-
మంగళగిరిలో టీడీపీ హత్యా రాజకీయాలు
-
క్రీడాకారులను మరింత తీర్చిదిద్దేలా.. ‘ఆడుదాం ఆంధ్ర’
డా.బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ: కబడ్డీ క్రీడాకారులను మరింత తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి (విక్టరీ వెంకటరెడ్డి) అన్నారు. బుధవారం రావులపాలెంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడలకు సంబంధించి విశాఖపట్నంలో మంగళవారం రాత్రి ముగింపు కార్యక్రమం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారన్నారు. కబడ్డీలో రాష్ట్రంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులను మరింత తీర్చిదిద్దాలంటూ సీఎం జగన్మోహన్రెడ్డి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్కు బాధ్యత అప్పగించారన్నారు. లాంగ్ టర్మ్ కోచింగ్లో భాగంగా ప్రో కబడ్డీ క్యాంప్కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమన్, బాలకృష్ణారెడ్డిలను, అలాగే ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కోచింగ్ క్యాంపునకు సంధ్య, సతీష్లను అప్పగించారన్నారు. దానికి కట్టుబడి వారిని అన్నివిధాలా తీర్చిదిద్దుతామని వెంకటరెడ్డి తెలిపారు. త్వరలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ తరఫున ప్రో కబడ్డీ తరహా ఆంధ్ర కబడ్డీ లీగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ శ్రీకాంత్, వైజాగ్ సెక్రటరీ ప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అంబేద్కర్ ని కూడా కాదన్నారు..!
-
3 గంటలు కావాలా?.. 24 గంటలు కావాలా?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/రామన్నపేట/తుంగతుర్తి: ‘మీ ఇంటి ముందున్న అభివృద్ధిని చూడండి.. మీ కళ్ల ముందుండే అభ్యర్థిని చూసి బీఆర్ఎస్కు ఓటు వేయండి’ అని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. నకిరేకల్లో బీఆర్ఎస్ అభ్యర్థి లింగయ్యను గెలిపించి సీఎం కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంను చేయాలన్నారు. నకిరేకల్ పట్టణంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. హరీశ్రావు మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సిగ్గులేకుండా 3 గంటల కరెంట్ చాలని మాట్లాడారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంటే ఉంటుందని, బీఆర్ఎస్ వస్తే 24 గంటలు వస్తుందని, ఏది కావాలో ప్రజలు ఆలోచించాలని సూచించారు. 3 గంటల కరెంటు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, 24 గంటల కరెంటు కావాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలన్నారు. కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్రెడ్డిలు పేర్లుకే పెద్దమనుషులు నల్లగొండ జిల్లాకు చెందిన కొందరు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, వారు పేరుకే పెద్దమనుషులని హరీశ్ వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డి పేర్లు పెద్దవే తప్ప వాళ్లు చేసే పనులు చిన్నవన్నారు. వారు జిల్లాను ఏనాడైనా పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వారి పాలనలో శవాన్ని కాల్చేసి స్నానం చేద్దామంటే కరెంట్ లేని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు. ఆనాడు ఉచిత కరెంట్ అని ఉత్త కరెంట్ ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ పార్టీయేనని, నకిరేకల్ అభివృద్ధి కొనసాగాలంటే ఎమ్మెల్యేగా లింగయ్యను గెలిపించాలని పిలుపునిచ్చారు. వంద రకాలుగా తెలంగాణకు ద్రోహం చేసిన కాంగ్రెస్ః జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రజల ముఖాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీదేనని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ‹Ùరెడ్డి అన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ వంద రకాలుగా ద్రోహం చేస్తే. బీఆర్ఎస్ ప్రభుత్వం వంద మంచి పనులు చేసిందన్నారు. ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే మేనిఫెస్టో వస్తుంది ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే విధంగా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో రాబోతుందని హరీశ్రావు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి 35 నియోజకవర్గాల్లో అభ్యర్థులు కరువయ్యారని, మనం పనికిరారంటూ పక్కన పెట్టిన వారిని పార్టీలో చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ వాంరటీ అయినా గ్యారంటీ అయినా కేసీఆరే తెలంగాణ వాంరటీ అయినా గ్యారంటీ అయినా కేసీఆరే అని మంత్రి హరీష్రావు అన్నారు. తుంగతుర్తి సభలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్తో కలిసి మాట్లాడారు. అసెంబ్లీ టిక్కెట్లను కాంగ్రెస్ పార్టీ రూ.15కోట్లకు అమ్ముకుంటోందని ఆరోపించారు. రేపు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటారని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటల, నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలో, నకిరేకల్లో, సూ ర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్ శంకుస్థాపనలు ప్రారంబోత్సవాలు చేశారు. -
బైజూస్ పై తప్పుడు ఆరోపణలు చేసిన ప్రతిపక్షాలకు గూబ పగిలేలా కౌంటర్ ఇచ్చిన కారుమూరి వెంకట రెడ్డి
-
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో " స్ట్రెయిట్ టాక్ "
-
ప్రముఖ న్యాయ కోవిదుడు సత్తి వెంకట్రెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది సత్తి వెంకట్రెడ్డి కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయస్సు 97 సంవత్సరాలు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నా రు. వెంకట్రెడ్డి అంత్యక్రియలు బుధవారం సా యంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. సత్తి వెంకట్రెడ్డి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా, కవిటం గ్రామం. అక్కడే 1926, ఫిబ్ర వరి 25న జన్మించారు. 1951లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. కొంత కాలం పాటు రాజమండ్రిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అటు తరువాత 1956లో హైదరాబాద్కు మకాం మార్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉత్తమ న్యాయవాదుల్లో ఒకరిగా పేరుగాంచారు. 1992–94 మధ్య కాలంలో కోట్ల విజయభాస్కర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, సత్తి వెంకట్రెడ్డి అడ్వొకేట్ జనరల్గా సేవలు అందించారు. ఆయన పలు కీలక కేసుల్లో వాదనలు వినిపించారు. ఆయన ముగ్గురు కుమారులు న్యాయవాదులే. వెంకట్రెడ్డి అల్లుడు సీవీ మోహన్రెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అడ్వొకేట్ జనరల్గా వ్యవహరించారు. సత్తి వెంకట్రెడ్డి మృతి పట్ల పలువురు న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. -
వేడెక్కిన మునుగోడు రాజకీయం
-
రామకృష్ణది పరువు హత్య కాదు
భువనగిరి క్రైం/గజ్వేల్: రియల్ ఎస్టేట్ వ్యాపారి, మాజీ హోంగార్డు రామకృష్ణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. రామకృష్ణది పరువు హత్య కాదని, ఆస్తి తగాదాల హత్యగానే భావిస్తున్నట్లు భువనగిరి ఏసీపీ వెంకటరెడ్డి తెలిపారు. భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. హత్య కేసులో 11 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఏ1గా యాదాద్రి భువనగిరి జిల్లా గౌరాయిపల్లికి చెందిన పల్లెపాటి వెంకటేశం, ఏ2గా రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన దోర్నాల యాదగిరి (బీబీనగర్ పీఎస్లో హోంగార్డు), ఏ3గా వలిగొండ మండలం దాసిరెడ్డి గూడెంకు చెందిన దంతూరి రాములు, ఏ4గా మోత్కూర్కు చెందిన సయ్యద్ లతీఫ్, ఏ5గా సిద్దిపేట జిల్లా యెల్లారెడ్డి నగర్కు చెందిన గోలి దివ్య, ఏ6గా సిద్దిపేట జిల్లా ఇందిరా నగర్ కు చెందిన మహ్మద్ అప్సర్, ఏ7గా సిద్దిపేట జిల్లా నర్సాపూర్కు చెందిన పొలసం మహేశ్, ఏ8గా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన మహ్మద్ సిద్దిఖీ, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన తోట్ల ధనలక్ష్మి, తోట్ల నరేందర్, తోట్ల భానుప్రకాశ్లను ఏ9, ఏ10, ఏ11 నిందితులుగా పేర్కొన్నారు. సోమవారం సయ్యద్ లతీఫ్, గోలి దివ్య, మహ్మద్ అప్సర్, పొలసం మహేశ్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మిగతా ఏడుగురిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఏసీపీ చెప్పా రు. నిందితుల నుంచి ఓ బొమ్మ పిస్టల్, రెండు కొడవళ్లు, సుత్తి, రూ.లక్ష నగదు, ఇండికా కారు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నామన్నారు. జమ్మపురం సర్పంచ్ అమృతరావును సాక్షిగా పేర్కొన్నారు. నిమ్మతోటలోకి తీసుకెళ్లి.. భూమిని చూపించడానికి జమ్మపురం సర్పంచ్ అమృతరావు ఈ నెల 15న రామకృష్ణను భువనగిరి పట్టణంలోని ఆయన నివాసం నుంచి తీసుకెళ్లారు. అమృతరావుతో వెళ్లిన భర్త తిరిగి రాకపోవడంతో భార్గవి 16న పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అమృతరావును పోలీసులు విచారించగా లతీఫ్ అతని అనుచరులు రామకృష్ణను గుండాల మండలం రామారంలోని నిమ్మతోటలోకి తీసుకెళ్లి తాడుతో కట్టి సుత్తి, బండ రాయితో కొట్టి దారుణంగా హత్య చేశారని చెప్పినట్టు ఏసీపీ తెలిపారు. శవాన్ని గోనె సంచిలో కట్టి టాటాబోల్ట్ కారులో పెట్టి అమృతరావును కూడా ఎక్కించుకుని బయలుదేరారని, కిలోమీటరు దూరం వచ్చాక అతన్ని అక్కడే వదిలేశారని, ఎవరికైనా చెబితే చంపేస్తామన్నారని చెప్పారు. ఆ తర్వాత వాళ్లు సిద్దిపేటకు వెళ్లినట్లు తెలిపారు. అమృతరావు సమాచారం మేరకు లతీఫ్, అతని భార్య దివ్య, మహేశ్, అప్సర్ను విచారించగా నేరాన్ని అంగీకరించినట్టు చెప్పారు. ఆస్తి కోసం మామను బెదిరించడంతో.. కొంతకాలం కిందట రామకృష్ణ ఉద్యోగం పోవడంతో మామ వెంకటేశంను ఆస్తిలో భాగం ఇవ్వాలని, లేకపోతే కోర్టులో కేసు వేస్తానని రామకృష్ణ బెదిరించాడని, దీన్ని జీర్ణించుకోలేకపోయిన వెంకటేశం రామకృష్ణను చంపాలని నిర్ణయించుకున్నాడని ఏసీపీ తెలిపారు.హోంగార్డు యాదగిరి ద్వారా రూ.10 లక్షలకు లతీఫ్తో సుపారీ మాట్లాడుకుని రూ.6 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చారన్నారు. గుండాల మండలం రామారంలో దారుణంగా హత్య చేసి శవాన్ని గోనె సంచిలో కట్టి కారులో తీసుకెళ్లి సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లక్డారం గ్రామంలోని కొండపోచమ్మ దేవాలయం దగ్గరలోని గోతిలో పాతిపెట్టారన్నారు. విచారణలో ఈ విషయాన్ని పోలీసులకు లతీఫ్ తెలపగా వెంటనే అక్కడికెళ్లి శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించామని, తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని చెప్పారు. తల, మెడ భాగాల్లో తీవ్రగాయాలు రామకృష్ణ తలకు తీవ్ర గాయమైందని, మెడ చుట్టూ ఉరేసినట్టు స్పష్టమైన గాయం కనిపిస్తోందని పోస్టుమార్టం చేసిన వైద్యులు వెల్లడించారు. నుదుటిపై, తల వెనుకభాగంలో గాయాలున్నాయన్నారు. చెవులు, ముక్కులోంచి రక్తం వచ్చిందని.. వీపు వెనుక కూడా గాయాలు కనిపిస్తున్నాయని చెప్పారు. మూత్రం పోసే నాళం వద్ద కూడా బలమైన గాయం కనిపించినట్లు వెల్లడించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని బంధువులు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లింగరాజుపల్లికి తీసుకెళ్లారు. 6 నెలల పసికందు, భార్గవికి అన్యాయం చేశారని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. -
రామకృష్ణ హత్య కేసు.. కీలక విషయాలు వెల్లడించిన ఏసీపీ
సాక్షి, భువనగిరి: మాజీ హోంగార్డు రామకృష్ణ హత్య కేసులో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. హత్య కేసుకు సంబంధించి భువనగిరి ఏసీపీ వెంకట్రెడ్డి మీడియాతో మాట్లాడారు. రామకృష్ణను మామ వెంకటేష్ హత్య చేయించారని తెలిపారు. లతీఫ్ గ్యాంగ్కు సుపారీ ఇచ్చి రామకృష్ణను హత్య చేయించాడని పేర్కొన్నారు. రామకృష్ణ హత్య కేసులో మొత్తం 11 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. గుండాల మండలానికి రామకృష్ణను తీసుకెళ్లి చంపినట్లు నిందితులు తెలిపారని చెప్పారు. లతీఫ్ గ్యాంగ్తో పాటు దివ్య, మహేష్, మహ్మద్ అప్సర్లను అరెస్ట్ చేశామని అన్నారు. భార్గవి తండ్రి వెంకటేష్ సుపారీ ఇచ్చి రామకృష్ణను చంపించారని వెల్లడించారు. రూ.10 లక్షల సుపారీ కోసమే ఈ హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని ఏసీపీ తెలిపారు. హోం గార్డ్ యాదగిరి, రాములుకు పరిచయం అయ్యాడని, అనంతరం రాములు లతీఫ్ గ్యాంగ్ను పరిచయం చేశాడని తెలిపారు. ఈ కేసులో అరెస్టైన 11 మందిలో నలుగురు నిందితులను రీమాండ్కు పంపించామని అన్నారు. మిగిలిన ఏడుగురిని మళ్లీ రీమాండ్ చేస్తామని ఏపీపీ పేర్కొన్నారు. -
సీఎం జగన్ చల్లగా ఉండాలంటూ.. అమ్మవారికి మొక్కు..
అనపర్తి (తూర్పుగోదావరి): అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో రెండేళ్లకోసారి నిర్వహించే సత్తెమ్మ తల్లి జాతర వైభవంగా నిర్వహించారు. సావరానికి చెందిన కర్రి వెంకటరెడ్డి పుట్టుకతో అంధుడు. నిరాశ చీకట్లు అలముకుంటున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలల పంట సచివాలయంలో ఇతనికి వెల్ఫేర్ అసిస్టెంట్గా ఉద్యోగం లభించింది. ఈ నేపథ్యంలో సోమవారం వృద్ధుని వేషం వేసుకుని అమ్మవారికి మొక్కు తీర్చుకున్నాడు. సీఎం జగన్ చల్లగా ఉండాలని కోరుకుంటూ స్నేహితుడు తాడి గోపికృష్ణారెడ్డి(మహిళ వేషధారి)తో కలసి అమ్మవారికి “ముసలోడికి దసరా పండుగ’ వేషధారణలో మొక్కు తీర్చుకున్నాడు వెంకటరెడ్డి. బీ టెక్.. డిఫరెంట్ లుక్ : అఖండ వేషధారణలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎన్.వీర్రాఘవరెడ్డి అదుర్స్ : పండితుల వేషధారణలో గ్రామస్తులు తగ్గేదే లే : పుష్ప సినిమాలోని వేషధారణలో యువకులు చదవండి: (మిమ్మల్ని విడిచి యాడకీ పోను..!) -
చిత్రపురిలో భూ కబ్జాలపై సీబీఐ విచారణ జరిపించాలి
కవాడిగూడ (హైదరాబాద్): చిత్రపురి భూ కబ్జాలపై ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణ జరిపించి పేద సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలను అప్పగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చే శారు. చిత్రపురి సొసైటీలో వందకోట్ల రూపాయల అవి నీతి జరిగిందని అధికారులు నివేదికలు ఇచ్చినా చర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటన్నారు. సోమవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద చిత్రపురి సాధన సమితి ఆధ్వర్యంలో పేద సినిమా కార్మికుల న్యాయపోరాట దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. పేదల ఇళ్ల స్థలాలను కొందరు ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుంటున్నారని అన్నారు. చిత్రపురి పేద సినీ కార్మికులు చేస్తున్న న్యాయ పోరాటానికి బీసీ సంక్షేమ సంఘం అండగా ఉంటుం దని పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ప్రస్తుత సొసైటీ పాలక మండలి సభ్యులు కార్మికుల సొంతింటి కలను నిర్వీర్యం చేస్తూ పేదల స్థలాలను ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కేటాయించి ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తున్నా రని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి సొసైటీలో జరిగే అవినీతి పై చర్యలు చేపట్టి పేద సినిమా కార్మికులకు న్యాయం చేయాలని డిమాం డ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. సినిమా కార్మికులు చేస్తున్న పోరాటం న్యాయమైందన్నారు. హౌసింగ్ సొసైటీలో అక్రమాలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
చంద్రబాబు సీఎం గా ఉన్నపుడే భారీ అక్రమ మైనింగ్
-
‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే భారీగా అక్రమ మైనింగ్’
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో భారీగా అక్రమ మైనింగ్ జరిగిందని గనులశాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే భారీగా అక్రమ మైనింగ్ జరిగిందని వెల్లడించారు. దానివల్ల రూ.230 కోట్లకుపైగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని, 2014 నుంచి 2019 వరకు విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ తెరలేపారని అన్నారు. ఆండ్రూస్ మైనింగ్ సంస్థ అక్రమ మైనింగ్ చేసినట్లు ప్రాథమిక నిర్ధారణ అయిందని తెలిపారు. టీడీపీ నేతలతో ఆండ్రూస్ మైనింగ్ సంస్థకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తించినట్లు పేర్కొన్నారు. అక్రమంగా 2లక్షల టన్నుల మైనింగ్ చేసినట్టు నిర్ధారించినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆండ్రూస్ మైనింగ్ సంస్థకు రూ.12.5 కోట్ల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. వేదాంత, విదేశాలకు సరఫరా చేయడంతో బాక్సైట్ తవ్వినట్లు భావిస్తున్నామని, ఇప్పటివరకు డీఎంఎల్ విచారణ చేశామని తెలిపారు. ఇప్పుడు మైనింగ్ జరిగిన ప్రాంతంలో విచారిస్తున్నామని, డ్రోన్ ద్వారా సర్వే మొదలుపెట్టామని పేర్కొన్నారు. వందల కోట్లు అక్రమాలు జరిగాయని, వాటన్నింటి పైనా ఇప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు. తమ శాఖ అధికారుల పాత్ర ఉన్నా సరే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. చదవండి: లేటరైట్ కొండలను పరిశీలించిన విశాఖ కలెక్టర్ -
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళగిరి చేరుకున్నారు. అక్కడ మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ వెంకట్రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్కు ఆయన హాజరయ్యారు. నూతన వధూవరులు అఖిలరెడ్డి, గౌతమ్రెడ్డిలను సీఎం జగన్ ఆశీర్వదించారు. సీఎం జగన్తో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఉన్నారు. -
ఇక నుంచి కమీషన్ 15 శాతమే
హైదరాబాద్: ఓటా, ఓయో ఆన్లైన్ బుకింగ్ సంస్థలకు ఇకనుంచి 15 శాతం కమీషన్ను మాత్రమే చెల్లిస్తామని, కాదంటే వచ్చేనెల 1 నుంచి దేశవ్యాప్తంగా హోటల్ ఆన్లైన్ బుకింగ్స్ను నిలిపివేస్తామని తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ఈ రెండు సంస్థలు తమ వ్యాపారాన్ని నిలువునా ముంచేసి రోడ్డున పడేలా చేశాయని అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తమకు ఆన్లైన్ ద్వారా వ్యాపారాన్ని కల్పించి లాభపడేలా చేస్తామంటే బడ్జెట్ కేటగిరీ హోటల్స్ నిర్వాహకులమంతా ఈ సంస్థల్లో చేరామని తెలిపారు. ఇలా వ్యాపారాన్ని చూపించినందుకుగాను వారికి 10 నుంచి 18% కమీషన్ ఇచ్చామన్నారు. అయితే, ఈ కమీషన్ ఇప్పుడు 40 శాతానికి చేరు కుందని, దీంతో తాము భారీగా నష్టపోతున్నామన్నారు. దేశవ్యాప్తంగా హోటల్ యాజమాన్యాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయన్నారు. వీరి వ్యవహారంపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. 25 నుంచి గదులు ఇచ్చేది లేదు తమ డిమాండ్లకు ఆన్లైన్ బుకింగ్ సంస్థలకు ఒప్పుకోకుంటే ఈ నెల 25 నుంచి తమ హోటల్స్, లాడ్జీల్లో గదులు ఇచ్చేది లేదని వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. హోటల్ రూమ్ వాస్తవ ధర రూ.1,500 ఉంటే వినియోగదారుల నుంచి రూ.2 వేలు వసూలు చేసి తమకు మాత్రం కేవలం రూ.700 ఇస్తున్నారన్నారు. రూమ్లపైనే కాకుండా ఫుడ్ వంటి వాటిపై కూడా తమ వద్ద డబ్బులు గుంజుతున్నారని వాపోయారు. రూ.వెయ్యిపైన వ్యాపారం జరిగితేనే పన్ను కట్టాలని, కానీ ఆన్లైన్ బుకింగ్ ద్వారా తమకు రూ.600, 700 మాత్రమే వస్తోందని హైదరాబాద్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్రెడ్డి తెలిపారు. ఆఫర్లు అంటూ చూపించే వెబ్సైట్లను ప్రజలు నమ్మవద్దని, నేరుగా వస్తే తక్కువ ధరల్లోనే రూమ్లను ఇస్తామని చెప్పారు. -
చెప్పినా..పట్టించుకోరా?
