ్చిన ఆటగాడి పరిస్థితి అయితే మరీ ఇబ్బందికరం. లాడ్జ్ (పోలాండ్): దక్షిణ అమెరికా దేశం వెనిజులా... ఆ దేశం తరఫున ఇద్దరు ఆటగాళ్లు ఇప్పటి వరకు ఒలింపిక్స్లో స్వర్ణ పతకాలు సాధించారు. 1968లో బాక్సర్ ఫ్రాన్సిస్కో రోడ్రిగ్స్ తర్వాత 2012 లండన్ ఒలింపిక్స్లో ఫెన్సింగ్ క్రీడాంశంలో రూబెన్ లిమార్డో గాస్కన్ బంగారు పతకం సాధించాడు. అయితే ఆ తర్వాత కూడా లిమార్డోకు పెద్దగా ఏమీ కలిసి రాలేదు. కానీ లోటు లేకుండా మాత్రం జరిగిపోయింది. 2016 రియో ఒలింపిక్స్లో విఫలమైనా... ఇప్పుడు మళ్లీ టోక్యో ఒలింపిక్స్ కోసం అతను సన్నద్ధమవుతున్నాడు. ఫుడ్ డెలివరీ బాయ్గా రూబెన్ లిమార్డో; ‘లండన్’ స్వర్ణంతో... రెండు ప్రపంచ చాంపియన్షిప్ రజతాలు కూడా గెలుచుకున్న 35 ఏళ్ల లిమార్డో... ఇందుకోసం యూరోపియన్ దేశం పోలాండ్లో శిక్షణ పొందుతున్నాడు. ఇంత కాలం ఒక ఆటగాడిగా స్పాన్సర్షిప్ నుంచే వచ్చే డబ్బులతో అంతా సవ్యంగానే సాగింది. అయితే కరోనా ఒక్కసారిగా అన్నీ మార్చేసింది. టోక్యో క్రీడలు వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో పాటు స్పాన్సర్లు కూడా వెనక్కి తగ్గారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము అండగా నిలవలేమంటూ చేతులెత్తేశారు. ఒకవైపు శిక్షణ, మరోవైపు భార్య, ఇద్దరు పిల్లల బాధ్యత కూడా ఉంది. ఒక క్రీడాకారుడిగా ఇన్నేళ్లు గడిపిన తనకు మరో పని తెలీదు. దాంతో కుటుంబ పోషణ కోసం లిమార్డో ‘ఉబెర్ ఈట్స్’ డెలివరీ బాయ్ అవతారమెత్తాడు. ఉదయమే ప్రాక్టీస్ ముగించుకున్న అనంతరం తన సైకిల్పై ఫుడ్ ఆర్డర్లు అందించేందుకు బయల్దేరడం, సాయంత్రం వచ్చి మళ్లీ సాధన కొనసాగించడం అతని దినచర్య. అయితే డెలివరీ బాయ్గా పని చేయడం పట్ల తాను బాధ పడడం లేదని, కోవిడ్–19 కాలంలో కనీసం బతికేందుకు ఒక ఆధారం దొరికినందుకు సంతోషిస్తున్నానని చెప్పినప్పుడు లిమార్డోలో ఒక ఒలింపిక్ చాంపియన్ కాకుండా ఎలాగైనా పోరాటం సాగించాలనుకునే ఒక సామాన్యుడు కనిపించాడు. మరో ఒలింపిక్ పతకం తన కల అని, దానిని నెరవేర్చుకునేందుకు ఎంతౖకైనా కష్టపడతానని అతను చెబుతున్నాడు. అతని స్వదేశం వెనిజులా నుంచి అయితే అసలు ఆశించడానికి ఏమీ లేదు. తీవ్ర రాజకీయ సంక్షోభం కారణంగా ఆ దేశం ప్రస్తుతం కనీస ఆహారం, మందులు కూడా లేకుండా భయంకర పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు అక్కడ 1 యూఎస్ డాలర్ విలువ సుమారు 10 వేల వెనిజులన్ బొలీవర్స్కు పడిపోవడం దాని తీవ్రతను చూపిస్తోంది. అంతర్జాతీయ క్రికెటర్ కూడా... నెదర్లాండ్స్కు చెందిన 28 ఏళ్ల పాల్ ఆడ్రియాన్ వాన్ మీకెరన్ది కూడా ఇదే తరహా బాధ. నెదర్లాండ్స్ క్రికెట్ జట్టులో ప్రధాన ఆటగాడైన ఈ ఫాస్ట్ బౌలర్ జాతీయ జట్టు తరఫున 5 వన్డేలు, 41 టి20 మ్యాచ్లు ఆడాడు. 2020 టి20 వరల్డ్ కప్కు అర్హత సాధించిన నెదర్లాండ్స్ జట్టులో అతను కూడా సభ్యుడు. అయితే ఇప్పుడు టి20 ప్రపంచకప్ వాయిదా పడటం అతడికి సమస్య తెచ్చిపెట్టింది. సాధారణంగా నెదర్లాండ్స్ క్రికెటర్లు వేసవిలో మాత్రమే క్రికెట్ బరిలోకి దిగి ఆటకు అనువుగా ఉండని శీతాకాలంలో ఇతర ఉద్యోగాలు చేసుకుంటారు. అక్టోబర్–నవంబర్లో ఆస్ట్రేలియా గడ్డపై ప్రపంచ కప్ జరిగి ఉంటే వారికి డబ్బు వచ్చి ఉండేది. కానీ ఆ అవకాశం లేకపోవడంతో వాన్ మీకెరన్ కూడా ‘ఉబెర్ ఈట్స్’ డెలివరీ బాయ్గా పని మొదలు పెట్టాడు. ‘ఈ రోజు ప్రపంచకప్ క్రికెట్ ఆడుతూ ఉండాల్సింది. కానీ ఈ శీతాకాలంలో డబ్బుల కోసం ఉబెర్ ఈట్స్ డెలివరీలు చేయాల్సి వస్తోంది. పరిస్థితులు ఎలా మారిపోతాయో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే బాధేమీ లేదు. అంతా నవ్వుతూ ఉండండి’ అని మీకెరన్ ట్వీట్ చేశాడు. -
లాక్డౌన్ : వైన్తో పండుగ చేసుకున్నారు
కరాకస్ : కరోనా నేపథ్యంలో అక్కడికి ప్రజలకు ఈ మహమ్మారి సోకకుండా మార్చి నుంచే వెనిజులా తమ దేశంలో లాక్డౌన్ అమలు చేసింది. దీంతో అక్కడి ప్రజలకు ఎటు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో బోర్గా ఫీలయ్యేవారు. దీంతో పాటు అక్కడి ప్రభుత్వం ఎవరు బయటికి రాకుండా సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలని అక్కడి అధికారులు ఆదేశించారు. వెనిజులాకి చెందిన రియల్ ఎస్టేట్ ఏంజెంట్ బెర్తా లోపెజ్ అనే యువతి లాస్ పాలోస్ అనే ప్రాంతంలో ఉంటుంది. ఆమె ఉంటున్న నివాసానికి అన్ని వైపుల అపార్ట్మెంట్లే కావడంతో బెర్తాకు వెంటనే ఒక ఆలోచన తట్టింది. ప్రభుత్వం విధించిన నిబంధనలను పాటిస్తూనే తను ఉంటున్న రూఫ్ టాప్ మీదకు ఎక్కి వైన్ తాగాలని భావించింది. ఇదే విషయాన్ని తన తోటివాళ్లకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. మొదట ఆమె చేస్తున్న పనిని ఒప్పుకోకున్నా.. తరువాత ఆలోచించి చూస్తే నిబంధనలు బేఖాతరు చేయడం లేదని వారు భావించారు. అపార్ట్మెంట్లో ఉంటున్న వారు తమ బిల్డింగ్ రుఫ్టాప్ ఎక్కి చేపలు పట్టే యంత్రానికి గ్లాసును కట్టేసి వైన్ తాగడం ప్రారంభించారు. ('ఆ రెండు లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయాల్సిందే') వైన్ తాగడానికి ఇంత చేయడం అవసరమా అని బెర్తాను అడిగితే.. ఆమె స్పందిస్తూ.. ' లాక్డౌన్ వల్ల ఇంట్లో బోర్గా పీలవుతున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. అలాగే ప్రభుత్వం చెప్పిన భౌతిక దూరాన్ని కూడా పాటిస్తున్నాం. ఇక ఫిషింగ్ లైన్ ఎందుకంటే ఎదుటివారికి చీర్స్ చెప్పేందుకు ఉపయోగిస్తున్నాం. ఇక రూఫ్టాప్ మీద వైన్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాం. వారు నాకు కనిపించేంత దూరంలో ఉండడంతో ఆనందంగా గడిపేస్తున్నాంటూ' చెప్పుకొచ్చింది. అయితే బెర్తా చేసిన చిన్న పని లంచ్, డిన్నర్ల వరకు తీసుకెళ్లింది. అయితే అందరు భౌతిక దూరం పాటిస్తూనే ఈ పని చేస్తుండడం విశేషం. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 44 లక్షలకు చేరుకోగా, మృతుల సంఖ్య 3లక్షలకు చేరువలో ఉంది. (కరోనా: ఫ్రాన్స్ను దాటేసిన బ్రెజిల్) -
వెనిజులా ఆ ఆయుధాన్ని వదిలింది: అమెరికా
వాషింగ్టన్/కారకస్: నార్కో టెర్రరిజాని(మాదక ద్రవ్యాల అక్రమ రవాణా)కి పాల్పడుతున్నారన్న ఆరోపణలతో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై అమెరికా అభియోగాలు దాఖలు చేసింది. ఆయనతో పాటు ఆ దేశ పలువురు ఉన్నతాధికారులపై కేసులు నమోదు చేసింది. తాము ఉగ్రవాద సంస్థగా గుర్తించిన రెవల్యూషనరీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా(ఎఫ్ఏఆర్సీ)తో మదురో అనుచరులు సంబంధాలు కొనసాగిస్తున్నారని అమెరికా ఆరోపించింది. కొకైన్ను అక్రమంగా రవాణా చేసే ‘ది కార్టెల్ ఆఫ్ ది సన్స్’ గ్యాంగ్కు మదురో నాయకత్వం వహిస్తున్నారని.. వారి సహాయంతో టన్నుల కొద్దీ మాదక ద్రవ్యాలు అమెరికాకు చేరవేస్తున్నారని మండిపడింది.(‘వారు యుద్ధం, హింస కోరుకుంటున్నారు’) గత రెండు దశాబ్దాలుగా ఈ తతంగం కొనసాగుతోందని... ఈ వ్యాపారం ద్వారా వాళ్లు మిలియన్ల కొద్దీ డాలర్లు ఆర్జించారని ఆరోపించింది. ఈ మేరకు న్యూయార్క్, వాషింగ్టన్, మియామీ తదితర ప్రాంతాల్లో ట్రాఫికింగ్, మనీ లాండరింగ్ కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. అదే విధంగా వెనిజులా డ్రగ్ మాఫియాకు సంబంధించిన సమాచారాన్ని అందించిన వారికి 15 మిలియన్ డాలర్ల భారీ రివార్డు ప్రకటించింది.(అమెరికాతో యుద్ధానికి సిద్ధం ) అమెరికాను నాశనం చేసేందుకే ఈ విషయం గురించి అమెరికా అటార్నీ జనరల్ బిల్ బార్ మాట్లాడుతూ... ‘‘ అమెరికాను నాశనం చేసేందుకు మదురో, ఆయన ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ఎఫ్ఏఆర్సీతో కుట్రపన్ని... దాదాపు 20 ఏళ్ల నుంచి టన్నుల కొద్దీ కొకైన్ను ఇక్కడికి పంపిస్తున్నారు. అమెరికా సమాజాన్ని నాశనం చేసేందుకు కొకైన్ అనే ఆయుధాన్ని వదిలారు. మదురో పాలనాదక్షత ఏంటో ఇప్పుడే అర్థమవుతోంది. ఆయన పాలన అవినీతి, నేరాలతో నిండిపోయింది’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మదురో ఉద్దేశపూర్వకంగానే కొకైన్ను సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. మదురో అంటే నేరగాడు.. డ్రగ్ మాఫియా! ఇక అమెరికా అభియోగాలపై స్పందించిన వెనిజులా విదేశాంగ శాఖ మంత్రి జార్జ్ అర్రెజా .. తమ దేశాధినేతపై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వెనిజులా ప్రజలు, ప్రజాస్వామ్య వ్యవస్థపై ట్రంప్ ప్రభుత్వం మరోసారి దాడికి దిగిందని దుయ్యబట్టారు. అత్యంత హేయమైన, నీచమైన ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కాగా వెనిజులా అధ్యక్షుడిగా మదురోను గుర్తించేందుకు అమెరికా సహా 50 ఇతర దేశాలు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత జువాన్ గైడోను వెనిజులా అధ్యక్షుడిగా తాము గుర్తిస్తున్నట్లు ట్రంప్ గతంలో ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో అమెరికా తాజా ఆరోపణలకు జువాన్ గైడో విదేశీ వ్యవహారాల కమిషనర్ జులియో బోర్గ్స్ మద్దతు పలికారు. ‘‘ మదురో అంటే డ్రగ్ మాఫియా. మదురో అంటే వ్యవస్థీకృత నేరగాడు’’అని వ్యాఖ్యానించారు. -
ఆ దేశాలపై అమెరికా ఆంక్షలు
వాషింగ్టన్: గతంలో చెప్పినట్టుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతా నిబంధనలను పాటించడంలో విఫలమైన దేశాల పౌరుల వీసా అనుమతులపై ఆంక్షలు విధించే పత్రంపై సంతకం చేశారు. ఇవి అమెరికా భద్రతకు ప్రమాదకరంగా మారాయని ఆయన వైట్ హౌస్ వెల్లడించింది. ఇరాన్, లిబియా, ఉత్తర కొరియా, సిరియా, వెనెజులా, యెమన్, సోమాలియా పౌరుల అమెరికా ప్రవేశంపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తూ ప్రకటన విడుదల చేసింది. మయన్మార్, ఎరిట్రియా, కిర్గిజిస్తాన్, నైజీరియా వలసదారులకు వీసాల అనుమతిపై నిషేధం విధించింది. సూడాన్, టాంజానియా దేశాలు వీసా లాటరీలో పాల్గొనే అవకాశాన్ని రద్దు చేస్తూ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ స్టెఫానియా గ్రెషమ్ ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ ఆంక్షలేవీ పర్యాటకులకు, వ్యాపారస్తులకు, వలసేతర ప్రయాణికులకు వర్తించవనిన్నారు. అంతర్జాతీయ భద్రతా నిబంధనలను పాటించకుంటే ఎలా ఉంటుందో ఆయా దేశాలకు అర్థమయ్యేందుకే ఈ నిషేధమని యాక్టింగ్ సెక్రటరీ చాడ్ ఎఫ్ వోల్ఫ్ వెల్లడించారు. ‘దేశ భద్రత, ప్రజల రక్షణే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రథమ బాధ్యత అనీ, ఈ ఆంక్షలు ఆ లక్ష్యాన్ని చేరుకుంటాయని’ వోల్ఫ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
వైరల్ : 8 ప్యాంట్లు తొడుక్కొని.. అడ్డంగా బుక్కైంది
మనం సాధారణంగా వస్త్ర దుకాణానికి వెళితే కావలిసినవి కొనుక్కుంటాం. కానీ ఓ యువతి మాత్రం షాప్కు వెళ్లి చోరీ చేద్దామని భావించి అడ్డంగా బుక్కైంది. ఈ వింత ఘటన వెనిజులాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోనూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. వెనిజులాలో ఓ యువతి వస్త్ర దుకాణానికి వెళ్లింది. అక్కడ జీన్స్ ర్యాక్ వద్దకు వెళ్లి 8 ప్యాంట్లు తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లి ఒకదాని మీద ఒకటి ధరించి చోరీ చేసేందుకు యత్నించింది. కాగా, యువతి ప్రవర్తనపై అనుమానం కలిగిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అడ్డగించి వాష్రూమ్కు తీసుకెళ్లారు. ఆమె వేసుకున్న ప్యాంట్ను విప్పమన్నారు. దీంతో సదరు యువతి ఒక్కొక్క ప్యాంట్ విప్పుతూ.. మొత్తం 8ప్యాంట్లను బయటికి తీయడంతో సిబ్బంది ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అయితే ఇదంతా వీడియో తీసీ ఫేస్బుక్లో షేర్ చేయడంతో 4.2 మిలియన్స్కు పైగా వ్యూస్ వచ్చాయి. ' ఈమె చోరీలు చేయడంలో చాలా నేర్పరి. కొంచెం అజాగ్రత్తగా వ్యవహరించి ఉంటే దర్జాగా బయటకు వెళ్లిపోయేదే' అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
నగ్న శరీరాలపై కోళ్ల పందెం
వెనిజులా : ఖైదీలను హింసించటానికి వెనిజులాలోని ఓ జైలు అధికారులు కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. సరిపడా తిండి, నీరు ఇవ్వాలంటూ నిరసన చేపట్టిన ఖైదీలను నగ్నంగా నేలపై పడుకోబెట్టి వారి శరీరాలపై కోళ్ల పందెం పెట్టారు. ఈ సంఘటన వెనిజులా, అనాకోలోని పోలీస్ కోఆర్డినేషన్ సెంటర్లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గత శుక్రవారం అనాకోలోని పోలీస్ కోఆర్డినేషన్ సెంటర్లోని ఖైదీలు తమకు సరిపడా ఆహారం, నీరు ఇవ్వటం లేదంటూ, బంధువులు చూడటానికి వచ్చినపుడు మెడిసిన్స్ తేవటానికి అనుమతి ఇవ్వాలంటూ నిరసన చేపట్టారు. దీంతో ఆగ్రహించిన జైలు అధికారులు తమ రాక్షసత్వాన్ని బయటపెట్టారు. దాదాపు 70మంది ఖైదీలను 2 గంటల పాటు విచక్షణా రహితంగా కొట్టడమే కాకుండా వారిని నగ్నంగా చేసి, నేలపై పడుకోబెట్టి శరీరాలపై కోళ్ల పందెం పెట్టారు. అవి వారి శరీరాలను చీరుతుంటే చూసి ఆనందించారు. ఆ తర్వాత కొన్ని గంటలు వారికి తిండి, నీరు కూడా ఇవ్వలేదు. వెనిజులాకు చెందిన ఓ రిపోర్టర్ ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘం తీవ్ర స్థాయిలో మండిపడింది. దీంతో స్పందించిన ప్రభుత్వం సంఘటనపై విచారణకు ఆదేశించింది. -
‘వారు యుద్ధం, హింస కోరుకుంటున్నారు’
కరాకస్ : దక్షిణ అమెరికా దేశం వెనిజులాలో సంక్షోభం తారస్థాయికి చేరింది. ఆర్థికమాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న వెనిజులా నుంచి లక్షలాది మంది పౌరులు పొట్టచేతబట్టుకుని... పెరు సహా ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్తున్నారు. తమకు వచ్చిన విద్యను ప్రదర్శిస్తూ చిల్లర పోగుచేసుకుంటూ దీనస్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో వ్యవహారశైలి వల్లే ఆ దేశ పౌరులకు ఇలాంటి దుర్గతి పట్టిందంటూ ప్రతిపక్షాలతో పాటు మానవ హక్కుల సంఘాలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ వెనిజులన్ మహిళ దీనస్థితిని కళ్లకుగట్టే వీడియోను ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్ మంగళవారం షేర్ చేసింది. ‘ మీరు ఈరోజు వినాల్సిన సుందరగానం ఇది’ అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఆ వీడియోలో...తన తొమ్మిది నెలల పాపాయిని చేతుల్లో పెట్టుకుని...గానం చేస్తూ ఆ తల్లి డబ్బు యాచిస్తోంది. ఈ దృశ్యాలు చూసి నెటిజన్లు కంటతడి పెడుతున్నారు. ‘తల్లి పొత్తిళ్లలో కేరింతలు కొడుతూ... హాయిగా పడుకోవాల్సిన ఆ చిన్నారి నేడు ఇలా రోడ్డుపై అమ్మ చేతుల్లో నిద్రపోతోంది. ఈ దుస్థితి కారణం ఎవరు’ అంటూ దేశ అధ్యక్షుడి తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం ఏడాది కాలంలో దాదాపు ఎనిమిదిన్నర లక్షల మంది వెనిజులన్లు పెరూకు వలస వచ్చారు. వారిలో చాలా మందిని అక్రమవలసదారులుగా గుర్తించిన పెరూ ప్రభుత్వం... పాస్పోర్టులు, వీసాలు ఉన్నవారిని మాత్రమే దేశంలో ఉండేందుకు అనుమతినిచ్చింది. వీసాలు లేని వాళ్లపై చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు కొలంబియా యుద్ధాన్ని కోరుకుంటోందని...వారి కుట్రలు తిప్పికొట్టేందుకు తమ సైన్యం సన్నద్ధంగా ఉన్నదంటూ వెనిజులా అధ్యక్షుడు మదురో ప్రకటన జారీ చేశారు. వివిధ రక్షణ విభాగాలకు చెందిన సైన్య దళాధిపతులతో సమావేశమైన ఫొటోలను విడుదల చేశారు. ‘కొలంబియా యుద్ధం, హింస కోరుకుంటోంది. అందుకు మేము ధీటుగా బదులిస్తాం’ అని మదురో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చదవండి: అమెరికాతో తెగదెంపులు! ఇక ఈ ఏడాది జరిగిన వెనిజులా ఎన్నికల్లో ప్రముఖ ప్రతిపక్ష నాయకులు నిషేధానికి గురవడం, కొన్ని పార్టీలు పోటీకి దూరం కావడంతో అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచినట్లు మదురో మేలో ప్రకటించుకున్నారు. ఇందుకు నిరసనగా మళ్లీ కొత్తగా ఎన్నికలు నిర్వహించాలంటూ నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు.అప్పటి నుంచి దేశంలో రాజకీయ అనిశ్చితితో పాటు ఆర్థిక సంక్షోభం కూడా ముదిరింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత జువాన్ గైడోను వెనిజులా అధ్యక్షుడిగా.. గుర్తిస్తున్నామంటూ అమెరికా ప్రకటన విడుదల చేసింది. ఇందుకు కొలంబియా సహా ఇతర దేశాలు వంతపాడాయి. ఈ క్రమంలో అమెరికా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మదురో.. అగ్రరాజ్యంతో దౌత్య పరమైన సంబంధాలన్నీ తెంచుకుంటున్నామని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
అమెరికాతో యుద్ధానికి సిద్ధం
మా దేశాన్ని చుట్టుముట్టి నిర్బంధిస్తే అమెరికాతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో హెచ్చరించారు. యుద్ధానికి తమ సేనలను సమాయత్తం చేస్తున్నామని ప్రకటించారు. అమెరికా చట్ట వ్యతిరేకమైన బెదిరింపులపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. శుక్రవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ వెనెజులా వ్యవహారంలో రష్యా, చైనా, ఇరాన్, క్యూబాల జోక్యాన్ని తాము సహించమని, అందుచేతనే ఆ దేశాన్ని దిగ్బంధించే అంశం పరిశీలనలో ఉందని చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలపై మదురో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా బెదిరింపులు చూస్తుంటే ఆ దేశం తీవ్ర నిరాశ, చికాకులు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. తమ దేశానికి వ్యతిరేకంగా అమెరికా ఏ సైనిక చర్య తీసుకున్నా తగిన మూల్యం చెల్లిస్తుందని హెచ్చరించారు. ‘నేర సామ్రాజ్యవాద దేశానికి నేనిచ్చే సందేశం ఇదే. ఎవరైనా మమ్మల్ని ముట్టడిస్తే యుద్ధానికి సిద్ధం కావడానికి మేం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. వారు మాపై ఎంత ఒత్తిడి తెచ్చినా, ఎన్ని ఆంక్షలు విధించినా మేం మరింత స్వేచ్ఛగా, స్వతంత్రంగా వ్యవహరిస్తాం’ అని స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే అమెరికా వెనెజులాపై అనేక రకాల ఆంక్షలు విధించింది. దేశాధ్యక్షుడిగా ప్రతిపక్ష నేత యువాన్ గ్వాయిడోను గుర్తిస్తున్నామని అమెరికా దాని మిత్ర పక్షాలు ప్రకటించడమే గాక మదురోను తొలగించడానికి ఆ దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకున్న విషయం తెలిసిందే. దీని ఫలితంగానే గత కొంతకాలంగా అధ్యక్ష కార్యాలయాన్ని గ్వాయిడో అనుచరులు స్వాధీనం చేసుకోవాలని చూస్తుండటంతో ప్రస్తుతం వెనెజులాలో ఘర్షణ వాతావారణం నెలకొంది. -
రెండు కళ్లలోకి బుల్లెట్లు దూసుకుపోయి..
సాక్షి, న్యూఢిల్లీ : ఒకప్పుడు చమురు ఎగుమతులతో సమద్ధిగా ఎదిగిన దేశం వెనిజులాలో నిత్యావసరాల కోసం అక్కడి ప్రజలు నిత్యం ఆందోళనలు చేయడం, వారిని పోలీసులు పాశవికంగా అణచివేయడం నిత్యకత్యమైంది. అలాగే వంట గ్యాస్ కోసం తల్లి ఆండ్రియానా వెంట కుమారులు రూఫో ఛాకన్ (16), ఆండ్రియాన్ (14)లు తారిబా పట్టణంలో రెండు వారాల క్రితం ఆందోళన చేస్తుండగా, వారిపైకి పోలీసులు రబ్బర్ బుల్లెట్లు కాల్చారు. ఆ బుల్లెట్లకు సంబంధించిన 51 ముక్కలు వచ్చి రూఫో ఛాకన్ ముఖానికి తగులగా, వాటిల్లో 16 ముక్కలు నేరుగా రెండు కళ్లలోకి దూసుకుపోయాయి. దీంతో రెండు కళ్ల నుంచి రక్తం చిమ్మింది. సకాలంలో ఆస్పత్రిలో చేరి చికిత్స అందించినప్పటికీ రెండు కళ్లు పోయాయి. చూపు తెప్పించే ఆస్కారమే లేదని వైద్యులు తేల్చి చెప్పారు. వంట గ్యాస్ లేక ఇబ్బంది పడుతున్న తల్లికి అండగా తాను ఆందోళనకు వెళ్లినందుకు ఇప్పుడు తల్లికి భారంగా మారాల్సి వచ్చిందని ఆ తనయుడు బాధ పడుతున్నాడు. ఇంక తానే మాత్రం ఏడ్వదల్చుకోలేదని, ఆస్పత్రిలోనే కావాల్సినంత ఏడ్చేశానని మీడియా ముందు వాపోయాడు. తాను మదిలో రంగులు మర్చిపోకముందే చూపు రావాలని కోరుకుంటున్నానని, తనకు జీవితంలో ఏ కలలు చావలేదని, చూపు కోసం తాను ఎంత కష్టపడాలన్నా పడతానని, అలాంటి దారి ఉంటే చూపుమని మీడియాను కూడా వేడుకున్నాడు. బాధ్యతారహితంగా రబ్బర్ బుల్లెట్లను పేల్చిన ఇద్దరు పోలీసులను వెనిజులా యంత్రాంగం గుర్తించి వారిని విధుల నుంచి సస్పెండ్ చేసింది. అమెరికా ఆంక్షల వల్ల ఇప్పుడు వెనిజులాలో చమురు, వంట గ్యాస్ కొరత తీవ్రమైంది. -
టాయిలెట్ పేపర్గా కరెన్సీ!
సాక్షి, బిజినెస్ డెస్క్: గతేడాది రూపాయికి కొనుక్కున్న వస్తువు ఈ ఏడాది ఏకంగా 10 లక్షల రూపాయలకు కొనుక్కోవాల్సి వస్తే? అదీ కాదు.. కాసేపటి క్రితం 5 రూపాయలకు కొన్న బిస్కెట్ ప్యాకెట్ని 10 నిమిషాల తర్వాత 10 రూపాయలకి.. ఆ తర్వాత మరో 10 నిమిషాలకు ఇరవై, ముప్ఫై, నలభై రూపాయలకు కొనుక్కోవాల్సి వస్తే.. ప్రస్తుతం ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభాలతో అస్తవ్యస్తమైన వెనెజులా దేశంలో అచ్చం ఇలాంటి పరిస్థితే ఉంది. కరెన్సీ విలువ పడిపోవడం, ఆహారం మొదలైన నిత్యావసరాల కొరత నెలకొనడం, దానికి తగ్గట్లుగా రేట్లు పెరిగిపోవడం దీనికి కారణం. దీంతో ఒక దశలో టాయ్లెట్ పేపర్ను కొనుక్కోవడం బదులు కరెన్సీ నోట్లనే టాయ్లెట్ పేపర్గా వాడుకుంటున్నారంటే పరిస్థితులు ఎంతగా దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. ఎందుకిలా అంటే.. క్రూడాయిల్ ధరలు పడిపోవడంతో ఆ దేశ కరెన్సీ బొలివర్కూ డిమాండ్ విపరీతంగా పడిపోయింది. విదేశాల నుంచి చేసుకునే దిగుమతుల భారం పెరిగి, దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావడంతో ప్రభుత్వం మరింత ఎక్కువగా కరెన్సీని ముద్రించింది. దీంతో అందరి చేతుల్లో డబ్బు ఉన్నా, నిత్యావసరాల సరఫరా పరిమితంగా ఉండటంతో వాటి రేట్లు పెరిగిపోయాయి. చివరికి ఇదో ఇదో విషవలయంలా తయారైంది. ఇది గాక, దాచుకున్న డబ్బును వెనెజులన్లు అమెరికన్ డాలర్లలోకి మార్చుకోవడం మొదలెట్టారు. దీంతో డాలర్లకు డిమాండ్ పెరిగి.. వెనెజులా బొలివర్ మారకం రేటు మరింతగా పడిపోయింది. ప్రభుత్వం నియంత్రణ విధించడంతో బ్లాక్ మార్కెట్ జోరందుకుంది. అధికారిక మారకం రేటుకు.. బ్లాక్మార్కెట్ రేటుకూ భారీ వ్యత్యాసాలు వచ్చేయడంతో వెనెజులా కరెన్సీ విలువ మరీ పాతాళానికి పడిపోయింది. ఆహారం దగ్గర్నుంచి ప్రతీ దానికి కొరత నెలకొనడంతో సుమారు 30 లక్షల మంది వెనెజులన్లు (జనాభాలో దాదాపు పది శాతం) దేశం విడిచి వెళ్లిపోయారు. కిలో టమాటా... 30,000పైమాటే.. లీటరు పాలు... దాదాపు.. 50,000 ► 10 లక్షల శాతం: ఈ ఏడాది ఆఖరుకు వెనెజులాలో ద్రవ్యోల్బణం చేరబోయే స్థాయి (ఐఎంఎఫ్ అంచనా). ► ప్రభుత్వం పాత కరెన్సీ బొలివర్ ఫుర్టె స్థానంలో బొలివర్ సోబ్రానో కరెన్సీని ప్రవేశపెట్టింది. ఒక సోబ్రానో.. లక్ష ఫుర్టెలకు సమానం. ► ప్రస్తుతం 1 వెనెజులా బొలివర్ సొబ్రానో .. భారత కరెన్సీలో సుమారు రూ. 6.88కి సమానం. ► కిలో టమాటా దాదాపు 4,411 బొలివర్లు.. అంటే రూ.30,387 అన్నమాట. లీటరు పాలప్యాకెట్ ధర సుమారు 7,029 బొలివర్లు (రూ.48,400). -
వెనెజులాలో తిరుగుబాటు యత్నం
కారకాస్: వెనెజులా రాజధాని కారకాస్లో మంగళవారం ఘర్షణలు చెలరేగాయి. తనకు తానే అధ్యక్షునిగా ప్రకటించుకున్న జువాన్ గయిడో నేతృత్వంలో కొందరు సైనికులు, ఆందోళనకారులు రాజధాని సమీపంలోని వైమానిక స్థావరాన్ని, ప్రధాన రహదారిని దిగ్బంధించేందుకు ప్రయత్నించగా ప్రభుత్వ సైనికులు వారిని చెదరగొట్టారు. తన ప్రభుత్వానికే సైన్యం మద్దతు ఉందంటూ అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రకటించుకున్నారు. తిరుగుబాటు యత్నాలను సైన్యం తిప్పికొడుతోందన్నారు. కాగా, గయిడో ప్రభుత్వాన్ని రష్యా, చైనా మినహా 50 వరకు దేశాలు గుర్తించాయి. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వెనెజులాలో ఆందోళనలు నిత్యకృత్యంగా మారాయి. మదురోను గద్దె దించేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని, వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని గయిడో ప్రకటించారు. ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పలువురు గాయపడ్డారు. ఆగ్రహించిన ఆందోళనకారులను బస్సుకు నిప్పుపెట్టి జాతీయ రహదారిని దిగ్బంధించారు. సంయమనం పాటించాలని వెనిజులా అధికార, ప్రతిపక్షాలను ఐక్యరాజ్యసమితి కోరింది. -
వెనిజులాలో అగ్రరాజ్యాల ఆధిపత్యం!
మాస్కో: ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న వెనిజులాలో రష్యా సైన్యం అడుగుపెట్టింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు మద్దతుగా తమ సైన్యం ఆ దేశానికి చేరుకున్నట్లు రష్యా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మారియా తెలిపారు. ఇరుదేశాల మధ్య కుదిరిన సైనిక సహకార ఒప్పందం మేరకే తాము వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. వెనిజులాలో ఉండే ప్రతీ హక్కు రష్యా సైన్యానికి ఉందని తేల్చిచెప్పారు. అయితే వెనిజులాకు ఎంతమంది రష్యా సైనికులు చేరుకున్నారన్న విషయమై మారియా స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న అమెరికా–రష్యా సంబంధాలు మరింత దిగజారనున్నాయి. -
అమెరికా దుందుడుకుతనం
అధ్యక్ష ఎన్నికల్లో రష్యాతో చేతులు కలిపి అడ్డదారులు తొక్కారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ దాన్నుంచి దేశ ప్రజల దృష్టి మళ్లించడానికి వెనిజులాలో చిచ్చు రగిలిస్తున్నారు. నిరుడు మే నెలలో అక్కడ జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన విపక్షాన్ని ప్రోత్స హించి ఉద్యమాలతో ఆ దేశంలో అశాంతి సృష్టిస్తున్నారు. గత కొన్నిరోజులుగా వెనిజులా నిరసన లతో, సమ్మెలతో అట్టుడుకుతోంది. ప్రస్తుత దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను ఎలాగైనా గద్దె దించా లన్నది అమెరికా లక్ష్యం. దీనికి యూరప్ యూనియన్(ఈయూ)లోని ప్రధాన దేశాలైన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్లు వత్తాసు పలుకుతున్నాయి. ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న జువాన్ గైదో తనను తాను దేశాధ్యక్షుడిగా ప్రకటించుకోగా, ఆయన్ను గుర్తిస్తున్నట్టు ట్రంప్ ఆదరా బాదరాగా ప్రకటించారు. పైగా సైనిక దాడులకు దిగుతామని బెదిరిస్తున్నారు. అయితే ఈయూ దేశాలు మాత్రం తాము అమెరికా తోక పట్టుకుని పోవడం లేదని చెప్పడానికన్నట్టు వేరే పల్లవి అందుకున్నాయి. ఎనిమిది రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని మదురోకు షరతు విధిం చాయి. అందుకు సిద్ధపడకపోతే గైదోను దేశాధ్యక్షుడిగా తాము కూడా గుర్తిస్తామని హెచ్చరిం చాయి. అసలు వేరే దేశంలో ఎవరు అధ్యక్షుడిగా ఉండాలో, ఎవరు ఉండకూడదో చెప్పడానికి వీరె వరు? వెనిజులా ప్రజలు తమను ఎవరు పాలించాలో తేల్చుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారా? అక్కడ నియంతృత్వం రాజ్యమేలుతోందా? తాజా సంక్షోభంలో తాము మదురోకు అండగా నిలు స్తామని రష్యా, చైనా ప్రకటించాయి. మన దేశం కూడా వెనిజులా సమస్యల్ని అక్కడి ప్రజలే పరిష్క రించుకోవాలని సూచించింది. గైదోను గుర్తించేందుకు నిరాకరించింది. వెనిజులాపై అమెరికా, పాశ్చాత్య దేశాల కడుపు మంట ఈనాటిది కాదు. అక్కడ అపారమైన చమురు, సహజవాయు నిక్షేపాలన్నాయి. అక్కడి భూగర్భంలో పసిడి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. అపురూపమైన వజ్రాలకు అది పెట్టింది పేరు. ఇంత సంపద ఉన్నప్పుడు ఎవరికైనా కన్నుకుట్టడం సహజం. పైగా ఆ దేశంలో వరసగా వచ్చిన ప్రభుత్వాలను గుప్పెట్లో పెట్టుకుని, అక్కడి సంపదను కొల్లగొట్టడం అలవాటు చేసుకున్న అగ్రరాజ్యాలకు 1999లో మొదటిసారి హ్యూగో చావెజ్ రూపంలో పెను సవాలు ఎదురైంది. ఆ దేశంలో రెండు ప్రధాన పార్టీలు ఎప్పుడూ ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ... ఒకరి తర్వాత మరొకరు పీఠం ఎక్కుతూ సహజ వనరులను బహుళజాతి సంస్థలకు దోచిపెడుతున్న తరుణంలో చావెజ్ ఆ రెండు పార్టీలకూ వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించాడు. 19వ శతాబ్దిలో స్పెయిన్ వలస దేశాలను ఏకం చేసిన వెని జులా జాతీయ యోధుడు సైమన్ బొలివర్ను ఆదర్శంగా తీసుకుని కుమ్మక్కు రాజకీయాలపై కత్తి దూశాడు. 1999 అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించి మొదలుకొని 2013లో మరణించేవ రకూ అధికారంలో కొనసాగారు. కేన్సర్ వ్యాధితో అంతిమ దశలో ఉండగా తన వారసుడిగా మదు రోను ప్రకటించారు. అదే ఆయనకు బలంగా మారింది. పాలనా సామర్థ్యంలో చావెజ్తో సరి తూగ కపోయినా... అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గాక ఇబ్బందులు తలెత్తినా ఉన్నం తలో మదురో మెరుగైన పాలనే అందించారు. అందుకే 2015లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో సైతం ఆయనే విజయం సాధించారు. వాస్తవానికి తదుపరి ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగాల్సి ఉంది. కానీ విపక్షాల డిమాండ్కు తలొగ్గి నిరుడు మే నెలలో... అంటే 19 నెలల ముందు అధ్యక్ష ఎన్నికలు జరి పారు. ఆ ఎన్నికల్లో 67.84 శాతం ఓట్లు సాధించారు. అవి స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగాయని వివిధ దేశాల నుంచి పరిశీలకులుగా వచ్చిన 150మంది సంతృప్తి వ్యక్తం చేశారు. అందులో 8 దేశా లకు చెందిన 14మంది ఎన్నికల అధికారులు, సాంకేతిక సిబ్బంది ఉన్నారు. పైగా వెనిజులా ఎన్ని కల ప్రక్రియ అత్యంత పకడ్బందీగా ఉంటుంది. ఎన్నికలకు ముందు... అవి కొనసాగుతుండగా... పూర్తయ్యాక– ఇలా మూడు దఫాలుగా 18సార్లు ఈవీఎంలను తనిఖీ చేసే ప్రక్రియ తప్పనిసరి. ఇందులో యాదృచ్ఛికంగా ఎంపిక చేసే 53శాతం ఈవీఎంలను పరీక్షిస్తారు. ఈ ప్రక్రియనంతటినీ టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. దొంగ ఓట్లకు అక్కడ ఆస్కారం ఉండదు. ఓటరు వేలిముద్రే అతడి/ఆమె గుర్తింపు కార్డు. అన్నిటికన్నా ముఖ్యమేమంటే... మదురో ప్రత్యర్థులెవరూ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించలేదు. 2015 పార్లమెంటరీ ఎన్నికల్లో మదురో పార్టీ కాకుండా, విపక్షాలే అత్యధిక స్థానాలు చేజిక్కించుకున్నాయి. నిజంగా అక్రమాలకు ఆస్కారం ఉంటే అది అసాధ్యమయ్యేది. వెనిజులా ఒడిదుడుకుల్లో ఉన్నమాట వాస్తవమే. కానీ ఆ ఒడిదుడుకులన్నీ అమెరికా ప్రాప కంతో సాగుతున్న దిగ్బంధం పర్యవసానంగా, చమురు ధరల కుంగుబాటు కారణంగా ఏర్పడ్డాయి. ఒబామా హయాంలో మొదలైన ఆంక్షలు ట్రంప్ వచ్చాక మరింత పెరిగాయి. వీటి విలువ దాదాపు 600 కోట్ల డాలర్లు. ఇవిగాక వెనిజులాకు దక్కాల్సిన చమురు సంస్థ లాభాలు 100 కోట్లను బదిలీ కాకుండా అమెరికా అడ్డగించింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్లో వెనిజులాకు ఉన్న 120 కోట్ల డాలర్ల బంగారం నిల్వలు స్తంభింపజేసింది. దేశంలో నిత్యావసరాల కొరత, ఆకాశాన్నంటిన ద్రవ్యోల్బణం సరేసరి. నిజంగా వెనిజులా ప్రజల శ్రేయస్సుపై ఏ కాస్త ఆందోళన ఉన్నా అమెరికా ఇలాంటి దుర్మార్గ చర్యలకు పాల్పడదు. వారిని కష్టాలపాటు చేయదు. తాము సృష్టించి, పెంచుతున్న సంక్షో భానికి మదురోను బాధ్యుడిగా చేసి, ఆయన తప్పుకోవాలనటం అమెరికా వక్రబుద్ధికి తార్కాణం. ప్రజామోదంతో ఎన్నికైన ఒక దేశాధ్యక్షుణ్ణి బెదిరించడం, సైనికచర్యకు దిగుతాననడం దురహం కారం తప్ప మరేం కాదు. ఈ దురహంకారానికి ఇప్పటికే పలు దేశాలు బలయ్యాయి. వెనిజులాలో నెత్తురు పారకుండా, అరాచకం తాండవించకుండా, అస్థిరత దాన్ని చుట్టుముట్టకుండా చూడాల్సిన బాధ్యత ప్రపంచ పౌరులందరిదీ. ఈ విషయంలో మన దేశం వైఖరి హర్షించదగ్గది. -
అక్కడ కాఫీ తాగాలంటే లక్షలు పెట్టాల్సిందే..
వెనిజులా : పట్టపగ్గాల్లేకుండా పెరిగిన ద్రవ్యోల్బణంతో వెనిజులాలో ఏ చిన్న వస్తువు కొనాలన్నా స్ధానిక కరెన్సీలో లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి. కప్పు కాఫీ ధర అక్కడి కరెన్సీలో పది లక్షల వెనిజులా బొలివర్స్ కావడం గమనార్హం. డాలర్తో బొలివర్స్ మారకం విలువ 637కు చేరడంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. వెనిజులాలో ఈ ఏడాది ద్రవ్యోల్బణం పదిలక్షల శాతానికి చేరుకుంటుందని ఐఎంఎఫ్ అంచనా వేయడంతో జనం బెంబేలెత్తుతున్నారు. నిత్యావసరాల ధరలు ప్రతి 19 రోజులకు రెట్టింపవుతున్నాయి. పెరుగుతున్న ధరలకు కళ్లెం వేసేందుకు వెనిజులా ప్రభుత్వం బ్యాంకు నోట్లను ఇబ్బడిముబ్బడిగా ముద్రిస్తుండటంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. గత కొన్నేళ్లుగా వెనిజులాలో నెలకొన్న రాజకీయ సంక్షోభం దేశాన్ని ఆర్థిక సుడిగుండంలోకి నెట్టేసింది. జీవన స్ధితిగతులు దిగజారిపోవడంతో అధ్యక్షుడు నికోలస్ మదురోకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దేశప్రజలే కాదు విదేశాలు సైతం ఆయన విధానాలను తీవ్రంగా ఎండగడుతున్నాయి. సంపన్న చమురు దేశాన్ని సామాజికార్థిక, రాజకీయ రంగాల్లో నిర్వీర్యం చేసిన అధ్యక్షుడి తీరును తప్పుపడుతున్నాయి. -
వెనెజులాలో రాజకీయ సంక్షోభం
కారకస్: దక్షిణ అమెరికా ఖండంలోని వెనెజులాలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. తనను తాను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్న విపక్ష నేత జువాన్ గుయాడో ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉండగా, అధ్యక్షుడు నికోలస్ మదురోకు సైన్యం తోడ్పాటు లభించింది. అమెరికాతోపాటు అనేక వెనెజులా పొరుగుదేశాలు గుయాడోకు మద్దతు తెలిపి ఆయనను తాత్కాలిక అధ్యక్షుడిగా గుర్తించగా, రష్యా, చైనా సహా పలు దేశాలు మదురోకు మద్దతుగా నిలిచాయి. ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోవడంతోపాటు ప్రజలకు నిత్యావసరాలు కూడా సరిగ్గా దొరకక తిండి కోసం నానా తిప్పలు పడుతున్నారు. -
అమెరికాతో తెగదెంపులు!
కారకస్ : ప్రతిపక్ష నేత జువాన్ గైడోను వెనిజులా అధ్యక్షుడిగా.. అమెరికా గుర్తించడం పట్ల ఆ దేశ ప్రస్తుత అధ్యక్షుడు నికోలస్ మదురో ఘాటుగా స్పందించారు. అగ్రరాజ్యం అమెరికాతో దౌత్య పరమైన సంబంధాలన్నీ తెంచుకుంటున్నామని పేర్కొన్నారు. 72 గంటల్లోగా అమెరికన్ ప్రతినిధులంతా తమ దేశాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ ఆయన హెచ్చరించారు. వెనిజులా అధ్యక్షుడిగా మదురో గతేడాది మేలో రెండోసారి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే మదురో పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైందని, శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయన్న కారణంగా ఆయనను అధ్యక్షుడిగా గుర్తించడానికి అమెరికా నిరాకరించింది. అంతేకాకుండా ప్రతిపక్ష నేత జువాన్ గైడోను అసలైన అధ్యక్షుడిగా గుర్తిస్తున్నామంటూ పేర్కొంది. ఈ మేరకు.. ‘ వెనిజులా ప్రజలు మదురో పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జువాన్ గైడోను వెనిజులా అధ్యక్షుడిగా నేను ఈ రోజు అధికారికంగా గుర్తిస్తున్నాను’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మదురో బుధవారం తన మద్దతుదారులతో కలిసి అధ్యక్ష భవనంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ‘ రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడిగా.. అమెరికాతో దౌత్యపరమైన, రాజకీయ ఇలా అన్ని రకాల సంబంధాలను తెంచుకోవాలని నిర్ణయించాను. దేశ ప్రజల ముందు, ప్రపంచంలోని అన్ని దేశాలకు ఈ విషయం తెలియజేస్తున్నాను. గెట్ అవుట్.. వెనిజులాను వదిలి వెళ్లండి. మాకు ఆత్మగౌరవం ఉంది.. డ్యామిట్’ అని మదురో వ్యాఖ్యానించారు. వెనిజులాను తోలు బొమ్మను చేసి అమెరికా అధికారం చెలాయించాలని చూస్తోందని ఘాటుగా విమర్శించారు. కాగా దక్షిణ అమెరికా దేశం వెనిజులాలో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి నెలకొంది. ప్రముఖ ప్రతిపక్ష నాయకులు ఎన్నికల్లో నిషేధానికి గురవడం, కొన్ని పార్టీలు పోటీకి దూరం కావడంతో అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచినట్లు మదురో మేలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో మళ్లీ కొత్తగా ఎన్నికలు నిర్వహించాలంటూ నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. ఇక ప్రతిపక్ష నేత జువాన్ను అధ్యక్షుడిగా అమెరికా గుర్తించడాన్ని కొలంబియా కూడా సమర్థించింది. The citizens of Venezuela have suffered for too long at the hands of the illegitimate Maduro regime. Today, I have officially recognized the President of the Venezuelan National Assembly, Juan Guaido, as the Interim President of Venezuela. https://t.co/WItWPiG9jK — Donald J. Trump (@realDonaldTrump) January 23, 2019 -
వెనెజులా అధ్యక్షుడిగా మళ్లీ మదురో
కారకస్: వెనెజులా అధ్యక్షుడిగా నికోలస్ మదురో రెండోసారి బాధ్యతలు చేపట్టారు. దేశంలో పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థ, క్షీణిస్తున్న శాంతిభద్రతల నేపథ్యంలో అధికారం నుంచి దిగిపోవాలని అంతర్జాతీయ సమాజం సూచించినా పదవి చేపట్టడానికే ఆయన మొగ్గు చూపారు. రాజధాని కారకస్లో జరిగిన మదురో ప్రమాణస్వీకార కార్యక్రమానికి 94 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. మదురో బాధ్యతలు చేపట్టడాన్ని అమెరికా, కెనడా సహా డజను లాటిన్ అమెరికా దేశాలు వ్యతిరేకించాయి. ప్రముఖ ప్రతిపక్ష నాయకులు ఎన్నికల్లో నిషేధానికి గురవడం, కొన్ని పార్టీలు పోటీకి దూరం కావడంతో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినట్లు మదురో మేలో ప్రకటించారు. -
మిస్ యూనివర్స్గా ఫిలిప్పీన్స్ భామ
బ్యాంకాక్: మిస్ యూనివర్స్ 2018 కిరీటాన్ని ఫిలిప్పీన్స్ యువతి కాట్రియానా గ్రే సొంతం చేసుకుంది. 93 దేశాలకు చెందిన యువతులు ఈ కిరీటం కోసం పోటీపడగా కాట్రియానా విజేతగా నిలిచింది. సోమవారం బ్యాంకాక్లో జరిగిన ఫైనల్లో న్యాయనిర్ణేతలు ఆమెను విజేతగా ప్రకటించారు. తొలి రన్నరప్గా దక్షిణాఫ్రికాకు చెందిన తామరిన్ గ్రీన్, రెండో రన్నరప్గా వెనెజెవిలాకు చెందిన స్టీఫనీ గుటీరెజ్ నిలిచారు. సింగర్, మోడల్గా పేరొందిన కాట్రియానా వేదికపై ఎరుపు రంగు గౌనులో తళుక్కుమంది. ఓ అగ్నిపర్వతాన్ని ప్రేరణగా తీసుకుని తాను ఎరుపు రంగు గౌనును ధరించానని కాట్రియానా చెప్పింది. గతేడాది మిస్ యూనివర్స్గా నిలిచిన డేమీ లీ నీల్పీటర్స్ కాట్రియానాకు కిరీటాన్ని అలంకరించింది. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె కాట్రియానాకు అభినందనలు తెలిపారు. -
వెనిజువెలా అధ్యక్షుడిపై హత్యాయత్నం!
కరాకస్: వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మడురోపై ఆదివారం ఉదయం (భారతకాలమానం ప్రకారం) హత్యాయత్నం జరిగింది. భారీ పేలుడు పదార్థాలున్న డ్రోన్ ఆయన ప్రసంగిస్తున్న వేదికకు సమీపంలో పేలింది. ఈ ప్రమాదంలో ఆయన క్షేమంగానే బయటబడినా.. ఏడుగురు సైనికులకు గాయాలయ్యాయి. నేషనల్ గార్డ్స్ 81వ వార్షికోత్సవం సందర్భంగా కరాకస్లో మిలటరీ పరేడ్నుద్దేశించి మడురో ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడికి కొలంబియానే కారణమని మొదట పేర్కొన్న మడురో అనంతరం.. అనుమానాస్పద రెబల్ గ్రూప్ హత్యాయత్నం చేసి ఉండొచ్చన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మిలటరీ అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ‘నేను బాగున్నాను. బతికే ఉన్నాను. ఈ దాడి తర్వాత మరింత విప్లవాత్మకంగా పనిచేయాలని నిశ్చయించుకున్నాను. ఈ ఘటనకు బాధ్యులకు తీవ్రమైన శిక్షలు తప్పవు. ఎవరినీ క్షమించబోం’ అని దాడి అనంతరం జాతినుద్దేశించి మాట్లాడుతూ మడురో హెచ్చరించారు. ‘నన్ను చంపేందుకు పన్నిన కుట్ర ఇది. నేడు నన్ను అంతమొందించేందుకు ప్రయత్నించారు. ఓ ఎగురుతున్న వస్తువు హఠాత్తుగా నా ముందు పేలింది’ అని ఆయన అన్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న ఆందోళనలను అణచివేస్తున్న మడురో.. 248 మందిని రాజకీయ ఖైదీలుగా జైల్లో పెట్టారు. ఈ ఘటనకు బాధ్యులపై కనికరం చూపించబోమని అటార్నీ జనరల్ తారెక్ విలియమ్ సాబ్ హెచ్చరించారు. కాగా, ఈ దాడికి తమదే బాధ్యతని వెనిజువెలా మిలటరీ రెబల్ గ్రూప్ ‘నేషనల్ మూమెంట్ ఆఫ్ సోల్జర్స్ ఇన్ టీషర్ట్స్’ (ఎన్ఎంఎస్టీ) ప్రకటించుకుంది. పేలింది డ్రోనా? సిలిండరా? వెనిజువెలా అధికార చానెల్లో చూపించిన దృశ్యాల్లో.. సైనికుల మధ్యలో మడురో నిలబడి ప్రసంగిస్తుండగా ఓ భారీ శబ్దం వినిపించింది. దీంతో పరేడ్లో ఉన్న జాతీయ గార్డులు దూరంగా జరిగిపోయారు. పేలుడు జరగగానే గార్డులు అధ్యక్షుడికి రక్షణ కల్పిస్తూ ఆయన చుట్టూ వలయంలా మారిన దృశ్యాలు కూడా కనిపించాయి. ఆ వెంటనే లైవ్ కట్ అయింది. అధ్యక్షుడు ప్రసంగిస్తున్న వేదికకు సమీపంలో ఈ డ్రోన్ పేలిందని వెనిజువెలా సమాచార మంత్రి జార్జ్ రోడ్రిగ్జ్ తెలిపారు. సంప్రదాయవాదులే (విపక్షం) ఈ పనిచేసి ఉండొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కరాకస్ మిలటరీ క్షేత్రానికి సమీపంలోని భవనం వద్దనుంచే ఈ డ్రోన్ను ఆపరేట్ చేసినట్లు స్థానిక పోలీసులు భావిస్తున్నారు. అయితే.. సమీపంలోని భవనంలో గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే భారీగా శబ్దం వచ్చిందని, హత్యాయత్నం జరగలేదని పలు అంతర్జాతీయ వార్తాసంస్థలు పేర్కొన్నా యి. మడురో మిత్రులైన క్యూబా, బొలీవియా దేశాలు ఈ హత్యాయత్నాన్ని ఖండించాయి. మాకేం సంబంధం లేదు: అమెరికా వెనిజువెలా ఘటనను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ దాడి వెనక తమ ప్రమేయం లేదని స్పష్టం చేసింది. ‘అమెరికా ప్రమేయం లేదు. ఆ దేశంలో జరిగే మార్పులతో మాకు సంబంధం లేదు’ అని అమెరికా భద్రతా సలహాదారు. జాన్ బోల్టన్ తెలిపారు. కొలంబియా ప్రభుత్వం కూడా మడురో ఆరోపణలను ఖండించింది. ‘మడురో ఆరోపణలు అర్థరహితం. ఎలాంటి ఆధారాల్లేకుండా మాట్లాడొద్దు’ అని హెచ్చరించింది. బాధ్యత మాదే! ఈ దాడికి తామే బాధ్యులమని మిలటరీ రెబల్ గ్రూప్ ‘నేషనల్ మూమెంట్ ఆఫ్ సోల్జర్స్ ఇన్ టీషర్ట్స్’ (ఎన్ఎంఎస్టీ) ప్రకటించుకుంది. ‘రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన వారు, అధికారాన్ని స్వార్థప్రయోజనాలకు వాడుకునే వారికి మిలటరీ ఇస్తున్న అసలు సిసలు గౌరవం’ అని ఓ ప్రకటనలో తెలిపింది. ‘దేశ ప్రజలు సంతోషంగా ఉండేలా చూడటం ప్రభుత్వం బాధ్యత. కానీ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా పట్టించుకోలేని ప్రభుత్వాన్ని మేం సహించబోం. కరెన్సీకి విలువ లేదు. వ్యాధులకు మందుల్లేవు. విద్యావ్యవస్థ దారుణంగా ఉంది. కమ్యూనిజాన్ని మాత్రమే ప్రభుత్వం బోధిస్తోంది’ అని ఎన్ఎంఎస్టీ పేర్కొంది. దేశంలో రాజ్యాంగ సంక్షోభం భారీ చమురు నిక్షేపాలున్నప్పటికీ.. వెనిజువెలా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. దేశంలో కొంతకాలంగా రాజ్యాంగ సంక్షోభం నెలకొంది. మడురో సన్నిహితులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అంతర్జాతీయంగా ఏకాకి అయింది. ద్రవ్యోల్బణం తీవ్ర స్థితికి చేరుకుంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్న సంప్రదాయవాదులను (విపక్షాలు) మడురో జైల్లో పెట్టిస్తున్నారు. వీరికి అమెరికా సాయం చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరగగా.. మడురో ఏకపక్ష నిర్ణయాలతో విపక్షం ఎన్నికలను బహిష్కరించింది. దీంతో మరో ఆరేళ్లపాటు ఈయనే అధికారంలో ఉండనున్నారు. డ్రైవర్ నుంచి అధ్యక్షుడి దాకా.. 1962లో పుట్టిన నికోలస్ మడురో తండ్రి వెనిజువెలాలో ప్రముఖ కార్మిక నేత. చిన్నప్పటినుంచే కమ్యూనిజం, కార్మిక చట్టాలను మడురో ఒంటబట్టించుకున్నారు. విద్యార్థి సంఘం నేతగా ఎదిగిన మడురో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తిచేయలేదు. అనంతరం కరాకస్ మెట్రో కంపెనీలో బస్ డ్రైవర్గా కూడా పనిచేశారు. 1993లో అప్పటి వెనిజువెలా అధ్యక్షుడు హ్యుగో చావెజ్ను కలుసుకున్న మడురో.. ఆ తర్వాత బొలివియన్ ఉద్యమంతో కీలకనేతగా ఎదిగారు. ఈ ఉద్యమం ద్వారానే 1998లో చావెజ్ అధ్యక్ష పీఠాన్ని మళ్లీ అధిరోహించారు. అప్పుడే మడురో ఎంపీగా గెలిచారు. 1999లో నేషనల్ అసెంబ్లీలో డిప్యూటీ నేతగా ఎంపికయ్యారు. చావెజ్ 2006లో మడురోను విదేశాంగ మంత్రిగా నియమించారు. 2013లో చావెజ్ మరణంతో ఆపద్ధర్మ నేతగా, ఆతర్వాత జరిగిన ఎన్నికల్లో చాలా తక్కువ మెజారిటీతో నెగ్గి అధ్యక్షుడయ్యారు. -
వెనెజులా అధ్యక్షుడిపై హత్యాయత్నం
కరాకస్, వెనెజులా : వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై డ్రోన్లతో దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి హాని కలుగలేదు. దేశ రాజధాని కరాకస్లో వేల మంది సైనికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తుండగా ఆయుధ సామర్ధ్యం కలిగిన డ్రోన్లు పేల్చివేశారు. ఈ మేరకు వెనెజులా ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. నేషనల్ గార్డ్స్ 81వ వార్షికోత్సవం సందర్భంగా సైనికులను ఉద్దేశించి మదురో ప్రసంగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. విచారణలో డ్రోన్ల ద్వారా బాంబు పేల్చినట్లు తేలింది. పేలుడు తర్వాత హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైరింజన్లు మంటలను ఆర్పివేశాయి. అయితే, ఇది నిజంగా డ్రోన్ దాడి కాదని, దగ్గరలోని అపార్ట్మెంటులో గ్యాస్ ట్యాంక్ పేలి ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. -
10 లక్షల శాతం పెరిగిన ఆ దేశ ద్రవ్యోల్బణం
లాటిన్ అమెరికా దేశం వెనిజులా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అక్కడ ఆకలి కేకలు ప్రపంచమంతా మారు మోగిపోతున్నాయి. పెట్రోల్ ఉత్పత్తులు ధరలు క్రాష్ కావడంతో మొదలైన సంక్షోభం, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చాక మరింత ఎక్కువైంది. సామాన్యుడికి అందుబాటులో లేని ధరలతో... జనాలకు సరిగా తిండి లేకుండా పోయింది. ఒక్క బ్రెడ్ కోసం గంటల తరబడి క్యూలైన్లు కడుతున్నారు. ప్రస్తుతం వెనిజులా ఇంతటి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆ దేశ ద్రవ్యోల్బణ రేటు కూడా పది శాతం, వంద శాతం, రెండొందల శాతం కాకుండా... ఏకంగా 10 లక్షల శాతం మేర పెరిగిపోతుందట. 2018లో వెనిజులా ద్రవ్యోల్బణం 10 లక్షల శాతాన్ని తాకే అవకాశముందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వెల్లడించింది. ఈ అధునాతన చరిత్రలో అత్యంత హీనాతిహీనమైన ద్రవ్యోల్బణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశం వెనిజులానే అని తన అధికారిక ప్రకటనలో తెలిపింది. 2014లో ఆయిల్ ధరలు క్రాష్ అవడంతో మొదలైన పతనం, అలా కొనసాగుతూనే ఉందని, వెనిజులానే కుప్పకూలేలా చేసిందని పేర్కొంది. ధరల పెంపుదలను, సౌమ్యవాద వ్యవస్థనువెనిజులా నియంత్రించలేకపోతుందని చెప్పింది. ‘1923లో జర్మనీ, 2000లో జింబాబ్వే ఎదుర్కొన్న మాదిరిగా వెనిజులా ప్రస్తుత పరిస్థితి ఉంది. దీని ద్రవ్యోల్బణం 2018 చివరి నాటికి 10 లక్షల మేర పెరిగే అవకాశముందని అంచనావేస్తున్నాం‘ అని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పశ్చిమ అర్థగోళ విభాగపు డైరెక్టర్ అలెజాండ్రో వెర్నర్ ఏజెన్సీ బ్లాగ్ పోస్టులో పేర్కొన్నారు. అయితే ఐఎంఎఫ్ అంచనాలపై వెనిజులా సమాచార మంత్రిత్వ శాఖ ఇంకా స్పందించలేదు. ఈ ఏడాది వినియోగదారుల ధరలు 46,305 శాతం పెరిగాయి. వాషింగ్టన్ మద్దతుతో వ్యతిరేక వ్యాపారులు నిర్వహించే ఆర్థిక యుద్ధానికి వెనిజులా బలైపోయిందని ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో చెప్పారు. అయితే దీనికంతటికీ కారణం, అధికార నాయకులు తీసుకునే చెత్త పాలసీ నిర్ణయాలేనని ప్రత్యర్థులూ విమర్శిస్తున్నారు. నగదు సరఫరా విస్తరణను పరిశీలించకపోవడం, కరెన్సీని నియంత్రించలేకపోవడం, ముడి పదార్థాలను, మెషిన్ పార్ట్లను దిగుమతి చేసుకోలేకపోవడమే దీనికి కారణమని కూడా పేర్కొంటున్నారు. -
వెనిజువెలా ఎన్నికల్లో మదురో ఘనవిజయం
కారకస్: వెనిజువెలాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో సోషలిస్ట్ నేత నికోలస్ మదురో(55) ఘనవిజయం సాధించారు. జాతీయ ఎన్నికల కౌన్సిల్ ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనిజువెలాకు చెందిన మదురో 68 శాతం ఓట్లను దక్కించుకున్నారు. దాదాపు 46.1 శాతం పోలింగ్ నమోదైన ఈ ఎన్నికల్లో మదురోకు 58 లక్షల ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి హెన్రీ ఫాల్కన్కు 18 లక్షల ఓట్లు పోలయ్యాయి. తాజా విజయంతో మరో ఆరేళ్లపాటు మదురో వెనిజువెలాకు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఫలితాల ప్రకటన అనంతరం అధ్యక్ష భవనం వద్ద గుమిగూడిన మద్దతుదారుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ఇది చరిత్రాత్మక విజయం. ఈ ఎన్నికల్లో వెనిజువెలా గెలిచింది. శాంతి గెలిచింది. ప్రజాస్వామ్యం గెలిచింది. వెనిజువెలాలో అతిపెద్ద, శక్తిమంతమైన రాజకీయ శక్తిగా మనం చాలాకాలం ఉంటాం. వాళ్లు నన్ను చాలా తక్కువగా అంచనా వేశారు. నేను నియంతనని ప్రతిపక్షాల చేసే విమర్శలు నన్ను బాధపెట్టవు. వెనిజువెలా ఆర్థికవ్యవస్థను అమెరికా, కొలంబియా దేశాల మద్దతు ఉన్న మాఫియాలు తీవ్రంగా దెబ్బతీశాయి. రాబోయే రెండేళ్లలో ఆర్థికవ్యవస్థను మెరుగుపర్చడంపై దృష్టిసారిస్తాం’ అని పేర్కొన్నారు. వెనిజువెలాతో అనుసరిస్తున్న యుద్ధవైఖరిని అమెరికా పునఃసమీక్షించాలని మదురో విజ్ఞప్తి చేశారు. 2013, మార్చి 5న అప్పటి దేశాధ్యక్షుడు హ్యుగో చావెజ్ మరణంతో మదురో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. కాగా, ఈ ఎన్నికల్ని బహిష్కరించిన ప్రతిపక్షాలు మరోసారి పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. మదురో ప్రభుత్వం ఎన్నికలకు ముందు, పోలింగ్ సందర్భంగా తీవ్రమైన అవకతవకలకు, ఉల్లంఘనలకు పాల్పడిందని రెండో స్థానంలో నిలిచిన హెన్రీ ఫాల్కన్ ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్కేంద్రాల సమీపంలో ‘రెడ్ టెంట్ల’ను ఏర్పాటుచేశారనీ, సంక్షేమ పథకాలకు అవసరమైన ‘ఫాదర్ల్యాండ్ కార్డు’లను మదురో మద్దతుదారులు అక్కడ స్కాన్ చేశారని వెల్లడించారు. కాగా, మదురో విజయంపై మయామీ, మ్యాడ్రిడ్లో వలసదారులు నిరసన తెలిపారు. వెనిజువెలాలో ఎన్నికలు జరిగిన తీరు సిగ్గుచేటనీ, ఈ ప్రభుత్వాన్ని తాము గుర్తించబోమని అమెరికా, యూరోపియన్ యూనియన్(ఈయూ)తో పాటు 17 పొరుగుదేశాలు తేల్చిచెప్పాయి. తాజాగా మదురో విజయం నేపథ్యంలో వెనిజువెలా జీడీపీలో 25 శాతం ఆదాయాన్ని సమకూరుస్తున్న చమురురంగంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరిన్ని ఆంక్షలు విధించే ప్రమాదముందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
వెనిజులా ప్రధానిగా నికోలస్ మడురో
కారకస్ : నికోలస్ మడురో రెండవ సారి కూడా వెనిజులా ప్రధానిగా ఎన్నికయ్యారు. మరో ఆరు సంవత్సరాల పాటు ఆయన వెనిజులా ప్రధానిగా కొనసాగనున్నారు. మొత్తం 90 శాతం ఓట్లు పోల్ కాగా ఇందులో మడురోకు 68 శాతం, ఆయన ప్రత్యర్థి హెన్రీ ఫాల్కన్కు 21శాతం ఓట్లు లభించాయి. ఆదివారం ఎన్నికల అధికారులు మడురోను విజేతగా ప్రకటించారు. కాగా మడురో ఎన్నికలలో రిగ్గింగ్కు పాల్పడి నెగ్గినట్లు ఫాల్కన్ ఆరోపిస్తున్నారు. 2018 డిసెంబర్ నెలలో జరగాల్సిన ఎన్నికలను మడురోకు అనుకూలంగా ఉండేలా కొద్ది నెలల ముందుగానే నిర్వహించారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఈ ఎన్నికలు చెల్లవని, వచ్చే ఏడాది కొత్తగా ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేస్తోంది. దేశంలో వచ్చిన ఆర్థిక సంక్షోభం కారణంగా కేవలం 46శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినిమోగించుకున్నారని ప్రతిపక్షం తెలిపింది. -
వెనెజులా జైలులో 68 మంది దుర్మరణం
కారకస్: వెనెజులాలోని కారాబొబొ రాష్ట్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయం జైలు నుంచి బుధవారం ఖైదీలు తప్పించుకోవడానికి యత్నించిన ఘటనలో మంటలు చెలరేగి 68 మంది దుర్మరణం చెందారు. జైలు నుంచి తప్పించుకోవడంలో భాగంగా ఖైదీలు పరుపులకు మంట పెట్టారనీ, భద్రతా సిబ్బంది నుంచి తుపాకీ లాక్కున్నారని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. మృతుల్లో 66 మంది ఖైదీలు కాగా, ఇద్దరు మహిళా సందర్శకులు ఉన్నారని వెల్లడించారు. వీరిలో కొందరు మంటల్లో చిక్కుకుని దుర్మరణం చెందగా, మరికొందరు ఊపిరాడక చనిపోయారని పేర్కొన్నారు. -
లైంగిక ఆరోపణలు.. అందాల పోటీలకు బ్రేక్
కారకాస్ : లైంగిక ఆరోపణల నేపథ్యంలో వెనెజులా అందాల పోటీలకు బ్రేక్ పడింది. వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులకు పడక సుఖానికి అందించి కొందరు పోటీదారులు పెద్ద ఎత్తున్న డబ్బు తీసుకున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పోటీలను నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వెనిజులాలో గత 40 ఏళ్లుగా అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ దఫా పోటీల్లో న్యాయనిర్ణేతలు, నిర్వాహకులు తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ పోటీదారులు ఆరోపణలకు దిగారు. వెంటనే తెరపైకి వచ్చిన మాజీ పోటీదారులు... గతంలోనూ ఇలాంటి వ్యవహారాలు జరిగాయని ఆరోపించారు. నిర్వాహకులతోపాటు బడా వేత్తలకు లైంగిక సుఖాన్ని అందించారని, తద్వారా డబ్బుతోపాటు కొందరు కిరీటాన్ని కూడా కైవసం చేసుకున్నారంటూ బాంబు పేల్చారు. ఈ ఆరోపణలు కాస్త తారా స్థాయికి చేరటంతో ఆన్లైన్లో పెద్ద ఉద్యమమే నడిచింది. దిగొచ్చిన నిర్వాహకులు కారాకస్లోని వేదికను మూసేస్తూ ఆడిషన్స్ను తాత్కాలికంగా నిలిపేసినట్లు ప్రకటించారు. ఈ ఆరోపణలపై అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, వెనెజులా ఇప్పటిదాకా ఏడు మిస్ యూనివర్స్, ఆరు మిస్ వరల్డ్ టైటిళ్లు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. -
వెనిజులా ఎందుకిలా ?
