-
Venkatesh Election Campaign: ఖమ్మం లో సినీ హీరో వెంకటేష్ ఎన్నికల ప్రచారం (ఫొటోలు)
-
టీమిండియా కెప్టెన్కు టాలీవుడ్ స్టార్ హీరో విషెస్..!
టాలీవుడ్ హీరో వెంకటేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బర్త్ డే సందర్భంగా స్పెషల్ విషెస్ తెలిపారు. ఆయనతో దిగిన ఫోటోను ట్విటర్లో పంచుకున్నారు. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా హీరో వెంకటేశ్కు క్రికెట్ అంటే విపరీతమైన అభిమానం. టీమిండియా మ్యాచ్ ఉందంటే చాలు స్టేడియంలో అలా వాలిపోతారు. ఐపీఎల్లోనూ సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్కు మద్దతుగా ఉంటారు. కాగా.. వెంకటేశ్ కొత్త ఏడాదిలో సైంధవ్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. గుంటూరు కారం, హనుమాన్, నా సామిరంగ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడింది. Happy Birthday Hitman @ImRo45! Have an amazing one 🤗 pic.twitter.com/TF7Kv2qfwR— Venkatesh Daggubati (@VenkyMama) April 30, 2024 -
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి మార్పుపై బీజేపీ ట్విస్ట్?
పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత రాజకీయ భవిష్యత్తు గందరగోళంగా ఉంది. జంప్ కొట్టు... టికెట్ పట్టు అన్నది ఆ ఎంపీ సూత్రం. ఆయన జంప్ అయితే ఆయ్యారు కానీ అవతల టికెట్ ఇవ్వాల్సిన వాళ్లు మాత్రం కామ్గా చేతులెత్తేస్తున్నారు. దీంతో నెక్ట్స్ ఏం చేయాలో తోచని ఆయోమయ పరిస్థితుల్లో మరో పార్టీకి జంప్ ఆలోచనలో ఉన్నారు ఎంపీ వెంకటేష్.తాజాగా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డిని కలిశారు. పెద్దపల్లి టికెట్ ఇస్తే పార్టీలో చేరతానని కిషన్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం. అయితే పార్టీ హైకమాండ్తో మాట్లాడి చెప్తానని కిషన్ రెడ్డి అన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే బీజేపీ గోమా శ్రీనివాస్ను తమ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఆయనకు బీఫాం ఇవ్వలేదు. అయిన్పటికీ గోమాస శ్రీనివాస్ నేడు నామినేషన్ వేశారు. ఈ క్రమంలో అసలు పెద్దపల్లి బీఫామ్ను బీజేపీ ఎవరికి ఇవ్వనుంది, వెంకటేష్ నేత అసలు పోటీ చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి నామినేషన్ చివరి రోజైన రేపు(గురువారం) పెద్దపల్లి అభ్యర్థి మార్పుపై బీజేపీ ట్విస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకుడైన వెంకటేష్ నేత గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎంపీగా గెలిచారు. అయితే మళ్లీ బీఆర్ఎస్ నుంచి టికెట్ వస్తుందో రాదో అని భావించిన వెంకటేష్.. ఇటీవలే కాంగ్రెస్ గూటికి చేరారు. కేవలం ఎంపీ టికెట్ కోసం కండువా మార్చేసినా.. చివరికి నిరాశే మిగిలింది. పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ మొండిచేయి చూపింది. గడ్డం వివేక్ కొడుకు వంశీకి టికెట్ ప్రకటించడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక కాంగ్రెస్లో ఉండి ప్రయోజనం లేదంటూ మళ్లీ పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. వెంకటేష్ నేత బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి -
థ్రిల్లింగ్ శబ్దం
హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘శబ్దం’. ఈ సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో సిమ్రాన్, లైలా లీడ్ రోల్స్లో నటించగా, 7జీ శివ నిర్మించారు. తెలుగు–తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘శబ్దం’ టీజర్ను హీరో వెంకటేశ్ షేర్ చేశారు. ‘‘ఆది పినిశెట్టి– అరివళగన్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘వైశాలి’ విజయం సాధించింది. ఇప్పుడు ‘శబ్దం’ వస్తోంది. ఈ సినిమాలోని చాలా సన్నివేశాలను పర్వతాలు, పర్యాటక ప్రదేశాల్లో చిత్రీకరించాం. అలాగే 120 ఏళ్ల క్రితం నాటి లైబ్రరీని కూడా నిర్మించాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
విక్టరీ వినోదం
‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ (ఈ చిత్రాల్లో వరుణ్ తేజ్ మరో హీరో) చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్–దర్శకుడు అనిల్ రావిపూడిల కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించి, 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ‘‘వెంకటేశ్గారితో మూడోసారి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్తో ఆరోసారి, భీమ్స్తో తొలిసారి.. 2025 సంక్రాంతికి ‘విక్టరీ వినోదం’తో కలుద్దాం’’ అని ఈ సినిమా గురించి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఓ మాజీ పోలీస్ ఆఫీసర్, అతని మాజీ ప్రేయసి, అతని భార్య... ఈ ముగ్గురి పాత్రల చుట్టూ సాగే క్రైమ్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుందని ఈ చిత్రం యూనిట్ పేర్కొంది. -
వెంకటేష్-అనిల్ రావిపూడి సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడే?
-
Sagubadi: మార్కెట్ను బట్టి సేద్యం! ఆపై నేరుగా ప్రజలకే అమ్మకం..
రైతు దంపతులు బండారి వెంకటేష్, విజయకు ప్రయోగాలంటే ప్రాణం. చదివింది పదో తరగతే అయినా, ఉద్యాన పంటల సాగులో భేష్ అనిపించుకుంటున్నారు. ఇతర రైతులకు భిన్నంగా మార్కెట్కు తగిన పంటలు పండించడం, దళారులకు విక్రయించకుండా నేరుగా మార్కెటింగ్ చేయటం వారి సక్సెస్కు ముఖ్య కారణాలుగా నిలిచాయి. వెంకటేష్, విజయ దంపతులది జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామం. ఖర్భూజ (పుచ్చ) పంటను తమకున్న 3 ఎకరాల్లో నవంబర్ నుండి మే నెల వరకు గత మూడేళ్లుగా సాగు చేస్తున్నారు. దీని పంట కాలం 90 రోజులు. ఒకేసారి పొలం మొత్తంలో విత్తనాలు వేయకుండా, కొన్ని రోజుల వ్యవధిలో ఐదు దఫాలుగా విత్తుతారు. శివరాత్రి నుంచి ఎండలు ముదురుతాయి. అప్పటి నుంచి మే వరకు పుచ్చకాయలు మార్కెట్కు వచ్చేలా సాగు చేస్తారు. ప్రతి రోజు టన్ను నుంచి టన్నున్నర కాయలు జగిత్యాల మార్కెట్కు తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. మార్కెట్ల్లో డిమాండ్ ఉన్న ఖర్భూజ రకాలను సాగుచేస్తుంటారు. ఈ ఏడాది ఐదు రకాల ఖర్భూజ పండ్లను సాగు చేశారు. సాధారణ ఖర్భూజ (సూపర్ క్వీన్ రకం), లోపల పసుపు పచ్చగా బయట ఆకుపచ్చగా ఉండే విశాల్ రకం, లోపల ఎర్రగా బయట పసుపు పచ్చగా ఉండే అరోహి రకం, గుండ్రంగా ఉండే జన్నత్ రకం, మస్క్మిలన్ (జ్యూస్ రకం) సాగు చేశారు. ఈ విత్తనాలను బెంగళూర్ నుంచి తెప్పించారు. ఖర్భూజ విత్తనాలు వేయక ముందు భూమిలో కోళ్ల ఎరువు, పశువుల పేడ వేసి, రెండు సార్లు దున్నిస్తారు. తర్వాత, బెడ్ మేకర్తో బెడ్ తయారు చేసి, మల్చింగ్ షీట్ వేసి, డ్రిప్ ద్వారా సాగు నీరు అందిస్తుంటారు. రసాయన ఎరువులు, పురుగు మందులు పెద్దగా వాడకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకుంటారు. జగిత్యాలలో ఖర్భూజ కాయలు అమ్ముతున్న వెంకటేష్ 3 నెలలు కష్టపడి పంట పండించి, ఆ పంటను దళారులకు విక్రయిస్తే కిలోకు రూ. 5–6 ధర కూడా రాదు. అందుకని ఈ రైతు దంపతులు తామే నేరుగా వినియోగదారులకు అమ్ముతారు. విజయ సాయంత్రం తోటకు వెళ్లి కూలీల సాయంతో కాయలను తెంపుతుంటారు. వెంకటేష్ ఉదయం ఐదు గంటలకే నిద్ర లేచి, ఒక్కరిద్దరి సహాయంతో కాయలను ట్రాక్టర్లో లోడ్ చేస్తారు. ఇంటి వద్ద భోజనం చేసి ఉ. 8 గంటలకు జగిత్యాలకు వచ్చి, ప్రభుత్వ మహిళా డిగ్రి కళాశాల వద్ద అమ్ముతారు. ఈ సమాచారం సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో మంచి గిరాకీ వస్తోంది. కిలో రూ. 25 నుంచి 49 వరకు రకాన్ని బట్టి విక్రయిస్తున్నారు. మార్కెట్ కంటే తక్కువ ధరకు ఇవ్వడంతో పాటు కాయలు నాణ్యతగా, రంగు రంగుల్లో ఉండటంతో వినియోగదారులు సైతం ఈ రైతు దగ్గర కొనటానికి ఆసక్తి చూపుతున్నారు. ఖర్భూజ సాగుతో పాటు ఏడాది పొడవునా ఏదో రకం కూరగాయలు, పండుగలప్పుడు పూలు కూడా సాగు చేస్తున్నారు. ఏ పంట పెట్టినా, అందులో అధిక దిగుబడులు సాధిస్తారు. వ్యవసాయాన్ని వ్యాపారంలా మార్చితేనే రైతులకు లాభం అనే మాటను వీరు చేసి చూపిస్తున్నారు. పలువురు యువ రైతులు వీరిని అనుసస్తున్నారు. – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్ డిమాండ్ను బట్టి పంట మార్చుతాం! ఐదారు రకాల ఖర్భూజ కాయలు పండించేందుకు చాలా కష్టపడుతున్నాం. ఆ పంటను దళారులకు విక్రయిస్తే విత్తనాల ఖర్చు కూడా రావడం లేదు. మార్కెట్లో డిమాండ్ను బట్టి రకాన్ని మార్చుతాం. నా పంటకు నేనే రాజును. నేరుగా అమ్ముతున్నాను. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నాం. ప్రజలు మా దగ్గర కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్ను గమనించుకుంటూ.. భార్యభర్త కలిసి పనిచేస్తే వ్యవసాయం తృప్తిగా ఉంటుంది. మంచి ఆదాయమూ వస్తుంది. – బండారి వెంకటేష్, విజయ (62818 13273). నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఇవి చదవండి: Sagubadi: నేలపైన కాదు.. నేరుగా వేర్లకే 'తడి తగిలేలా'.. -
శ్రీవారి సేవలో వెంకటేశ్ కూతురు.. భర్తతో కలిసి తొలిసారి!
టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ రెండో కుమార్తె హయవాహిని ఇటీవలే వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్లో రామానాయుడులో జరిగిన పెళ్లికి బంధువులు, సన్నిహితులు, ఇండస్ట్రీ ప్రముఖులు హాజరయ్యారు. విజయవాడకు చెందిన డాక్టర్ నిశాంత్ పాతూరిని ఆమె పెళ్లాడారు. తాజాగా కొత్త జంట తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పెళ్లి తర్వాత తొలిసారిగా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. కొత్త జంటకు వేద పండితులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ఆశీర్వాదంతో పాటు నూతన దంపతులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
ఆరంభం అప్పట్నుంచేనా..?
‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ (వరుణ్ తేజ్ మరో హీరో) చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష, మృణాల్ ఠాకూర్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ సినిమాకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్ను పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను మే చివర్లో లేదా జూన్ మొదటి వారంలో ్రపారంభించాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని తెలిసింది. అలాగే ఈ సినిమాను ‘దిల్’ రాజు నిర్మించనున్నారని, సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది చిత్ర యూనిట్ టార్గెట్ అని సమాచారం. -
25 వసంతాలు పూర్తి చేసుకున్న 'రాజా'.. ఈ సినిమాను వదులుకున్న స్టార్ హీరోయిన్
రాజా.. 1999 మార్చి 18న ముప్పలనేని శివ దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి నిర్మించిన విజయవంతమైన సినిమా. ఇందులో వెంకటేష్, సౌందర్య జంటగా నటించారు. ఎస్. ఎ. రాజ్ కుమార్ అందించిన స్వరాలు విపరీతమైన ప్రజాదరణ పొందాయి. ఈ సినిమా 1998లో తమిళంలో కార్తీక్, రోజా జంటగా వచ్చిన 'ఉన్నిడతిల్ ఎన్నై కొడుతేన్' అనే సినిమాకు రీమేక్.. ఇప్పటికి టాలీవుడ్లో ఈ సినిమా విడుదలయ్యి 25 ఏళ్లు పూర్తి కావడం జరిగింది. ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేయడం అన్నది ఎప్పటి నుంచో ఉన్నదే. ఈ క్రమంలోనే రాజా చిత్రం తెలుగులో రీమేక్ అయి భారీ విజయాన్ని అందుకుంది. 1999లో విడుదలయిన ఈ సినిమా వెంకటేశ్- సౌందర్య జోడీని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. వాస్తవంగా 'రాజా'లో హీరోయిన్ మొదట సౌందర్య కాదట. ఈ సినిమాకు మొదటగా రోజాను హీరోయిన్గా అనుకున్నారట. అందుకు కారణం రాజా మాతృక అయిన 'ఉన్నిడతిల్ ఎన్నై కొడుతేన్' అనే చిత్రంలో మొదట నటించింది రోజానే కావడం. తమిళంలో వచ్చిన ఆ సినిమాతో ఆమెకు ఎనలేని క్రేజ్ వచ్చింది. తమిళంలో లీడ్ రోల్స్లో కార్తిక్, రోజా, అజిత్ నటించారు. తమిళంలో ఈ సినిమాకు ప్రేక్షకుల దగ్గర నుండి ప్రశంసలతో పాటు అవార్డులు కూడా చాలానే అందాయి. ఈ సినిమాకు ఉత్తమ నటిగా తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు అందుకున్న రోజా తెలుగు రీమేక్లో కూడా నటించాలని నిర్ణయించుకుంది. దానికి తనకు అవకాశం లభించింది కూడా. కానీ ఆ సమయంలో రోజా వద్ద అవసరమైన డేట్స్ లేకపోవడంతో సౌందర్యను సంప్రదించి రాజా సినిమాను పట్టాలెక్కించారు. ఇందులో వెంకీ, సౌందర్య కెమిస్ట్రీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. వీరిద్దరిని ఆన్ స్క్రీన్ క్యూట్ కపుల్గా అనేవారు. అంతలా ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ అయింది. ఆ రోజుల్లో రాజా సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వచ్చాయి. విడుదలైన అన్ని చోట్లు 50రోజులు ఆడిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో మొదట దొంగగా కనిపించిన వెంకీ ఆ తర్వాత తన సరైన నటనతో ప్రేక్షకులను కదిలించాడు. అంతే స్థాయిలో సౌందర్య తన సెంటిమెంట్తో కట్టిపడేసింది. 71 కేంద్రాల్లో రాజా సినిమా 100 రోజులు ఆడింది. 4 సెంటర్లలో రజతోత్సవం జరుపుకున్న చిత్రంగా వెంకటేశ్ కెరియరల్లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా ఒరియా, కన్నడ, హిందీ, బెంగాలీ బంగ్లాదేశ్, బెంగాలీ భాషల్లో రీమేక్ అయ్యింది. ఈ సినిమాకు ఉత్తమ ఉత్తమ నటిగా సౌందర్యకు నంది అవార్డు దక్కింది. రాజా విడుదలయ్యి నేటితో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది. -
సైలెంట్గా హీరో వెంకటేశ్ రెండో కూతురి పెళ్లి.. ఫోటోలు వైరల్
-
చాలా సింపుల్గా హీరో వెంకటేశ్ రెండో కూతురి పెళ్లి!