చిత్తూరు ఎడ్యుకేషన్: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తే సరిగా స్పందిం చడం లేదని జెడ్పీటీసీ సభ్యులు ఆరోపించారు. సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్య ధోరణిని వారు సభ దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్పర్సన్ గీర్వాణి అధ్యక్షతన మంగళవారం ఉదయం 10 గంటలకు స్థాయీ సంఘ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా 1, 7 కమిటీ సమావేశాలు నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్, పుంగనూరు జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా జిల్లా పరిషత్ ఆర్థిక పరిస్థితి అడుగుతున్నా ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. దీంతో పాలకమండలిని అనుమానించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ జెడ్పీటీసీలకు, వెంకటరెడ్డి యాదవ్కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్పందించిన చైర్పర్సన్ ఆర్థిక పరిస్థితుల నివేదికలను సభ్యులకు అందజేయడంతో వారు శాంతించారు. వెంకటరెడ్డి యాదవ్ మాట్లాడుతూ పుంగనూరు పాలెంపల్లి పంచాయతీ దగ్గరాజుచెరువుకు ఆయకట్టు అవసరముందని ఇరిగేషన్ అధికారులను కోరారు. పుంగనూరు ఎంపీడీఓ కార్యాలయానికి ప్రహరీ గోడ లేకపోవడంతో దాదాపు రూ.50 కోట్ల విలువ చేసే స్థలం అన్యాక్రాంతమవుతోందన్నారు. జెడ్పీ బడ్జెట్లోని ఆస్తు ల సంరక్షణ నిధులను గోడ నిర్మాణానికి విడుదల చేయాలని కోరారు. జిల్లాలోని అన్ని మండలాల్లో చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయని నాలుగు సంవత్సరాలుగా చెబుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దళితవాడల్లో ఓవర్హెడ్ ట్యాంకులను ఎందుకు శుద్ధి చేయించడం లేదని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను సభ్యులు ప్రశ్నించారు. గ్రామాల్లో మంచినీటి ట్యాంకుల ఏర్పాటుకు నిధులు ఇవ్వాలని కోరా రు. ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ శాఖల మధ్య సమన్వయం లేదని సభ్యులు మండిపడ్డారు. ఆర్డబ్ల్యూఎస్లో ఆస్తుల రిజిస్టర్లను అమలు చేయాలని చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పూతలపట్టు హైవే, చిత్తూరు గాంధీ రోడ్డు నుంచి అరగొండ వరకు ఇష్టానుసారం స్పీడ్ బ్రేకర్లు వేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నట్లు ఆర్అండ్బీ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానిక సంస్థలు నిర్వీర్యమవుతున్నా ప్రశ్నించరా.. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ విషయాన్ని పాలకమండలి సీఎం దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదని సభ్యులు ప్రశ్నించారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఎన్నికైనప్పటి నుంచి 14వ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేక ఉత్సవవిగ్రహాల్లా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై సభ్యులందరూ ఐక్యంగా పోరాడాలని జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్ పిలుపునిచ్చారు. విద్యుత్ ఎస్ఈపై చైర్పర్సన్ ఆగ్రహం.. స్థాయీ సంఘ సమావేశాలకు హాజరుకాని విద్యుత్ శాఖ ఎస్ఈపై జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారమివ్వకుండా నిలిచిపోయిన ఇతర శాఖల జిల్లా అధికారులకు మెమోలు జారీచేయాలని ఆమె ఆదేశించారు. కారణం లేకుండా గ్రామాల్లో ఇష్టానుసారంగా కరెంట్ కోత విధిస్తున్నారని చైర్పర్సన్ మండిపడ్డారు. దొంగలున్నారని గ్రామాల వాసులు భయపడుతుంటే రాత్రుల్లో కరెంట్ కట్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. సంఘ సమావేశాల్లో కోరం లేక 3, 4, 6 వాయిదా పడ్డాయి. సమావేశాల్లో ఇన్చార్జి సీఈఓ రవికుమార్ నాయుడు, ఏఓలు ప్రభాకర్రెడ్డి, వెంకట రత్నం, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. -
తార్నాకలో ఏవీ హైమా!
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్కు చెందిన ప్రముఖ డెవలపర్ అర్నవ్ విశిష్ట (ఏవీ) కన్స్ట్రక్షన్స్ తార్నాకలోని స్ట్రీట్ నంబర్–2లో ఏవీ హైమా రెసిడెన్సీ పేరిట లగ్జరీ ప్రాజెక్ట్ను నిర్మిస్తోంది. పూర్తి వివరాలు ఏవీ కన్స్రక్షన్స్ ఎండీ వెంకట్ రెడ్డి జక్కా తెలిపారు. ♦ 3,700 గజాల్లో రానున్న ఈ ప్రాజెక్ట్ మొత్తం ఐదంతస్తుల్లో ఉంటుంది. ప్రతి ఫ్లోర్లో 10 ఫ్లాట్లు.. మొత్తం 50 లగ్జరీ ఫ్లాట్లుంటాయి. 1,225 నుంచి 1,830 చ.అ.ల్లో ఫ్లాట్ల విస్తీర్ణాలున్నాయి. సెల్లార్+స్టిల్ట్ పార్కింగ్ కోసం కేటాయించాం. ♦ వసతుల విషయానికొస్తే.. పవర్ బ్యాకప్, జిమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్, ల్యాండ్స్కేపింగ్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, ఇంటర్కమ్ ఫెసిలిటీ, సోలార్ ఫెన్సింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింట్ పిట్స్ వంటివి ఏర్పాటు చేస్తున్నాం. ♦ నిర్మాణ పనులు తొలి అంతస్తు శ్లాబ్ లెవల్లో ఉంది. వచ్చే ఏడాదికి నిర్మాణం పూర్తవుతుంది. ఇప్పటివరకు ఏవీ కన్స్ట్రక్షన్ నుంచి 4 వెంచర్లలో 1,000 ఓపెన్ ప్లాట్లు, 25 అపార్ట్మెంట్లలో 1,000కి పైగా ఫ్లాట్లను అభివృద్ధి చేశాం. వచ్చే ఏడాది కాలంలో 500 ఓపెన్ ప్లాట్లు, 100 ఫ్లాట్లను నిర్మించాలని లకి‡్ష్యంచాం. -
హౌ డేర్ యూ..!
ఒంగోలు టౌన్: ‘జిల్లాలోని సీపీడబ్ల్యూ స్కీమ్స్కు సంబంధించి 1000 కోట్ల రూపాయల పనులతో ప్రతిపాదనలు చేశారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధికారపక్ష ఎమ్మెల్యేలనే పిలుస్తారా? ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పిలవరా? తమ నియోజకవర్గాలకు తెలియకుండా పనులు ఎలా చేస్తారు. ఎమ్మెల్యే హక్కులు, గౌరవం కాలరాసే అధికారం ఎవరిచ్చారు? ఈ విషయమై స్పీకర్కు ఫిర్యాదు చేస్తాం. ప్రివిలైజేషన్ కమిటీ దృష్టికి తీసుకువెళతాం’ అని సంతనూతలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్, మార్కాపురం శాసనసభ్యుడు జంకె వెంకటరెడ్డి అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక టీటీడీసీ మీటింగ్ హాలులో జరిగిన డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కో ఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ (దిశ)లో ఈమేరకు స్పందించారు. సమావేశం జరుగుతున్న పోడియం వద్ద పలువురు ఎంపీపీలతో కలిసి కొద్దిసేపు బైఠాయించారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ తమకు తెలియకుండా నియోజకవర్గంలో పనులపై ఎలా ప్రతిపాదనలు చేస్తారని ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులను నిలదీశారు. ఏ పనులకు ప్రతిపాదనలు చేశారో కూడా కనీస సమాచారం ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పనిచేసే అధికారులకు 30 సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఉద్దేశపూర్వకంగా పిలవలేదంటూ మండిపడ్డారు. కనీసం తమ నియోజకవర్గంలో ఏమి ప్రతిపాదనలు పెట్టారో కూడా ఇంతవరకు చెప్పలేదని తెలిపారు. తమ నియోజకవర్గాలకు సంబంధించిన పనులకు తాము లేకుండా ఎవరి కోసం ప్రపోజల్స్ పెట్టారని నిలదీశారు. ఈ విషయమై రాతపూర్వకంగా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యేతో ప్రారంభోత్సవాలా? మార్కాపురం శాసన సభ్యుడు జంకె వెంకటరెడ్డి జోక్యం చేసుకుంటూ తన నియోజకవర్గంలో అంగన్వాడీ భవన నిర్మాణాన్ని ప్రారంభించినా తనకు సమాచారం ఇవ్వడం లేదన్నారు. మాజీ శాసనసభ్యునితో అంగన్వాడీ భవనాన్ని ఎలా ప్రారంభిస్తారని అధికారులను నిలదీశారు. లోకల్ ఎమ్మెల్యేని పిలవాలన్న విషయాన్ని కూడా పక్కన పెట్టేస్తున్నారని మండిపడ్డారు. పొదిలిలో వికలాంగులకు ఇళ్ల పట్టాలు, హౌసింగ్ నిర్మాణాలు తాను లేకుండా ఎలా ఇస్తారని.. మాజీ ఎమ్మెల్యేతో ఎలా ఇప్పిస్తారని నిలదీశారు. ప్రతిపక్ష ఎమ్నెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లను పక్కన పెట్టడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాంటి అధికారులను సస్పెండ్ చేయాలి శాసనసభ్యులకు తెలియకుండా వారి నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. నెలరోజుల క్రితం అభివృద్ధి పనులు చేపట్టారని.. ఈ విషయమై ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి అధికారులను సస్పెండ్ చేసేవరకు ధర్నాకు కూర్చోవాలన్నారు. కొనకనమిట్ల ఎంపీపీ రామనారాయణరెడ్డి మాట్లాడుతూ మండలంలో జరిగే సమీక్ష సమావేశాలకు తమను ఆహ్వానించడం లేదన్నారు. చినారికట్ల గ్రామ పంచాయతీ సమావేశం గత ఏడాది సెప్టెంబర్లో పంచాయతీ సమావేశం తేదీని ప్రకటించి, మరో తేదీలో సభ్యులు లేకుండా ఏకపక్షంగా తీర్మానం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏకపక్షంగా తీర్మానాలు చేస్తూ సభ్యుల హక్కులను కాలరాస్తున్నారన్నారు. జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి జోక్యం చేసుకుంటూ మార్కాపురం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యునికి సమాచారం ఇవ్వకుండా, ఆహ్వానించకుండా పనులు ప్రారంభించిన అధికారులపై సమగ్ర విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని ఐసీడీఎస్, హౌసింగ్ అధికారులను ఆదేశించారు. -
‘కేసీఆర్కు వ్యవసాయంపై అవగాహన లేదు’
నల్లగొండ టూటౌన్: వ్యవసాయంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు ఏ మాత్రం అవగాహన లేదని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. 24 గంటల కరెంట్ వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోయే ప్రమాదముందని మండిపడ్డారు. సోమవారం నల్లగొండలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రైతుల కోసం ఏదో చేసినట్టుగా గొప్పలు చెబుతున్న సీఎం కేసీఆర్కు పోయే కాలం దగ్గరికొచ్చిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి ఒక మోసగాడి చేతిలో మోసపోయిందని, రాష్ట్రం ఏర్పడ్డ సంతోషం లేకుండా చేశారని అన్నారు. -
ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షన్దారుల సెల్ కన్వీనర్గా వెంకట్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షన్దారుల సెల్ రాష్ట్ర కన్వీనర్గా పీఆర్టీయూ మాజీ అధ్యక్షుడు పి.వెంకట్రెడ్డి నియమితులయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నియామక పత్రాన్ని అందజేశారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పేరి వెంకట్రెడ్డి పీఆర్టీయూ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా 15 ఏళ్లు, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా 9 ఏళ్లు పనిచేశారు. పదవీ విరమణ అనంతరం ఇటీవల బీజేపీలో చేరారు. వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఉపాధ్యాయ, ఉద్యోగులు, పెన్షన్దారుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. -
తాకట్టులో విద్యార్హత!
♦ ఫీజులు చెల్లించని విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల్లోనే.. ♦ మూడేళ్లు దాటినా బకాయిల ఊసెత్తని సర్కారు ♦ ఫీజులు చెల్లిస్తేనే ధ్రువపత్రాలు ఇస్తామంటున్న కాలేజీలు ♦ చెల్లించలేక కాలేజీల్లోనే వదిలేసిన విద్యార్థులు ఉప్పల్కు చెందిన వెంకట్రెడ్డి.. ఘట్కేసర్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో 2013–14లో ఎంటెక్ పూర్తి చేశాడు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఫీజు బకాయిలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో కాలేజీ యాజమాన్యానికి అతని ఫీజు అందలేదు. దీంతో టెన్త్, ఇంటర్, బీటెక్, ఎంటెక్ సర్టిఫికెట్లను ఫీజు చెల్లిస్తేనే ఇస్తామని యాజమాన్యం తమ వద్దే ఉంచుకుంది. సర్టిఫికెట్లు అవసరమైతే బకాయిలకు సంబంధించి మొత్తాన్ని డీడీS రూపంలో ఇచ్చి తీసుకెళ్లవచ్చని, సర్టిఫికెట్లు వెనక్కు ఇస్తే డీడీ ఇస్తామని వెసులుబాటు కల్పించింది. పోటీ పరీక్షలు, ఉద్యోగ ఇంటర్వూ్యలు తదితర సందర్భాల్లో వెంకట్రెడ్డి అప్పు చేసి కాలేజీలో డీడీలు సమర్పించి సర్టిఫికెట్లు పొందడం.. తిరిగి కాలేజీలో సమర్పించి డీడీని వెనక్కు తెచ్చుకోవడం చేస్తున్నాడు. రాష్ట్ర విభజన సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతన పథకాలపై నెలకొన్న అయోమయం ఇప్పటికీ తీరలేదు. కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నిధుల కేటాయింపులు, విడుదల సక్రమంగా ఉన్నప్పటికీ.. విభజన సమయం లో నెలకొన్న బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం ఊసెత్తడం లేదు. దీంతో విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం నానా అవస్థలు పడుతున్నా రు. 2013–14 విద్యా సంవత్సరంలో దాదాపు 1.18 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి రూ.248.05 కోట్ల మేర ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాల్సి ఉంది. అయితే ఆ నిధులు ఇప్పటికీ విడుదల కాలేదు. సాధారణంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించిన చెల్లింపులను విద్యా సంవత్సరం ముగిసిన తర్వాతి ఏడాదిలో విడతల వారీగా ప్రభుత్వం విడుదల చేస్తోంది. కొన్నేళ్లుగా ప్రభుత్వాలు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. ఆ ప్రకారం 2013–14కు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు, ఉపకార వేతనాలు 2014–15లో ఇవ్వాలి. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో పలు విభాగాల విభజన ఆలస్యం కావడంతో ఆ ఏడాది నిధుల విడుదలలో కొంత జాప్యం జరిగింది. ఈ క్రమంలో వార్షిక సంవత్సరం చివర్లో బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపినప్పటికీ పూర్తిస్థాయి నిధులు విడుదల కాలేదు. ఖజానా విభాగం వద్దే పలు బిల్లులు 2013–14 విద్యా సంవత్సరంలో ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం తెలంగాణ జిల్లాల నుంచి 14.31 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారి అర్హతను నిర్ధారించిన అధికారులు రూ. 2,296.20 కోట్లు అవసరమని లెక్కలు తేల్చి ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో 2014–15 వార్షిక సంవత్సరం చివర్లో నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ మేరకు ఫీజు రీయింబర్స్ మెంట్, ఉపకార వేతన బిల్లులను సంక్షేమ అధికారులు పాస్ చేశారు. ఆయితే వీటిలో పలు బిల్లులు ఖజానా విభాగంలోనే నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులకు నిధులు విడుదల కాకుండా బ్రేక్ పడింది. ఇలా మొత్తంగా రూ. 248.05 కోట్లు పెండింగ్లో ఉండిపోయాయి. ఈ బకాయిలను విడుదల చేయాలని సంక్షేమ శాఖలు ప్రభుత్వానికి పలుమార్లు నివేదించినప్పటికీ స్పందన మాత్రం శూన్యం. దీంతో ఆయా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధ్రువపత్రాలన్నీ కాలేజీల్లోనే.. రీయింబర్స్మెంట్ నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాక సంబంధిత విద్యార్థుల ధ్రువపత్రాలు కాలేజీల్లో ఉండిపోయాయి. ఫీజు బకాయిలు చెల్లిస్తేనే ధ్రువపత్రాలను ఇస్తామని కాలేజీలు తేల్చి చెబుతున్నాయి. దీంతో ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులు తక్కువ మొత్తంలో ఫీజులుండటంతో చెల్లింపులు జరిపి సర్టిఫికెట్లు తీసుకోగలిగారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కోర్సులు చదివిన విద్యార్థులు మాత్రం పెద్ద మొత్తంలో ఫీజులు బకాయి పడటంతో చాలామంది తమ సర్టిఫికెట్లను కాలేజీ యాజమాన్యాల వద్దే వదిలేశారు. దీంతో ఉన్నత చదువులు, ఉద్యోగ దరఖాస్తు సమయంలో కాలేజీల్లో బకాయిలకు సంబంధించిన మొత్తాన్ని డీడీ రూపంలో సమర్పించి వాటిని తాత్కాలిక పద్ధతిలో తెచ్చుకోవడం, తిరిగి కాలేజీలో సమర్పించి డీడీని వెనక్కు తీసుకోవడం చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు డీడీ చార్జీల భారం మించిపోతోంది. ఇందులోనూ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల అవసరాన్ని బట్టి ఫీజులను నిర్ధారించాయి. రెండుసార్లు డీడీలు ఇచ్చా.. ‘పీహెచ్డీ కౌన్సెలింగ్, అడ్మిషన్ సమయంలో రెండుసార్లు ఎంటెక్ సర్టిఫికెట్లు అవసరమైతే రూ.20 వేల మేరకు డీడీలు తీసి కాలేజీలో సమర్పించా. ప్రక్రియ ముగిశాక తిరిగి డీడీలను తీసుకున్నా’ అని ఓయూలో పీహెచ్డీ చేస్తున్న విద్యార్థిని సుష్మ ‘సాక్షి’తో అన్నారు. -
పారామెడికోస్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
నల్లగొండ టౌన్: పారామెడికోస్ శిక్షణను గ్రామీణ వైద్యులు సద్వినియోగం చేసుకోవాలని సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకన్న పిలుపునిచ్చారు. బుధవారం చిన వెంకట్రెడ్డి ఫంక్షన్హాల్లో జరిగిన సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం పదో వార్షికోత్సవ మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైద్యారోగ్యశాఖ పథకాలు విజయవంతం కావడంలో గ్రామీణ వైద్యులు అందిస్తున్న సహకారం మరవలేనిదర్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్యం అందిస్తున్న గ్రామీణ వైద్యులను ప్రభుత్వం మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలోని అన్ని మండలాలలో సంఘం సభ్యత్వాలను పూర్తి చేసి సంఘాలన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.బాలరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ వైద్యులకు అన్ని విధాలుగా సహాయ, సహకారాలను అందిస్తుందన్నారు. అంతకు ముందు సంఘం జిల్లా కార్యాలయం నుంచి పట్టణంలో ర్యాలీని నిర్వహించారు. సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం జిల్లాగౌరవాధ్యక్షుడు పొనుగోటి హనుమంతరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘం రాష్ర్ట గౌరవ సలహాదారు బి.వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు డిఎస్ఎన్ చారి, ప్రధాన కార్యదర్శి బొల్లెపల్లి శ్రీనివాసరాజు, కోశాధికారి జి.రాజశేఖర్రావు, ఉపాధ్యక్షుడు వనం యాదగిరిరావు, ప్ర చార కార్యదర్శి బ్రహ్మచారి, నర్సింహారెడ్డి, పి.వెంకటేశ్వర్లుగౌడ్, ఎ.కృష్ణారెడ్డి, ఎం.మధనాచారి, ఎ.యాదగిరి, నజీరుద్దిన్, పి.లలిత, కె.విజయేందర్రెడ్డి, మణికుమారి, వెంకటాచారి, ప్రభుదాస్, జహాంగీర్, వాసుదేవులు, చంద్రశేఖర్, కుతుబుద్దిన్, వీరన్న పాల్గొన్నారు. -
మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గుదిబండ వెంకటరెడ్డి(74) గురువారం తెల్లవారుజామున చనిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని తులసి ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన దుగ్గిరాల నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వెంకటరెడ్డికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. -
టీచర్లను అవమానించడమే
- పీఆర్టీయూ అధ్యక్షుడి సస్పెన్షన్పై ఉపాధ్యాయ సంఘాల మండిపాటు సాక్షి, హైదరాబాద్: పీఆర్టీయూ-తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్దన్రెడ్డిని సస్పెండ్ చేయడం టీచర్లను అవమానించడమేనని ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. బడిబాట సమీక్షలో హెచ్ఎంలను దూషించిన మహబూబ్నగర్ కలెక్టర్ తీరును ప్రశ్నించినందుకు ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదని పేర్కొన్నాయి. పై అధికారులకు సమాచారం ఇవ్వకుండా విలేకరుల సమావేశం పెట్టినంత మాత్రాన ఎలా సస్పెండ్ చేస్తారని పీఆర్టీయూ మాజీ అధ్యక్షుడు వెంకట్రెడ్డి ప్రశ్నించారు. సస్పెన్షన్ వెంటనే ఎత్తివేసి, కలెక్టర్ తీరుపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. టీచర్ల పట్ల అవమానకరంగా కలెక్టర్ వ్యవహరిస్తున్నారని టీపీటీఎఫ్ అధ్యక్షుడు కొండల్రెడ్డి పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా టీచర్లను బదిలీ చేసిన కలెక్టర్.. ఉపాధ్యాయ సంఘాల నేతలను సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెన్నయ్య, రవిశంకర్రెడ్డి, షౌకత్ అలీ తదితరులు ప్రశ్నించారు. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని పీఆర్టీయూ అధ్యక్షుడు హర్షవర్ధన్రెడ్డి పేర్కొన్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం
ధాన్యం సేకరణ సాఫీగా సాగాలి
పాఠశాలల ప్రారంభం లోగా పనులు పూర్తి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
4,63,983 మంది ఓటుకు దూరం
ప్రణాళిక సిద్ధం
డెంగీ నివారణకు సహకరించాలి
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి
కల్తీ విత్తనాలు అమ్మితే చర్యలు
తప్పక చదవండి
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
Advertisement