-
ఆకలి, ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరత
కారాకాస్, వెనెజులా : ఆ బ్రిడ్జి దాటితే చాలు.. గుక్కెడు నీళ్లు తాగొచ్చు. ఆ బ్రిడ్జి దాటితే చాలు ఒక్క ముద్ద యంగిలి పడొచ్చు. ఇది సగటు వెనెజులా వాసి ఆలోచన. కొలంబియా దేశానికి వలస పోవడమే లక్ష్యంగా వేలాది మంది వెనెజులియన్లు కదులుతున్నారు. రోజు రోజుకూ తీవ్రమవుతోన్న ఆర్థిక సంక్షోభం, పరుగెడుతున్న ద్రవ్యోల్బణం, ఆకలి, రాజకీయ అస్థిరత వెనెజులా ప్రజల పాలిట శాపంగా మారింది. రాయిటర్స్ ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో వెనెజులా రాజధాని కరాకస్లో 162 దోపిడీలు జరిగాయి. వీటిలో 42 ట్రక్కుల దోపిడీలు ఉన్నాయి. ఈ దోపడిల్లో ఎనిమిది హత్యలు జరిగాయి. అత్యధిక హత్యలు జరుగుతున్న దేశాల్లో వెనెజులా కూడా ఒకటి. ట్రక్కులపై దాడులు పెరుగుతుండటంతో రవాణా ఖరీదు కూడా బాగా పెరిగింది. ఆకలిని తట్టుకోలేక.. ప్రజలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. రవాణా మార్గం ద్వారా తరలిస్తున్న ఆహార పదార్థాలను దోచుకునే గ్రూపులు సైతం ఏర్పడ్డాయి. రవాణా చేస్తున్న వాహనంలో ఉన్న వారిని హత్య చేసి పదార్థాలను దుండగులు దోచుకెళ్తున్నారు. ఇలాంటి సంఘటనలు విపరీతంగా పెరగడంతో వాటికి ‘మ్యాడ్ మ్యాక్స్ వైలెన్స్’ అని పేరు పెట్టారు. వెనెజులా-కొలంబియాల మధ్య కీలక మార్గంగా ఉన్న సిమోన్ బొలివర్ ఇంటర్నేషనల్ బ్రిడ్జి గుండా కొలంబియాలోకి ప్రవేశించేందుకు వెనెజులియన్లు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆత్మరక్షణలో పడిన కొలంబియా సరిహద్దు ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించింది. దేశంలోకి ప్రవేశించడానికి యత్నించేవారిని అడ్డుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కొలంబియాను ఆనుకుని ఉన్న బ్రెజిల్ సైతం సరిహద్దులో భద్రతను పెంచింది. అక్రమ వలసదారులను అడ్డుకునేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు చెప్పింది. -
వెనిజులా పార్లమెంట్లో హింస
కారకస్: వెనిజులాలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశం హింసాత్మకంగా మారింది. గురువారం ప్రభుత్వ మద్దతుదారులు దుడ్డు కర్రలు, పైపులతో నేషనల్ అసెంబ్లీలోకి చొరబడి ప్రతిపక్ష సభ్యులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. ఆ తరువాత అధ్యక్షుడు మదురో మద్దతుదారులు పార్లమెంట్ను 9 గంటలపాటు ముట్టడించడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తొలుత జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన పోలీసులు తర్వాత∙సైన్యంసాయంతో ఎంపీలను విడిపిం చారు. ఉదయం సుమారు 100 మంది దుడ్డు కర్రలు, పైపులతో తొలుత పార్లమెంట్ ముందు గేటు, ఆ తరువాత ఇంటీరియర్ గార్డెన్, భవనం గేట్లను బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు. కారిడార్లోకి చొచ్చుకెళ్లి చట్ట సభ్యులపై దాడి చేశారు. స్టన్ గ్రెనేడ్లను పేల్చారు. అక్కడి నుంచి వెళ్లి పోవాలని పాత్రికేయులను బెదిరించారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో ఐదుగురు ఆసుపత్రిలో చేరారని ప్రతిపక్ష పార్టీ వెల్లడించింది. ప్రభుత్వ మద్దతుదారులు..ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఉగ్రవాదులు, హంతకులు అని అరుస్తూ పార్లమెంట్ను చుట్టుముట్టారు. పోలీసులు ఎట్టకేలకు ప్రతిపక్ష సభ్యులను బయటికి తీసుకురాగలిగారు. -
అక్కడ లిప్స్టిక్ ధర రూ.72 వేలు
న్యూఢిల్లీ: భారతీయ మహిళలు ఎరుపెక్కిన పెదాలు, గులాబీ బుగ్గలు, తీరైన నల్లటి కనుబొమలు, కొసదేరిని ముక్కు, అందమైన కురులతో అందంగా కనిపించడం కోసం తహతహలాడుతుండడంతో దేశంలో బ్యూటీ బిజినెస్ వేగంగా విస్తరిస్తోంది. అయినప్పటికీ ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా బ్యూటీ బిజినెస్ ఎక్కువగా ఉన్న 50 దేశాల్లోకెల్లా భారత్లోనే లిప్స్టిక్ ధరలు చాలా తక్కువగా ఉండడం విశేషం. భారత్లో ఓ లిప్స్టిక్ ధర సరాసరి 926 రూపాయలు ఉండగా, ప్రపంచంలో అత్యంత ఎక్కువగా వెనిజులా దేశంలో ఉండడం ఆశ్చర్యం. ఆ దేశంలో సరాసరి లిప్స్టిక్ ధర 71,627 రూపాయలు పలుకుతుంది. అక్కడి ద్రవ్య సంక్షోభమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. వెనిజులా తర్వాత పెరూలో లిప్స్టిక్ ధర 3,792 రూపాయలు పలుకుతోంది. భారత్లో కాస్మోటెక్ సర్జరీలు కూడా చవగ్గా అందుబాటులో ఉన్నాయని మెక్సికో ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థ 'లినియో' బ్యూటీ ప్రైస్ ఇండెక్స్ను విడుదల చేసింది. బ్రెస్ట్ పెంచుకునేందుకు చేసుకునే కాస్మోటిక్ సర్జరీలకు స్విడ్జర్లాండ్ దేశాల్లో ఆరేడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుండగా, భారత్లో కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఖర్చవుతుందట. అయితే భారత దేశంలో ముక్కు కాస్మోటిక్ సర్జరీకి ఎక్కువ ఖర్చు అవుతుందట. సరాసరి 83,922 రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపింది. బ్యూటీ బ్రాండ్లు, సర్వీసులు, కాస్మోటెక్ ప్రొసీజర్లను పరిగణనలోకి తీసుకొని లినియో కంపెనీ బ్యూటీ ధరల సూచికను తయారు చేసింది. సోషల్ మీడియా, బ్లాగుల కారణంగా భారత్లోని పట్టణ ప్రాంతాల్లో బ్యూటీ బిజినెస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ మార్కెట్ ఒక్క 2016లోనే 16 శాతం వద్ధి చెందింది. ఒక్క లిప్స్టిక్ రంగంలోనే 3,338 కోట్ల రూపాయల వ్యాపారం నడుస్తోంది. లాక్మీ, నైకా లాంటి స్థానిక బ్రాండ్లను ఆదరిస్తున్న మహిళలు, స్మాష్బాక్స్, సెఫోరా లాంటి విదేశీ బ్రాండ్లను సైతం ఆదరిస్తున్నారు. కనుబొమలపై అవాంఛిత రోమాలను తొలగించడంతోపాటు జుట్టును అందంగా తీర్చిదిద్దినట్లు కత్తిరించడం లాంటి బ్యూటీ సర్వీసులకు కూడా భారత్లో అందుబాటు ధరల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా మగవాళ్లకు రోడ్డుపక్కనుండే సాలూన్ షాపులు తక్కువ ధరలకే సేవలిందిస్తున్నాయి. భారతీయ మహిళలు అందమైన కనుబొమల కోసం సరాసరి 150 రూపాయలు ఖర్చు పెడుతుండగా, అదే అమెరికా మహిళలు దాదాపు 700 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. భారత్లో హేర్ కటింగ్ కోసం పురుషులు సరాసరి 175 రూపాయలు ఖర్చు పెడుతుండగా, అమెరికాలో పురుషులు దాదాపు 910 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. -
ద.అమెరికా లో హింస, 78 మంది మృతి
కారకాస్(వెనిజువెలా): దక్షిణ అమెరికా, వెనిజువెలాలో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల సందర్భంగా చెలరేగిన హింసాకాండలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా జరిగిన గొడవల్లో మొత్తం మృతుల సంఖ్య 78కి చేరుకుందని అధికార యంత్రాంగం తెలిపింది. అధ్యక్షుడు నికొలస్ మడురో ప్రభుత్వం ప్రభుత్వంపై విసుగెత్తిన ప్రజలు, ప్రతిపక్షాలు ఆయన గద్దెదిగాలని కోరుతూ గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మూడు నెలలు కొనసాగుతున్న అశాంతితో సంబంధం ఉందనే అనుమానంతో పోలీసులు ఇప్పటి వరకు 1500 మందిని పౌరులను అదుపులోకి తీసుకున్నారు. అధికారంలో మరింత కాలం కొనసాగేందుకు అధ్యక్షుడు మడురో అక్రమాలకు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. -
వెనిజులాలో నోట్లురద్దు: ఉద్రిక్త వాతావరణం
-
రెండు దేశాలు, ఒక ప్రయోగం
రెండో మాట వెనిజులా అంతటా వాడుకలో ఉన్న పెద్ద కరెన్సీ నోట్లు రద్దు కావడంతో ప్రజలు అశాంతితో దాడులకు, దోపిడీలకూ నడుం కట్టవలసి వచ్చినట్టే భారతదేశంలోనూ పేదలు, ఉద్యోగులు, ముసలీ ముతకా గంటల తరబడి, రోజులకొద్దీ నగదు కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు పడి, సహనం కోల్పోయి పలుచోట్ల అశాంతితో దాడులు చేయడం, బ్యాంకర్లను వేధిం చడం, కొట్టడం జరుగుతోంది. అశాంతి మధ్య వెనిజులాలో నలుగురు చనిపోగా.. మన దేశంలో అలా చనిపోయిన వారి సంఖ్య 110 దాకా ఉన్నట్లు సమాచారం. ‘గ్రామీణ భారతదేశం నూటికి నూరుపాళ్లు నగదు లావాదేవీల మీదే ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ. అలాంటి వ్యవస్థను డిజిటల్ (ఎలక్ట్రానిక్) లావా దేవీల మీద ఆధారపడే ఆర్థిక వ్యవస్థగా మార్చేముందు గ్రామీణ నిరక్షరాస్యత లాంటి సమస్యలను ప్రభుత్వం పరిగణనలోనికి తీసుకుని ఉండాల్సింది. అనా లోచితంగా పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయడం వల్ల కోట్లాదిమంది ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ చర్య వల్ల ఏ అవినీతిపరులని, నల్లధనం కూడబెట్టిన వారిని ప్రభుత్వం దెబ్బతీయాలనుకున్నదో అలాంటివారు తప్పిం చుకున్నారు. ఇంతకూ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడానికి ముందే దీనిని బయటకు వెల్లడించిన వారెవరో తెలియాలి.’ – జస్టిస్ బీపీ జీవన్రెడ్డి (సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి. 18–12–16న జరిగిన అఖిల భారత బ్యాంకింగ్ అసోసియేషన్ సమావేశంలో) పాలకులు, పాలనా వ్యవస్థలు; వారి జెండాలు, ఎజెండాల సంగతి ఎలా ఉన్నా, అనుభవం కలిగిన ఒక న్యాయ నిపుణునిగా జస్టిస్ జీవన్రెడ్డి భారత ప్రజాబాహుళ్యం నాడిని పట్టుకుని స్పందించిన తీరు విశిష్టంగా ఉంది. దీనిని చూస్తుంటే ప్రపంచ దేశాల మీద అమెరికా పెత్తనానికి బీజం ఎక్కడ ఉందో అమెరికా విదేశాంగ మంత్రి హోదాలో జాన్ ఫాస్టర్ డల్లెస్ ఒకనాడు వెల్లడిం చిన తీరు గుర్తుకు వస్తున్నది. ‘ఒక దేశాన్ని జయించడానికి రెండే మార్గాలు: 1. సాయుధ శక్తి ద్వారా ఆ దేశ ప్రజలను లొంగదీసుకోవడం. 2. ఆ దేశాన్నీ, ప్రజలనీ ఆర్థికంగా తన నియంత్రణలోకి తెచ్చుకోవడం’ అన్నారు డల్లెస్. మెక్సికో మాజీ అధ్యక్షుడు పోర్టిటిల్లో తన దేశ స్వీయానుభవాన్ని రంగరించి ఇదే అంశాన్ని విశ్లేషించారు. ఈ పరిస్థితులకు ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఎంతవరకు కారణమో ఆగ్రహంతో వివరిం చారు. ‘ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ సంస్థలు ప్లేగు వ్యాధిని వ్యాపింపచేసే ఎలుకలు’ అని పోర్టిటిల్లో వ్యాఖ్యానించారు. ఈ ఎలుకలను పెంచి పోషి స్తున్న అమెరికన్ సామ్రాజ్యవాదమే ఆర్థిక, సైనిక అవసరాల కోసం తనపైన ఆధారపడిన దేశాల కరెన్సీలనూ, వాటి విలువలనూ శాసిస్తున్నది. భారత్–వెనిజులా అనుభవాలు 1991లో కాంగ్రెస్, తరువాత బీజేపీ–పరివార్–ఎన్డీఏ ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంక్ ప్రజా వ్యతిరేక సంస్కరణలను బేషరతుగా అంగీకరించి, ఏనాడైతే అమలులోకి తెచ్చాయో, ఆనాటి నుంచే భారతీయ కరెన్సీ విలువ, దాని నిలకడ మన పాలకుల చేతి నుంచి జారిపోయాయి. 1967–68 సంవ త్సరంలో ఇందిరాగాంధీ హయాంలో డాలర్కు రూపాయి విలువలో తొలి పతనం ప్రారంభమైంది. తరువాత నేటికి రూపాయి విలువ కేవలం 20 పైసలకు దిగజారింది. డాలర్ ఒక్కంటికి రూ.6 చెల్లించిన దశ నుంచి నేడు రూ. 70లు ధారపోయవలసిన స్థితికి చేరుకున్నాం. ఇలాంటి దుర్దశలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం అకస్మాత్తుగా పెద్ద నోట్ల రద్దును ప్రకటించడం వెనుక అంతర్జాతీయ కుట్ర ఉందని భావించడం వాస్తవదూరం కాదు. ఎక్కువ వినియోగంలో ఉన్న రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేయడా నికి ప్రధాన కారణం డిజిటల్ లావాదేవీలకు అలవాటు పడిన గుత్త కంపె నీలు, కొన్ని ప్రభుత్వాలు నగదు రహిత వ్యవస్థ కోసం ఒత్తిడి చే యడమే. భారత్ నోట్ల రద్దు తరువాత వెనిజులా కూడా అందుకు సాహసించింది. అమెరికా ఒత్తిడికి లొంగిన ఈ లాటిన్ అమెరికా దేశం తమ ఆర్థిక వ్యవస్థలో పెద్ద నోటు బిల్ను రద్దు చేసుకుంది (అమెరికా డాలర్ ప్రకారం 100 బిల్ నోటు విలువ 15 సెంట్లు. అంటే ఒక డాలర్=వెనిజులన్ 100 బిల్లు). ఇటీవలి కాలం వరకు వెనిజులాలో చలామణిలో ఉన్న కరెన్సీలో 77 శాతం బిల్ రూపంలోనే ఉంది. అక్కడ చావెజ్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు అమెరికన్ చమురు సంస్థలను ఆయన జాతీయం చేయడంతో అగ్రదేశం కన్నెర్ర చేసింది. అయితే ఆయన మీద కక్ష సాధించడానికి అమెరికా చేసిన యత్నం ఫలించ లేదు. చావెజ్ తరువాత అధికారంలోకి వచ్చిన మదురో (ఆయన అనుచ రుడే) అడ్డు తొలగించుకునేందుకు, దేశంలో అస్థిర పరిస్థితులు సృష్టించేం దుకు అమెరికా కుట్ర పన్నింది. అక్కడి మాఫియాల ద్వారానే మరో పెద్ద నోటు 100 బోలివార్ కరెన్సీని నిల్వ చేయించి బిల్ విలువకు ఎసరు పెట్టింది. మదురో పైఎత్తు వేసి, మాఫియాలకు మద్దుతుగా నిలిచిన కొలంబియా, బ్రెజిల్ దేశాల సరిహద్దులను మూసేశారు. 100 బోలీవార్ నోటును రద్దు చేశారు. చలామణిలో ఉన్న పెద్ద నోటు రద్దు కావడంతో వెనుజులా ప్రజలు నిత్యావసరాలకు అల్లల్లాడిపోయారు. పెద్దపెట్టున ఆందోళన, నిరసన ప్రదర్శ నలకు దిగవలసి వచ్చింది. వెనిజులా అంతటా వాడుకలో ఉన్న పెద్ద కరెన్సీ నోట్లు రద్దు కావడంతో ప్రజలు అశాంతితో దాడులకు, దోపిడీలకూ నడుం కట్టవలసి వచ్చినట్టే భారతదేశంలోనూ పేదలు, ఉద్యోగులు, ముసలీ ముతకా గంటల తరబడి, రోజులకొద్దీ నగదు కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు పడి, సహనం కోల్పోయి పలుచోట్ల అశాంతితో దాడులు చేయడం, బ్యాంకర్లను వేధించడం, కొట్టడం జరుగుతోంది. అశాంతి మధ్య వెనిజులాలో మూడు రోజుల్లో నలు గురు చనిపోగా మన దేశంలో గంటలకొద్దీ క్యూలలో నిలబడి వేసారి అలసి పోయి సొమ్మసిల్లి చనిపోయిన వారి సంఖ్య సుమారు 110 మంది దాకా ఉందని సమాచారం. అయితే–వెనిజులాలో ప్రెసిడెంట్ మదురో సకాలంలోనే (మూడు రోజుల్లోనే) ప్రజా బాహుళ్యం నాడిని, అశాంతిని గమనించి రద్దును నిలిపి వేయవలసి వచ్చింది. ఆ పాఠం పనికిరాదా? నోట్లరద్దు అనంతరం వెనిజులాలో కనిపించిన దృశ్యాలు ఇక్కడా కనిపించినా ఈ పాఠాన్ని మొండితనంవల్ల మోదీ ఆమోదించ నిరాకరిస్తున్నారు. ఆయన నిర్ణయాన్ని అనేకమంది ప్రపంచవ్యాప్త (అమెరికన్లు సహా) ఆర్థిక వేత్తలు విమర్శిస్తున్నా, మూడే.. ఫిజ్, స్టాండర్డ్ అండ్ పూర్, మెరిలించ్ వంటి రేటింగ్ ఏజెన్సీలూ, విదేశీ పెట్టుబడి సంస్థలూ, మల్టీ నేషనల్ కంపెనీలూ మాత్రమే స్వాగతించాయి. డిజిటల్ (ఎలక్ట్రానిక్)తంత్రం ద్వారా జరిపే ధన లావాదే వీలు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని మోసాలకు నిలయమైనాయో ఉదా హరణలు అనేకం. అందుకే భారత గ్రామీణ వ్యవస్థకు ఆయువుపట్టుగా ఉన్న నగదు లావాదేవీల వ్యవస్థను ఒక్కసారిగా కూల్చి నిరక్షరాస్యులకు అంతు చిక్కని డిజిటల్ లావాదేవీల వ్యవస్థకు మరలడం వల్ల మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలకే ఎంత ప్రమాదమో–గత మూడేళ్లుగా మన దేశం సహా పలు ప్రపంచ దేశాలపై జరిగిన సైబర్ గ్యాంగ్ ముఠాల దాడులే నిదర్శనం. సైబర్ ఎటాక్స్ అంటే కన్పించని అజ్ఞాతశత్రువు జరిపే యుద్ధం లాంటిదిది. ఈ– మెయిల్స్, ఇతర డిజిటల్ సమాచార డేటాలు, యాహూ, జీ–మెయిల్, డాట్ కామ్ వ్యవస్థలన్నీ సైబర్ దాడులకు గురవుతూనే ఉన్నాయి. ఇటీవలనే ఈ డిజిటల్ టెక్నాలజీవల్ల సైబర్ నేరాలు (నేరస్థుడు కనబడడు–చిక్కడు– దొరకడు) మరింతగా పెరగనున్నాయని పోలీసు వర్గాలే వెల్లడించక తప్పడం లేదు! ప్రపంచ ఘరానా బ్యాంకులలో ఒకటి జేపీ మోర్గాన్ సంస్థ ద్వీపాంతర బ్రాంచీలలో ఒకటి హైదరాబాద్లో ఉంది. ఈ ఘరానా బ్యాంకులో కొన్ని కోట్ల మంది ఖాతాదారుల ‘సెన్సిటివ్’ (అతికీలకమైన) సమాచారం కనుమ రుగైపోయింది. కానీ ఆ బ్యాంకు ఈ రహస్యాన్ని బయటకు పొక్క నివ్వకుండా తొక్కిపట్టేసింది. చివరికి ఈ సైబర్ దాడుల నుంచి అమెరికా రక్షణశాఖ వెబ్ సైట్, ‘నాసా’ వెబ్సైట్ని కూడా అజ్ఞాత నేరస్తులు మినహాయించలేదని గుర్తించాలి. అంటే దొంగ ఒకోసారి దొరకొచ్చు. మరోసారి దొరక్కపోవచ్చు! అందుకనే సైబర్ దాడులకు, కరెన్సీ నోట్ల రద్దు చర్యకు కూడా అవినాభావ సంబంధం ఉందని సైబర్ నిపుణులు భావిస్తున్నారు! ఫలానా వెబ్సైట్కి మీరు బదలాయిస్తే (ట్రాన్స్ఫర్) మీ డబ్బులు ఆదా అవుతాయని ఒక అజ్ఞాత నేరస్థుడు మొబైల్ సందేశాలు పంపుతుంటాడు. ఖాతాదార్లు బుట్టలో పడ డం, లక్షలు, కోట్లాది రూపాయలు కోల్పోవడం ఒక రివాజుగా మారిందట! కనుకనే, పెద్ద నోట్లను రద్దు చేయడానికి ప్రయత్నించిన పాత సోవియట్ యూనియన్, మయన్మార్, జింబాబ్వే లాంటి దేశాలు చేతులు కాల్చుకు న్నాయి. నగదు రహిత లావాదేవీలు ఉన్న అమెరికా, కెనడా, జపాన్లు కూడా సైబర్ దాడుల నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. అన్ని దేశాల అనుభవమూ అదే! బలవంతాన జరిపే పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడి పోతుందని జింబాబ్వే, మయన్మార్ల అనుభవం. బ్లాక్ మార్కెటింగ్ను, దొంగ సరుకు దిగుమతులను, నల్లధనం అణచివేత పేరిట మయన్మార్ సైనిక ప్రభుత్వం తమ కరెన్సీ ‘క్యాత్’ను మూడుసార్లు రద్దు చేసినా ఫలితం శూన్యం. పెద్ద నోట్ల రద్దు వల్ల తాత్కాలిక ఇబ్బందులున్నా, భవిష్యత్తులో లాభాలుంటాయని నరేంద్ర మోదీ, చంద్రబాబు, కేసీఆర్ భ్రమల్లోకి నెడు తున్నారు. ఇది ఎంత అసాధ్యమో కరెన్సీల ఆటుపోట్లను అధ్యయం చేసిన ప్రసిద్ధ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉండా ల్సిన నగదు తరిగిపోతున్నప్పుడు సరకుల ధరలు పడిపోతాయి. ముఖ్యంగా చిన్న, మధ్య రకం నోట్లు తరిగిపోయి వస్తువుల ధరలు పడిపోతాయి. నోట్ల ముమ్మరం దశ (ఇన్ఫ్లేషన్) ధరల పతనానికి (డిఫ్లేషన్) దారితీస్తుంది. ఈ దుస్థితి చివరికి తమ కరెన్సీ పైనే ప్రజలకు విశ్వాసం లేకుండా పోయే దశకు తీసుకువెళుతుంది. ఆసియా దేశాలలో ఒక్క పాకిస్తాన్ మాత్రమే కొత్త డిజైన్ లతో కొత్త నోట్లను ముద్రించే ముందు పాత నోట్లను రద్దు చేస్తూ (2016 డిసెంబర్ నుంచే) వాటిని మార్చుకోవడానికి ఒకటిన్నర సంవత్సరం పాటు వ్యవధి కల్పించింది. ఇవన్నీ ఎలా ఉన్నా, మన ‘‘చాయ్వాలా’’ మోదీ ప్రభుత్వ పరిస్థితి ఇలా పక్క తోవలు పట్టినా, అదే గుజరాత్లోని సూరత్లో పుట్టి పెరిగిన మరొక చాయ్వాలా ఆ దశ దాటి వడ్డీ వ్యాపారిగా రూపమెత్తి, లెక్కకురాని రూ. 12 కోట్ల ఆస్తులకు పడగెత్తిన వ్యక్తి ఆస్తిని ఆదాయపన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నందుకు సంతృప్తిపడదామా?! - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
వెనిజులాలో నోట్ల రద్దు నిర్ణయం వాయిదా
-
వెనిజులాలో ఆందోళనలు, లూటీలు
నోట్ల రద్దు ఎఫెక్ట్ కారకస్: వెనిజులాలో పెద్ద నోట్ల రద్దు, కొత్త నోట్ల సరఫరాలో జాప్యంతో ప్రజల కష్టాలు తారస్థాయికి చేరాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి బతకలేక కన్నబిడ్డలను వదిలేస్తున్న దారుణ పరిస్థితుల్లో నోట్ల రద్దు ప్రజల జీవితాలను మరింత అగాథంలోకి నెట్టింది. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి 100 బొలివర్ నోట్లను రద్దు చేస్తూ వెనిజులా అధ్యక్షుడు మదురో గత ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. అయితే పాత నోట్లు చెల్లక, కొత్త నోట్లు రాక, తినడానికి తిండి లేక ప్రజలు డెలివరీ ట్రక్కులను దోచుకుంటుంటూ పోలీసులతో గొడవలకు దిగుతూ రెచ్చిపోతున్నారు. క్రిస్మస్ వస్తున్న తరుణంలో కనీసం ఆహార పదార్థాలు కొనుక్కోవడానికి కూడా చేతిలో చిల్లర లేక శుక్రవారం ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. మరకైబో నగరంలో పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లురువ్వారు. (చదవండి: మోదీ బాటలోనే వెనిజులా.. పెద్ద నోట్ల రద్దు) మటురిన్ నగరంలో చికెన్ ట్రక్కును లూటీ చేశారు. పుయెర్టో లా క్రజ్ నగరంలో డబ్బులు తీసుకోడానకి అనుమతించకపోవడంతో ఆగ్రహించిన ప్రజలు ఆందోళనకు దిగారు. శాంటా బార్బరాలో బ్యాంకు నగదును తీసుకెళ్తున్న ట్రక్కును కొంతమంది దోచుకోవడానికి ప్రయత్నించగా డ్రైవర్లు కాల్పులు జరపడంతో నలుగురికి గాయాలయ్యాయి. వెనిజులా రిజర్వు బ్యాంకులో మాత్రమే 100 బొలివర్ నోట్లను మార్చుకునే వీలుండటంతో బ్యాంకు ముందు వేలమంది క్యూలో నిలబడుతున్నారు. పాతనోట్లను తీసుకొని ’ప్రత్యేక ఓచర్లు’ ఇస్తున్నారే తప్ప కొత్త నోట్లు ఇవ్వడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
డబ్బుల కోసం నిరసనలు.. లూటీలు!
పెద్దనోట్ల రద్దు అనంతరం జనం పడుతున్న పాట్లు మన దేశంలో కంటే వెనిజులాలో మరింత దారుణంగా ఉన్నాయి. అక్కడ కొత్త నోట్లు దొరక్క, పాత నోట్లు చెల్లక జనం డెలివరీ ట్రక్కులను దోచుకుంటున్నారు, పోలీసులతో ఘర్షణకు దిగుతున్నారు. రద్దు చేసిన 100 బొలివర్ నోట్ల స్థానంలో వాటి విలువకు దాదాపు 200 రెట్ల ఎక్కువ నోట్లు అందుబాటులోకి తీసుకు రావాలని భావిస్తోంది. కానీ ఇప్పటివరకు నోట్లు సామాన్యులకు అందుబాటులోకి రాలేదు. అసలే ప్రస్తుతం అక్కడ ద్రవ్యోల్బణం తీవ్రస్థాయిలో ఉంది. దాంతో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. కొత్త నోట్లు ఇంకా సిద్ధం కాకముందే 100 బొలివర్ నోట్లను రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు నికొలస్ మదురో ప్రకటించారు. ఆయన ప్రకటించే సమయానికి 100 బొలివర్ విలువ మూడు సెంట్లు (అమెరికా కరెన్సీలో) మాత్రమే. వెనిజులాలో చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో అవే 77 శాతం వరకు ఉన్నాయి. క్రిస్మస్ సమీపిస్తుండటం, తమ వాళ్ల కోసం బహుమతులు కాదు కదా.. కనీసం ఆహారం కొనుక్కోడానికి కూడా జనం దగ్గర డబ్బులు లేకపోవడంతో నిరసనలు వెల్లువెత్తాయి. మరకైబో నగరంలో నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. అలాగే మటురిన్ నగరంలో ఒక పెద్ద మాల్ను డజన్ల కొద్దీ ప్రజలు దోచుకున్నారు. తాను చూస్తుండగానే ఒక చికెన్ ట్రక్కును కొందరు దోచుకున్నారని మటురిన్ నగరానికి చెందిన జువాన్ కార్లోస్ లీల్ అనే రైతు చెప్పారు. డబ్బు తీసుకుందామని బ్యాంకులకు వెళ్లిన జనం, అక్కడ వారికి దొరక్కపోవడంతో దోపిడీలకు పాల్పడుతున్నారని ప్యూర్టో లా క్రజ్ అనే బేకరీ వ్యాపారి తెలిపారు. నిరసనకారులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం దుకాణాలు మూయించేశారు. ఇంకా పలు రాష్ట్రాల్లో కూడా నిరసనలు కొనసాగుతున్నట్లు ట్విట్టర్లో చెబుతున్నారు. శాంటా బార్బరా నగరంలో డబ్బు తీసుకెళ్తున్న ట్రక్కును కొంతమంది వ్యక్తులు దోచుకోడానికి ప్రయత్నిస్తుంటే, దాని డ్రైవర్లు కాల్పులు జరపడంతో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ప్రస్తుతం కేవలం ఆ దేశ రిజర్వు బ్యాంకులో మాత్రమే 100 బొలివర్ నోట్లను తీసుకుంటుండటంతో.. అక్కడ వేలాది మంది క్యూలు కడుతున్నారు. ఇప్పటికైతే వాటిని కేవలం డిపాజిట్ చేయించుకుని, వాటి బదులు 'ప్రత్యేక ఓచర్లు' ఇస్తున్నారే తప్ప కొత్తనోట్లు ఇవ్వడంలేదు. ప్రపంచం మొత్తం తలకిందులైనట్లు అనిపిస్తోందని, ఆహారం కొనడానికి డబ్బులు లేవని జీసస్ గారికా అనే కూరగాయల వ్యాపారి చెప్పారు. -
వెనిజులాలో ‘నోట్ల’ కష్టాలు మనకన్నా దారుణం
కారకాస్: మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్టయింది వెనిజులా ప్రజల పరిస్థితి. దేశంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి బతకలేక బిడ్డలను సైతం వదిలేస్తున్న దారుణ పరిస్థితుల్లో దేశాధ్యక్షుడు నికోలస్ మడురో వంద బోలివర్ నోట్లను హఠాత్తుగా రద్దు చేయడం వారి బతుకులను మరింత అగాతంలో పడేసింది. డిసెంబర్ 15వ తేదీ నుంచి మూడు రోజుల్లోగా వంద బోలివర్ నోట్లను కొత్త కరెన్సీతో మార్చుకోవాలని దేశాధ్యక్షుడు గడువు విధించినా శుక్రవారం నాటికి కూడా కొత్త కరెన్సీ మెజారిటీ బ్యాంకులకు చేరుకోలేదు. పాత నోట్లు చెల్లక, కొత్త నోట్లు రాక తినడానికి తిండిలేక అలమటిస్తున్నామని బ్యాంకుల ముందు చాంతాడంతా క్యూల్లో నిలబడిన పేదలు, మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. కొన్ని ఏటీఎంలలో ఇప్పటికీ కూడా పాత వంద నోట్లే వస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. దేశంలో ఎక్కడికక్కడ వ్యాపార లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయని చిన్న వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి కరెన్సీ విలువ దారుణంగా పడిపోయిన నేపథ్యంలో వంద బోలివర్ నోట్లను రద్దు చేస్తున్నట్లు గత ఆదివారం నాడు దేశాధ్యక్షుడు నికోలస్ హఠాత్తుగా రేడియోలో ప్రకటించారు. గురువారం నాటికి దేశంలోని అన్ని బ్యాంకులకు 500 నుంచి 20,000 బోలివర్ నోట్లు ఆరు డినామినేషన్లలో చేరుకుంటాయని, అప్పటి నుంచి 72 గంటల్లోగా పాత నోట్లను మార్చుకోవాలని గడువు విధించారు. బుధవారం రాత్రి నుంచే బ్యాంకుల ముందు క్యూలు కట్టినా దేశంలోని చాలా బ్యాంకులకు డబ్బులురాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త కరెన్సీ ముద్రణా సంస్థలు కూడా ఈ విషయంలో పెదవి విప్పడం లేదు. ‘నా ఆరేళ్ల పాపను సాదుకునేందుకు ఎవరికైనా ఇచ్చేస్తాను. గత అక్టోబర్లోనే మా పక్కింటి వాళ్లను అడిగాం. వారికి కుదరదని చెప్పారు. మా మామకు వచ్చే ఆరు డాలర్లకు సమానమైన పింఛనుపై పాపతో సహా నలుగురం బతుకుతున్నాం. కష్టమవుతోంది. మా దగ్గరుండి ఆకలితో చనిపోవడమో లేదా వ్యభిచారిగా మారడమో కాకుండా కాస్త డబ్బున్నవాళ్లు పెంచుకుంటే బాగుంటుందని భావిస్తున్నాం’ అని 43 ఏళ్ల నిరుద్యోగ మహిళ జులే పుల్గర్ వాపోయారు. ఇప్పుడు ఇలాంటి వాళ్లు వెనిజులాలో ఎందరో ఉన్నారు. ఇలా రోజుకు తమ పిల్లల సంరక్షణ బాధ్యతలను చూసుకోవాల్సిందిగా డజనుకుపైగా తల్లిదండ్రులు తమ సంస్థ వద్దకు వస్తున్నారని కరిరుబానా అనే సాంఘిక సేవా సంస్థ తెలియజేసింది. మరికొంత మంది తల్లిదండ్రులు తమను సంప్రతించకుండానే తెల్లవారక ముందే తమ కార్యాలయం ముందు పిల్లలను వదిలేసి వెళుతున్నారని సంస్థ నిర్వాహకులు తెలిపారు. నగరంలోని ధనవంతులు నివసిస్తున్న ప్రాంతాల్లో కొంత మంది పేద తల్లులు తమ పిల్లలను వదిలేసి వెళుతున్నారని మున్సిపల్ అధికారులు తెలియజేస్తున్నారు. భారత్లోలాగా వెనిజులా కూడా బ్యాంక్ ఖాతాలుండే వారు చాలా తక్కువ. వ్యాపార వర్గాల మధ్య కూడా ఎక్కువగా నగదు లావాదేవీలే జరుగుతుంటాయి. చమురు విలువలు అపారంగా ఉన్న దేశంలో కూడా నోట్ల కష్టాలు తప్పడం లేదు. -
ఫార్మాపై వెనెజులాతో భారత్ చర్చలు
* చమురు రూపంలో బకాయిల సర్దుబాటు ప్రతిపాదనపై కసరత్తు * కేంద్ర వాణిజ్య విభాగం డెరైక్టర్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్గత సంక్షోభం, కరెన్సీ పతనం తదితర సమస్యలతో సతమతమవుతున్న వెనెజులా నుంచి దేశీ ఫార్మా కంపెనీలకు అందాల్సిన చెల్లింపులను రాబట్టడంపై కేంద్రం మరింతగా దృష్టి సారించింది. బకాయిలను చమురు సరఫరా రూపంలో సర్దుబాటు చేసే ముసాయిదా ప్రతిపాదనను వెనెజులా ప్రభుత్వం ముందుంచింది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయని కేంద్ర వాణిజ్య విభాగం డెరైక్టర్ అనిస్ జోసెఫ్ చంద్ర తెలిపారు. ఇటు దేశీయంగా ఆర్థిక శాఖ, విదేశాంగ శాఖ, ఆర్బీఐ తదితర వర్గాలతో కూడా ఈ అంశంపై చర్చిస్తున్నట్లు ఆమె వివరించారు. వెనెజులాలో నెలకొన్న పరిస్థితుల కారణంగా సమస్య పరిష్కారంలో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. ఔషధాల ఎగుమతి ప్రోత్సాహక మండలి ఫార్మెక్సిల్ నిర్వహిస్తున్న ఫార్మా సీఈవోల సదస్సులో గురువారమిక్కడ పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు వివరించారు. దేశీ ఫార్మా సంస్థలకు వెనెజులా నుంచి రూ. 2,000 కోట్లు రావాల్సి ఉందని అంచనా. ఎగుమతుల్లో 12 శాతం వృద్ధి..: రష్యా వంటి మార్కెట్ల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఇతర మార్కెట్లు లోటు భర్తీ చేయగలవని, ఫార్మా ఎగుమతులు మెరుగ్గానే ఉండగలవని ఫార్మెక్సిల్ చైర్మన్, అరబిందో ఫార్మా హోల్టైమ్ డెరైక్టర్ మదన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ఎగుమతుల్లో సుమారు 10-12 శాతం వృద్ధి నమోదు కాగలదని ఆయన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం దాదాపు 17 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఈసారి సుమారు 19 బిలియన్ డాలర్ల మార్కును చేరుకోగలమని ఫార్మెక్సిల్ వైస్ చైర్మన్ దినేష్ దువా పేర్కొన్నారు. మరోవైపు, ప్రతిసారి ముంబైలో జరిగే ఫార్మా ఎక్స్పో ఐఫెక్స్ను వచ్చే ఏడాది ఏప్రిల్లో తొలిసారిగా హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు ఫార్మెక్సిల్ డెరైక్టర్ జనరల్ పీవీ అప్పాజీ తెలిపారు. ఫార్మా సంస్థలకు పురస్కారాలు.. సదస్సు సందర్భంగా వివిధ విభాగాల్లో ఫార్మా సంస్థలకు పురస్కారాలు ప్రదానం చేశారు. ఎగుమతులకు సంబంధించి బల్క్ డ్రగ్స్ విభాగంలో (లార్జ్) అరబిందో ఫార్మా, ఫార్ములేషన్స్లో (మధ్య స్థాయి) హెటెరో ల్యాబ్స్ పురస్కారాలు దక్కించుకున్నాయి. ఆల్ రౌండ్ పార్ ఎక్సలెన్స్ (లార్జ్) పురస్కారాన్ని మైలాన్ ల్యాబరేటరీస్ దక్కించుకోగా, మిడ్ సెగ్మెంట్లో క్యాడిలా అవార్డు దక్కించుకుంది. పేటెంట్ అవార్డుల్లో ఎన్సీఈ/డ్రగ్ డిస్కవరీకి సంబంధించి సువెన్ లైఫ్ సెన్సైస్ పసిడి పురస్కారం అందుకోగా, బల్క్ డ్రగ్స్/ఏపీఐ విభాగంలో హెటెరో డ్రగ్స్ పసిడి, లారస్ ల్యాబ్స్ .. న్యూలాండ్ ఫార్మా రీసెర్చ్..ఎంఎస్ఎన్ ల్యాబ్స్ రజత పురస్కారం దక్కించుకున్నాయి. -
‘నామ్’కు కాలం చెల్లిందా?
ఒకప్పుడు ప్రపంచ రాజకీయ రంగస్థలిపై ప్రభావశీల శక్తిగా వెలిగిన అలీనోద్య మానికి కాలదోషం పట్టిందా? వెనిజులాలోని మార్గరిటా ద్వీపంలో ఈ నెల 17-18 తేదీలలో జరిగిన 17వ అలీన దేశాల శిఖరాగ్ర సమావేశం తీరును చూస్తే ఆ అనుమానం రాకమానదు. 120 సభ్య దేశాలతో ఐక్యరాజ్య సమితిలో అతి పెద్ద రాజకీయ కూటమిగా ఉన్న అలీనోద్యమం (నామ్) శిఖరాగ్ర సదస్సుకు 12 మంది దేశాధినేతలు మాత్రమే హాజరయ్యారు. వెనిజులాలో నెలకొన్న రాజకీయ అస్థిరత, అధ్యక్షుడు నికొలస్ మధురో అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి ఉండటం వల్లనే ఈ సదస్సు చప్పగా సాగిందని అనుకోలేం. మూడేళ్ల క్రితం ఇరాన్ రాజధాని టెహ్రాన్లో జరిగిన 16వ నామ్ సదస్సుకు హాజరైనది 30 మంది దేశాధినేతలే. ఈ ధోరణిని బట్టి నామ్ సభ్య దేశాలలో ఈ ఉద్యమంపట్ల నమ్మకం సడలుతోంది, ఆసక్తి తగ్గుతోందనేది స్పష్టమే. వ్యవస్థాపక సభ్య దేశమైన భారత దేశాధినేత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సుకు హాజరు కాకపోవడం విశేషం. 1961లో ఏర్పడిన నాటి నుంచి నామ్ చరిత్రలో మోదీకి ముందు ఒకే ఒక్క భారత ప్రధాని.. కాంగ్రెస్ బ్లాక్ మెయిలింగ్ మద్దతుతో ఊగిసలాడే ప్రభుత్వానికి నేతృత్వం వహించిన చరణ్సింగ్ (1979లో క్యూబాలో జరిగిన 7వ సదస్సు) మాత్రమే ఇలా గైర్హాజరయ్యారు. ప్రధాని ఈ సదస్సుకు హాజరు కానంత మాత్రాన మోదీ ప్రభుత్వం అలీనోద్యమంలో ఆసక్తిని కోల్పోయిందనుకోరాదని ప్రభుత్వ వివరణ. అదెలా ఉన్నా, ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య సాగిన ఆధిపత్య పోటీలో నలిగిపోతున్న వర్ధమాన దేశాల ఉద్యమంగా పుట్టిన నామ్కు నేటి ప్రపంచంలో సమంజసత్వమే లేదనే వాదన నేడు గట్టిగా విన వస్తోంది. అమెరికా, సోవియట్ యూనియన్ అగ్రరాజ్యాలు రెంటికి సమదూరాన్ని పాటించడానికి నేడు అలాంటి ప్రపంచాధిపత్య పోటీ లేదు కాబట్టి అలీన విధానం అవసరం ఇక లేదనే భావన మోదీకి ఏర్పడినట్టుంది. ఇటీవలే అమెరికాతో సైనిక ఒప్పందాన్ని కుదుర్చుకున్న దృష్ట్యా వెంటనే పాశ్చాత్య వ్యతిరేక ముద్ర ఉన్న నామ్ సదస్సుకు హాజరు కాకపోవడమే ఉత్తమమనేది కూడా ఆయన ప్రభుత్వాన్ని ప్రభా వితం చేసి ఉండొచ్చు. పైగా అలీన విధానం అనే భావనకు కర్త జవహర్లాల్ నెహ్రూపట్ల, ఆయన వారసత్వంపట్ల ప్రధానికి ఉన్న విముఖత అందరికీ తెలిసినదే. అలీనోద్యమాన్ని ప్రచ్ఛన్న యుద్ధ శిశువుగా మాత్రమే చూసేవారెవరైనా దానికి కాలం చెల్లిపోయిందనుకోవడం సహజమే. కానీ 1950లలో ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేస్తున్న కాలంలోనే ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని చాలా దేశాలు వలస సంకెళ్లను తెంచుకున్నాయి. అవి ప్రపంచంలో తమదైన సొంత అస్తిత్వాన్ని చాటుకోవాలని, నిలుపుకోవాలని, స్వతంత్రంగా అభివృద్ధి చెందాలని తహతహ లాడాయి. ఆ ఆకాంక్షల నుంచే అలీన విధానం అనే భావన 1954 నాటికి ఊపిరి పోసుకుంది. దాన్ని విస్మరిస్తే అలీన విధానానికి అసలు పునాది వలసవాద వ్యతి రేకత అనే చారిత్రక వాస్తవం మరుగున పడిపోతుంది. అదే నేడు జరుగుతోంది. అలీనోద్యమాన్ని ప్రచ్ఛన్న యుద్ధానికి అంటగట్టేసే యాంత్రిక ధోరణికి కారణ మౌతోంది. మన కళ్లెదుటే మధ్యప్రాచ్యంలో సాగుతున్న సిరియా మారణహోమం నుంచి, దక్షిణ చైనా సముద్రంలో కమ్ముకుంటున్న ప్రచ్ఛన్న యుద్ధ మేఘాల వరకు ప్రతిచోటా ప్రపంచ శక్తుల సంఘర్షణ స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగిన కాలంలోలాగే నేడూ పలు వర్ధమాన దేశాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఏదో ఒక ప్రపంచ శక్తి వెనుక నిలవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరోవంక అమెరికా, చైనాల మధ్య ఆర్థిక ఆధిపత్య పోటీ నానాటికీ విస్తరిస్తోంది, ఉద్రిక్తతలకు దారితీస్తోంది. వీటికి తోడు అన్ని అంతర్జాతీయ సంస్థలలోను, వేదికలపైన సంపన్న దేశాలు, వర్ధమాన దేశాల ప్రయోజనాల మధ్య సంఘర్షణ నగ్నంగా కనిపిస్తూనే ఉంది. డబ్ల్యూటీఓ నుంచి పర్యావరణం, వాతావరణ మార్పుల వరకు అడుగడుగునా వర్ధమాన దేశా లపట్ల వివక్ష కొనసాగుతోంది. 21వ శతాబ్దం విసురుతున్న సవాళ్లు అలీనోద్యమం పుట్టిన నాటి కంటే భిన్నమైనవే. కానీ అవి అలీనోద్యమానికి కాలదోషం పట్టిం చకపోగా మరింత ఆవశ్యకం చేస్తున్నాయి. ‘నామ్, పేద దేశాల అంతర్జాతీయ ట్రేడ్ యూనియన్’ అని ఒకప్పుడు అనేవారు. అలాంటి కూటమిగా నామ్ ఆవశ్యకత ఎప్పటికన్నా నేడు ఎక్కువగా ఉన్నది. 2003 కౌలాలంపూర్ నామ్ సదస్సులో నాటి భారత ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి చెప్పింది సరిగ్గా ఇదే: ‘అలీనోద్యమం ఈ నూతన శతాబ్దంలోని గొప్ప చారిత్రక సందర్భం. గతాన్ని పునరాలోచించుకుని, విజయాలను వైఫల్యాలను మదింపు చేసి మన ఉద్యమాన్ని పునరుజ్జీవింపచేయ డానికి నిర్దిష్ట చర్యలను చేపట్టాల్సి ఉంది. ఈ కృషిలో భారత్ తనవంతు పాత్రను నిర్వహించడానికి సిద్ధంగా ఉంది.’ ప్రచ్ఛన్న యుద్ధం ప్రపంచాన్ని అణు యుద్ధం అంచున నిలిపిన 1960లు, 1970లలో భారత్ సహా చాలా వర్ధమాన దేశాలు ఏదో ఒక అగ్రరాజ్యాన్ని ఆశ్రయిం చాల్సి వచ్చింది. అయినా అలీనోద్యమం తన సొంత గొంతుకను వినిపించగలి గింది. 1981లో, నాడు సోవియట్ యూనియన్కు మిత్ర దేశంగా ఉన్న భారత్ అధ్యక్షతన నామ్.. అఫ్ఘానిస్థాన్ నుంచి సోవియట్ యూనియన్ తక్షణమే సేనలను ఉపసంహరించాలని తీర్మానించింది. 2013 నామ్ టెహ్రాన్ సదస్సు దక్షిణ చైనా సముద్ర వివాదంపై నీళ్లు నమలకుండా ఐరాస అంతర్జాతీయ సముద్ర మౌలిక సూత్రాలను అన్ని పక్షాలు తు.చ. తప్పక పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. నేటి మార్గరిటా సదస్సు కూడా చైనా, ఫిలిప్పీన్స్ దక్షిణ చైనా సముద్ర వివాదాన్ని మధ్య వర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది. ఆ అంశంపై భారత్ అను సరిస్తున్న సూత్రప్రాయమైన వైఖరి కూడా అదే. నేటికీ బహుముఖ అంతర్జాతీయ వేదికగా అలీన ఉద్యమానికి ఉన్న శక్తిని, ప్రాధాన్యాన్ని గుర్తించి, దాన్ని పునరు జ్జీవింపజేసి, సమర్థ నాయకత్వాన్ని అందించాల్సిన చారిత్రక బాధ్యత ఆ ఉద్యమ నిర్మాతగా, నామ్లోని శక్తివంతమైన దేశంగా భారత్దే. ఇప్పటికైనా అది గుర్తిం చడం అవసరం. -
అధ్యక్షుడు దిగిపోవాలంటూ ఫుడ్ ఎమర్జెన్సీ !
కారాకాస్ (వెనిజులా): వెనిజులాలోని రెండో అతిపెద్ద రాష్ట్రమైన మిరాండా పాఠశాలల్లో ఫుడ్ ఎమర్జెన్సీని ప్రకటించారు. కేంద్రంలోని సోషలిస్టు ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రతిపక్ష పార్టీల సమ్మేళనం ‘డెమొక్రాటిక్ యూనిటీ రౌండ్ టేబుల్’కు చెందిన హెన్రిక్ కాప్రిల్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మిరాండా రాష్ట్ర గవర్నర్గా ఉన్న ఆయన ప్రస్తుత అధ్యక్షుడు నికోలస్ మదురో పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితికి వామపక్ష సోషలిస్టు ప్రభుత్వమే కారణమని, నికోలస్ను గద్దె దింపాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ప్రజానీకానికి సరిపడా ఆహారం దేశంలో లేదంటూ కాప్రిల్స్ వ్యాఖ్యానించారు. ఈయన 2013 అధ్యక్ష ఎన్నికల్లో నికోలస్ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. చమురు నిక్షేపాల దేశంగా పేరొందిన వెనిజులా ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవడంతో గత రెండేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కుంటోంది. ఫలితంగా దేశంలో ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ప్రభుత్వం గద్దె దిగాలంటూ పలుచోట్ల నిరసనలు కార్యక్రమాలు చేపడుతున్నారు. -
సుష్మాకు 'నామ్' సమ్మిట్ ఆహ్వానం
న్యూఢిల్లీః విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కు వెనెజులా నాన్ అలైన్డ్ మూవ్ మెంట్ (నామ్) ఆహ్వానం అందింది. వచ్చేనెల వెనెజులాలో జరిగే నామ్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే అవకాశం లేకపోవడంతో ఆయనకు బదులుగా సుష్మా స్వరాజ్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. వెనెజులా బొలీవియన్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రి డెల్సీ రోడ్రిక్వెజ్ 2016 ఆగస్టు 18న ఇండియా సందర్భించారు. వెనెజులాలోని మార్గరిటా ఐస్లాండ్ లో 17వ 'నామ్' సదస్సు జరగనున్న నేపథ్యంలో సమావేశానికి భారతదేశాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు రోడ్రిక్వెజ్ భారత్ కు వచ్చినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. 2016 సెప్టెంబర్ 17-18 తేదీల్లో నామ్ సదస్సు జరగనుంది. అయితే ఇంతకు ముందు 1979 సంవత్సరం చరణ్ సింగ్ భారత కేర్ టేకర్ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన నామ్ శిఖరాగ్ర సమావేశానికి కూడా భారత ప్రధాని హాజరు కాలేదు. దీంతో ఈసారి తప్పనిసరిగా భారత ప్రాతినిథ్యం ఉండేందుకు వీలుగా ప్రధానికి బదులుగా సుష్మా స్వరాజ్ హాజరయ్యే అవకాశం ఉంది. -
మెస్సీ ‘రికార్డు’ షో
► సెమీఫైనల్లోకి అర్జెంటీనా ► వెనిజులాపై 4-1తో విజయం ► కోపా అమెరికా కప్ ఫాక్స్బరో (అమెరికా): కోపా అమెరికా కప్లో సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. టోర్నీలో నాలుగో గోల్ సాధించడంతో పాటు అర్జెంటీనా తరఫున అత్యధిక గోల్స్ (54) చేసిన ఆటగాడిగానూ నిలిచాడు. ఆదివారం వెనిజులాతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ను మెస్సీ అంతా తానై శాసించడంతో అర్జెంటీనా 4-1తో నెగ్గి సెమీస్కు చేరింది. 60వ నిమిషంలో చేసిన గోల్తో మెస్సీ ఇప్పటిదాకా గాబ్రియల్ బటిస్టుటా పేరిట ఉన్న అత్యధిక గోల్స్ రికార్డును సమం చేశాడు. అలాగే జట్టు సాధించిన మరో రెండు గోల్స్లోనూ తన పాత్ర ఉండడం విశేషం. గోంజలో హిగువాన్ (8వ, 28వ నిమిషాల్లో), లమేలా (71వ నిమిషంలో) మిగతా గోల్స్ చేశారు. వెనిజులా నుంచి రోండన్ (70వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. బుధవారం జరిగే సెమీఫైనల్లో అర్జెంటీనా జట్టు అమెరికాతో తలపడుతుంది. అంతకుముందు ప్రథమార్ధం నుంచే మెస్సీ తన మేజిక్ను చూపాడు. దీంతో 8వ నిమిషంలోనే జట్టు ఆధిక్యం సాధించింది. టచ్లైన్ నుంచి పెనాల్టీ ఏరియాలోకి మెస్సీ ఇచ్చిన అద్భుత పాస్ను అందుకున్న హిగువాన్ ఏమాత్రం అలక్ష్యం చేయకుండా గోల్ చేశాడు. ఆ తర్వాత కూడా వెనిజులా గోల్పోస్టుపై అర్జెంటీనా దాడులను కొనసాగించింది. అయితే 27వ నిమిషంలో ప్రత్యర్థి ఆటగాడు గోంజలెజ్ను అడ్డుకున్నందుకు నికోలస్ గైటాన్ ఎల్లో కార్డుకు గురయ్యాడు. దీంతో తను అమెరికాతో సెమీస్కు దూరం కానున్నాడు. వర్గాస్ నాలుగు గోల్స్... సాంటా క్లారా (అమెరికా): వరుస విజయాలతో దూసుకెళుతున్న మెక్సికో జట్టుకు డిఫెండింగ్ చాంపియన్ చిలీ బ్రేక్ వేసింది. ఫార్వర్ట్ ఆటగాడు ఎడ్వర్డో వర్గాస్ (44, 52, 57, 74వ నిమిషాల్లో) ఏకంగా నాలుగు గోల్స్తో అదరగొట్టడంతో పాటు పేలవమైన ఆటతీరుతో మెక్సికో మూల్యం చెల్లించుకుంది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో చిలీ 7-0తో మెక్సికోను చిత్తుగా ఓడించింది. ఓ మేజర్ టోర్నీలో ఈ జట్టు ఇంత ఘోరంగా ఓడడం ఇదే తొలిసారి. గతంలో 1978 ప్రపంచకప్లో మెక్సికో 0-6తో పశ్చిమ జర్మనీ చేతిలో ఓడింది. 70 వేలకు పైగా ఉన్న మెక్సికో మద్దతుదారుల మధ్య చిలీ ఈ మ్యాచ్లో అసమాన ప్రతిభను చూపింది. 13 నిమిషాల వ్యవధిలోనే వర్గాస్ హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. ఎడ్సన్ పూచ్ (16వ, 87వ ని.లో) రెండు గోల్స్, అలెక్సిస్ సాంచెజ్ (49వ ని.లో) ఓ గోల్ చేశాడు. -
వెనుజులాతో జర జాగ్రత్త: మెస్సీ
హవానా: కోపా అమెరికా కప్లో భాగంగా వెనుజులాతో జరుగనున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్కు అర్జెంటీనా ఆటగాళ్లు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని ఆ జట్టు కెప్టెన్ లియోనల్ మెస్సీ సూచించాడు. పటిష్టమైన వెనుజులాతో జాగ్రత్తగా ఆడితేనే విజయం సాధ్యమవుతుందన్న విషయాన్ని ప్రతీ ఆటగాడు గుర్తించాలన్నాడు. గ్రూప్-డిలో టాపర్ గా నిలిచామన్న అతి విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దరిచేరనీయొద్దని ఆటగాళ్లను మెస్సీ హెచ్చరించాడు. 'వెనుజులా గట్టి ప్రత్యర్థి. ఆ విషయం అర్జెంటీనా ఆటగాళ్లు గుర్తించుకుంటే చాలు. వారు కూడా బలమైన జట్లను ఓడించే క్వార్టర్స్ కు చేరారు. ఆ జట్టును నియంత్రించాలంటే పూర్తిస్థాయి ప్రదర్శన ఒక్కటే మార్గం. అందుకోసం సాధ్యమైనంతవరకూ బాగా సన్నద్ధం కావాలి' అని మెస్సీ తెలిపాడు. మరోవైపు అర్జెంటీనా కోచ్ గెరార్డో మార్టినో కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం వెనుజులా జట్టు అసాధారణ ఆటగాళ్లతో పటిష్టంగా ఉందన్నాడు. మెక్సికోను ఓడించి క్వార్టర్స్ కు చేరిన వెనుజులాను ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయొద్దని సూచించాడు. ఆదివారం అర్జెంటీనా-వెనుజులా జట్లు క్వార్టర్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
గ్రూప్ ‘సి’ టాపర్గా మెక్సికో
* వెనిజులాతో మ్యాచ్ ‘డ్రా’ * కోపా అమెరికా కప్ హూస్టన్: ఆరంభంలోనే ప్రత్యర్థి ఆధిక్యం పొందినా ఒత్తిడిని అధిగమించిన మెక్సికో చివర్లో గోల్ కొట్టి మ్యాచ్ను కాపాడుకుంది. దీంతో గ్రూప్ ‘సి’లో టాపర్గా నిలిచింది. కోపా అమెరికా కప్లో భాగంగా సోమవారం వెనిజులాతో జరిగిన ఈ మ్యాచ్ 1-1తో డ్రా అయ్యింది. ఈ రెండు జట్లు ఇప్పటికే క్వార్టర్స్కు చేరాయి. మ్యాచ్ ఆరంభమైన 10వ నిమిషంలోనే వెనిజులా గోల్ చేసి మెక్సికోకు షాక్నిచ్చింది. క్రిస్టియాన్ సాంటోస్ హెడర్ ద్వారా ఇచ్చిన పాస్ను అందుకున్న వెలాజ్క్వెజ్ చక్కటి వ్యాలీతో గోల్ను సాధించాడు. అయితే ద్వితీయార్ధం 49, 56వ నిమిషాల్లోనూ స్కోరును సమం చేసేందుకు వచ్చిన అవకాశాలను మెక్సికో వినియోగించుకోలేకపోయింది. ఇక 80వ నిమిషంలో జీసస్ మాన్యుయల్ టెకాటిలో కొరోనా చేసిన గోల్తో మెక్సికో ఊపిరిపీల్చుకుంది. 84వ నిమిషంలో వెనిజులా నుంచి జోసెఫ్ మార్టినెజ్ గోల్ కోసం యత్నించినా మెక్సికో కీపర్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ఉరుగ్వేకు ఓ విజయం: కోపా అమెరికా కప్ను ఉరుగ్వే జట్టు విజయంతో ముగించింది. వరుసగా రెండు మ్యాచ్లు ఓడి ఇప్పటికే నాకౌట్కు దూరమైన ఈ జట్టు గ్రూప్ ‘సి’ నామమాత్రపు మ్యాచ్లో 3-0తో జమైకాను ఓడించింది. -
ఉరుగ్వేకు మరోషాక్
ఫిలాడెల్ఫియా: దాదాపు గత పది సంవత్సరాలుగా వెనుజులా చేతిలో ఓటమి ఎరుగని ఉరుగ్వేకు కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నీలో తొలిసారి షాక్ తగలింది. భారత కాల మాన ప్రకారం గురువారం రాత్రి జరిగిన గ్రూప్-సి మ్యాచ్లో వెనుజులా 1-0 తేడాతో ఉరుగ్వేను ఓడించింది. ఆట 36వ నిమిషంలో సలోమాన్ రాండాన్స్ గోల్ చేసి వెనుజులాను ఆధిక్యంలోకి తీసుకువెళ్లాడు. ఆ తరువాత ఉరుగ్వే దూకుడుగా ఆడిన వెనుజులా డిఫెన్స్ను ఛేదించలేక ఓటమి పాలైంది. దీంతో వెనుజులా క్వార్టర్స్ లో కి చేరింది. ఇది 2006 తరువాత ఉరుగ్వేకు తొలి ఓటమి కాగా, కోపా అమెరికా కప్లో వెనుజులా వరుసగా రెండు విజయాలు నమోదు చేసి సరికొత్త చరిత్రను లిఖించింది. గత మ్యాచ్ల్లో మెక్సికో చేతిలో ఉరుగ్వే ఓటమి పాలుకాగా, మెక్సికోపై వెనుజులా విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
మగువలూ.. హెయిర్ డ్రైయర్స్ ఆపితే పవర్ ఫుల్లు!
వెనిజులా: విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ ముదురో మహిళలకు ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేశారు. కరెంటు సమస్యల నేపథ్యంలో మహిళలు హెయిర్డ్రైయర్స్ వాడటం మానేయాలని సూచించారు. విద్యుత్ ఉపయోగించి చేసే ప్రతిపనికి ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెప్పారు. ఇలా కనీసం ఓ రెండు నెలలపాటు పాటించాలని డిక్రీ జారీ చేశారు. దీంతోపాటు ఎయిర్ కండిషనర్స్ వంటివి ఉపయోగించడం కూడా తగ్గించాలని చెప్పారు. మహిళలకు సంబంధించి ఆయనేం చెప్పారంటే 'మహిళలు జుట్టును ఆరబెట్టుకునే యంత్రాలు(హెయిర్ డ్రైయర్స్) ఉపయోగించడం కంటే వారి జుట్టులోకి చేతి వేళ్లను పోనిచ్చి సరిచేసుకోవడం ద్వారా సహజంగా ఆరిపోతుందని చాలా కాలంగా నాకున్న ఆలోచన. ఇదొక్కడే నా దగ్గర ఉన్న ఉపాయం కూడా' అని అన్నారు. వాతావరణ పరిస్థితులు కూడా అనూహ్యంగా మారిన నేపథ్యంలో ఇప్పటి వరకు వెనిజులా వాసులు అనుసరిస్తున్న విధానాల్లో స్వల్ప మార్పులు చేసుకుంటే మంచిదని కూడా ఆయన చెప్పారు. అయితే, ఆయన అభిప్రాయంతో పలువురు విభేదించారు. రాష్ట్రపతి వ్యాఖ్యలు సరికావని అన్నారు. ఒక వేళ అలాంటిదే చేస్తే అంతకన్నా చెత్తపని ఇంకేం ఉండదని అంటున్నారు. -
అందాల రాశిని హత్య చేసి 30 ఏళ్లు జైలు పాలు
కారాకస్: వెనెజులా సుందరి మోనికా స్పేర్ (29) హత్య కేసులో ముగ్గురు వ్యక్తులకు ముప్పై ఏళ్ల జైలు శిక్షపడింది. వారికి కఠినకారాగార శిక్ష విధిస్తూ ఉత్తర కారాబోబోలోని కోర్టు తీర్పు చెప్పింది. 'ఒక దొంగతనానికి పాల్పడే క్రమంలో వారు చేసింది ఉద్దేశ పూర్వక హత్యే' అని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. మోనికా స్పేర్ 2004లో మిస్ వెనిజులా అందాల పోటీలో పాల్గొని కిరీటాన్ని దక్కించుకుంది. అదే మిస్ యూనివర్స్ పోటీలో కూడా పాల్గొంది. అనంతరం పలు టీవీ కార్యక్రమాల్లో కూడా నటించింది. ఆమె ఒక రోజు తన భర్త హెన్రీ బెర్రీ (39) కూతురుతో కలిసి ఓ టూర్కి వెళ్లి తిరిగొస్తుండగా ఓ ఎజెన్సీ ప్రాంతంలో ముగ్గురు దొంగలు వారి వాహనాన్ని ఆపేశారు. వారికి సహాయం చేద్దామని ఓ ట్రక్కు డ్రైవర్ ప్రయత్నించినా అప్పటికే ఆ ముగ్గురు వారి కారుపై విచ్చల విడిగా కాల్పులు జరిపి వారిని దోచుకొని వెళ్లారు. ఈ కాల్పుల్లో మోనికా, ఆమె భర్త మరణించగా కూతురుకు గాయాలయ్యాయి. ఈ కేసును విచారించిన కోర్టు అంతకు ముందు ఇందులో కొంత పాత్ర ఉన్న 15, 17 ఏళ్ల ఇద్దరు యువకులకు నాలుగేళ్ల జైలు శిక్షను విధించడంతోపాటు మరో ముగ్గురుకి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరో మహిళకు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది.