విక్టరీ వెంకటేశ్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన రెండో కూతురు హయవాహిని వివాహం బంధంలోకి అడుగు పెట్టారు. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుమారుడు నిషాంత్తో కలిసి ఏడడుగులు వేశారు. గతేడాద అక్టోబర్లో ఎంతో సింపుల్గా వీరి నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్లో జరిగిన ఈ వేడుకకు మహేశ్ బాబు, రానా, నాగచైతన్య తదితర హీరోలు హాజరై కాబోయే వధూవరులను ఆశ్వీర్వదించారు. ఇక శుక్రవారం(మార్చి 15) జరిగిన పెళ్లి వేడుకకి బయటి వారెవరెవరిని ఆహ్వానించలేదు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో రామా నాయుడు స్టూడియోలో చాలా సింపుల్గా పెళ్లి జరిపించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, వెంకీ, నీరజ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నాడు. పెద్దమ్మాయి ఆశ్రితకు 2019లో పెళ్లి జరిగింది. -
హీరో వెంకటేశ్ ఇంట పెళ్లి సంబరాలు.. మెహందీ సెలబ్రేషన్స్ ఇలా జరిగాయ్ (ఫోటోలు)
-
చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలయ్య కలిసి నటించిన ఏకైక మూవీ!
మల్టీస్టారర్ సినిమాలంటే జనాలకు మహా క్రేజు.. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఇప్పటివరకు మల్టీస్టారర్ సినిమాలకు ఢోకా లేదు. ఇద్దరు హీరోల కాంబినేషన్ ఎలా ఉందో చూడాలని అభిమానులు తెగ ముచ్చటపడుతుంటారు. అయితే అప్పట్లోనే నలుగురు స్టార్ హీరోలు.. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ కలిసి నటించారు. వీళ్లంతా కలిసి ఏ సినిమా చేశారా? అని ఆలోచిస్తున్నారా? ఆ మల్టీస్టారర్ మూవీ ఇదే ఒకరు హీరోగా నటిస్తే.. మిగిలిన ముగ్గురు అతిథులుగా మెరిశారు. ఆ సినిమా పేరే త్రిమూర్తులు. ఇందులో వెంకటేశ్, అర్జున్, రాజేంద్రప్రసాద్ హీరోలుగా నటించారు. ఖుష్బూ, శోభన, అశ్విని హీరోయిన్లుగా నటించారు. కె. మురళీ మోహనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1987లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మల్టీస్టారర్ సినిమాలో మెగాస్టార్, కింగ్ నాగ్, బాలయ్య గెస్టులుగా కనిపించారు. వీరు మాత్రమే కాదు. ఇండస్ట్రీ అంతా దిగింది. అతిరథులంతా ఇందులోనే కృష్ణ, విజయ నిర్మల, కృష్టంరాజు, చంద్రమోహన్, మురళీ మోహన్, విజయశాంతి, పద్మనాభం, రాధ, భానుప్రియ, శారద, రాధిక, శారద, జయమాలిని, అనురాధ, వై.విజయ.. ఇలా పలువురు సెలబ్రిటీలు కనిపించారు. ఇంతమంది నటించిన ఏకైక సినిమా త్రిమూర్తులు అనే చెప్పవచ్చు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా క్లిక్ అవలేదు. భారీ తారాగణం ఉన్నప్పటికీ సినిమాలో విషయం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఆడలేనట్లు అర్థమవుతోంది. టి.సుబ్బిరామిరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి బప్పి లహరి సంగీతం అందించాడు. ఐదు పాటలకు వేటూరి సుందరరామమూర్తి లిరిక్స్ అందించాడు. ఇది హిందీ మూవీ నసీబ్కు రీమేక్గా తెరకెక్కింది. చదవండి: అక్క భర్తతో ప్రేమలో పడ్డా.. నేను చెడిపోయినా పర్వాలేదని లొంగిపోయాను: జయలలిత -
వెంకటేశ్కి జోడీగా...
హీరోయిన్గా మీనాక్షీ చౌదరి ప్రస్తుతం ఫుల్ఫామ్లో ఉన్నారు. తమిళ హీరో విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’, వరుణ్ తేజ్ ‘మట్కా’, దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’, విశ్వక్ సేన్ పదో చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు ఈ యంగ్ బ్యూటీ. కాగా మీనాక్షీకి హీరోయిన్గా మరో సూపర్ చాన్స్ వచ్చిందని టాక్. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్–దర్శకుడు అనిల్ రావిపూడిల కాంబినేషన్లో ఓ విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ‘దిల్’ రాజు నిర్మించనున్నారని సమాచారం. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా తొలుత త్రిష పేరు వినిపించింది. తాజాగా మీనాక్షీ చౌదరి పేరు తెరపైకి వచ్చింది. వెంకీ వంటి స్టార్ హీరో సినిమా కాబట్టి మీనాక్షీ కూడా ఆల్మోస్ట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చేసినట్టేనని అంటున్నారు ఫిల్మ్నగర్ వాసులు. ఇక ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారని, ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ను చిత్ర యూనిట్ పరిశీలిస్తోందని ఫిల్మ్నగర్ సమాచారం. ఇంకా.. కథ రీత్యా ఇందులో ఓ గెస్ట్ రోల్ ఉందని, ఈ పాత్రలో రవితేజ లేదా బాలకృష్ణ కనిపిస్తారని భోగట్టా. -
ఆ హిట్ ఫ్రాంచైజీలోకి త్రిష.. జోడీ కుదిరిందా?
హీరో వెంకటేశ్, హీరోయిన్ త్రిష నాలుగోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. వీరిద్దరూ గతంలో ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ (2007), ‘నమో వెంకటేశ’(2010), ‘బాడీగార్డ్’(2012) వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ హిట్ జోడీ ఇప్పుడు నాలుగోసారి కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీకి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. వెంకటేశ్, వరుణ్ తేజ్లతో ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ వంటి సినిమాలు తీసి, హిట్ అందుకున్నారు అనిల్ రావిపూడి. ఈ ఫ్రాంచైజీలో ‘ఎఫ్ 4’ సినిమా ఉంటుందని ‘ఎఫ్ 3’ క్లైమాక్స్లో హింట్ ఇచ్చింది చిత్రయూనిట్. ‘ఎఫ్ 2, ఎఫ్ 3’ సినిమాలు నిర్మించిన ‘దిల్’ రాజే తాజాగా వెంకీ–అనిల్ కాంబినేషన్ లో మూడో సినిమా నిర్మించనున్నారట. ఈ మూవీలో హీరోయిన్గా త్రిషని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. అంటే.. దాదాపు పుష్కరకాలం తర్వాత వెంకటేశ్–త్రిష మరోసారి జోడీగా నటించనున్నారన్నమాట. పూర్తి గ్రామీణ నేపథ్యంలో రూపొందనున్ను ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. వెంకటేశ్తో అనిల్ రావిపూడి తెరకెక్కించేది ‘ఎఫ్ 4’ సినిమానా? లేక మరొక చిత్రమా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్ నేత
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, పెద్దపల్లి/సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ డాక్టర్ బొర్లకుంట వెంకటేశ్ నేత ఆ పార్టీకి ఝలక్ ఇచ్చారు. కొంతకాలంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ వైఖరితో అసంతృప్తితో ఉన్న ఆయన... ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటి కి చేరారు. మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత అడుగుపెట్టి నేతలతో సమీక్షించిన రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. మరోవైపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన టీటీడీ మాజీ సభ్యుడు మన్నె జీవన్రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు ఆ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత రెహ్మాన్, పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం కేసీ వేణుగోపాల్, రేవంత్రెడ్డితో కలిసి వెంకటేష్ నేత, మన్నె జీవన్రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కు చెందిన ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి (మ హబూబ్నగర్), జనంపల్లి అనిరుద్రెడ్డి (జడ్చర్ల), గవినోళ్ల మధుసూదన్రెడ్డి (దేవరకద్ర), వీర్లపల్లి శంకర్ (షాద్నగర్), ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ మల్లు రవి, మాజీ మంత్రి డాక్టర్ జి.చిన్నారెడ్డి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరిగి సొంత గూటికి... మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్కు చెందిన వెంకటేశ్ నేత 2018 అసెంబ్లీ ఎన్నికలకు మందు రాజకీయల్లోకి వచ్చారు. కాంగ్రెస్ తరఫున 2018లో చెన్నూర్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి 2019లో పెద్దపల్లి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. తాజాగా లోక్సభ ఎన్నికల వేళ తిరిగి సొంతగూటికి చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది. టికెట్ ఇస్తే ధర్నా చేస్తా: శేజల్ ఎంపీ వెంకటేశ్ నేత బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను కాపాడాడని ఆరిజిన్ డెయిరీ సీఏవో బొడపాటి శేజల్ ఆరోపించారు. తనకు అన్యాయం జరిగిందని ఎంపీకి చెబితే న్యాయం చేస్తామని మాటిచ్చి మోసం చేశారని మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. కాంగ్రెస్ ఇలాంటి వారిని చేర్చుకొని ఎన్నికల్లో టికెట్ ఇస్తే ఢిల్లీలో ధర్నా చేస్తానని, ఎన్నికల్లో వెంకటేశ్ నేతకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని హెచ్చరించారు. -
బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్లో చేరిన సిట్టింగ్ ఎంపీ
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలు కాంగ్రెస్లో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇక, పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్లో చేరారు. వివరాల ప్రకారం.. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్లో చేరిపోయారు. తాజాగా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికి ఎంపీ వెంకటేష్ వెళ్లారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. వెంకటేష్ను పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికారు. కాంగ్రెస్ లో చేరిన BRS పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత BRS Peddapally MP Venkatesh Neta joined Congress ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన BRS పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత)… pic.twitter.com/To99hdcLru — Congress for Telangana (@Congress4TS) February 6, 2024 కాగా, ఎంపీ వెంకటేష్ 2019 లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. తాజాగా బీఆర్ఎస్కు గుడ్బై చెప్పి మళ్లీ హస్తం గూటికి చేరారు. ఇక, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్టు సమాచారం. ఇక, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, లోక్సభ ఎన్నికల వేళ సిట్టింగ్ ఎంపీ పార్టీ మారడం బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
సీక్వెల్ కోసం వెంకటేశ్– అనిల్ రావిపూడి ప్లాన్
‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాల (వరుణ్ తేజ్ మరో హీరో) కోసం కలిసి పని చేసిన హీరో వెంకటేశ్–దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో మరో మూవీ తెరకెక్కనుందనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. ఇటీవల అనిల్ రావిపూడి ఓ కథను వెంకటేశ్కు వినిపించారట. ఈ కథ బాగా నచ్చడంతో వెంకీ గ్రీన్సిగ్నల్ ఇచ్చారట. ‘దిల్’ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. అయితే వెంకటేశ్–అనిల్ రావిపూడి కాంబినేషన్లోని సినిమా ‘ఎఫ్ 4’ అవుతుందా? లేక వేరే కొత్త కథా? అనే విషయాలపై స్పష్టత రావాల్సింది. మరి... వెంకటేశ్–అనిల్ రావిపూడిల కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా సెట్స్ పైకి వెళ్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
అఫీషియల్: మూడు వారాల్లోనే ఓటీటీకి సైంధవ్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఈ ఏడాది సంక్రాంతి ఏకంగా నాలుగు సినిమాలు పోటీ పడ్డాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగా చిత్రాలు సందడి చేశాయి. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. మిగిలిన మూడు చిత్రాలకు మిక్స్డ్ టాక్ వచ్చింది. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రాల ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలు నెల రోజుల తర్వాతే ఓటీటీ వస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వెంకటేశ్ నటించిన సైంధవ్ చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. (ఇది చదవండి: సంక్రాంతి మూవీస్.. ఓటీటీల్లో రిలీజయ్యేది ఎప్పుడంటే?) శైలేశ్ కొలను డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ ప్రకటించింది. జనవరి 13న థియేటర్లలో విడుదలైన వెంకటేశ్ 'సైంధవ్' అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమాను స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. -
Saindhav OTT: ఓటీటీలోకి వెంకటేశ్ కొత్త సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే!?
ఈసారి సంక్రాంతికి నాలుగు సినిమాలొచ్చాయి. వాటిలో మహేశ్, వెంకటేశ్, నాగార్జున లాంటి స్టార్ హీరోల మూవీస్ ఉన్నాయి. కానీ ఇవి కాకుండా ఎలాంటి అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చిన 'హనుమాన్'.. పండగ విన్నర్గా నిలిచింది. మిగతా సినిమాలతో పోలిస్తే వెంకీమామ 'సైంధవ్'.. ఊహించని రీతిలో ఫెయిలైంది. ఇప్పుడుది అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి రానుందట. ఇప్పటికే డేట్ కూడా ఫిక్స్ అయిందని అంటున్నారు. విక్టరీ వెంకటేశ్ 75వ సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను తీశాడు. ఇప్పటి ట్రెండ్ తగ్గట్లు యాక్షన్ విత్ ఫ్యామిలీ సెంటిమెంట్ కాన్సెప్ట్ ఎంచుకున్నారు. 'సైంధవ్' పేరుతో మూవీ తీశారు. విడుదలకు కొన్నిరోజుల ముందు వెంకీ బాగా ప్రమోషన్స్ చేయడంతో కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. అలా సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలోకి మూవీ వచ్చింది. కానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో ఫెయిలైంది. (ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్) సినిమా కాస్త ల్యాగ్ ఉండటంతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కరెక్ట్గా వర్కౌట్ కావడం.. ఫెయిల్ కావడానికి కారణాలని చెప్పొచ్చు. అలానే జనవరి 12న వచ్చిన 'హనుమాన్'కి సూపర్ హిట్ టాక్.. 'గుంటూరు కారం'కి మిక్స్డ్ టాక్ రావడం కూడా 'సైంధవ్'కి మైనస్ అయిందేమో. ఇలా థియేటర్లలో పూర్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు ఓటీటీలోకి తీసుకొచ్చేయబోతున్నారట. 'సైంధవ్' మూవీ డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ.. దాదాపు రూ.15 కోట్లకు దక్కించుకుందట. లెక్క ప్రకారమైతే ఫిబ్రవరి నెలాఖరున ఓటీటీలోకి తీసుకురావాలని అనుకున్నారని, టాక్ తేడా కొట్టేయడంతో నెలలోపే అంటే ఫిబ్రవరి 2 లేదా 9న స్ట్రీమింగ్ చేయబోతున్నారనే మాట వినిపిస్తోంది. కొన్నిరోజులు ఆగితే దీనిపై ఓ క్లారిటీ వచ్చేస్తుందిలే! (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) -
చంద్రబాబుకు ఊరట ఇవ్వడానికి నిరాకరణ
-
భారీ ధరకు సైంధవ్ ఓటీటీ రైట్స్.. పోటీపడి మరీ దక్కించుకున్న ఆ సంస్థ!
టాలీవుడ్ హీరో వెంకటేశ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ సైంధవ్. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటించింది. వెంకటేశ్ నటిస్తోన్న 75వ చిత్రానికి శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీలైన ఈ చిత్రానికి మొదటి రోజే మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్ర ఇప్పటికే సంక్రాంతి బరిలో గుంటూరు కారం, హనుమాన్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. వెంకటేశ్ సైతం సైంధవ్ సినిమాతో పోటీలో నిలిచారు. అయితే ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తుండగా ఓటీటీ ఫ్లాట్ఫామ్ గురించి నెట్టింట చర్చ మొదలైంది. వెంకీమామ చిత్రం ఏ ఓటీటీకి రానుందని తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైంధవ్ ఓటీటీ డీల్ వివరాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు సమాచారం. భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం పోటీపడి సొంతం చేసుకున్నట్లు నెట్టింట వార్త తెగ వైరలవుతోంది. అయితే సినిమా రిలీజైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. -
‘సైంధవ్’ మూవీ రివ్యూ
టైటిల్: సైంధవ్ నటీనటులు: వెంకటేశ్,నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, ఆర్య, బేబీ సారా, జయప్రకాశ్ తదితరులు నిర్మాణ సంస్థ: నిహారిక ఎంటర్టైన్మెంట్ దర్శకత్వం: శైలేష్ కొలను సంగీతం: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ: ఎస్. మణికందన్ ఎడిటర్: గ్యార్రి బి.హెచ్ విడుదల తేది: జనవరి 13, 2024 సైంధవ్ కథేంటంటే... ఈ సినిమా కథ అంతా చంద్రప్రస్థ అనే ఫిక్షనల్ టౌన్ చుట్టూ తిరుగుతుంది. అక్కడ డ్రగ్ సరఫరా, గన్ బిజినెస్..లాంటి అసాంఘిక కార్యక్రమాలు విచ్చలవిడిగా జరుగుతుంటాయి. కార్టెల్ లీడర్ విశ్వామిత్ర (ముఖేష్ రిషి) ఆధ్వర్వంలో ఇదంతా జరుగుతుంది. ఓ సారి విశ్వామిత్రకు 20 వేలమంది యువతతో పాటు గన్స్, డ్రగ్స్ సరఫరా చేసే డీల్ వస్తుంది. ఆ పనిని తన వద్ద పని చేసే మాఫియా లీడర్ వికాస్ మాలిక్(నవాజుద్దీన్ సిద్ధిఖి)కి అప్పగిస్తాడు. అతను తన అనుచరురాలు జాస్మిన్(ఆండ్రియా)తో ఈ డీల్ సక్రమంగా జరిగేలా చూస్తుంటాడు. అదే సమయంలో ఐదేళ్ల క్రితం వెళ్లిపోయిన సైంధవ్ కోనేరు అలియాస్ సైకో(వెంకటేష్) తిరిగి చంద్రప్రస్థ టౌన్కి వస్తాడు. అతనికి కూతురు గాయత్రి(సారా పాలేకర్) అంటే ప్రాణం. చంద్రప్రస్థలో పోర్ట్లో పని చేస్తూ కూతురుతో కలిసి జీవిస్తుంటాడు. పక్కింట్లో నివాసం ఉంటున్న మనో(శ్రద్ధా శ్రీనాథ్)కి సైంధవ్ అంటే చాలా ఇష్టం. భర్త (గెటప్ శ్రీను) కొట్టడంతో అతనిపై కేసు పెట్టి, ఒంటరిగా ఉంటుంది. గాయత్రిని సొంత కూతురిలా చూసుకుంటుంది. ఓ సారి స్కూల్లో సడెన్గా పడిపోతుంది గాయత్రి. ఆస్పత్రికి తీసుకెళ్తే.. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే నరాల వ్యాధి సోకిందని, పాప బతకాలంటే రూ. 17 కోట్లు విలువ చేసే ఇంజెక్షన్ ఇవ్వాలని డాక్టర్లు చెబుతారు. డబ్బు కోసం విశ్వామిత్ర, వికాస్ మాలిక్ను చంపడానికి మైఖేల్ (జిషు సేన్ గుప్తా)తో డీల్ కుదుర్చుకుంటాడు సైంధవ్. అసలు సైంధవ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఐదేళ్ల క్రితం ఏం జరిగింది? కలిసి బిజినెస్ చేస్తున్న విశ్వామిత్ర, వికాస్ మాలిక్లను చంపేందుకు మైఖేల్ ఎందుకు ప్రయత్నించాడు? కూతురు ప్రాణాలు కాపాడుకోవడం కోసం సైంధవ్ ఏం చేశాడు? చివరకు కూతుర్ని రక్షించుకున్నాడా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ‘గతాన్ని పక్కన పెట్టి సామాన్య జీవితం గడుపుతున్న హీరోకి సమస్య రావడం.. మళ్లీ పాత శత్రువులతో యుద్ధం చేయడం.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. భారీ యాక్షన్ సీన్తో కథను ముగించడం’ ఈ తరహా కాన్సెప్ట్తో భాషా మొదలు కొని మొన్నటి జైలర్ వరకు చాలా సినిమాలు వచ్చాయి. సైంధవ్ కథ కూడా ఇలానే ఉంటుంది. కథలో యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్ అన్నీ ఉన్నా.. ఏ ఒక్కటీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దలేకపోయాడు దర్శకుడు శైలేష్ కొలను. కథను బలంగా రాసుకున్నాడు కానీ.. స్క్రీన్ప్లేని సరిగా పట్టించుకోలేకపోయాడు. ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేలా ఒక్క సన్నివేశాన్ని కూడా తీర్చిదిద్దలేకపోయాడు. కొన్ని సన్నివేశాల మధ్య కనెక్షన్ కూడా సరిగా లేదు. ఎంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా.. తెరపై చూస్తే కొంతవరకు అయినా నమ్మేలా ఉండాలి. చుట్టూ వందల మంది ఉండడం.. వారి చేతుల్లో పెద్ద పెద్ద గన్స్ ఉన్నా.. హీరో మాత్రం ఓ చిన్న గన్తో వాళ్లందరినీ మట్టుపెట్టడం ఏంటి? పైగా ఓ సీన్లో హీరోకి బుల్లెట్ తాకుతుంది.. అది స్పష్టంగా చూపిస్తారు కూడా.. కాసేపటికి హీరో ఒంటిపై ఆ గాయం కూడా కనిపించదు? ఇదెలా సాధ్యం? పది నిమిషాల్లో ఇంటికి వచ్చిన విలన్లను ‘లెక్క మారుతుందిరా నా కొడకల్లారా’ అంటూ కొట్టి చంపడమే కాదు ఎక్కడో దూరంలో ఉన్న పోర్ట్కి వెళ్లి వాళ్లను సముద్రంలో పడేసి వస్తాడు? ఎంత లెక్క మారినా.. అది ఎలా సాధ్యం అవుతుంది? ఇలాంటి లాజిక్ లెస్ సీన్స్ చాలానే ఉన్నాయి. ఏ దశలోనూ సినిమా రక్తి కట్టదు. డ్రగ్స్ డీల్.. 20 వేల మంది యువత సరఫరా అంటూ సినిమాను చాలా ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. హీరో ఎంట్రీ తర్వాత కథ ఫాదర్-డాటర్ సెంటిమెంట్ వైపు సాగుతుంది. అయితే సినిమా ప్రారంభంలోనే సైకో వచ్చాడని విలన్లు భయపడడం చూస్తే.. ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే ఆ స్టోరీని పక్కకి పెట్లి ఫాదర్-డాటర్ సెంటిమెంట్తో ఫస్టాఫ్ని నడిపించాడు. డబ్బు కోసం హీరో ప్రయత్నించడం.. ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యలతో ఫస్టాఫ్ పర్వాలేదనిపిస్తుంది. కానీ సెకండాఫ్లో మాత్రం కేవలం యాక్షన్ ఎపిసోడ్లపైనే ఎక్కువగా ఫోకస్ చేశాడు. అందువల్ల భావోద్వేగాలు బలంగా పండలేదు. పోనీ యాక్షన్ ఎపిసోడ్స్ అయినా ఆసక్తికరంగా ఉంటాయా అంటే.. అదీ లేదు. కాల్పుల మోతే తప్ప ఏమీ ఉండదు. కొన్ని పాత్రలకు సరైన ముగింపు ఉండదు. ఇక క్లైమాక్స్ ఎలా ఉంటుందో సినిమా ప్రారంభంలోనే తెలిసిపోతుంది. తెరపై కూడా అంత ఆసక్తికరంగా చూపించలేకపోయాడు. కథ బాగుంది కానీ స్క్రీన్ప్లే విషయంలో దర్శకుడు ఇంకాస్త జాగ్రత్త పడుంటే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. సైంధవ్ పాత్రలో ఒదిగిపోయాడు వెంకటేశ్. యాక్షన్ తో పాటు ఎమోషనల్ సీన్స్లో కూడా అద్భుతంగా నటించాడు. తెరపై స్టైలిష్గా కనిపించాడు. వెంకటేశ్ తర్వాత ఈ సినిమాలో బలంగా పండిన పాత్ర నవాజుద్దీన్ సిద్ధిఖిది. ఆయన పాత్రను తిర్చిదిద్దిన విధానం బాగుంది. తెలుగు,హిందీని మిక్స్ చేస్తూ ఆయన చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. మనోగా శ్రద్ధా శ్రీనాథ్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. జాస్మిన్గా ఆండ్రియా యాక్షన్ సీన్ అదరగొట్టేసింది. ఆర్యది కేవలం అతిథి పాత్రే. ముఖేష్ రుషి, జిష్షు సేన్ గుప్తా, రుహానీ శర్మ, జయప్రకాశ్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతిక పరంగా సినిమా పర్వాలేదు. సంతోష్ నారాయణన్ పాటలు, నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
Saindhav Twitter Review: సైంధవ్ ట్విటర్ రివ్యూ!
టాలీవుడ్ హీరో వెంకటేశ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ సైంధవ్. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటించింది. వెంకటేశ్ 75వ మూవీకి శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈరోజే థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే చాలా చోట్ల స్క్రీన్స్పై సైంధవ్ అలరిస్తోంది. అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రంపై ట్విటర్ వేదికగా అభిమానులు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ట్రైలర్ చూడగానే ఫుల్ యాక్షన్ మూవీ సగటు ప్రేక్షకునికి అర్థమైపోయింది. ప్రతి సీన్లో బుల్లెట్ల వర్షం కురిపించారు వెంకీమామ. తాజాగా రిలీజ్ కాగా.. నెటిజన్స్ నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. యాక్షన్ సీన్స్లో ముఖ్యంగా వెంకీమామ ఇరగదీశాడని ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా పంచుకుంటున్నారు. సెంటిమెంట్స్ సీన్స్ కూడా హార్ట్కు టచ్ చేస్తాయని చెబుతున్నారు. ప్రతి సీన్ గూస్బంప్స్ తెప్పిస్తోందని.. ఇంటర్వెల్ ట్విస్ట్ వేరే లెవల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ⭐⭐⭐/5 Venky mawa before movies tho compare chesthey better story Mainly fights , sankranti Paisa vasool#saindhavreview #Saindhav #venkatesh #Venky75 pic.twitter.com/BSJU3YLBXB — #Gunturkaaram (@renutv9) January 12, 2024 #Saindhav saidhev day... postive talk premieres shows🔥🔥🔥🔥🔥🔥 pic.twitter.com/aUDtYnrGEo — venkyarjunnaidu (@DukkaNaidu65634) January 13, 2024 Positive reviews Venky mama done & dusted 💥❤️🩹#SaindhavOnJan13th #Saindhav #Venkatesh pic.twitter.com/o4y5Xd7v6f — Bharath (@Bharath_9180) January 13, 2024 #SaindhavReview - ⭐⭐⭐⭐⭐ It's a best movie of #Venkatesh , Lot's of Action, lot of Twist and Turn and Interval is literally mind-blowing. Goosebump 🔥🔥🔥#Saindhav #Venky75 pic.twitter.com/yDMPAMu7no — AMIR ANSARI (@amirans934) January 12, 2024
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- సమంత వద్ద జాబ్ చేయాలనుకుంటున్నారా..? ఇలా సంప్రదించండి
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
- Rahul Gandhi: యూపీలో ‘ఇండియా’ తుపాను
- 27 రోజులు.. 57 సభలు, రోడ్ షోలు
- మీ భూమి మీదే..
- బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు
- పసిడికి అక్షయ తృతీయ శోభ
- CM Jagan: కదిలించిన కడప చైతన్యం
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement