-
పిజ్జా లవ్ : ఇద్దరమ్మాయిలు చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు
పిజ్జా అంటే చెప్పలేనంత ప్రేమ ఇద్దరు స్నేహితులు చేసిన తెలిస్తే షాక్ అవుతారు. ఒకరోజు సెలవుపెట్టి ఏకంగా విమానంలో వెళ్లి మరీ పిజ్జా ఆరగించి వచ్చారు. దీనికి ఎంత ఖర్చయిందో తెలుసా? మాంచెస్టర్ ఈవెనింగ్ న్యూస్ ప్రకారం, యూకేకుచెందిన మోర్గాన్ బోల్డ్, ఆమె స్నేహితురాలు జెస్ వుడర్ ఇద్దరూ "ఎక్స్ట్రీమ్ డే ట్రిప్"ని ప్లాన్ చేసారు. అంటే ఒక్క రోజులోనే తిరిగి ఆఫీసుకు వచ్చేసేలా అన్నమాట. దీని ప్రకారం ఇద్దరు స్నేహితులు లివర్పూల్ నుండి పిసాకు (ఇటలీలో) మాంచెస్టర్ విమానాశ్రయంలో విమానంలో వెళ్లారు. డే రిటర్న్ ఫ్లైట్లను బుక్ చేసుకున్నారు. ఏప్రిల్ 24న ఉదయం 6 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు ఇంటికి చేరుకోవడం విశేషం. ఈ సుడిగాలి పర్యటనలో షాపింగ్ చేసుకొని, తమకిష్టమైన పిజ్జాను ఆస్వాదించారు.బోల్డ్, వుడర్ లీనింగ్ టవర్ ఆఫ్ పిసా ముందు ఫోటోలు తీసుకున్నారు. గూగుల్ మ్యాప్లో మంచి పిజ్జాతో రెస్టారెంట్లకు వెతుక్కున్నారు. విమానచార్జీలు, విమానాశ్రయం పార్కింగ్, ఫుడ్ కలిపి మొత్తం పర్యటనకు 170 పౌండ్లు (రూ. 17,715) వెచ్చించామని తెలిపారు. లివర్పూల్నుంచి లండన్కి ఇంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. పైగా అక్కడ పిజ్జా ఇతర డ్రింక్స్ ఖరీదు చాలా ఎక్కువ. దాదాపు అదే డబ్బుతో వేరే దేశం వెళలి వచ్చామంటూ చెప్పుకొచ్చారు. పిసా టవర్ను చూస్తూ పిజ్జా తినడం అద్భుతం. ఇక్కడఆహార ధరలు రీజనబుల్గానే ఉన్నాయంటూ వెల్లడించారు. వచ్చిన విమానంలోనే తిరిగి ఇంటికి వెళ్లడం ఇంకా బావుందంటూ తెగ సంబరపడిపోయారు. -
ఇదేం స్నాక్ రా బాబూ...రేటు ఎంతైనా సరే ఎగబడుతున్న జనం
ఆరోగ్యానికి మంచిదంటూ పాతకాలపు వంటలు, వంటలు ఇపుడొక ఫ్యాషన్. జపాన్లో ఒక వింత వంటకం తెగర వైరల్ అవుతోంది. శతాబ్దాల నాటి చిరుతిండిని లేటెస్ట్గా వడ్డించడంతో, ఖరీదు ఎక్కువైనా సరే ఎగబడి తింటున్నారట అక్కడి జనం. అసలు స్టోరీ ఏంటంటే..ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నాయి జపాన్ రెస్టారెంట్లు. శతాబ్దాల చరిత్రగల పురాతన వంటకం ‘రైస్ బాల్’ ను వెరైటీగా సిద్ధంచేసి మరీ ఆహారప్రియులను ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి కూడా. ఇంతకీ ఈ స్నాక్ ఎలా తయారు చేస్తారో తెలిస్తే మాత్రం.. దిమ్మ దిరగాల్సిందే.జపాన్లో ఒనిగిరి లేదా రైస్ బాల్ (అన్నం ముద్దలు) వంటకం చాలా ఫేమస్. ఉడకబెట్టిన వివిధ కూరగాయలు, మాంసం, అన్నం, నోరి అనే ఎండబెట్టిన సముద్ర పాచిలో చుడతారు. సాధారణంగా ఒనిగిరి అన్నం ముద్దలను చేత్తోనే లడ్డూల్లా చుడతారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఇటీవలి కాలంలో అందమైన మహిళా చెఫ్లను రెస్టారెంట్ల యజమానులు రంగంలోకి దించారు. ఆ అమ్మాయిలు ఒనిగిరి ముద్దలను చేత్తో బదులు చంక కింద పెట్టుకొని చుడతారు. ఇక్కడో ఇంకో సంగతి ఏంటంటే...ఆర్మ్పిట్ టెక్నిక్ను వంటగదిలో కస్టమర్లను చూడటానికి అనుమతిస్తాయి. అంతేకాదు మేము చాలా జాగ్రత్తగా ఎలాంటి ఇన్ఫోక్షన్స్ రాకుండా డిస్ ఇన్ఫెక్ట్ట్తోశుభ్రంగా ఉండేలా చూసు కుంటామంటూ యజమానులు హామీ ఇస్తున్నారు. ఆర్మ్పిట్ ఒనిగిరి ముద్దలను కొన్ని రెస్టారెంట్లు ఏకంగా 10 రెట్ల ఎక్కువ ధరకు అమ్ముతున్నారు.ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తోందీరైస్ బాల్! కొందరు పాజిటివ్గా కమెంట్ చేస్తోంటే, మరికొందరు నెగిటివ్ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. మొత్తం మీద రైస్బాల్ తయారీ విధానంపై చర్చ రచ్చ రచ్చగా మారింది.కొందరు కస్టమర్లు వహ్వా అంటూ లొట్టలేసుకొని తింటుంటే మరికొందరు మాత్రం రుచిలో పెద్దగా తేడా రాలేదంటూ పెదవి విరుస్తున్నారట. చెఫ్కు ఏదైనా గుప్త రోగం ఉంటే పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు మరికొంతమంది. సాధారణంగా తమకు రైస్బాల్స్ అంటే ప్రాణం.. కానీ ఇది అత్యంత జుగుప్సాకరంగా ఉందని మండి పడుతున్నారు. తాము ఎప్పటికీ ఈ డిష్ను ట్రై చేయబోమని తెగేసి చెబుతున్నారు.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం చంకలో తయారయ్యే చెమటలో ఒక ప్రత్యేకమైన ఫెరోమోన్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుందట. దీన్ని వాసన చూస్తే లైంగిక ఆకర్షణలు పెంచుతుందని 2013 నాటి అధ్యయనంలో తేలిందట. -
కలే నిజమైంది.. ప్రాణాలు కాపాడింది!
మనలో చాలా మందికి పీడకలలు వస్తుంటాయి. ఉలిక్కిపడి లేచి హమ్మయ్య నిజం కాదు గదా అని ఊపిరి పీల్చుకుంటాం. అయితే తమ కలలు చాలావరకు నిజం అవుతూ ఉంటాయని కొంతమంది చెబుతారు. యూకేలోని మహిళకు ఇలాగే జరిగిందట. తన కలే తన జీవితాన్ని కాపాడింది అంటోంది.. వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.మెట్రో నివేదిక ప్రకారం యూకేకు చెందిన వ్యాపారవేత్త 46 ఏళ్ల షార్లెట్ వ్రోకి ఒక విచిత్రమైన కల(2021లో ) వచ్చింది. తనకు రొమ్ములో ఒక గడ్డ ఉన్నట్టు, డాక్టరు మాట్లాడుతున్నట్టు కల వచ్చింది. అంతేకాదు ఆ వైద్యుడు బ్రెస్ట్ కేన్సర్ అని చెప్పినట్టుగా కూడా చాలా స్పష్టంగా వినిపించింది. దీంతో చటుక్కున మెలకువ వచ్చింది. అప్పటికి సమయం తెల్లవారుజామున 4 గంటలు అయింది.లేచి భయంతోనే రొమ్ములను చెక్ చేసుకుంది. నిజంగానే కలలో కనిపించిన ప్రదేశంలోనే చేతికి ఒక ముద్దలాగా తగిలింది. ఇది కలా? నిజమా అనుకుంటూనే వెంటనే వైద్యులను సంప్రదించింది. స్కానింగ్లు, పరీక్షల తరువాత ఆమెకు ట్రిపుల్ నెగెటివ్ కేన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. భర్త, పిల్లల సహకారంతో కేన్సర్ చిక్సితను మొదలు పెట్టింది. కీమోథెరపీ చేయించుకుంది. ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు మాస్టెక్టమీ, రేడియోథెరపీ ,మళ్లీ కీమోథెరపీలు జరిగాయి. చివరికి 2023 మార్చి నాటికి ఆమెకు కేన్సర్ నయమైంది.''నా కలలు..సినిమా చూస్తున్నట్టుగా చాలా స్పష్టంగా ఉంటాయి. నిజంగా ఆకలవల్లే భయంకరమైన కేన్సర్ను తొందరగార్తించి జయించగలిగాను లేదంటే పరిస్థితి ఏంటో ఊహించడానికి కూడా భయంగా ఉంది. కొంతమంది ఇది యాదృచ్ఛికం అన్నారు. కానీ విశ్వం లేదా మరెవరో ముందస్తుగా నన్ను ఇలా హెచ్చరించి ఉంటారనే కచ్చితంగా నమ్ముతున్నాను. ఎప్పటికీ కృతజ్ఞురాలిని’’కాగాభవిష్యత్తు గురించి సమాచారం అందించే, లేదా హెచ్చరించే కలలను ''ప్రికోగ్నిటివ్ డ్రీమ్స్'' అంటారట. 900 మందిపై జరిపిన ఒక అమెరికన్ అధ్యయనంలో 33 శాతం మంది పాల్గొనేవారు ఒక కలను గుర్తుకు తెచ్చుకోవడం, ఆ కల నిజం కావడం సంభవించిందట. -
కొడుకు కల సాకారం కోసం...ఒక టీవీ నటి సాహసం, వైరల్ స్టోరీ
అమ్మ ఎపుడైనా అమ్మే. అమ్మకు ప్రత్యామ్నాయం లేదు. మాతృత్వపువిలువ, కన్నపేగు మమకారం తెలుసు. అందుకే కేన్సర్తో చనిపోయిన కొడుకుకల సాకారం కోసం పెద్ద సాహసానికి పూనుకుంది. 68 ఏళ్ల వయసులో ఒక టీవీ స్టార్ కొడుకు వీర్యంతో వారసురాలికి జన్మనిచ్చిన ఘటన సంచలనంగా మారింది. సహజంగా పిల్లలకు కనే అవకాశం లేనపుడో, మరేకారణాల రీత్యానో సరోగసీని ఆశ్రయిస్తుంటారు. కానీ కొడుకు కోసం సరోగసీని ఎందుచుకుంది స్పెయిన్ దేశానికి చెందిన టీవీ నటి అనా బ్రెగాన్. ఈమెకు అలెస్ లెక్వియో అనే కొడుకు ఉండేవాడు. అయితే దురదృష్టవశాత్తూ కేన్సర్తో 27 ఏళ్లకే కన్నుమూశాడు. అయితే మరణానికి ముందు అలెస్కు తండ్రి కావాలన్న కోరిక బలంగా ఉండేది. అందుకే తన స్పెర్మ్ను భ్రద (ఫ్రీజ్) పర్చుకున్నాడు. ముందస్తు ప్రమాదాన్ని ఊహించాడో ఏమో, విధి ఫలితమో గానీ కొన్నాళ్లకు కేన్సర్ బారిన పడ్డాడు. తన కల నెరవేరకుండానే చనిపోయాడు. అయితే తండ్రి కావాలన్న ఆశతో అఎస్ లెక్వియో తన వీర్యాన్ని భద్రపర్చిన విషయం ఇంట్లో లభించిన రశీదు ఆధారంగా అనా ఓబ్రెగాన్ తెలుసుకుంది. అంతే తల్లి మనసు తన కొడుకు కలసాకారం కోసం ఆరాటపడింది. దీనికి సంబంధించిన 2023లో వైద్యులను సంప్రదించింది. అన్ని పరీక్షల అనంతరం సరోగసికీ ఓబ్రెగాన్ శరీరం సహకరిస్తుందని వెల్లడించారు. దీంతో ప్రాణాలకు తెగించి మరీ కొడుకు వీర్య కణాలతో గర్భం దాల్చి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపాయికి అనిత అని పేరుపెట్టుకుంది. ఫస్ట్ బర్త్డే సందర్భంగా ఈ విషయాలను స్వయంగా అనా ఇన్స్టాలో ఫోటోలతో సహా షేర్ చేసింది. “అనితా, నీకు ఏడాది నిండింది. అగాధమైన చీకటిలో మునిగిపోయి, విపరీతమైన బాధతో ఛిద్రమైపోయిన నా హృదయాన్ని కాంతితో నింపేశాయ్... నీ చిరునవ్వు, ముద్దు ముద్దుమాటలు, నీ బుడిబుడి అడుగులు ఇవి చాలు నాకు.. మీ నాన్న నన్ను ఎంత ప్రేమతో చూసాడో అదే ప్రేమతో నన్ను చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఇప్పటివరకూ ఎవరూ నన్ను అలా చూడలేదు. ” అని పోస్ట్ చేసింది. ఇది నెటిజనుల చేత కంటతడిపెట్టిస్తోంది. View this post on Instagram A post shared by Ana_Obregon Oficial (@ana_obregon_oficial) -
మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు: సెల్ఫీ వీడియో పుణ్యమే!
సెల్ఫీ వల్ల చాలామంది మనుషుల ప్రాణాలు బలైన సంఘటనలు అనేకం చూశాం. కానీ ఒక సెల్ఫీ వీడియో నిందితుడిని పట్టిచ్చిన వైనం వైరల్గా మారింది. ఓ రైలు ప్రయాణికుడి సెల్ఫీ వీడియో మరో ప్రయాణికుడి మరణం వెనకున్ మిస్టరీ ఛేదించిన ఘటన మహారాష్ట్రలోని కళ్యాణ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి: బ్యాంకు ఉద్యోగి ప్రభాస్ భాంగే హోలీ వేడుకలకు ఇంటికెళ్లి అనంతరం తిరిగి పూణే వెళ్లేందుకు ఈ నెల 24న సిద్దేశ్వర్ ఎక్స్ప్రెస్లో బయలుదేరాడు. కానీ అనూహ్యంగా అతని మృతదేహం విఠల్వాడి రైల్వే స్టేషన్లో పట్టాలపై దర్శనమిచ్చింది. అయితే జారి పడి దుర్మరణం పాలై ఉంటాడని పోలీసులు తొలుత భావించారు. అయితే ఇక్కడే అసలు కథ వెలుగులోకిచ్చింది. రైలు విఠల్వాడి స్టేషన్ వద్దకు వచ్చేసరికి ప్రభాస్ భాంగే బయట రైలు డోరు దగ్గర నిలబడి ఉన్నాడు. ఇదే అదనుగా భావించిన సెల్ఫోన్ దొంగ ఆకాశ్ జాదవ్ హఠాత్తుగా అతని ఫోన్ లాక్కున్నాడు. అతని మొబైల్ ఫోన్ను లాక్కోవడానికి ప్రయత్నించినపుడు అదుపు తప్పి పట్టాలపై పోయాడు. అయితే ఈ మొత్తం ఉందంతం మరో రైలు ప్రయాణికుడు జాహిద్ జైదీ సెల్ఫీ వీడియోలో రికార్డు అయింది. జాహిద్ ఫోన్ కొట్టేసేందుకు కూడా ఆకాశ్ జాదవ్ ప్రయత్నించాడు కానీ సాధ్యం కాలేదు. అది వీడియోలో రికార్డు అయింది.దీనిపై అతను ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దీనిపై విచారించాల్సిందిగా పోలీసులను కోరాడు.ఇది వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. అనుమానితుడిగా ఆకాశ్ జాదవ్ను అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడు కూడా నిజం అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. అతడి నుంచి ప్రభాస్ ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నామని రైల్వే పోలీసు అధికారి పండరీనాథ్ కాండే వెల్లడించారు. -
నిజంగానే..చర్మం ఒలిచి చెప్పులు కుట్టించాడు! ఇంట్రస్టింగ్ స్టోరీ
చేసిన మేలుకు కృతజ్ఞతగా ‘చర్మం ఒలిచి చెప్పులు కుట్టిస్తా’ అనే మాటను సాధారణంగా వినే ఉంటాం కదా. కానీ ఎక్కడా చూసి ఉండం. కానీ మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన ఒక వ్యక్తి అక్షరాలా దీన్ని చేసి చూపించాడు. అదీ నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి పట్ల కృతజ్ఞతతో.. శ్రీరాముడి స్ఫూర్తితో. దీనికి సంబంధించిన స్టోరీ ఇపుడు నెట్టింట విశేషంగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన రౌనక్ గుర్జార్ ఒకప్పుడు రౌడీ షీటర్. తన చర్మంతో తన తల్లికి చెప్పులు తయారు చేయించి బహుమానంగా ఇచ్చాడు. అదీ రామాయణం స్ఫూర్తితో. రామాయణంలో శ్రీరాముడు తన తల్లి పట్ల చూపిన భక్తికి , ప్రేమకు చలించిపోయాడు రౌనక్. తాను కూడా అమ్మకోసం ఏదైనా చేయాలనుకున్నాడు. అందుకోసం ఏకంగా కుటుంబంలో ఎవరికీ తెలియకుండా ఓ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకుని, తొడ భాగంలోని కొంత చర్మాన్ని తొలగించి, దానితో తల్లికి సరిపోయేలా ఆ చర్మంతో చెప్పులు తయారు చేయించాడు. (ఇదే తొడమీద ఒకప్పుడు పోలీసులు కాల్పులు జరిపారట.) మార్చి 14 - 21 మధ్య తన ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన భగవత్ కథలో రౌనక్ తన తల్లికి ఆ చెప్పులు సమర్పించి తల్లి పాదాలపై మోకరిల్లాడు. దీంతో రౌనక్ తల్లితో పాటు గురు జితేంద్ర మహారాజ్ కూడా భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడున్న ప్రతి ఒక్కరినీ ఈ సంఘటన కదిలించింది.రౌనక్ క్రమం తప్పకుండా రామాయణం పారాయణం చేస్తాడట. ఈ క్రమంలోనే శ్రీరాముడి పాత్ర తనలో స్ఫూర్తి నింపిందని చెప్పుకొచ్చాడు. తన చర్మంతో తనకు చెప్పులు కుట్టిస్తాడని ఊహించలేదంటూ రౌనక్ తల్లి కన్నీళ్లుపెట్టుకున్నారు. రౌనక్ లాంటి కొడుకును కనడం అదృష్టంగా భావిస్తున్నానంటూ, నిండు నూరేళ్లుగా చల్లగా వర్ధిల్లమని కొడుకుని మనసారా దీవించి గుండెనిండా హత్తుకుందామె -
డబ్బుల కోసం ఇంత కక్కుర్తా? స్వయానా అన్ననే.. వైరల్ స్టోరీ
పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటూ పవిత్రంగా భావిస్తారు. ప్రభుత్వం పోత్సాహం పథకం డబ్బుల కోసం కక్కుర్తి పడి, సొంత అన్నాచెలెళ్లే పెళ్లి తంతు ముగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి సమూహిక్ వివాహ్ యోజన పథకం కింద నిర్వహించిన కమ్యూనిటీ వివాహ కార్యక్రమంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. 2024, మార్చి 5న మహారాజ్గంజ్ జిల్లాలోని లక్ష్మీపుర్ బ్లాక్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 38 నిరుపేద కుటుంబాలకు చెందిన జంటలకు సామూహిక వివాహం కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారందరికీ ‘సీఎం వివాహ పథకం’ కింద వధువుకు మంగళసూత్రం, ట్రంకుపెట్టె, దుస్తులతో పాటు రూ.51 నగదు అందించారు. అయితే మహారాజ్గంజ్ జిల్లాలో ఒక మహిళకు అప్పటికే పెళ్లయిపోయింది. కానీ భర్త దూరంగా ఉన్నాడు. దీంతో ప్రభుత్వ పథకం కోసం సొంత అన్నతో కలిసి పన్నాగం పన్నింది. ఏమాత్రం సంకోచం లేకుండా సోదరుడిని వివాహం చేసుకుంది. 'సప్తపది' (ఏడు సార్లు అగ్ని ప్రదక్షిణం) తో సహా అన్ని ఆచారాల్ని పాటించింది. అనంతరం బహుమతులు అందుకుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు విస్తుపోయారు. ఈ విషయం అధికారుల దృష్టికి కూడా చేరడంతో, పరిశీలించిన అధికారులు అప్పటికే ఆమెకు వివాహమైనట్లు గుర్తించారు. దీంతో లక్ష్మీపూర్ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అమిత్ మిశ్రా విచారణకు ఆదేశించారు. వారికిచ్చిన బహుమతులను కూడా వెనక్కి తీసుకున్నామనీ, ఈ పథకం కింద ఇచ్చే నగదు సహాయం నిలిపి వేస్తామని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మిశ్రా తెలిపారు. కాగా ఇటీవల యూపీలోని బల్లియా జిల్లాలో కమ్యూనిటీ వెడ్డింగ్ స్కీమ్లో ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఇద్దరు అమ్మాయిలు, తమకు తామే దండలు వేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
ఏడేళ్లకు వచ్చిన అడ్మిట్ కార్డ్: షాకైన బెంగాలీ బాబు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని వ్యవసాయ శాఖలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. వ్యవశాయ శాఖలో ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న 7 సంవత్సరాల తర్వాత ఆ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డు వచ్చింది. దీంతో అది చూసి ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. ఆశ్యర్యకరమైన పరిణామం ఇంటర్నెట్లో వైరల్గా మారింది. అటు రాజకీయంగా కూడా ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఇండియా టుడే కథనం ప్రకారం 2016 లో పశ్చిమ బెంగాల్లోని వ్యవసాయ శాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది. అసిస్టెంట్ పోస్టుకు ఆ ఏడాది మార్చిలో వార్తాపత్రికలో ప్రకటన వచ్చింది. ఈ నోటిఫికేషన్ను చూసి ఆశిష్ బెనర్జీ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు వర్ధమాన్ జిల్లాకు చెందిన ఆశిష్ బెనర్జీ. పరీక్ష డిసెంబర్ 18, 2016న జరగాల్సి ఉంది. కానీ దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డు లేదా హాల్ టికెట్ రాలేదు. దీని కోసం కొన్నాళ్లు ఎదురుచూసి, ఇక దాని సంగతే మర్చిపోయాడు. కానీ ఆశ్యర్యకరంగా దాదాపు ఏడేళ్ల తరువాత షాక్య్యే ఘటన చోటు చేసుకుంది. (80 కోట్లమంది పేదలకు ప్రయోజనం: ప్రధాని మోదీ కీలక ప్రకటన) ఇటీవల (2023 నవబంరు 1వ తేదీ) ఆశిష్ బెనర్జీకి పశ్చిమ బెంగాల్ వ్యవసాయ శాఖ నుంచి ఒక సీల్డ్ కవరు అందింది. దాని లోపల ఏడేళ్ల క్రితం జరిగిన పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ ఉంది. దీంతో ఇంత కాలానికా.. జీవిత కాలం లేటు అన్నట్టుగా ఆశ్చర్యపోవడం ఆశిష బెనర్జీ వంతైంది. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే 2016 డిసెంబరు 18 వ తేదీనే నిర్వహించడం, పరీక్ష రాసి, సెలక్ట్ అవ్వడం, వారు ఉద్యోగంలో చేరిపోవడం అన్నీ జరిగిపోయాయి. (షాకింగ్ వీడియో: ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం, ఒకరు మృతి) దీంతో ఈ వ్యవహారంపై ఆశిష్ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాడు. తనకు అడ్మిట్ కార్డు ఆలస్యం కావడానికి కారణం ఏమిటో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశాడు. చేయని తప్పుకు తాను మూల్యం చెల్లించాల్సి వచ్చిందని తప్పు ఎవరిదో తేలాలని పట్టుబడుతున్నాడు. అంతేకాదు రాష్ట్రంలోని ఇతర ఉపాధి స్కామ్ల మాదిరిగానే ఈ కేసులో కూడా కుంభకోణం జరిగిదంటే ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆశిష్. -
ఈ కారణంతో టాప్ పెర్ఫార్మర్నే పీకేసిన కంపెనీ! ఇదేం చోద్యం అంటున్న నెటిజన్లు
కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు అవార్డులు, రివార్డులు, ప్రోత్సాహకాలు ఇవ్వడం, పనితీరు బాగా లేదు అనుకున్న వాళ్లని ఉద్యోగం నుంచి తొలగించడం చాలా కామన్. కానీ ఒక కంపెనీ మాత్రం ఉద్యోగులకు గుణపాఠం చెప్పే పేరుతో టాప్ పెర్ఫార్మర్నే ఉద్యోగంలోంచి తీసేసింది. దీనికి సంబంధించిన కథనం సోషల్మీడియాలో వైరల్గా మారింది. (నీతా అంబానీ అద్భుత గిఫ్ట్: మురిసిపోతున్న కాబోయే కోడలు) సోషల్మీడియా ప్లాట్ఫాం రెడిట్ ఒక యూజర్ ఈ స్టోరీని షేర్ చేశాడు. కంపెనీలో బాగా పని చేసే టాప్ పెర్ఫార్మర్ను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ విషయాన్ని రెడిట్ యూజర్ పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో ఇదెక్కడి చోద్యం రా బాబూ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఉద్యోగులను భయపెట్టేందుకు బాగా పనిచేస్తున్న ఉద్యోగిని తీసివేయడం ఎంతవరకు సబబు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. (సినిమాలకు బ్రేక్: సమంతకు ఆర్థికంగా అన్ని కోట్లు నష్టమా?) అంతేకాదు కంపెనీకి సంబంధించి తర విషయాల గురించి కూడా చెప్పాడు. కార్మికుల కమీషన్లు దొంగిలించడం, కాంట్రాక్ట్ నిబంధనలను బేఖాతరు చేయడం, కనీసం వాష్రూంలో 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడిపినా వేధించడం, నచ్చకపోతే తలుపు తెరిచి ఉందని చెప్పడం లాంటివి చాలా వరకు తగ్గాయంటూ వీటి తీవ్రతను చెప్పుకొచ్చాడు రెడిటర్ పోస్ట్లో తెలిపారు. టార్గెట్ రీచ్ అవ్వని కారణంగా తొలగిస్తామని బెదిరించారు. నిజానికి నానుంచి కమీషన్ తీసుకున్నందుకు చేసిన పని అది. ఇది ఇలా ఉంటే అకస్మాత్తుగా టాప్ పెర్ఫార్మర్ అయినా తన సహో ద్యోగిని తొలగించారనీ వాపోయాడు. అంతేకాద సేల్స్ ఫిగర్స్ కాస్త తక్కువగా ఉండటంతో అంచనాలను అందుకోలేదని వారు చెప్పారు. కానీ ఇక్కడ అసలు విషయం ఏమిటంటే తమను ప్రశ్నించిన వారిక ఇలాటి గతే పడుతుందని ఇతర ఉద్యోగులకు ఇది పరోక్ష హెచ్చరిక అని కమెంట్ చేశారు.కమీషన్ కాంట్రాక్ట్ ఒప్పందాలను ఉల్లంఘిండం లాంటి విషయాలపై ఎవరైనా ప్రశ్నిస్తే ఇదే గతి పడుతుందనే మెసేజ్ను డైరెక్ట్ మేనేజర్ ఇచ్చారని రెడిట్ పోస్టులో రాసుకొచ్చారు ఆ కంపెనీ ఉద్యోగి. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. -
థ్యాంక్స్ టూ యాపిల్ స్మార్ట్ వాచ్, లేదంటే నా ప్రాణాలు: వైరల్ స్టోరీ
యాపిల్ వాచ్లోని కీలక ఫీచర్ ఇప్పటివరకు చాలామంది ప్రాణాలను కాపాడింది. భయానక పరిస్థితుల నుంచి యాపిల్ వాచ్ కారణంగా బయటపడ్డానంటూ ప్రపంచవ్యాప్తంగా పలు యూజర్లు షేర్ చేసిన పలు కథనాలూ చదివాం. తాజాగా అలాంటి మరో స్టోరీ వైరల్గా మార్చింది. యాపిల్ వాచ్ లేకపోయి ఉంటే.. ఈ పాటికి నా ప్రాణాలు గాలి కలిసిపోయేవే అంటూ ఒక వ్యక్తి ఈ లిస్ట్లో చేరారు. (వాట్సాప్ యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్: ఒకేసారి 32 మందితో) కెనడాకు చెందిన వ్యక్తి అలెగ్జాండర్ లేజర్సన్ కథనం ప్రకారం యాపిల్ వాచ్ కీలకమైన సమయంలో స్పందించి అత్యవసరమైన వ్యక్తుల ఫోల్ చేయడంతో సకాలంలో వైద్యం అందింది. తద్వారా తలకు భారీ గాయమైనా ప్రాణాలతో బతికి బైటపడ్డాడు. దీనికి ఆయన యాపిల్ స్మార్ట్వాచ్కు కృతజ్ఞతలు తెలిపారు. అలెగ్జాండర్ ఏదో పనిచేసుకుంటూ ఉండగా నిచ్చెనపై నుండి కింద పడిపోయాడు.దీంతో అతని తలికి తీవ్ర గాయమైంది. కానీ వెంటనే యాపిల్ వాచ్ సిరీస్ 8 స్మార్ట్ వాచ్ అత్యవసర సేవల నంబరు, అతని భార్యను డయల్ చేసింది.దీంతో వెంటనే అతడిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు.తలపై ఏడు కుట్లు పడ్డాయని, ప్రస్తుతం కోలుకుంటున్నానని పేర్కొన్న అలెగ్జాండర్ వాచ్లోని టెక్నాలజీకి ధన్యవాదాలు తెలిపారు. (టాప్ డైరెక్టర్ రాజమౌళి కొత్త అవతార్: హీరోలకు షాకే!?) కాగా యాపిల్ స్మార్ట్వాచ్ Apple Watch 4, ఆ తరువాతి మోడల్స్ లో ఫాల్ డిటెక్షన్ ఫీచర్ యూజర్ అందుబాటులో ఉంది. ఒకవేళ యూజర్ పడిపోతే ఈ ఫీచర్ వెంటనే అలర్ట్ అవుతుంది.ఆటోమేటిక్గా ఎమర్జెన్సీ సర్వీస్లను, వ్యక్తులకు సమాచారం ఇస్తుంది. ఈ ఫీచర్ 55 ఏళ్లు పైబడిన వినియోగదారుల కోసం ఈ ఫీచర్ స్వయంచాలకంగా ఆన్ అవుతుంది. సెటింగ్స్లో మాన్యువల్గా కూడా దీన్ని సెట్ చేసుకోవచ్చు. (తొలి జీతం 5వేలే.. ఇపుడు రిచెస్ట్ యూట్యూబర్గా కోట్లు, ఎలా?) -
వర్క్ టైంలో ఆన్ లైన్ షాపింగ్ అడ్డంగా దొరికిపోయిన ఉద్యోగి
-
తిండి లేదు.. తిప్పలు పడింది.. విశ్వాసమే మళ్లీ నెగ్గింది!
27 రోజులు.. 64 కిలోమీటర్లు.. దారి తెలీయకున్నా ఎక్కడా ప్రయాణం ఆపలేదు. తిండి లేదు.. తోవలో తిప్పలెన్నో పడింది.. చివరకు కథ సుఖాంతం అయ్యింది. విశ్వాసానికి మారుపేరైన శునకం మరోసారి తన స్వామి భక్తిని చాటుకుని వార్తల్లోకి ఎక్కింది. అదేంటో మీరూ చదివేయండి.. సృష్టిలో ప్రేమ అనంతం. కానీ, ఆ ప్రేమకు స్వచ్ఛతను.. అచ్చమైన అర్థాన్ని చెప్పేవి మాత్రం కొన్నిగాథలే. మూగజీవాలు మనుషుల పట్ల కనబరిచే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా ఇక్కడో శునకం.. యజమాని(కేర్ టేకర్) కోసం చేసిన సాహసం గురించి ముమ్మాటికీ చెప్పుకోవాల్సిందే. పైన ఫొటోలో ఉంది కూపర్. Golden Retriever జాతికి చెందిన శునకం. ఒక నెలకిందట.. ఐర్లాండ్ ఉత్తర భాగంలోని టైరోన్ కౌంటీలోని ఓ ఇంటికి దత్తత వెళ్లింది. కారు నుంచి దిగీదిగగానే పరుగులు అందుకుంది కూపర్. అలా మొదలైన ప్రయాణం 40 మైళ్ల పాటు సాగింది. లండన్డెర్రీలోని టోబర్మోర్లో ఉన్న తన కేర్ టేకర్ చెంతకు చేరింది. కనిపించకుండా పోయిన మూగజీవాల గురించి ఆరా తీసే లాస్ట్పాస్ ఎన్ఐ అనే ఛారిటీ కూపర్కు చెందిన అందమైన కథను సోషల్ మీడియాలో పంచుకుంది. దాదాపు నెలపాటు సాగిన కూపర్ ప్రయాణం.. ఎక్కడా ఆగలేదు. ఎవరి సాయం లేకుండానే అది ముందుకు సాగింది. దారి తెలియకపోయినా.. అది పాత ఓనర్ చేరుకున్న తీరు ఆశ్చర్యానికి గురి చేయిస్తోందని సదరు ఛారిటీ పేర్కొంది. మరోవైపు అది తిరిగి రావడం చూసి దానిని దత్తత ఇచ్చిన వ్యక్తి భావోద్వేగానికి లోనయ్యారు. ఇకపై కూపర్ ఎక్కడికి వెళ్లదని, తనతోనే ఉంటుందని కన్నీళ్లతో చెబుతున్నారు. -
బంపర్ ఆఫర్! ఏడాది వేతనంతో కూడిన సెలవు! ఎక్కడ?
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సమయంలో వర్క్ఫ్రం హోం విధానానికి అలవాటు పడిన ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు వెళ్లాలంటే అయ్యో... అని నిట్టూరిస్తున్న పరిస్థితి. అలాంటిది ఒక ఉద్యోగికి 365 రోజులు పెయిడ్ లీవ్ ఇస్తే.. వావ్.. అది కదా బంపర్ఆఫర్ అంటే. చైనాలోని ఒక ఉద్యోగి ఇలాంటి జాక్పాట్ తగిలింది. ఏకంగా ఏడాది పాటు వేతనంతో కూడిన లీవ్ లభించింది. ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే, ఎలాంటి విధులు నిర్వహించకుండానే అతనికి నెలనెలా జీతం పొందే అవకాశం లభించింది. నమ్మలేకపోతున్నారా? ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న ఈ స్టోరీ చదవాల్సిందే. (రాధిక మర్చంట్, ఫ్రెండ్ ఒర్రీ: ఈ టీషర్ట్, షార్ట్ విలువ తెలిస్తే షాకవుతారు) స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించిన ప్రకారం చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రం షెన్జెన్ పట్టణంలోని పేరు వెల్లడించని కంపెనీ తమ ఉద్యోగి ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది. కరోనా కారణంగా మూడేళ్ల తర్వాత ఇటీవల వార్షిక విందును ఏర్పాటు చేసింది. సంస్థలో పనిచేసే ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం కల్పించాలని భావించింది. వారిలో నైతిక స్థైర్యాన్ని పెంపొందించే ఆనోచన తోవిందులో లక్కీ డ్రాను నిర్వహించింది. ఈ డ్రా గెలుచుకున్న వారికి అధిక వేతనం, ఇతర బహుమతులతో పాటు ఏడాది పాటు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించింది. (సల్మాన్ ఖాన్ మూవీ బూస్ట్: ఏకంగా 21 వేల కోట్లకు ఎగబాకిన బిజినెస్మేన్) పెనాల్టీ కార్డులు కూడా ఈ డ్రాలో జోడించింది. అంటే పార్టీలో వెయిటర్గా వ్యవహరించడం లేదా ఇంట్లో తయారు చేసిన ప్రత్యేకమై ఒక రకంగా భయంకరమైన పానీయం తాగడం లాంటివి కూడా ఉన్నాయి. అయితే వీటన్నింటిని తోసి రాజని మేనేజర్ స్థాయి ఉద్యోగి ఒకరు 365 రోజుల సెలవుతో కూడిన బంపర్ప్రైజ్ గెల్చుకోవడంతో ఎగిరి గంతేశాడు. అతడు దీనికి సంబంధించిన చెక్ పట్టుకుని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. (ఇదీ చదవండి: అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) 男子在公司年会抽到“365天带薪休假”奖项 pic.twitter.com/aOaSxgBAtO — The Scarlet Flower (@niaoniaoqingya2) April 12, 2023 మరోవైపు కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగి చెన్ మాట్లాడుతూ ఈ సెలవును నగదుగా మార్చుకోవాలనుకుంటున్నారా లేదా ఆనందించాలనుకుంటున్నారా అనేది నిర్ణయించడానికి విజేతతో కంపెనీ చర్చలు జరుపుతుందని పేర్కొన్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
‘నాకేం వద్దు.. నాకు ఇలా బతకడమే బాగుంది’
వారం రోజులుగా ఈ ‘దాదీజీ’ (అవ్వ) వీడియో వైరల్ అవుతోంది. దానికి కారణం ముంబై మెట్రో రైళ్లల్లో ఈ దాదీజీ చాక్లెట్లు అమ్ముతూ కనిపించడమే. ఆమె కథ ఏమిటో. పిల్లలు చూస్తున్నారో లేదో. కాని తన జీవితం తాను బతకడానికి చక్కని నవ్వుతో తియ్యని చాక్లెట్లు అమ్ముతోంది. ఒక ప్రయాణికుడు ఆమె వీడియో సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. చాలామంది సాయం చేస్తామని వచ్చారు. ‘చాక్లెట్లు కొనండి చాలు’ అని సున్నితంగా, ఆత్మగౌరవంతో తిరస్కరించిందామె. ముంబై లోకల్ ట్రైన్లలో చక్కగా నవ్వుతూ, చుడీదార్లో చలాకీగా నడుస్తూ, చాక్లెట్లు అమ్మే ఆ పెద్దావిడను చూసి ఎవరో వారం క్రితం సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వయసులో కూడా జీవించడానికి శ్రమ పడుతున్న ఆమెను అందరూ ప్రశంసలతో ముంచెత్తారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ అయితే ఆ వీడియోను ట్వీట్ చేసి అందరూ ఆమె దగ్గర చాక్లెట్లు కొనండి అని వినతి చేశారు. ఆ తర్వాత ‘హేమ్కుంట్ ఫౌండేషన్’కు చెందిన అహ్లూవాలియా అనే వ్యక్తి ఆమెకు పెద్ద ఎత్తున సాయం చేస్తాము ఆమె ఎక్కడ ఉంటుందో గుర్తించండి అని ముంబై వాసులను ఉద్దేశించి ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లను బాలీవుడ్ స్టార్లు కూడా రీట్వీట్ చేశారు. చాలామంది ముంబైవాసులు ‘మేము ఫలానా ట్రైన్లో చూశాం. ఆ స్టేషన్లో చూశాం’ అని స్పందనలు పెట్టారు. చివరకు వెతికి వెతికి ఆమెను పట్టుకున్నారు అహ్లూవాలియా మనుషులు. ఆమె పేరు వజ్జీ... ‘నా కుటుంబంలో సమస్య వచ్చింది. అప్పటినుంచి చాక్లెట్లు అమ్ముతున్నా’ అని ఆమె చెప్పింది వజ్జీ. ఫౌండేషన్ సభ్యులు ఆమెకు వెంటనే పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ‘నాకేం వద్దు. నాకు ఇలా బతకడమే బాగుంది’ అని చెప్పిందామె. ‘నా మనుషులు ఆమె చాక్లెట్లను రెట్టింపు రేటు ఇచ్చి కొందామన్నా ఆమె ఇవ్వలేదు. మామూలు రేటుకే ఇచ్చింది. ఇకపై ప్రతి వారం ఆమె చాక్లెట్లు మొత్తం మేము కొంటాం. ఎందుకంటే ఆ ఒక్క రోజు ఆమె అన్ని రైళ్లు తిరిగే అవస్థ తప్పుతుంది’ అని ట్వీట్ చేశాడు అహ్లూవాలియా. ‘ఆమె ఆత్మగౌరవం చూసి మేమందరం ఆమెకు మరింత అభిమానులం అయ్యాం’ అని నెటిజన్లు వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరికీ ఏవో సమస్యలు వస్తాయి. కాని వజ్జీలా నవ్వుతూ హుందాగా వాటిని ఎదుర్కొనడం తెలియాలి. వజ్జీ నుంచి గ్రహించాల్సిన పాఠం అదే. -
రియల్ హీరో: ప్రాణత్యాగంతో 144 మందిని కాపాడాడు!
తన ప్రాణం పోతుందని తెలిస్తే.. ఎవరైనా భయపడతారు. తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, తన ప్రాణం పోయినా.. ఇతరులను కాపాడాలని చూసేవాళ్లను ఏం అనాలి?. రియల్ హీరో అనడం ఎంతమాత్రం తక్కువ కాదు. క్షణాల్లో ఘోర ప్రమాదం జరుగుతుందని తెలిసి.. తన ప్రాణం పోయిన పర్వాలేదనుకుని వంద మందికి పైగా ప్రాణాలు నిలబెట్టాడు యాంగ్ యోంగ్. దక్షిణ చైనాలో హైస్పీడ్ బుల్లెట్ రైలు డీ2809 శనివారం ప్రమాదానికి గురైంది. గుయిజౌ ప్రావిన్స్లో బుల్లెట్ రైలు ప్రమాదానికి గురికాగా.. డ్రైవర్ కోచ్ నుజ్జునుజ్జు అయ్యి అందులోని డ్రైవర్ యాంగ్ యోంగ్ ప్రాణం విడిచాడు. ప్రమాదంలో మరో ఎనిమిది మంది గాయపడగా.. 136 మంది సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ప్రమాదం గురించి దర్యాప్తు చేపట్టిన అధికారులకు.. ట్రైన్ డేటా ఆధారంగా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. డీ2809 రైలు.. గుయియాంగ్ నుంచి రోంగ్జియాంగ్ స్టేషన్ల మధ్య ఒక టన్నెల్ వద్దకు చేరుకోగానే.. డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతోనే ప్రమాదం జరిగిందని నిర్ధారించారు అధికారులు. అయితే.. టన్నెల్కు చేరుకునే ముందు ట్రాకుల మీద అసాధారణ పరిస్థితులను యాంగ్ గుర్తించాడు. వెంటనే.. ఎమర్జెన్సీ బ్రేకులు అప్లై చేశాడు. దీంతో ముందున్న బురద, మట్టి కుప్పలను బలంగా ఢీకొట్టి రైలు సుమారు 900 మీటర్ల దూరం జారుకుంటూ ముందుకు వెళ్లింది. ఆపై స్టేషన్ వద్ద బోల్తా పడడంతో డ్రైవర్ కోచ్ బాగా డ్యామేజ్ అయ్యింది. Train driver on D2809 "5 second braking" : Emergency braking becomes muscle memory, Yang Yong did everything he could pic.twitter.com/IkiMUvcknt — tigers tiger (@tigerstiger1) June 5, 2022 యోంగ్ బ్రేకులు గనుక వేయకుండా ఉంటే.. పూర్తిగా బల్లెట్రైలే ఘోర ప్రమాదానికి గురై భారీగా మృతుల సంఖ్య ఉండేది!. కానీ, యోంగ్ సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. తన ప్రాణం కన్నా ప్రయాణికులే ముఖ్యం అనుకున్నాడు. యోంగ్ నేపథ్యం.. ఆయన ఇంతకు ముందు సైన్యంలో పని చేశారు. రిటైర్ అయిన తర్వాత.. కో-డ్రైవర్గా, అసిస్టెంట్ డ్రైవర్గా, ఫోర్మ్యాన్గా, డ్రైవర్ ఇన్స్ట్రక్టర్గా, గ్రౌండ్ డ్రైవర్గా.. చివరికి ట్రైన్ డ్రైవర్గా బాధ్యతలు చేపట్టాడు. దేశం కోసం సేవలు అందించిన వీరుడు.. చివరకు జనాల ప్రాణాలను కాపాడడం కోసమే ప్రాణాలు వదిలాడు. యోంగ్ చేసిన త్యాగం.. ఆ దేశాన్ని కంటతడి పెట్టించింది. రియల్ హీరోగా ఆయన్ని అభివర్ణిస్తోంది. తనను తప్ప.. మిగతా అందరినీ కాపాడుకున్న ఆ హీరోను ఆరాధిస్తోంది ఇప్పుడు అక్కడ. యోంగ్ పార్థివదేహానికి అతని స్వస్థలం గుయిజౌలోని జున్యీ వద్ద ప్రభుత్వ లాంఛనాలతో ప్రజల కన్నీళ్ల మధ్య ఘనంగా జరిగింది. The heroic driver of #D2809 Yang Yong returned to his hometown of #Zunyi , #Guizhou , under the escort of the convoy. Locals spontaneously lined the way to bid farewell Welcome home heroes. 6月5日,D2809司机杨勇在车队护送下回到家乡贵州遵义。当地人自发夹道送别:“欢迎英雄回家!” pic.twitter.com/c8OokOdx24 — Michael Franklin ( 100% follow back) (@Michael04222710) June 6, 2022 -
రెండుసార్లు గర్భస్రావం.. తర్వాత ప్రెగ్నెంట్.. నెలలోపే మళ్లీ గర్భం.. కవలలు!
మాతృత్వపు మధురిమలను ఆస్వాదించాలని కోరుకోని మహిళ ఉండదంటే అతిశయోక్తి కాదు. తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ బిడ్డను ప్రపంచంలోకి తీసుకువస్తుంది తల్లి. అందుకోసం ఎంతటి బాధనైనా పంటిబిగువన భరిస్తుంది. పొత్తిళ్లలో చిన్నారిని చూసుకోగానే తాను పడిన ప్రసవ వేదనను మరిచిపోతుంది. అమెరికాలోని టెక్సాస్కు చెందిన కారా విన్హోల్డ్ కూడా అలాంటి కోవకు చెందిన వారే! అయితే, ఇప్పటికే ఒక కుమారుడికి జన్మనిచ్చిన ఆమె.. తనకు తెలియకుండానే కవలలకు ప్రాణం పోశారు. వారిని ఈ లోకంలోకి తీసుకువచ్చారు. ఎన్నో అబార్షన్ల తర్వాత దక్కిన ఈ రెట్టింపు సంతోషంతో విన్హోల్డ్ దంపతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అసలేం జరిగింది? వాషింగ్టన్ పోస్ట్, మెట్రో కథనాల ప్రకారం.. విన్హోల్డ్, ఆమె భర్త 2018లో ఓ బాబుకి జన్మనిచ్చారు. తమ కుటుంబాన్ని మరింతగా విస్తరించుకోవాలని భావించిన ఆ జంట.. మరో సంతానం కోసం ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో 2019లో విన్హోల్డ్ గర్భం దాల్చడంతో ఎంతో సంతోషపడ్డారు. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. అనారోగ్య కారణాల రీత్యా ఆమెకు గర్భవిచ్చిత్తి అయింది. 2020లోనూ ఇదే తరహాలో చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఆరోగ్యంపై కూడా ఈ అబార్షన్లు తీవ్ర ప్రభావం చూపాయి. అయినప్పటికీ మరో బిడ్డను కనాలన్న ఆ తల్లి మనసు నిరాశ చెందలేదు. ఈ క్రమంలో గతేడాది ఫిబ్రవరిలో విన్హోల్డ్ మరోసారి గర్భవతి అయింది. అన్నీ సజావుగా సాగడంతో పుట్టబోయే బిడ్డ కోసం ఎదురుచూడసాగింది. అయితే, ఊహించని విధంగా ఏడు వారాల తర్వాత తన కడుపులో మరో శిశువు ఎదుగుతున్నట్లు డాక్టర్లు ఆమెకు చెప్పారు. గర్భం దాల్చిన నెల రోజుల తర్వాతే మరో ప్రెగ్నెన్సీ రావడంతో ఇది సాధ్యమైందని వైద్యులు చెప్పడంతో విన్హోల్డ్ దంపతులు ఆశ్చర్యానికి లోనయ్యారు.ఈ నేపథ్యంలో ఆమె కవలలకు జన్మనిచ్చారు. దీంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. (PC: Kennedy News and Media Via Metro) కారణం ఏమిటి? కారా విన్హెల్డ్కు తెలియకుండానే కవలలు జన్మించడానికి కారణం సూపర్ఫెటేషన్. హెల్త్లైన్ జర్నల్ ప్రకారం.. ఒకేసారి విడుదలైన రెండు అండాలు వేర్వేరు సమయాల్లో(వారాల వ్యవధి) ఫలదీకరణం చెందితే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి. దీనినే వైద్య పరిభాషలో సూపర్ఫెటేషన్ అంటారు. ఎప్పుడూ నిరాశ చెందలేదు.. అయితే ఇలా! ‘చాలా మంది పిల్లల్ని కనాలని.. వారితో అమ్మా అని పిలిపించుకోవాలని నాకు ఆశగా ఉండేది. గర్భస్రావాలు అయినప్పటికీ నేను పూర్తి ఆశావాద దృక్పథంతోనే ఉన్నాను. కచ్చితంగా ఇది జరిగి తీరుందని నమ్మాను. అమ్మగా నా ప్రయాణంలో ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుసు. అయినా ఏనాడు నిరాశ చెందలేదు. ఇప్పుడు నా కల నెరవేరింది’’ అని విన్హోల్డ్ వాషింగ్టన్ పోస్ట్తో వ్యాఖ్యానించారు. తన జీవితంలో అద్భుతం జరిగిందంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. కాగా విన్హోల్డ్కు కవలలుగా ఇద్దరు కుమారులు జన్మించారు. ఆరు నిమిషాల తేడాతో ఈ భూమ్మీదకు వచ్చిన ఆ బుజ్జాయిలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ముగ్గురు కుమారుల అల్లరితో ఈ దంపతుల ఇల్లు ఇప్పుడు ఎంతో సందడిగా ఉంది. ఇక గర్భవతికి మరో ప్రెగ్నెన్సీ అంటూ విన్హోల్డ్ జీవితంలోని ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: ఎనిమిది మంది భార్యలతో ఒకే ఇంట్లో.. వీడు మామూలోడు కాదండోయ్.. -
74 ఏళ్ల వయసులో గర్ల్ ఫ్రెండ్ కోసమే ఇదంతా...
బెంగళూరులో పట్టాభి రామన్ 74 ఏళ్ల వయసులో ఆటో నడుపుతాడు. గొప్ప ఇంగ్లిష్ మాట్లాడతాడు. గర్ల్ ఫ్రెండ్ కోసమే ఈ వయసులో కూడా ఆటో నడుపుతాను అంటాడు. గర్ల్ ఫ్రెండా? ఆశ్చర్యపోకండి. ‘నా భార్యను నేను గర్ల్ఫ్రెండ్ అనే పిలుస్తాను. భార్యను ఎప్పుడూ ప్రియురాలిగానే చూసుకోవాలి. సేవకురాలిగా కాదు’ అంటాడు. ప్రయివేట్ కాలేజీలో ఇంగ్లిష్ లెక్చరర్గా పని చేసిన రామన్ పిల్లల మీద ఆధారపడకుండా గత 14 ఏళ్లుగా ఆటో నడుపుతున్నాడు. భార్య అంటే ప్రేమ, గౌరవం... ఫిర్యాదులు లేని జీవితానందం ఉన్న రామన్ కథ ఒక పాసింజర్ ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని జీవన పాఠాలు పుస్తకాలు చదవడం వల్ల తెలుస్తాయి. మరికొన్ని జీవిత పాఠాలు నిలువెత్తు పుస్తకాలుగా తిరిగే మనుషుల వల్ల తెలుస్తాయి. మొన్నటి గురువారం బెంగళూరులో నికితా అయ్యర్ అనే ఉద్యోగిని ఇలాగే ఒక సజీవ జీవనపాఠాన్ని కలుసుకుంది. ఆ తర్వాత ఆమె ఆ పరిచయాన్ని లింక్డ్ఇన్లో పంచుకుంది. అంతే. ఆ పోస్ట్ వేలాదిమందిని ఆకట్టుకుంటోంది. ఇంతకూ ఆ పోస్ట్లో ఏముంది? ఆమె ఇలా రాసింది. ఆ రోజున... ఆ రోజున నేను ఉదయాన్నే పని మీద బయలు దేరాను. నేను బుక్ చేసుకున్న ఊబర్ ఆటోడ్రైవర్ నన్ను రోడ్డు మధ్యలో వదిలి వెళ్లిపోయాడు. అప్పటికే నాకు ఆఫీసుకు లేట్ అయ్యింది. నా ఆఫీసు ఊరికి ఆ చివర ఉంది. నా ముఖం కంగారుతో నిండి ఉంది. అది గమనించాడో ఏమో ఒక పెద్దాయన తన ఆటో ఆపి ‘ఎక్కడికి వెళ్లాలి’ అని ఇంగ్లిష్లో అడిగాడు. నేను ఆయన వయసు వాలకం చూసి జంకుతూనే చెప్పాను. ‘రండి మేడమ్. మీరు ఏమి ఇవ్వాలనుకుంటే అది ఇవ్వండి’ అన్నాడు మళ్లీ అంతే మంచి ఇంగ్లిష్లో. నేను ఆశ్చర్యపోయి ఆటో ఎక్కాను. ‘ఇంత మంచి ఇంగ్లిష్ మీకు ఎలా వచ్చు?’ అని అడిగాను. ఆయన ‘నేను గతంలో ఇంగ్లిష్ లెక్చరర్ని’ అన్నాడు. ఆ తర్వాత ఆయనే ‘ఇప్పుడు మీరు నన్ను మరి ఆటో ఎందుకు నడుపుతున్నావు అని అడగాలనుకుంటున్నారు కదూ’ అన్నాడు. ‘అవును. దయచేసి చెప్పండి’ అన్నాను. ఆయన నాతో ప్రయాణం పొడుగునా 45 నిమిషాల పాటు తన కథ చెప్పాడు. ఆయన పేరు పట్టాభి రామన్. ఎం.ఏ, ఎం.ఇడి చేశాడు. కాని బెంగళూరులో ఆయనకు ఎవరూ లెక్చరర్ ఉద్యోగం ఇవ్వలేదు. ‘ఎక్కడకు వెళ్లినా సామాజిక వర్గానికి చెందిన ప్రశ్న ఎదురైంది. అది చెప్పాక.. సర్లే, చెప్తాం లే అనేవారు. పిలుపు వచ్చేది కాదు. దాంతో విసిగి ముంబై వెళ్లిపోయాను’ అన్నాడాయన. ముంబైలోని పోవై కాలేజీలో 20 ఏళ్లు లెక్చరర్గా పని చేశాడట. 60 నిండాక తిరిగి బెంగళూరు చేరి ఆటో నడుపుతున్నాడు. ‘ప్రయివేట్ లెక్చరర్లకు పెన్షన్ ఉండదు. మళ్లీ టీచర్ ఉద్యోగం చేయాలన్నా పది– పదిహేను వేలకు మించి రాదు. అందుకని ఆటో నడుపుతున్నాను. దీనిని నడపడం వల్ల వచ్చే ఆదాయంతో నా గర్ల్ఫ్రెండ్ను హాయిగా చూసుకుంటున్నాను’ అన్నాడు. ఆ మాటకు నాకు నవ్వు వచ్చింది. ‘గర్ల్ఫ్రెండా?’ అన్నాను. ‘అవును. నా భార్యను నేను గర్ల్ఫ్రెండ్ అనే పిలుస్తాను. భార్యను ఎప్పుడూ సమస్థాయిలోనే చూడాలి. భర్త అనుకోగానే భార్య రూపంలో ఆమె సేవకురాలిగా కనిపిస్తుంది. అది నాకు ఇష్టం ఉండదు. ఆమెకు ఇప్పుడు 72 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఇంటిని, నన్ను చక్కగా చూసుకుంటుంది’ అన్నాడతను. మరి పిల్లలు?... ‘వాళ్ల జీవితం వాళ్లే. నేను, నా భార్య కారుగోడిలో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉంటాం. దాని అద్దె 12 వేలు నా కొడుకు కడతాడు. అంతకు మించి మా పిల్లల నుంచి మేము ఏమీ ఆశించం. మేమిద్దరం మాకు ఉన్నదానితో హాయిగా ఉంటాం’ అన్నాడతను. ‘చూడండి. నేను ఈ రోడ్డుకు రాజుని. నా ఇష్టం వచ్చినప్పుడు ఆటో తీస్తా. లేదంటే ఇంట్లో ఉంటా’ అని నవ్వాడతను. అతనితో మాట్లాడుతున్నంత సేపు నిరాశ కాని నిస్పృహ కాని జీవితం పట్ల ఫిర్యాదు కాని లేవు. ఇలాంటి వాళ్లు నిజమైన హీరోలు. కాకుంటే వీళ్ల గురించి మనకు తెలియదు. నిజంగా ఈయన పరిచయం నాకు చాలా స్ఫూర్తినిచ్చింది. ఆ తర్వాత?... నికితా అయ్యర్ ఈ అనుభవాన్ని లింక్డ్ఇన్లో ప్రచురించింది. ఆ పోస్ట్ వెంటనే వైరల్గా మారింది. 70 వేల మంది క్షణాల్లో లైక్ చేశారు. ఆ తర్వాత వేల మంది దానిని షేర్ చేశారు. ఎన్డిటివి, ఇతర సంస్థలు ఈ కథనాన్ని ప్రచారంలో పెట్టాయి. సింపుల్గా, సరళంగా, సంతోషంగా తన జీవితం తాను గడుపుతున్న ఆ ఆటో పెద్దాయన చాలామందిని ప్రభావితం చేశాడు. లక్షలు, కోట్లు ఉంటే ఏమిటి... మానసిక ఆనందం అంటే ఏమిటో తెలుసుకోవడం ముఖ్యంగాని అంటున్నారు. అతడు భార్యను చూసుకుంటున్న పద్ధతి ప్రతి ఒక్క భర్తకు ఆదర్శం అనీ అంటున్నారు. మొత్తానికి ఈ బోయ్ ఫ్రెండ్ మంచి మార్కులు కొట్టేశాడు. చదవండి: Ambali Health Benefits: అంబలి తాగుతున్నారా.. స్థూలకాయం, మధుమేహం.. ఇంకా -
నా బిడ్డ మొండిఘటం.. ఉక్రెయిన్ నుంచి క్షేమంగా వస్తాడు!: రజియా బేగం
‘‘ఉక్రెయిన్ దేశం యుద్ధంలో ఉందనే సంగతి మొదట నా బిడ్డే ఫోన్ చేసి నాకు చెప్పాడు. ఎప్పటికప్పుడు వాడు తన క్షేమసమాచారాలను అందిస్తున్నాడు. వీలైతే ఫోన్ చేస్తున్నాడు. లేదంటే మెసేజ్ చేస్తున్నాడు. నాకు గుండె ధైర్యం ఎక్కువ. నా బిడ్డ కూడా నాలాగే మొండి ఘటం. వాడు క్షేమంగా ఉక్రెయిన్ నుంచి తిరిగొస్తాడనే నమ్మకం ఉంది నాకు. కానీ, తల్లి ప్రేమ కదా. అందుకే అధికారుల సాయం కోరుతున్నా’’ అని చెబుతోంది యాభై ఏళ్ల టీచరమ్మ రజియా బేగమ్. అన్నట్లు ఈమె గురించి మీకు పరిచయం ఉందో లేదో.. ఈమె అప్పట్లో నేషనల్ ఫేమస్ అయ్యారు. సుమారు రెండేళ్ల కిందట కరోనా మొదలయ్యాక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి. ఆ సమయంలో ఎక్కడికక్కడే చిక్కుపోయి.. స్వస్థలాలకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు చాలామంది. ఈ తరుణంలో నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి ఓ తల్లి తన బిడ్డ కోసం వందల కిలోమీటర్లు స్కూటీ మీద వెళ్లి.. సురక్షితంగా అతన్ని తెచ్చేసుకుంది(1400కి.మీ.పైనే). నెల్లూరులో చిక్కుకుపోయిన కొడుకు నిజాముద్దీన్ అమన్ను తీసుకొచ్చుకునేందుకు బోధన్ ఎస్పీ నుంచి పర్మిషన్ తీసుకుని మరి సాహసం చేసింది. కొడుకు కోసం తల్లి పడ్డ ఆరాటాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసించారు. సాలంపాడ్ క్యాంప్ విలేజ్లో గవర్నమెంట్ టీచర్గా పని చేసే రజియాబేగం కథ అప్పుడు బాగా వైరల్ అయ్యింది. అయితే ఆ కొడుకు అమన్ ఇప్పుడు.. వేల కిలోమీటర్ల దూరంలో ఉక్రెయిన్ సంక్షోభంలో చిక్కుకుపోయాడు. అతను ఉంటున్న ప్రాంతంలో భారతీయుల తరలింపులో ఎలాంటి పురోగతి లేదని సమాచారం. రజియా భర్త 14 ఏళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూశాడు. అందుకే తన బిడ్డను డాక్టర్ కావాలని ఆమె కోరుకుంది. ఉక్రెయిన్ సుమీ స్టేట్ యూనివర్సిటీలో చేర్పించింది. సుమారు 50 దేశాల నుంచి రెండు వేల మంది దాకా విద్యార్థులు చదువుతున్నారు ఇక్కడ. మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతున్న అమన్. ఉక్రెయిన్ యుద్ధ వాతావరణంలో ఓ బంకర్లో అతను ఆశ్రయం పొందుతున్నాడు. అయితే అతను ఉంటున్న ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన బిడ్డ మాత్రమే కాదు.. తన బిడ్డల్లాంటి వాళ్లందరినీ వీలైనంత త్వరగా ఇక్కడకు రప్పించే విధంగా చర్యలు చేపట్టాలని కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను రజియాబేగం కోరుతున్నారు. ఇప్పటికే ఆమె నిజామాబాద్ కలెక్టర్కు లేఖ కూడా రాశారు. -
ప్రాణం నిలిపిన డెలివరీ బాయ్.. సర్వత్రా హర్షం
డెలివరీ బాయ్ల జీవితాల గురించి తెలియంది కాదు. కరోనాలాంటి కష్టకాలంలోనూ పొట్టకూటి కోసం రిస్క్ చేస్తున్న వాళ్లు కోకోల్లలు. అయితే డెలివరీ బాయ్ల విషయంలో కొంత మందికి చిన్నచూపు ఉంటుంది. అలాంటి వాళ్ల కళ్లు తెరిపించే ఘటన ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ముంబై(మహారాష్ట్ర)లో రిటైర్డ్ కల్నల్ మోహన్ మాలిక్ కుటుంబం నివసిస్తోంది. కిందటి నెల (డిసెంబర్ 25న) హఠాత్తుగా ఆ పెద్దాయన తీవ్ర అస్వస్థలకు లోనయ్యారు. వెంటనే ఆయన కొడుకు ఆస్పత్రికి తీసుకుని బయలుదేరాడు. దారిలో భారీ ట్రాఫిక్. ఇంచు కూడా కదల్లేని స్థితి. దీంతో టూవీలర్ మీద త్వరగా వెళ్లొచ్చన్న ఉద్దేశంతో కారు దిగి సాయం కోసం మాలిక్ కొడుకు అందరినీ బతిమాలాడు. కానీ, ఎవరూ సాయానికి ముందుకు రాలేదు. ఆ టైంలో డెలివరీలతో అటుగా వెళ్తున్నాడు ఒక స్విగ్గీ డెలివరీ బాయ్. మాలిక్ కొడుకు పడుతున్న కష్టం చూసి చలించి.. వెంటనే ఆ పెద్దాయన తన బైక్ మీద కూర్చోబెట్టుకుని ముగ్గురూ ఆస్పత్రికి బయలుదేరాడు. అడ్డుగా వాహనాలను గట్టిగా అరుస్తూ పక్కకు తప్పుకునేలా చేసి మరీ వీలైనంత త్వరగా ఆస్పత్రికి చేరుకున్నాడు ఆ డెలివరీ బాయ్. అలా సకాలంలో ఆస్పత్రికి చేరడంతో మోహన్ మాలిక్ ప్రాణం నిలిచింది. అయితే ఆస్పత్రికి చేరిన వెంటనే.. ఆ డెలివరీ బాయ్ అక్కడి నుంచి మాయమైపోయాడు. ఇన్నాళ్లూ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసి కోలుకున్న ఆ పెద్దాయన.. ఈ మధ్యే డిశ్చార్జి అయ్యారు. స్విగ్గీ ప్రతినిధులను సంప్రదించి.. ఎలాగోలా ఆ డెలివరీ బాయ్ జాడ కనుక్కోగలిగాడు. ఆ డెలివరీ బాయ్ పేరు మృణాల్ కిర్దత్. తన ప్రాణం కాపాడిన ఆ యువకుడిని.. రియల్ సేవియర్గా కొనియాడుతున్నాడు ఆ పెద్దాయన. సకాలంలో స్పందించిన ఆ డెలివరీ బాయ్ పనికి సోషల్ మీడియాలో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అతనికి ఏదైనా సాయం అందించాలని పలువురు కామెంట్లు చేస్తున్నారు. హ్యాట్సాఫ్ టు దిస్ రియల్ హీరో. View this post on Instagram A post shared by Swiggy (@swiggyindia) -
ప్రేమ,పెళ్లి.. నా కౌశిక్ చచ్చిపోయాడు.. అయినా
సాక్షి, వెబ్డెస్క్: స్నేహితుల ద్వారా పరిచయం.. అభిరుచులు కలిశాయి.. స్నేహం ప్రణయంగా మారింది... బంధంలోని స్వచ్ఛత మనసులను మరింతగా పెనవేసింది.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు.. పెద్దల ఆమోదంతో పెళ్లితో ఒక్కటై బంధాన్ని ‘శాశ్వతం’ చేసుకున్నారు.. సరదాలు, సంతోషాల సవ్వడిలో నాలుగేళ్ల కాలం నాలుగు రోజుల్లా గడిచిపోయింది. ప్రపంచంలోని ఆనందమంతా తమ చెంతే ఉన్నట్లు భావించారు ఆ దంపతులు.. వీరి అన్యోన్యతను చూసి విధి కూడా కన్ను కుట్టిందేమో... జంటను వేరు చేసింది.. ఆమె నుంచి అతడిని శాశ్వతంగా దూరం చేసింది... అయినా ఆమె ఓటమిని అంగీకరించలేదు.. గుండెల నిండా అతడు పంచిన ప్రేమ, నేనున్నా లేకున్నా నీ చిరనవ్వు చెరగనీయొద్దు అనే మాటలు ఆమెను మళ్లీ మామూలు మనిషిని చేశాయి.. జీవన గమనాన్ని కొనసాగించేందుకు బాటలు వేశాయి. సరికొత్త ఆరంభానికి పునాదులు పరిచాయి. ఫొటో కర్టెసీ: హ్యూమన్స్ ఆఫ్ బాంబే ‘‘ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాళ్లు ఈ లోకాన్ని వీడితే వాళ్లతో పాటు మనమూ వెళ్లిపోలేము కదా... ఒకవేళ అదే జరిగితే ఈ ప్రపంచంలో ఒక్క మనిషి కూడా మిగలడు.. దుఃఖాన్ని దిగమింగి, వారు మిగిల్చిన జ్ఞాపకాలతో శేష జీవితాన్ని గడపాలి. అప్పుడే సాంత్వన చేకూరుతుంది’’ ముంబైకి చెందిన రేడియో జాకీ రోహిణి రామనాథన్ అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు ఇవి. భర్త హఠాన్మరణంతో కుంగిపోయిన ఆమె.. అతి తక్కువ కాలంలోనే ఆ బాధ నుంచి తేరుకుంది. తన ‘‘మాటలతో’’ ఎంతో మందికి ఆహ్లాదం పంచుతూ ముందుకు సాగుతోంది. కొంగొత్త ఆశలతో ప్రతి ఉదయాన్ని స్వాగతిస్తూ... భర్తను చేరేదాకా ఇలాగే మరింత ఉల్లాసంగా జీవితాన్ని గడుపుతానని చెబుతోంది. నేను ఆర్జే, తను రైటర్ ‘‘కామన్ ఫ్రెండ్స్ ద్వారా కౌశిక్ను కలిశాను. ఒక రేడియో జాకీగా కథలు చెప్పడం అంటే నాకు ఇష్టం. తను రచయిత.. అందుకేనేమో మా మనసులు తొందరగా కలిసిపోయాయి. తనతో ఉంటే సమయం తెలిసేదే కాదు. ఒక్క నిమిషం కూడా తనతో మాట్లాడకపోతే ఏమీ తోచేది కాదు. ఫోన్ నెంబర్లు మార్చుకున్నాం. గంటల తరబడి కాల్స్. వీలుచిక్కినప్పుడల్లా షికార్లు. ప్రేమికుడిగా మారడం కంటే ముందు తను నా బెస్ట్ఫ్రెండ్. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నాం. మూడేళ్ల డేటింగ్ తర్వాత.. ఒకరోజు తను నాకు ప్రపోజ్ చేశాడు. పెళ్లి చేసుకుందామా అని తను అడగగానే వెంటనే ఓకే చెప్పేశాను. తనే నా సంతోషం. ఈఫిల్ టవర్ కింద ఆత్మీయంగా ముద్దులు పెట్టుకున్నాం. నచ్చిన ప్రదేశాలు చుట్టేశాం. మొత్తానికి ప్రేమలో మునిగితేలాం. ఫొటో కర్టెసీ: హ్యూమన్స్ ఆఫ్ బాంబే సలహా ఇచ్చేందుకు తను లేడు తనకు న్యూయార్క్ సిటీ అంటే చాలా ఇష్టం. అందుకే అక్కడికి షిఫ్ట్ అయ్యాం. పెళ్లైన తర్వాత నాలుగేళ్లు ఎప్పుడు గడిచాయో తెలియనే లేదు. అస్సలు కలలో కూడా ఊహించని పరిణామం. నా కౌశిక్ చచ్చిపోయాడు.. నేను శోకసంద్రంలో మునిగిపోయాను. మాకే ఎందుకు ఇలా జరగాలి? నేను కోరుకున్న వ్యక్తితో జీవితం పంచుకున్నాను.. నాకు ఏ చిన్న సమస్య వచ్చినా కౌశిక్ సలహా తీసుకునేదాన్ని... జీవితకాల విషాదం.. అలాంటి సమయంలో నాకు తోడుగా ఉండేందుకు కౌశిక్ ఈ లోకంలోనే లేడు కదా.. ‘‘మానసిక ఒత్తిడి, బాధ, కోపం’’ ఇలా ఎన్నో భావోద్వేగాలు ఏకకాలంలో నన్ను చుట్టుముట్టాయి. అప్పుడే భర్తను మర్చిపోయిందా? ప్రపంచమంతా చీకటైపోయినట్లు అనిపించింది. ఎవ్వరితోనూ మాట్లాడలేకపోయాను. నిజం చెప్పాలంటే మా అత్తామామలు ఆ సమయంలో నాకు అండగా నిలబడ్డారు. తనివితీరా ఏడ్చాను. 14 రోజుల తర్వాత కాస్త తేరుకున్నాను. పనిలో నన్ను నేను బిజీ చేసుకోవడం మొదలుపెట్టాను. ఇంటర్వ్యూలు చేశాను. మామూలు స్థితికి వచ్చేశాను. కొంతమంది నన్ను చూసి... ‘‘తనేంటి ఇలా ఎలా నవ్వగలుగుతోంది? అసలు తనకు కొంచమైనా బాధ ఉందా?’’ అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కానీ వాళ్లకు తెలియదు.. ప్రతిరోజూ రాత్రి బోసిపోయిన ఇంట్లోకి రాగానే దుఃఖం నన్ను ఆవహిస్తుంది. మౌనంగానే రోదించడం నాకు అలవాటుగా మారిపోయింది. సూటిపోటి మాటలు, చేదు అనుభవాలు.. పది నెలలు గడిచిన తర్వాత నేనొక నిర్ణయానికి వచ్చాను. ఫొటో కర్టెసీ: హ్యూమన్స్ ఆఫ్ బాంబే మానసిక చికిత్స తీసుకోవడం మొదలుపెట్టాను. చాలా మార్పు వచ్చింది. కౌశిక్కు నేను ఏడిస్తే అస్సలు నచ్చేది కాదు. తనకు నా నవ్వంటే ఇష్టం. మరి దానిని దూరం చేసుకోవడం ఎందుకు అనిపించింది. నాలుగేళ్ల కాలంలో తను నాకు ప్రపంచంలోని అన్ని సంతోషాలు అందించాడు. జీవితకాలానికి సరిపడా తను పంచిన ఆ జ్ఞాపకాలే నాకు ఊపిరి. తనను మళ్లీ కలుసుకునే దాకా నేనిలాగే సంతోషంగా ఉంటాను’’ అని రోహిణీ రామనాథన్ తన మనో అంతరంగాన్ని హ్యూమన్స్ ఆఫ్ బాంబేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిష్కరించారు. ఇష్టమైన వారిని కోల్పోయినా.. జీవించే హక్కు, అర్హత అందరికీ ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Wuhan Lab: వయాగ్రా దోమల లీక్.. కలకలం!
వుహాన్ ల్యాబ్ పరిశోధకుల తాజా పరిశోధన బెడిసి కొట్టింది. వయాగ్రా ఇంజెక్ట్ చేసిన వేల కొద్దీ దోమలు .. ల్యాబ్ నుంచి బయటపడ్డాయి. ఓ పరిశోధకుడి నిర్లక్క్ష్యంతోనే ఇది జరిగిందని ల్యాబ్ నిర్వాహకులు ప్రకటించగా.. ఆ దోమల ప్రభావంతో విపరీత అనర్థాలు చోటు చేసుకున్నాయి. అవి కుట్టిన వాళ్లు వికృతంగా ప్రవర్తిస్తున్నారు. లైంగిక కోరికలతో రగిలిపోతూ ఆస్పత్రి పాలవుతున్నారు. ఈ వార్త ఇంటర్నెట్లో వైరల్ అవుతుండడంతో ఆందోళన మొదలైంది. వైరల్ వార్త.. చైనా నుంచి మరో షాక్. వయాగ్రా దోమల ప్రభావంతో చైనాలో అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. పండు ముసళ్లోల్ల దగ్గరి నుంచి కుర్రాల దాకా కామ వాంఛతో రగిలిపోతున్నారు. వుహాన్కి చెందిన 87 ఏళ్ల వృద్ధుడు ఒకడు కోరికల్ని తట్టుకోలేక ఆస్పత్రిలో చేరాడు. మరో పేషెంట్ నగ్నంగా ఆస్పత్రిలో తిరుగుతూ.. పబ్లిక్గా వికృత చేష్టలకు పాల్పడ్డాడు. మరో వ్యక్తి కనిపించిన వాళ్లపైనా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఇది వుహాన్ కెచ్లీ ఆస్పత్రి డాక్టర్లు ఇచ్చిన స్టేట్మెంట్. ఇక ఇది మునుముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని వుహాన్ ల్యాబ్ హెడ్ రీసెర్చర్ డాక్టర్ వెంజి యింగ్ యిన్ జింగ్ భయపడుతున్నారని వరల్డ్న్యూస్డెయిలీరిపోర్ట్ డాట్ కామ్ అనే వెబ్ సైట్ ఒక కథనాన్ని ప్రచురించింది. One more shock from China. Wuhan: Thousands of mosquitoes inoculated with Viagra escape from high-security laboratory https://t.co/h4FAK7yp1g — किसान 🇮🇳 (@WadheshT) June 15, 2021 ఫ్యాక్ట్ చెక్.. వరల్డ్న్యూస్డెయిలీరిపోర్ట్ డాట్ కామ్ అనేది కంప్లీట్ సెటైరికల్ వెబ్సైట్. ‘‘నిజనిర్థారణలతో సంబంధం లేదు’’ అనేది ఆ వెబ్సైట్ క్యాప్షన్. అందులో కంటెంట్ మామూలుగా ఉండదు. కుక్కకు-పిల్లి తోకకు ముడిపెట్టి కథనాలు పబ్లిష్ చేస్తుంది. పైగా జనాలు అది నిజమని గుడ్డిగా నమ్మేంత పక్కాగా. అందులో ఉంది అధికారిక సమాచారమేమో అనేంతలా స్టోరీలు అల్లుతుంది. వుహాన్ ల్యాబ్ మీద సెటైరిక్గా పోయిన నెలలో రాసిన ఈ ఆర్టికల్.. ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఇందులో ఉన్న వృద్ధుడి ఫొటో అసలు చైనా వ్యక్తిదే కాదు. జపాన్ వ్యాపారవేత్త యుకిషి చుగంజి. 2003లో 114 వయసులో ఆయన అనారోగ్యంతో చనిపోయారు. ఆ టైంలో ప్రపంచంలో అత్యంత వృద్ధుడి రికార్డు ఆయన పేరు మీద ఉండేది. #CKMKB 😂😂 Good news “The effects of one mosquito bite can last up to forty-eight hours and symptoms include an increase in libido, sexual arousal, and possibly a very, very large erection,” Dr. Wenzi told the press during a press conference.https://t.co/iR5nHFIWBC — 🥃🚬 (@BeastOnDrive) June 15, 2021 -
వైరల్ స్టోరీ : ‘దేవుడు కరుణిస్తే.. అమ్మను చూస్తా’
సోషల్ మీడియాతో ఎవరి ఫేట్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియడం లేదు. చూపులేకున్నా తన టాలెంట్తో కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకోగలిగాడు బిలాల్ గోరెజెన్. ఒకప్పుడు వీధుల్లో డ్రమ్స్ వాయించే బిలాల్కు ఈ క్రేజ్ దక్కడానికి కారణం.. తెగ ఊగిన ఓ పిల్లితో ఉన్న అతని వీడియో ఒకటి వైరల్ కావడమే. టర్కీకి చెందిన బిలాల్ వయసు 33 ఏళ్లు. పుట్టుకతోనే అంధుడు. కానీ, డ్రమ్స్ నేర్చుకుని వీధుల్లో వాయిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. 2011లో ఓ సెస్ టర్కీ అనే రియాలిటీ షో అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కానీ, ఆర్థికంగా మాత్రం సాయం అందించలేదు. రెండేళ్ల క్రితం ఇస్తాంబుల్ మేయర్ ఎక్రెమ్తో కలిసి చేసిన వీడియో ఒకటి బాగా వైరల్ అయ్యింది. అయితే ఆ తర్వాత ‘లెవన్ పొల్క్కా’ వీడియో అతని నుదుటిరాతను పూర్తిగా మార్చేసింది. View this post on Instagram A post shared by Bilal Göregen (@bilalgoregen) పిల్లి తెచ్చిన లక్ లెవాన్ పొల్క్కా ఒక ఫిన్లాండ్ పాపులర్ సాంగ్. ఆ సాంగ్ను తనకొచ్చిన రీతిలో పాడుతూ.. డ్రమ్స్ వాయించాడు బిలాల్. అయితే ఆ వీడియోకు జపాన్ వైబింగ్ క్యాట్(పిల్లి సరదాగా తల ఊపిన వీడియో)ను ఎడిట్ చేయడంతో అది బాగా పేలింది. సోషల్ మీడియాలో బిలాల్కు పేరు దక్కింది. ఆ వీడియో తర్వాత బిలాల్ ఎన్నో ఫేమస్ పాటలకు డ్రమ్స్ వాయించాడు. మన వరకు బాలీవుడ్ ‘ఖలియో కా ఛమన్’, దలేర్ మెహందీ ’తున్క్ తున్క్ తున్’ ఆల్బమ్స్, లేటెస్ట్గా త్రీ ఇడియెట్స్లో ‘ఆల్ ఈజ్ వెల్’తో ఇండియన్స్ను బిలాల్ ఆకట్టుకోగలిగాడు. షకీరా ఆల్బమ్స్ను సైతం తన స్టయిల్లో కంపోజ్ చేశాడతను. ఇక పాపులర్ పాప్ సాంగ్స్తో పాటు టీవీ సిరీస్ల థీమ్ సాంగ్లను నోటితో హమ్మింగ్ చేస్తూ డ్రమ్స్ వాయిస్తాడు బిలాల్. View this post on Instagram A post shared by Bilal Göregen (@bilalgoregen) దేవుడంటే కోపం లేదు బిలాల్ ఇంటర్నెట్ సెలబ్రిటీ అయ్యాక ఈమధ్య ఓ టీవీ షోలో పాల్గొన్నాడు. అందులో యాంకర్ దేవుడు కరుణించి వరాలిస్తే ఏం కోరుకుంటావని బిలాల్ను అడిగాడు. దానికి బిలాల్ స్పందిస్తూ.. ‘‘మా అమ్మ ముఖం చూడాలని ఉందని చెప్తా. ఆమె నన్ను కన్నదని ఈ మాట చెప్పట్లేదు. కానీ, నా అవిటితనపు బాధను ఆమె అనుభవించింది. కన్నీళ్లు కార్చింది. ఆ బాధను మోస్తున్నప్పుడు ఆమె ముఖం చూడాలన్నదే నా కోరిక’’ అని చెప్పాడు. పనిలో పనిగా రంగులు చూడాలన్న కోరికను కూడా అడిగేస్తానని చెప్పాడు. నాకు ఆ భగవంతుడి మీద నాకెలాంటి కోపం లేదు. ఎందుకంటే నా జీవితమే నాకు గొప్ప అని చెప్పడంతో అక్కడున్న ఆడియెన్స్ నిల్చుని చప్పట్లతో బిలాల్ పట్ల గౌరవం ప్రదర్శించారు. View this post on Instagram A post shared by Bilal Göregen (@bilalgoregen) -
అయ్యో జ్యోతి: అప్పట్లో సంచలనం.. ఇప్పుడు విషాదం
తండ్రి ఆరోగ్యం బాగోలేదు. పైగా లాక్డౌన్ కష్టాలు. అందుకే ఆ కూతురు సాహసానికి పాల్పడింది. వారంపాటు 1200 కిలోమీటర్లపైగా సైకిల్ మీద తండ్రిని ఇంటికి చేర్చింది. సైకిల్ జ్యోతి కుమారి సాహసానికి, ధైర్యానికి అప్పట్లో సర్వత్రా ప్రశంసలు కురిసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఇంట విషాదం నెలకొంది. పాట్నా: సైకిల్ గర్ల్ జ్యోతి కుమారి తండ్రి మోహన్ పాశ్వాన్ సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయాన్ని జిల్లా మెజిస్ట్రేట్ త్యాగరాజన్ ప్రకటించారు. ఏ తండ్రి కోసమైతే జ్యోతి కుమారి అంత కష్టానికి ఓర్చిందో.. ఆ తండ్రే ఇక లేరని, ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని త్యాగరాజన్ అన్నారు. అంతేకాదు ఆ కుటుంబానికి అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు కూడా. కాగా, జ్యోతి కుటుంబ స్వస్థలం బిహార్లోని దర్బంగా. యాక్సిడెంట్ తర్వాత.. జ్యోతి తండ్రి మోహన్ పాశ్వాన్ ఆటో డ్రైవర్. బతుకు దెరువు కోసం ఢిల్లీలోని గురుగ్రామ్కు వెళ్లాడు. ఇక పదో తరగతి ఫెయిల్ అయిన పెద్దకూతురు జ్యోతి కూడా ఆయతో పాటే వెళ్లింది. మోహన్ భార్య మిగిలిన పిల్లలతో ఊరిలో ఉండేది. పోయినేడాది ఓ రోడ్డు ప్రమాదంలో మోహన్ గాయపడ్డాడు. దీంతో ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. సరిగ్గా అదే టైంలో లాక్డౌన్ వచ్చి పడింది. ఇంటి కిరాయి కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఓనర్ ఖాళీ చేయమన్నాడు. దీంతో తండ్రి ఆరోగ్య దృష్ట్యా ఊరికి వెళ్లాలని జ్యోతి అనుకుంది. సైకిల్పై తండ్రిని కూర్చోబెట్టుకుని ఇంటి బాట పట్టింది. వారం కష్టం జబ్బు పడిన తండ్రి మోహన్ను సైకిల్ పై కూర్చోబెట్టుకుని ప్రయాణం మొదలుపెట్టింది జ్యోతి. రోజూ ముప్ఫై నుంచి నలభై కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కింది. మధ్య మధ్యలో కొందరు ట్రక్ డ్రైవర్లు లిఫ్ట్, భోజనం ఇచ్చి సాయపడ్డారు. మొత్తానికి వారం తర్వాత ఇంటికి చేరుకుంది. జ్యోతి ప్రయత్నానికి అప్పట్లో దేశమంతా సలాం కొట్టింది. అంత చిన్న వయసులో ఏమాత్రం అధైర్యపడకుండా... ఎక్కడా అలసిపోకుండా... అంత సుదీర్ఘ దూరం ఆమె సైకిల్పై ప్రయాణించడం అప్పట్లో అంతా మెచ్చుకున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం జ్యోతి తెగువకు హ్యాట్సాఫ్ చెబుతూ బాలపురస్కార్ ప్రకటించారు. ఇవాంక ట్రంప్ సహా పలువురు సెలబ్రిటీలు కూడా సైకిల్ జ్యోతి సాహసంపై స్పందించారు. అయితే ఆ టైంలో కొంత సాయం అందినప్పటికీ.. ఆర్థికంగా ఆ కుటుంబం నిలదొక్కుకోలేదని తెలుస్తోంది. జ్యోతి కుటుంబానికి సాయం జ్యోతి కథనాల తర్వాత అధికారులు ఆమెకు కొంత సాయం అందించారు. అప్పట్లో సైక్లింగ్ ఫెడరేషన్ కూడా జ్యోతిని సైకిల్ రైడర్గా తీర్చిదిద్దుతామని ప్రకటించింది. అయితే జ్యోతి తల్లి మాత్రం కూతురి చదువే మొదటి ప్రాధాన్యంగా పేర్కొంది. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన జ్యోతి కుటుంబం ఇప్పుడు విషాదంలో మునిగిపోయింది. దీంతో సాయం అందించేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. -
ఈ ఫొటో తీస్తుంటే మొహమాటపడ్డారు..
ముంబై: మహారాష్ట్రకు చెందిన మంజిరి ప్రభు తన సోదరి లీనాతో కలిసి పుణెలో ఆటో ఎక్కారు. గమ్యస్థానానికి చేరుకోగానే డ్రైవర్కు డబ్బు చెల్లించే క్రమంలో కనిపించిన ఓ అతిథి ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. డ్రైవర్ కాళ్ల దగ్గర కూర్చుని, రెండు అందమైన కళ్లేసుకుని తదేకంగా తననే గోముగా చూస్తూ దృష్టిని ఆకర్షించింది. ఆ అతిథి పేరు రీని. ఆటో డ్రైవర్ హర్వీందర్ సింగ్ ప్రియనేస్తం అది. ఎల్లప్పుడూ తనతోనే ప్రయాణం చేస్తుంది. కానీ ఎన్నడూ కస్టమర్లను విసిగించకుండా, ఒద్దికగా ఉంటూ విశ్వాసానికి మారుపేరన్న నానుడిని నిజం చేస్తోంది. ‘రియల్ లైఫ్ శాంటా’’ అంటూ క్రిస్మస్ పర్వదినాన మంజిరి, సదరు ఆటోడ్రైవర్- అతడి పెంపుడు కుక్కకు సంబంధించిన విశేషాలను తన ఫేస్బుక్ పేజీలో షేర్ చేశారు. ఈ స్టోరీ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘‘ఈరోజు నేను నిజమైన శాంటాను కలిశాను. నా సోదరి లీనా, నేను ఆటో ఎక్కాం. దిగిన తర్వాత డ్రైవర్కు డబ్బు ఇస్తున్నాను. అప్పుడే ఓ కుక్కపిల్ల నా కంటపడింది. డ్రైవర్ కాళ్ల దగ్గర ఓ రగ్గుమీద కూర్చుని నన్నే చూస్తోంది. కానీ ప్రయాణం చేస్తున్నంత సేపు తన అలికిడి అస్సలు వినిపంచనేలేదు. వాడి పేరు రోనీ అట. ఆటోడ్రైవర్ చెప్పారు. వీధిలో బేలగా చూస్తున్న ఆ కుక్కపిల్లను అతడి కొడుకు ఓ రోజు ఇంటికి తీసుకువచ్చాడట. అయితే ఎవరిపనుల్లో వారు బిజీగా ఉండటంతో పప్పీని చూసుకోవాల్సిన బాధ్యతను హర్వీందర్ తీసుకున్నారట. ఇంటి నుంచి బయల్దేరే ముందే తనతో పాటు రోనీకి కూడా భోజనం, బిస్కట్లు ఓ బాక్సులో సర్ది తనవెంటే తీసుకువెళ్తారట. నేను ఈ ఫొటో తీస్తుంటే హర్వీందర్ సింగ్ కాస్త మొహమాటపడ్డారు. కానీ కానీ అంతటి దయార్థ హృదయం కలిగిన వారు ఎంతమంది ఉంటారు. సాటి మనుషులను కూడా పట్టించుకోని వ్యక్తులు ఉన్న సమాజంలో మూగజీవి పట్ల ఇంత కేరింగ్ తీసుకుంటున్న ఆయన ఈ ప్రపంచంలో ఇంకా మానవత్వం మిగిలే ఉందని నిరూపిస్తున్నారు. వాళ్లిద్దరి బంధం చూస్తే నాకు ముచ్చటేస్తోంది’’ అని మంజిరి పేర్కొన్నారు.(చదవండి: వైరల్గా మారిన బస్ డ్రైవర్ ఫొటో..) -
ఆన్లైన్ పెళ్లి; ఇన్ని రకాల వంటలా!
ఒకప్పుడు పెళ్లిళ్లంటే కొబ్బరాకులతో ఇంటి ముందు పందిరి.. అరిటాకుల్లో బంతి భోజనాలు.. అంతా కలిసి ఒక్కచోట చేరి ముచ్చట్లు పెట్టే దృశ్యాలు.. వివాహ తంతు ముగిశాక బ్యాండ్ బాజాలతో ఊరేగింపులు గుర్తుకు వచ్చేవి.. అయితే కాలక్రమేణా పెళ్లి వేదిక ఫంక్షన్హాళ్లకు మారింది. ఇక సంపన్నులైతే డెస్టినేషన్ వెడ్డింగ్ పేరిట సుదూర ప్రాంతాలకు బంధు గణాన్ని తరలించి అత్యంత వైభవోపేతంగా వివాహాలు జరిపించే పోకడలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. కాసేపు ఈ విషయాన్ని పక్కన పెడితే.. కరోనా మహమ్మారి దెబ్బకు చాలా మంది శుభకార్యాలు వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం కోవిడ్ కారణంగా సుముహుర్తాన్ని వదులుకోవడం ఇష్టంలేక అత్యంత సన్నిహితుల సమక్షంలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇక లాక్డౌన్ కాలంలో మెజారిటీ ప్రజలు ఆన్లైన్లో వివాహ తంతు కానిచ్చేసి ఆశీర్వచనాలు అందుకున్నారు. వీడియోకాల్లో ఆశీస్సులు ఓకే.. మరి భోజనం సంగతి ఎలా? శుభమస్తు అని దీవించిన బంధువర్గానికి విందు భోజనం పెట్టేదెలా? కల్యాణ సాపాడు పెట్టడం కనీస మర్యాద కదా! అదే పాటించకపోతే ఎలా? ఇలాంటి ఆలోచనలే వెంటాడాయి ఓ తమిళ కుటుంబాన్ని! అందులో పెద్దగా ఆలోచించాల్సి ఏముంది.. ఏ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థనో ఆశ్రయిస్తో సరిపోతుంది కదా అంటారేమో! అదీ నిజమే.. అయితే వాళ్లు డిజిటల్ అతిథులను కేవలం సాదా సీదా భోజనంతో సరిపెట్టేయాలనుకోలేదు. (చదవండి: అందుకే హనీమూన్ రద్దు చేసుకున్నారు!) అందుకే ఆహ్వాన పత్రికతో పాటు అచ్చమైన సంప్రదాయ పద్ధతిలో బుట్టభోజనం, అరిటాకులు, 18 రకాల వంటకాలను పంపించారు. మ్యారేజ్ వెబ్కాస్ట్ వివరాలతో పాటు భోజనాన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో కూడా వివరించే కార్డును కూడా పంపారు. హాయిగా పెళ్లిభోజనం చేస్తూ కంప్యూటర్ల ముందుకు కూర్చుని వధూవరులను ఆశీర్వదించమని కోరారు. ఈ వినూత్న ఆహ్వానాన్ని అందుకున్న శివానీ అనే నెటిజన్ ఇందుకు సంబంధించిన విశేషాలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. డిసెంబరు 10న వివాహ బంధంతో ఒక్కటైన శివప్రకాశ్, మహతి జంటకు నెటిజన్ల నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
మంచికి చెడుకు మధ్య యుద్ధం: వైఎస్ జగన్
పచ్చ మేనిఫెస్టోలో పచ్చి మోసాలు
స్టార్ హీరోయిన్కి హైకోర్టు నుంచి నోటీసులు.. కారణం ఏంటంటే?
తగ్గుతున్న పంట దిగుబడి.. ఆరెంజ్ జ్యూస్ ఫ్యూచర్లపై ప్రభావం
నా స్నేహితుడు: అల్లు అర్జున్
‘కేజ్రీవాల్ అవుట్ కాలేదు.. రిటైర్డ్ హర్ట్ అయ్యారంతే’
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్.. ఆర్జేడీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
మంచికి చెడుకు మధ్య యుద్ధం: వైఎస్ జగన్
మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
కైకలూరులో సీఎం జగన్ కాన్వాయ్ ర్యాలీ కిక్కిరిసిన జనం
తప్పక చదవండి
- ‘ఫోర్లు, సిక్స్లు కొట్టడంలో తనకు తానే పోటీ’.. కేజ్రీపై మాన్
- ‘మిమ్మల్ని ప్రాధేయ పడుతున్న’.. కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
- టీడీపీ, పవన్కు మంత్రి బొత్స కౌంటర్
- సీఎం జగన్కు ఇంత మంది శత్రువులు ఎలా అయ్యారు?
- బాబును సీఎం చేసేందుకే ఈ లేనిపోని పెంట వార్తలు: పోసాని
- నీతో ప్రచారం చేస్తే నా ఓటమి ఖాయం... కేశినేని చిన్ని
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement