నన్ను చంపేస్తానని బెదిరించాడు.. సీఎస్పై మంత్రి సంచలన ఆరోపణలు..
Published
Sun, May 21 2023 11:41 AM
న్యూఢిల్లీ: ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ సంచలన ఆరోపణలు చేశారు. చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ తనను చంపుతానని బెదిరిస్తున్నారని తెలిపారు. ఈమేరకు ఆయన శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేపడతామన్నారు.
రాత్రి 9:30 గంటల సమయంలో తన కార్యాలయానికి వచ్చిన సీఎఎస్.. 'నిన్ను చంపేస్తా' అని భయభ్రాంతులకుగురి చేశారని మంత్రి పేర్కొన్నారు. కాగా చీఫ్ సెక్రెటరీ తనను బెదిరిస్తున్నారని లెఫ్టినెంట్ గవర్నర్కు కూడా భరద్వాజ్ ఫిర్యాదు చేశారు. కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు.