దొంగ తెలివి... చాక్లెట్లు కూడా బంగారమే! | Shamshabad Airport Police Found Gold Biscuits And Chocolates | Sakshi
Sakshi News home page

Hyderabad Airport Seized Gold దొంగ తెలివి... చాక్లెట్‌, బిస్కెట్‌ బంగారమే..

Sep 28 2021 7:56 AM | Updated on Sep 28 2021 7:57 AM

Shamshabad Airport Police Found Gold Biscuits And Chocolates - Sakshi

శంషాబాద్‌: అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రియాద్‌ నుంచి జజీరా ఎయిర్‌లైన్స్‌ విమానంలో సోమవారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికుడి కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. దీంతో కస్టమ్స్‌ అధికారులు అతడిని క్షుణ్నంగా తనిఖీ చేశారు. అతడి సామగ్రిలో చాక్లెట్లు, బిస్కెట్లలో 763 గ్రాముల బరువు కలిగిన బంగారు బిస్కెట్లు, నాణేలు బయటపడ్డాయి. వాటి విలువ 32.24 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.

చదవండి: ‘డ్రోన్‌ డెలివరీ’ అద్భుతం: వరద ప్రభావిత ప్రాంతాల్లో మందుల సరఫరా’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement