mark zuckerberg
-
వారి కోసం జుకర్బర్గ్ ఫ్యావరెట్ హుడీ వేలం : మార్క్ డ్యాన్స్ వైరల్ వీడియో
మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ తనకెంతో ఇష్టమైన పాత హుడీని వేలం వేశారు. తద్వారా వచ్చిన సొమ్మును టెక్సాస్ పాఠశాల సంక్షేమం కోసం వినియోగించనున్నారు. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం, ఈ ప్రియమైన హూడీతోపాటు బిడ్ దక్కించుకున్న వ్యక్తికి జుకర్బర్గ్ స్వయంగా చేతితో రాసిన నోట్ కూడా దక్కింది. దీనిని ఫేస్బుక్ స్టేషనరీలో రూపొందించారట.2019లో తరచుగా ధరించే నల్లటి హూడీ లాస్ ఏంజిల్స్లో జరిగిన వేలంలో భారీ ధరకు అమ్ముడు బోయింది. జూలియన్స్ ఆక్షన్స్ వారి "స్పాట్లైట్: హిస్టరీ అండ్ టెక్నాలజీ" సిరీస్లో భాగంగా గత గురువారం ఈ వేలం నిర్వహించింది. దీనికున్న పర్సనల్ టచ్, క్రేజ్ అభిమానులను స్పష్టంగా ఆకట్టుకున్నాయి. దీంతో చాలా వేగంగా బిడ్డింగ్ జరిగింది. దాదాపు 22 బిడ్లు వచ్చాయి. చివరకు రూ.13 లక్షల కంటే ఎక్కువ ధర పలికింది. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) ఇది తన ఆల్-టైమ్ ఫేవరెట్లలో ఒకటిగా అభివర్ణించారు జుకర్బర్గ్. , "నేను తొలినాళ్లలో దీన్ని ఎప్పుడూ ధరించేవాడిని. దాని లోపల మా అసలు మిషన్ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అయి ఉంది" అని గుర్తు చేసుకున్నారు. ఈ హూడీ 2010 నాటిది. ఇదే ఏడాది జుకర్బర్గ్ టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యారు. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం సొమ్మను టెక్సాస్లోని పాఠశాల పిల్లలకు మద్దతు ఇవ్వడానికి అంకితం చేస్తామని మార్క్ ప్రకటించారు. దీంతోపాటు పాటు ఆపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ధరించిన సిగ్నేచర్ బో టై కూడా వేలంలో అమ్ముడైన ఇతర ప్రసిద్ధ వస్తువులలో ఒకటిగా దాదాపు రూ. 31 కోట్లకు బిడ్దక్కించుకుంది. దీని అసలు ధర వెయ్యి డాలర్లుమాత్రమే.మార్క్ డ్యాన్స్, భార్య ఫిదా మరోవైపు మార్చి 1న, భార్య ప్రిస్సిల్లా చాన్ పుట్టినరోజు సందర్భంగా జుకర్బర్గ్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ టక్సేడోలో పార్టీలో ఎంట్రీఇచ్చి టక్సేడోను చింపేసి మరీ, ఒక్క ఉదుటున స్టేజ్పైకి అద్భుతమైన నీలిరంగు జంప్సూట్లో పాట పాడి, డ్యాన్స్ చేశాడు. దీంతో చాన్ ఫిదా అయిపోయింది. తెగ వైరలవుతోంది. 2025 గ్రామీ అవార్డుల వేడుకలో బెన్సన్ బూన్ బ్యూటిఫుల్ థింగ్స్ ప్రదర్శన ఇస్తున్నప్పుడు ధరించిన జంప్సూట్ కూడా ఇలాంటిదేనట. -
నాకు మరణశిక్ష పడేలా ఉంది: జుకర్ బర్గ్
వాషింగ్టన్ : ఎవరో ఫేస్బుక్లో (Facebook) పోస్ట్లు పెడితే.. దానికి నన్ను బాధ్యుడ్ని చేస్తూ.. నాకు మరణశిక్ష విధించాలని పలువురు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. నాకు మరణశిక్ష పడేలా ఉంది అని’ మెటా (Meta) సీఈవో మార్క్ జూకర్బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జో రోగన్ పాడ్కాస్ట్ (Joe Rogan Podcast)లో జూకర్బర్గ్ పై విధంగా మాట్లాడారు.ఆ పాడ్కాస్ట్లో జూకర్ బర్గ్ పాకిస్తాన్ చట్టాలపై ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్లో ఫేస్బుక్ చట్టపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. ఓ నెటిజన్ దైవదూషణకు సంబంధించిన పోస్టులను ఫేస్బుక్లో షేర్ చేశాడు. ఆ పోస్టు పెట్టినందుకు నాపై పలువురు కోర్టును ఆశ్రయించారు. నాకు మరణశిక్ష విధించాలని కోరారు. ప్రస్తుతం, ఈ కేసులపై విచారణ కొనసాగుతోంది.ఆ కేసు విచారణపై జూకర్ బర్గ్ ప్రస్తావించారు. స్థానిక నిబంధనలు, సాంస్కృతిక విలువల విషయంలో మెటా నిబద్ధతతో ఉంది. ఉదాహరణకు, పాకిస్తాన్కు చెందిన ఓ యూజర్ దైవాన్ని దూషిస్తూ పోస్టులు పెట్టారు. అలా పోస్టులు పెట్టడంపై పలువురు నాపై దావా వేశారు. క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగుతున్నాయి. ఇది ఎక్కడికి వెళుతుందో నాకు తెలియదు. ఎందుకంటే నేను పాకిస్తాన్కు వెళ్లాలని అనుకోవడంలేదు. కాబట్టి నేను దాని గురించి ఆందోళన చెందడం లేదు’ అని జుకర్బర్గ్ స్పష్టం చేశారు. Power of Pakistan 😂 pic.twitter.com/V4qokhbq76— Kreately.in (@KreatelyMedia) February 11, 2025👉చదవండి : తగ్గేదేలే.. మరోసారి ఎల్ అండ్ టీ చైర్మన్ వివాదాస్పద వ్యాఖ్యలు -
మార్క్ జుకర్బర్గ్ (ఫేస్బుక్) రాయని డైరీ
వాషింగ్టన్ లో ప్రెసిడెంట్ ఇనాగరేషన్ కు వెళ్లి, తిరిగి క్యాలిఫోర్నియాలో మేము ఉంటున్న పాలో ఆల్టోకి వచ్చేసరికి వైట్ హౌస్ నుండి ఫోన్ కాల్!‘‘మిస్టర్ జుకర్బర్గ్! నేను అలెక్స్ ఎన్ వాంగ్, యునైటెడ్ స్టేట్స్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని మాట్లాడుతున్నాను. ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ లైన్ లోకి రావటం కోసం దయచేసి కొద్ది క్షణాలు మీరు వేచి ఉండగలరా?’’ – అని !! ‘‘ఎస్... ప్లీజ్’’ అన్నాను.‘ఎవరు?!’ అన్నట్లు ప్రిసిల్లా నావైపు చూసింది. టేబుల్ మీద ఉన్న ‘లాస్ ఏంజిల్స్ టైమ్స్’ లో ట్రంప్ ఫొటోను కనుసైగగా ఆమెకు చూపించాను.పిల్లల్ని తీసుకుని ప్రిసిల్లా పక్క గదిలోకి వెళ్లిపోయింది. మాక్సిమా, ఆగస్ట్, ఆరేలియా ఎప్పుడూ తల్లిని చుట్టుకునే ఉంటారు. తొమ్మిదేళ్లొకరికి, ఏడేళ్లొకరికి. రెండేళ్లొకరికి! కాలేజ్లో ప్రిసిల్లా అంటే... ప్రిసిల్లా–నేను. ఇప్పుడు ప్రిసిల్లా అంటే ‘ఆల్ గర్ల్ టీమ్’ లా పిల్లలు–తను! కలిసి తిరుగుతుంటారు. కలిసి ఆడుతుంటారు. బుద్ధి పుడితే ఎప్పుడైనా ‘పోన్లే పాపం డాడ్...’ అన్నట్లు నన్ను తమ జట్టులోకి చేర్చుకుంటారు.‘‘మిస్టర్ జుకర్బర్గ్! లైన్ లోనే ఉన్నారా...?’’ అన్నారు అలెక్స్ ఎన్ వాంగ్, నిర్ధారణ కోసం.‘‘ఎస్... మిస్టర్ వాంగ్! నేను లైన్ లోనే ఉన్నాను...’’ అన్నాను.హఠాత్తుగా ‘‘హాయ్ జాక్...’’ అంటూ లైన్ లోకి వచ్చేశారు ట్రంప్!‘‘సర్ప్రైజింగ్, మిస్టర్ ప్రెసిడెంట్!’’ అన్నాను.‘‘నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలనని చెప్పటానికే నీకు ఫోన్ చేశాన్ జాక్...’’ అన్నారు ట్రంప్!!‘‘ఏ విషయం గురించి మిస్టర్ ప్రెసిడెంట్!!’’ అని అడిగాను.‘‘వెల్... జాక్! నా ఇనాగరేషన్ లో నువ్వు నీ పక్కనున్న స్త్రీమూర్తిని – ఆమె కంఠానికి దిగువనున్న భాగం వైపు – ఆపేక్షగా చూశావని అంతా నిన్ను ట్రోల్ చేయటం గురించే అంటున్నా! మగవాళ్లు నిప్పులా ఉన్నా నిందలు తప్పవు. లుక్! స్త్రీ విషయంలో నోరు జారిన మగాడినైనా ఈ లోకం క్షమిస్తుంది కానీ, చూపు జారిన మగాడికి ఏ లోకంలోనూ క్షమాపణ లభించదు...’’ అన్నారు ట్రంప్.‘‘థ్యాంక్యూ మిస్టర్ ప్రెసిడెంట్’’ అన్నాను.ఆయన అంటున్న ఆ స్త్రీ మూర్తి లారెన్ సాంచెజ్! జెఫ్ బెజోస్ ప్రియురాలు. ఇనాగరేషన్ లో నాకు ఒక పక్క నా భార్య,ఇంకో పక్క ఆమె ఉన్నారు. ఆమెకు అటువైపున నిలబడి ఉన్న జెఫ్ బెజోస్ ఏదో చెబుతుంటే, నేను తలతిప్పి చూసినప్పుడు, నా చూపు ఆమె ‘లో–నెక్’ లోపలికి స్లిప్ అయినట్లుంది. అంత బ్యాడ్ మోమెంట్ లేదు నా లైఫ్లో!ఇలాంటి సంక్షోభ సమయంలో లోకంలోని ఒక మగవాడు నాకు సపోర్ట్గా రావటం బాగుంది. అయితే ఆ మగవాడు డోనాల్డ్ ట్రంప్ కాకపోయుంటే నాకు మరింత సపోర్టివ్గా అనిపించేది.‘‘వింటున్నావా జాక్? నువ్వు ఆమెను చూడాలని చూడలేదని నాకు తెలుసు. చూడటం వేరు. చూపు పడటం వేరు. కానీ జాక్, నీపైన వచ్చిన లక్ష కామెంట్లలో ఒకటైతే నాకు భలే నచ్చింది. మొదటిసారి నువ్వొక హ్యూమన్ లా స్పందించావట! హాహ్హహా...’’ అంటూ పెద్దగా నవ్వారు ట్రంప్. నేనూ నవ్వాపుకోలేకపోయాను.‘హాయ్ జాక్’ అంటూ లైన్ లోకి వచ్చినంత హఠాత్తుగా ‘బాయ్ జాక్’ అంటూ లైన్ లోంచి వెళ్లిపోయారు ట్రంప్.ఫోన్ పెట్టేశాక, ‘‘ఏమిటట?’’ అని ప్రిసిల్లా.పక్కన పిల్లల్లేరు! నిద్రబుచ్చి వచ్చినట్లుంది.‘‘అదే, ఆ బ్యాడ్ మోమెంట్ గురించి ట్రంప్ నన్ను సపోర్ట్ చేస్తున్నారు... ’’ అని చెప్పాను.ప్రిసిల్లా నవ్వింది.‘‘అది బ్యాడ్ మోమెంట్ కాదు బాస్, బ్యాడ్ ఫొటోగ్రాఫ్... ‘ అంది, నన్ను అతుక్కుపోతూ.ప్రిసిల్లా అంటే... ఇప్పుడు మళ్లీ ప్రిసిల్లా–నేను... కాలేజ్ డేస్ తర్వాత ఇన్నేళ్లకు! -
త్వరలో స్మార్ట్ ఫోన్ అంతం!! తర్వాత రాబోయేది ఇదే..
విశ్వవ్యాప్త సాంకేతికతను అంగీకరించడంలో మనిషి ఎప్పుడూ ముందుంటాడు. దానిని అంతే వేగంగా ఒడిసిపట్టుకుని అంగీకరిస్తుంటాడు కూడా. అయితే దశాబ్దాలపాటు మనందరి జీవితంలో భాగమైన మొబైల్ ఫోన్.. త్వరలో అంతం కానుందా?. అన్నింటికీ నెక్స్ట్(అడ్వాన్స్డ్) లెవల్ కోరుకునే మనిషికి వాటి స్థానంలో ఎలాంటి సాంకేతికత అందుబాటులోకి రాబోతోంది?..మనిషి జీవితంలో మొబైల్ ఫోన్లు(Mobile Phones) రాక ఒక క్రమపద్ధతిలో జరిగింది. కమ్యూనికేషన్లో భాగంగా.. రాతి కాలం నుంచి నేటి ఏఐ ఏజ్ దాకా రకరకాల మార్గాలను మనిషి అనుసరిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో పొగతో సిగ్నల్స్ ఇవ్వడం దగ్గరి నుంచి.. పావురాల సందేశం, డ్రమ్ములు వాయించడం, బూరలు ఊదడం లాంటి ద్వారా సమాచారాన్ని ఇచ్చుపుచ్చుకునేవాడు. కొన్ని ఏండ్లకు అది రాతపూర్వకం రూపంలోకి మారిపోయింది. ఆపై.. ఆధునిక యుగానికి వచ్చేసరికి టెలిగ్రఫీ, టెలిఫోనీ, రేడియో కమ్యూనికేషన్, టెలివిజన్, మొబైల్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్-ఈమెయిల్, స్మార్ట్ఫోన్, సోషల్ మీడియా.. ఆపై మోడ్రన్ కమ్యూనికేషన్(Modern Communication)లో భాగంగా ఏఐ బేస్డ్ టూల్స్ ఉపయోగం పెరిగిపోవడం చూస్తున్నాం. అయితే.. ఇన్నేసి మార్పులు వచ్చినా దశాబ్దాల తరబడి మొబైల్ ఫోన్ల డామినేషన్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. కాలక్రమంలో మనిషికి ఫోన్ ఒక అవసరంగా మారిపోయిందది. మరి అలాంటిదానికి అసలు ‘అంతం’ ఉంటుందా?అమెరికా వ్యాపారవేత్త, ఫేస్బుక్ సహా వ్యవస్థాపకుడు, ప్రస్తుత మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్(Mark Zuckerberg) సెల్ఫోన్ స్థానంలో తర్వాతి టెక్నాలజీ ఏంటో అంచనా వేస్తున్నారు. సెల్ఫోన్ల అంతం త్వరలోనే ఉండబోతోందని, వాటి స్థానాన్ని స్మార్ట్ గ్లాసెస్ ఆక్రమించబోతున్నాయని అంచనా వేస్తున్నారు.రాబోయే రోజుల్లో వేరబుల్ టెక్నాలజీ(ఒంటికి ధరించే వెసులుబాటు ఉన్న సాంకేతికత) అనేది మనిషి జీవితంలో భాగం కానుంది. సంప్రదాయ ఫోన్ల కంటే స్మార్ట్ గ్లాసెస్ను ఎక్కువగా వినియోగిస్తాడు. వీటిని వాడడం చాలా సులువనే అంచనాకి మనిషి త్వరగానే వస్తాడు. అవుట్డేటెడ్ విషయాలను పక్కన పెట్టడం, ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నప్పుడు మనమూ అంగీకరించడం సర్వసాధారణంగా జరిగేదే. నా దృష్టిలో రాబోయే రోజుల్లో తమ చుట్టుపక్కల వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేందుకు స్మార్ట్ గ్లాసెస్(Smart Glasses)లాంటివి ఎక్కువగా వాడుకలోకి వస్తుంది. ఆ సంఖ్య ఫోన్ల కంటే కచ్చితంగా ఎక్కువగా ఉంటాయి’’ అని జుకర్బర్గ్ అభిప్రాయపడ్డారు.అలాగే 2030 నాటికి సెల్ఫోన్ల వాడకం బాగా తగ్గిపోతుందని.. దానికి బదులు స్మార్ట్గ్లాసెస్ తరహా టెక్నాలజీ వాడుకలో ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. అయితే వేరబుల్ టెక్నాలజీ ఖరీదుతో కూడుకున్న వ్యవహారమని.. అలాగని దానిని అందరికీ అందుబాటులోకి తేవడం అసాధ్యమేమీ కాదని, అంచలంచెలుగా అది జరుగుతుందని ఆయన చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. స్మార్ట్ఫోన్లతోపాటు వాటికి అనువైన స్మార్ట్ యాక్ససరీస్కు మార్కెట్లో ఇప్పుడు డిమాండ్ ఉంటోంది. తాజా సర్వేల ప్రకారం.. గత ఐదేళ్లుగా స్మార్ట్ వేరబుల్స్ వినియోగం పెరుగుతూ వస్తోంది. దీంతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు టెక్ కంపెనీలు సైతం సరికొత్త ఫీచర్స్తో స్మార్ట్ వేరబుల్స్ను విడుదల చేస్తున్నాయి. అందునా స్మార్ట్గ్లాసెస్ వినియోగమూ పెరిగింది కూడా. రేబాన్ మెటా, ఎక్స్ రియల్ ఏ2, వచుర్ ప్రో ఎక్స్ఆర్, సోలోస్ ఎయిర్గో విజన్, అమెజాన్ ఎకో ఫఫ్రేమ్స్, లూసిడ్ తదితర బ్రాండ్లు మార్కెట్లోకి అందుబాటులోకి ఉన్నాయి. యాపిల్ కంపెనీ యాపిల్ విజన్ ప్రో పేరిట మార్కెట్కు తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. మరికొన్ని కంపెనీలు కూడా ఇంకా ఈ లిస్ట్లో ఉన్నాయి.ఇదీ చదవండి: జుకర్బర్గ్ చేతికి అత్యంత అరుదైన వాచ్!! -
మెటా క్షమాపణలు చెప్పాలి.. పార్లమెంటరీ కమిటీ సమన్లు..?
ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ప్లాట్ఫామ్స్ ఇంక్(Meta) చర్యలను భారత పార్లమెంటరీ ప్యానెల్ పరిశీలిస్తోంది. 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ చేసిన వ్యాఖ్యలపై కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీకి సారథ్యం వహిస్తున్న డాక్టర్ నిషికాంత్ దూబే నేతృత్వంలోని ప్యానెల్ మెటాకు సమన్లు జారీ చేయాలని యోచిస్తోంది.అసలేం జరిగిందంటే..2024 లోక్సభ ఎన్నికలకు ముందు జరిగిన ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మెటా సీఈఓ మాట్లాడుతూ.. కోవిడ్ -19 మహమ్మారిని నిర్వహించడంలో భారత ప్రభుత్వం విఫలమైందన్నారు. దాంతో ప్రస్తుత ప్రభుత్వం 2024 ఎన్నిక(2024 Lok Sabha elections)ల్లో విజయం సాధించబోదని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఈ అంశంపై అప్పట్లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ మార్క్ జూకర్బర్గ్ మాటలు తప్పని రుజువైందన్నారు. ప్రజలు తమ పార్టీకే స్పష్టమైన మెజార్జీ అందించారని చెప్పారు. జూకర్బర్గ్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.తప్పుడు సమాచారం..కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీకి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ దూబే ప్రజాస్వామ్య దేశంలో ఖచ్చితమైన సమాచారం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ‘ఈ తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేసినందుకు కమిటీ(parliamentary panel) మెటాపై చర్య తీసుకోవాలని చూస్తుంది. ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా తప్పుడు సమాచారం దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది. ఈ పొరపాటుకు ఆ సంస్థ భారత పార్లమెంటుకు, ఇక్కడి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’ అన్నారు దూబే అన్నారు.ఇదీ చదవండి: పనితీరు సరిగాలేదా? సర్దుకోవాల్సిందే..సమాచార నిర్ధారణకు బాధ్యతమెటాకు సమన్లు జారీ చేయాలని పార్లమెంటరీ ప్యానెల్ తీసుకున్న నిర్ణయం.. తప్పుడు సమాచారం వ్యాప్తి, ప్రజాస్వామ్య వ్యవస్థలో దాని ప్రభావంపై పెరుగుతున్న ఆందోళనలను నొక్కి చెబుతుంది. ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల పాత్రపై కూడా చర్చ జరగాల్సి ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. తమ ప్లాట్ఫామ్లో పంచుకునే సమాచారం ఖచ్చితత్వాన్ని నిర్ధారించడంలో టెక్ దిగ్గజాలు బాధ్యత వహించాలని చెబుతున్నారు. -
జుకర్బర్గ్ వ్యాఖ్యలు.. మెటాకు భారత్ సమన్లు
సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కేంద్రం సమన్లు జారీ చేయనుంది. లోక్సభ ఎన్నికలపై ఆ సంస్థ బాస్ మార్క్ జుకర్బర్గ్ చేసిన ‘అసత్య ప్రచారపు’ వ్యాఖ్యలే అందుకు కారణం. గతేడాది భారత్ సహా ప్రపంచంలో అనేక దేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓటమి చెందాయని జుకర్బర్గ్ (Mark Zuckerberg) ఇటీవల ఓ పాడ్కాస్ట్లో వ్యాఖ్యానించారు. అయితే.. జుకర్బర్గ్ చేసిన వాదనను భారత ప్రభుత్వం ఖండించింది. బీజేపీ ఎంపీ, ఐటీ & కమ్యూనికేషన్ పార్లమెంటరీ హౌజ్ ప్యానెల్ చైర్మన్ నిషికాంత్ దుబే మెటాకు సమన్లు పంపే విషయాన్ని ధృవీకరించారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినందుకే సమన్లు అని ఎక్స్ వేదికగా తెలిపారాయన. मेरी कमिटि इस ग़लत जानकारी के लिए @Meta को बुलाएगी । किसी भी लोकतांत्रिक देश की ग़लत जानकारी देश की छवि को धूमिल करती है । इस गलती के लिए भारतीय संसद से तथा यहाँ की जनता से उस संस्था को माफ़ी माँगनी पड़ेगी https://t.co/HulRl1LF4z— Dr Nishikant Dubey (@nishikant_dubey) January 14, 2025ప్రజాస్వామ్య దేశం విషయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం.. ఆ దేశ ప్రతిష్టకు భంగం కలిగించడమే అవుతుంది. ఈ తప్పునకు భారత దేశ ప్రజలకు, చట్ట సభ్యులకు క్షమాపణ చెప్పాల్సిందే అని దుబే ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. అంతకు ముందు.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో.. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏపై ఓటర్లు విశ్వాసం ఉంచి వరుసగా మూడోసారి గెలిపించారని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) కౌంటర్ బదులిచ్చారు.‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో 2024లో నిర్వహించిన ఎన్నికల్లో 64కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై విశ్వాసం ఉందని తేల్చిచెప్పారు. కొవిడ్-19 తర్వాత భారత్ సహా అధికారంలో ఉన్న అనేక ప్రభుత్వాలు ఓడిపోయాయి అని జుకర్బర్గ్ చెప్పడంలో వాస్తవం లేదు. .. 80 కోట్ల మందికి ఉచిత ఆహారం మొదలు 220కోట్ల వ్యాక్సిన్లు అందించడంతోపాటు కొవిడ్ సమయంలో ప్రపంచ దేశాలకు భారత్ సాయం చేయడం వంటి నిర్ణయాలు మోదీ మూడోసారి విజయానికి నిదర్శనంగా నిలిచాయి’’ అని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. అలాగే జుకర్బర్గ్ అలా మాట్లాడటం నిరాశకు గురిచేసిందన్న అశ్వినీ వైష్ణవ్.. వాస్తవాలు, విశ్వసనీయతను కాపాడుకుందామంటూ మెటాను టాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.జుకర్బర్గ్ ఏమన్నారంటే..జనవరి 10వ తేదీన ఓ పాడ్కాస్ట్లో జుకర్బర్గ్ మాట్లాడారు. 2024 సంవత్సరం భారీ ఎన్నికల సంవత్సరంగా నిలిచింది. ఉదాహరణగా.. భారత్తో సహా ఎన్నో దేశాల్లో ఎన్నికలు జరిగాయి. అయితే అన్నిచోట్లా అక్కడి ప్రభుత్వాలు అక్కడ ఓడిపోయాయి. దీనికి కరోనాతో ఆయా ప్రభుత్వాలు డీల్ చేసిన విధానం.. అది దారితీసిన ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణం అని అన్నారాయన. -
యాపిల్పై జుకర్బర్గ్ తీవ్ర వ్యాఖ్యలు
దిగ్గజ పారిశ్రామిక వేత్త, మెటా సీఈఓ 'మార్క్ జుకర్బర్గ్' (Mark Zuckerberg).. 'జో రోగన్ ఎక్స్పీరియన్స్'లో మాట్లాడుతూ యాపిల్ (Apple)ను విమర్శించారు. గ్లోబల్ కనెక్టివిటీని విప్లవాత్మకంగా మార్చినందుకు ఐఫోన్లను ప్రశంసిస్తూనే.. కంపెనీ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించడం లేదని, ఈ విషయంలో యాపిల్ విఫలమైందని అన్నారు.ఐఫోన్ బాగుంది, ఎందుకంటే ప్రపంచంలోని చాలామంది దగ్గర ఇప్పుడు ఈ ఫోన్ ఉందని చెబుతూనే.. సంస్థ కొంతకాలంగా గొప్పగా ఏమీ కనుగొనలేదని జుకర్బర్గ్ వెల్లడించారు. స్టీవ్ జాబ్స్ ఐఫోన్ను కనుగొన్నారు. అయితే సంస్థ కేవలం దానిపై 20ఏళ్లుగా పనిచేస్తోంది. ప్రతి ఏటా కొత్త వెర్షన్స్ లాంచ్ చేస్తోంది. కానీ అవి పాత వెర్షన్ల కంటే మెరుగ్గా లేదు. ఈ కారణంగానే చాలా తక్కువ మంది మాత్రమే కొత్త ఐఫోన్లను కొనుగోలు చేస్తున్నారని అన్నారు.సంస్థ అందిస్తున్న కొత్త ఐఫోన్ మోడళ్లలో పెద్దగా అప్గ్రేడ్లు లేకపోవడం వల్ల ఫోన్ విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే కంపెనీ కొనుగోలుదారులపై, డెవలపర్లపై ఈ 30 శాతం పన్ను విధిస్తోందని.. ఇలాంటి వాటి వల్లనే యాపిల్ లాభపడుతోందని జుకర్బర్గ్ పేర్కొన్నారు.యాపిల్ ఇతర కంపెనీల పరికరాలను iPhoneలతో సజావుగా ఎలా పని చేయనివ్వదు అనే దాని గురించి జుకర్బర్గ్ కలత చెందారు. దీనికి ఆయన ఎయిర్పాడ్లను ఉదాహరణగా చూపాడు, అదే కనెక్షన్ టెక్నాలజీని ఉపయోగించకుండా ఇతర కంపెనీలను బ్లాక్ చేస్తుందని వివరించారు.ఇదీ చదవండి: 'సరిగ్గా 10 గంటలు.. ప్రపంచాన్ని మార్చేయొచ్చు': ఆనంద్ మహీంద్రాతమ రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్ కోసం యాపిల్ కనెక్షన్ ప్రోటోకాల్ను ఉపయోగించమని మెటా చేసిన అభ్యర్థనను.. భద్రతా కారణాల వల్ల యాపిల్ తిరస్కరించింది. వినియోగదారు గోప్యత పట్ల నిజమైన ఆందోళన కంటే కూడా వ్యాపార ప్రయోజనాల కారణంగా అభ్యర్థనను తిరస్కరించినట్లు జుకర్బర్గ్ చెప్పారు.యూజర్ల గోప్యత, భద్రతపై యాపిల్ వైఖరిని ఆయన విమర్శించారు. యాపిల్ కనిపెట్టిన కొత్త వాటిలో 'విజన్ ప్రో' ఒకటి మాత్రమే అని నేను అనుకుంటున్నానని.. కంపెనీ మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ గురించి జుకర్బర్గ్ ప్రస్తావించారు. ఇది కూడా సరైన అమ్మకాలు పొందలేదని ఆయన అన్నారు. -
జుకర్బర్గ్ చేతికి అరుదైన వాచ్: ధర అన్ని కోట్లా?
ప్రపంచ ధనవంతులలో ఒకరు, మెటా సీఈఓ 'మార్క్ జుకర్బర్గ్' (Mark Zuckerberg) ఇటీవల ఓ ఖరీదైన, అరుదైన వాచ్ కట్టుకుని కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వాచ్ గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు.మార్క్ జుకర్బర్గ్ కట్టుకున్న వాచ్ గ్రూబెల్ ఫోర్సే 'హ్యాండ్ మేడ్ 1'. దీని ధర 9,00,000 డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం ఇది రూ. 7 కోట్ల కంటే ఎక్కువ. ఇది చూడటానికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ వాచ్ ధర కోట్లలో ఉండటం వల్ల దీనిని కొనొగోలు చేసేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది. అయితే ఈ వాచ్ కలిగిన కుబేరుల జాబితాలో జుకర్బర్గ్ ఒకరు.గ్రూబెల్ ఫోర్సే 'హ్యాండ్ మేడ్ 1' వాచ్'హ్యాండ్ మేడ్ 1' (Hand Made 1) అనేది విలాసవంతమైన, ఖరీదైన వాచ్ల జాబితాలో ఒకటి. దీనిని ప్రఖ్యాత స్విస్ వాచ్మేకర్ గ్రూబెల్ ఫోర్సే ఎస్ఏ ఉత్పత్తి చేసింది. ఇవి చాలా అరుదైన వాచ్లు. ఎందుకంటే కంపెనీ కూడా వీటిని తక్కువ సంఖ్యలో (ఏడాదికి రెండు లేదా మూడు) మాత్రమే ఉత్పత్తి చేస్తుంది.మార్క్ జుకర్బర్గ్ ఖరీదైన వాచ్లు కట్టుకుని కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఈయన పటెక్ ఫిలిప్, ఎఫ్పీ జర్న్ వంటి బ్రాండ్ వాచ్లను కట్టుకుని కనిపించారు. కాగా ఇప్పుడు గ్రూబెల్ ఫోర్సే 'హ్యాండ్ మేడ్ 1' వాచ్తో కనిపించారు. ప్రస్తుతం ఫేస్బుక్ సీఈఓ ధరించిన వాచ్ మీద పలువురు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.మార్క్ జుకర్బర్గ్ ఖరీదైన గడియారాన్ని కట్టుకోవడం వెనుక ఏమైనా ఆలోచన ఉందా? అని ఒకరు అన్నారు. ఫేస్బుక్ సత్యం, వాస్తవాలపై దృష్టి పెట్టాలని మరొకరు పేర్కొన్నారు. ఈ వాచ్ ఖరీదు చాలామంది ఇళ్ల ఖరీదు కంటే ఎక్కువ అని ఇంకొకరు అన్నారు. ఇలా నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.వాచ్ల మీద అమితాసక్తి కలిగిన మార్క్ జుకర్బర్గ్.. అనంత్ అంబానీ & రాధికా మర్చంట్ల వివాహానికి హాజరైనప్పుడు కూడా వాచ్ల ప్రస్తావన వచ్చింది. జుకర్బర్గ్ భార్య ప్రిసిల్లా చాన్, అనంత్ ధరించిన విలాసవంతమైన గడియారాన్ని మెచ్చుకోవడానికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అయింది.ఇదీ చదవండి: ఒక్క రీఛార్జ్.. 425 రోజులు వ్యాలిడీటీ: ఈ నెల 16 వరకే ఛాన్స్అనంత్ అంబానీ వాచ్ముకేశ్ అంబానీ తనయుడు.. అనంత్ అంబానీ ఇటీవల రూ. 22 కోట్ల విలువైన వాచ్ కట్టుకుని కనిపించారు. ఆ వాచ్ ది రిచర్డ్ మిల్లే RM 52-04 స్కల్ బ్లూ సఫైర్ అని తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన వాచీలలో ఇది ఒకటి. ఇలాంటివి ప్రపంచంలో కేవలం మూడు మాత్రమే ఉన్నాయని సమాచారం. ఈ వాచ్ రష్యా అధ్యక్షుడు 'వ్లాదిమిర్ పుతిన్' ప్రెస్ సెక్రటరీ 'డిమిత్రి పెస్కోవ్' (Dmitry Peskov) వద్ద కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రిచర్డ్ మిల్లే RM 52-04 బ్లూ సఫైర్ ఒకే పీస్తో తయారు చేశారు. ఇది చూడటానికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. -
అమెజాన్ రూ.8.3 కోట్లు విరాళం
కొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార నిధికి అమెజాన్ ఒక మిలియన్ డాలర్లు(రూ.8.3 కోట్లు) విరాళంగా ఇవ్వాలని యోచిస్తోంది. తన ప్రైమ్ వీడియో సర్వీస్లో ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా ప్రసారం చేయనుందని కంపెనీ ప్రతినిధి ఇప్పటికే ధ్రువీకరించారు. ఇందుకోసం అమెజాన్ మరో రూ.8.3 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ నేపథ్యంలో త్వరలో బెజోస్ ట్రంప్ను కలవబోతున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి.ఇప్పటికే మెటా ఛైర్మన్ మార్క్ జూకర్బర్గ్ ఇటీవల ట్రంప్ నివాసంలో కలిసి తన ప్రమాణ స్వీకార నిధికి ఒక మిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. కాబోయే అధ్యక్షుడితో తమ సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రధాన టెక్ కంపెనీలు ప్రయత్నిస్తున్నట్లు తెలిస్తుంది. కాగా, ట్రంప్ తన మొదటి పదవీకాలంలో అమెజాన్ను విమర్శించారు. గతంలో బెజోస్కు చెందిన వాషింగ్టన్ పోస్ట్లో రాజకీయ కవరేజీపై ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. 2019లో ట్రంప్ మొదటి హయాంలో పెంటగాన్ కాంట్రాక్ట్కు సంబంధించి అమెజాన్కు విరుద్ధంగా వ్యవహరించారనే వాదనలున్నాయి.ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బెజోస్ న్యూయార్క్లో జరిగిన డీల్ బుక్ సమ్మిట్లో మాట్లాడుతూ ట్రంప్ రెండోసారి అధికారంలోకి రావడంపై సంతోషంగా ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న ప్రణాళికలను సమర్థిస్తున్నట్టు తెలిపారు. 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి తర్వాత ట్రంప్ ఫేస్బుక్ ఖాతాను నిలిపేస్తున్నట్లు మెటా ప్రకటించింది. 2023 ప్రారంభంలో కంపెనీ తన ఖాతాను పునరుద్ధరించింది.ఇదీ చదవండి: 10 రోజుల్లో 10000 మంది కొన్న కారు ఇదే..ఎలాన్మస్క్ ఇప్పటికే ట్రంప్నకు పూర్తి మద్దతినిచ్చారు. ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించాక తన కార్యవర్గంలో మస్క్, వివేక్రామస్వామిని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) సంయుక్త సారథులుగా నియమించిన విషయం తెలిసిందే. -
రూ.5 కోట్ల వాచ్తో జుకర్బర్గ్.. ప్రత్యేకతలివే..
మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ కంపెనీ ఏఐ లామాకు సంబంధించిన విషయాలను ఇటీవల ఇన్స్టాగ్రామ్లో వీడియో ద్వారా షేర్ చేసుకున్నారు. అయితే ఆ వీడియోలో తాను ధరించిన వాచ్పై నెట్టింట చర్చ జరిగింది. ప్రపంచంలోనే అత్యంత సన్నని వాచ్ను మార్క్ ధరించినట్లు నెటిజన్లు గుర్తించారు. ఈ బల్గారి ఆక్టో ఫినిసిమో ఆల్ట్రా సీఓఎస్సీ(Bulgari Octo Finissimo Ultra COSC) మోడల్ వాచ్ కేవలం 1.7 మిల్లీమీటర్ మందంతో ఉంటుంది. అంటే దాదాపు రెండు క్రెడిట్ కార్డ్ల మందం కంటే సన్నగా ఉంటుంది.ఈ వాచ్ ప్రత్యేకతలు..ఈ వాచ్ కేవలం 1.7 మిమీ మందంతో ఉంటుంది.ఈ వాచ్ బీవీఎల్ 180 క్యాలిబర్తో గంటకు 28,800 వైబ్రేషన్స్ (4 హెర్ట్జ్) ఫ్రీక్వెన్సీతో మాన్యువల్ వైండింగ్ మూవ్మెంట్ను కలిగి ఉంటుంది.ఈ గడియారాన్ని సాండ్బ్లాస్టెడ్ టైటానియంతో తయారు చేశారు. వాచ్ పట్టీలు కూడా పూర్తిగా టైటానియంతోనే రూపొందించారు. కాబట్టి ఇది చాలా ఏళ్లు మన్నికగా ఉంటాయి. దాంతోపాటు తేలికపాటి డిజైన్ దీని సొంతం.ఇది COSC సర్టిఫైడ్ గడియారం. అంటే ఇది కఠినమైన కచ్చితత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.ఈ వాచ్ లిమిటెడ్ ఎడిషన్. ప్రపంచంలో ఇవి 20 మాత్రమే ఉన్నాయి. అందుకే ఇది అంత ప్రత్యేక సంతరించుకుంది.దీని ధర సుమారు 5,90,000 అమెరిన్ డాలర్లు. అంటే రూ.5 కోట్లకు పైనే.లామా 3 కంటే పది రెట్లు ఎక్కువజుకర్బర్గ్ పోస్ట్ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. మెటా ఏఐ లామా 4 వెర్షన్ను 2025 ప్రారంభంలో విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఇది తదుపరి తరం ఏఐ మోడల్ అని, లామా 3 కంటే ఇది మరింత మెరుగ్గా పని చేస్తుందన్నారు. ఇందులో రీజనింగ్ వ్యవస్థ సమర్థంగా పని చేస్తుందని చెప్పారు. లామా 4కు సుమారు 1,60,000 జీపీయూలు(గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్- కంప్యూటర్లు, గేమింగ్ కన్సోల్స్ కోసం చిత్రాలు, వీడియోలను రియల్ టైమ్లో అందించడానికి ఇది ఉపయోగపడుతుంది) అవసరమని భావిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది లామా 3 కంటే పది రెట్లు ఎక్కువ. -
రూ.1 కోటి కంటే ఖరీదైన వాచ్ ధరించిన మార్క్
ప్రముఖ టెక్ కంపెనీ మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఇటీవల ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫొటోలో సుమారు రూ.ఒక కోటి వాచ్ ధరించి కనిపించారు. ఈయన ప్రస్తుతం ప్రపంచంలోని మూడో అత్యంత సంపన్న వ్యక్తికి ఉన్నారు. తాను ధరించిన వాచ్కు సంబంధించి వాచ్.న్యూజ్ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో వివరాలు వెల్లడించారు.మార్క్ జుకర్బర్గ్ పాటెక్ ఫిలిప్ వాచ్ ధరించి తన భార్య ప్రిస్సిల్లా చాన్తో కలిసి ఉన్న ఉన్న ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. తాను షేర్ చేసిన ఇమేజ్లోని వాచ్కు సంబంధించి నెట్టింట చర్చ జరిగింది. దాంతో పలు సమాజిక మాధ్యమాల్లో తన రిస్ట్వాచ్ వివరాలు వెల్లడించారు. అందులో భాగంగా వాచ్.న్యూజ్ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ దాని వివరాలు వెల్లడించింది. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck)ఇదీ చదవండి: పెళ్లి కూతురిని వెతకనందుకు రూ.60 వేలు జరిమానా!జుకర్బర్గ్ ధరించిన వాచ్ ప్రతిష్టాత్మక స్విస్ బ్రాండ్ పాటెక్ ఫిలిప్ తయారు చేసిన టైమ్పీస్గా గుర్తించారు. ఈ సంస్థ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, ప్రత్యేకమైన గడియారాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందింది. మార్క్ ఈ కంపెనీకు చెందిన దాదాపు రూ.1 కోటి కంటే ఎక్కువ ధర ఉంటే ‘5236పీ’ మోడల్ వాచ్ను ధరించినట్లు వాచ్.న్యూజ్ పేర్కొంది. మార్చిలో అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడులకు వచ్చిన జుకర్బర్గ్ దంపతులు తను వాడిన పాటక్ ఫిలిప్ వాచ్ను చూసి బాగుందని కితాబిచ్చిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by watchnewz (@watch.newz) -
హంతకుని గెటప్లో మార్క్ జుకర్బర్గ్ (ఫోటోలు)
-
కుమార్తె కోసం నెయిల్ ఆర్టిస్ట్గా జుకర్బర్గ్ - వీడియో
కూతుళ్ళ కోసం తండ్రులు ఎంత దూరమైనా వెళ్తారు. కోతి కావాలంటే కొండ మీదకు ట్రెకింగ్ చేస్తారు. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం కోసం ఆకాశమెత్తు చెట్టునైనా సునాయాసంగా ఎక్కేస్తారు. జుకర్బర్గ్ కూడా అంతే! ఆయనెంత టెక్నాలజీ కింగ్ అయినా కూతురి దగ్గర ఒక మామూలు తండ్రే. మానవాళి కలలకు రంగులు అద్దటానికి ప్రపంచం నిరంతరం అప్డేట్లతో పరుగులు తీస్తుండే మెటా సీఈఓ 'మార్క్ జుకర్బర్గ్' కూతురి గోళ్లకు రంగు వేయడం కోసం ఎలా కుదురుగా కూర్చున్నారో చూడండి. మొత్తానికి టాస్క్ ఫినిష్ చేసేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.జుకర్బర్గ్ టేబుల్పైకి వంగి, తన కుమార్తె గోళ్లకు నెయిల్ పాలిష్ వేసి నెయిల్ ఆర్టిస్ట్ అయ్యారు. చిన్నారి తన నెయిల్ ఆర్ట్ని ప్రదర్శించడంతో క్లిప్ ముగుస్తుంది. నెటిజన్లు ఈ వీడియో చూసి తమదైన రీతిలో స్పందిస్తున్నారు.ఇప్పటికే 20వేల కంటే ఎక్కువ లైక్స్ పొందిన ఈ వీడియో 6,25,000 కంటే ఎక్కువ వీక్షణలను పొందింది. తన కుమార్తె కోసం సీఈఓ నుంచి స్టైలిస్ట్గా మారారని ఒకరు కామెంట్ చేశారు. ఫాదర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వాలని ఇంకొకరు చమత్కరించారు.క్వెస్ట్ 3ఎస్కుమార్తె గోళ్లకు నెయిల్ పాలిష్ వేయడానికంటే ముందు జుకర్బర్గ్ 'క్వెస్ట్ 3ఎస్'లో మల్టిపుల్ స్క్రీన్స్ చూసారు. క్వెస్ట్ 3ఎస్ అనేది వర్చువల్ రియాలిటీ హెడ్సెట్. దీనిని మెటా 2024 సెప్టెంబర్ 25న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్రారంభించింది. దీని ధర రూ. 25,210 నుంచి రూ. 33,610 వరకు ఉంది.ఇదీ చదవండి: జియోభారత్ కొత్త ఫోన్స్ ఇవే.. ధర తెలిస్తే కొనేస్తారు!మెటా క్వెస్ట్ 3ఎస్ హెడ్సెట్.. సినిమా సైజ్ స్క్రీన్పై మీకు ఇష్టమైన షోలను చూడటానికి మాత్రమే కాకుండా, మీరు ఎక్కడికెళ్లినా మీతో పాటు తీసుకెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది గేమ్స్ వంటివి ఆడటానికి కూడా అనుమతిస్తుంది. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) -
జెఫ్ బెజోస్ను వెనక్కు నెట్టిన జుకర్బర్గ్!
మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'మార్క్ జుకర్బర్గ్'.. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ను అధిగమించి ప్రపంచంలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ (Elon Musk) మొదటి స్థానంలో ఉండగా.. ఆ తరువాత స్థానాల్లో జుకర్బర్గ్, బెజోస్ ఉన్నారు.బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఇలాన్ మస్క్ నికర విలువ రూ. 256 బిలియన్ డాలర్స్, జుకర్బర్గ్ నికర విలువ 206 బిలియన్ డాలర్లు, జెఫ్ బెజోస్ విలువ 205 బిలియన్ డాలర్లు. మెటా ప్లాట్ఫామ్ షేర్లు పెరగడంతో.. మార్క్ జుకర్బర్గ్ ప్రపంచంలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు.నికర విలువ పరంగా జుకర్బర్గ్.. బెజోస్ కంటే 1.1 బిలియన్ డాలర్ల ముందు, టెస్లా సీఈఓ కంటే 50 బిలియన్ల వెనుకంజలో ఉన్నారు. ఈ ముగ్గురు కాకుండా.. బెర్నార్డ్ ఆర్నాల్ట్, లారీ ఎల్లిసన్, బిల్ గేట్స్, లారీ పేజీ, స్టీవ్ బాల్మెర్, వారెన్ బఫెట్, సెర్గీ బ్రిన్ వరుస పది స్థానాల్లో ఉన్నారు.ఇదీ చదవండి: కేంద్రం శుభవార్త.. ఆ ఉద్యోగులకు రూ.2,029 కోట్ల బోనస్ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో భారతీయులుప్రపంచ ధనవంతుల జాబితాలో భారతీయ ధనవంతులైన ముకేశ్ అంబానీ 14వ స్థానంలో, గౌతమ్ ఆదానీ 17వ స్థానంలో ఉన్నారు. 37వ స్థానంలో శివ నాడార్, 38వ స్థానంలో షాపూర్ మిస్త్రీ, సావిత్రి జిందాల్ 49వ స్థానంలో, 61వ స్థానంలో దిలీప్ శాంఘ్వీ, 62వ స్థానంలో అజీమ్ ప్రేమ్ జీ, సునీల్ మిట్టల్ 72వ స్థానంలో, 89వ స్థానంలో రాధాకిషన్ దమాని, 90వ స్థానంలో కుమార మంగళం బిర్లా, 97వ స్థానంలో లక్ష్మీ మిట్టల్, 100వ స్థానాల్లో సైరస్ పూనావల్ల ఉన్నారు. -
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు (ఫొటోలు)
-
రూ.16 లక్షల కోట్ల మార్కు దాటిన ‘మార్క్’ సంపద!
మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ప్రపంచంలోని నాలుగో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. 200 బిలియన్ డాలర్లు(రూ.16 లక్షల కోట్లు) మించి నికర విలువను సంపాదించిన అతికొద్ది మంది వ్యక్తుల్లో ఒకరిగా స్థానం సంపాదించారు. ఈమేరకు బ్లూమ్బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్లో వివరాలు వెల్లడయ్యాయి. జుకర్బర్గ్ సంపద ప్రస్తుతం 201 బిలియన్ డాలర్ల(రూ.16.8 లక్షల కోట్లు)కు చేరుకుంది.ఇప్పటివరకు టెస్లా సీఈఓ ఇలోన్ మస్క్ 272 బిలియన్ డాలర్ల(రూ.22.7 లక్షల కోట్లు) సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. తర్వాత స్థానాల్లో వరుసగా అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ (211 బిలియన్ డాలర్లు-రూ.17.6 లక్షల కోట్లు), ఎల్వీఎంహెచ్ ఛైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ (207 బిలియన్ డాలర్లు-రూ.17.3 లక్షల కోట్లు) ఉన్నారు. జుకర్బర్గ్ ఇప్పటివరకు నాలుగోస్థానంలో ఉన్న ఓరాకిల్ కార్పొరేషన్ సహవ్యవస్థాపకులు లారీ ఎల్లిసన్ను వెనక్కినెట్టారు.ఇదీ చదవండి: వడ్డీతో కలిపి రూ.8,465 కోట్లు చెల్లించిన ఎయిర్టెల్బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం టాప్ 10 ధనవంతులు..ఇలోన్ మస్క్జెఫ్ బెజోస్బెర్నార్డ్ ఆర్నాల్ట్మార్క్ జూకర్బర్గ్లారీ ఎల్లిసన్బిల్గేట్స్లారీపేజ్స్టీవ్ బామర్వారెన్బఫెట్సెర్జీబ్రిన్ -
200 బిలియన్ డాలర్ల క్లబ్లోకి...!
సామాజిక మాధ్యమం ‘ఫేస్బుక్’ సృష్టికర్తల్లో ఒకరిగా వెలుగులోకి వచ్చి దాని మాతృసంస్థ ‘మెటా ఫ్లాట్ఫామ్స్’ లాభాల పంటతో వేలకోట్లకు పడగలెత్తిన ఔత్సాహిక యువ వ్యాపారవేత్త మార్క్ జుకర్బర్గ్ మరో ఘనత సాధించారు. కేవలం 40 ఏళ్ల వయసులోనే 200 బిలయన్ డాలర్ల క్లబ్లో చేరి ప్రపంచంలో నాలుగో అత్యంత ధనవంతుడిగా రికార్డ్ నెలకొల్పారు. ప్రస్తుత ఆయన సంపద విలువ 201 బిలియన్ డాలర్లు చేరిందని బ్లూమ్బర్గ్ తన బిలియనీర్ ఇండెక్స్లో పేర్కొంది. ఈ ఒక్క ఏడాదే ఆయన సంపద ఏకంగా 73.4 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం. షేర్మార్కెట్లో ఈ ఏడాది ‘మెటా’ షేర్ల విలువ 64 శాతం పెరగడమే ఇతని సంపద వృద్ధికి అసలు కారణమని తెలుస్తోంది. ‘మెటా’ చేతిలో ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, థ్రెడ్స్ సోషల్మీడియాలతోపాటు ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ ఉంది. మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అనేది త్వరలో ప్రపంచంలోనే అత్యంత అధికంగా వాడే ‘ఏఐ అసిస్టెంట్’గా ఎదగబోతోందని గతవారం ‘మెటా కనెక్ట్ 2024’ కార్యక్రమంలో జుకర్బర్గ్ ధీమా వ్యక్తంచేయడం తెల్సిందే. చరిత్రలో ఇప్పటిదాకా 200 బిలియన్ డాలర్ల సంపద గల కుబేరులు ముగ్గురే ఉండగా వారికి ఇప్పుడు జుకర్బర్గ్ జతయ్యాడు. ఇన్నాళ్లూ 200 బిలియన్ డాలర్లకు మించి సంపదతో ఎలాన్మస్క్( 272 బిలియన్ డాలర్లు), జెఫ్ బెజోస్(211 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ ఆర్నాల్ట్లు మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. మస్క్.. టెస్లా, ‘ఎక్స్’కు సీఈవోగా కొనసాగుతున్నారు. జెఫ్ బెజోస్ అమెజాన్ సంస్థకు అధిపతిగా ఉన్నారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్కు ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ వస్తువుల బ్రాండ్ అయిన ఎల్వీఎంహెచ్సహా భిన్నరంగాల్లో డజన్లకొద్దీ వ్యాపారాలున్నాయి. – వాషింగ్టన్ -
రూ.4.48 లక్షల కోట్లు: సంపాదనలో ఇతడే టాప్
ప్రపంచ కుబేరుడు ఎవరు అనగానే వినిపించే పేరు టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్' (Elon Musk). అయితే ఈ ఏడాది అత్యధికంగా సంపాదించినవారి జాబితాలో మాత్రం మెటా సీఈఓ 'మార్క్ జుకర్బర్గ్' స్థానం సంపాదించుకున్నారు.2024లో మార్క్ జుకర్బర్గ్ సంపద 54 బిలియన్ డాలర్లు పెరిగింది. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 4.48 లక్షల కోట్లు. ఈ ఒక్క సంవత్సరమే ఈయన సంపద 40 శాతం పెరిగి 182 బిలియన్ డాలర్లకు చేరింది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ విడుదల చేసిన జాబితాలో జుకర్బర్గ్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల లిస్టులో నాలుగో స్థానంలో ఉన్నారు. మెటా సీఈఓ కంటే 7 బిలియన్ డాలర్లు ఎక్కువ సంపాదనతో 'బెర్నార్డ్' మూడో స్థానంలో నిలిచారు.2024 ప్రారంభంలో ఎన్వీడియా కో-ఫౌండర్ అండ్ సీఈఓ 'జెన్సన్ హువాంగ్' షేర్స్ కూడా గత రెండు రోజులుగా భారీగా తగ్గాయి. దీంతో ఈయన ఏకంగా 11.5 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూశారు. సంవత్సర ఆదాయం పరంగా హువాంగ్ 44 బిలియన్ డాలర్ల లాభాలను పొందారు. దీంతో ఈయన నికర విలువ 93 బిలియన్ డాలర్లకు పెరిగింది.ఇదీ చదవండి: ప్రపంచంలో రెండో స్థానానికి భారత్ జుకర్బర్గ్ నాయకత్వంలో ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్ వంటి ప్లాట్ఫామ్లు ఉన్నాయి. మెటా కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్లో భారీ పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడులు ఇన్వెస్టర్లను కొంత ఆందోళనకు గురి చేసింది. దీంతో 2021 సెప్టెంబర్ - 2022 నవంబర్ మధ్య మెటా స్టాక్ 75 శాతం కంపెనీ ఎక్కువ తగ్గిపోయింది.ఏఐ టెక్నాలజీ రోజు రోజుకి అభివృద్ధి చెందుతుండటంతో ఇన్వెస్టర్లకు కంపెనీ మీద విశ్వాసం ఏర్పడింది. ఫలితంగా మెటా షేర్లు మళ్ళీ రికార్డు స్థాయికి చేరాయి. దీంతో కంపెనీ విలువ ఏకంగా 1.3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. మెటాలో జుకర్బర్గ్ వాటా 13 శాతానికి చేరింది. 2022లో 35 బిలియన్ డాలర్ల సంపద మాత్రమే కలిగి ఉన్న జుకర్బర్గ్.. ఇప్పుడు 182 బిలియన్ డాలర్ల నికర విలువకు చేరారు. -
జీవిత పాఠాలు నేర్పిన గురువులు
మీలో ఆశలు రేకిత్తించి వాటిని సాధించేందుకు ఓదారి చూపే ప్రతి వ్యక్తి గురువే. అలా అందరి జీవితాల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది గురువులు తారసపడుతారు. అలాంటి వారి సలహాలు, సూచనలు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగపడుతాయి. అలా గురువుల సాయంతో కొందరు వ్యాపారాల్లో స్థిరపడి మరెందరికో ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి వ్యాపార దిగ్గజాలు తమ గురువుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.వారెన్బఫెట్జీవితంలో కష్టనష్టాలు వారెన్బఫెట్కి అనేక పాఠాలు నేర్పాయి. తన తండ్రి హోవార్డ్ బఫెట్, కోచ్ బెంజమిన్ గ్రాహం, భార్య సుసాన్ బఫెట్ నుంచి ఎన్నో ఆర్థికపాఠాలు నేర్చుకున్నట్లు ఆయన చెప్పారు. సొంతంగా డబ్బు సంపాదించడం ఎలాగో తన తండ్రి నుంచి నేర్చుకున్నట్లు తెలిపారు. పెట్టుబడి నిర్వహణకు సంబంధించిన ఎన్నో విషయాలు ఆయన నేర్పించారని పేర్కొన్నారు.బిల్గేట్స్మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్గేట్స్ తనకు వారెన్బఫెట్ ఎన్నో విషయాల్లో మార్గనిర్దేశం చేశారని చెప్పారు. హార్వర్డ్ యూనివర్సిటీలో మధ్యలో చదువు మానేసిన తర్వాత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఆ సమయంలో వారెన్బఫెట్ దీర్ఘకాల లక్ష్యాలతో డబ్బు ఎలా సంపాదించాలో నేర్పించినట్లు చెప్పారు.జెఫ్బెజోస్అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్బెజోస్ వారెన్బఫెట్, జేపీ మోర్గాన్ ఛైర్మన్ జామీ డిమోన్, డిస్నీ సీఈఓ బాబ్ ఇగర్లను తన గురువులుగా భావిస్తున్నట్లు చెప్పారు. వారెన్బఫెట్ తన పుస్తకాల్లో ఎన్నో విషయాలు పంచుకుంటారని, దాదాపు అన్నింటిని చదవడానికి ఇష్టపడతానని బెజోస్ అన్నారు. సంక్షిష్టమైన కంపెనీ ద్వారా పెట్టుబడి పెడుతూ డబ్బు ఎలా సంపాదించాలో డిమోన్ను చూసి నేర్చుకోవాలన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలను ఎలా నెరవేర్చుకోవాలో ఇగర్ ద్వారా తెలుసుకున్నానని చెప్పారు.ఇలాన్మస్క్ఎక్స్(ట్విటర్), టెస్లా, స్పేస్ఎక్స్ వంటి కంపెనీల అధినేత ఇలాన్మస్క్ స్పేస్ఎక్స్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ జిమ్ కాంట్రెల్ను గురువుగా భావిస్తారు. మస్క్ కంపెనీలో పనిచేస్తున్న ఉన్నతాధికారులకు కాంట్రెల్ మెంటార్గా వ్యవహరిస్తున్నారు. యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్జాబ్స్ పుస్తకాలు ఇప్పటికీ చదువుతున్నట్లు మస్క్ చెప్పారు. అవి తనకు మార్గదర్శకాలుగా పనిచేస్తాయని వివరించారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్, నికోలా టెస్లా, థామస్ ఎడిసన్, ఐసాక్ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ పుస్తకాలు ఎంతో ప్రేరణ ఇస్తాయన్నారు.ఇదీ చదవండి: 2.75 లక్షల ఫోన్ నంబర్లకు చెక్మార్క్ జుకర్బర్గ్మెటా వ్యవస్థాపకులు మార్క్ జుకర్బర్గ్ యాపిల్ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్ను ఎంతో ఆరాధించేవారు. మేనేజ్మెంట్ నిర్వహణతోపాటు కంపెనీకి ప్రత్యేకంగా బ్రాండింగ్ ఎలా తీసుకురావాలో స్టీవ్ దగ్గరి నుంచి నేర్చుకున్నట్లు మార్క్ తెలిపారు. -
జుకర్ బర్గ్... ప్రేమ మార్క్
షాజహాన్కు భార్య పై ఉన్న ప్రేమ పాలరాతి తాజ్మహల్లో ప్రతిఫలించింది. మెటా బిలియనీర్ మార్క్ జుకర్ బర్గ్ విషయానికి వస్తే... భార్యపై ఆయనకున్న ప్రేమ ఇంటి పెరట్లోని సుందరమైన నీలిరంగు విగ్రహంలో ప్రతిఫలిస్తోంది. రొమాంటిక్ హావభావాలతో కూడిన భార్య ప్రిస్కిల్లా చాన్ భారీ విగ్రహాన్ని ఇంటి పెరట్లో ఏర్పాటు చేశాడు జుకర్ బర్గ్. ఆ విగ్రహం పక్కన నిలబడి ఫొటో దిగి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఈ విగ్రహం చిత్రాలు ఇంటర్నెట్ సెన్సేషన్గా మారాయి...ఫేస్బుక్ విజయం గురించి చెప్పుకోవడం కంటే తన ప్రేమ విజయం గురించి చెప్పుకోవడం అంటేనే మార్క్ జుకర్ బర్గ్కు ఇష్టం. ప్రిస్కిల్లా చాన్తో ఎలా పరిచయం అయింది, ఆ పరిచయం ఎలా ప్రేమగా మారింది కథలు కథలుగా చెబుతుంటాడు. అవి ఎప్పుడో జరిగినట్లుగా ఉండవు. నిన్నా మొన్న జరిగినట్లుగానే ఉంటాయి. అది అతడి మాటల చాతుర్యం కాదు. ప్రేమలోని మాధుర్యం!19 మే, 2012 అనేది జుకర్ బర్గ్, చాన్లకు మరచిపోలేని సుదినం. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వారి వివాహం జరిగింది. ఈ ఔట్డోర్ వెడ్డింగ్లోని విశేషం ఏమిటంటే... పెళ్లి నాటి ప్రమాణాలను కాగితాల రూపంలో ఇరువురు ఇచ్చిపుచ్చుకున్నారు.జుకర్బర్గ్ చాన్కు ఇచ్చిన పేపర్లో ఇలా రాసి ఉంది.... ‘ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో... ఎప్పుడూ ఇలాగే’ అదృష్టవశాత్తు ఆ సంతోషం ఇప్పటివరకు వారికి దూరం కాలేదు. ‘మార్క్ అప్పుడు ఎంత ప్రేమతో ఉన్నాడో ఇప్పుడూ అంతే. అప్పుడు ఎలా నవ్వించేవాడో ఇప్పుడూ అంతే’ అంటూ భర్త గురించి మురిపెంగా చెబుతుంటుంది ప్రిస్కిల్లా చాన్.ఏడు అడుగుల సిల్వర్ అండ్ బ్లూ ప్రిస్కిల్లా చాన్ విగ్రహం వారి బలమైన ప్రేమ బంధానికి ప్రతీకలా కనిపిస్తోంది. ప్రవహిస్తున్నట్లుగా కనిపించే వెండి వస్త్రం విగ్రహాన్ని మరింత ఆకర్షణీయం చేసింది. ఈ విగ్రహం కోసం న్యూయార్క్కు చెందిన ఆర్టిస్ట్, అర్కిటెక్చర్, శిల్పి డేనియల్ ఆర్షమ్ను సంప్రదించాడు మార్క్. విగ్రహం ఎలా ఉండాలి? అనే దాని గురించి ఇద్దరి మధ్య ఎన్నోరోజుల పాటు చర్చలు జరిగాయి.చాన్ విగ్రహం పుణ్యమా అని ‘ఎవరీ డేనియల్’ అనే శోధన మొదలైంది. ఈ డేనియల్కు ‘ఇన్స్టాగ్రామ్ శిల్పి’ అని పేరు. డ్యాన్స్, డిజైన్, అర్కిటెక్చర్, ఆర్ట్ను మిక్స్ చేసిన కళాకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో పెద్ద ప్రాజెక్ట్లకు పని చేశాడు. ‘భార్య విగ్రహాన్ని నెలకొల్పే రోమన్ సంప్రదాయాన్ని తీసుకువద్దాం’ అని ఇన్స్టాగ్రామ్లో రాశాడు జుకర్ బర్గ్.టీ సేవిస్తూ తన విగ్రహం దగ్గర ఫొటో దిగిన ప్రిస్కిల్లా చాన్ ఆ ఆర్ట్వర్క్ను ‘అద్భుతం’ అని ప్రశంసించింది.ఏడు అడుగుల ప్రిస్కిల్లా చాన్ విగ్రహంపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు కనిపిస్తున్నాయి. భార్యపై మార్క్ జుకర్బర్గ్కు ఉన్న ప్రేమను ఎంతోమంది ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నీలిరంగులో ఉన్నందుకు కావచ్చు... కొందరు మాత్రం ఈ విగ్రహాన్ని అవతార్ క్యారెక్టర్లతో పోలుస్తూ జోక్లు పేలుస్తున్నారు. ఎవరి మాట ఎలా ఉన్నా... ప్రిస్కిల్లా చాన్ విగ్రహం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.కన్నీళ్లు తుడిచే విగ్రహం‘భార్య విగ్రహాన్ని నెలకొల్పే రోమన్ సంప్రదాయాన్ని తీసుకువద్దాం’ అని జుకర్ బర్గ్ అంటున్నాడుగానీ మన వాళ్లు ఆ పని ఎప్పుడో చేశారు. చేస్తున్నారు! కోల్కత్తాకు చెందిన 65 సంవత్సరాల తాపస్ అనే రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి 2.5 లక్షలు ఖర్చు చేసి తన భార్య ఇంద్రాణి సిలికాన్ స్టాచ్యూను ఇంట్లో ఏర్పాటు చేసుకున్నాడు. జీవకళ ఉట్టిపడే ఈ విగ్రహంతో తాపస్ ఎన్నోసార్లు మాట్లాడుతుంటాడు. తన భార్య చనిపోలేదని, విగ్రహం రూపంలో ఇంట్లోనే ఉంది అనుకొని దుఃఖానికి దూరం అయ్యాడు. తాపస్లాంటి భర్తల కథలు మన దేశ నలుమూలలా ఉన్నాయి. -
భార్యకు అరుదైన గిఫ్ట్ ఇచ్చిన మార్క్ జుకర్బర్గ్ (ఫోటోలు)
-
మెటా ఏఐలో కొత్త ఫీచర్.. ఇదెలా పనిచేస్తుందంటే?
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మెటా ఏఐ కొత్త ఫీచర్ ఆవిషక్రయించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను సీఈఓ మార్క్ జుకర్బర్గ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.నచ్చిన స్టైల్లో ఫోటోలు క్రియేట్ చేసుకోవడానికి ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. దీనిని ఎలా ఉపయోగించాలో కూడా మెటా సీఈఓ వీడియోలో చూపిస్తారు. యూజర్ తన ముఖాన్ని స్కాన్ చేయి తనకు నచ్చిన విధంగా ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు.జుకర్బర్గ్ వీడియోలో మొదట తన ముఖాన్ని స్కాన్ చేసుకున్నారు. ఆ తరువాత సెర్చ్ బార్లో నచ్చిన విధంగా ఎలాంటి ఇమేజ్ కావాలో సెర్చ్ చేయాలి. అప్పుడు మెటా మీరు అడిగినట్లుగా ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. జుకర్బర్గ్ తనను గ్లాడియేటర్గా చూపించమని సెర్చ్ చేశారు. అప్పుడు మెటా అలాంటి ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. ఆ తరువాత బాయ్ బ్యాండ్, గోల్డ్ వేసుకున్నట్లు ఇలా ఫోటోలను క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ వీడియోలో చూడవచ్చు. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) -
అంబానీ పెళ్లి సందడి : జెఫ్ బెజోస్, ఇతర దిగ్గజాల కళ్లు చెదిరే కానుకలు
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆకాశమంతపందిరి, భూదేవి అంత పీట అనే మాట వినడమే గానీ ఎపుడూ చూడని చాలామందికి ఇలా ఉంటుందా అనేట్టుగా కనీవినీ ఎరుగని రీతిలో మూడు రోజుల పాటు వేడుక జరిగింది. జూలై 12, 2024న గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్కు ప్రపంచ వ్యాప్తంగా పద్నాలుగు వేల మంది హాజరయ్యారు. సుమారు రూ. 5వేల కోట్లు ఖర్చు చేసినట్టు పలు మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. అలాగే దేశ, విదేశాలనుంచి విచ్చేసిన అతిథులకు బహుమతులను అంతే ఘనంగా అందించారు. అయితే ఇపుడు తాజాగా అనంత్-రాధిక గ్రాండ్ వెడ్డింగ్కు విచ్చేసిన గ్గోబల్ దిగ్గజాలు నూతన వధూవరులకు ఇచ్చిన కానుకలపై తాజా చర్చ నడుస్తోంది.కొత్త జంట అనంత్ అంబానీ-రాధిక మర్చంట్లకు కొందరు హై-ప్రొఫైల్ అతిథులు ఖరీదైన విగ్రహాలు , పెయింటింగ్లను అందించారు. ఇంటర్నేషన్ గెస్ట్లు మాత్రం వీటన్నింటికీ మించిన కోట్ల విలువ చేసే కార్లను గిప్ట్లుగా అందించారట. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో ప్రకారం, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ వారికి బుగాట్టి కారును బహుమతిగా ఇచ్చారు. దీని రూ. 11.50 కోట్లు.అమెరికన్ నటుడు , ప్రొఫెషనల్ రెజ్లర్, జాన్ సెనా వారికి రూ. 3 కోట్ల విలువైన లంబోర్ఘిని బహుమతిగా ఇచ్చాడు. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ వారికి రూ. రూ. 300 కోట్లు విలువైన కానుక ఇచ్చారట. ఇక బిల్ గేట్స్ రూ. 9 కోట్ల విలువైన డైమండ్ రింగ్ ఇచ్చారని తెలుస్తోంది. 9 కోట్లు. అంతేకాదు బిల్ గేట్స్ రూ. రూ. 180 కోట్ల విలువైన లగ్జరీ యాచ్ను ఇచ్చినట్టు మరో వీడియో ద్వారా తెలుస్తోంది. గూగుల్ , అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ 100 కోట్ల రూపాయల విలువైన హెలికాప్టర్ను బహుమతిగా ఇచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కొత్తగా పెళ్లయిన జంటకు అమెరికాలోని రూ. 80 కోట్ల విలువ జేసే లగ్జరీ భవనాన్ని కానుకగా ఇచ్చినట్టు తెలుస్తోంది. -
‘అమెరికా ఇండిపెండెన్స్ డే’..మార్క్ జుకర్బర్గ్ వినూత్న వేడుకలు
అమెరికా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ జులై 4న వినూత్నంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో విడుదల చేసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.జులై 4న అమెరికా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రముఖులు వేడుకలు నిర్వహించుకున్నారు. అందులో భాగంగా మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఒక చేతిలో బీర్ బాటిల్, మరో చేతిలో అమెరికా జెండాతో నీటిపై హైడ్రోఫాయిల్(నీటిపై కదలడం) చేశారు. ఇందులో మార్క్ బ్లాక్ యాప్రాన్, వైట్ షర్ట్ ధరించారు. కళ్లకు బ్లాక్ గాగుల్స్ పెట్టి అదిరిపోయే పోజు ఇచ్చారు. ఈ వీడియోను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ‘హ్యాపీ బర్త్డే అమెరికా’ అని రాశారు. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck)జుకర్బర్గ్ ఆరు నెలల కిందట మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ)లో శిక్షణ పొందుతున్నప్పుడు ప్రమాదవశాత్తు కింద పడ్డారు. దాంతో తన మోకాలికి తీవ్ర గాయమై శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇటీవల కోలుకున్న మార్క్ తన 40వ పుట్టినరోజు వేడులకు ఘనంగా జురుపుకున్నారు. తాజాగా ఇలా హైడ్రోఫాయిల్ చేయడంతో తన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
Mark Zuckerberg: భారత్లో మెటా థ్రెడ్స్ జోరు
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ (ఇప్పుడు ఎక్స్)కు పోటీగా ఏడాది క్రితం ప్రవేశపెట్టిన థ్రెడ్స్ యాప్కి గణనీయంగా ఆదరణ లభిస్తోందని సోషల్ మీడియా దిగ్గజం మెటా తెలిపింది. అంతర్జాతీయంగా నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 17.5 కోట్లుగా ఉందని పేర్కొంది. క్రియాశీలక వినియోగదారులు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని మెటా సీఈవో మార్క్ జూకర్బర్గ్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్లో ఎక్కువగా సినిమాలు, టీవీ, ఓటీటీ, సెలబ్రిటీలు, స్పోర్ట్స్కి సంబంధించిన కంటెంట్ ఉంటోందని మెటా వివరించింది. క్రికెట్లో రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, ఆకాశ్ చోప్రా మొదలైన వారు క్రియాశీలకంగా ఉంటున్నారని పేర్కొంది. టీ20 క్రికెట్ వరల్డ్ కప్, ఐపీఎల్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 మొదలైనవి హాట్ టాపిక్లుగా నిల్చాయని, 200 మంది పైచిలుకు క్రియేటర్లు ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్పై అప్డేట్స్ ఇచ్చారని వివరించింది. 2023 జూలైలో ప్రవేశపెట్టిన వారం రోజులకే 10 కోట్లకు పైగా యూజర్ సైనప్లతో థ్రెడ్స్ ఒక్కసారిగా ప్రాచుర్యంలోకి వచి్చంది. అయితే, క్రమంగా దానిపై యూజర్ల ఆసక్తి తగ్గుతూ వస్తోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
ఒత్తిడి చేస్తే భారత్ నుండి వెళ్ళిపోతాం !..వాట్సా ప్ వార్నింగ్
-
ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల జాబితా (ఫొటోలు)
-
రహస్య ప్రాజెక్ట్.. ఫేస్బుక్పై సంచలన ఆరోపణలు
Facebook Secret Project: మార్క్ జుకర్బర్గ్ నేతృత్వంలోని ఫేస్బుక్పై సంచలన ఆరోపణలకు సంబంధిచిన పత్రాలు బయటకొచ్చాయి. స్నాప్చాట్, యూట్యూబ్, అమెజాన్ వంటి ప్రత్యర్థి ప్లాట్ఫామ్ల యూజర్లపై ఫేస్బుక్ స్నూపింగ్ (అనైతిక విశ్లేషణ) చేసినట్లు ఆరోపిస్తూ కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టు కొత్త పత్రాలను విడుదల చేసింది. ‘టెక్ క్రంచ్’ కథనం ప్రకారం.. స్నాప్చాట్ (Snapchat) యాప్కి, తమ సర్వర్లకు మధ్య నెట్వర్క్ ట్రాఫిక్ను అడ్డగించడానికి, డీక్రిప్ట్ చేయడానికి ఫేస్బుక్ 2016లో 'ప్రాజెక్ట్ ఘోస్ట్బస్టర్స్' అనే రహస్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోర్టు పత్రాల ప్రకారం.. యూజర్ బిహేవియర్ను అర్థం చేసుకోవడానికి, స్నాప్చాట్పై ప్రయోజనాన్ని పొందేందుకు ఫేస్బుక్ ఈ చొరవను రూపొందించింది. ఈ పత్రాల్లో రహస్య ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించిన ఫేస్బుక్ అంతర్గత ఈమెయిల్లు కూడా ఉన్నాయి. 2016 జూన్ 9 నాటి అంతర్గత ఈమెయిల్లో ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ స్నాప్చాట్లో ఎన్క్రిప్టెడ్ ట్రాఫిక్ ఉన్నప్పటికీ దానిలో విశ్లేషణలను పొందాలని ఉద్యోగులను ఆదేశించినట్లుగా ఉంది. దీంతో నిర్దిష్ట సబ్డొమైన్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగించడానికి 2013లో ఫేస్బుక్ ద్వారా పొందిన వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ‘ఒనావో’ను ఉపయోగించాలని ఫేస్బుక్ ఇంజనీర్లు ప్రతిపాదించారు. ఒక నెల తర్వాత, వారు ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్ఫారమ్లలో ఇన్స్టాల్ చేయగల ప్రతిపాదన కిట్లను అందించారు. ఈ ప్రాజెక్ట్ను అమెజాన్, యూట్యూబ్ యూజర్ల డేటా కోసం విస్తరించారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్ల బృందంతో పాటు దాదాపు 41 మంది న్యాయవాదులు ప్రాజెక్ట్ ఘోస్ట్బస్టర్స్లో పనిచేశారు. ఓనావోను ఉపయోగించడానికి ఫేస్బుక్ టీనేజర్లకు రహస్యంగా డబ్బు చెల్లిస్తోందని దర్యాప్తులో వెల్లడైన తర్వాత, ఫేస్బుక్ 2019లో ఒనావోను మూసివేసింది. -
Anant-Radhika జుకర్బర్గ్ భార్య నగ మిస్..? నెటిజనుల కామెంట్స్ వైరల్
రిలయన్స్ అధినేత, బిలియనీర్ ముఖేష్ ,నీతా అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ బాష్లో ఒక ఆశ్యర్యకరమైన విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ భార్య పెండెంట్ను కోల్పోయిందట. దీంతో సోషల్ మీడియా సంస్థలు ఎఫ్బీ, ఇన్స్టాగ్రామ్ డౌన్కి ఇదే కారణమంటున్న నెటిజన్లు ఛలోక్తులు వైరల్గా మారాయి. గుజరాత్లోని జామ్ నగర్లో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించిన వేడుకలకు బాలీవుడ్, క్రీడారంగ సెలబ్రిటీలతోపాటు, మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ , భార్య న్, బిల్ గేట్స్ ఆయన భార్య, గ్లోబల్ పాప్ ఐకాన్, రిహన్నా సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం మార్క్ భార్యప్రిస్సిల్లా చాన్ లాకెట్ మిస్ అయింది. దీంతో భారీ గందరగోళం ఏర్పడి, జుకర్బర్గ్ దంపతులతో పాటు అతిథులంతా మూడున్నర గంటలపాటు లాకెట్టు కోసం వెతికినా ఫలితం లేక పోయింది. ఈ ఘటనపై రెడిట్యూజర్ వెల్లడించడంతో నెటిజన్లు ఫన్నీ కమెంట్లతో సందడి చేశారు. అందుకే ఫేస్బుక్, ఇన్స్టా పనిచేయ లేదంటూ కమెంట్ చేశారు. ఈ సంఘటన దురదృష్టకరం అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. అయితే చాన్ లాకెట్టు నిజంగానే పోయిందా? ఒక వేళ పోతే మళ్లీ దొరికిందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. కాగా మెటా యాజమాన్యంలోని యాప్లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్, థ్రెడ్లు నాలుగు రోజుల క్రితం భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా డౌన్ అయిన సంగతి తెలిసిందే. -
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సెలబ్రెటీల స్పెషల్ ఫొటోలు..
-
కత్తులు తయారు చేస్తున్న టెక్ బాస్.. వీడియో వైరల్!
Mark Zuckerberg viral video: ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం, ఫేస్బుక్ యాజమాన్య సంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ కత్తుల తయారీపై దృష్టి పెట్టినట్లు ఉన్నారు. ఇటీవల జపనీస్ కత్తి మాస్టర్ అకిహిరా కోకాజీ నుంచి కత్తి తయారీ పాఠాన్ని నేర్చుకున్నారు. పదునుకు ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ జపనీస్ కత్తి ‘కటనా’ను తయారు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జుకర్బర్గ్ తాజాగా ఇన్స్టాగ్రామ్లో వరుస పోస్ట్లను షేర్ చేశారు. అందులో ఆయన కత్తి మాస్టర్తో పోజులివ్వడాన్ని చూడవచ్చు. మరొక చిత్రంలో తాను తయారు చేసిన కత్తిని చూపించాడు. అలాగే కత్తి తయారు చేస్తున్న వీడియోను, తయారు చేసిన కత్తిని వాడుతున్న వీడియోను కూడా షేర్ చేశారు. "మాస్టర్ అకిహిరా కోకాజీతో కటనాల తయారీ గురించి నేర్చుకోవడం నిజంగా అద్భుతంగా ఉంది. మీ (అకిహిరా కోకాజీ) కళా నైపుణ్యాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు!" అని పేర్కొన్నాడు. ఈ వీడియో ఇంటర్నెట్ యూజర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. షేర్ చేసినప్పటి నుంచి 3.6 లక్షలకు పైగా లైక్లను సొంతం చేసుకుంది. అలాగే వేలాది కామెంట్లు వచ్చాయి. “తయారు చేసిన కటానాను మీతోనే ఉంచుకుంటారా?” అని ఓ యూజర్ ప్రశ్నించారు. “మీరు నిజమైన నింజాగా మారే మార్గంలో ఉన్నారు. చేతులతో యుద్ధంలో ఆరితేరాక కత్తులపై దృష్టిపెట్టారు!” అని మరో యూజర్ వ్యాఖ్యానించారు. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) -
మస్క్, జుకర్బర్గ్ ఎలాంటి వారంటే! చెన్నై నుంచి వెళ్లిన తరువాత..
చెన్నైలో పుట్టి అమెరికాలోని అగ్ర కంపెనీలలో పనిచేసిన 'శ్రీరామ్ కృష్ణన్' ఇటీవల యూఏఈలో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో ఫేస్బుక్ సీఈఓ 'మార్క్ జుకర్బర్గ్', మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ల', ఎక్స్ (ట్విటర్) అధినేత 'ఇలాన్ మస్క్'తో సహా టాప్ సిఇఓలతో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. యుక్త వయసులోనే కోడింగ్ నేర్చుకున్నట్లు, అదే తనను టెక్నాలజీ వైపు అడుగులు వేసేలా చేసిందని శ్రీరామ్ కృష్ణన్ వెల్లడించారు. 2007లో మైక్రోసాఫ్ట్లో చేరి కొన్ని సంవత్సరాల పాటు సత్య నాదెళ్లతో కలిసి పనిచేశారు, అప్పటికే సత్య నాదెళ్ల సీఈఓ కాలేదు. మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేసిన తరువాత ఫేస్బుక్లో చేరి 'మార్క్ జుకర్బర్గ్'తో కూడా కలిసి పనిచేశారు. ఇలాన్ మస్క్ ఎక్స్ (ట్విటర్) కొనుగోలు చేసిన సమయంలో శ్రీరామ్ అక్కడే పనిచేసినట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఆండ్రీసెన్ హోరోవిట్జ్లో భాగస్వామిగా ఉన్నట్లు వెల్లడించారు. ఇలాన్ మస్క్, జుకర్బర్గ్లు చిన్న చిన్న విషయాలను సైతం వారే చూసుకుంటారని, ఇతరులకు అప్పగించరని చెబుతూ.. మెటా సీఈఓ ప్రతి అంశం మీద ప్రత్యేక దృష్టి సారిస్తారని, ఒక ప్రాజెక్టు తీసుకున్న తరువాత అందులో పనిచేసే ఉద్యోగుల కంటే ఆయనే ఎక్కువ తెలుసుకుంటారని శ్రీరామ్ చెప్పారు. నా భార్య కూడా కొన్ని సంవత్సరాల క్రితం మెటాలో పనిచేసింది, జుకర్బర్గ్ ఇప్పటికీ అదే విధంగా ఉన్నారని ఆమె నాకు చెప్పిందని అన్నారు. ఇలాన్ మస్క్ విషయానికి వస్తే.. అందరూ అనుకున్నట్లు ఎక్కువ సమయంలో ఎక్స్(ట్విటర్)లో పోస్టులు చేయడానికి సమయం కేటాయించరని, ఆయనతో నేను ఉన్నప్పుడు 95 శాతం మీటింగులు జూనియర్ ఇంజనీర్లతో జరిగాయని తెలిపారు. ఆయన ప్రతి పనిని ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తారని అన్నారు. చెన్నైలో జన్మించిన శ్రీరామ్ కృష్ణన్ (2001-2005) వరకు ఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కాలేజ్, అన్నా యూనివర్సిటీల నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. అనంతరం మైక్రోసాఫ్ట్లో విజువల్ స్టూడియో విభాగంలో ప్రోగ్రాం మేనేజర్గా తన కెరియర్ను ప్రారంభించారు. చెన్నైలో పుట్టిన నాకు సిలికాన్ వ్యాలీకి మారినప్పుడు కల్చర్ మొత్తం చాలా భిన్నంగా అనిపించినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: మరో కంపెనీ కీలక ప్రకటన.. వందలాది ఉద్యోగుల నెత్తిన పిడుగు! -
బిల్ గేట్స్ను వెనక్కు నెట్టిన జుకర్బర్గ్
ప్రపంచ కుబేరుల జాబితాలోని మొదటి స్థానంలో మార్పుల ఏర్పడ్డ తరువాత.. మెటా సీఈవో 'మార్క్ జుకర్బర్గ్' (Mark Zuckerberg) కూడా ఓ అడుగు ముందుకు వేసి బిల్ గేట్స్ను వెనక్కు నెట్టారు. దీంతో జుకర్బర్గ్ ప్రపంచంలోని నాల్గవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. మెటా స్టాక్ ధరలు 22 శాతం పెరగడం వల్ల జుకర్బర్గ్ సంపద 28 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఈయన నికర విలువ.. బ్లూమ్బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం 170 బిలియన్ డాలర్లకు చేరింది. ఇదే సమయంలో బిల్ గేట్స్ నికర విలువ 145 బిలియన్ డాలర్ల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే బిల్ గేట్స్ విలువ కంటే జుకర్బర్గ్ విలువ 25 బిలియన్ డాలర్లు పెరిగింది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం ఇప్పుడు జుకర్బర్గ్ కంటే ముందున్న ధనవంతులు బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్, ఇలాన్ మస్క్ మాత్రమే ఉన్నారు. మెటా తన మొట్టమొదటి డివిడెండ్ను మార్చిలో పంపిణీ చేసినప్పుడు జుకర్బర్గ్ సుమారుగా 174 మిలియన్ డాలర్ల నగదును పొందవచ్చని భావిస్తున్నారు. ఇదీ చదవండి: సంక్షోభంలో పేటీఎం - ప్రత్యర్థులకు పెరిగిన డిమాండ్.. జుకర్బర్గ్ దాదాపు 350 మిలియన్ క్లాస్ A, B షేర్లకు యజమానిగా కంపెనీలో వాటాలను కలిగి ఉన్నారు. అయితే మెటా తన 50-సెంట్స్ త్రైమాసిక డివిడెండ్ కొనసాగిస్తే.. జుకర్బర్గ్ వార్షిక ఆదాయాలు 690 మిలియన్ డాలర్లకు మించిపోతుందని తెలుస్తోంది. ఇదే జరిగితే ధనవంతుల జాబితాలో నాలుగవ స్థానంలో ఉన్న మెటా సీఈఓ మరింత ముందుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. -
మా సీఈవో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాడు.. ఆందోళన చెందుతున్న కంపెనీ
నేటి ఆధునిక ప్రపంచంలో టెక్ దిగ్గజాల ప్రతి కదలికను మార్కెట్లు నిశితంగా గమనిస్తుంటాయి. ప్రముఖ టెక్నాలజీ కంపెనీ మెటా.. తమ సీఈవో గురించి తెగ ఆందోళన పడిపోతోంది. హై రిస్క్ పనులతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాడని, దీని ప్రభావం కంపెనీ భవిష్యత్తుపై పడుతుందని బెంగపడుతోంది. మెటా తమ తాజా ఆర్థిక నివేదికలో కంపెనీ సీఈవో మార్క్ జుకర్బర్గ్కు పొంచిఉన్న ముప్పును వెల్లడించింది. జుకర్బర్గ్ అలవాట్లు, జీవనశైలితో మెటా స్పష్టంగా సంతోషంగా లేన్నట్లు కనిపిస్తోంది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ , హానికరమైన క్రీడలతో జుకర్బర్గ్ థ్రిల్ కోరుకుంటున్నారని, ఇది కేవలం ఆయన వ్యక్తిగతంగానే కాకుండా కంపెనీకి, అందులో పెట్టుబడివారికి కూడా ప్రమాదాన్ని కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. "జుకర్బర్గ్తోపాటు మేనేజ్మెంట్లోని కొంతమంది తీవ్రమైన గాయాలు, ప్రాణాల మీదకు తెచ్చే క్రీడలు, ఇతర హై రిస్క్ కార్యకలాపాలలో పాల్గొంటున్నారు. జుకర్బర్గ్ ఏ కారణం చేతనైనా అందుబాటులో లేకుంటే మా కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం ఉండవచ్చు" అని మెటా తన వార్షిక నివేదికలో పేర్కొంది. మస్క్తో కేజ్ ఫైట్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, ఇతర హానికరమైన క్రీడల పట్ల జుకర్బర్గ్కు ఉన్న మక్కువ తెలిసిందే. గత నవంబర్లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కోసం శిక్షణ తీసుకుంటున్న సమయంలో మోకాలికి గాయం కావడంతో ఆపరేషన్ చేయించుకున్న విషయం తెలిసిందే. టెస్లా అధినేత ఎలాన్ మస్క్తో కేజ్ ఫైట్కి సిద్ధమైనప్పుడు జుకర్బర్గ్ సాహసాలు మరోసారి ముఖ్యాంశాలుగా మారాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై గొడవలకు పేరుగాంచిన ఇద్దరు బిలియనీర్లు తమ విభేదాలను పరిష్కరించడానికి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మ్యాచ్ని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఒకరినొకరు వెనక్కు తగ్గినట్లు ఆరోపణలు చేయడంతో ఆ ఫైట్ రద్దయింది. "హై రిస్క్ = హై రివార్డ్" ఈ కొత్త రిస్క్ల గురించి చర్చలకు ప్రతిస్పందనగా, జుకర్బర్గ్ "హై రిస్క్ = హై రివార్డ్" అనే సందేశంతో థ్రెడ్స్లో జిఫ్ పోస్ట్ చేశారు. జుకర్బర్గ్ డేర్డెవిల్ సాహసాలతో ప్రమాదాలు ఉన్నప్పటికీ, మెటా శుక్రవారం తన షేర్లలో గణనీయమైన వృద్ధిని సాధించింది. కంపెనీ నాల్గవ త్రైమాసిక లాభాలలో మూడు రెట్లు పెరిగినట్లు నివేదించింది. దానితో పాటు దాని మొట్టమొదటి డివిడెండ్ ప్రకటించింది. -
కీలక నిర్ణయం.. వందల కోట్ల విలువైన మెటా షేర్లు అమ్మిన మార్క్ జూకర్ బర్గ్!
సోషల్ మీడియా దిగ్గజం మెటాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ సంస్థ అధినేత మార్క్ జుకర్ బర్గ్ వందల కోట్లలో విలువైన కంపెనీ షేర్లను ఒకే రోజు రెండు సార్లు అమ్ముకున్నారని తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. దాదాపూ రెండేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత నవంబర్ నెల ముగిసే సమయానికి మెటా షేర్ల విలువ 172 శాతం పెరిగింది. అయితే అదే రోజు కంపెనీ షేర్లను అమ్ముకునేందుకు అనుమతి కోరుతూ జుకర్ బర్గ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ కమిషన్ ఫారమ్ 4కు అప్లయ్ చేసుకున్నారు. అనంతరం తొలిసారి 560,180 షేర్లు, కొద్ది సేపటి తర్వాత అదనంగా 28,009 షేర్లను అమ్ముతూ 144 ఫారమ్ అప్లయ్ చేసుకున్నట్లు సెక్యూరిటీ ఎక్ఛేంజ్ ఫైలింగ్ తేలింది. ఆ మొత్తం షేర్ల విలువ రూ.1,600 కోట్లు. మార్క్ జూకర్ బర్గ్ సంస్థ షేర్లు అమ్ముకున్నారన్న నివేదికలతో యూఎస్ మార్కెట్లు ముగిసే సమయానికి మెటా షేర ధర 320.02 డాలర్ల వద్ద ముగిసింది. ఇక కంపెనీలో షేర్లు అమ్మగా సేకరించిన నిధుల్ని ఆయన ఎందుకు వినియోగిస్తారనే అంశంపై స్పష్టత లేదు. మెటా.. తీవ్ర వాద సంస్థ : రష్యా ఈ అక్టోబరులో రష్యా అధికారిక వర్గాలు మెటాను ఓ తీవ్రవాద సంస్థగా పేర్కొనడం, తల్లిదండ్రుల అనుమతి లేకుండా 2019 నుంచి 13 ఏళ్ల కంటే తక్కువ వయసున్న లక్షల మంది ఇన్స్టాగ్రామ్ యూజర్ల సమాచారాన్ని తీసుకుందని ఆరోపిస్తూ 33 రాష్ట్రాలు పలు న్యాయ స్థానాల్ని ఆశ్రయించడం వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం మెటా షేర్లు ఈ ఏడాదిలో వరుసగా పాజిటీవ్గా ట్రేడయ్యాయి. దీంతో నవంబర్ 22న మెటా షేర్ విలువ గరిష్టా స్థాయికి 341.49 డాలర్లకు చేరుకోగా.. చివరి సారిగా అదే షేర్ విలువ డిసెంబరు 30, 2021 నుంచి తగ్గుతూ వస్తుంది. -
మార్క్ జుకర్బర్గ్ మోకాలికి శస్త్ర చికిత్స..అసలేంటి చికిత్స? ఎందుకు?
మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ సమయంలో మోకాలికి గాయం అవ్వడంతో శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు తెలిపారు. అసలు మోకాలి గాయం అంటే ఏంటీ? ఎందువల్ల అవుతుంది తదితరాల గురించే కథనం. మోకాలి గాయం అంటే.. క్రీడాకారులు ఎక్కువగా ఈ మోకాలి గాయం బారిన పడతారు. మోకాలి గాయాన్ని పూర్వ క్రూసియేట్ లిగ్మెంట్ (Anterior Cruciate Ligament(ACL)) గాయం అని కూడా అంటారు. అంటే మోకాలి ఏసీఎల్ నిర్మాణంపై ఏర్పడిన గాయంగా కూడా చెబుతారు. ఈ ఏసీఎల్ అనేది మోకాలిలో ఉండే మృదువైన కణజాల నిర్మాణం. ఈ క్రూసియేట్ లిగ్మెంట్ తొడను ముందు ఎముక(టిబియా)తో కలిపే జాయింట్. దీనివల్లే మనం నిలబడటానికి నుంచొవడానికి వదులుగా మోకాలు కదులుతుంది. మనం ముందుకు వంగడానికి, నిలుచున్నప్పుడు కదిలే ఈభాగంలో గాయం అయితే పాపింగ్ లాంటి ఒక విధమైన సౌండ్ వస్తున్న అనుభూతి కలుగుతుంది. ఆ ప్రాంతంలో అంతర్లీనంగా లిగ్మెంట్ చీరుకుపోవడం లేదా ఎముకలు తప్పి ఒక విధమైన శబ్దం వస్తుంది. దీంతో మోకాలు ఉబ్బి, అస్థిరంగా ఉంటుంది. భరించలేని నొప్పిని అనుభవిస్తాడు పేషెంట్. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) ఏసీఎల్ లిగ్మెంట్కి చికిత్స ఎలా అందిస్తారంటే.. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ప్రకారం..దెబ్బతిన్న ఏసీఎల్ లిగ్మెంట్ స్థానంలో కొత్త ACL గ్రాఫ్ట్ కణజాలంతో భర్తీ చేసి శస్త్ర చికిత్స చేస్తారు. అయితే ఈ కొత్త ఏసీఎల్ కణజాలం రోగి నుంచే తీసుకోవచ్చు లేదా మరొకరి నుంచైనా స్వీకరించొచ్చు. ఈ చికిత్స రోగికి తగిలిన గాయం తాలుకా తీవ్రత ఆధారంగా వివిధ రకాలుగా చికిత్స అందిస్తారు వైద్యులు. సాధ్యమైనంత వరకు ఇలాంటి గాయాల్లో తీవ్రత తక్కువగా ఉంటే ఫిజియోథెరపీ చేయించడం, రోగిని రెస్ట్ తీసుకోమనడం వంటివి సూచిస్తారు వైద్యులు. అదే పరిస్థితి చాలా ఘోరంగా ఉంటే ఏసీఎల్ పునర్నిర్మాణ శస్త్ర చికిత్స చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ సాధారణ ఆర్థోస్కోపిక్ పద్ధతులను ఉపయోగించే నిర్వహించడం జరుగుతుంది. మోకాలిపై కోతలు పెట్టి పాటెల్లార్ స్నాయువుని(మోకాలి చిప్ప), తొడ ఎముకను కొత్త లిగ్మెంట్తో జాయింట్ చేసేలా మోకాలి అంతటా ఆపరేషన్ నిర్వహిస్తారు. ఫలితంగా పటేల్లార్ స్నాయువు ముందుకు వెనక్కు కదిలేందుకు ఉపకరిస్తుంది. కొన్ని పరిస్థితుల్లో ఆ మోచిప్పలనే తొలగించడం లేదా ఇతర స్నాయువులతో పునర్నిర్మించవడం వంటివి చేస్తారు వైద్యులు. (చదవండి: దంతాలకు ఏ పేస్టు బెటర్?.. దంత సమస్యలకు కారణం!) -
హాస్పిటల్ బెడ్పై జుకర్బర్గ్ - ఇన్స్టా పోస్ట్ వైరల్
మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'మార్క్ జుకర్బర్గ్' (Mark Zuckerberg) మోకాలికి గాయం కావడంతో ఇటీవల ఆపరేషన్ చేయించుకున్నారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సమయంలో మోకాలికి తీవ్రమైన గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు అతని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసారు. మార్క్ జుకర్బర్గ్ పోస్ట్ ప్రకారం, ఏఎల్సీ (Anterior Cruciate Ligament) తొలగించి రీప్లేస్ చేయించుకోవడానికి ఆపరేషన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. హాస్పిటల్లోని వైద్య సిబ్బంది తనను జాగ్రత్తగా చూసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపాడు. ఇదీ చదవండి: భవిష్యత్తు వీటిదే అంటున్న నితిన్ గడ్కరీ - వైరల్ వీడియో వచ్చే ఏడాది మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ పోటీలో పాల్గొనటానికి ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, దీని వల్ల శిక్షణకు ఇంకా కొన్ని రోజులు దూరంగా ఉండాల్సి ఉందని, కోలుకున్న తరువాత మళ్ళీ శిక్షణ ప్రారంభిస్తానని జుకర్బర్గ్ వెల్లడించారు. నాపైన ప్రేమ చూపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ఇన్స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) -
నెలవారీ 10కోట్ల యూజర్లను సంపాదించిన సంస్థ!
మెటా సంస్థలో భాగంగా ఉన్న ఇన్స్టాగ్రామ్ థ్రెడ్స్ నెలవారీగా దాదాపు 100 మిలియన్ల(10కోట్లు) వినియోగదారులను చేరుకున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు జుకర్బర్గ్ ప్రకటించారు. ఇటీవల కంపెనీ త్రైమాసిక ఆదాయాల గురించి మాట్లాడుతున్నపుడు ఈ విషయాన్ని చెప్పారు. సానుకూలంగా సంభాషణలు సాగించేందుకు చేసే ప్రయత్నంలో భాగంగా కంపెనీ ఈ టూల్ను తీసుకొచ్చిందన్నారు. ఇన్స్టాథ్రెడ్లు రానున్న రోజుల్లో మరింత వేగంగా ప్రజల్లోకి వెళ్తాయని మెటా సీఎఫ్ఓ సుసాన్ లి అన్నారు. ఇన్స్టాగ్రామ్ వార్తలకు వ్యతిరేకం కాదని, సంబంధిత ప్లాట్ఫామ్లో థ్రెడ్లు వార్తలను విస్తరించట్లేదని ఇన్స్టా ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే ఎక్స్(ట్విటర్)కు పోటీగా మెటా ఇన్స్టాథ్రెడ్లను జులైలో ప్రారంభించింది. -
మాజీ మహిళా ఉద్యోగి దెబ్బ, కదులుతున్న లక్షల కోట్ల విలువైన కంపెనీ పునాదులు?
ఒక్క మహిళా ఉద్యోగి. 8.48 నిమిషాల నిడివి గల వీడియో. వందల కొద్దీ డాక్యుమెంట్లు.వెరసీ ప్రపంచంలో అత్యంత విలువైన సోషల్ మీడియా కంపెనీ మెటా పునాదులు ఒక్కొక్కటిగా కదులుతున్నాయా? 2021లో మెటా (అప్పడు ఫేస్బుక్)లోని అక్రమాల్ని బయటపెట్టింది తానేనంటూ వెలుగులోకి వచ్చిన ఓ వీడియోతో గంటల వ్యవధిలో ఆ సంస్థ రూ.50 వేల కోట్లు నష్టపోయింది. ప్రారంభంలో మహిళ చేసిన ఆరోపణల్ని సీఈవో జూకర్ బెర్గ్ సైతం ఇదంతా 'టీ కప్పులో తుఫాను' అని అనుకున్నారు. కానీ మెటాను ముంచే విధ్వంసానికి దారితీస్తుందనుకోలేదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. తాజాగా, ఆ వీడియో తాలుకు ప్రభావం మరోసారి మెటాపై పడింది. మెటా, ఆ సంస్థకు చెందిన ప్రముఖ ఫొటో/వీడియో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్కు భారీ షాక్ తగిలింది. 41 రాష్ట్రాలకు చెందిన పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు యువతను వ్యసనపరులుగా మార్చడం ద్వారా వారిలో మానసిక రుగ్మతలు పెరిగేలా ఆజ్యం పోస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఫిర్యాదుల వెల్లువ మెటా, ఇన్స్టాగ్రామ్పై ఓక్లాండ్, కాలిఫోర్నియా, ఫెడరల్ కోర్టులో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా కాలిఫోర్నియా, న్యూయార్క్తో పాటు మరో 33 రాష్ట్రాల పిటిషనర్లు.. ఈ రెండు ఫ్లాట్ఫామ్లు తప్పుడు ప్రచారాలు చేస్తూ పదే పదే తప్పుదారి పట్టిస్తున్నాయని.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ప్రలోభపెట్టి.. ఆన్లైన్లో గంటల కొద్ది గడిపేలా శక్తివంతమైన టెక్నాలజీని మెటా ఉపయోగించుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా ఆదాయాన్ని గడించి లాభపడుతుందని అన్నారు. యూజర్ల కన్నా.. డబ్బులే ముఖ్యం ఓ వైపు అడ్వటైజర్లు చేజారిపోకుండా యువతను కట్టిపడేయడంలో మెటా వ్యూహాత్మకంగా ఎలా వ్యాపారం చేస్తుందో వారు వివరించారు. ముఖ్యంగా, పలు అంతర్జాతీయ సంస్థలు తమ ఉత్పత్తుల అమ్మకాలు జరిగేలా చిన్న వయస్సు వారినే తమ వ్యాపారానికి అనువుగా మార్చుకుంటున్నాయి. ఇలా చేయడం వల్ల పిల్లలు యుక్తవయస్సు వచ్చే వరకు తమ సంస్థ బ్రాండ్లను వినియోగించుకుంటారనే ఉద్దేశ్యంతో ఈ తరహా వ్యాపార వ్యూహాలను అమలు చేస్తున్నాయి. వారికి లాభం చేకూరేలా మెటా,ఇన్స్టాగ్రామ్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తద్వారా ఆదాయాన్ని పొందుతున్నాయి’ అని కోర్టు దావాలో తెలిపారు. పిల్లల్ని నాశనం చేస్తున్నాయ్ అంతేకాదు, ‘నిరాశ, ఆందోళన, నిద్రలేమి, విద్య, రోజువారీ జీవితంలో జోక్యం, అనేక ఇతర ప్రతికూల ఫలితాలు పిల్లల జీవితాల్ని నాశనం చేస్తున్నాయని పిటిషన్లు కోర్టు మెట్లెక్కారు. దీంతో మెటాపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వివిధ రాష్ట్ర చట్టాలను ఉల్లంఘించినందుకు మెటా 1,000 వెయ్యి నుంచి 50,000 డాలర్ల వరకు సివిల్ పెనాల్టీలను ఎదుర్కొంటుంది. కేసు తీవ్రతను బట్టి భారీ మొత్తంలో మెటా చెల్లించాల్సి ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ మొత్తాన్ని ఇన్స్టాగ్రామ్ను ఉపయోగించే మిలియన్ల మంది పిల్లలు, యవకులకు చెల్లించాల్సి ఉంటుంది. ఫ్రాన్సెస్ హౌగెన్ దెబ్బే ఇలా మెటా వరుస ఇబ్బందులు ఎదుర్కొవటానికి ఫేస్బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్ కారణం. ఆమె గతంలో ఫేస్బుక్లో తప్పుడు సమాచారం నిరోధించే విభాగంలో మేనేజర్గా పని చేశారు. 2021లో ఫ్రాన్సెస్ హౌగెన్ మెటా తీరును తప్పుబట్టారు. ప్రజల భద్రత కంటే లాభాలే ఫేస్బుక్కు ముఖ్యమని..ద్వేషాన్నిరెచ్చగొట్టే తప్పుడు సమాచారాన్ని ఎంతగా వ్యాప్తి చెందిస్తున్నదీ కంపెనీ సొంత పరిశోధన కూడా చెబుతోందంటూ కొన్ని డాక్యుమెంట్లను విడుదల చేశారు. ఇద్దరు టీనేజర్ల అభిప్రాయాలు ఆ డాక్యుమెంట్లలో వీడియోలు కూడా ఉన్నాయి. వీడియోల్లో ఇద్దరు టీనేజర్లు మెటాకి చెందిన సోషల్ సైట్లపై తమ అభిప్రాయాల్ని వివరించారు. ‘‘14ఏళ్ల ఎలీనార్, ఫ్రేయా’లు ఇద్దరూ తమ వయస్సు వారిలాగే ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. ఓ టీనేజర్గా మేం ఇందులో మోడల్స్ను ఇన్ఫ్లుయెన్సర్స్ను చూస్తుంటాం. వాళ్లందరూ స్కిన్నీగా పర్ఫెక్ట్ బాడీతో ఉంటారు. వాళ్లని చూసినప్పుడు అనుకోకుండానే వాళ్లతో మనల్ని పోల్చి చూసుకుంటాం. ఇదే అన్నింటికన్నా ప్రమాదకరమైందని నాకు అనిపిస్తుంది. ‘‘మనసుకు ఏదీ తోచనప్పుడు ఇన్స్టాగ్రామ్లోకి వెళుతుంటాం. అందులో చాలా వరకు మనల్ని టార్గెట్ చేసేవే మనకి కనిపిస్తుంటాయి. అంటే ఉదాహరణకు మోడల్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ను సెలబ్రిటీస్ మనకి కనిపిస్తుంటారు. అప్పుడనప్పిస్తుంది. ఓహ్! ‘అలా మనం ఎప్పటికీ అవ్వలేమని’ ఫ్రేయా అన్నారు. ఎలీనార్, ఫ్రేయాల ఆందోళనని షేర్ చేసింది.మానసిక ఆరోగ్య సమస్యలపై బాధపడుతున్న టీనేజర్ల పరిస్థితిని ఇన్ స్టాగ్రామ్ మరింత దారుణంగా చేస్తుందని లీకైన ఫేస్బుక్ అంతర్గత పత్రాల్లో ఉంది. ఈ డాక్యుమెంట్స్ను ఫ్రాన్సెస్ హౌగెన్ లీక్ చేసింది. లీకైన కొద్ది సేపటికే రూ.50 వేల కోట్లు నష్టం ఇలా లీకైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో అంతరాయం ఏర్పడడంతో ఫేస్బుక్కు 7 బిలియన్ డాలర్లు అంటే సుమారు మన కరెన్సీలో రూ.50 వేల కోట్లకు పైగానే నష్టం వాటిల్లింది. ఈ ప్రభావం ఫేస్బుక్ స్థాపించినప్పటి నుంచి సర్వీసులు నిలిచిపోవడం, ఈ రేంజ్లో డ్యామేజీ జరగడం ఇదే మొదటి సారి. అంతేకాదు ఈ అంతరాయంతో అపరకుబేరుల జాబితా నుంచి మార్క్ జూకర్ బర్గ్ స్థానం కిందకి దిగజారింది. ఇది అప్పట్లో సంచలనంగా మారింది. కోలుకోలేని నష్టం నాటి నుంచి మెటా ఊహించని విధంగా నష్టపోతూ వస్తుంది. లీకైన పత్రాల వల్ల కొన్ని గంటల వ్యవధిలో వేల కోట్ల నష్టంతో పాటు, సంస్థ పేరును మార్చడంతో పాటు అన్నీ రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. అయితే తాజాగా, 41 రాష్ట్రాల్లో మెటాపై దాఖలైన వాజ్యం ఆ సంస్థ ఇంకెన్ని ఇబ్బందులు ఎదుర్కొనుందో చూడాల్సి ఉంది. చదవండి👉సంచలన నిర్ణయం.. భారత్కు గుడ్బై చెప్పిన రెండు దిగ్గజ కంపెనీలు -
జుకర్బర్గ్ సంచలన నిర్ణయం.. ఫేస్బుక్, ఇన్స్టా యూజర్లకు షాక్!
మార్క్ జుకర్బర్గ్ నేతృత్వంలోని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ 'మెటా' (Meta) 2024 నుంచి యాడ్-ఫ్రీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లను యాడ్స్ లేకుండా వినియోగించాలనుకుంటే తప్పకుండా డబ్బు చెల్లించాల్సిందే అంటూ వార్తలు వస్తున్నాయి. ఇది నిజమే అంటూ కంపెనీ కూడా ప్రకటించింది. అయితే యాడ్స్ వచ్చినా వినియోగించుకోవచ్చు అనుకునేవారు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ విధానం ప్రవేశపెట్టడానికి సంస్థ సన్నద్ధమవుతోంది. ట్రయల్ తరువాత అధికారికంగా 2024 మధ్యలో గానీ లేదా ఆ సంవత్సరం చివరి నాటికి గానీ అమలులోకి రానున్నట్లు సమాచారం. ఇప్పటికే వినియోగదారుని అనుమతి లేకుండా ప్రకటనలు పంపినందుకు ఐర్లాండ్ ప్రైవసీ కమీషన్ మెటాకు భారీ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రకటనలు పంపించాలంటే తప్పకుండా యూజర్ అనుమతి అవసరం అనే రీతిలో యాడ్-ఫ్రీ సబ్స్క్రిప్షన్ విధానం తీసుకువచ్చింది. ఇదీ చదవండి: ముకేశ్ అంబానీకి కాబోయే కోడలు ఆస్తి ఎన్ని కోట్లంటే? ఈ విధానం అమలులోకి వచ్చిన తరువాత యూజర్ యాడ్-ఫ్రీ సబ్స్క్రిప్షన్ కోసం నెలకు ఇన్స్టాగ్రామ్ 14 డాలర్లు, ఫేస్బుక్ 17 డాలర్లను చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. దీనికి సంబందించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది. ప్రారంభంలో ఫ్రీ అన్న జుకర్బర్గ్ ఇప్పుడు ఎక్స్ (ట్విటర్) బాటలో పయనించడానికి సిద్దమవడం గమనార్హం. -
ఐటీలో లేఆఫ్స్ కలకలం: మరోసారి మెటాలో ఉద్యోగాల కోత!
Meta Layoffs: ఐటీ రంగంలో లేఆఫ్స్ పర్వానికి ఇంకా తెరపడే అవకాశాలు కనిపించడం లేదు. ముఖ్యంగా ప్రముఖ సోషల్ మీడియా సంస్థలు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాలో మరోసారి ఉద్యోగాల కోత వార్త కలకలం రేపుతోంది. త్వరలోనే మరింత మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ విడత తొలగింపుల్లో కంపెనీలోని చిప్ డెవలప్మెంట్ టీమ్పై ప్రభావం చూపుతుంది. గత నవంబర్ నుండి 21వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించిన Meta, ఈసారి తన Metaverse డివిజన్ నుండి ఎంప్లాయిస్పై వేటు వేయనుంది. దీంతో ఆగ్మెంటెడ్ , వర్చువల్ రియాలిటీ ఉత్పత్తుల సీఈవో మార్క్ జుకర్బర్గ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను ప్రభావితం చేయవచ్చు. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఫేస్బుక్ ఎజైల్ సిలికాన్ టీమ్ లేదా ఫాస్ట్ టీంలో ఉద్యోగులను సాగనంపాలని భావిస్తోంది. కంపెనీ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫారమ్ ద్వారా బాధిత ఉద్యోగులకు సమాచారం అందిందనీ, దాదాపు 600 మంది ఉద్యోగుల తొలగింపుల ప్రక్రియ బుధవారం ఉంటుందని భావిస్తున్నారు. అయితే తొలగింపులపై మెటా ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు. కృత్రిమ మేధస్సు పనిపై దృష్టి కేంద్రీకరించిన మెటాలోని మరొక చిప్-మేకింగ్ యూనిట్ కష్టాల్లో పడింది. ఆ ప్రయత్నాలకు బాధ్యత వహించిన ఎగ్జిక్యూటివ్ ఇటీవల రాజీనామా చేశారు. కాగా Meta ప్రస్తుతం క్వెస్ట్ వంటి మిశ్రమ రియాలిటీ హెడ్సెట్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ పరికరాలు AI వర్చువల్ అసిస్టెంట్ ద్వారా వీడియోను ప్రసారం చేయగలవు మరియు ధరించిన వారితో కమ్యూనికేట్ చేయగలవని కంపెనీ తెలిపింది. కంపెనీ సాధారణ కళ్లద్దాలను పోలి ఉండే సరళమైన డిజైన్తో సాంకేతికంగా అభివృద్ధి చెందిన AR గ్లాసెస్, స్మార్ట్వాచ్లపై కూడా పని చేస్తోంది. కాగా గ్లోబల్ ఆర్థిక మాంద్య పరిస్థితులు, ఆదాయాల క్షీణత నేపథ్యంలో ఐటీ సహా చాలాకంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా ఫేస్బుక్, ట్విటర్, గూగుల్ లాంటి దిగ్గజాలు వేలాది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. -
కత్రినా క్రేజే వేరు.. ఏకంగా ఫేస్ బుక్ సీఈవోను వెనక్కి నెట్టి!!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరో విక్కీ కౌశల్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్స్ ఉన్న సినీ తారల్లో కత్రినా ఎప్పుడు ముందు వరసలోనే ఉంటారు. ఇన్స్టాలో ఆమెకు 76.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే తాజాగా వాట్సాప్ సైతం ఛానెల్స్ సదుపాయం ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడ కూడా కత్రినా కైఫ్ 14 ఫాలోవర్స్లో ముందు వరుసలో నిలిచింది. ఈ విషయంలో ఏకంగా ఫేస్బుక్ దిగ్గజం మార్క్ జుకర్ బర్గ్, ప్రముఖ రాపర్ బ్యాడ్ బన్నీ కంటే ఎక్కువ ఫాలోవర్స్ను కలిగి ఉంది. (ఇది చదవండి: కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ను నెట్టేసిన సల్మాన్ బాడీగార్డ్స్.. వీడియో వైరల్) ఇప్పటివరకు వాట్సాప్ ఛానెల్కు అత్యధికంగా 23 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రముఖ ఓటీటీ యాప్ నెట్ఫ్లిక్స్ 16.8 మిలియన్లతో రెండోస్థానంలో ఉంది. రియల్ మాడ్రిడ్ అధికారిక ఛానెల్ 14.4 మిలియన్లతో మూడోస్థానంలో నిలవగా.. కత్రినా తన 14.2 మిలియన్ ఫాలోవర్లతో నాలుగో స్థానంలో నిలిచింది. రాపర్ బ్యాడ్ బన్నీ 12.6 మిలియన్ల ఫాలోవర్లతో 5వ స్థానం, మార్క్ జుకర్బర్గ్ను 9.2 మిలియన్లతో కొనసాగుతున్నారు. కత్రినా కైఫ్ సెప్టెంబర్ 13న వాట్సాప్ ఛానెల్ను ప్రారంభించింది. కొత్త ఛానెల్కు స్వాగతం చెబుతూ తన ఫోటోలు కూడా పంచుకుంది. సెలబ్రీటీల పరంగా చూస్తే కత్రినా కైఫ్ టాప్లో ఉంది. (ఇది చదవండి: సల్మాన్ ఖాన్ టైగర్ సందేశం వచ్చేసింది) కత్రినా ప్రస్తుతం సల్మాన్ ఖాన్తో కలిసి టైగర్-3 చిత్రంలో నటిస్తోంది. యష్ రాజ్ బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహించారు. గతంలో సల్మాన్ఖాన్, కత్రినా కైఫ్ జంటగా ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై చిత్రాల్లో నటించారు. ఈ ప్రాంఛైజీలో భాగంగా వస్తున్న చిత్రమే టైగర్-3. నవంబరు 10న దిపావళికి ఈ చిత్రం విడుదల అవుతుందని టైగర్ మేకర్స్ ప్రకటించారు. -
Facebook New Logo: ఫేస్బుక్ లోగో మారిందోచ్.. తేడా గుర్తించగలరా?
Facebook logo changed: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ లోగో మారింది. కొన్ని నెలల క్రితం ఎలాన్ మస్క్ ఆధీనంలోని ట్విటర్ ‘X’గా రీబ్రాండింగ్ అయిన సంగతి తెలిసిందే. దాని ప్రసిద్ధ పిట్ట (లారీ ది బర్డ్) లోగోను కూడా తొలగించి దాని స్థానంలోకి సాధారణ ‘X’ అక్షరం లోగోను తీసుకొచ్చింది. తాజాగా మెటా యాజమాన్యంలోని ఫేస్బుక్ (Facebook) కూడా తమ లోగోలో కొన్ని మార్పులు చేసింది. అయితే ఈ సూక్ష్మ మార్పులను చాలా మంది గమనించలేకోపోయారు. తదేకంగా గమనించే కొందరు యూజర్లు మాత్రం పసిగట్టేశారు. ఫేస్బుక్ కొత్త లోగో తమ “ఐడెంటిటీ సిస్టమ్” అప్డేట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఫేస్బుక్ లోగోను మెటా సర్దుబాటు చేసింది. ట్విటర్ లాంటి భారీ మార్పు కాకుండా సూక్ష్మమైన సర్దుబాటును మాత్రమే ఫేస్బుక్ చేసింది. అయితే తదేకంగా గమినిస్తే తప్ప లోగోలో ఏమి మారిందో గుర్తించడం కష్టం. ఫేస్బుక్ బ్రాండ్కు డిఫైనింగ్ మార్క్ను సృష్టించడం తమ లక్ష్యమని, కొత్త లోగో సుపరిచితంగా, డైనమిక్గా, సొగసైనదిగా భావించేలా ఉండాలనుకున్నట్లు ఫేస్బుక్ డిజైన్ డైరెక్టర్ డేవ్ ఎన్ ఒక బ్లాగ్ పోస్ట్లో పేర్కొన్నారు. ఇంతకీ ఏం మారింది? ఫేస్బుక్ తమ లోగోలో చాలా సూక్ష్మమైన మార్పులు చేసింది. లోగోలోని ‘f’ అక్షరం పరిమాణాన్ని కాస్త పెంచింది. అలాగే లోగో బ్యాక్గ్రౌండ్లో నీలిరంగును కొంచెం ముదురుగా మార్చింది. అయితే ఫాంట్ విషయంలో ఎలాంటి మార్పు లేదు. ఫాంట్ ఇప్పటికీ Facebook Sansగానే ఉంది. ఇది ‘f’ అక్షరాన్ని మరింత ప్రత్యేకంగా చేసింది. (Google AI Chatbot Bard: గూగుల్ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఆ యాప్స్ ఇక మరింత సులువు!) ఇది "ఫేస్బుక్ కోసం రిఫ్రెష్ చేసిన గుర్తింపు వ్యవస్థ" మొదటి దశలో భాగమని మెటా పేర్కొంది. ఈ మార్పును వివరిస్తూ మెటా ఒక బ్లాగ్ పోస్ట్లో ప్రకటన చేసింది. ఫేస్బుక్ యాప్లో రియాక్షన్లకు మరింత వైవిధ్యత తీసుకురావడానికి రియాక్షన్స్ కలర్ ప్యాలెట్ను అప్డేట్ చేసినట్లు ప్రకటించింది. కొత్త లోగోపై ట్రోల్స్ ఫేస్బుక్ కొత్త లోగోపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ‘తేడా గుర్తించండి.. చూద్దాం’ అంటూ ఒకరు, ‘మరింత నీలం’ అంటూ మరొకరు..యూజర్లు తమకు తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే ‘ఇది అత్యంత భారీ మార్పు’ అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చారు. -
మెటాకు కీలక మార్కెట్గా భారత్
న్యూఢిల్లీ: స్థూలఆర్థిక వృద్ధి, డిజిటల్ మౌలిక సదుపాయాలు తదితర అంశాల్లో భారత్లో అపరిమిత అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఇండియా హెడ్ సంధ్య దేవనాథన్ చెప్పారు. వీటితో పాటు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి తమ యాప్స్ గణనీయంగా ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో భారత్ను తాము కీలక మార్కెట్గా పరిగణిస్తున్నామని ఆమె వివరించారు. కేంద్రం కొత్తగా రూపొందించిన డిజిటల్ వ్యక్తిగత డేటా భద్రత చట్టంతో ఇటు యూజర్ల వివరాల గోప్యతను పాటించడం, అటు నూతన ఆవిష్కరణలు చేయడం మధ్య సమతౌల్యం పాటించడానికి సంబంధించి టెక్ కంపెనీలకు స్పష్టత లభించిందని సంధ్య తెలిపారు. తమ ప్లాట్ఫామ్పై తప్పుడు సమాచారాన్ని, విద్వేషపూరిత కంటెంట్ని క్రియాశీలకంగా కట్టడి చేసేందుకు కృత్రిమ మేధను తాము సమర్థంగా వినియోగించుకునేందుకు కృషి చేస్తున్నామని ఆమె చెప్పారు. పెరుగుతున్న యూజర్లు.. కీలక మార్కెట్లలో టీనేజర్లు, యువతలో ఫేస్బుక్కు ఆదరణ తగ్గుతోందన్న అభిప్రాయం సరికాదని.. మెటాలో భాగమైన ఫేస్బుక్కు భారత్లో 40 కోట్ల మంది పైగా యూజర్లు ఉన్నారని వివరించారు. భారత్లో తాము వివిధ నవకల్పనలను పరీక్షించి, అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. 2030 నాటికల్లా 1 లక్ష కోట్ల డాలర్ల డిజిటల్ ఎకానమీగా ఎదగాలన్న భారత్ విజన్ అనేది వ్యాపారాలకు గణనీయంగా ఊతమివ్వగలదని సంధ్య చెప్పారు. -
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యూజర్లకు భారీ షాక్!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలో ఫేస్బుక్, ఇన్స్ట్రామ్ యూజర్లకు గట్టి షాకివ్వనుంది. ఆ రెండు ఫ్లాట్ఫామ్లలో యాడ్స్ప్లే అవ్వకూడదనుకుంటే అందుకు యూజర్లు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ నిబంధన యురేపియన్ యూనియన్లో అందుబాటులోకి రానుందని సమచారం. త్వరలో మిగిలిన దేశాలకు సైతం వర్తించనుంది. దీనిపై మెటా అధినేత మార్క్ జుకర్ బెర్గ్ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. 2019 నుంచి మెటా సేవలపై యూరోపియన్ యూనియన్ దేశాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మెటా అనుమతి లేకుండా వినియోగదారుల డేటాను సేకరిస్తుందని ఆరోపిస్తున్నాయి. నాటి నుంచి న్యాయపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. ఈ తరుణంలో మెటా యాజమాన్యం పెయిడ్ సర్వీసులపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ పెయిడ్ సబ్స్క్రిప్షన్ సేవలు అందుబాటులోకి వస్తే యూజర్లు పేస్బుక్, ఇన్స్టాగ్రామ్కు ఏ ఒక్కదానికి చెల్లించినా.. మరొకటి ఉచితంగా ఇవ్వనున్నది. ఇక పెయిడ్ వెర్షన్లో యూజర్ల నుంచి ఎంత వసూలు చేస్తారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. రెండు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు ఒకేసారి చెల్లించి వాడుకోవడంతో పాటు.. లేదంటే వేర్వేరుగా ప్లాన్ సైతం ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. -
మస్క్ & జుకర్బర్గ్ పోరుకి అంతా సిద్ధం.. వేదిక అక్కడే?
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఎలాన్ మస్క్ & మార్క్ జుకర్బర్గ్ కేజ్ ఫైట్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు దీనికి చరమ దశ వచ్చిందా అన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ప్లేస్ కూడా ఫిక్స్ చేసినట్లు టెస్లా సీఈఓ ట్వీట్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఈ ఫైట్ మస్క్ అండ్ జుక్ ఫౌండేషన్ల ద్వారా నిర్వహిచనున్నట్లు తెలుస్తోంది. దీనికి రోమ్ నగరం వేదిక కానున్నట్లు, ఇప్పటికే ఇటలీ ప్రధానితో, అక్కడి సాంస్కృతిక శాఖామంత్రితో మాట్లాడినట్లు మస్క్ ట్వీట్ చేశారు. దీని ద్వారా వచ్చే డబ్బు మొత్తం స్వచ్చంద సంస్థలకు వెళ్లనున్నట్లు ఇదివరకే తెలియజేసారు. మెటా అండ్ ఎక్స్ ద్వారా ఈ ఫైట్ లైవ్ చూడవచ్చని వెల్లడించారు. ఇప్పటికే జరగాల్సిన ఈ ఫైట్ మస్క్ ఆరోగ్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అంతే కాకుండా ఈ పోరుకి తానూ ఎప్పుడూ సిద్దమే అన్నట్లు గతం నుంచి జుకర్బర్గ్ చెబుతూనే ఉన్నాడు. అయితే ఇప్పటికి కూడా ఈ ఫైట్ జరుగుతుందా? లేదా అనేదాని మీద సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు డేట్ కూడా ఇంకా ప్రకటించకపోవడం గమనార్హం. ఇదీ చదవండి: మొబైల్ కనిపించకుండా పోయిందా? డోంట్ వర్రీ - పరిష్కారమిదిగో..! ఈ కేజ్ ఫైట్ కోసం ఇప్పటికే ప్రపంచంలోని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ పోరు జరిగితే ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ ఎంతోమందిలో రోజురోజుకి ఎక్కువవుతోంది. బహుశా ఇది త్వరలోనే జరిగే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. The fight will be managed by my and Zuck’s foundations (not UFC). Livestream will be on this platform and Meta. Everything in camera frame will be ancient Rome, so nothing modern at all. I spoke to the PM of Italy and Minister of Culture. They have agreed on an epic location. — Elon Musk (@elonmusk) August 11, 2023 -
రింగ్లో ఫైటింగ్కు సిద్ధమౌతున్న మస్క్, జుకర్ బర్గ్
-
‘జుక్ × మస్క్’ కుబేరుల కోట్లాట లైవ్.. ఆ ఆదాయంతో..
ఎక్స్ (ట్విటర్) అధినేత ఎలాన్ మస్క్, మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ కేజ్ ఫైట్లో తలపడనున్నారని తెలిసిందే. అయితే ఈ ఫైట్ను తన మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విటర్)లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు మస్క్ తాజాగా ప్రకటించారు. ఈ ఇద్దరు టెక్ టైటాన్లు గత నెలలో కేజ్ ఫైట్లో ఒకరినొకరు ఎదుర్కొనే సవాలును స్వీకరిస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఆన్లైన్ షేక్ అవుతోంది. తరచూ వరి ఫైట్ గురించే చర్చ జరుగుతోంది. వారి ప్రత్యక్ష యుద్ధాన్ని వీక్షించేందుకు ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘జుక్ Vs మస్క్ ఫైట్ ఎక్స్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. దీని ద్వారా వచ్చే మొత్తాన్ని వెటరన్స్ సంక్షేమానికి వెచ్చిస్తాం’ ట్వీట్ చేశారు. పోరాటానికి తాను సిద్ధమవుతున్నానని, రోజంతా బరువులు ఎత్తుతున్నానని అంతకుముందు చేసిన ట్వీట్లో పేర్కొన్నారు. అయితే తనకు వర్కవుట్ చేసేందుకు సమయం లేదని అందుకే వర్క్ దగ్గరకే వెయిట్స్ తెచ్చుకుంటున్నట్లు చమత్కరించారు. ఈ సందర్భంగా వారి ఫైట్ గురించి ఓ యూజర్ ప్రస్తావించగా మస్క్ స్పందిస్తూ "ఇది ఒక నాగరిక యుద్ధం. మగాళ్లు యుద్ధాన్ని ఇష్టపడతారు" అని బదులిచ్చారు. 51 ఏళ్ల మస్క్, 39 ఏళ్ల జుకర్బర్గ్ మధ్య అన్ని విషయాల్లోనూ పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంతగా ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఈ మధ్య ట్విటర్కు పోటీగా మెటా కొత్త యాప్ థ్రెడ్స్ ప్రకటించినప్పుడు అది తారస్థాయికి చేరింది. జుకర్బర్గ్తో కేజ్ ఫైట్ కోసం తాను సిద్ధంగా ఉన్నానని మస్క్ ట్విటర్లో తన అభిమానులకు చెప్పారు. ఆ మధ్య మార్షల్ ఆర్ట్స్ వీడియోలను జుకర్బర్గ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా "ఫైట్ లొకేషన్ పంపించు" అంటూ ప్రతిస్పందించారు ఎలాన్ మస్క్. కేజ్ ఫైట్పై ఇద్దరూ పరస్పర పోస్టులు పెడుతూ ఫాలోవర్లలో ఉత్తేజం నింపుతున్నారు. Zuck v Musk fight will be live-streamed on 𝕏. All proceeds will go to charity for veterans. — Elon Musk (@elonmusk) August 6, 2023 -
ఫేస్బుక్ సీఈవోలో ఈ టాలెంట్ కూడా ఉందా? రింగులో దిగితే..
టెక్ రంగంలో తనదైన రీతిలో దూసుకెళ్తున్న మెటా 'సీఈఓ మార్క్ జుకర్బర్గ్' (Mark Zuckerberg) గురించి అందరికి తెలుసు. ఈయన కేవలం సాంకేతిక రంగంలో మాత్రమే కాకుండా యుద్ధ కలల్లో కూడా మంచి ప్రావీణ్యం పొందాడు. ఇందులో భాగంగానే తాజాగా బ్రెజిలియన్ ‘జియు-జిట్సు’లో బ్లూ బెల్ట్ సాధించినట్లు తెలిపాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రముఖ బిలియనీర్ జాబితాలో ఒకరైన జుకర్బర్గ్ ఈ విజయాన్ని ఇన్స్టాగ్రామ్లో గర్వంగా పంచుకున్నారు. ఇందులో అతని కోచ్ డేవ్ కామరిల్లోతో కలిసి కొత్త బెల్ట్ ప్రమోషన్లను జరుపుకున్నారు. ఇందులో 5వ డిగ్రీ బ్లాక్ బెల్ట్ సాధించిన డేవ్కి శుభాకాంక్షలు తెలిపారు. మీరు ఒక గొప్ప కోచ్, మీ ట్రైనింగ్లో ఫైటింగ్ గురించి చాలా నేర్చుకున్నాను, బ్లూ బెల్ట్ సాధించే స్థాయికి ఎదగటం చాలా గౌరవంగా భావిస్తున్నా అని ఫోటోలను పోస్ట్ చేశారు. (ఇదీ చదవండి: ఇది విడ్డూరం కాదు.. అంతకు మించి.. తెల్లగా ఉందని జాబ్ ఇవ్వలేదు!) జుకర్బర్గ్ చేసిన పోస్టుకి డేవ్ రిప్లై ఇస్తూ.. మీ ఆసక్తికి ధన్యవాదాలు, ట్రైనింగ్ సమయంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారని గొప్పగా కొనియాడాడు. ఈ పోస్టుకి నెటిజన్లు కూడా తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఎలాన్ మస్క్ అండ్ మార్క్ మధ్య కేజ్ ఫైట్ జరుగుతుందనే వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందనే దాని మీద ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడి కాలేదు. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) -
ఆరంభ శూరత్వం..ట్విటర్ దెబ్బకు చాప చుట్టేసిన ‘థ్రెడ్స్’!
ఆరంభంలో శూరత్వం అన్నట్టు.. ట్విటర్కు పోటీగా ఎదురైన కొన్ని రోజులకే థ్రెడ్స్ యూజర్ల విషయంలో చాప చుట్టేస్తున్నట్లు తెలుస్తోంది. రోజులు గడిచే కొద్ది యాక్టీవ్ యూజర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్.. థ్రెడ్స్ను యూజర్లకు పరిచయం చేసిన ప్రారంభంలో దాని రోజూ వారీ యూజర్లు 10 మిలియన్ యూజర్లు ఉన్నట్లు తెలిపారు. కానీ ఇటీవల విడుదలైన నివేదిక మాత్రం పూర్తి భిన్నంగా చూపిస్తోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. యాప్లో రోజువారీ యాక్టీవ్ యూజర్ల సంఖ్య వరుసగా రెండవ వారం పడిపోయింది. ఇప్పుడు 13 మిలియన్లకు చేరుకుంది. జూలై ప్రారంభంలో గరిష్ట స్థాయి నుండి 70 శాతం యూజర్లు తగ్గినట్లు సూచిస్తుంది. అదే సమయంలో ట్విటర్ రోజువారీ యాక్టీవ్ యూజర్లు 200 మిలియన్లు ఉన్నారు. దీంతో ట్విటర్కు గట్టి పోటీ ఇవ్వాలంటే థ్రెడ్స్కు భారీ ఎత్తున యూజర్లు కావాల్సి ఉంటుంది. దీంతో పాటు సైన్ ఆప్ల విషయంలో మార్క్ జుకర్ బెర్గ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటూ వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నారు. జులై 5న అందుబాటులోకి వచ్చిన థ్రెడ్స్ ప్రారంభం రోజుల్లో.. లాగిన్ అయ్యేందుకు యూజర్లు పోటెత్తేవారు. రాను రాను అలా సైన్ అప్ అయ్యే వారి సంఖ్య సైతం తగ్గింది. వినియోగదారుల్లో ఆసక్తి తగ్గుతూ వస్తుంది. యూజర్ల సంఖ్య భారీగా పడిపోతున్నప్పటికీ మెటా యాజమాన్యం ట్విటర్కు పోటీ థ్రెడ్సేనన్న సంకేతాలిస్తుంది. యాప్ను పునరుద్ధరిస్తూ కొత్త ఫీచర్లను పరిచయం చేసేలా దృష్టిసారిస్తున్నట్లు తెలిపింది. అయినప్పటికీ, వినియోగదాలు తగ్గిపోకుండా ట్విటర్ ఎలాంటి ఫీచర్లను యూజర్లకు అందిస్తుందో.. థ్రెడ్స్ సైతం అవే ఫీచర్లను ఎనేబుల్ చేయాలని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
చాట్జీపీటీ, గూగుల్లకు పోటీగా మెటా ఏఐ.. ఉచిత వెర్షన్ విడుదల
ఫేస్బుక్ యజమాన్య సంస్థ మెటా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అడుగు పెట్టింది. ఇప్పటికే సంచలనం సృష్టించిన చాట్జీపీటీ (ChatGPT), గూగుల్ (Google) లకు పోటీగా తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ను పరిచయం చేసింది. ఉచిత వెర్షన్ను విడుదల చేసింది. ఓపెన్ ఏఐ, గూగుల్ సంస్థలు అభివృద్ధి చేసిన చాట్జీపీటీ, బార్డ్ చాట్బాట్లు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. మానవ సృజనాత్మకత, నైపుణ్యాన్ని అనుకరిస్తూ వారిని ఆకర్షించేలా వీటిని రూపొందించారు. అయితే ఇందుకు భిన్నంగా జెనరేటివ్ ఏఐ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాకుండా పరిశోధకుల కోసం ప్రత్యేకంగా ‘లామా’ (Llama) అనే భాషా నమూనాను అభివృద్ధి చేసింది మెటా. ఈ లామా అనేది ఓపెన్ సోర్స్. అంటే ఓపెన్ ఏఐ, గూగుల్లు అభివృద్ధి చేసిన ఏఐలకు భిన్నంగా మెటా లామా ఏఐలో అంతర్గతంగా జరిగే పనులు అందరికీ అందుబాటులో ఉంటాయి. వాటిని సవరించే వీలుంటుంది. ఇదీ చదవండి ➤ Meta: ‘మెటా’పై తీవ్ర ఆరోపణలు! కేసు వేసిన ఉద్యోగిని.. ఏం జరిగిందంటే.. "ఓపెన్ సోర్స్ ఇన్నోవేషన్ను ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఇది చాలా మంది డెవలపర్లను కొత్త టెక్నాలజీతో నిర్మించడానికి వీలు కల్పిస్తుంది" అని మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ పోస్ట్లో తెలిపారు. అలాగే ఇది సేఫ్టీ, సెక్యూరిటీని కూడా మెరుగుపరుస్తుందన్నారు. ఎందుకంటే సాఫ్ట్వేర్ అందరికీ అందుబాటులో ఉంచినప్పుడు ఎక్కువ మంది పరిశీలించి సంభావ్య సమస్యలను గుర్తించడానికి, వాటిని పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా డౌన్లోడ్ చేసుకునేలా మెటా ఏఐ మోడల్ సరికొత్త, శక్తివంతమైన వర్షన్ లామా 2 త్వరలో అందుబాటులోకి రానుంది. మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ సర్వీస్ ద్వారా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. -
కలిసిపోయిన మస్క్, జుకర్బర్గ్.. బీచ్లో హగ్గులు, ఆటలు!
ట్విటర్ బాస్ 'ఎలాన్ మస్క్' & మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'మార్క్ జుకర్బర్గ్' మధ్య ఉన్న పోటీ గురించి దాదాపు అందరికి తెలుసు. ఈ ఇద్దరూ కేజ్ ఫైట్కు సిద్దమవుతున్నట్లు గత కొన్ని రోజులకు ముందు సోషల్ మీడియాలో ఒక న్యూస్ చక్కర్లు కొట్టింది. అయితే ఇప్పుడు వీరిరువురూ కలిసిపోయినట్లు కనిపించే ఫోటో వైరల్ అయింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఎలాన్ మస్క్ అండ్ జుకర్బర్గ్ కలిసిపోయినట్లు కనిపించే ఈ ఫోటో 'ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్' (AI) రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇద్దరూ చేతులు పట్టుకుని టైటాన్లు బీచ్లో నడుస్తున్నట్లు కనిపిస్తుంది. (ఇదీ చదవండి: భారత్లో ఈ కార్లకు డిమాండ్ ఎక్కువ - వీటి ప్రత్యేకతేంటంటే?) సర్ డోజ్ ఆఫ్ ది కాయిన్తో అనే ఒక ట్విటర్ యూజర్ ఏఐ ద్వారా ఈ చిత్రాలను రూపోంచినట్లు తెలుస్తోంది. ఇందులో ఒకరి చేయి మరొకరు పట్టుకున్నట్లు, కౌగిలించుకున్నట్లు, బీచ్లో ఎంజాయ్ చేతున్నట్లు చూడవచ్చు. ఇప్పటికి ఈ ఫొటోలు మిలియన్ల మంది వీక్షించారు. లక్షల మంచి లైక్ చేశారు. దీనిపై స్పందించిన మస్క్ ఒక నవ్వుతున్న ఎమోజి ట్విటర్ ద్వారా పోస్ట్ చేశారు. మొత్తం మీద ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 😂 — Elon Musk (@elonmusk) July 14, 2023 -
‘మెటా’పై తీవ్ర ఆరోపణలు! కేసు వేసిన ఉద్యోగిని
Lawsuit on Meta: యూఎస్ టెక్ దిగ్గజం మెటా (Meta) జాతి వివక్షకు పాల్పడుతోందని, ఆసియన్లను చిన్నచూపు చూస్తోందని ఆరోపిస్తూ వైష్ణవి జయకుమార్ అనే సింగపూర్కు చెందిన భారతీయ సంతతి ఉద్యోగిని కాలిఫోర్నియా పౌర హక్కుల విభాగంలో దావా వేశారు. 2020 జనవరిలో మెటా కంపెనీలో చేరిన ఆమె అంతకు ముందు డిస్నీ, గూగుల్, ట్విటర్ సంస్థల్లో పనిచేశారు. ప్రమోషన్లలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తనను తక్కువ అనుభవం ఉన్న ఉద్యోగుల కింద చేర్చి అవకాశాలు లేకుండా చేశారని వైష్ణవి వాపోయారు. ఆసియన్ మహిళ అయిన తనపై ఎలా జాతి వివక్ష చూపారో వైష్ణవీ జయకుమార్ ఇటీవలి లింక్డ్ఇన్ పోస్ట్లో రాశారు. గత నెలలో మాస్ లేఆఫ్ల రూపంలో తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. మెటా కంపెనీలో యూత్ పాలసీ హెడ్గా ఉన్న వైష్ణవీ జయకుమార్ మెటా యాప్లన్నింటిలో వయసు ఆధారిత పాలసీలు, ఉత్పత్తి లక్షణాలపై పనిచేసే బృందానికి నాయకత్వం వహించేవారు. మొదటి రెండేళ్లు అంతా బాగానే జరిగిందని, ఆ తర్వాత ప్రమోషన్ గురించి అడిగినప్పుడు జాతి వివక్షను ఎదుర్కొన్నట్లు వైష్ణవి పేర్కొన్నారు. తన మేనేజర్ ఉన్నట్టుండి జాతి వివక్ష చూపడం ప్రారంభించారని చెప్పుకొచ్చారు. తనకు ఇతర అభ్యర్థుల కంటే ఎక్కువ అనుభవం ఉన్నప్పటికీ నాయకత్వ బాధ్యతలకు తాను సీనియర్ని కానంటూ యాజమాన్యానికి తప్పుడు నివేదిక ఇచ్చారని వాపోయారు. ఎగ్జిక్యూటివ్ స్థాయిలో 25 శాతమే.. వైష్ణవీ జయకుమార్ తన దావాలో ఆసియా, పసిఫిక్ ద్వీపవాసుల నిపుణుల నెట్వర్క్ ‘అసెండ్’ 2022లో చేసిన ఒక అధ్యయనాన్ని ప్రస్తావించారు. దాని ప్రకారం మెటా కంపెనీలోని మొత్తం వర్క్ఫోర్స్లో 49 శాతం మంది ఆసియన్లు ఉంటే ఎగ్జిక్యూటివ్ స్థాయిలో 25 శాతం మంది మాత్రమే ఆసియన్లు ఉన్నారు. 2022 చివరి నాటికి మెటా కంపెనీ 11,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది మార్చిలో మరో రౌండ్ మాస్ లేఆఫ్లలో మరో 10,000 మందికి ఉద్వాసన పలికింది. సిలికాన్ వ్యాలీలో దీర్ఘకాలంగా ఉన్న జాతి వివక్షకు వ్యతిరేకంగా చర్య తీసుకోవాలని కోరుతూ టెక్ పరిశ్రమలో ఆసియా అమెరికన్లు దాఖలు చేసిన అనేక వ్యాజ్యాలలో వైష్ణవీ జయకుమార్ వేసిన దావా కూడా ఒకటి. అయితే ఈ ఆరోపణలపై మెటా కంపెనీ వర్గాల నుంచి ఇంతవరకు ఎటువంటి వివరణ రాలేదు. ఇదీ చదవండి: ఎలాన్ మస్క్పై కోర్టులో దావా: ఇష్టమొచ్చినట్లు తొలగించడం కాదు.. కట్టు రూ. 4వేల కోట్లు! -
దెయ్యాలు వేదాలు వల్లిస్తే.. ఎవరూ ఊహించనిది ఇది!
ఎలన్ మస్క్తో పాటు ఎవరూ కూడా ఇలాంటి ఓ పరిణామం జరుగుతుందని ఊహించి ఉండరు. అదేంటో తెలుసా?.. తాలిబన్ల ఆయన్ని ఆరాధించడం. అవును.. ట్విటర్ను అద్భుతంగా నడిపిస్తూ తమకెంతో ప్రియపాత్రుడిగా నిలిచిపోయాడంటూ ఎలన్ మస్క్ను ఇష్టపడుతున్నారు వాళ్లు. అదే సమయంలో మార్క్ జుకర్బర్గ్ పేరు చెబితేనే అసహ్యించుకుంటున్నారు. ఎందుకంటే.. అఫ్గనిస్తాన్లో అనధికార ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తాలిబన్లు ట్విటర్పై.. దాని ఓనర్ ఎలన్ మస్క్పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. తాజాగా.. తాలిబన్ నేత అనాస్ హక్కానీ సైతం మస్క్ను ఆకాశానికి ఎత్తేశాడు. భావ ప్రకటనకు సోషల్ మీడియాల్లో ట్విటర్ మాత్రమే సరైన వేదిక. దానిని సమర్థవంతంగా నడిపిస్తున్న ఎలన్ మస్క్కు తాలిబన్ల తరపున అభినందనలు. అందుకే ఆయనంటే మాకు ఎంతో గౌరవం అంటూ పేర్కొన్నారు. ‘‘ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల కంటే Twitter ద్వారా రెండు అడ్వాంటేజ్లు ఉన్నాయి. మొదటిది వాక్ స్వాతంత్ర్యం హక్కు. రెండోది Twitter స్వభావమైన విశ్వసనీయత. మెటాలాంటి అసహన విధానానికి ట్విటర్ దూరంగా ఉంటుంది. వేరొకటి దానిని భర్తీ చేయలేదు అంటూ మెటా థ్రెడ్స్ను ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్ చేశారాయన. Twitter has two important advantages over other social media platforms. The first privilege is the freedom of speech. The second privilege is the public nature & credibility of Twitter. Twitter doesn't have an intolerant policy like Meta. Other platforms cannot replace it. pic.twitter.com/oYQTI3hgfI — Anas Haqqani(انس حقاني) (@AnasHaqqani313) July 10, 2023 కారణం ఇదే.. మెటాను(ఒకప్పటి ఫేస్బుక్)ను తాలిబన్లు ద్వేషించడానికి ప్రధాన కారణం .. తాలిబన్ అనే పదాన్ని ఆ ప్లాట్ఫారమ్ పరిగణించే విధానం. పక్కా టైర్ 1 ఉగ్రవాద సంస్థగా తాలిబన్ను చూపిస్తోంది ఇది. పైగా తాలిబన్కు మురికి అనే అర్థం కట్టబెట్టింది. ఈ కారణం వల్లే ఫేస్బుక్(మెటా)లో తాలిబన్ లీడర్లు తమ అభిప్రాయాలను పంచుకోలేకపోతున్నారు.. అసహ్యించుకుంటున్నారు. అదే ట్విటర్లో అయితే యధేచ్ఛగా తమ పోస్టులను పెడుతున్నారు. ఇస్లామిక్ ఎమిరేట్ అఫ్గ్ పేరిట తాలిబన్ గ్రూప్కు ట్విటర్లో ఓ అధికారిక అకౌంట్ కూడా ఉంది. నాటో బలగాల ఉపసంహరణ తర్వాత తాలిబన్లు తిరిగి అఫ్గనిస్థాన్ను స్వాధీనం చేసుకున్నాయి. ఇకపై ప్రజాస్వామ్య యుతంగా.. పాలన సాగిస్తామని, ఏ వర్గానికి హక్కుల్ని దూరం చేయబోమని ప్రకటించుకుని పాలన మొదలుపెట్టింది. పైగా ఈ ప్రచారంతోనే గ్లోబల్ గుర్తింపు, అటుపై ఆర్థిక సాయం.. ఒప్పందాల కోసం తాలిబన్ ప్రభుత్వం ఎదురు చూస్తోంది. కానీ, తుపాకీ రాజ్యంలో మహిళలు, పిల్లల హక్కులను కాలరాస్తూనే వస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి తాలిబన్లు మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది కదా!. ఇదీ చదవండి: ఒంటి కన్ను దొంగ.. భలే భలే కథ -
చట్టపరమైన చిక్కుల్లో థ్రెడ్స్.. మార్క్ జుకర్ బర్గ్కు నోటీసులు!
ఎలాన్ మస్క్కు చెందిన ట్విటర్కు పోటీగా మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్ మాతృసంస్థ) అధినేత మార్క్ జుకర్ బర్గ్ ‘థ్రెడ్స్’ను విడుదల చేశారు. ఈ యాప్ సంచలనాలకు కేంద్రం బిందువుగా మారింది. లాంఛ్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే సుమారు 30 మిలియన్ యూజర్లను సొంతం చేసుకుంది. అదే సమయంలో చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకుంది. తమ మేధో సంపత్తిని (intellectual property rights)ను కాపీ కొట్టారంటూ ఎలాన్ మస్క్ తన లాయర్ అలెక్స్ స్పిరో ద్వారా జుకర్ బర్గ్కు నోటీసులు పంపించారు. ట్విటర్ వ్యాపార రహస్యాలు, మేధో సంపత్తిని చట్టవిరుద్ధంగా దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ నోటీసుల్లో అలెక్స్ స్పిరో పేర్కొన్నారు. వీటితో పాటు ట్విటర్ వాణిజ్య రహస్యాలు, ఇతర అత్యంత గోప్యమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలున్న డజన్ల కొద్దీ మాజీ ట్విటర్ ఉద్యోగులను మెటా నియమించుకుందని లేఖలో ఆరోపించింది. NEWS: Twitter is threatening to sue Meta over "systematic, willful and unlawful misappropriation" of Twitter's trade secrets and IP, as well as scraping of Twitter's data, in a cease-and-desist letter sent yesterday to Zuckerberg by Elon's lawyer Alex Spiro. pic.twitter.com/enWhnlYcAt — T(w)itter Daily News (@TitterDaily) July 6, 2023 తమ సంస్థ వ్యాపార రహస్యాలు, ఇతర అత్యంత గోప్యమైన సమాచారాన్ని ఉపయోగించడం మెటా మానుకోవాలని డిమాండ్ చేస్తోంది. అయితే మెటాకు ట్విటర్ నోటీసులంటూ వచ్చిన వార్తలను ఉటంకిస్తూ చేసిన ట్వీట్కు మస్క్ స్పందించారు. ‘పోటీ మంచిదే.. కానీ మోసం చేయకూడదు’ అని అన్నారు. ఇక, థ్రెడ్స్లో ట్విటర్ మాజీ ఉద్యోగులున్నారంటూ ట్విటర్ పంపిన నోటీసుల్ని మెటా ఖండించింది. థ్రెడ్స్ ఐటీ విభాగంలో మాజీ ట్విటర్ ఉద్యోగులు ఎవరూ లేరని మెటా ప్రతినిధి ఆండీ స్టోన్ థ్రెడ్స్ పోస్ట్లో తెలిపారు. మేధో సంపత్తి అంటే? మేధో సంపత్తి అనేది కంటికి కనిపించని ఆస్తుల్లోని ఓ భాగం. మనుషులు తమ తెలివితేటలతో సృష్టించే ఆవిష్కరణ, సాహిత్య, కళాత్మక పని, డిజైన్లు, చిహ్నాలు (సింబల్స్), పేర్లు, చిత్రాలు (ఇమేజెస్) వంటివి ఈ జాబితాలో ఉంటాయి. వీటికి వ్యక్తుల మనసు, తెలివితేటలు ప్రాణం పోస్తాయి. వీటి సృష్టికి సంబంధించిన ఐడియాలు కంటికి కనిపించవు. ఈ ఐడియాలనే మేధో సంపత్తి అంటారు. -
మార్గ్ జుకర్బర్గ్ ట్వీట్! ఎలాన్ మస్క్ రిప్లై ఇలా..
ట్విటర్కు పోటీగా విడుదలైన మెటా థ్రెడ్స్ కొన్ని గంటల్లోనే సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఒక మిలియన్ కంటే ఎక్కువమంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లు మెటా సీఈఓ మార్గ్ జుకర్బర్గ్ వెల్లడించారు. కొంతమంది ఈ కొత్త యాప్ని ట్విటర్ కిల్లర్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇందులో భాగంగానే జుకర్బర్గ్ ట్విటర్ ద్వారా ఒక పోస్ట్ చేసాడు. ఇది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జుకర్బర్గ్ ట్వీట్.. నిజానికి మెటా సీఈఓ జుకర్బర్గ్ ట్విటర్ ద్వారా పోస్ట్ చేయడం చాలా రోజుల తరువాత ఇదే మొదటి సారి. సుమారు 11 సంవత్సరాల తరువాత మొదటి పోస్ట్ చేసాడు. కొత్త యాప్ లాంచింగ్ సందర్భంగా ఈ ట్వీట్ చేసాడు. ఈ పోస్టులో కనిపించే రెండు స్పైడర్మ్యాన్ చిత్రాలు ఒకే రకమైన దుస్తులు ధరించి ఉండటం చూడవచ్చు. ఇది ట్విటర్ అధినేత మస్క్ను ఉదీసించి పోస్ట్ అని తెలుస్తోంది. pic.twitter.com/MbMxUWiQgp — Mark Zuckerberg (@finkd) July 6, 2023 జుకర్బర్గ్ 2012 జనవరి 18 తరువాత ట్విటర్ ద్వారా ట్వీట్ చేయడం ఇదే మొదటి సారి. ఈ పోస్టుకి ఇప్పటికి లెక్కకు మించిన లైకులు, కామెంట్స్ అండ్ షేర్స్ వస్తున్నాయి. థ్రెడ్స్ యూజర్ల సంఖ్య ట్విటర్ను మించిపోతుందా అనే ప్రశ్నకు జుకర్బర్గ్ ఇంకా కొంత సమయం పట్టవచ్చని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. (ఇదీ చదవండి: ట్విటర్ను షేక్ చేస్తున్న మెటా థ్రెడ్స్.. లక్షలు దాటుతున్న యూజర్ల సంఖ్య!) ఎలాన్ మస్క్ ట్వీట్.. థ్రెడ్స్ యాప్ దాదాపు ట్విటర్ మాదిరిగానే ఉందని ఒక నెటిజన్ కామెంట్ చేసాడు. ఇందులో భాగంగా ఒక కీ బోర్డు ఇమేజ్ యాడ్ చేసి Ctrl+C+V (ట్విటర్ కాపీ పేస్ట్) అని రాసాడు. దీనికి స్పందిస్తూ ఎలాన్ మస్క్ నవ్వుతున్న ఒక ఎమోజి పోస్ట్ చేసాడు. మొత్తానికి అనుకున్న విధంగా మెటా ఒక కొత్త యాప్ తీసుకువచ్చింది. అయితే ఇది ట్విటర్ యాప్ని దెబ్బతీస్తుందా.. లేదా అనేది మరి కొన్ని రోజుల్లోనే తెలుస్తుంది. (ఇదీ చదవండి: ట్విటర్కు పోటీగా మెటా థ్రెడ్స్.. నిమిషాల్లోనే సంచలనం.. ఇలా లాగిన్ అవ్వండి!) 😂 — Elon Musk (@elonmusk) July 6, 2023 -
విడుదల కాకుండానే..మెటా ‘థ్రెడ్స్’కు ఎదురు దెబ్బ!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా ట్విటర్ తరహాలో థ్రెడ్స్ పేరుతో యాప్ను లాంఛ్ చేస్తున్నట్లు ప్రకటించింది. విడుదలకు ముందే ఆ యాప్కు ఎదురు దెబ్బ తగిలింది. యూజర్ల డేటా విషయంలో భద్రత లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ విచిత్రంగా స్పందించారు. ఇటీవల,ట్విటర్లో రోజుకు వీక్షించే ట్వీట్లపై ఎలాన్ మస్క్ ఆంక్షలు విధించారు. దీంతో ఆయనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ట్విటర్ బాస్ మాత్రం తాను చేస్తున్న చర్యల్ని సమర్ధించుకున్నారు. యూజర్లు ట్విటర్కు బానిసయ్యే ప్రమాదం ఉంది. దాని నుంచి బయట పడాల్సిన అవసరం ఉంది. నేను ప్రపంచానికి మంచి చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. అదే సమయంలో గత కొంత కాలంగా పనిచేస్తున్న థ్రెడ్ యాప్ను యూజర్లకు అందిస్తున్నట్లు మెటా తెలిపింది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ప్లే స్టోర్ సైతం ఆ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈనేపథ్యంలో ఎన్ ఎఫ్టీ టెక్నాలజీ సీఈవో మారియో నౌఫల్ థ్రెడ్ యాప్ గురించి ట్వీట్ చేశారు. థ్రెడ్ యాప్ విడుదలపై స్పష్టత వచ్చింది. జులై 6న అమెరికాలో విడుదల కానుంది. మెటాలోని ఓ ఎగ్జిక్యూటివ్ చెప్పినట్లుగా.. మెటా లక్ష్యం నీతి, నిజాయితీ, విలువలతో కూడిన సోషల్ మీడియా సైట్ను అభివృద్ది చేయడం. అయినప్పటికీ, యాప్ తన వివరణలో పేర్కొన్నట్లుగా ‘సనేలీ రన్’ అనే పదం యాప్ మీ మొత్తం డేటాను సేకరిస్తుంది అని సూచించేలా ఉంది. వ్యక్తిగతంగా, అది నిజమేనని నేను గట్టిగా నమ్ముతాను. 🚨BREAKING: META's Answer to Twitter (Threads) Release Date CONFIRMED 'Threads' will be released on Thursday in the U.S. The app has been described as a competitor to Twitter. According to an executive at Meta, its goal is to establish a "sanely run" social media site.… pic.twitter.com/PxQxAERnB1 — Mario Nawfal (@MarioNawfal) July 4, 2023 ట్విటర్ ఉన్నత ఆశయాలతో పనిచేస్తుంది. జుకర్ బర్గ్ అందుకు విరుద్ధం. వాక్ స్వాతంత్య్రానికి నిజమైన ఛాంపియన్ అతనే అంటూ వెటకారంగా ట్వీట్లో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సానుకూలం అంశం ఏంటంటే? థ్రెడ్ యాప్ విషయంలో జుకర్ బర్గ్తో పోటీ పడేందుకు ఎలాన్ మస్క్ ఇప్పటికే సిద్ధంగా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. Great tweet on this story, further demonstrating Meta's COMPLETE lack of care about privacy! https://t.co/jJ6WxsGlJy — Mario Nawfal (@MarioNawfal) July 4, 2023 అందుకు ఇయాన్ జెల్బో అనే మరో నెటిజన్.. ఆశ్చర్యం పోవడానికి అందులో ఏమీ లేదు. ఎందుకంటే ట్విటర్ ప్రత్యర్ధి మెటా మన డేటాను కలెక్ట్ చేస్తుందంటూ కొన్ని ఆధారాలు చూపిస్తూ వాటిని ట్వీట్ చేశాడు. Thank goodness they’re so sanely run — Elon Musk (@elonmusk) July 4, 2023 ఆ ట్వీట్లకు మస్క్ తనదైన శైలిలో స్పందించారు. కృతజ్ఞత, వాళ్లు చాలా తెలివిగా నడుచుంటున్నారని పేర్కొన్నారు. మరి థ్రెడ్స్ విడుదల, డేటా గోప్యతపై మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ స్పందించాల్సి ఉంటుంది. చదవండి👉 ట్విటర్ పోటీగా మెటా ‘థ్రెడ్’.. ఫస్ట్ లుక్ ఇదే! -
ట్విటర్ పోటీగా మెటా ‘థ్రెడ్’.. ఫస్ట్ లుక్ ఇదే!
Instagram Threads : యూజర్లు చూసే ట్వీట్లపై ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే, మస్క్ నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న యూజర్లు ట్విటర్కు ప్రత్యామ్నాయమైన బ్లూ స్కై, మాస్టోడాన్ లాంటి మైక్రోబ్లాగింగ్ యాప్స్ను వినియోగించేందుకు మక్కువ చూపుతున్నారు. ఈ తరుణంలో మస్క్ను మరింత ఇబ్బందుల్లో నెట్టేలా మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ‘థ్రెడ్’ పేరుతో ట్విటర్ తరహా మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ఫామ్ యాప్ను జులై 6న విడుదల చేయనున్నారు. ఈ యాప్ విడుదల తేదీపై స్పష్టత లేనప్పటికీ.. థ్రెడ్ యాప్ వివరాలు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్నాయి. థ్రెడ్ యాప్ విడుదల తర్వాత ఇన్స్ట్రాగ్రామ్ యూజర్లు వారి ఇన్స్టా ఐడీతో ఈ మైక్రోబ్లాగింగ్ యాప్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుందంటూ ప్లేస్టోర్లో కనిపిస్తున్న థ్రెడ్ యాప్లో లాగిన్ వివరాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ యాప్ గురించి సంస్థ ఉద్యోగులతో మెటా చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ క్రిస్ కాక్స్ ప్రివ్యూ మీటింగ్ నిర్వహించారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. థ్రెడ్ కోసం డీసెంట్రలైజ్డ్ సోషల్ మీడియా ప్రోటోకాల్ సంస్థ యాక్టివిటీపబ్తో మెటా చేతులు కలిపింది. ఈ సంస్థ వెబ్ సర్వర్లకు - వెబ్బ్రౌజర్లు థ్రెడ్ యాప్ ఇంటర్ ఫేస్కు అనుసంధానం చేసేలా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ యాప్ ఇంటర్నల్ కోడ్ నేమ్ ‘ప్రాజెక్ట్ 92’ అని తెలుస్తోంది. చదవండి👉 ఎలాన్ మస్క్కు ఏమైంది? ఆ మందులు ఎందుకు వాడుతున్నట్లు? -
ముష్టియుద్ధానికి సిద్ధమవుతున్న మస్క్, జుకర్బర్గ్.. ట్రైనింగ్ కూడా..
సాధారణంగా ధనవంతులైన ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధం ఎప్పుడూ ఉంటుంది, అలాంటి సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు నిందారోపణలు చేసుకుంటారు. అయితే ఇప్పుడు ప్రపంచ కుబేరులైన టెస్లా సీఈఓ 'ఎలన్ మస్క్' (Elon Musk), ఫేస్బుక్ వ్యవస్థాపకుడు 'మార్క్ జుకర్బర్గ్' (Mark Zuckerberg) నిజమైన పోరుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. I’m up for a cage match if he is lol — Elon Musk (@elonmusk) June 21, 2023 మాటలతో మొదలైన ఈ పోరు చేతల వరకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు పరిస్థితులు చెబుతున్నాయి. వీరు ఇప్పుడు ట్రైనింగ్ సెషన్ వరకూ వెళ్లారని కొన్ని సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుస్తోంది. ప్రారంభంలో.. జుకర్బర్గ్ ఒకే అంటే కేజ్ ఫైట్ చేయడానికి తాను సిద్దమేనని మస్క్ ట్విటర్ పోస్ట్ చేసాడు. దీనికి రిప్లై ఇస్తూ జుకర్బర్గ్ 'ప్లేస్ ఎక్కడో చెప్పు' అన్నట్లు సమాచారం. I did an impromptu training session with @elonmusk for a few hours yesterday. I'm extremely impressed with his strength, power, and skill, on the feet and on the ground. It was epic. It's really inspiring to see Elon and Mark doing martial arts, but I think the world is served… pic.twitter.com/cq00A9Xnmw — Lex Fridman (@lexfridman) June 27, 2023 అంతటితో ఆగకుండా మస్క్ 'వెగాస్ ఆక్టాగాన్' వచ్చేయ్ అక్కడ చూసుకుందాం.. అన్నాడట. అయితే ఇది కేవలం పోస్టులకు మాత్రమే పరిమితం అనుకున్న నెటిజన్లకు మరో షాకింగ్ న్యూస్ తెలిసింది. అదేంటంటే వీరిద్దరూ కూడా ఈ ఫైట్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు, దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరి మధ్య ఫైట్ తథ్యమే అని చాలా మంది అనుకుంటున్నారు. (ఇదీ చదవండి: కోకాకోలా క్యాన్సర్ కారకమా? డబ్ల్యూహెచ్ఓ ఏం చెబుతోందంటే!) Here's a highlight video of Mark Zuckerberg and I training jiu jitsu. I look forward to training with @elonmusk as well. It's inspiring to see both Elon and Mark taking on the martial arts journey. See the full video here: https://t.co/G1ubUuxILK pic.twitter.com/WsLaRiFf1o — Lex Fridman (@lexfridman) June 25, 2023 నిజంగా వీరిద్దరి మధ్య పోరు జరుగుతుందా.. లేదా? అనేది ఖచ్చితంగా తెలియకపోయినా, ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదే జరిగితే ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్ గురించి బాగా తెలిసిన జుకర్బర్గ్ చేతిలో మస్క్ ఓటమి ఖాయమని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మీమ్స్ కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి. -
సొంత ఉద్యోగులే భారీ షాకిచ్చారు
-
లేఆఫ్స్ సెగ: అయ్యయ్యో మార్క్ ఏందయ్యా ఇది!
మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్కు మింగుడు పడని వార్త ఇది. మెటా నిర్వహించిన ఉద్యోగుల సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడైనాయి. కేవలం 26 శాతం మంది సిబ్బంది మాత్రమే మెటా మార్క్ జుకర్బర్గ్ నాయకత్వంపై విశ్వాసం కలిగి ఉన్నారని వాషింగ్టన్ పోస్ట్ ఒక నివేదికలో పేర్కొంది. గతేడాది అక్టోబర్తో పోలిస్తే ఐదు శాతం పడిపోయిందని తెలిపింది. (అదరగొట్టిన పోరీలు..ఇన్స్టాను షేక్ చేస్తున్న వీడియో చూస్తే ఫిదా!) వాల్ స్ట్రీట్ జనరల్లో ప్రచురించిన నివేదిక ప్రకారం మెటా ఉద్యోగులలో 74 శాతం మంది అసంతృప్తితో ఉన్నారట. వేలాది మంది ఉద్యోగులను తొలగించిన రెండు నెలల తర్వాత ఏప్రిల్ 26- మే 10 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో నాలుగింట ఒక వంతు మంది అంటే 26 శాతం మంది మాత్రమే మార్క్ జుకర్బర్గ్ నాయకత్వంపై విశ్వాసంతో ఉన్నారు. ఇది అక్టోబర్లో 58 శాతం నుండి 5 శాతం క్షీణించి 43 శాతానికి పడిపోయింది. (ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ ఏదో తెలిస్తే షాకవుతారు) ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా ఖర్చులను తగ్గించుకునే పనిలో దిగ్గజ కంపెనీలు లేఆఫ్స్ బాటపట్టాయి. ఫేస్బుక్ మాతృసంస్థ మెటా సహా గూగుల్, మైక్రోసాఫ్ట్ అమెజాన్ లాంటి అనేక టెక్ కంపెనీలు వేలాది ఉద్యోగులపై వేటు వేశాయి. ముఖ్యంగా మెటా అనేక దశల్లో 21వేలకు పైగా ఉద్యోగులను తొలగించింది. ఈ ఆకస్మిక తొలగింపులు మెటాలో పనిచేస్తున్న వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని ప్రస్తుత , మాజీ ఉద్యోగులు భావిస్తున్నారు. -
మెటా కీలక నిర్ణయం వర్క్ ఫర్మ్ హోమ్..!
-
వర్క్ ఫ్రమ్ హోమ్కు స్వస్తి.. కొత్త వర్క్ పాలసీని అమలు చేయనున్న మెటా!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకోనుంది. వర్క్ ప్రమ్ హోమ్ను తగ్గించేలా చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం కొత్త వర్క్ పాలసీని తయారు చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ కొత్త పని నిబంధనలు అమల్లోకి వస్తే ఉద్యోగులు కనీసం వారానికి మూడు రోజులు కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుంది. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. వర్క్లో సమర్ధత, ఉత్పాదకత వంటి అంశాల్ని పరిగణలోకి తీసుకున్న మెటా ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి కొత్త పాలసీని అమలు చేయనుంది. అయితే, ఇప్పటికే రిమోట్ వర్క్కి పరిమితమైన ఉద్యోగులు వారి ప్రస్తుత స్థానాల నుంచి విధులు నిర్వహించేందుకు మెటా అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా మెటా ప్రతినిధులు కొత్త వర్క్ పాలసీ విషయంలో ఉద్యోగులు పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది కార్యాలయం నుంచి లేదంటే ఇంటి నుంచి పని చేసినా ఉద్యోగుల పనితీరులో ఎలాంటి మార్పులు ఉండవని, సమర్ధవంతంగా పనిచేస్తారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సహకారం, సంబంధాలు, అనుకూలమైన పని సంస్కృతిని పెంపొందించేందుకే కొత్త పని విధానంపై పనిచేస్తున్నట్లు మెటా ప్రతినిధి ప్రస్తావించారు.ఈ నిర్ణయం మెటా గత కొంతకాలంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి నెలలో మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్తో జరిగిన ఇంటర్నల్ మీటింగ్లో ఇంజినీర్లు వారంలో కనీసం మూడు రోజులు సహచరులతో కలిసి పనిచేసినప్పుడే మెరుగైన పనితీరు కనబరుస్తామనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో మెటా వర్క్ పాలసీ అమలు చేయనున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే? -
మెటాలో తొలగింపులు! వారికి జుకర్బర్గ్ ఇస్తానన్న ప్యాకేజీ ఏంటో తెలుసా?
ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా (Meta Platforms Inc) ఆఖరు రౌండ్ లేఆఫ్స్ను మొదలు పెట్టింది. మొత్తం 10,000 ఉద్యోగాలను తొలగించడానికి మార్చిలో ప్రకటించిన ప్రణాళికలో భాగంగా ఇది చివరి రౌండ్ తొలగింపు. మొదటి, రెండో విడత తొలగింపులు ఇప్పటకే పూర్తయ్యాయి. ఈ మేరకు కొంతమంది మెటా ఉద్యోగులు లింక్డ్ఇన్ వంటి ప్లాట్ఫామ్లలో తమ తొలగింపు గురించి తెలియజేశారు. ఈ రౌండ్ లేఆఫ్స్లో కంపెనీ యాడ్ సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో ఎక్కువ మందిని తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. సీవెరెన్స్ ప్యాకేజీ అంటే? గతంలో 11,000 మంది ఉద్యోగులను తొలగించినప్పుడు మెటా కంపెనీ వారికి సీవెరెన్స్ ప్యాకేజీని వాగ్దానం చేసింది. సీవెరెన్స్ ప్యాకేజీ అంటే ఉద్యోగులను తొలగించినప్పుడు కంపెనీ వారికి చెల్లించే మొత్తానికి సంబంధించిన ప్యాకేజీ. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఈ ప్యాకేజీ కింద 16 వారాల మూల వేతనం చెల్లిస్తారు. అదనంగా ఉద్యోగుల అనుభవాన్ని బట్టి వారు పనిచేసిన ఒక్కో సంవత్సరానికి రెండు వారాల మూల వేతనం చొప్పున తొలగింపునకు గురైన ఉద్యోగులు అందుకుంటారు. అలాగే ఈ ప్యాకేజీ కింద ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఆరు నెలలపాటు వైద్య ఖర్చులను కంపెనీనే భరిస్తుంది. 2022 నవంబర్లో 11,000 మందికిపైగా ఉద్యోగులను మెటా తొలగించింది. తర్వాత ఈ ఏడాది మార్చిలో మళ్లీ 10,000 ఉద్యోగాలను తొలగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సారి తొలగిస్తున్న ఉద్యోగాలతో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 2021 ఏడాది మధ్య నాటికి ఉన్న స్థాయికి పడిపోయింది. 2020 తర్వాత మెటా నియామకాలను రెట్టింపు చేస్తూ వచ్చింది. మొత్తంగా లేఆఫ్స్ ప్రభావం ఈ సారి నాన్-ఇంజనీరింగ్ ఉద్యోగులపై పడింది. అంటే కోడింగ్, ప్రోగ్రామింగ్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కంపెనీ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీతో ఇంజనీర్లు, నాన్ ఇంజనీరింగ్ ఉద్యోగుల మధ్య సమతూకం పాటించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు సీఈవో మార్క్ జుకర్బర్గ్ గత మార్చిలో హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ భారీ కానుక.. రూ.64 కోట్లు! -
మెటాకు భారీ షాక్
-
మెట్గాలాలో బిలియనీర్లు అంబానీ, మస్క్, రతన్ టాటా, ఆనంద్ మహీంద్ర: ఫోటోలు వైరల్
సాక్షి,ముంబై: మెట్గాలాలో బిలియనీర్లు, ప్రముఖ వ్యాపారవేత్తలు సందడి చేశారు. అదేంటి ఫ్యాషన్ ఈవెంట్లో వ్యాపారవేత్తలకు ఏం పని అనుకుంటున్నారా? ఇదంతా ఏఐ ఆర్ట్ మహిమ. ఏఐ ఆర్టిస్ట్ అబూ సాహిద్ బుర్రలో వచ్చిన ఆలోచనకు ప్రతిరూపమే ఈ చిత్రాలు. ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ఇంట్రస్టింగ్ ఫోటోలతో ఇన్స్టాలో పాపులర్ అవుతున్నారు. (Nokia C22: నోకియా సీ22 స్మార్ట్ఫోన్ వచ్చేసింది: అదిరే ఫీచర్లు, అతి తక్కువ ధర) రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, ఎంఅండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర, ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా, ట్విటర్ అధినేత, ఎలాన్ మస్క్, మెటా సీఈవో మార్క్జుకర్ బర్గ్ మెట్ గాలాకు హాజరవుతున్నట్లు ఊహించి ఈ ఫోటోలను సృష్టించారు. మిడ్ జర్నీ సాయంతోరూపుదిద్దిన ఈ ఫోటోల్లోబాబా రాందేవ్, అజీం ప్రేమ్జీతో పాటు, బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ లాంటి దిగ్గజాల ఫోటోలు కూడా ఉండటం విశేషం. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో ఒకటి మెట్గాలా. ఈ ఐకానిక్ ఫ్యాషన్ ఈవెంట్ను న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో ప్రతీ ఏడాది నిర్వహిస్తుంటారు. (అయ్యయ్యో! ఐకానిక్ స్టార్, ప్రిన్స్ మహేష్, డార్లింగ్ ప్రభాస్? ఎందుకిలా?) కాగా కృత్రిమ మేధస్సుతో (ఏఐ) రూపొందించిన చిత్రాలు ఇంటర్నెట్లో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లు , డిజిటల్ ఆర్టిస్టులు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రూపొందించిన చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఇండియన్ డిజిటల్ ఆర్టిస్ అబూ సాహిత్ ప్రముఖంగా నిలుస్తున్నారు. ఇన్స్టాలో ఆయనకు 21.6వేల గ్రామ్ ఫాలోవర్లున్నారు. ఆయన పేజీ నిండా ఇలాంటి ఫోటోలు చాలానే ఉన్నాయి. View this post on Instagram A post shared by SK MD ABU SAHID (@sahixd) -
రిలేషనే కాదు.. ఎదో తెలియని ఎమోషన్.. జుకర్బర్గ్ ఫోటో వైరల్
ముగ్గురు ఆడపిల్లల మురిపాల తండ్రి మెటా సీయివో మార్క్ జుకర్బర్గ్. మాగ్జిమా (7), ఆగస్ట్(5)లకు తోడుగా గత మార్చి నెలలో ఈ లోకంలోకి వచ్చింది ఔరేలియ. ‘వెల్కమ్ టూ ది వరల్డ్’ అంటూ ఆ చిట్టి ఫోటోను పోస్ట్ చేసి స్వాగతం పలికాడు జుకర్బర్గ్. తాజా విషయానికి వస్తే... పెద్దమ్మాయి, రెండో అమ్మాయిల కోసం తానే స్వయంగా త్రీడీ ప్రింటింగ్ డ్రెస్లను డిజైన్ చేయడంతో పాటు కుట్టుపని కూడా నేర్చుకున్నాడు జుకర్బర్గ్. తాను డిజైన్ చేసిన గౌన్ను పిల్లలు ధరించారు. ఆ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు జుకర్బర్గ్. ఈ ఫొటో బాగా వైరల్ అయింది. చదవండి: కర్బూజ జ్యూస్ తాగుతున్నారా? అధిక మోతాదులో పొటాషియం ఉండటం వల్ల.. ‘జుకర్ బర్గ్... మీరు ఎన్ని గొప్ప విజయాలు సాధించినా సరే, పిల్లల డ్రెస్ కోసం కేటాయించిన సమయం అత్యంత విలువైనది. భవిష్యత్లో మీ పిల్లలకు ఎప్పుడూ గుర్తుండిపోయే విలువైన సందర్భం ఇది’ అంటూ నెటిజనులు స్పందించారు. -
వినతుల వెల్లువ.. వాట్సాప్లో మరో అదిరిపోయే ఫీచర్!
న్యూఢిల్లీ: వాట్సాప్ ఓ అనుకూల సదుపాయాన్ని తన యూజర్ల కోసం రూపొందించింది. ఒకటికి మించిన ఫోన్లలో ఒక్కటే వాట్సాప్ ఖాతాను ఉపయోగించుకోవచ్చని ప్రకటించింది. అంతర్జాతీయంగా ఈ ఫీచర్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు, రానున్న వారాల్లో ప్రతి ఒక్కరికీ ఇది వినియోగంలోకి వస్తుందని పేర్కొంది. ఈ ఫీచర్ కావాలంటూ వాట్సాప్ యూజర్లలో ఎక్కువ మంది నుంచి వినతులు రావడంతో దీన్ని రూపొందించినట్టు సంస్థ తెలపింది. వాట్సాప్ను వెబ్ బ్రౌజర్కు కనెక్ట్ చేసిన మాదిరే, ఒకటికి మించిన ఫోన్లలోనూ అనుసంధానించడం ద్వారా కొత్త ఫీచర్ను ఉపయోగించుకోవచ్చు. ఇలా ఒకే ఖాతా అనుసంధానమై ఉన్న ఏ ఫోన్లో అయినా చాట్, మీడియా, కాల్స్ సేవలు వాడుకోవచ్చని వాట్సాప్ తెలిపింది. ఒకవేళ ప్రైమరీ ఫోన్ (మొదట ఇన్స్టాల్ చేసుకున్న)లో వాట్సాప్ చాలా కాలంగా యాక్టివ్గా లేకపోతే, అప్పుడు ఆ అకౌంట్ కనెక్ట్ అయి ఉన్న ఇతర ఫోన్లలోనూ దానంతట అదే లాగవుట్ అవుతుందని పేర్కొంది. సైనవుట్ చేయాల్సిన అవసరం లేకుండా, ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కు ‘నౌ స్విచ్’ను ఎంపిక చేసుకోవచ్చని వాట్సాప్ తెలిపింది. -
షాకిచ్చిన మెటా.. ఊహించినట్టే భారీగా ఊడుతున్న ఉద్యోగాలు!
ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా మరో సారి భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పడం లేదని మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ చెప్పినట్లు బ్లూమ్బెర్గ్ కథనం ప్రచురించింది. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. తాజా లేఆఫ్స్పై మేనేజర్లుకు మెటా మెమో పంపింది. ఆ మెమోలో ఉద్యోగుల్ని కోత విధించే విషయంలో సిద్ధంగా ఉండాలని సూచించింది. దీంతో ఫేస్బుక్, వాట్సాప్,ఇన్స్టా, వర్చువల్ రియాలిటీ సంస్థ రియాలిటీ ల్యాబ్స్,క్విస్ట్ హార్డ్ వంటి విభాగాల్లోని ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. కాస్ట్ కటింగ్ విషయంలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు10 వేల మంది ఉపాధి కోల్పోనున్నట్లు జుకర్ బర్గ్ ఈ ఏడాది మార్చి నెలలో ప్రకటించిన విషయం తెలిసింది. ఆ ప్రకటనకు కొనసాగింపుగానే ఇప్పుడు తొలగింపుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా మేనేజర్లకు పంపిన మెమోలో ఉద్యోగులు సైతం కొత్త మేనేజర్ల పర్యవేక్షణలో పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని, వర్క్ను విభజించినప్పుడు వివిధ విభాగాల ఉద్యోగులు వారితో పనిచేయాల్సి వస్తుందని సూచించింది. కాగా, ఈ సందర్భంగా మెటా ప్రతినిధి లేఆఫ్స్పై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. 5 నెలల్లో ఇది రెండోసారి 5 నెలల్లో మెటా భారీగా ఉద్యోగాలను తొలగించడం ఇది రెండో సారి. గత నవంబరులో 13శాతంతో 11,000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఈ ఏడాది మార్చిలో ఉద్యోగుల్ని మరోసారి తొలగిస్తున్నట్లు సూచన ప్రాయంగా తెలియజేసింది. కొత్త నియామకాల్ని నిలిపివేసింది. ‘ప్రతికూల వ్యాపార’ పరిస్థితుల నేపథ్యంలో, సంస్థ ఆర్థిక స్థితిని కాపాడుకునేందుకు వ్యయాలు తగ్గించుకుంటున్నామని, ఇందులో భాగంగానే ఉద్యోగుల సంఖ్యను కుదిస్తున్నట్లు మెటా ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి👉 ఉద్యోగులపై వేలాడుతున్న లేఆఫ్స్ కత్తి, 2.70 లక్షల మంది తొలగింపు..ఎప్పుడు? ఎక్కడా? -
బుజ్జి బంగారం: ఆనందంలో మునిగి తేలుతున్న మార్క్ జుకర్బర్గ్
సాక్షి,ముంబై: ఫేస్బుక్ మాతృసంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఎందుకంటే జుకర్ బర్గ్ భార్య ప్రిసిల్లా చాన్ మూడో బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మార్క్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మరోసారి అమ్మాయి పుట్టడం పట్ల జుకర్ బర్గ్ సంతోషం వ్యక్తం చేశారు. లిటిల్ బ్లెస్సింగ్.. అరేలియా చాన్కి స్వాగతం అంటూ జుకర్ బర్గ్ ప్రకటించారు. దీంతో 1 మిలియన్కు పైగా లైక్స్ అభినందనలు వెల్లువెత్తాయి. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) (ఇదీ చదవండి: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ , అదిరిపోయే లాంచింగ్ ఆఫర్ కూడా!) కాగా గతంలోనే తనకు పాప పుడుతుందని జుకర్ బర్గ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రిసిల్లా చాన్ మూడోసారి ప్రెగ్నెంట్ అయిందని, మ్యాక్స్, ఆగస్ట్ (కుమార్తెలు) కు వచ్చే ఏడాది ఓ చెల్లి రాబోతోందంటూ అని తన భార్యతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీలో కలుసుకున్న ప్రిసిల్లా చాన్,జుకర్బర్గ్.. 2003 నుంచి డేటింగ్లో ఉన్న ఈ జంట 2012లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికే ఇద్దరి అమ్మాయిలకు జన్మనిచ్చింది ఈ జంట.ఇటీవలే పదో వెడ్డింగ్ యానివర్సరీ కూడా జరుపు కున్నారు. (జియో కస్టమర్లకు ట్విస్ట్: ఎంట్రీ-లెవల్ రూ.199 ప్లాన్ ఇక రూ. 299లు) -
ఇది నమ్మక ద్రోహమే..తక్షణమే రాజీనామా చెయ్యండి! జుకర్బర్గ్ ఆగ్రహం
న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ఇటీవలికాలంలో పెద్దసంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతుండటం ఆందోళన రేపుతోంది. ఈ నేపథ్యంలోదాదాపు రెండు దశాబ్దాల క్రితం ఉద్యోగులకు జుకర్బర్గ్ అంతర్గత ఇమెయిల్ ఆన్ లైన్లో చక్కర్లు కొడుతోంది. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ 2010లో ఉద్యోగులకు రాసిన ఈమెయిల్ తాజాగా (మంగళవారం. మార్చి 21) లీక్ అయింది. తాజా నివేదికల ప్రకారం ఫేస్బుక్ సొంత మొబైల్ ఫోన్లో పనిచేస్తోందని టెక్ క్రంచ్ కథనానికి ప్రతిస్పందనగా 2010 ఇమెయిల్ పంపించారు. ఈ వార్తను ఖండిస్తూ సిబ్బందిపై జుకర్ బర్గ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నెట్వర్క్ భవిష్యత్తు ప్రణాళికల గురించి తప్పుడు సమాచారాన్ని లీక్ చేశాడనేది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి కంపెనీ రహస్యంగా ఫోన్ను నిర్మిస్తోందన్న టెక్ క్రంచ్ కథనంపై అసహనం వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా నమ్మక ద్రోహమే.. ఈ పని ఎవరు చేశారో దయచేసి తక్షణమే రాజీనామా చేయండి అని జుకర్బర్గ్ మండిపడ్డారు. 2010, సెప్టెంబరులో నాటి ఈ ఇ-మెయిల్ "కాన్ఫిడెన్షియల్-డోంట్ షేర్" అనే లైన్తో మొదలవుతుంది. ఒక ప్రశ్నోత్తరాల సమయంలో తాను ఫోన్ తయారీ గురించి అస్సలు మాట్లాడలేదని, అన్ని ఫోన్లు, యాప్స్ మరింత సోషల్ కావడం, భవిష్యత్తు ప్రణాళికలపై మాత్రమే సుదీర్ఘంగా మాట్లాడాను అంటూ టెక్ క్రంచ్ కథనాన్ని కోట్ చేశారు. ఈ విషయాన్ని ఎవరు లీక్ చేసినా వెంటనే రాజీనామా చేయాల్సిందేనంటూ ఆగ్రహించారు. సంస్థ అంతర్గత సమాచారాన్ని లీక్ చేసిన వారు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి.. లేదంటే అదెవరో ఖచ్చితంగా తెలుసుకుంటామని జుకర్బర్గ్ హెచ్చరించారు. కాగా గత ఏడాదంతా మెటాకు ఎదురు దెబ్బతగిలింది. ప్రతికూల ఆర్థిక వాతావరణామాలు, ఆదాయాలు పడిపోవడంతో వేలాదిమందిని తొలగించింది. అంతేకాదు మిడిల్ మేనేజ్మెంట్ను లక్ష్యంగా రాబోయే నెలల్లో 10వేల మందిని మెటా తొలగిస్తుందని, అలాగ 5 వేల ఇతర జాబ్స్ను కూడా భర్తీ చేయడంలేదని మార్చి నెల ప్రారంభంలో జుకర్బర్గ్ ఉద్యోగులకు ఇమెయిల్ సమాచారాన్ని అందించిన సంగతి తెలిసిందే. -
ఉద్యోగులకు మార్క్జుకర్ బర్గ్ షాక్ .. మరో 10,000 మందిని
న్యూయార్క్: ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా మరో 10,000 మందికి ఉద్వాసన పలకనున్నట్టు మంగళవారం ప్రకటించింది. అలాగే కొత్తగా 5,000 మందిని విధుల్లోకి తీసుకోవాలనుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు స్పష్టం చేసింది. నాలుగు నెలల్లోనే రెండవ పర్యాయం ఉద్యోగుల కోతకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సంస్థ చరిత్రలో అత్యధికంగా 2022 నవంబర్లో 13 శాతం (11,000) మంది ఉద్యోగులను మెటా తొలగించిన సంగతి తెలిసిందే. ఉద్యోగాల కోత రాబోయే రెండు నెలల్లో జరుగుతుందని సంస్థ సీఈవో మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ వేదికగా వెల్లడించారు. ‘పునర్నిర్మాణాలు, తొలగింపులను మా సాంకేతిక సమూహాలలో ఏప్రిల్ చివరలో, వ్యాపార సమూహాలలో మే నెలాఖరులో ప్రకటించాలని భావిస్తున్నాము’ అని తెలిపారు. ఉద్యోగుల కోత పూర్తి అయితే మొత్తం సిబ్బంది సంఖ్య సుమారు 66,000లకు వచ్చి చేరనుంది. 2022 సెపె్టంబర్ చివరినాటికి 87,314 మంది సంస్థలో పనిచేస్తున్నారు. -
జుకర్బర్గ్పై ఎలాన్ మస్క్ తీవ్ర వ్యాఖ్యలు!
ఫేస్బుక్ మాతృసంస్థ మెటా.. ట్విటర్ తరహా వికేంద్రీకృత సోషల్ నెట్వర్క్ను ప్రారంభించే యోచనలో ఉంది. సాధ్యాసాధ్యాలపై మెటా కసరత్తు చేస్తోంది. అయితే దీనికి సంబంధించిన వార్తను ట్విటర్లో షేర్ చేయగా ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదీ చదవండి: Jayanti Chauhan: రూ.7 వేల కోట్ల కంపెనీని వద్దన్న వారసురాలు.. ఇప్పుడిప్పుడే.. ట్విటర్ లాంటి సోషల్ నెట్వర్క్ను మెటా ప్రారంభించనున్నట్లు వచ్చిన వార్తలపై డిజీ కాయిన్ సహ వ్యవస్థాపకుడు బిల్లీ మార్కస్ ట్విటర్లో షిబెటోషి నకమోటో పేరుతో ఓ మీమ్ వీడియోను పోస్ట్ చేశారు. మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ ట్విటర్కు పోటీగా అలాంటి నెట్వర్క్ ప్రారంభిస్తే ఎలాన్ మస్క్తో విసుగు చెందిన యూజర్లు జకర్బర్గ్ను అమితంగా ఇష్టపడతారని రాశారు. దీనికి ఎలాన్ మస్క్ బదులిస్తూ జుకర్బర్గ్ను ‘కాపీ క్యాట్’ అని సంభోదించారు. అయితే పిల్లి అని అక్షరాల్లో రాయకుండా పిల్లి ఎమోజీని ఉపయోగించారు. ఇదీ చదవండి: Microsoft: మరీ దారుణం భయ్యా! టీం అంతటినీ పీకేశారు.. టెక్కీ ఆవేదన ఫేస్బుక్ కసరత్తు చేస్తున్న ఈ కొత్త సోషల్ నెట్వర్క్కు ‘P92’ అనే కోడ్నేమ్ను పెట్టింది. దీనిపై అప్పుడప్పుడూ కొంతమంది తమ అభిప్రాయాలతో అప్డేట్లు ఇస్తున్నారు. కొత్త సోషల్ నెట్వర్క్ను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు మెటా ప్రతినిధి సైతం ధ్రువీకరించారు. అయితే ఇతర వివరాలేవీ ఆయన చెప్పలేదు. Copy 🐈 — Elon Musk (@elonmusk) March 11, 2023 -
మెటాలో భారీ లేఆఫ్స్...ఈ సారి ఎంతమంది అంటే?
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా మరోసారి ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుట్టింది. ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ ఈ వారంలో వేలాది మంది ఉద్యోగుల్ని ఫైర్ చేయనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది నవంబర్లో మెటా కంపెనీ చరిత్రలోనే తొలిసారిగా 13శాతంతో 11వేల మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా తలెత్తిన ఆర్ధిక అనిశ్చితితో మరోసారి సిబ్బందిని ఇంటికి సాగనంపేందుకు సిద్ధమైంది మెటా. మేనేజర్లకు ప్యాకేజీలు ఇచ్చి వెళ్లగొట్టే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. రెండో దఫా తొలగింపులపై బ్లూమ్బర్గ్ ఫిబ్రవరిలో ఓ కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు ఆ కథనానికి కొనసాగింపుగా ఉద్యోగులకు పింక్ స్లిప్లు జారీ చేసేందుకు మెటా సిద్ధమైంది. జుకర్ బర్గ్ నిర్ధేశించిన ఆర్ధిక లక్ష్యాలను చేరుకునేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందంటూ మెటా ఇంటర్నల్ మీటింగ్లో పాల్గొని..పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ ఉద్యోగి తెలిపారు. కంపెనీల నుంచి మెటాకు వచ్చే యాడ్స్ తగ్గిపోవడంతో సంస్థ వర్చువల్ రియాలిటీ మెటావర్స్పై దృష్టిసారించింది. పొదుపు మంత్రం జపిస్తూనే ఖర్చు పెట్టే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. అందుకే ఏ ఉద్యోగిని ఉంచాలి? ఎవర్ని తొలగించాలో చెప్పాలంటూ డైరెక్టర్లను, వైస్ ప్రెసిడెంట్లను అడుగుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
మెటా,ఇన్స్టాగ్రామ్ యూజర్లకు భారీ షాక్!
ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ బాటలో మెటా (facebook) సీఈవో మార్క్ జుకర్ బర్గ్ పయనిస్తున్నారు. ఇన్ని రోజులు ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్ సేవల్ని ఉచితంగా అందించిన జుకర్ బర్గ్.. ఇప్పుడు యూజర్ల నుంచి ప్రతినెలా ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఫ్రీగా వినియోగించుకునే మెటా, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లు ఇకపై మరింత కాస్ట్లీగా మారనున్నాయి. ట్విటర్ తరహాలో మెటా సైతం.. మెటా, ఇన్స్టాగ్రామ్ బ్లూటిక్ హోల్డర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు మార్క్ జుకర్ బర్గ్ అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ ఐడీలతో ఫేస్బుక్ బ్లూటిక్ హోల్డర్ల అకౌంట్ల పరిశీలించి.. తొలుత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో వెరిఫికేషన్ ఛార్జీలను విధించనున్నారు. ఆ తర్వాత మిగతా దేశాల్లో బ్లూ టిక్ యూజర్ల నుంచి పెద్ద మొత్తంలో యూజర్ల ఛార్జీలు వసూలు చేయనున్నారు. బ్లూ వెరిఫికేషన్తో ఫేక్ అకౌంట్ల నుంచి యూజర్లు సురక్షితంగా ఉండొచ్చని ఈ సందర్భంగా జుకర్ బర్గ్ తెలిపారు. ఈ కొత్త ఫీచర్ వల్ల యూజర్లలో విశ్వసనీయత పెరగడంతోపాటు రీచ్,సెక్యూరిటీ పెరుగుతుందన్నారు.ఇక మెటా ప్రకటించినట్లుగా ఐఓఎస్ యూజర్లు నెలకు 14.99 డాలర్లు, వెబ్ యూజర్ల నుంచి నెలకు 11.99 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. -
ఉద్యోగాల కోతలు.. మార్క్ జూకర్బర్గ్ కు సెక్యూరిటీ పెంపు
-
మార్క్ జుకర్ బర్గ్ అలవెన్స్ భారీగా పెంచిన ఫేస్బుక్
-
340 కంపెనీల్లో లక్షమందికి పైగా ఉద్యోగుల తొలగింపు...తాజాగా మెటాలో
ఫేస్బుక్ మాతృసంస్థ మెటా గత ఏడాది నవంబరులో 13శాతంతో 11,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. తాజాగా మరికొంత మందిని తొలగించే యోచనలో ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. గత కొన్ని వారాలుగా విభాగాలకు కేటాయించే బడ్జెట్తో పాటు, హెడ్ కౌంట్ విషయంలో అస్పష్టత నెలకొందంటూ మెటాకు చెందిన ఇద్దరు ఉద్యోగులు చెప్పినట్లు తెలిపింది. ఇదే అంశంపై మెటా ఇప్పటి వరకు స్పందించలేదు. కొద్దిరోజుల క్రితం మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ టీం లీడర్లు, డైరెక్టర్లను తీవ్రంగా హెచ్చరికలు జారీ చేసినట్లు బ్లూమ్బర్గ్ నివేదించింది. ఈ ఏడాదిని సమర్ధత కనబరిచే సంవత్సరంగా (year of efficiency) అభివర్ణించిన జుకర్ బర్గ్... పైన పేర్కొన్నట్లుగా ఉన్నత స్థాయి ఉద్యోగులు వర్క్ విషయంలో వ్యక్తి గతంగా శ్రద్ద వహించాలని లేదంటే సంస్థను వదిలి వెళ్లిపోవచ్చని అన్నారు. దీంతో పాటు పనితీరు తక్కువగా ఉన్న ప్రాజెక్టులను షట్డౌన్ చేయడంతో పాటు ఆ ప్రాజెక్ట్లలో లీమ్ లీడర్లుగా విధులు నిర్వహిస్తున్న వారిని తొలగించేందుకు సన్నద్దమైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది గడ్డు కాలమే గత ఏడాది సంస్థలు భారీ ఎత్తున ఉద్యోగులకు పింక్ స్లిప్లు అందించిన విషయం తెలిసింది. ఆ కోతలు ఈ ఏడాదిలో సైతం కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 340 కంపెనీలు లక్షకు పైగా ఉద్యోగుల్ని ఇంటికి పంపినట్లు అంచనా. ఇటీవలే టిక్టాక్ ఇండియా భారత్లోని తమ ఉద్యోగులందరినీ తొలగించింది. యాహూ 1,600 మందిని, డెల్ 6,500 మందిని ఇంటికి సాగనంపాయి. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు కలిపి దాదాపు రూ.50,000 మందిని తొలగించాయి. -
మేనేజర్లు అయితే ఏంటీ.. పనిచేయకపోతే రాజీనామా చేయండి: జుకర్బర్గ్
మెటా కంపెనీ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ రానున్న రోజుల్లో మరికొంత మంది ఉద్యోగులను తొలగించేలా ఉన్నారు. తాజాగా ఆయన కంపెనీలోని మేనేజర్లు, డైరెక్టర్లకు ఇచ్చిన వార్నింగ్ చూస్తే లేఆఫ్స్పై హింట్ ఇచ్చినట్టుగా అనిపిస్తోంది. గతేడాది నవంబర్లో ట్విటర్ సగం మంది ఉద్యోగులను తొలగించిన కొన్ని రోజులకే జుకర్బర్గ్ కూడా మెటా సంస్థలో 11 వేల ఉద్యోగాలను పీకేశారు. జుకర్బర్గ్ తాజా హెచ్చరికలతో ఉద్యోగుల్లో మళ్లీ లేఆఫ్ భయాలు నెలకొన్నాయి. గత వారం కంపెనీలో జరిగన అంతర్గత సమావేశంలో సీఈఓ జుకర్బర్గ్.. మేనేజర్లు, డైరెక్టర్ల స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులకు పలు హెచ్చరికలు చేశారు. ఈ ఏడాది మరింత ఎఫీషియెన్సీ కనబర్చాలన్నారు. కేవలం సిబ్బందితో పనిచేయించడమే కాదు.. పనిలో వ్యక్తిగత పాత్ర కూడా ఉండాలని, లేకుంటే రాజీనామా చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. లేఆఫ్స్ ప్రారంభ దశలో జుకర్బర్గ్ మరింత ఎఫీషియన్సీ దిశగా పనిచేయనున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం.. రానున్న రోజుల్లో మెటా కంపెనీలో సీనియర్ మేనేజర్లు సైతం కింద స్థాయి ఉద్యోగులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కోడింగ్, డిజైనింగ్, రీసెర్చ్ వంటి వాటిపై దృష్టి పెట్టకుండా కేవలం ఇన్చార్జ్లుగా ఉంటామంటే కుదరదు. ఉద్యోగుల పనితీరుపై కంపెనీలో నిరంతర సమీక్షలు కొనసాగుతున్నాయి. పనితీరు బాగా లేని ఉద్యోగులపై లేఆఫ్స్ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. (ఇదీ చదవండి: Zoom layoffs: అరగంటలో 1300 ఉద్యోగాలు ఊస్టింగ్.. భారీగా జీతం వదులుకున్న సీఈఓ!) -
ఉద్యోగాల ఊచకోత తరువాత ‘మెటా’ మరో షాకింగ్ డెసిషన్
న్యూఢిల్లీ: వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మార్క్ జుకర్బర్గ్ నేతృత్వంలోని మెటా ఫుల్ టైం ఉద్యోగ ఆఫర్లను వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వేల ఉద్యోగులను తొలగించిన సంస్థ చరిత్రలో ఇలాంటి నిర్ణయం తీసు కోవడం ఇదే తొలిసారని పలువురు వ్యాఖ్యానించారు. నియామక అవసరాలను తిరిగి అంచనా వేయడం కొనసాగిస్తున్నాం. చాలా స్వల్ప సంఖ్యలో అభ్యర్థుల ఆఫర్లను ఉపసంహరించుకుంటూ కష్టమైన నిర్ణయం తీసుకున్నామన్న మెటా ప్రతినిధి వ్యాఖ్యలను టెక్ క్రంచ్ నివేదించింది. మెటా ఇటీవల 20 మంది ఆఫర్లను రద్దు చేసిందని ఇంజనీర్ ,రచయిత గెర్గెలీ ఒరోస్జ్ ట్వీట్ చేశారు. ప్రపంచ మాంద్యం భయాలు నేపథ్యంలో మెటా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 2022 నవంబరులో ప్రపంచవ్యాప్తంగా 11,000 మంది ఉద్యోగులను ఫేస్బుక్ తొలగించడం టెక్ వర్గాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గతంలో తన లండన్ కార్యాలయంలో 2023 వేసవి ఇంటర్న్షిప్ ఆఫర్లను రద్దు చేసింది Just in: Meta has rescinded fulltime offers in London, as I confirmed with devs impacted. New grads with offers due to start in February have been taken back in bulk. I know of about 20 people so far. This is the first time I'm aware that Meta is taking back signed, FTE offers. — Gergely Orosz (@GergelyOrosz) January 9, 2023 -
ఇన్ఫ్లుయెన్సర్లకు భారీ షాక్, మెటా మరో సంచలన నిర్ణయం!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్ఫ్లుయెన్సర్ల కోసం 2020లో ఈ లైవ్ స్ట్రీమింగ్ యాప్ను తీసుకొచ్చింది. ఇప్పుడు అదే యాప్ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆపేస్తున్నట్టు మెటా వెల్లడించింది. దాంతో ఫిబ్రవరి 15 నుంచి సూపర్ యాప్ నిలిచిపోనుంది. దాంతో యూజర్లు కొత్త పోస్టులను క్రియేట్ చేయలేరు. లైవ్ స్ట్రీమింగ్ యాప్ను షట్డౌన్ చేయనున్న మెటా ఇప్పటికే పలు రకాల ప్రొడక్ట్లు, ప్రాజెక్ట్లను నిలిపివేసింది. ఈ వారం మొదట్లో 10 ఏళ్ల నాటి కనెక్టవిటీ డివిజన్ను షట్డౌన్ చేయనుంది. డెన్మార్క్లోని ఒడెన్సే సిటీలో రెండు కొత్త డేటా సెంటర్ల నిర్మాణాన్ని ఆపేసింది. 344 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ను రద్దు చేసుకుంది. 2023లో బుల్లెటిన్ అనే న్యూస్ లెటర్ ప్రొడక్ట్ను రద్దు చేస్తున్నట్లు అక్టోబర్ నెలలో ప్రకటించింది. ఆగష్టులో క్వెస్ట్ 1 వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ తయారీని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. డేటా సెంటర్ల బదులు ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ చేయలనుకున్నట్టు మెటా తెలిపింది. -
వాట్సాప్ అవతార్ వచ్చేసింది..మీరూ కస్టమైజ్ చేసుకోండి ఇలా!
న్యూఢిల్లీ: మెటా-యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ మరోకొత్త ఫీచర్ను బుధవారం లాంచ్ చేసింది. యూజర్లు తమ ప్రొఫైల్ను డిజిటల్ వెర్షన్లో రూపొందించుకునే ఈ ఫీచర్ అనుమతినిస్తుంది. నచ్చిన రీతిలో విభిన్న హెయిర్ స్టైల్స్, ఫేషియల్ ఫీచర్స్ను క్రియేట్ చేసుకోవచ్చు. రకరకాల ఫీలింగ్స్, మీ మూడ్కనుగుణంగా 36 అనుకూల స్టిక్కర్లతో మీ ఓన్ అవతార్ను ఎంచుకోవచ్చు. అవతార్ ఫీచర్ను వినియోగదారులందరికీ రోల్ అవుట్ చేస్తున్నట్లు వాట్సాప్ తాజాగా ప్రకటించింది. 36 స్టిక్కర్లలో అవతార్ను ప్రొఫైల్ చిత్రంగా, చాట్లలో స్టిక్కర్గా ఉపయోగించవచ్చు. అన్ని యాప్లలో మరిన్ని స్టైల్లు త్వరలో రానున్నాయి అంటూ ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ పోస్ట్లో రాశారు. అవతార్ ఎలా క్రియేట్ చేసుకోవాలి WhatsApp ఖాతాను ఓపెన్ చేసి, సెట్టింగ్లకు వెళ్లండి అవతార్ ఆప్షన్ క్లిక్ చేయండి.(సెట్టింగ్స్లో అకౌంట్ ఆప్షన్ కింద అవతార్ ఫీచర్ అప్డేట్ అయిన తరువాత మాత్రమే అవతార్ ఆప్షన్ కనిపిస్తుంది.) మీ అవతార్ను మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకొని ప్రొఫైల్ చిత్రంగా సెట్ చేసుకోవడమే...సింపుల్ -
'సారీ..అంత ఇచ్చుకోలేం!', మెటా ఉద్యోగులకు మరో భారీ షాక్?
సంస్థ ప్రారంభించిన నాటి నుంచి ఎన్నడూ జరగనంత స్థాయిలో మెటా 11 వేల మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసింది. ఖర్చులు తగ్గించుకునేందుకు వేరే దారి లేదంటూ మార్క్ జుకర్ బర్గ్ ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్స్ పెట్టారు. తప్పులేదు. అంతవరకు బాగానే ఉన్న. జుకర్ బర్గ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీ విషయంలో వెనక్కి తగ్గినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగుల్ని ఫైర్ చేస్తూ.. సదరు సిబ్బందికి సెవరన్సు పే (Severance Pay) అందిస్తామని చెప్పారు. సెవరన్సు పే అంటే? సంస్థ అకస్మాత్తుగా ఓ ఉద్యోగిని విధుల నుంచి తొలగించినప్పుడు..రానున్న రోజుల్లో ఉద్యోగి, అతని కుటుంబానికి ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా సంస్థలు కొంత మొత్తాన్ని చెల్లిస్తాయి. ఉద్యోగులకు అందించే బెన్ఫిట్స్ విషయంలో వెనక్కి తగ్గినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. సంస్థ 11వేల మందికి పింక్ స్లిప్ జారీ చేసే సమయంలో మెటాలో ఉపాధి కోల్పోయిన ఉద్యోగులకు 16 వారాల బేస్ సెరారెన్స్ పేతో పాటు ప్రతి సంవత్సరం సర్వీస్కు రెండు అదనపు వారాల వేతనాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. దీంతో పాటు ఉద్యోగులకు, వారి కుటుంబాలకు 6 నెలల పాటు హెల్త్ ఇన్స్యూరెన్స్ అలవెన్స్లు వర్తిస్తాయని తెలిపింది. అయితే తాజాగా మెటా కేవలం 8 వారాల బేస్ పే, మూడు నెలల ఇన్సూరెన్స్ మాత్రమే ఇస్తుందని ఉద్యోగులు చెబుతున్నారు. తాము కాంట్రాక్ట్ ఉద్యోగులం కాదని, అయినా తమ పట్ల యాజమాన్యం ఇలా ఎందుకు కఠినంగా వ్యవహరిస్తుందో అర్ధం కావడం లేదని వాపోతున్నారు. ఫైర్ చేసిన ఉద్యోగుల్లో కొంతమందికి మాత్రమే జుకర్ బర్గ్ హామీ ఇచ్చినట్లు బెన్ఫిట్స్ అందిస్తున్నారని, మిగిలిన ఉద్యోగుల విషయంలో వ్యత్యాసం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఉద్యోగం కోల్పోయి తక్కువ సెవరన్సు పే పొందిన ఉద్యోగుల గురించి సమాచారం కావాలని మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఇతర ఎగ్జిక్యూటీవ్లకు లేఖ పంపారని, సమస్యను పరిష్కరించాలని కోరినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. చదవండి👉 ఉద్యోగులకు ఊహించని షాక్!..ట్విటర్,మెటా బాటలో మరో దిగ్గజ సంస్థ! -
మెటా పాలసీ హెడ్ రాజీవ్ అగర్వాల్ రిజైన్..శాంసంగ్లో చేరిక!
మాజీ మెటా ఇండియా పాలసీ హెడ్ రాజీవ్ అగర్వాల్ సౌత్ కొరియన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్లో చేరినట్లు బ్లూమ్ బర్గ్ తెలిపింది. వారం రోజుల క్రితం ఖర్చు తగ్గించుకునేందుకు మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ 11,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగుల్ని తొలగించారు. ఆ తొలగింపుల తర్వాత మెటా సంస్థలో పలు కీలక పరిణామాలు చేటు చేసుకుంటున్నాయి. వివిధ దేశాలకు చెందిన మెటా కంట్రీ హెడ్లు పదవులకు రాజీనామా చేస్తున్నట్లు సమాచారం. రాజీనామా చేసిన వారిలో భారత్కు చెందిన పాలసీ హెడ్ రాజీవ్ అగర్వాల్ ఒకరు. మంగళవారం మెటా ఇండియా పాలసీ హెడ్ రాజీవ్ అగర్వాల్, వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్లు తమ పదవులకు రాజీనామా చేసినట్లు ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా అధికారికంగా ప్రకటించింది. ఆ మరుసటి రోజు అంటే ఇవాళ శాంసంగ్లో చేరినట్లు తెలుస్తోంది. డిసెంబర్ నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనుండగా..రాజీవ్ అగర్వాల్ శాంసంగ్లో సైతం పాలసీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించనున్నారు. కాగా, రాజీవ్ అగర్వాల్ గతంలో ఉబెర్ టెక్నాలజీస్లో దక్షిణాసియా పాలసీ హెడ్గా పనిచేశారు. ఉబెర్కు రాజీనామా చేసి మెటాలో చేరారు. మరో సంస్థలో అవకాశం కోసమే రాజీవ్ అగర్వాల్, అజిత్ మోహన్ ఇద్దరు తమ పదవులకు ఎందుకు రాజీనామా చేశారో మెటా తెలిపింది. మెటా ఇండియా హెడ్ అజిత్ మోహన్ తమ కాంపిటీటర్లో చేరేందుకు తన పదవికి రిజైన్ చేశారని మెటా పేర్కొంది. ఇక అజిత్ మోహన్ మరో సంస్థ అవకాశం కోసమే అజిత్ మెటా నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారంటూ’ మెటా గ్లోబల్ బిజినెస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ నికోలా మెండెల్సన్ ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి👉 : మెటా ఉద్యోగులకు ఊహించని షాక్, మార్క్ జూకర్ బర్గ్ సంచలన ప్రకటన! -
‘వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ రాజీనామా’..చేశారా!..తొలగించారా!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటాకు భారీ షాక్ తగిలింది. వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ తన పదవికి రాజీనామా చేశారు. వాట్సాప్లో యూపీఐ పేమెంట్స్తో పాటు, ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ను దేశ ప్రజలందరికి చేరువ చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన బోస్ ఉన్న పళంగా రిజైన్ చేయడం చర్చాంశనీయంగా మారింది. మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ వారం రోజుల క్రితం తమ సంస్థలో పని చేస్తున్న వారిలో దాదాపు 13 శాతం అంటే 11,000 మందికి పైగా ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. తొలగింపు నిర్ణయం తీసుకున్న వారం రోజుల తర్వాత వాట్సాప్ ఇండియాకు అభిజిత్ బోస్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.అయితే ఆయన రాజీనామా చేశారా? లేదా జుకర్ బర్గ్ తొలగించిన వారిలో ఈయన కూడా ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది. . కాగా, అభిజిత్ రిజైన్ను వాట్సాప్ గ్లోబల్ హెడ్ విల్ కాథ్ కార్ట్ ధృవీకరించారు. ‘వాట్సాప్ ఇండియా మొదటి హెడ్గా ఎనలేని సేవలు అందించిన అభిజిత్కు ధన్యవాదాలు. వాట్సాప్లో కొత్త సేవలు ప్రారంభించడానికి, వాట్సాప్ వ్యాపారం పెరగడానికి అతని ఎంట్రప్రెన్యూర్ స్కిల్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయి’ అని తెలిపారు. -
‘ఆ మెయిల్కు నా గుండె బరువెక్కింది’..మెటా మహిళా ఉద్యోగి ఆవేదన
ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా తాజాగా 11వేల మంది ఉద్యోగుల్ని తొలగించింది. వారిలో కమ్యూనికేషన్స్ మేనేజర్ అన్నేకా పటేల్ ఉన్నారు. తెల్లారి నిద్ర లేచిన నాకు మెటా పంపిన మెయిల్తో నా గుండె పగిలిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మెటాలో తొలగించిన ఉద్యోగుల్లో ప్రసూతి సెలవులో ఉన్న అన్నేకా పటేల్ ఒకరు. ఆమె తన మూడు నెలల కుమార్తెకు పాలుపట్టేందుకు తెల్లవారు జామున 3 గంటలకు మేల్కొంది. ‘ఉదయం 5:35 గంటలకు నన్ను ఉద్యోగం తొలగించినట్లు నాకు ఇమెయిల్ వచ్చింది. నా గుండె బరువెక్కింది’ అని అన్నేకా పటేల్ లింక్డ్ఇన్ పోస్ట్లో తెలిపారు. కంపెనీ గణనీయంగా ఉద్యోగాల తొలగింపు ఉంటుందని విన్నాను. అందుకే ఈమెయిల్ చెక్ చేసుకున్నట్లు ఆమె చెప్పారు. చదవండి👉 : మెటా ఉద్యోగులకు ఊహించని షాక్, మార్క్ జూకర్ బర్గ్ సంచలన ప్రకటన! నెక్ట్స్ ఏంటీ మెటాలో ఉద్యోగం పోయింది. మరి వాట్ నెక్ట్స్ ఏంటీ? అంటే దానికి సమాధానం చెప్పడం చాలా కష్టం. నా ప్రసూతి సెలవు ఫిబ్రవరిలో ముగుస్తుంది. మాతృత్వం మొదటి కొన్ని నెలలు నా జీవితం చాలా సవాళ్లతో కూడుకున్నప్పటకీ వాటి గురించి స్పందించలేనన్నారు. చదవండి👉 : 'టీ కప్పులో తుఫాను' కాదు..ఫేస్ బుక్ను ముంచే విధ్వంసం -
మెటాలో వేల మందికి ఉద్వాసన: హెచ్1బీ వీసా హోల్డర్లలో కలవరం
న్యూఢిల్లీ: టెక్నాలజీ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. టెక్ పరిశ్రమకు సవాళ్లు పెరుగుతుండటం, ఆదాయాలు పడిపోతుండటం వంటి పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ మాతృసంస్థ మెటా 11,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. మెటా మొత్తం సిబ్బంది సంఖ్యలో ఇది 13 శాతం. ఉద్యోగులకు రాసిన లేఖలో సంస్థ సీఈవో మార్క్ జుకర్బర్గ్ ఈ విషయాలు వెల్లడించారు. ‘కోవిడ్ మహమ్మారి తర్వాత కూడా భారీ వృద్ధి ఉంటుందనే అంచనాతో పెద్ద యెత్తున ఉద్యోగులను తీసుకున్నాం. దురదృష్టవశాత్తు నేను ఊహించిన విధంగా జరగలేదు. (రూ.2 వేల నోట్లు: షాకింగ్ ఆర్టీఐ రిప్లై) ఆన్లైన్ కామర్స్ మళ్లీ పాత స్థాయికి వచ్చేసింది. స్థూల ఆర్థిక మందగమనం, పెరిగిన పోటీ, ప్రకటనలు తగ్గడం వంటి కారణాలతో ఆదాయాలు నేను ఊహించిన దానికన్నా తగ్గాయి. నేను పరిస్థితిని తప్పుగా అంచనా వేశాను. దీనికి బాధ్యుణ్ని నేనే‘ అని ఆయన పేర్కొన్నారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో కూడా కోతల పర్వం నడుస్తున్న నేపథ్యంలో మెటాలోనూ ఉద్వాసనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ మొదలైనవి మెటాలో భాగంగా ఉన్నాయి. తీసివేస్తున్న ఉద్యోగులకు ఈమెయిల్స్ వస్తాయని, వారికి కంపెనీ సిస్టమ్స్ ఇక అందుబాటులో ఉండవని జుకర్బర్గ్ తెలిపారు. మాజీ ఉద్యోగులకు 16 వారాల బేసిక్ పేతో పాటు కంపెనీలో పని చేసిన ప్రతి ఏడాదికిగాను 2 వారాల జీతం లభిస్తుంది. 6 నెలల పాటు వారితో పాటు వారి కుటుంబ సభ్యులకూ హెల్త్ ఇన్సూరెన్స్ పని చేస్తుంది. ఇదీ చదవండి: క్యూ కడుతున్న టాప్ కంపెనీలు: అయ్యయ్యో ఎలాన్ మస్క్! టెక్ సంస్థలకు సవాళ్లు.. కోవిడ్ సమయంలో లాక్డౌన్ల వల్ల ఇళ్లకే పరిమితం కావడంతో ప్రజలు సోషల్ మీడియాను గణనీయంగా ఉపయోగించారు. దీంతో ఆయా కంపెనీలకూ భారీగా ఆదాయాలు వచ్చాయి. అయితే, లాక్డౌన్లు ముగిసి, ప్రజలు తిరిగి దైనందిన జీవితాల్లో పడిపోయిన తర్వాత వాటి ఆదాయాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రత్యేకంగా మెటా విషయానికొస్తే.. డిజిటల్ యూనివర్స్ ’మెటావర్స్’ పై భారీగా పెట్టుబడులు పెడుతుండటం ఇన్వెస్టర్లను కలవరపరుస్తోంది. అటు టెక్ దిగ్గజం యాపిల్ ప్రైవసీ టూల్స్ సైతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు సమస్యగా మారుతున్నాయి. వీటి వల్ల యూజర్ల అనుమతి లేకుండా వారిని ట్రాక్ చేయడం, ప్రత్యేకంగా టార్గెట్ చేసే ప్రకటనలు చూపడం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్ లాంటి సంస్థలకు కష్టతరమవుతోంది. అలాగే యువత ఎక్కువగా టిక్టాక్ వైపు మళ్లుతుండటం ఇన్స్టాగ్రామ్పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. భారత్లోని ఉద్యోగుల్లో కలవరం.. ఏయే దేశాల్లో ఏ మేరకు కోతలు ఉంటాయనేది తెలియకపోవడంతో భారత్లోని మెటా ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, వాట్సాప్లకు సంబంధించి మెటాకు భారత్లో 300–400 మంది ఉద్యోగులు ఉన్నారు. వీటిలో 60 మంది సిబ్బంది గల వాట్సాప్ బృందమే చిన్నది. మెటా ఇండియా హెడ్ అజిత్ మోహన్ ఇటీవలే రాజీనామా చేసి పోటీ సంస్థ స్నాప్లో చేరారు. హెచ్1బీ వీసా హోల్డర్లకు సహకారం ఉద్వాసనకు గురైన వారిలో హెచ్1బీ వీసాహోల్డర్లు ఉంటే ఇమ్మిగ్రేషన్ పరంగా వారికి అవసరమైన పూర్తి సహాయ, సహకారాలను కంపెనీ అందిస్తుందని జుకర్బర్గ్ తెలిపారు. తమ దేశంలో పని చేసేందుకు విదేశీయులకు అమెరికా ఈ వీసాలు జారీ చేస్తుంది. అకస్మాత్తుగా ఉద్యోగం పోతే, తమ వీసాను స్పాన్సర్ చేసే మరో కంపెనీలో ఉద్యోగాన్ని 60 రోజుల్లోగా చూసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే వీసా గడువు ముగిసిపోతుంది. పలు అమెరికన్ కంపెనీల్లో భారత్, చైనా నుంచి చాలా మటుకు ఉద్యోగులు ఉన్నారు. ప్రధానంగా ఫేస్బుక్లో వీరి సంఖ్య 15శాతం పైనే. ఉద్యోగాల్లో కోతల వల్ల ఇలాంటి హెచ్1బీ వీసాహోల్డర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. -
అసలేం జరుగుతోంది, ఊడిపోతున్న ఉద్యోగాలు.. ప్రముఖ కంపెనీలో 11వేల మందిపై వేటు!
ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ బుధవారం కంపెనీలో జరుగుతున్న ఉద్యోగుల తొలగింపులపై తాజాగా స్పందించారు. తమ కంపెనీలో పని చేస్తున్న వారిలో దాదాపు 13 శాతం ( 11,000 మందికి) పైగా ఉద్యోగులపై వేటు వేయాలని కంపెనీ నిర్ణయించినట్లు ఈ సందర్భంగా జుకర్బర్గ్ తెలిపారు. ఫేస్బుక్ సీఈఓ ఉద్యోగులకు రాసిన లేఖలో.. “ఈ రోజు నేను మెటా చరిత్రలో చేసిన కొన్ని కష్టతరమైన మార్పులను షేర్ చేస్తున్నాను. నేను మా బృందం పరిమాణాన్ని సుమారు 13% తగ్గించాలని నిర్ణయించుకున్నాను. మా ప్రతిభావంతులైన ఉద్యోగులలో 11,000 కంటే ఎక్కువ మందిని తొలగిస్తున్నాం. ఇది నాకు ఎంతో బాధను కలిగిస్తోందని లేఖలో పేర్కొన్నారు జుకర్బర్గ్. ఉద్యోగాలు కోల్పోయే సిబ్బందికి కనీసం నాలుగు నెలల జీతాన్ని అందించనున్నట్లు సంస్థ హెచ్ఆర్ విభాగం అధిపతి లోరీ గోలెర్ తెలిపారు. ఇక ఈ ఉద్యోగాల తొలగింపు కంపెనీ 18 సంవత్సరాల చరిత్రలో భారీగా తొలగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం అకస్మాత్తుగా ఉద్యోగుల తొలగింపుకు ప్రధాన కారణాలు..కంపెనీ ఖర్చను భారీగా తగ్గించుకోవడం, ఆర్ధిక మాంద్యం కారణంగా సంస్థలు అడ్వటైజ్మెంట్లకు కోసం పెట్టే ఖర్చును తగ్గించుకోవడం, కంపెనీని ఇటీవల వరుసగా చుట్టుముడుతున్న వివాదాల కారణంగా సంస్థపై నియంత్రణ వంటి అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆ బ్యాంక్ కస్టమర్లకు ఒకేసారి రెండు శుభవార్తలు! -
మెటా ఉద్యోగులకు ఊహించని షాక్, మార్క్ జూకర్ బర్గ్ సంచలన ప్రకటన
మెటా ఉద్యోగులకు ఊహించని షాక్ తగలనుంది. ఆ సంస్థ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ సంచలన ప్రకటన చేశారు. బుధవారం ఉదయం నుంచి కంపెనీ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ధృవీకరించారు. ఈ సందర్భంగా కంపెనీ తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు ఉద్యోగుల్ని తొలగించాల్సి వస్తుందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని మెటా ఖండించింది. 87,000 కంటే ఎక్కువ మంది విధుల నిర్వహిస్తున్న మెటాలో భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించే అవకాశం ఉందని వాల్స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. అయితే తాజా సమావేశంలో ఉద్యోగుల్ని ఇంటికి పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని జూకర్ బర్గ్ చెప్పారు. కానీ ఎంత మందికి పింక్ స్లిప్ ఇచ్చే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. ఇక వేటు వేసే ఉద్యోగుల్లో రిక్రూటింగ్, బిజినెస్ టీం గ్రూప్ సభ్యులున్నారని సమాచారం. ఉద్యోగాలు కోల్పోయే సిబ్బందికి కనీసం నాలుగు నెలల జీతాన్ని అందించనున్నట్లు సంస్థ హెచ్ఆర్ విభాగం అధిపతి లోరీ గోలెర్ తెలిపారు. ఇక ఈ ఉద్యోగాల తొలగింపు కంపెనీ 18 సంవత్సరాల చరిత్రలో భారీగా తొలగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కారణాలివేనా ఉద్యోగుల తొలగింపుకు అనేక కారణాలున్నాయి. వాటిలో ప్రధానంగా ఆర్ధిక మాంద్యం కారణంగా సంస్థలు అడ్వటైజ్మెంట్లకు కోసం పెట్టే ఖర్చును తగ్గించుకోవడం, టిక్టాక్ నుండి పోటీ, యాపిల్ ప్రైవసీ పాలసీలో మార్పులు చేయడం, వరుసగా చుట్టుముడుతున్న వివాదాల కారణంగా సంస్థపై నియంత్రణ వంటి అంశాలు మెటాలో ఉద్యోగుల్ని తొలగింపు కారణమైంది. చదవండి👉 : 'టీ కప్పులో తుఫాను' కాదు..ఫేస్ బుక్ను ముంచే విధ్వంసం -
మెటా ఊహించని షాక్, భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగించనున్న జూకర్బర్గ్!
ట్విటర్ తర్వాత మెటా సైతం భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగించనుంది. మరికొన్ని వారాల్లో మెటాలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులపై సీఈవో మార్క్ జూకర్బర్గ్ వేటు వేయనున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో తెలిపింది. ఇదే అంశంపై మెటా యాజమాన్యం బుధవారం తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. ప్రకటన ఖర్చులపై పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రభావం పెట్టుబడిదారుల్లో భయాందోళనకు దారితీసింది. దీనికి తోడు టిక్టాక్ నుండి పోటీ,యాపిల్ ప్రైవసీ పాలసీలో మార్పులు చేయడం, మెటావర్స్పై భారీ ఎత్తున ఖర్చు చేయడం, సంస్థపై నియంత్రణ వంటి అంశాలు మెటాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాటి ఫలితంగా అక్టోబర్లో నెలలో మెటావర్స్ షేర్లు 25 శాతం పడిపోయాయి. దీంతో మార్క్ జూకర్బర్గ్ సంపద విలువ అక్టోబర్ 27 నాటికి 11 బిలియన్ డాలర్లు తగ్గిపోవడంతో మెటా కంపెనీ షేర్ 36 బిలియన్ డాలర్లకు చేరుకుంది. వచ్చే ఏడాది మెటా స్టాక్ మార్కెట్ విలువ నుండి సుమారు 67 బిలియన్లకు పడిపోనుందని అంచనా వేసింది. దీంతో జూకర్ బర్గ్ ఖర్చుల్ని తగ్గించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ నెలలో మెటా ఫలితాల విడుదల సందర్భంగా మార్క్ జూకర్బర్గ్ మాట్లాడుతూ, మెటావర్స్పై పెట్టిన పెట్టుబడులకు ఫలితాలు వచ్చేందుకు దశాబ్దం పడుతుంది. ఈలోగా హైరింగ్ నిలిపివేయడం,ఖర్చులను తగ్గించేందుకు ఉద్యోగ బృందాల్లో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. 2023లో ఉద్యోగుల సంఖ్యను ఇలాగే ఉంచడం లేదా, తగ్గించడం చేయాల్సి ఉంటుందని అన్నారు. తాజాగా అందుకు ఊతం ఇచ్చేలా మెటా ఉద్యోగుల్ని తొలగిస్తుందంటూ పలు నివేదికలు వెలుగులోకి రావడం చర్చాంశనీయంగా మారింది. చదవండి👉 మార్క్ జుకర్బర్గ్ 'కక్కుర్తి' పని, వందల కోట్లకు ఇల్లు అమ్మకం! -
మెటాకు అజిత్ మోహన్ రాజీనామా
మెటా ఇండియాలో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. మెటా ఇండియా డైరెక్టర్ అజిత్ మోహన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలోకి మెటా ఇండియా డైరెక్టర్గా మనీష్ చోప్రా బాధ్యతలు స్వీకరిస్తారని రాయిటర్స్ తెలిపింది ఇక మెటా ఇండియా డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిన అజిత్ మోహన్ స్నాప్లో చేరనున్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. మోహన్ ఆసియా-పసిఫిక్ బిజినెస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తారంటూ వెలుగులోకి వచ్చిన నివేదికల్ని ఉటంకిస్తూ టెక్క్రంచ్ నివేదించింది. ‘గత 4 ఏళ్లుగా అతను (అజిత్ మోహన్) మన భారతదేశ కార్యకలాపాలను రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు’ అని మెటా గ్లోబల్ బిజినెస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ నికోలా మెండెల్సోన్ తెలిపారు. -
వావ్..వాట్సాప్లో అదిరిపోయే సూపర్ ఫీచర్లు..అవేంటో తెలుసా?
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మార్కెట్లో కాంపిటీటర్లకు గట్టి పోటీ ఇస్తూ యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో అప్లికేషన్ను అప్డేట్ చేస్తూ వస్తోంది. తాజాగా ‘కమ్యూనిటీస్’ అనే ఫీచర్ను వాట్సాప్ సంస్థ వరల్డ్ వైడ్గా ఎనేబుల్ చేసింది. ఇదే విషయాన్ని మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించారు. గతంలో వాట్సాప్ గ్రూప్ల నిర్వహణ కష్టంగా మారడంతో.. మార్క్ జుకర్ బర్గ్ కమ్యూనిటీస్ ఫీచర్పై వర్క్ చేశారు. కొద్ది నెలల క్రితం బీటా వెర్షన్లో విజయ వంతంగా ట్రయల్స్ నిర్వహించి..గురువారం రియల్ టైం యూజర్లు వినియోగించేలా మార్కెట్కు పరిచయం చేశారు. కమ్యూనికేట్ ఫీచర్ వాట్సాప్లో ఫ్యామిలీ, కాలేజీ, ఆఫీస్ ఇలా అనేక గ్రూప్లు ఉండేవి. అయితే ఇప్పుడు ఫ్యామిలీ గ్రూప్లో ఎన్ని గ్రూప్లు ఉంటే అన్నీ గ్రూప్లో ఒకే గ్రూప్ కింద యాడ్ చేసుకోవచ్చు. అలా గ్రూప్లో యాడ్ చేసుకొని.. ఆ గ్రూప్కు ఒక నేమ్ సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్యామిలీలో ఫ్యామిలీ గ్రూప్లు, కాలేజీ గ్రూప్లో కాలేజీ గ్రూప్లు.. ఇలా డివైడ్ అయిపోతాయి. అలా గ్రూపుల్ని డివైజ్ చేయడం వల్ల వాట్సాప్ వినియోగం సులభతరం అవుతుందని మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. ఈ కమ్యూనికేట్ ఫీచర్తో పాటు గ్రూప్ చాట్లో పోల్స్ క్రియేట్ చేయడం, ఒకే సారి 32 మంది సభ్యులకు గ్రూప్ వీడియో కాల్ చేయడం, గ్రూప్ వీడియో కాల్లో పాల్గొనే సభ్యుల సంఖ్యను డబుల్ చేసిపనట్లు వాట్సాప్ ప్రతినిధులు తెలిపారు. గ్రూప్లో సభ్యుల సంఖ్య ఎంతంటే వాట్సాప్ గతంలో గ్రూప్ సభ్యుల సంఖ్య 512 మంది వరకు చేరే సౌకర్యం ఉంది. తాజాగా ఆ సభ్యుల సంఖ్య 1,024కి పెంచింది. తద్వారా వ్యాపార వేత్తలు వారి క్లయింట్లకు పెద్ద సంఖ్యలో మెసేజ్ సెండ్ చేయడంతో పాటు వ్యాపార కార్యకలాపాల్ని మరింత వృద్ధి చేసుకోవచ్చు. గతేడాది 256 మంది సభ్యుల నుంచి 512కి పెంచింది. కాగా వాట్సాప్ కాంపిటీటర్ టెలిగ్రాంలో సుమారు 2లక్షల మంది సభ్యులు చేరవచ్చు. కానీ వాట్సాప్ తరహాలో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ తరహాలో సెక్యూర్ లేదని టెక్ నిపుణులు చెబుతున్నారు. -
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్కు భారీ షాక్
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్కు భారీ షాక్ తగిలింది. బెజోస్ 23 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. కొనసాగుతున్న సెలవులు, షాపింగ్ సీజన్ ఉన్నప్పటికీ అమెజాన్. కామ్ సేల్స్ తగ్గిపోయాయి. ఆ ప్రభావంతో మదుపర్లు అప్రమత్తం కావడంతో ట్రేడింగ్లో షేర్లు క్షీణించడంతో బెజోస్ సంపద కరిగిపోయింది. బ్లూమ్బెర్గ్ వెల్త్ ఇండెక్స్ ప్రకారం...బెజోస్ ఇంత భారీ మొత్తంలో కోల్పోవడంతో..చరిత్రలో క్షీణించిన సంపద జాబితాలో నిలించింది. గురువారం మార్కెట్ ముగిసిన తర్వాత స్టాక్ దాదాపు 21 శాతం పడిపోయింది. పెట్టుబడి దారులు టెక్నాలజీ స్టాక్లలో భారీగా పెట్టుబుడుల పెట్టడంతో ఆ ప్రభావం అమెజాన్పై పడింది. దీంతో గురువారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి అతని సంపద ఈ సంవత్సరం $58 బిలియన్లకు పైగా పడిపోయింది. చదవండి👉 700మందికి చుక్కలు చూపిస్తున్న జోబైడెన్ ..వారిలో ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ కూడా! మెటా అదినేత మార్క్ జూకర్బర్గ్, ఎలాన్ మస్క్, చాంగ్పెంగ్ జావో మాత్రమే ఇంతకుముందు భారీ ఎత్తున నష్టపోయారు. ఇలాగే బెజోస్ తన సంపదను కోల్పోతుంటే పైన పేర్కొన్న జాబితాలో ఒకరిగా నిలవనున్నారు. కాగా, అమెజాన్.కామ్ స్టాక్ 2022లో దాదాపు 33 శాతం పడిపోయాయి. అలాగే, ఆగస్ట్ ఫైలింగ్ ప్రకారం..బెజోస్ అమెజాన్లో దాదాపు 996 మిలియన్ షేర్లను కలిగి ఉన్నారు. చదవండి👉 ‘ఇదే..తగ్గించుకుంటే మంచిది’! -
మార్క్ జుకర్బర్గ్కు ఇన్వెస్టర్ల షాక్: మార్కెట్ వాల్యూ ఢమాల్!
న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా మరోసారి ఫలితాల్లో ఢమాల్ అంది. వరుసగా రెండో త్రైమాసికంలో కూడా ఆదాయ క్షీణత నమోదు చేసింది. మెటావర్స్పై అనాసక్తతకు తోడు ప్రకటనల ఆదాయం క్షీణించడం, ప్రపంచవ్యాప్తంగా టిక్ టాక్ నుంచి ఎదురవుతున్న పోటీ కారణంగా మెటా ఆదాయం పడిపోయింది. సెప్టెంబర్ 30తో ముగిసిన క్యార్టర్-2 ఫలితాల్లో ఆదాయం 4శాతం తగ్గి 27.71 బిలియన్ల డాలర్లకు చేరింది. అంతకుముందు ఇది 29.01 బిలియన్ల డాలర్లుగా ఉంది. మెటావర్స్ ప్రాజెక్ట్పై చేసిన అపారమైన, ప్రయోగాలకు మొత్తం ఖర్చుల్లో ఐదవ వంతు ఖర్చుపెట్టారు మెటా బాస్ మార్క్ జుకర్బర్గ్ . అయితే కంపెనీ ఒక్కోషేరు ఆదాయంలో అంచనాలకు అందుకోలేక చతికిలపడింది. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో ఆర్జించిన3.22 డాలర్లనుంచి 52 శాతం పడిపోయి 1.64 డాలర్లను మాత్రం సాధించింది. అలాగే మెటా రియాలిటీ ల్యాబ్స్ యూనిట్, దాని మెటావర్స్ మూడవ త్రైమాసికంలో 3.67 బిలియన్ డాలర్ల నిర్వహణ నష్టాన్నినమోదు చేసింది. అంతకు ముందు సంవత్సరంతో నష్టంతో పోలిస్తే ఇది అధికం. ఈ ఫలితాల నేపథ్యంలోవాల్ స్ట్రీట్లో మెటా షేరు ఏకంగా 20 శాతం కుప్పకూలింది. 2016 కనిష్ట స్థాయిని తాకింది. ఈ ఏడాదిలో మెటాషేరు 61శాతం క్షీణించడం గమనార్హం. తాజా నష్టంతో 67 బిలియన్ డాలర్ల మార్కెట్ వాల్యూ హరించుకు పోయింది. కాగా మెటా పెట్టుడులపై పెట్టుబడిదారుల ఆందోళన నేపథ్యంలో మెటావర్స్ పేరిట కంపెనీ అనవసర ఆలోచనలు చేస్తోందని మెటా వాటాదారు ఆల్టిమీటర్ క్యాపిటల్ సీఈఓ బ్రాడ్ గెర్స్ట్నర్ ఈ వారం ప్రారంభంలో మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్క్పై లేఖ రాసిన సంగతి తెలిసిందే. -
ఎఫ్బీలో జుకర్బర్గ్కు భారీ షాక్, కష్టాల్లో మెటా
న్యూఢిల్లీ: మెటా సీఈవో, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ పౌండర్ మార్క్ జుకర్ బర్గ్కు భారీ షాక్ తగిలింది. ఆయన సొంత ప్లాట్ఫాంలోనే ఊహించని ఝలక్ తగిలింది. ఒక్కసారిగా 118 లక్షల ఫాలోవర్లను కోల్సోయారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులను ప్రభావితం చేసే బగ్ కారణంగా కొన్ని సెకన్లలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఫేస్బుక్లో జుకర్బర్గ్కు 119 మిలియన్ల (11.9 కోట్ల)మంది ఫాలోవర్లు ఉండగా అకస్మాత్తుగా అది కాస్తా 10వేల కిందికి (9920) పడి పోవడం సంచలనం రేపింది. మరోవైపు జుకర్బర్గ్తో పాటు పలువురు సెలబ్రిటీల పాలోవర్ల సంఖ్య కూడా లక్షల్లో తగ్గిపోవడం కలకలం రేపింది. ముఖ్యంగా ప్రముఖ రచయత్రి తస్లిమా నస్రీన్ ట్వీట్ చేశారు.ఫేస్బుక్ సునామీతో తన ఫాలోవర్లు కూడా ఒక్కమారుగా 9లక్షల నుంచి 9వేలకు పడిపోయారంటూ మీడియా కథనాన్ని షేర్ చేశారు. అంతేకాదు తనకు ఫేస్బుక్ కామెడీ అంటే చాలా ఇష్టం అంటూ ఆమె ట్వీట్ చేయడం విశేషం. తర్వాత కొన్ని గంటల్లో ఈ లోపాన్ని కంపెనీ సరిచేయడంతో యథాతథంగా ఆయా సెలబ్రిటీల ఫాలోవర్లు కనిపించారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో లోపాన్ని త్వరగా గుర్తించి మెటా పరిస్థితిని సరిదిద్దే పనిలో ఉన్నామని, సాంకేతికత లోపాలే కారణమని మెటా తెలిపింది. అసౌకర్యానికి క్షమాపణలు తెలిపింది. అయితే, పొరపాటు ఎలా జరిగిందనే దానిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కాగా మెటా వర్స్ సక్సెస్లో ఇబ్బందులు పడుతున్న మోటాకు తాజాగా ఫాలోవర్ల కౌంట్ తగ్గిపోవడంతో మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇది ఇలా ఉంటే ఉక్రెయిన్లో రష్యన్ మిలిటరీకి వ్యతిరేకంగా హింసకు పిలుపునిచ్చే పోస్ట్లను మెటా అనుమతిస్తోందని రష్యా ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ను ఉగ్రవాదులు, తీవ్రవాదుల జాబితాలో చేరుస్తూ ఆర్థిక పర్యవేక్షణ ఏజెన్సీ రోస్ఫిన్మోనిటరింగ్ ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, లింక్డ్ఇన్ సీఈవొ ర్యాన్ రోస్లాన్స్కీతో సహా అనేక మంది అమెరికన్ పౌరులపై క్రెమ్లిన్ విధించిన ఆంక్షలలో భాగంగా జుకర్బర్గ్ రష్యాలోకి ప్రవేశించకుండా నిషేధం ఇప్పటికే అమల్లో ఉంది. .@facebook created a tsunami that wiped away my almost 900,000 followers and left only 9000 something on the shore: @taslimanasreen. Several users of @Meta's #facebook are complaining losing majority of their #followers. read more here. #MarkZuckerberghttps://t.co/QbxBSgMvId — The Telegraph (@ttindia) October 12, 2022 -
ఫేస్బుక్లో అన్ఫాలో కలకలం
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో బుధవారం ఉదయం నుంచి కొన్ని గంటల సేపు గందరగోళం నెలకొంది. ఫేస్బుక్ వినియోగదారుల ఫాలోవర్ల సంఖ్య రాత్రికి రాత్రి అమాంతంగా పడిపోవడంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అనూహ్యంగా భారీ సంఖ్యలో తమ ఫాలోవర్ల సంఖ్య తగ్గిపోతున్నట్టు చాలా మంది వినియోగదారులు ఆందోళన చెందారు. దీనికి కారణాలు తెలీక గగ్గోలు పెట్టారు. చివరికి మెటా కంపెనీ వ్యవస్థపాకుడు మార్క్ జుకర్బర్గ్కు తిప్పలు తప్పలేదు. జుకర్బర్గ్కు 11.9 కోట్ల మంది ఫాలోవర్లు ఉంటే ఏకంగా 10 వేలకు పడిపోవడంతో కలకలం నెలకొంది. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, యూఎస్ఏ టుడే వంటి అమెరికన్ మీడియా ఖాతాల ఫాలోవర్ల సంఖ్య పడిపోయింది. రచయిత్రి తస్లీమా నస్రీన్ ఫాలోవర్ల సంఖ్యపై ఆందోళన చెందుతూ ట్వీట్ చేశారు. ‘ఫేస్బుక్ సృష్టించిన సునామీతో తొమ్మిది లక్షల మంది ఉన్న నా ఫాలోవర్ల సంఖ్య కేవలం 9,000కు పడిపోయింది. జుకర్బర్గ్ ఫాలోవర్లు తగ్గిపోవడం మరీ విడ్డూరం’ అని ఆమె ట్వీట్ చేశారు. ఎందరో ప్రముఖుల ఫాలోవర్ల సంఖ్య పడిపోవడంతో ఫేస్బుక్ ప్రతినిధులు వినియోగదారులకు క్షమాపణలు చెప్పారు. సాయంత్రానికి అందరి ఖాతాల ఫాలోవర్లు సాధారణ స్థితికి చేరుకోవడంతో నెటిజన్లు ఊపిరిపీల్చుకున్నారు. ఎందుకిలా జరిగింది ? ఫేస్బుక్లో ఫాలోవర్ల సంఖ్య పడిపోవడానికి మెటా సంస్థ ఎలాంటి వివరణ ఇవ్వనప్పటికీ రకరకాల విశ్లేషణలు చేస్తూ నెటిజన్లు పలు పోస్ట్లు పెట్టారు. ఫేస్బుక్లో బాట్ అకౌంట్ల ప్రక్షాళనకు దిగడమే దీనికి కారణమని భావిస్తున్నారు. ఈ బాట్ అకౌంట్ల సాయంతో ఆటోమేటిక్గా మెసేజ్లు పంపడం, ఫాలోవర్ల సంఖ్యను పెంచుకోవడం వంటివి చేయొచ్చు. వీటిని తొలగించే క్రమంలో సాంకేతిక లోపాలు తలెత్తి భారీ గందరగోళానికి దారి తీసిందని కొందరు అభిప్రాయపడ్డారు. ఫేస్బుక్లో కొత్త ఆల్గారథిమ్ ప్రయోగించడంతో ఇలా జరిగిందనే అనుమానాలు కొందరు వ్యక్తంచేశారు. -
ఫేస్బుక్ సంచలన నిర్ణయం: 12వేల మంది ఉద్యోగులు ఇంటికి!
ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చేందుకు ఫేస్బుక్ సిద్ధమైంది. కంపెనీ చరిత్రలో మొదటి సారిగా భారీస్థాయిలో ఉద్యోగులను ఇంటికి సాగనంపనుంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తే.. మార్క్ జుకర్బర్గ్ నేతృత్వంలోని మెటా ఉద్యోగులు గడ్డు పరిస్ధితులు ఎదుర్కొవడం తప్పేలా లేదు. సంస్థలోని వివిధ డిపార్ట్మెంట్ల నుంచి దాదాపు 12,000 మందిని తీసివేయనున్నట్లు సమాచారం. ఇందుకు ప్రధాన కారణంగా.. సరైన సామర్ధ్యం కనబరచని ఉద్యోగులను విధుల నుంచి తొలగించవచ్చని ప్రచారం సాగుతోంది. జుకర్బర్గ్ ఇటీవల మెటా ఎర్నింగ్స్ కాల్లో ఈ అంశంపై తేల్చిచెప్పారు. దీనిపై పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఫేస్బుక్ మే నుంచి ఉద్యోగుల హైరింగ్ ప్రక్రియను నిలపేసిన సంగతి తెలిసిందే. దీని మరింత కాలం పొడిగించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో జుకర్బర్గ్ మాట్లాడుతూ హైరింగ్ నిలిపివేతతో పాటు ఖర్చులు కూడా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆశించిన సామర్ధ్యం ప్రదర్శించని 15 శాతం మంది ఉద్యోగులపై కంపెనీ వేటు తప్పదని నివేదికలు బయటరావడంతో ఫేస్బుక్ టెకీలలో అందోళన మొదలైంది. రాబోయే రోజుల్లో భారీ స్థాయిలో ఉద్యోగుల లేఆఫ్స్ దిశగా ఫేస్బుక్ అడుగులు వేస్తోంది. మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు, మార్కెట్లో మనీ ఫ్లో కఠినతరం కావడం, ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరుగుతుండడం, ఇలాంటి ప్రతికూల పరిణామాలు వల్ల చిన్న కంపెనీలతో పాటు దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్న టెక్ దిగ్గజాల వరకు అన్ని కంపెనీలపై ఈ పరిణామాలు తీవ్రంగా ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు. చదవండి: బ్యాంక్ కస్టమర్లకు వార్నింగ్.. ఆ యాప్లు ఉంటే మీ ఖాతా ఖాళీ,డిలీట్ చేసేయండి! -
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. మీకోసం
ప్రముఖ మెసేంజర్ యాప్ (Whatsapp) వాట్సాప్ అదిరిపోయే ఫీచర్లతో అనతి కాలంలోనే కోట్లాది యూజర్లను సంపాదించుకున్న సంగతి తెలసిందే. ఎప్పటికప్పుడు ఆధునిక టెక్నాలజీతో తమ వినియోగదారులకు సేవలందించడంలో తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతోంది. తాజాగా ఈ యాప్లో మరో కొత్త ఫీచర్ని జతచేస్తోంది. యూజర్లకు బెస్ట్ కాలింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ ఫీచర్ని వాట్సాప్ ప్రవేశపెడుతోంది. వాయిస్ కాలింగ్ కోసం కాల్ లింక్ల ఫీచర్ను విడుదల చేసింది. యూజర్లు కేవలం ఒక ట్యాప్లో వాట్సాప్ వాయిస్ కాల్ చేయవచ్చని తెలిపింది. ఈ ఫీచర్ ఉపయోగించాలంటే, యూజర్లు కాల్స్ ట్యాబ్లో అందుబాటులో ఉన్న ‘కాల్ లింక్లు’ ఆప్షన్ను ఎంచుకోవాలి. ఆ తర్వాత వీడియో లేదా ఆడియో కాల్ లింక్ను క్రియేట్ చేసుకుని వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈజీగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. కాల్ లింక్లను ఉపయోగించేందకు యూజర్లు వారి వాట్సాప్ యాప్ను లేటెస్ట్ వెర్షన్కి అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. వాట్సాప్లో ఈ కాల్ లింక్ల ఫీచర్ను దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. మెటా సీఈఓ (Meta CEO) మార్క్ జుకర్బర్గ్ మాట్లాడుతూ.. 32 మంది వ్యక్తుల కోసం సేఫ్ ఎన్క్రిప్టెడ్ వీడియో కాలింగ్ను పరీక్షిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్తో సహా ఇతర గ్రూప్ వీడియో కాలింగ్ ప్లాట్ఫాంలు సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
సగం సంపద ఆవిరైంది.. గుడ్న్యూస్ చెప్పిన మార్క్ జుకర్బర్గ్!
ఫేస్బుక్ వ్యవస్థాపక సీఈవో మార్క్ జుకర్బర్గ్ భారీగా సంపద కోల్పోయి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవల తన సంపద ఊహించిన స్థాయిలో కరిగిపోవడం, కంపెనీ షేర్లు కూడా పతనం వైపు పరుగులు పెట్టడం వంటి ఘటనలతో విచారంలో ఉన్న తనకి ఓ గుడ్ న్యూస్ పలకరిస్తూ ఊరటనిచ్చింది. జుకర్బర్గ్ మూడోసారి తండ్రి కాబోతున్నాడు. తన భార్య ప్రిస్సిల్లా చాన్ గర్భవతి అయ్యిందని, ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు. అందులో.. “లాట్స్ ఆఫ్ లవ్. వచ్చే ఏడాది మాక్స్, ఆగస్ట్లకు చెల్లెలిని రాబోతోందని ఈ గుడ్ న్యూస్ పంచుకోవడానికి సంతోషంగా ఉందని” పోస్ట్ చేశారు. మార్క్ జుకర్బర్గ్, ప్రిస్సిల్లా చాన్ 2003లో హార్వర్డ్ యూనివర్శిటీ ఫ్రాట్ పార్టీలో కలుసుకున్న తర్వాత డేటింగ్ ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి రిలేషన్లో ఉన్న వీరు 2012లో వివాహం చేసుకున్నారు. ఇటీవలే వారి 10వ వివాహ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు- ఆగస్ట్, మాక్సిమా. మెటా’ అభివృద్ధి, రీబ్రాండింగ్పై దృష్టిపెట్టడంతో జుకర్బర్గ్కు సంపద భారీగా క్షీణించిన సంగతి తెలిసిందే. ఫలితంగా కేవలం 55.9 బిలియన్ డాలర్ల నికర విలువతో ఇటీవల ప్రపంచ బిలియనీర్లలో 20వ స్థానంలో నిలిచారు. ఈ పరిణామాలతో మార్క్ సగం సంపద వరకు కోల్పోయాడు. 2014 నుండి ఆయనకిదే అత్యల్ప స్థానం కావడం గమనార్హం. రెండేళ్ల కిందట మార్క్ సంపద 106 బిలియన్ డాలర్లుగా ఉంది. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) చదవండి: కరోనా ఎఫెక్ట్: ఆ కేటగిరి అద్దె ఇళ్లకు ఫుల్ డిమాండ్.. టూ కాస్ట్లీ గురూ! -
జుకర్ బర్గ్కు భారీ షాక్! 71 బిలియన్ డాలర్లు తుడుచుపెట్టుకుపోయాయ్!
న్యూఢిల్లీ: ‘మెటా’ అభివృద్ధి, రీబ్రాండింగ్పై దృష్టిపెట్టిన ఫేస్బుక్ వ్యవస్థాపక సీఈవో మార్క్ జుకర్బర్గ్కు భారీ షాక్ ఇస్తోంది. మార్క్ సంపద భారీగా తాజాగా మరింత క్షీణించింది. ఫలితంగా కేవలం 55.9 బిలియన్ డాలర్ల నికర విలువతో మార్క్ జుకర్బర్గ్ ప్రపంచ బిలియనీర్లలో 20వ స్థానంలో ఉంది, 2014 నుండి ఇదే అత్యల్ప స్థానం. ఈ సంపద రెండేళ్ల కిందటే 106 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం. మెటా డెవలప్మెంట్ కోసం దాదాపు 71 బిలియన్ డాలర్లను వెచ్చించనున్నారు. ఫలితగా మార్క్ సంపద ఈ మేరకు తుడుచుపెట్టుకుపోయింది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అత్యంత సంపన్నులలో అతని నికర సంపద సగానికి తగ్గిపోయింది. 2014లో ప్రపంచ బిలియనీర్లలో రెండు స్థానంలో ఉన్నారు ఇటీవల కంపెనీ షేర్లు రికార్డు స్థాయిలో 24 శాతం పడిపోయాయి. అంచనాలకు భిన్నంగా మెటా బలహీన ఫలితాల కారణంగా చరిత్రలో అతిపెద్ద పతనాన్ని నమోదు చేసింది. అలా ఒక్క రోజులోనే మార్క్ సంపద 31 బిలియప్ డాలర్లకు పడిపోయింది. సెప్టెంబర్, 2021లో కంపెనీ షేర్లు 382 డాలర్ల వద్ద జుకర్ బర్గ్ అతని సంపద గరిష్టంగా 142 బిలియన్ డాలర్లగా ఉన్న సంగతి తెలిసిందే. మెటావర్స్లో కంపెనీ పెట్టుబడులు పెట్టడం వల్ల స్టాక్ డ్రాప్ అవుతోందనీ, రాబోయే మూడు నుండి ఐదేళ్లలో "గణనీయమైన" సంపద కోల్పోతుందని తాను భావిస్తున్నట్లు నీధమ్ అండ్ కంపెనీ ఇంటర్నెట్ విశ్లేషకుడు లారా మార్టిన్ చెప్పారు. -
సైలెంట్గా సైడ్ అయిపోవచ్చు, వాట్సాప్ యూజర్లకు శుభవార్త!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మూడు ఫీచర్లను యాడ్ చేస్తున్నట్లు వాట్సాప్ మాతృసంస్థ, మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ తెలిపారు. ఏదైనా గ్రూప్ నుంచి నిష్క్రమిస్తే ఇతర సభ్యులకు ఎవరికీ తెలియదు. ఎగ్జిట్ అయిన విషయం అడ్మిన్స్కు మాత్రమే తెలుస్తుంది. అలాగే వాట్సాప్ను ప్రైవేట్గా చూసుకునే వెసులుబాటు రానుంది. అంటే ఆన్లైన్లో ఉన్నప్పుడు ఎవరికి కనపడాలి, ఎవరికి కనపడకూడదో నిర్ణయించుకోవచ్చు. ఈ రెండు ఫీచర్లు ఆగస్ట్లోనే జతకూడనున్నట్టు కంపెనీ మంగళవారం ప్రకటించింది. యూజర్ మరో యూజర్కు వ్యూ వన్స్ ఫీచర్ను ఉపయోగించి ఫోటో, వీడియో పంపినప్పుడు ఒకసారి మాత్రమే చూసుకునే వీలుంది. అయితే వ్యూ వన్స్ ద్వారా వచ్చిన ఫొటోను, వీడియోను స్క్రీన్షాట్ తీసుకునే వీలు లేకుండా కొత్త ఫీచర్ కొద్ది రోజుల్లో రానుంది. చదవండి👉ఎస్బీఐ:'హాయ్' చెప్పండి..వాట్సాప్లో బ్యాంక్ సేవల్ని పొందండి! -
ఇన్స్టా యూజర్లకి గుడ్ న్యూస్.. కిరాక్ ఫీచర్ రాబోతోంది!
ఎప్పటికప్పుడు లేటస్ట్ అప్డేట్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న ఇన్స్టాగ్రామ్ మరో సరికొత్త ఫీచర్ను తీసుకురానుంది. ఇంతవరకు ఫోటో షేరింగ్, వీడియో రీల్స్, చాటింగ్ వంటివాటితో యూజర్లను తనవైపు తిప్పుకున్న ఇన్స్టా తాజాగా మ్యాప్స్ ఫీచర్ను ప్రవేశపెట్టబోతోంది. ఈ ఫీచర్లతో యూజర్లు సులభంగా కొత్త లొకేషన్లను కనుగొనవచ్చు. ఇన్స్టా ఐజీ(IG)లో కొత్తగా మ్యాప్ ఫీచర్ను ప్రవేశపెడుతున్నట్టు మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ప్రకటించారు. ఈ కొత్త ఫీచర్తో యూజర్లు తమ సమీపంలో ఉన్న స్థానిక వ్యాపారాలు, వివిధ ప్రసిద్ధ స్థలాలను కనుగొనవచ్చు. గతంలో యూజర్లు ఒక లొకేషన్ సందర్శించినప్పుడు వాళ్లు షేర్ చేసిన పోస్ట్లను మాత్రమే చూడగలిగేవారు. కానీ, లొకేషన్ వివరాల గురించి తెలుసుకునే వీలు ఉండేది కాదు. అయితే ఇన్స్టాలో రాబోయే లేటెస్ట్ అప్డేట్ మ్యాప్ ఫీచర్ ద్వారా లోకేషన్ వివరాలు కూడా తెలుసుకునేలా వీలు కల్పించారు. ఇన్స్టాగ్రామ్ గత సంవత్సరం కొన్ని దేశాలలో ఈ మ్యాప్ ఫీచర్ని పరీక్షించింది. ఇది మనకి సమీపంలోని స్థలాల వివరాలు లేదా కేవలం మనకు కావాల్సిన షాపులను మాత్రమే చూపిస్తుంది. యూజర్లు ఒక ప్రాంతం కోసం సెర్చ్ చేసిన తర్వాత, అనవసరమైన వాటిని పక్కన పెట్టేందుకు అందులో ఫిల్టర్ ఆప్షన్ కూడా ఉంటుంది. దాన్ని సెలక్ట్ చేసుకుని మనం ఎంచుకున్న రెస్టారెంట్లు, బార్లు, పార్కులు లేదా ఇతర స్థలాలను చూడవచ్చు. చదవండి: OnePlus 10T 5G: అదిరిపోయే ఫీచర్లతో వన్ప్లస్ 10టీ.. గ్రాండ్ లాంచ్ అప్పుడే! -
వర్క్ కంప్లీట్ చేయకపోతే..మార్క్ జుకర్ బర్గ్ కత్తితో ఏం చేస్తాడో తెలుసా!
మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారారు.ఫేస్బుక్ సంస్థ ప్రారంభ దశలో ఉన్న ఉద్యోగుల్లో ఒకరైన నోహ్ కాగన్.. వర్క్ విషయంలో జుకర్ బర్గ్ తీరు గురించి మాట్లాడిన వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. ఉద్యోగుల పట్ల చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారని, అలా జుకర్ బర్గ్ ఎందుకు చేస్తున్నారో తెలిసేది కాదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మెటా కార్యాలయంలో జపాన్కు చెందిన పురాతన కత్తిని(కటానా) మార్క్ జుకర్ బర్గ్ ఉపయోగించేవారు. ఫేస్బుక్లో కోడింగ్, లేదంటే ఇతర వర్క్లు నచ్చకపోతే కటానా కత్తిని ఊపుతు తిరిగేవారంటూ టిక్ టాక్ వీడియోలో తెలిపాడు. జుకర్బర్గ్ కత్తి గురించి టిక్టాక్లో వీడియోలో కాగన్.."అతను గొప్ప ఇన్నోవేటర్. షెడ్యూల్ ప్రకారం వర్క్ కంప్లీట్ కాకపోతే జుకర్ బర్గ్ కటానా కత్తితో ఆఫీస్ అంతా తిరుగుతూ నేను చెప్పిన పని టైంకు పూర్తి చేయకపోతే మీ ముఖంపై కొడతాను. లేదంటే ఈ భారీ ఖడ్గంతో నిన్ను(ఉద్యోగులను ఉద్దేశిస్తూ)నరికివేస్తానంటూ' నవ్వులు పూయించేవారని అన్నాడు. ఈ రోజు వరకు, అతని వద్ద ఆ కత్తి ఎందుకు ఉందో నాకు తెలియదు." వర్క్లో ఎంత ఒత్తిడి ఎదురైనా చాలా ప్రశాంతంగా, కూల్గా ఉండేవారు. కానీ వర్క్ పూర్తి చేసే విషయంలో ఆ కత్తిని ఉపయోగిస్తారంటూ కాగన్ పలు ఆసక్తికర విషయాల్ని నెటిజన్లతో పంచుకున్నాడు. ఇదో చెత్త..మళ్లీ చేయి ప్రస్తుతం సాఫ్ట్ వేర్ డీల్స్ సంస్థ యాప్సుమో సీఈఓగా ఉన్న కాగన్ ఫేస్బుక్లో పనిచేసిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు.కంపెనీకి సేవలందించిన 10 నెలలకే జుకర్ బర్గ్ తనని ఫేస్బుక్ నుండి తొలగించినట్లు తెలిపారు. 60వేల డాలర్ల జీతంతో పాటు కంపెనీలో 0.1 శాతం షేర్ను కోల్పోయినట్లు చెప్పాడు. సందర్భం ఎలా ఉన్నా జుకర్ బర్గ్ హ్యాండిల్ చేయగలడు. కానీ ఓసారి జుకర్ బర్గ్ తన సహనాన్ని కోల్పోయాడు. ఫేస్బుక్లో కొత్త ఫీచర్ను ఎనేబుల్ చేయాలని అనుకున్నాడు. అదే ఫీచర్పై పనిచేస్తున్న ఇంజనీర్ క్రిస్ట్ను గమనించాడు. ఫీచర్పై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ గ్లాస్తో వాటర్ విసిరేసి "ఇదో చెత్త..మళ్లీ చేయి"అంటూ జుకర్బర్గ్ అరుస్తూ వెళ్ళిపోయాడని కాగన్ తెలిపాడు. కాగా, 2005లో ఫేస్బుక్లో చేరిన కాగన్ జుకర్బర్గ్ కత్తి గురించి మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. 2014లో కాగన్ రాసిన బుక్లో "హౌ ఐ లాస్ట్ 170 మిలియన్ డాలర్స్: మై టైమ్ యాజ్ #30 ఎట్ ఫేస్బుక్" ఈవెంట్లో సైతం జుకర్ బర్గ్ వాడే కత్తి గురించి ప్రస్తావించాడు. -
అపర కుబేరులకు భారీ షాక్.. లక్షల కోట్ల నష్టం!
కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వాలు,సెంట్రల్ బ్యాంక్లు ఉద్దీపన చర్యలు చేపట్టడం, జాతీయ, అంతర్జాతీయ పరిణామల నేపథ్యంలో టెక్ కంపెనీల నుంచి క్రిప్టో కరెన్సీ వరకు ఇలా అన్నీ రంగాలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. వెరసి ప్రపంచ వ్యాప్తంగా 500 మంది బిలియనీర్లు కేవలం 6నెలల వ్యవధిలో 1.4 ట్రిలియన్ డాలర్లను నష్టపోయారు. బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం..వరల్డ్ 500 రిచెస్ట్ బిలియనీర్లలో ఎలన్ మస్క్ తన సంపదలో దాదాపు 62 బిలియన్ డాలర్లు, జెఫ్ బెజోస్ 63 బిలియన్ డాలర్లు, మార్క్ జుకర్ బర్గ్ నికర సంపద సగానికి పైగా తగ్గింది. ఇలా ప్రపంచంలో 500 మంది సంపన్నులు 2022 మొదటి 6 నెలల్లో 1.4 ట్రిలియన్ డాలర్లను కోల్పోయారు. కారణాలివేనా! పాలసీ మేకర్లు ప్రస్తుతం నెలకొన్న అధిక ద్రవ్యోల్బణాన్నితగ్గించేందుకు వడ్డీ రేట్లను భారీగా పెంచాయి. దీంతో బిలియన్లు తన ఆదాయాన్ని పెద్ద ఎత్తున కోల్పోయారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్ దిగ్గజంటెస్లా జూన్ నుండి కేవలం మూడు నెలల్లో అత్యంత దారుణమైన నష్టాల్ని చవిచూసింది. అమెజాన్ సైతం అదే దారిలో పయనించింది. అయినా వాళ్లే టాప్ ప్రప౦చ౦లోని అత్య౦త ధనవ౦తులైన ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్లు భారీ నష్టాల్ని చవిచూస్తున్నాయి. అయినప్పటికీ ప్రపంచ ధనవంతుల జాబితాలో వరుస స్థానాల్లో కొనసాగుతున్నారు. ఎలన్ మస్క్ ఇప్పటికీ 208.5 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే ధనవంతుల జాబితాలో తొలిస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత అమెజాన్ బాస్ బెజోస్ 129.6 బిలియన్ డాలర్ల నికర విలువతో రెండవ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. చదవండి👉 ఎలన్ మస్క్ కొంపముంచిన చైనా.. లక్షల కోట్లు హాంఫట్! -
సంక్షోభంలో మెటా? ఉద్యోగులకు వార్నింగ్..ఎందుకంటే!
ఉద్యోగులకు మెటా హెచ్చరికలు జారీ చేసింది. సెకండ్ ఆఫ్ ఇయర్లో (ఫైనాన్షియల్ ఇయర్ - 6నెలలు) సంస్థ మెరుగైన ఫలితాలు సాధించేలా ఉద్యోగులు తమ పనితీరును మెరుగు పరుచుకోవాలని ఉద్యోగులకు ఇంటర్నల్ మెమో జారీ చేసింది.భవిష్యత్లో మరింత క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉందని ఆ మెయిల్లో పేర్కొంది. ప్రముఖ సోషల్ మీడియా సంస్థ మెటా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మెటా ప్రైవసీ పాలసీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విమర్శల కారణంగా మెటా యాడ్స్ బిజినెస్ (ఉదా:బ్రాండ్ పెయిడ్ ప్రమోషన్స్,సేల్స్) భారీగా పడిపోయింది.దీంతో ఆ సంస్థకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందుకే ఖర్చులు తగ్గించి, ఉద్యోగాల నియామకాల్ని నిలిపివేస్తున్నట్లు మెటా చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ క్రిస్ కాక్స్ మెమోలో హైలెట్ చేశారు. ఆదాయం పడిపోయింది క్రిస్ కాక్స్ మెమోలో ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మెటా పనితీరుపై సీఈవో మార్క్ జుకర్ బర్గ్ అధ్యక్షతన అంతర్గత సమావేశం జరిగింది. మెటా ఉన్నత స్థాయి ఉద్యోగులతో జుకర్ బర్గ్ నిర్వహించిన భేటీలో మెటా ఆదాయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గతేడాది యాపిల్ సంస్థ యాప్ ట్రాకింగ్ ట్రాన్స్పరెన్సీ(ఏటీటీ) పేరుతో తెచ్చిన కొత్త పాలసీ కారణంగా మెటాకు వచ్చే ఆదాయం తగ్గినట్లు జుకర్ బర్గ్ గుర్తించినట్లు కాక్స్ చెప్పారు. కాబట్టే అందుకు అనుగుణంగా సంస్థ కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొత్త రిక్రూట్ మెంట్ ఆపేస్తున్నట్లు వెల్లడించారు. ఉద్యోగులతో జుకర్ బర్గ్ అంతర్గత సమావేశంలో జుకర్ బర్గ్ ఉద్యోగులతో క్యూ అండ్ ఏ సెషన్ నిర్వహించారు. ఉద్యోగులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా జుకర్ బర్గ్ స్పందిచారు. ఆయన మాట్లాడుతూ..నా వరకు ఇదే నేను ఎదుర్కొంటున్న అత్యంత గడ్డు పరిస్థితులు. ఆ పరిస్థితుల నుంచి బయట పడే శక్తి సామర్ధ్యాలున్నాయి.ఇతర కారణాల వల్ల ఈ ఏడాదిలో సుమారు 30శాతం మెటా ఇంజనీర్లను తగ్గించే అవకాశం ఉంటుందని జుకర్ బర్గ్ తెలిపారు. -
ఇకపై ఎఫ్బీ మనకు కనిపించదు! ఎందుకంటే?
ప్రపంచ వ్యాప్తంగా విరివిగా ఇంటర్నెట్ ఉపయోగించే జనాల్లో వారిలో సగానికి పైగా జీవితంలో ఓ భాగమైంది ఫేస్బుక్ లేదా ఎఫ్బీ. బ్లూరంగులో కనిపించే ఫేస్బుక్ టికర్ ఇకపై మనకు కనిపించదు. రాబోయే రోజుల్లో సెర్చ్ ఇంజన్లలో ఫేస్బుక్ అని టైప్ చేస్తే పేజీలు దొరక్కపోవచ్చు. ఎందుకంటే ఇకపై ఫేస్బుక్ స్థానంలో మెటా కనిపించబోతుంది. ‘మార్క్’ ప్రస్థానం హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్న రోజుల్లో మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ను 2004లో ప్రారంభించాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ అందరి స్మార్ట్ఫోన్లలో ఓ భాగమైంది ఫేస్బుక్. ఇప్పుడు మనం చూస్తున్న ఫేస్బుక్ లోగో, టిక్కర్ అంతా 2012లో పబ్లిక్ ఇష్యూకి వెళ్లినప్పుడు డిజైన్ చేసింది. గడిచిన పదేళ్లుగా ఇదే లోగో, టిక్కర్తో ఎఫ్బీ కనిపిస్తోంది. కానీ ఇకపై ఇది కనుమరుగు కానుంది. గతేడాదే ఫేస్బుక్తో ప్రయాణం ప్రారంభించిన మార్క్ జుకర్బర్గ్ ఆ తర్వాత వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లను సొంతం చేసుకుని ప్రపంచంలోనే అతి పెద్ద సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్గా ఫేస్బుక్ను తీర్చిదిద్దారు. అక్కడితో మార్క్ ప్రణాళికలు ఆగిపోలేదు. వాస్తవ ప్రపంచానికి దీటుగా టెక్నాలజీ సాయంతో మరో మాయ ప్రపంచానికి రూకలప్పన చేశాడు. దానికి మెటావర్స్గా పేరు పెట్టుకున్నాడు. మెటాపై నమ్మకంతో ఫేస్బుక్ కంపెనీ పేరుకూడా మెటా 2021 అక్టోబరులో మార్చేశాడు. ఇకపై మెటానే ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ ఇవన్నీ టూడీ సెంట్రిక్ సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్. కానీ మెటావర్స్ ఇందుకు విరుద్ధం. అందుకే మెటా మీదనే ఫోకస్ చేస్తూ ఇప్పటికే కంపెనీ పేరు మెటాగా మార్చాడు జుకర్బర్గ్. ఇప్పుడు దాన్ని మరింత విస్త్రృతం చేసే లక్ష్యంతో ఫేస్బుక్ టిక్కర్ , లోగోల స్థానంలో మెటా లోగో, టిక్కర్లను మనుగడలోకి తీసుకురాబోతున్నట్టు జున్ 9న అమెరికా స్టాక్మార్కెట్ నాస్డాక్కు తెలిపారు. కోత పడింది కోట్లాది మంది ప్రజలకు చేరువైన ఫేస్బుక్ టికర్, లోగోలను మార్చితే ఏమవుతుందనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. జనబాహుళ్యంలోకి విస్త్రృతంగా చొక్కుకుపోయిన సంస్థల విషయంలో టికర్, లోగోల విషయంలో పెద్దగా ఫరక్ పడదంటున్నాయి మెటా వర్గాలు. కానీ ప్రజల సెంటిమెంట్తో ముడిపడిన అంశం కావడంతో నాస్డాక్ మరోరకంగా స్పందించింది. టికర్ మార్పు ప్రకటన అనంతరం మెటా షేర్ల విలువకు 6 శాతం మేర కోత పడింది. ఈ తాజా ఉదంతంతో మార్క్ అభిప్రాయంలో ఏదైనా మార్పు వస్తుందేమో చూడాలి. చదవండి: Sheryl Sandberg: మెటా సీఓఓ పదవికి షెరిల్ శాండ్బర్గ్ రాజీనామా! -
ఫేస్బుక్ సీఓఓకు షెరిల్ శాండ్బర్గ్ ఆకస్మిక నిష్క్రమణ
-
ఆలస్యానికి తావేలేదు.. మెటా కొత్త సీవోవో ఇతనే?
చిన్న స్టార్టప్ నుంచి ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీల్లో ఒకటిగా ఫేస్బుక్ను తీర్చడంలో మార్క్ జూకర్బర్గ్ అను నిత్యం శ్రమించాడు. కాలానుగుణంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ సరికొత్త వర్చువల్ ప్రపంచం సృష్టించే పనిలో ఉత్సాహంగా ఉన్నాడు. ఇంతలో మెటాలో ఊహించని విధంగా వచ్చిన కుదుపును జాగ్రత్తగా హ్యాండిల్ చేసే పనిలో ఉన్నాడు జుకర్బర్గ్. వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ తనలోని క్రైసిస్ మేనేజ్మెంట్ స్కిల్స్ను మరోసారి ప్రపంచానికి చూపెట్టారు. ఊహించని కుదుపు ఫేస్బుక్ నుంచి మెటాగా మారే క్రమంలో ఎదురైన అనేక విపత్కర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటూ సోషల్ మీడియాలో ఫేస్బుక్ను రారాజుగా నిలిపారు మార్క్జుకర్బర్గ్. భవిష్యత్తును అంచనా వేస్తూ సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ నుంచి మెటావర్స్ అనే సరికొత్త వర్చువల్ వరల్డ్ రెడీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ప్రయాణంలో జుకర్బర్గ్తో పాటు ఎంతగానో శ్రమించిన షెరిల్ శాండ్బర్గ్ అకస్మాత్తుగా మెటాకు గుడ్బై చెప్పారు. ఉన్నట్టుండి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పదవికి ఆమె రాజీనామా చేశారు. దీంతో ఒక్కసారిగా మెటా కుదుపులకు లోనైంది. షేర్ల ధరలకు కోతలు పడ్డాయి. షెరిల్ వారసుడెవరు షెరిల్ శాండ్బర్గ్ మెటాను వీడి వెళ్లడం కంపెనీ పరంగానే కాకుండా వ్యక్తగతంగా కూడా జూకర్బర్గ్కి తీరని నష్టమే. షెరిల్ నిష్క్రమణపై జూకర్బర్గ్ తాజాగా విడుదల ప్రకటన సైతం ఇదే విషయాన్ని పట్టి చూపుతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ మరోసారి తనలోని మేనేజ్మెంట్ స్కిల్స్ని బయటకు తెచ్చారు జుకర్బర్గ్. ఓవైపు షెరిల్ తాలుకూ బాధను అనుభవిస్తూనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా మెటా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా జేవియర్ ఒలివన్ను నియమించారు. ఎవరీ జేవియర్ ఒలివన్ స్పెయిన్కి చెందిన జేవియర్ ఓలివన్ (44) నవర్రా యనివర్సిటీ నుంచి ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్లో పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. జపాన్కు చెందిన సీమెన్స్లో తన కెరీర్ ను ప్రారంభించాడు. ఫేస్బుక్లోకి 2007లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయంలో ఫేస్బుక్కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూజర్ల సంఖ్య కేవలం 40 మిలియన్లు మాత్రమే. ఆ తర్వాత ఈ సంఖ్య ఊహించని వేగంతో పెరుగుతూ ప్రస్తుతం 3.6 బిలియన్లకు చేరుకుంది. ఇందులో ఇండియా, జపాన్, రష్యా, ఇండోనేషియా, బ్రెజిల్ వంటి పెద్ద మార్కెట్లలో ఫేస్బుక్ పాతుకుపోవడంలో జేవియర్ కృషే ఎక్కువ. కాగా షెరిల్ లేని లోటు లేకుండా ఒలివన్ సంస్థను ముందుకు నడిపిస్తాడని మెటా నమ్మకంతో ఉంది. చదవండి: Sheryl Sandberg: మెటా సీఓఓ పదవికి షెరిల్ శాండ్బర్గ్ రాజీనామా! -
Sheryl Sandberg: మాజీ బాయ్ ఫ్రెండ్కోసమే మెటాకు షాక్?
న్యూఢిల్లీ: ఫేస్బుక్ మెటా సీవోవో షెరిల్ శాండ్బర్గ్ ఆకస్మిక నిష్క్రమణ టెక్ వర్గాల్లో సంచలనం రేపింది. సంస్థనుంచి వైదొలగుతున్నట్టు ఆకస్మికంగా ప్రకటించారు. అయితే భవిష్యత్తును ఇంకా నిర్ణయించుకోనప్పటికీ, ప్రధానంగా కుటుంబానికి, సేవా కార్యక్రమాలకు తన సమయాన్ని కేటాయిస్తానని ఫేస్బుక్లో తెలిపారు. అలాగే ఎగ్జిక్యూటివ్ బోర్డులో డైరెక్టర్గా కొనసాగుతాని కూడా స్పష్టం చేశారు. అంతేకాదు ప్రతీ కష్టమైన, కీలకమైన సమయాల్లో అండగా నిలిచారంటూ మార్క్ జుకర్బర్గ్ను ప్రశంసించారు. 2008లో ఉద్యోగంలో చేరినప్పుడు, ఐదేళ్లపాటు పనిచేస్తా అనుకున్నాను. కానీ పద్నాలుగేళ్లు జర్నీ కొనసాగింది. తన జీవితంలోని కొత్త అధ్యాయాన్ని ప్రారంభిచేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. మాజీ బాయ్ ఫ్రెండ్ కోసమేనా? ఎవరీ బాబీ కోటిక్? అయితే మార్క్ జుకర్బర్గ్ సన్నిహితురాలు, తొలినాళ్లలో ఫేస్బుక్ వృద్ధిలో కీలక పాత్ర పోషించిన షెరిల్ శాండ్బర్గ్ 14 సంవత్సరాల తరువాత కంపెనీనీ వీడటం చాలామందికి ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీంతో షెరిల్ నిర్ణయానికి మాజీ ప్రియుడు బాబీ కోటిక్ కారణమా అనే ఊహాగానాలు మీడియాలో ఒక్కసారిగా గుప్పుమన్నాయి. శాండ్బెర్గ్ చుట్టూ అనేక వివాదాలు ఉన్నప్పటికీ ఇటీవలికాలంలో వచ్చిన తీవ్ర ఆరోపణలు ఈ పరిణామానికి దారితీశాయని విశ్లేషకులు అభిప్రాయం. తన స్నేహితుడు, యాక్టివిజన్ బ్లిజార్డ్ ప్రస్తుత సీఈవో బాబీ కోటిక్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను తిప్పి కొట్టేందుకు తన పలుకు బడిని ఉపయోగించి శాయశక్తులా కృషి చేశారంటూ ఇటీవల ఆరోపణలు చెలరేగాయి. ఈ మేరకు 2022 ఏప్రిల్లో, వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. అయితే దీనిపై అంతర్గత విచారణ చేపట్టినప్పటికీ, ఆరోపణలన్నింటినీ మెటా బహిరంగంగానే ఖండించింది. జేవియర్ ఒలివాన్ (ఫైల్ ఫోటో) షెరిల్ శాండ్బర్గ్ స్థానాన్ని భర్తీ చేసేదెవరు? ఒక శకం ముగిసిందంటూ షెరిల్ రాజీనామాను సోషల్మీడియా వేదికగా ప్రకటించిన జుకర్బర్గ్ ప్రస్తుతం శాండ్బర్గ్ ప్లేస్లో ఇంకా ఎవరిని ప్లాన్ చేయలేదని తొలుత పేర్కొన్నారు. కానీ ఆ తరువాత చీఫ్ గ్రోత్ ఆఫీసర్ జేవియర్ ఒలివాన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రత్యేక ఫేస్బుక్ పోస్ట్లో వెల్లడించారు. -
మెటాకు భారీ షాక్, విచారంలో జుకర్ బర్గ్!
Sheryl Sandberg Leaves Meta: సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్బుక్) కు సీఓఓ (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) షెరిల్ శాండ్బర్గ్ గుడ్ బై చెప్పారు. ఆ సంస్థలో 14 ఏళ్లుగా వివిధ ఉన్నత స్థాయి విభాగాల్లో విధులు నిర్వర్తించిన ఆమె తాజాగా మెటాను వీడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్బుక్) కు సీఓఓ (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) షెరిల్ శాండ్బర్గ్ గుడ్ బై చెప్పారు. ఆ సంస్థలో 14 ఏళ్లుగా వివిధ ఉన్నత స్థాయి విభాగాల్లో విధులు నిర్వర్తించిన ఆమె తాజాగా మెటాను వీడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 14ఏళ్ల పాటు పనిచేసి మెటాను వదిలి వెళుతున్నట్లు చేసిన షెరిల్ శాండ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ప్రకటనతో ఆ సంస్థ షేర్లు 4శాతం నష్టపోయాయి. ఇక షెరిల్ నిర్ణయంపై జుకర్ బర్గ్ స్పందించారు. " మెటాలో ఓ శకం ముగిసింది. 14ఏళ్ల తర్వాత నా స్నేహితురాలు, వ్యాపార భాగస్వామి షెరిల్ శాండ్ బర్గ్ మెటా సీఓఓ పదవికి రాజీనామా చేశారు. 2008లో షెరిల్ మెటాలో జాయిన్ అయినప్పుడు నా వయస్సు 23ఏళ్లు. వ్యాపారం వైపు అప్పుడప్పుడే అడుగులు వేస్తున్నా. మేం మంచి ప్రొడక్ట్ను (ఫేస్బుక్) తయారు చేశాం. కానీ ఆ ప్రొడక్ట్ను ఎలా లాభాలొచ్చే వ్యాపారంగా తీర్చిదిద్దాలి. చిన్న స్టార్టప్ను ప్రపంచంలో అతి పెద్ద సంస్థగా ఎలా తీర్చిదిద్దాలి' అనే విషయాలపై అవగాహన లేదు. చుక్కాని లేని నావలా ఉన్న మెటాను షెరిల్ ఆదుకున్నారు. ఫేస్బుక్లో యాడ్స్ ఆధారిత బిజినెస్ మోడల్ను వెలుగులోకి తెచ్చారు. సంస్థను పటిష్టం చేసేందుకు ఉపయోగ పడే అత్యంత ప్రతిభావంతులైన ఉద్యోగుల్ని జల్లెడ పట్టి మరి నియమించుకున్నారు. అస్తవ్యస్తంగా ఉన్న మేనేజ్మెంట్ కల్చర్ను మార్చారు. తన ఆలోచనలతో స్టార్టప్ను ఒక సంస్థగా మార్చారు. ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మందికి ఉపాధి అవకాశాల్ని కల్పించారు. ఈరోజు మెటా ఈ స్థాయిలో ఉందంటే అందుకు ఆమె కారణమని జుకర్ బర్గ్ కొనియాడారు. సంస్థలో రాజీనామా చేసినా షెరిల్తో మా వ్యాపారం సంబంధాలు కొనసాగుతాయి. ఎందుకంటే ఆమెది గొప్ప వ్యక్తుత్వం, సహచరురాలు అంతకు మించి మంచి స్నేహితురాలంటూ " ప్రశంసల వర్షం కురిపించారు. చదవండి👉హే..! జుకరూ..నువ్వు మారవా? -
మన ముందుకు మెటా ప్రపంచం.. ఎప్పటి నుంచి అంటే?
సోషల్ మీడియాలో ఫేస్బుక్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత కాలంలో ఇన్స్టా, ట్విటర్, టిక్టాక్లు సోషల్ మీడియాను కొత్త ఎత్తులకు తీసుకెళ్లాయి. ఇప్పుడు సోషల్ మీడియా కాదు ఏకంగా వర్చువల్ యూనివర్స్గా మెటావర్స్ తెస్తానంటున్నాడు మార్క్ జూకర్బర్గ్. దాదాపు ఏడాది కాలంగా మెటావర్స్ గురించి వింటున్నా చాలా మందికి ఇంకా అది కొరుకుడు పడని విషయంగానే ఉంది. దీన్ని గమనించిన జూకర్బర్గ్ మెటావర్స్ ఎక్సీపీరియన్స్ మరింత చేరువ చేసే పనిలో పడ్డారు. మెటావర్స్ ఎక్స్పీరియన్స్ పొందాలంటే ప్రత్యేకమైన గ్యాడ్జెట్స్ అవసరం. లేటెస్ట్ సెన్సార్ల ఆధారంగా పని చేసే ఈ గ్యాడ్జెట్స్ ఉన్నప్పుడే మెటావర్స్ అనుభూతిని ‘ఫీల్’ అవగలం లేదంటూ వర్చువల్ రియాలిటీ, యానిమేషన్ వీడియోలకు మరో రూపం మెటావర్స్ అన్నట్టుగా ఉంటుంది. దీంతో మెటావర్స్ ఫీల్కు ఉపయోగపడే గ్యాడ్జెట్స్తో మెటాస్టోర్ను అందుబాటులోకి తెస్తున్నారు. కాలిఫోర్నియాలో బర్లింగేమ్ క్యాంపస్లో తొలి మెటాస్టోర్ని 2022 మే 9న ప్రారంభించబోతున్నారు. అదే విధంగా ఆన్లైన్ పోర్టల్ మెటాడాట్కామ్ కూడా అందుబాటులోకి రానుంది. ఇందులో దొరికే గ్యాడ్జెట్స్ని కొనుగోలు చేసి ఉపయోగించిన తర్వాతే మెటావర్స్ మీద మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే మెటా గ్యాడ్జెట్స్ ఎంత ధరలో లభిస్తున్నాయనే అంశంపై ఇంకా పూర్తి వివరాలు జూకర్బర్గ్ రిలీజ్ చేయలేదు. చదవండి: యాపిల్ నుంచి కొత్తగా స్మార్ట్ బాటిల్స్! ధర ఎంతంటే? -
Facebook: మార్క్ జుకర్బర్గ్కు బిగ్ షాక్
Facebook CEO Mark Zuckerberg.. ఉక్రెయిన్లో రష్యా బలగాల భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ఉక్రెయిన్పై దాడుల కారణంగా తమ దేశం రష్యాపై ఆంక్షలు విధించారన్న ప్రతీకారంతో పుతిన్ అనేక దేశాల ప్రముఖులపై నిషేధం విధిస్తున్నారు. తాజాగా ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారీస్పై రష్యా నిషేధం విధించింది. ఆంక్షల్లో భాగంగా భాగంగా అమెరికాకు చెందిన 29 మంది రాజకీయవేత్తలు, కంపెనీ సీఈవోలను, 61 మంది కెనడియన్లను బ్లాక్ లిస్టులో పెట్టింది. వారిపై నిరవధికంగా బ్యాన్ విధిస్తున్నట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. రష్యా ప్రకటించిన బ్లాక్లిస్టులో లింక్డిన్ సీఈవో ర్యాన్ రోస్లాన్స్కీ, ఏబీసీ న్యూస్ టెలివిజన్ ప్రెజెంటర్ జార్జ్ స్టెఫానోపౌలోస్, వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ డేవిడ్ ఇగ్నేషియస్, అమెరికా రక్షణ అధికారులలో పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ మరియు డిఫెన్స్ డిప్యూటీ సెక్రటరీ కాథ్లీన్ హిక్స్ ఉన్నారు. అంతకుముందు రష్యా.. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అనంతరం వాటిని ‘ఉగ్రవాద’ సంస్థలుగా పేర్కొంది. ఇది చదవండి: పాక్ ఆర్మీ చీఫ్పై ఇమ్రాన్ ఆరోపణలు -
చలో చలో.. మెటాలోకం అంటున్న యూత్! మీకేం తెలుసు?
‘ఆహా! అలాగా!!’ అనే ఆశ్చర్యాలకు అంతు ఉండదు. ‘అసలు ఇది ఎలా సాధ్యం’ అనే ప్రశ్నలకు విరామం ఉండదు. ఊరిస్తున్న వర్చువల్ వరల్డ్ ‘మెటావర్స్’ యూత్లోకానికి దగ్గరగా వచ్చేస్తుంది. ఇది వినోదానికి పరిమితమైన ఆట కాదు. కాల్పానిక ప్రపంచంలో సేద తీరే పాట కాదు. యూత్ జీవనశైలిలో మెగా మార్పు తీసుకువచ్చే మెటావర్స్! నిన్నటి సైన్స్–ఫిక్షనే రేపటి కొత్త ఆవిష్కరణ అనే మాట అన్ని సందర్భాలలోనూ నిజమై ఉండకపోవచ్చుగానీ ‘మెటావర్స్’ వరకైతే నిజమే. నీల్ స్టీఫెన్సన్ అమెరికన్ సైన్స్ఫిక్షన్ నవల ‘స్నో క్రాష్ (1992)’లో కనిపించిన ‘మెటావర్స్’ ఇప్పుడు యూత్ ఫేవరేట్ సౌండ్ అయింది. ఫేస్బుక్ తన కంపెనీ పేరును ‘మెటా’గా మార్చుకోవడం ఒక్కటి చాలు అది మెటావర్స్కు ఇస్తున్న ప్రాధాన్యతను చెప్పడానికి. భారీ ఖర్చుతో సరికొత్త డిజిటల్ ప్రపంచాన్ని సృష్టించే పనిలో భాగంగా ప్రపంచంలోనే వేగవంతమైన ఏఐ సూపర్ కంప్యూటర్ (ఏఐ రిసెర్చ్ సూపర్క్లస్టర్.. ఆర్ఎస్సీ) రూపొందించడం, యూనివర్సల్ స్పీచ్ ట్రాన్స్లేటర్(ఇన్స్టంట్ స్పీచ్–టు–స్పీచ్ ట్రాన్స్లెషన్: అన్ని భాషల్లో)... మొదలైనవి రూపొందిస్తుంది మెటా. కేవలం మెటా మాత్రమే కాదు రాబోయే కాలంలో రకరకాల మెటావర్స్ ప్లాట్ఫామ్స్ ప్రభావంతో యువప్రపంచంలో సరికొత్త మార్పులు రానున్నాయి. వినోదరంగానికి వస్తే... టీవీ చూడడం కంటే మెటావర్స్ లోకంలోనే ఎక్కువ సమయం గడపడానికి యువతరం ఇష్టపడుతుందనేది ఒక అంచనా. ‘యూత్ వ్యూయర్షిప్ను కాపాడుకోవడానికి టీవి రంగం చాలా కసరత్తులు చేయాల్సి ఉంటుంది. ఆకట్టుకునే విభిన్నమైన కంటెంట్ను సమకూర్చుకోక తప్పదు’ అంటున్నారు మాథ్యూ వర్నెఫోర్డ్. ఈయన మెటావర్స్ ప్లాట్ఫామ్స్కు గేమ్స్ను సమకూర్చే ‘డూబిట్’ కో–ఫౌండర్. రాబోయే కాలంలో ‘ఫిట్నెస్ మెటావర్స్’ ట్రెండ్ ఊపందుకోబోతుంది. ‘వెల్టు డూ 2022 కన్జ్యూమర్ వెల్నెస్ట్రెండ్’ రిపోర్ట్ ప్రకారం యంగ్ ఫిట్నెస్ ప్రేమికులు సంప్రదాయ జిమ్లలో కంటే వర్చ్వల్లోనే ఉత్తేజకరమైన వర్కవుట్ ఎక్స్పీరియన్స్ను సొంతం చేసుకుంటారు. ‘మ్యూజిక్, విజువల్స్, వేరుబుల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్...మొదలైన వాటిని ఒకే వేదికపై తీసుకు రావడం ద్వారా మెటావర్స్లో జిమ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఫిట్నెస్ ఆర్గనైజేషన్స్ కొత్త ఆడియెన్స్తో కనెక్ట్ అవుతారు’ అంటుంది రిపోర్ట్, ఇన్–పర్సన్ ఇంటర్వ్యూలు, జూమ్ కాల్స్ కాలంలో ఉన్న కుర్రకారు రిప్రెజెంటేటివ్ అవతార్ను ఎంచుకొని, వర్చువల్ వేదికపై ఇంటర్వ్యూలకు వెళ్లే రోజులు వస్తున్నాయి. సోషల్ మెటావర్స్ స్టార్టప్ ఫామ్ ‘వన్ ఎబౌ’ పేరుతో ‘వాక్–ఇన్ రిక్రూట్మెంట్ ప్లాట్ఫామ్’ను లాంచ్ చేసింది. క్యాండిడేట్ ప్లాట్ఫామ్పై క్లిక్ చేయడంతో ఇంటర్వ్యూ ప్రదేశంలోకి ఎంటర్ అవుతారు. అక్కడ ఉన్న 45 ఆప్షన్లలో తనను బెస్ట్గా రిప్రెజెంట్ చేసే అవతార్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. వర్చువల్ లాబీ నుంచి హెచ్ఆర్ రిప్రెజెంటేటివ్ వీరికి స్వాగతం పలుకుతూ రిక్రూటింగ్కు ప్యానల్కు పరిచయం చేస్తారు. ‘దైవిక శక్తులలాంటి శక్తులతో మెటావర్స్తో ఎవరికి వారు తమదైన ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించుకోవచ్చు’ అని ఊరిస్తున్నాడు మార్క్ జుకర్ బర్గ్. -
8మంది కాదు.. ఒకే సారి 32మంది, వాట్సాప్లో ఇకపై..!
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అదిరిపోయే ఫీచర్లను అందుబాటులోకి తీసుకొని రానుంది. వాట్సాప్ గ్రూప్స్లో కొత్త ఫీచర్లు, రియాక్షన్స్తో పాటు లార్జ్ఫైల్ షేరింగ్ చేసే సౌకర్యాన్ని యూజర్లకు అందించనున్నట్లు మెటా ఫ్లాట్ ఫామ్ సీఈఓ మార్క్ జుకర్ బెర్గ్ తెలిపారు. ప్రస్తుతం వాట్సాప్లో ఎనిమిది మంది మాత్రమే గ్రూప్ వాయిస్ కాల్స్ చేసుకునే సదుపాయం ఉంది. కానీ తాజాగా జుకర్ బెర్గ్ వాయిస్ కాల్స్ చేసే సదుపాయాన్ని 8 మంది నుంచి 32 మందికి పెంచనున్నట్లు తెలిపారు. దీంతో ఒకే సారి 32 మందికి వాట్సాప్ నుంచి వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. వీడియో, పీడీఎఫ్ వంటి 1జీబీ డేటా ఫైల్స్ను పంపుతుండగా ఇకపై 2జీబీ వరకు ఫార్వర్డ్ చేయోచ్చు. ఉదాహరణకు ఓ స్కూల్కు చెందిన 10 వాట్సప్ గ్రూప్లు ఉంటే.. అందరికి ఒకే సమయంలో ఒకే మెసేజ్ను పంపేలా టూల్ను డిజైన్ చేయనున్నట్లు వాట్సాప్ స్పోక్ పర్సన్ తెలిపారు. రోజూవారీ జీవితంలో భాగమైన చాటింగ్ కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత అడ్వాన్స్గా యూజర్లకు పరిచయం చేసేలా కొత్త కొత్త యాప్స్ను బిల్డ్ చేస్తున్నట్లు జుకర్ బెర్గ్ తెలిపారు. తద్వారా వందల మంది యూజర్ల నుంచి వేల మంది యూజర్లు చాట్ చేసుకునేలా వీలు కలగనుంది. చదవండి: రూ.22వేల కోట్ల ఫైన్ ! జుకర్ బర్గ్ ఒక్కో యూజర్కు తలా రూ.5వేలు ఇస్తారా!! -
జుకర్బర్గ్ సంచలన నిర్ణయం తన పేరు మీద కరెన్సీ!
మెటా చీఫ్ మార్క్ జుకర్బర్గ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తన పేరు మీదుగా డిజిటల్ కరెన్సీ తెచ్చే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే మెటాలో అంతర్గత పనులు వేగంగా జరుగుతున్నాయంటూ ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కామర్స్ రంగం పుంజుకుంటోంది. ఇదే సమయంలో గేమింగ్ రంగం కూడా వేగంగా విస్తరిస్తోంది. మెటావర్స్ కనుక విస్త్రృత స్థాయిలో అందుబాటులోకి వస్తే గేమింగ్ ప్రపంచం రూపు రేఖలే మారిపోతాయని నిపుణుల అంచనా. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిజిటల్ కరెన్సీని అభివృద్ధి చేయాలని మెటా నిర్ణయించినట్టు సమాచారం. మెటా అభివృద్ధి చేస్తున్న డిజిటల్ కరెన్సీ ఇప్పటికే తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ డిజిటల్ కరెన్సీని జుక్బక్స్గా పిలుస్తున్నట్టు సమాచారం. ఈ డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి వస్తే ముందుగా గేమింగ్ ఇండస్ట్రీలో లావాదేవీలకు ఉపయోగించాలని మెటా యోచిస్తోంది. పిల్లలో ఎంతో పాపులరైన రోబ్లోక్స్ గేమ్లో రోబక్స్ అనే డిజిటల్ కరెన్సీ ఇప్పటికే చలామనీలో ఉంది. జుక్బక్స్ కూడా ముందుగా గేమింగ్లో ప్రయోగించి, అక్కడ వచ్చిన ఫలితాల ఆధారంగా ఈ కామర్స్లో ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. గతంలో బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా క్రిప్టోకరెన్సీ తెచ్చేందుకు మెటా ప్రయత్నించింది. ముందుగా లిబ్రా పేరుతో తెస్తారని ప్రచారం జరిగినా చివరకు డైమ్గా పేరు ఖరారు అయ్యింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు క్రిప్టో లావాదేవీలపై నిషేధం లేదా కఠినమైన ఆంక్షలు విధించడంతో క్రిప్టో కరెన్సీ ఆలోచన నుంచి మెటా యూ టర్న్ తీసుకుంది. దాని స్థానంలో జుక్బక్స్ పేరుతో డిజిటల్ కరెన్సీ ప్రాజెక్టును పట్టాలపైకి ఎక్కించింది. చదవండి: మీ బట్టలు మీరే ఉతుక్కోండి,ఎవరూ ఉతకరు..ఉద్యోగులకు జుకర్ నోటీసులు! -
మీ బట్టలు మీరే ఉతుక్కోండి,ఎవరూ ఉతకరు..ఉద్యోగులకు జుకర్ బెర్గ్ నోటీసులు!
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్(మెటా) పరిస్థితి మేడిపండను తలపిస్తుంది. పైకి అంతా బాగున్నట్లే ఉన్నా కరోనా కారణంగా ఆర్ధిక చిత్రం దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్ బెర్గ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థలోని ఉద్యోగులకు అందించే ప్రోత్సహకాల్ని నిలిపివేసినట్లు న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేకంగా కథనాన్ని ప్రచురించింది. సిలికాన్ వ్యాలీ. అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ గూగుల్, యాపిల్, ఫేస్బుక్ తో పాటు ఇతర దిగ్గజ టెక్ కంపెనీలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న టెక్ కంపెనీలన్నీ ఉద్యోగుల నుంచి ఫలితాల్ని రాబట్టేందుకు, ఎక్కువ పనిగంటలు పనిచేయించుకునేందుకు భారీ ఎత్తున ప్రోత్సహకాల్ని అందిస్తుంటాయి. అయితే కరోనా, వరుస వివాదాల కారణంగా భవిష్యత్లో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఉద్యోగుల ధరించే దుస్తువుల్ని ఉతకడం, ఐరన్ చేయడంలాంటి సౌకర్యాల్ని ఫేస్బుక్ తొలగించింది. ఉద్యోగులకు సాయంత్రం 6.00గంటలకు డిన్నర్ టైమ్కు ఉచితంగా భోజనాన్ని అందిస్తుంది. ఆ సమయాన్ని సాయంత్రం 6.30కి పెంచడం, వ్యాలెట్ సేవల్ని సైతం కట్ చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో హైలెట్ చేసింది. ఉద్యోగులకు తొలగించిన ప్రోత్సహకాలు కంపెనీకి తగ్గుతున్న ఆదాయానికి ముడిపడి ఉంది. భవిష్యత్ లక్ష్యాలను ప్రతిభింభించేలా ఫేస్బుక్ పేరును మెటా మార్చింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వ్యాల్యూ 515డాలర్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో జుకర్ బెర్గ్ తీసుకున్న కీలక నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఉద్యోగులకు కంపెనీ అందించే ప్రోత్సహాకాలకు, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వ్యాల్యూ పడిపోవడానికి ఎలాంటి సంబంధం లేదని ఫేస్బుక్ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. ఉద్యోగులకు అందించే సదుపాయాల విషయంలో ఫేస్బుక్ ఇలా ఉందని, కానీ వారి ఆరోగ్యంతో పాటు ఇతర సెక్యూరిటీల విషయంలో అందించే ఫండ్ ను 300 డాలర్ల నుంచి 3వేల డాలర్లకు పెంచిందని సూచిస్తున్నారు. చదవండి: రూ.22వేల కోట్ల ఫైన్ ! జుకర్ బర్గ్ ఒక్కో యూజర్కు తలా రూ.5వేలు ఇస్తారా!! -
చెలరేగిపోదాం! టిక్ టాక్ను తలదన్నేలా..ఫేస్బుక్తో డబ్బులు సంపాదించండిలా?!
యూజర్లకు ఫేస్బుక్ (మెటా) బంపరాఫర్ ప్రకటించింది. ఫేస్బుక్ ద్వారా 35వేల డాలర్ల సంపాదించే అవకాశాన్ని క్రియేటర్లకు కల్పిస్తున్నట్లు తెలిపింది. మనదేశంలో టిక్ టాక్ బ్యాన్ తర్వాత్ షార్ట్ వీడియోలు జోరు ఊపందుకుంది. 2020 జూన్ నెలలో కేంద్రం టిక్ టాక్ ను బ్యాన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు టిక్ టాక్ ను తలదన్నేలా ఫేస్బుక్ రీల్స్ను అందుబాటులోకి తెచ్చింది. తొలిసారి గతేడాది యూఎస్లో రీల్స్ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఆ సదుపాయాన్ని 150 దేశాల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు సోషల్ నెట్ వర్క్ దిగ్గజం తన బ్లాగ్ పోస్ట్లో తెలిపింది. రీల్స్ చేయండి..డబ్బులు సంపాదించండి. కోవిడ్ కారణంగా క్రియేటర్లను ఆదుకునేలా ఫేస్బుక్లో డబ్బులు సంపాదించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల టిక్ టాక్ క్రియేటర్లు ఫేస్బుక్ రీల్స్లో మనీ ఎర్నింగ్స్ పై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఫేస్బుక్ ప్రతినిధులు ఆ అనుమానాల్ని పటాపంచలు చేస్తూ వ్యూస్, లైక్స్తో పాటు ఇతర అంశాల్ని పరిగణలోకి తీసుకొని అర్హులైన క్రియేటర్లు నెలకు 35వేల డాలర్ల వరకు చెల్లించేందుకు రీల్స్ ప్లే బోనస్ ప్రోగ్రామ్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, దీంతో పాటు క్రియేటర్లు డబ్బులు సంపాదించేందుకు ఇతర అవకాశాల్ని క్రియేట్ చేస్తున్నట్లు వెల్లడించింది. -
జుకర్బర్గ్ కొంపముంచిన ఫేస్బుక్..! రయ్మంటూ దూసుకొచ్చిన అదానీ, అంబానీ..!
ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటాకు యూజర్లు గట్టి షాక్ను ఇచ్చారు. ఫేస్బుక్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యూజర్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఇదే మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ కొంపముంచింది. దీంతో ఒక్కరోజులోనే జుకర్బర్గ్ నికర విలువ 29 బిలియన్ డాలర్లను కోల్పోయాడు. జుకర్బర్గ్ స్థానం గల్లంతు..! ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ Meta Platforms Inc క్యూ 3లో నిరుత్సాహకరమైన ఆదాయాలను నమోదుచేయడంతో గురువారం(ఫిబ్రవరి 3) రోజున మెటా షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. మార్కెట్ చరిత్రలో మెటా మార్కెట్ క్యాప్ రికార్డు స్థాయిలో 26 శాతం నష్టాలను మూటకట్టుకుంది. దీంతో మెటా ఒక్కరోజే 251 బిలియన్ డాలర్లను కోల్పోయింది. మెటా షేర్లు భారీగా పతనమవ్వడంతో జుకమ్బర్గ్ నికర ఆస్తుల విలువ కూడా భారీగా తగ్గిపోయింది. ఫిబ్రవరి 3న మెటా స్టాక్ 26 శాతం నష్టపోవడంతో జుకర్బర్గ్ నికర విలువలో 29 బిలియన్ డాలర్లను కోల్పోయారు. ఫోర్బ్స్ ప్రకారం.. మెటా వ్యవస్థాపకుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జుకర్బర్గ్ నికర విలువ 85 బిలియన్ల డాలర్లక పడిపోయింది . అదానీ, అంబానీకి కలిసొచ్చింది..! మెటా షేర్ల వైప్ అవుట్ మన ఇండియన్ బిలియనీర్స్ అదానీ, అంబానీలకు కలిసొచ్చింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ జాబితా ప్రకారం, అదానీ నికర విలువ 90.1 బిలియన్ డాలర్లు ఉండగా, అంబానీ నికర ఆస్తుల సంపద 90 బిలియన్ డాలర్లుగా ఉంది. మెటా షేర్ల భారీ వైపౌట్ తర్వాత జుకర్బర్గ్ పన్నెండవ స్థానానికి పడిపోయాడు. నవంబర్లో టెస్లా అధినేత ఎలన్ మస్క్ సింగిల్ డేలో 35 బిలియన్ డాలర్లను కోల్పోయిన తరువాత ఈ రేంజ్లో నికర ఆస్తుల విలువను పొగోట్టుకున్న వ్యక్తి జుకర్బర్గ్ రికార్డు సృష్టించాడు. టెక్నాలజీ స్టాక్స్లో అస్థిరత..! టిక్టాక్, యూట్యూబ్ వంటి ప్రత్యర్థుల నుంచి ఫేస్బుక్ భారీ పోటీ నెలకొంది. దాంతో పాటుగా ప్రైవసీ మార్పులపై తీసుకున్న యాపిల్ నిర్ణయాలు మెటా షేర్లు పడిపోయే కారణాలుగా ఉన్నాయి. ఇకపోతే అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లలో ఊహించిన పెరుగుదల ప్రభావంతో అమెరికన్ మార్కెట్లో టెక్నాలజీ స్టాక్స్లో అస్థిరత నెలకొంది. చదవండి: చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు..! యూజర్ల దెబ్బకు ఒక్క రోజులోనే లక్షన్నర కోట్లు లాస్ -
ఫేస్బుక్కు గట్టి షాకిచ్చిన యూజర్లు..! దెబ్బకు ఒక్క రోజులోనే లక్షన్నర కోట్లు..!
ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును నమోదుచేసుకుంది. ఒక్కరోజులోనే మెటా షేర్లు 20 శాతం తగ్గి సుమారు రూ. 200 బిలియన్ డాలర్ల నష్టాలను మూటగట్టుకుంది. భారీ షాకిచ్చిన యూజర్లు..! సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్కు యూజర్లు గట్టి షాకిచ్చారు. ఫేస్బుక్ 18 ఏళ్ల చరిత్రలో తొలిసారి రోజువారీ యూజర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో మెటా షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. టిక్టాక్, యూట్యూబ్ నుంచి గణనీయమైన పోటీ రావడంతో మెటా గడిచిన త్రైమాసికంలో భారీ నష్టాలను మూటకట్టుకుంది. మెటా మార్కెట్ విలువలో ఏకంగా 200 బిలియన్ డాలర్లు ఇట్టే ఆవిరయ్యాయి. మరోవైపు ట్విటర్, పిన్ట్రస్ట్, స్నాప్ చాట్ షేర్లు కూడా నేల చూపులు చూశాయి. కొంపముంచిన వివాదాలు..! గత ఏడాది మెటా సీఈవో జుకర్బర్గ్కు అంతగా కలిసి రాలేదు. అనేక వివాదాలలో చిక్కుకొని తీవ్రంగా సతమతమయ్యాడు మార్క్. ఫేస్బుక్ వచ్చిన ఆరోపణలతో పేరెంట్ కంపెనీ పేరును మెటాగా మార్చుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గత ఏడాది ఫేస్బుక్పై వచ్చిన తీవ్ర ఆరోపణలు యూజర్లపై భారీగానే ప్రభావం చూపింది. మెటా క్యూ 4 అంచనాల్లో యూజర్ల సంఖ్య 1.95 బిలియన్లుగా ఫేస్బుక్ పేర్కొంది. సుమారు రెండు మిలియన్ల మంది డెయిలీ యూజర్లను ఫేస్బుక్ కోల్పోయింది. చదవండి: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన విమానం.. కేవలం గంటలో! -
జుకర్బర్గ్కు భారీ దెబ్బ..! తగ్గేదేలే అన్నాడు...ఇప్పుడు పూర్తిగా అమ్మేసే పరిస్థితి..!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై నెలకొన్న ఆదరణను క్యాష్ చేసుకునేందుకుగాను మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ కూడా భారీ ప్రణాళికలను రచించాడు. స్వంత క్రిప్టోకరెన్సీని నిర్మించాలనే జుకర్బర్గ్ ప్రతిష్టాత్మకమైన ప్రణాళిక పూర్తిగా నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పడు పూర్తిగా అమ్మేసే పరిస్థితి..! బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం...డైమ్ డిజిటల్ కరెన్సీ అభివృద్ధిని పర్యవేక్షిస్తోన్న డైమ్ (Diem) అసోసియేషన్కు చెందిన ఇన్వెస్టర్ల మూలధనాన్ని తిరిగి ఇచ్చేందుకు కంపెనీ సిద్దమైందని పేర్కొంది. అంతేకాకుండా ఈ సంస్థ ఆస్తుల విక్రయం కూడా పరిశీలనలో ఉందని తెలిపింది. ఇందులో పనిచేసిన ఇంజనీర్ల కోసం కొత్త గమ్యాన్ని కనుగొనడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని బ్లూమ్బెర్గ్ పేర్కొంది. ఈ విషయంపై డైమ్ అసోసియేషన్ ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ఈ వ్యవహారంపై మెటా కూడా స్పందించలేదు. యూఎస్ కాంగ్రెస్కు ఎదురెళ్లి మరీ..! జుకమ్ బర్గ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రిప్టోకరెన్సీ ప్రాజెక్ట్ను ఒకానొక సమయంలో యూఎస్ కాంగ్రెస్ ముందు సమర్థించుకున్నాడు. స్వంత క్రిప్టోకరెన్సీ విషయంలో మార్క్ వెనకడుగు వేసేదిలేదంటూ మందుకు వెళ్లాడు. ఇప్పుడు అది కాస్త బెడిసి కొట్టింది. వారి ఒత్తిడి కారణంగానే..! డైమ్ అసోసియేషన్లో జుకర్బర్గ్కు చెందిన మెటా సంస్థ మూడింట ఒక వంతు వాటాలను కల్గి ఉంది. మిగిలినది ఆండ్రీసెన్ హోరోవిట్జ్, యూనియన్ స్క్వేర్ వెంచర్స్, రిబ్బిట్ క్యాపిటల్ వంటి అసోసియేషన్ సభ్యులు భాగస్వాములుగా ఉన్నారు. జుకర్బర్గ్ స్వంత క్రిప్గోకరెన్సీని జూన్ 2019లో మొదటిసారిగా ప్రకటించినప్పటి నుంచి క్రిప్టోప్రాజెక్టు పూర్తిగా చిక్కుల్లో పడిపోయింది. ఆ సమయంలో డైమ్ డిజిటల్ కరెన్సీకి లిబ్రా అని నామకరణం కూడా చేశారు. యూఎస్ సెంట్రల్ బ్యాంకర్లు, రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా లిబ్రా డిజిటల్ కరెన్సీ పూర్తిగా నిలిచిపోయే అవకాశాలు ఏర్పాడయని సమాచారం. చదవండి: పాలపుంతలోని ఆ మిస్టరీ ఏంటబ్బా? 18 నిమిషాలకొకసారి రేడియో తరంగాలు, చేధించే పనిలో రీసెర్చర్లు -
రూ.22వేల కోట్ల ఫైన్ ! జుకర్ బర్గ్ ఒక్కో యూజర్కు తలా రూ.5వేలు ఇస్తారా!!
ఫేస్బుక్ (మెటా) అధినేత మార్క్ జుకర్ బర్గ్కు బ్యాడ్ టైమ్ నడుస్తోందా? ప్రస్తుతం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల నుంచి బయటపడాలంటే జుకర్ బర్గ్ తన ఆస్తుల్ని అమ్ముకోవాల్సిందేనా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. యూకే నిబంధనల విరుద్దంగా జుకర్బర్గ్ ప్రయత్నిస్తున్నారంటూ..ఫేస్బుక్కు వ్యతిరేకంగా యూకేలో రూ.22,990 కోట్ల ఫైన్ కేసు నమోదైంది. ఫేస్బుక్ తన ఆధిపత్యంతో దుర్వినియోగానికి పాల్పడిందనే ఆరోపణలపై యూకేలో 3.1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 22,990 కోట్లు) క్లాస్ యాక్షన్ దావాను ఎదుర్కొంటోంది. కాంపటీషన్ లా ఎక్స్పర్ట్ డాక్టర్ లిజా లోవ్డాల్ గోర్మ్సెన్ 'యూకే కాంపిటీషన్ లా ట్రిబ్యూనల్'లో ఫేస్బుక్పై క్లాస్ యాక్షన్ దావా వేశారు. 2015 - 2019 మధ్యకాలంలో ఫేస్బుక్ తన 44 మిలియన్ల యూకే వినియోగదారుల డేటాను చోరీకి పాల్పడిందని, తద్వారా బిలియన్ల ఆదాయాన్ని గడించేందుకు ఆ డేటా దోహదం చేసిందని స్పష్టం చేశారు. కాబట్టే యూజర్లకు ఫేస్బుక్ పరిహారం చెల్లించాలని దావాలో పేర్కొన్నారు. ఈ కేసులో ఫేస్బుక్ దుర్వినియోగానికి పాల్పడిందనే తేలితే దాదాపు 44 మిలియన్ల యూకే ఫేస్బుక్ యూజర్లకు ఒక్కొక్కరికి 68 డాలర్లు (సుమారు రూ.5,000) చెల్లించాల్సి ఉంటుందని ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాల్ని ప్రచురించాయి. 17ఏళ్ల క్రితం స్థాపించిన ఫేస్బుక్ కుటంబ సభ్యులు,స్నేహితులు ఆన్లైన్లో కలుసుకునేందుకు అనువైన వేదికగా మారింది. అయినప్పటికీ, ఫేస్బుక్లో మరో చీకటి కోణం దాగి ఉంది. ఇది సాధారణ యూకే ప్రజల వ్యక్తిగత డేటాను దొంగిలించి..వారిపై అన్యాయమైన నిబంధనలు, షరతులను విధిస్తూ మార్కెట్లో తన ఆధిపత్యంతో ఫేస్బుక్ దుర్వినియోగానికి పాల్పడింది. ఫేస్బుక్ ద్వారా యూకే యూజర్ల డేటాను దొంగిలించినందుకు 44 మిలియన్ల యూకే యూజ్లరకు నష్టపరిహారం కోసం ఈ కేసు వేస్తున్నట్లు గోర్మ్సెన్ తెలిపారు. కాగా డాక్టర్ గోర్మ్సెన్ బ్రిటిష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ కంపారిటివ్ లా (బీఐఐసీఎల్)లో సీనియర్ రీసెర్చ్ ఫెలో, కాంపిటీషన్ లా ఫోరమ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. చదవండి: జుకర్ బర్గ్ను వెంటాడుతున్న యూకే, అమ్ముతావా? లేదా? -
పక్కన లేకున్నా.. ‘నన్ను బలవంతంగా వాటేసుకుని..’!!
Woman claims she was virtually groped in Meta VR metaverse: లైంగిక వేధింపులు-మీటూ ఉద్యమం ద్వారా విస్తృత చర్చ జరిగిన తీరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ రంగం కూడా ఇందుకు మినహాయింపు కాదనే విషయంపై స్పష్టత వచ్చింది కూడా మీటూ ద్వారానే!. అయితే వాస్తవిక ప్రపంచంలోనే కాదు.. వర్చువల్ ప్రపంచంలోనూ ఇలాంటి అనుభవాలు తప్పవని, పైగా అవి మరింత ఆందోళనకరంగా ఉంటాయనే విషయం తాజాగా ఓ ఘటన ద్వారా రుజువైంది. వర్చువల్రియాలిటీ (VR), అగుమెంటెడ్ రియాలిటీల(AR)ల సంకరణ కలయికగా రాబోతున్న టెక్నాలజీనే ‘మెటావర్స్’. ఇదొక ఒక 3డీ వర్చువల్ ప్రపంచం. వ్యక్తిగతంగా పక్కపక్కన లేకున్నా.. భౌతిక ప్రపంచంలో చేయలేని పనులను కలిసి చేయగలగడం మెటావర్స్ ప్రపంచ ప్రత్యేకత. వాస్తవానికి కార్పొరేట్ రంగం కోసం పుట్టుకొచ్చిన ఈ టెక్నాలజీని.. దాదాపు అన్నింటా అన్వయింపజేయాలని టెక్ దిగ్గజాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో మెటావర్స్ యాప్ బేటా వెర్షన్ టెస్టింగ్లో భాగంగా మెటా కంపెనీ(ఫేస్బుక్) హోరిజోన్ వరల్డ్స్ ఫీచర్ను పరిశీలిస్తోంది. ఇందులో పని చేస్తున్న ఓ టెస్టర్కు పాపం చేదు అనుభవం ఎదురైంది. మెటా కంపెనీలో పని చేస్తున్న ఆ టెస్టర్ అవతార్(కార్టూన్ తరహా రూపం)ను ఓ ఆగంతకుడు బలవంతంగా వాటేసుకున్నాడట. అక్కడితో ఆగకుండా అసభ్యంగా ప్రవర్తించాడట. అఘాయిత్యానికి పాల్పడే సమయంలో తాను భరించలేక.. వెంటనే హెడ్సెట్ను తొలగించినట్లు ఆమె వెల్లడించింది. పైగా ఈ ఘటనపై ఫేస్బుక్ గ్రూప్కి ఆమె రిపోర్ట్ చేయడంతో పాటు వర్జ్ వేదికగా ఆ చేదు అనుభవాన్ని పంచుకుంది. ‘సాధారణ ఇంటర్నెట్-సోషల్ మీడియాలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడమే దారుణం. అలాంటిది వర్చువల్ రియాలిటీలో ఇలాంటి ఘటనలు మరింత ప్రమాదకరమని నా అనుభవంతో రుజువైంది. ఘటన జరగడం కంటే.. ఆ ఘటనకు చాలామంది మద్దతు ఇవ్వడం నన్ను ఇంకా బాధించింది. నన్ను ఒంటరిని చేశారనే భావనలోకి నెట్టేసింది ఈ అనుభవం’ అంటూ ఆమె వర్జ్ బ్లాగ్లో రాసుకొచ్చింది. దీనిపై టెక్ నిపుణులు స్పందిస్తున్నారు. మెటా ప్రపంచంలో ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఘటనే కిందటి నెల 26నే చోటు చేసుకుందట. అయితే విమర్శల నేపథ్యంలో ఈ ఘటనపై ఆలస్యంగా స్పందించింది మెటా. టెస్టర్పై జరిగిన వర్చువల్ దాడిని ఖండిస్తూ.. అపరిచితులతో జాగ్రత్త ఉండాలంటూ యూజర్లకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి వేధింపులను తట్టుకునేందుకు ‘మెటా సేఫ్జోన్ ఫీచర్’ సరిపోదనే అభిప్రాయాన్ని తామూ అంగీకరిస్తున్నట్లు పేర్కొంది కంపెనీ. అయితే ఈ విషయంలో యూజర్లకు తగిన శిక్షణ అవసరమని, వేధింపులు ఎదురైనప్పుడు అవతలి వాళ్లను బ్లాక్ చేయగలిగేలా అవగాహన ఉండాలని, ఇందుకు సంబంధించి ప్రణాళికను తాము రూపొందిస్తామని హరిజోన్ వైస్ ప్రెసిడెంట్ వివేక్ శర్మ వెల్లడించారు. 2020 ప్యూ రీసెర్చ్ పోల్ ప్రకారం.. ఆన్లైన్ వేధింపుల ఘటనలు(ఆడామగా తేడా లేకుండా బాధితులు) 25 శాతం పైగా పెరిగాయి. భౌతిక దాడుల బెదిరింపులు, వెంబడించడం, పదే పదే వేధింపులకు గురి చేయడం లాంటి ఘటనలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ ఉదంతాలు మానసికంగా కుంగదీస్తున్నాయి. ఇందులో వీఆర్ సంబంధిత వేధింపులు సైతం ఉండడం కొసమెరుపు. చదవండి: టెక్ దిగ్గజం మెటా(ఫేస్బుక్)కు భారీ జరిమానా! -
మెటా మొట్టమొదటి ఆఫీస్ భారత్లోనే..
గురుగ్రామ్: ఆసియాలోనే అతిపెద్ద కేంద్రంగా పరిగణిస్తున్న కార్యాలయాన్ని ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతంలో మెటా (గతంలో ఫేస్బుక్) బుధవారం ప్రారంభించింది. ఫేస్బుక్ కంపెనీ మెటాగా పేరు మార్చేసుకున్న తర్వాత ప్రారంభించిన మొదటి ఆఫీస్ ఇదే కావడం విశేషం. ఇది సీ ఫైన్(C-FINE) కేంద్రానికి వేదిక కానుంది. తద్వారా వచ్చే మూడేళ్లలో భారత్లోని కోటి మంది చిన్న వ్యాపారులకు, 2,50,000 మంది ఆవిష్కర్తలకు నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నట్టు మెటా ప్రకటించింది. 1.3 లక్షల చదరపు అడుగులతో, ఆరు ఫ్లోర్ల బిల్డింగ్తో ఈ కార్యాలయం.. అమెరికాలోని మెలానో పార్క్లో సంస్థ ప్రధాన కార్యాలయంను పోలి ఇది ఉండడం గమనార్హం. ఇక మెటా(ఫేస్బుక్ కంపెనీ) 2010లో హైదరాబాద్లో మొదటి కార్యాలయాన్ని ప్రారంభించడం తెలిసిందే. ‘‘భారత్ ఫేస్బుక్కు మాత్రమే అతిపెద్ద కేంద్రంగా లేదు. వాట్సాప్, ఇన్స్ట్రాగామ్కూ కీలకమైన దేశంగా ఉంది. భారత్లో మా అతిపెద్ద బృందానికే కాకుండా, బయటి ప్రపంచానికీ ఇది కేంద్రంగా ఉంటుంది’’ అని ఫేస్బుక్ (మెటా) వైస్ ప్రెసిడెంట్, ఎండీ అజిత్ మోహన్ తెలిపారు. దేశంలో వాట్సాప్ను 53 కోట్ల మంది, ఫేస్బుక్ను 41 కోట్ల మంది, ఇన్స్ట్రాగామ్ను 21 కోట్ల మంది వినియోగిస్తున్నట్టు అంచనా. చదవండి: ఫేస్బుక్కు షాక్.. 10 లక్షల కోట్లకు దావా వేసిన రొహింగ్యాలు -
రూ.25వేల కోట్లు దానం చేసిన జుకర్బర్గ్ దంపతులు
వాషింగ్టన్: మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, అతని భార్య ప్రిసిల్లా ఛాన్ మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. వివిధ వ్యాధులకు సంబంధించి లోతైన శాస్త్రీయ పరిశోధనలకోసం తమ స్వచ్ఛంద సంస్థ చాన్ జుకర్బర్గ్ ఇనిషియేటివ్ (సీజెడ్ఐ)ద్వారా రెండున్నర లక్షల కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తొలుత రూ.25 వేల కోట్ల విరా ళాలు ఇస్తామని పేర్కొన్నారు. రానున్న పదేళ్లలో వైద్యరంగంలో నూతన పరిశోధనలు, కృత్రిమ మేథ మీద పనిచేసేందుకు హార్వర్డ్ యూనివర్సిటీలో నెలకొల్పుతున్న విద్యాసంస్థ కోసం మొదట రూ.3 వేల770 కోట్లు (500 మిలియన్ డాలర్లు) అందజేస్తామని, మరో పదిహేనేళ్లపాటు సంస్థకు నిధులు అందుతాయని సీజెడ్ఐ ప్రతినిధి జెఫ్ మెక్గ్రెగర్ తెలిపారు. ఆ సంస్థకు జుకర్బర్గ్ తల్లి కరేన్ కెంప్నెర్ జుకర్బర్గ్ పేరు పెట్టనున్నారు. ఇక రూ.4,500కోట్ల నుంచి రూ.6.7వేల కోట్ల వరకు సీజెడ్ఐలోని బయోమెడికల్ ఇమేజింగ్ ఇనిస్టిట్యూట్కు అందజేయనున్నట్లు తెలిపారు. ఇక మరో వంద కోట్ల రూపాయలను చాన్ జుకర్బర్గ్ బయోహబ్ నెట్వర్క్కు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. -
జుకర్ బర్గ్ను వెంటాడుతున్న యూకే, అమ్ముతావా? లేదా?
వేగంగా డబ్బులు సంపాదించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ కథ అడ్డం తిరిగినప్పుడు చేసిన పాపాలకు ముసుగేసే టైమ్ దొరక్కపోవచ్చు. కష్టపడకుండా వచ్చిన సొమ్ము కాపాడుకోలేకపోవచ్చు' అని నిరూపిస్తుంది ఫేస్బుక్ (మెటా) ఉదంతం. ఫేస్బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్ విజిల్ బ్లోవర్గా మారి..ఫేస్బుక్ మీద సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో జుకర్బర్గ్కు పెద్ద దెబ్బ తగిలింది. ఫేస్బుక్ను అడ్డం పెట్టుకొని జుకర్ సంపాదించిన సంపద అంతా.. ఇప్పుడు ఆయా కేసులు నుంచి తప్పించుకునేందుకు ఖర్చు చేస్తున్నారు. పైగా ఫేస్బుక్ పేరు మెటా గా మార్చి లక్షల కోట్ల నష్టాల్ని చవిచూశారు. ఇప్పుడు అదే ఫేస్బుక్కు చెందిన జిఫైని అమ్మాల్సిన పరిస్థితి తలెత్తింది. కాదు కూడదు అంటే జుకర్పై మరిన్ని చర్యలు తీసుకునేందుకు యూకే ప్రభుత్వం సిద్ధమైంది. జుకర్ ఏడాదిన్నర క్రితం యూకేకి చెందిన జిఫై (Graphics Interchange Format) మేకింగ్, షేరింగ్ సంస్థను కొనుగోలు చేశారు. ఆ సంస్థను ఫేస్బుక్ అమ్మేయాలని యూకేకి చెందిన రెగ్యులేటరీ సంస్థ సీఎంఏ (Competition and Markets Authoirty) జుకర్కు ఆదేశాలు జారీ చేసింది. కానీ అందుకు జుకర్ ఒప్పుకోలేదు. దీంతో బ్రిటన్ రెగ్యులేటరీ ఫేస్బుక్పై సుమారు 50.5 మిలియన్ జీబీపీ (బ్రిటిష్ పౌండ్లు) (సుమారు రూ. 520 కోట్లు) జరిమానా విధించింది. ఇప్పుడు ఇదే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. జిఫైని అమ్మాలని హెచ్చరించింది. ఒకవేళ్ల జుకర్ కాదంటే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సీఎంఏ సిద్ధమైంది. జిఫై అమ్మితే ఎవరికి లాభం ఒకవేళ జుకర్బర్గ్ జిఫైని అమ్మేస్తే ఫేస్బుక్ ఆధిపత్యాన్ని నిరోధించవచ్చని ప్లాన్ వేసింది. సీఎంఏ ప్రకారం జిఫైని ఫేస్బుక్ అమ్మేస్తే ఆ సోషల్ ప్లాట్ ఫాం నుంచి ఇతర ప్లాట్ఫామ్లను చేసే యాక్సెస్ను ఫేస్బుక్కు పరిమితం చేయొచ్చని తెలుస్తోంది. అంతేకాదు జిఫై అమ్మితే యూకేలోని $9.4 బిలియన్ల డిస్ప్లే యాడ్ మార్కెట్ను ప్రభావం చూపుతుందోనని ఫేస్బుక్ భావిస్తుందని సీఎంఏ పేర్కొంది. చదవండి: బిర్యానీ కోసం టెంప్ట్ అయ్యాడు, అలా ఆర్డర్ పెట్టి..ఇలా పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు -
అఖిలేశ్ యాదవ్పై పోస్టు.. మార్క్ జుకర్బర్గ్పై కేసు!
మెటా కంపెనీ (ఫేస్బుక్) సీఈవో మార్క్ జుకర్బర్గ్పై ఉత్తర ప్రదేశ్లో కేసు నమోదు అయ్యింది. సమాజ్వాదీ పార్టీ ఛీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్కు వ్యతిరేకంగా చేసిన ఓ పోస్ట్ వివాదాస్పదం కావడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. కన్నౌజ్ జిల్లాలోని ఓ న్యాయస్థానంలో పరువుకు భంగం కలిగించే ప్రయత్నం కింద కేసు నమోదు అయ్యింది. జుకర్బర్గ్తో పాటు 49 మంది పేర్లను ఇందులో చేర్చినట్లు తెలుస్తోంది. జుకర్బర్గ్కు ఆ పోస్ట్కి ఎలాంటి సంబంధం లేకున్నా.. ఆయన సీఈవోగా ఉన్న ఫ్లాట్ఫామ్లో ఆ పోస్ట్ పడడం, అందులో అఖిలేష్కు వ్యతిరేకంగా అభ్యంతరకరంగా కామెంట్లు పడడంతోనే ఎఫ్ఐఆర్లో జుకర్బర్గ్ పేరు చేర్చినట్లు తెలుస్తోంది. పీటీఐ రిపోర్ట్ ప్రకారం.. కన్నౌజ్ జిల్లా సారాహతి గ్రామానికి చెందిన అమిత్ కుమార్ అనే వ్యక్తి ఈ కేసును దాఖలు చేశాడు. అఖిలేష్ ఇమేజ్ను దెబ్బ తీసేందుకే అలాంటి పోస్ట్ను చేశారని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలంటూ అమిత్ కోర్టులో దాఖలు చేసిన అభ్యర్థన పిటిషన్లో పేర్కొన్నాడు. అంతకు ముందు పోలీసులకు ఈ వ్యవహారంపై పిటిషన్ అందజేసినా స్పందన లేదని కుమార్ కోర్టుకు వెల్లడించాడు. ‘బువా బాబువా’ పేరుతో రన్ అవుతున్న ఓ పేస్బుక్ పేజీలో అఖిలేష్ యాదవ్తో పాటు బీఎస్పీ ఛీఫ్ మాయావతిని ఉద్దేశిస్తూ సెటైరిక్ పోస్టులు పడుతుంటాయి. అయితే ఈ పిటిషన్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన పోలీసులు ఈ కేసు నుంచి జుకర్బర్గ్ పేరును తప్పించారు. పేజీ అడ్మిన్ని ప్రశ్నించి దర్యాప్తను వేగవంతం చేస్తామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇక ఈ పిటిషన్ ఆధారంగా కేసు నమోదు చేయాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. చదవండి: పర్మిషన్ లేకుండా ఆ ఫొటోలు పెడితే ఎలా? -
Parag Agrawal: సీఈవోగా చిన్నవయస్సే! కానీ..
Twitter Parag Agrawal Youngest CEO In Top 500 Companies: మరో భారతీయుడు అత్యున్నత పదవిలో కొలువు దీరాడు. పరాగ్ అగర్వాల్ పేరును సోమవారం సోషల్ మీడియా జెయింట్ ‘ట్విటర్’కు సీఈవోగా ప్రకటించారు. ఈ ఫీట్తో సీఈవో హోదాలో పరాగ్ మరో అరుదైన ఘనత సాధించాడు!. ఎస్ అండ్ పీ(అమెరికా స్టాక్ మార్కెట్ ఇండెక్స్) టాప్-500 కంపెనీల్లో యంగెస్ట్ సీఈవో ఘనత Parag Agrawal సాధించినట్లు తెలుస్తోంది. మెటా (గతంలో ఫేస్బుక్) సీఈవో మార్క్ జుకర్బర్గ్ వయసు 37 ఏళ్లు. పరాగ్ వయసు కూడా 37 ఏళ్లే! అని రిపోర్టులు చెప్తున్నాయి. కానీ, జుకర్బర్గ్(మే 14, 1984) పరాగ్ కంటే చిన్నవాడంట!. అయినప్పటికీ ఇద్దరి వయసు ఒకటే కావడంతో యంగెస్ట్ సీఈవో హోదాలో ఈ ఇద్దరూ నిలిచినట్లు అమెరికా మీడియా హౌజ్లు కథనాలు వెలువరుస్తున్నాయి. విశేషం ఏంటంటే.. సెక్యూరిటీ కారణాలతో ఆయన పూర్తి ఐడెంటిటీని, ఇతర బయోడేటాను రివీల్ చేసేందుకు ట్విటర్ కంపెనీ అంగీకరించలేదు. అయితే పరాగ్ అగర్వాల్ 1984 ముంబైలో పుట్టినట్లు కొన్ని చోట్ల ప్రొఫైల్ను సెట్ చేస్తున్నారు కొందరు. సో.. అధికారికంగా ఆయన చిన్నవయస్కుడని ప్రకటన వెలువడాల్సి ఉంది. The Standard and Poor's 500(S&P 500) టాప్ 500 కంపెనీల్లో బెర్క్షైర్ హత్వే సీఈవో వారెన్ బఫెట్(95) అత్యధిక వయస్కుడిగా నిలిచారు. ఇక 500 పెద్ద కంపెనీల సీఈవో జాబితాను పరిశీలిస్తే సగటు వయసు 58 ఏళ్లుగా ఉంది. డైరెక్టర్ల వయసు సగటున 63 ఏళ్లుగా ఉంది. కానీ, విశాల కోణంలో పరిశీలిస్తే చిన్నవయసు వాళ్లు సీఈవో అర్హతలకు దూరంగానే ఉన్నారు. అయితే ఇలాంటి సోషల్ మీడియా కంపెనీలను సమర్థవంతంగా నడిపేందుకు వయసు పెద్ద ఆటంకం కాకపోవచ్చని స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ డేవిడ్ లార్కర్ అభిప్రాయపడుతున్నారు. ట్విటర్ ఫౌండర్, సీఈవో జాక్ డోర్సే(45).. ఫైనాన్షియల్ సర్వీస్-డిజిటల్ పేమెంట్ కంపెనీ ‘స్క్వేర్’కు సైతం సీఈవో బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే రెండింటి బాధ్యతలు చేపట్టడం కష్టతరమవుతున్న తరుణంలో ఆయన ట్విటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇక పరాగ్కు పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించాక.. జాక్ డోర్సే ట్విటర్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవచ్చనే అంటున్నారు. కానీ, 2022 వరకు(తన కాంట్రాక్ట్ ముగిసేవరకు) బోర్డులో మాత్రం మెంబర్గా కొనసాగనున్నాడు. -
జుకర్ బర్గ్పై మరో పిడుగు, ఫ్రాన్సెస్ హౌగెన్ ఎంత పని చేశావమ్మా..!
ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్కు భారీ షాక్ తగిలింది. ఒహాయో అటార్నీ జనరల్ డేవిడ్ యోస్ట్ మెటాపై (ఫేస్బుక్) దావా వేశారు. ఫేస్బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్ విజిల్ బ్లోవర్గా మారి..ఫేస్బుక్ మీద సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె చేస్తున్న ఆరోపణల కంటే ఇప్పుడు ఒహాయో అటార్నీ జనరల్ వేసిన దావా చాలా ప్రమాదకరమని న్యాయనిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగి పెట్టిన చిచ్చుకంటే ఇదే పెద్దది ఓహియో అటార్నీ జనరల్ మెటాపై పరువు నష్టం దావా వేశారు. ఫెడరల్ సెక్యూరిటీల చట్టాన్ని ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. అంతేకాదు ఒహాయో పబ్లిక్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ సిస్టమ్, ఫేస్బుక్ పెట్టుబడిదారుల తరపున ఈ కేసు దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగిగా మారిన విజిల్బ్లోయర్ ఫ్రాన్సిస్ హౌగెన్ మొదట వాల్ స్ట్రీట్ జర్నల్కు అంతర్గత పత్రాలను లీక్ చేశారు. ఆ లీక్ చేసిన డాక్యుమెంట్లు కారణంగా పబ్లిక్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ సిస్టమ్, ఫేస్బుక్ పెట్టుబడిదారులు 100 బిలియన్ల మార్కెట్ వాటాను కోల్పోయినట్లు డేవిడ్ యోస్ట్ చెప్పారు. అయితే ఈ దావా మార్క్ జుకర్బర్గ్లాంటి వ్యక్తుల గురించి కాదని, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యవస్థలపై పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఈ దావాతో పెన్షన్ ఫండ్ నష్టాలను తిరిగి పొందవచ్చని, అలాగే ప్రజలను తప్పుదోవ పట్టించకుండా ఉండటానికి కంపెనీ మార్పులు చేస్తుందని తాను ఆశిస్తున్నట్లు యోస్ట్ ప్రకటనలో పేర్కొన్నారు. ఫేస్బుక్ పై కఠిన చర్యలు తప్పవ్ డేవిడ్ యోస్ట్ చేసిన కేసు అంశంపై మెటా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఫేస్బుక్పై నమోదైన ఫిర్యాదుల కంటే యోస్ట్ వంటి రాష్ట్ర అటార్నీ జనరల్ వేసిన కేసు ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఎనలిస్ట్ బ్లెయిర్ లెవిన్ చెప్పారు. కోర్టు మెటాను మరిన్ని అంతర్గత పత్రాలను పబ్లిక్ చేయమని ఆదేశించే అవకాశం ఉందని, తద్వారా ఫేస్బుక్కు మరిన్ని చిక్కులు తప్పవని లెవిన్ చెప్పారు. గతంలోనే యోస్ట్ లేఖ 40 మంది రాష్ట్ర అటార్నీ జనరల్లలో ఒకరైన యోస్ట్ గతంలో ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బెర్గ్కు లేఖ రాశారు. పిల్లల కోసం డిజైన్ చేసే ఇన్స్టాగ్రామ్ వెర్షన్పై ఆంక్షలు విధించాలని జుకర్ బెర్గ్కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. -
మార్క్ జుకర్బర్గ్ నువ్వు ఏం చేస్తున్నావ్? ఫేస్బుక్పై ఫైర్!
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ లబ్ధి కోసం ఫేస్బుక్, వాట్సాప్ల ద్వారా విషప్రచారం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కొత్త చట్టాల పేరు చెప్పి సోషల్ మీడియా దిగ్గజ కంపెనీలను ఒత్తిడి పెంచి విద్వేష పూరిత ప్రచారం చేస్తోందని ఆరోపించింది. ఈ విషయంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐసీసీ టెక్నాలజీ సెల్ చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి, రోహన్గుప్తాలు మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజస్వామ్యానికి ఫేస్బుక్ కారణంగా ముప్పు ఏర్పడుతోందని కాంగ్రెస్ నేతలు విమర్షించారు. ఫేస్బుక్, వాట్సాప్ వేదికగా విష ప్రచారం జరుగుతుంటే ఎందుకు అడ్డుకోవడం లేదంటూ మార్క్ జూకర్బర్గ్ను ప్రశ్నించారు. విద్వేష పూరిత కంటెంట్ను గుర్తించి, వడపోసే కార్యక్రమానికి ఎందుకు బడ్జెట్ తగ్గిస్తూ వస్తున్నారని మార్క్ను అడిగారు. ఫేస్బుక్, వాట్సాప్లలో జరుగుతున్న ద్వేష పూరిత ఫేక్ న్యూస్ ప్రచారంపై అంతర్గత విచారణ చేపట్టాలని కోరుతూ మార్క్ జుకర్బర్గ్కి లేఖ రాశామన్నారు. ఫేస్బుక్ యూజర్లు తమ జీవితకాలంలో చేసే మరణించిన వ్యక్తుల చిత్రాల కంటే ఎక్కువ పుల్వామా ఎటాక్ మృతుల చిత్రాలను ఫేస్బుక్లో చూశారంటూ ఆరోపించారు. వాట్సాప్లో కూడా ఇదే జరగుతోందన్నారను. బీజేపీ ఉద్దేశ పూర్వకంగానే సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లను ఉపయోగించుకుని దేశంలో ద్వేషం పెంచుతుందన్నారు. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాలన్నారు. -
'ఫోటో' తెచ్చిన చిక్కులు..ఫేస్బుక్ పై మరో బాంబు..!
Phhhoto Filed an Antitrust Suit Against Meta: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ (మెటా)కు భారీ షాక్ తగిలింది. ఫేస్బుక్పై ఫోటో యాప్ సంస్థ 'ఫోటో'(Phhhoto) కోర్ట్ను ఆశ్రయించింది. తమ యాప్కు చెందిన క్లోనింగ్ ఫీచర్ ను కాపీ కొట్టి ఫేస్బుక్..ఇన్ స్ట్రాగ్రామ్లో వినియోగిస్తుందంటూ కోర్ట్లో ఫిర్యాదు చేసింది. అంతేకాదు తమకు ఫేస్బుక్ అధినేత మార్క్జుకర్ బర్గ్ నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేస్తోంది. దీంతో వరుస పరిణామాల నేపథ్యంలో తాజాగా ఫోటో యాప్ సైతం కోర్ట్లో ఫిర్యాదు చేయడం..ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ పరిస్థితి 'మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు' అయ్యిందని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫోటో యాప్ ఫోటో యాప్ యూజర్లు ఒకే పాయింట్-అండ్-షూట్ బరస్ట్లో ఐదు ఫ్రేమ్లను క్యాప్చర్ చేయడానికి, చిన్న జిఫ్ వంటి వీడియోల్ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే తన ఫీచర్ను ఫేస్బుక్ కాపీకొట్టి ఇన్స్టాగ్రామ్లో పాపులర్ అయిన 'బూమ్రాంగ్' ఫీచర్లో వినియోగిస్తుందని అమెరికన్ డిస్ట్రిక్ కోర్ట్కు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు ఇన్స్ట్రాగ్రామ్లో వినియోగిస్తున్న ఫీచర్ ఎంత పాపులర్ అయ్యిందో మాకు బాగా తెలుసు. కానీ ఈ ఫీచర్ ఆలోచన ఫేస్బుక్ది కాదు. ఫేస్బుక్..ఫోటో ఫీచర్ను కాపీ చేసి బూమ్ రాంగ్ గా ఇన్ స్ట్రాగ్రామ్ యూజర్లకు అందించింది. అదే సమయంలో దివెర్జ్ కథనం ప్రకారం..ఇన్స్ట్రాగ్రామ్ ఏపీఐ నుంచి ఫోటోని ఫేస్బుక్ బ్లాక్ చేసిందని కంపెనీ ఆరోపిస్తుంది. ఫేస్బుక్ ఎవరిని ఎదగనీయదు ఫేస్బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ కారణంగా తన సంస్థ బిజినెస్ పరంగా భారీగా దెబ్బతిన్నదని, పెట్టుబడులు పెట్టే అవకాశాల్ని నాశనం చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధులు మండిపడ్డారు. ఫేస్బుక్కు పోటీగా వస్తున్న ఏ సోషల్ మీడియా నెట్ వర్క్లను ఎదగనీయదని, ఫేస్బుక్ తీరు వల్లే ఫోటో నష్టపోయిందని ఫోటో ప్రతినిధులు కోర్ట్కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2017లో షట్ డౌన్ ఫోటో యాప్ 2014లో ప్రారంభమైంది. కానీ యూజర్లను ఆకట్టుకోవడంలో విఫలం కావడంతో ఆ సంస్థ ప్రతినిధులు 2017లో షట్డౌన్ చేశారు. అయితే ఈ ఫోటో యాప్ ప్రారంభంలో నెలవారి యూజర్లు 3.7 మిలియన్ల మంది వినియోగించుకున్నారని, వారిలో బియాన్స్, జో జోనాస్, క్రిస్సీ టీజెన్, బెల్లా హడిద్ లు ఉన్నట్లు తెలిపారు. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్, ఇన్స్టాగ్రామ్ మాజీ సీఈవో కెవిన్ సిస్ట్రోమ్ యాప్ను డౌన్లోడ్ చేసి దాని ఫీచర్లను పరిశీలించినట్లు నివేదిక పేర్కొంది. కాగా, ఫోటో సంస్థ ప్రతినిధులు ఫేస్బుక్ పై ఫిర్యాదు చేయడంపై ఆ సంస్థ ప్రతినిధులు స్పందించారు. ఫోటో అర్ధం లేని ఆరోపణలు చేస్తుందని, కోర్ట్లో వేసిన పిటిషన్ పై న్యాయమైన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. చదవండి: జుకర్ బర్గ్పై మరో పిడుగు..! ఈ సారి మైక్రోసాఫ్ట్ రూపంలో..! -
జుకర్ బర్గ్పై మరో పిడుగు..! ఈ సారి మైక్రోసాఫ్ట్ రూపంలో..!
ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్కు మైక్రోసాఫ్ట్ నుంచి మరో ఎదురు దెబ్బ తగలనుంది. ఇప్పటికే జుకర్ బర్గ్ కొత్త టెక్నాలజీ మెటావర్స్ పై పనిచేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మైక్రోసాఫ్ట్ సైతం ఈ మెటావర్స్ పై పనిచేస్తున్నట్లు ప్రకటించింది. ఈ టెక్నాలజీని ఫేస్బుక్ కంటే తామే ముందుగా ప్రపంచానికి పరిచయం చేస్తామని చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది. జూకర్ బర్గ్.. నువ్వు దిగిపో గత కొంత కాలంగా జరుగుతున్న పరిణామలతో జుకర్ బర్గ్కు డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యిందని, ప్రస్తుతం ఆయనకు ఎదురవుతున్న సమస్యలపై టెక్ నిపుణులు చెబుతున్న మాట. నిన్న ఫేస్బుక్ సీఈఓగా పనికి రాడని, ఆ పదవి నుంచి దిగిపోవాలని ఫేస్బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హాగెన్ వ్యాఖ్యానించింది. లేదంటే ఫేస్బుక్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అదే సమయంలో ఫేస్బుక్ పేరును మెటాగా మార్చడంతో అదికాస్త వివాదం అయ్యింది. జుకర్ వాడిన 'మెటా' లోగో తమదేనంటూ జర్మనికి చెందిన 'ఎం-సెన్స్ Migräne' ట్వీట్ చేసింది. లోగో, ఫేస్బుక్ మాతృ సంస్థ లోగో ఒకేవిధంగా ఉన్నాయంటూ ట్వీట్లో పేర్కొంది. అది సర్ధుమణిగే లోపే తాజాగా టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మెటావర్స్ పై వర్క్ చేస్తున్నట్లు తెలిపింది. దీంతో జుకర్కు మరో ఎదురు దెబ్బతగిలినట్లైంది. అయితే ఈ మెటావర్స్ టెక్నాలజీ మైక్రోసాఫ్ట్ కోసం కాదని వర్చువల్ రియాలిటీ (వీఆర్), అగ్మెంటెడ్ రియాలిటీ(ఏఆర్), మిక్స్డ్ రియాలిటీ( ఎంఆర్)లను ఒకే ఫ్లాట్ ఫాం మీదికి తెచ్చే 'మైక్రోసాఫ్ట్ మెష్' కోసం అని చెప్పింది. మైక్రోసాఫ్ట్ మెష్ అంటే కరోనా కారణంగా ఈ 'వీఆర్, ఏఆర్, ఎంఆర్' టెక్నాలజీ వినియోగం బాగా పెరిగిపోయింది. అందుకే ఈ వర్చువల్ టెక్నాలజీపై వర్క్ చేస్తున్న మైక్రోసాఫ్ట్..ఇందుకోసం మైక్రోసాఫ్ట్ మెష్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగంలో వినియోగించేందుకు మెటావర్స్ ను బిల్డ్ చేస్తున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాదిలో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు ముమ్మురం చేస్తున్నట్లు వెల్లడించింది. మెటావర్స్ అంటే మెటావర్స్ అంటే ఇదొక వర్చువల్ రియాలిటీ. వర్క్ ఫ్రం హోంలో బిజీగా ఉన్న ఉద్యోగులు ఆఫీస్లో జరిగే మీటింగ్లకు హాజరు కాలేరు. అదే ఈ మెటావర్స్ టెక్నాలజీతో ఎక్కడ ఉన్నా..2డీ, త్రీడీ అవతార్ ఆకారాల్లో ఆఫీస్లో జరిగే మీటింగ్కు అటెండ్ అయ్యామనే అనుభూతిని కల్పిస్తుంది. కరోనా లాక్ డౌన్ టైమ్లో ఈ టెక్నాలజీని ఫేస్బుక్ ఇంటర్నల్గా జరిగే మీటింగ్లలో వినియోగించింది. దీన్ని పూర్తి స్థాయిలో ప్రపంచానికి అందించేందుకు 'మెటా' పేరుతో ఫేస్బుక్ అధినేత జుకర్ పనిచేస్తుండగా..మైక్రోసాఫ్ట్ సైతం ఈ మెటావర్స్ పై వర్క్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వరుస వివాదాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జుకర్కు మైక్రోసాఫ్ట్ తీసుకున్న నిర్ణయం ఎన్ని తలనొప్పులు తెచ్చిపెడుతుందోనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. చదవండి: 'ఐ కాంట్ బ్రీత్':ఫేస్బుక్ కు మరో ముప్పు..జూకర్ ఏం చేస్తారో? -
మాతృ సంస్థ పేరు మారిన మార్క్ జుకర్బర్గ్ను వీడని కష్టాలు..!
ఫేస్బుక్ మాతృ సంస్థ పేరు మారిన మార్క్ జుకర్బర్గ్ను కష్టాలు వీడటం లేదు. గతంలో కంటే ఎక్కువ విమర్శలు రావడంతో పాటు కంపెనీకి నష్టాలు కూడా వస్తున్నాయి. అక్టోబర్ 29న జరిగిన కనెక్ట్ ఈవెంట్లో ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ మాతృ సంస్థ పేరును మారుస్తున్నట్లు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మేరకు కొత్తలోగో ఆవిష్కరణ కూడా జరిగింది. తాజాగా, ఆ కొత్త లోగో మీద విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే, ఫేస్బుక్ మాతృ సంస్థ "మెటా" కొత్త లోగో వేరే కంపెనీ లోగో లాగా కనిపిస్తుంది. ఈ కొత్త లోగోపై సదురు కంపెనీ అభ్యంతరం వ్యక్తం చేసింది. జర్మనికి చెందిన కంపెనీ 'ఎం-సెన్స్ Migräne' లోగో, ఫేస్బుక్ మాతృ సంస్థ లోగో ఒకేవిధంగా ఉన్నాయి. సదురు కంపెనీ ట్విటర్ వేదికగా ఇలా రాశారు..""మా మైగ్రేన్ యాప్ లోగో నుంచి ప్రేరణ పొందిన @facebook మాకు చాలా గౌరవం ఉంది. బహుశా వారు మా డేటా గోప్యతా పద్ధతుల నుంచి కూడా ప్రేరణ పొందుతున్నట్లు తెలుస్తుంది" అని పేర్కొంది. అయితే, ఈ విషయంపై ట్విటర్లో భారీగా మిమ్స్ వర్షం కురుస్తుంది. లోగో కూడా కాపీ చేయాలా అంటూ ఫేస్బుక్ ను ఏకి పారేస్తున్నారు. 2016లో 'ఎం-సెన్స్ Migräne' యాప్ ను అభివృద్ది చేశారు. We are very honoured that @facebook felt inspired by the logo of our migraine app - maybe they’ll get inspired by our data privacy procedures as well 👀 🤓 #dataprivacy #meta #facebook pic.twitter.com/QY7cota36r — M-sense Migräne (@msense_app) October 29, 2021 (చదవండి: భారత్ దెబ్బకు చైనా భారీగా నష్టపోనుందా?) -
మార్క్ జుకర్బర్గ్పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఫ్రాన్సెస్ హౌగెన్!
ఫేస్బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్ విజిల్ బ్లోవర్గా మారిపోయి..ఫేస్బుక్ మీద సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. యూజర్ భద్రత కంటే లాభాలే ఫేస్బుక్కు పరమావధిగా మారిందని ఆమె తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా మరోసారి ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్పై ఘాటుగా విమర్శలు చేసింది. గతంలో ఫేస్బుక్పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె, మొదటిసారి బహిరంగ ప్రసంగంలో తన మాజీ బాస్ మార్క్ జుకర్బర్గ్ను సీఈఓ పదవి నుంచి దిగిపోవాలని బాంబ్ పేల్చింది. అలాగే, సంస్థ పేరు మార్చడం కంటే ఫేస్బుక్ నాయకత్వంలో మార్పును కోరుకోవాలని సూచించారు. "మార్క్ జుకర్బర్గ్ సీఈఓగా కొనసాగితే సంస్థ పరిస్థితి మారే అవకాశం లేదని నేను భావిస్తున్నాను" అని హౌగెన్ ఒక వెబ్ సమ్మిట్లో చెప్పారు. కాగా, ఒక మాజీ ఫేస్బుక్ ప్రొడక్ట్ మేనేజర్ ను జుకర్ బర్గ్ రాజీనామా చేయాలా అని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చాడు.. "బహుశా మరొకరు పగ్గాలు చేపట్టే సమయం వచ్చిందని భావించవచ్చు.. భద్రతపై ఎక్కువ దృష్టి పెట్టె వ్యక్తి వల్ల ఫేస్బుక్ తిరిగి బలంగా నిలబడే అవకాశం ఉంది" అని అన్నారు. (చదవండి: ద్విచక్ర వాహనాలు కొనేవారికి ఎస్బీఐ తీపికబురు) ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఇటీవల విమర్శలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో మాతృ సంస్థ పేరును మార్చిన విషయం తెలిసిందే. జుకర్బర్గ్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇంతకుముందు ఫేస్బుక్ కింద కొనసాగిన సామాజిక మాధ్యమాలు(ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లు) ఇకపై ‘మెటా’ కింద కొనసాగుతాయి. ‘‘ప్రస్తుత బ్రాండ్ ఇకపై మనకు కావాల్సిన సేవల అన్నింటినీ అందించలేకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో మనం భవిష్యత్తుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మన సంస్థ బ్రాడ్ పేరును మార్చాల్సి వచ్చింది’’ అని ఆయన పేర్కొన్నారు. కానీ, పేరు మార్చిన తర్వాత కూడా విమర్శలు, నష్టాలు తగ్గకపోవడంతో జుకర్బర్గ్పై ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. -
పాపం జుకర్ బెర్గ్: వేల కోట్ల నష్టం..పేరు మార్చినా..! జాతకం మారలేదు..!
ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్ బెర్గ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారు.ఫేస్బుక్ పేరు మార్చి ‘మెటా’ అంటూ ప్రచారం చేస్తున్నా ఆయన తప్పిదాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా జుకర్ బెర్గ్ వేలకోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ అందుబాటులోకి తెచ్చిన ప్రైవసీ పాలసీ వల్ల ట్విట్టర్, యూట్యూబ్ సంస్థలు 10 బిలియన్ల డాలర్లకు పైగా నష్టపోయాయి. ఆ జాబితాలో ఫేస్బుక్ కూడా చేరింది. ది వెర్జ్ కథనం ప్రకారం..యాపిల్ సంస్థ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో యాప్ ట్రాకింగ్ ట్రాన్స్పరెన్సీ(ఏటీటీ) పేరుతో కొత్త పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఈ పాలసీ వల్ల థర్డ్ యాప్స్ యాపిల్ ప్రొడక్ట్లను వినియోగించే యూజర్ల డేటాను ట్రాక్ చేయలేవు. అలా చేయాలంటే యూజర్ల పర్మీషన్ తీసుకోవాలని యాపిల్ సంస్థ కండీషన్ పెట్టింది. ఆ నిబంధనల్ని అమలు చేస్తోంది. అంతే యాపిల్ నిబంధనలపై ఫేస్బుక్ ఆగ్రహం వ్యక్తం చేసింది. I’m pretty certain #Facebook is fighting #Apple to retain access to personal data. #PID #privacy. #fullpagead #wsj pic.twitter.com/029WwaGSs0 — Dave Stangis (@DaveStangis) December 16, 2020 డేటా యాపిల్ది.. సొమ్ము చేసుకునేది ఫేస్బుక్ ఫేస్బుక్ పిక్సెల్ టూల్ సాయంతో యాపిల్ ఫ్లాట్ ఫామ్లలో యూజర్ల డేటాను సేకరించి..ఆ యూజర్ల అభిరుచులకు అనుగుణంగా ఫేస్బుక్ ఆయా సంస్థలకు చెందిన ప్రకటనలు ఇచ్చేది. ఆ ప్రకటనలే ఫేస్బుక్కు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టేవి. కానీ తాజాగా యాపిల్ అప్డేట్ చేసిన ఐఎస్ఎస్14 లలో ఫేస్బుక్ యూజర్ల డేటాను ట్రాక్ చేసుకోలేకపోతుంది. దీంతో యాడ్స్పై ఆదాయం లేక జుకర్ బెర్గ్ భారీ నష్టాల్ని చవిచూస్తున్నట్లు కొన్ని రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి. యాడ్స్ లేని కారణంగా లూట్మే, ఫేస్బుక్, స్నాప్ చాట్, య్యూట్యూబ్, ట్విట్టర్ల ఆదాయం తగ్గినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ కథనాన్ని వెలుగులోకి తెచ్చింది. సోషల్ మీడియా యాప్లు 12 శాతం ఆదాయాన్ని కోల్పోయినట్లు కథనంలో పేర్కొంది. నేను అప్పుడే చెప్పా గతేడాది కొత్త ప్రైవసీ పాలసీని అందుబాటులోకి తెస్తున్నట్లు యాపిల్ ప్రకటించింది. ఆ ప్రకటనపై జుకర్ బెర్గ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆ పాలసీపై మరోసారి స్పందించారు. కొద్ది రోజుల క్రితం ఫేస్బుక్ సీఈఓ జుకర్ బెర్గ్ మాట్లాడుతూ..యాపిల్ తెచ్చిన పాలసీ వల్ల ఫేస్బుక్తో పాటు చిరు వ్యాపారులు దెబ్బతినే అవకాశం ఉందని అన్నారు. యాపిల్ పాలసీతో యాడ్స్పై వచ్చే ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుందని గుర్తించినట్లు చెప్పారు. యాపిల్ ఐఓఎస్ పాలసీ ఫీచర్లు క్లిష్ట సమయాల్లో ప్రకటన ప్లాట్ఫారమ్లపై ఆధారపడే చిన్న వ్యాపారాలపై ప్రభావం చూపుతాయని అన్నారు. ఫేస్బుక్ సీఎఫ్ఓ డేవిడ్ వెహ్నర్ మాట్లాడుతూ..యాపిల్ ఏటీటీ అంశం సవాళ్లతో కూడుకుందని, అది వారి అంచనాలకు కాస్త విఘాతం కలిగిస్తోందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: 'ఐ కాంట్ బ్రీత్':ఫేస్బుక్ కు మరో ముప్పు..జూకర్ ఏం చేస్తారో? -
ఫేస్బుక్ మాతృ సంస్థ పేరు మార్పు వెనుక అసలు కారణం ఇది?
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ "ఫేస్బుక్, మెసెంజర్, ఇనస్టాగ్రామ్, వాట్సాప్" మాతృ సంస్థ పేరును ఫేస్బుక్ నుంచి మెటాగా మార్చిన సంగతి మనకు తెలిసిందే. ఇక పై నుంచి ఈ యాప్స్ మాతృ సంస్థను మెటాగా వ్యవహరించాల్సి ఉంటుంది అని జుకర్బర్గ్ కంపెనీ కనెక్ట్ ఈవెంట్లో ప్రకటించారు. ఈ మేరకు జుకర్బర్గ్ కనెక్ట్ ఈవెంట్లో తన కంపెనీ కొత్త పేరు, లోగోను ప్రకటించారు. నిజానికి చెప్పాలంటే పూర్తి పేరు మెటావర్స్. దీనిని సంక్షిప్తంగా మెటా అని నామకరణం చేశారు. గ్రీకు భాషలో 'మెటా' అంటే "అంతకు మించి" అని అర్ధం. అయితే, ఫేస్బుక్ పేరు మార్పు విషయంలో చాలా మంది తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు. ఇక నుంచి ఫేస్బుక్ పేరు మెటాగా మారనున్నట్లు అర్ధం చేసుకుంటున్నారు. కానీ, అది వాస్తవం కాదు. ఇప్పటి వరకు "ఫేస్బుక్, మెసెంజర్, ఇనస్టాగ్రామ్, వాట్సాప్" అన్నీ యాప్స్ కి కలిపి మాతృ సంస్థగా ఫేస్బుక్ కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు ఆ మాతృ సంస్థ పేరును "మెటా"గా జుకర్బర్గ్ ప్రకటించారు. అంటే ఇకపై మెటా మాతృ సంస్థ కింద ఫేస్బుక్, మెసెంజర్, ఇనస్టాగ్రామ్, వాట్సాప్ యాప్స్ ఉంటాయన్నమాట. అయితే ఉన్నఫలంగా ఇప్పటికిప్పుడు ఈ మార్పు ఎందుకు?. Announcing @Meta — the Facebook company’s new name. Meta is helping to build the metaverse, a place where we’ll play and connect in 3D. Welcome to the next chapter of social connection. pic.twitter.com/ywSJPLsCoD — Meta (@Meta) October 28, 2021 (చదవండి: టాటా మోటార్స్ అస్సలు తగ్గట్లేదుగా!) అసలు కారణం ఇది అక్టోబర్ 28న జరిగిన కంపెనీ కనెక్ట్ ఈవెంట్లో సీఈఓ మార్క్ జుకర్బర్గ్ పేరు మార్పు గురుంచి ఇలా మాట్లాడారు.. "భవిష్యత్తులో మన సంస్థ ఏం చేయబోతోందనే విషయాన్ని ఫేస్బుక్ అనే పదంతో నిర్వచించలేం. మన విస్తరణకు ఆ పదం చాలా చిన్నదైపోయింది. కొత్త పేరు ఫేస్బుక్ యాప్స్ అన్నింటినీ రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పటి వరకు ప్రజలకు చేరువకావడానికి అన్నీ సంస్థలు యాప్స్ ను మాత్రమే వాడుకొనేవి, భౌతికంగా దగ్గర అయ్యే విధంగా అనుభూతి కలిగించే టెక్నాలజీ లేదు. అలాంటి లోటు పూడ్చడానికి రాబోయే రోజుల్లో సంస్థ భారీ ఎత్తున చేపట్టబోయే ఆగ్యుమెంట్, వర్చువల్ రియాలటీకి ప్రతిబింబంగా ఈ మెటా నిలుస్తుంది. మనం ఎవరు, మనం భవిష్యత్తులో ఏం నిర్మించాలనుకుంటున్నాం అనేది మెటా మీనింగ్" అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ ఆధారిత సేవలకు చిరునామాగా మారాలనే లక్ష్యాన్ని మెటా నిర్దేశించుకుంది. (చదవండి: దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ ఇదే..!) మరో కారణం సీఈఓ మార్క్ జుకర్బర్గ్ మాతృ సంస్థ పేరు మార్పు విషయం గురుంచి ఇలా చెబుతున్నప్పటికీ మరోవైపు టెక్ నిపుణులు మాత్రం ఈ పేరు మార్పు వెనక ఇతర కారణాలున్నాయని చెబుతున్నారు. గత కొంత కాలంగా ఫేస్బుక్ వివాదాలు ఎదుర్కొంటోంది. ఆ గొడవలు అటు ఇటు తిరిగి వాట్సాప్ కు కూడా వ్యాపించాయి. మరో వైపు ప్రైవసీ పాలసీ విషయంలో దుమారం రేగింది. దీంతో ఆసియా దేశాల్లో ఫేస్బుక్ పై ఓ రకమైన వ్యతిరేక భావన ఏర్పడింది. మరోవైపు యూరోపియన్ దేశాలు సంస్థ మీద భారీగా జరిమానా కూడా విధిస్తున్నాయి. వీటన్నింటి నుంచి యూజర్ల దృష్టి మారాల్చడానికి మాతృ సంస్థ పేరు మార్చేయడమే ఉత్తమమని జుకర్బర్గ్ భావించినట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. -
పేరుమార్చుకున్న ఫేస్బుక్.. ఇకపై అన్ని సేవలు ‘మెటా’ కిందనే
ఓక్లాండ్: సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ ‘కార్పొరేట్’ పేరు ఇకపై ‘మెటా’గా రూపాంతరం చెందనుంది. ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ గురువారం కంపెనీ కనెక్ట్ ఈవెంట్లో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ మేరకు కొత్తలోగో ఆవిష్కరణ జరిగింది. అంతర్జాతీయంగా ఇటీవల ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, వాట్సాప్ సేవలు సాంకేతికంగా పలు గంటల పాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రజాభద్రతకంటే లాభార్జనకే ఫేస్బుక్ పెద్దపీట వేస్తోందని ఇటీవల తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఇంతకుముందు ఫేస్బుక్ కింద కొనసాగిన సామాజిక మాధ్యమాలు– ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లు ఇకపై ‘మెటా’ కింద కొనసాగుతాయి. అంటే మాతృసంస్థ పేరుమాత్రమే మారింది తప్ప, దానికింద ఉండే సామాజిక మాధ్యమాల సేవలు పాతపేర్లతోనే కొనసాగుతాయి. ‘మెటావర్స్’ దిశలో అడుగులు! ‘మెటావర్స్’లో భాగంగా పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్లు జుకర్బర్గ్ తెలిపారు. వర్చువల్–రియాలిటీ స్పేస్లో రానున్న కాలంలో వినియోగదారులు ఎటువంటి అంతరాయం లేని అత్యున్నత స్థాయి సాంకేతిక సేవలను వినియోగం, తత్సబంధ అంశాలు ‘మెటావర్స్’ పరిధిలోకి వస్తాయి. ‘యాప్స్’ నుంచి మరింత సాంకేతిక పరిపక్వత కలిగిన ‘మెటావర్స్’దిశగా మెటా అడుగులు వేస్తుందని కూడా ఈ సందర్భంగా జుకర్బర్గ్ పేర్కొన్నారు. ‘‘ఒకరికి ఒకరిని కలిపి ఉంచడానికి సాంకేతికతను ఆవిష్కరించే కంపెనీ మనది. వెరసి మన సాంకేతికతలో ప్రజలను ఒక చోటు కేంద్రీకరించవచ్చు. తద్వారా అందరూ కలిసి ఆర్థిక వ్యవస్థ మరింత పురోగతికి దోహదపడవచ్చు’’ అని ఈ సందర్భంగా జుకర్బర్గ్ పేర్కొన్నారు. ‘‘ప్రస్తుత బ్రాండ్ ఇకపై మనకు కావాల్సిన సేవల అన్నింటినీ అందించలేకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో మనం భవిష్యత్తుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ దిశలోనే మన సంస్థ బ్రాడ్ పేరు మారింది’’ అని కూడా ఆయన పేర్కొన్నారు. -
ఫ్రాన్సెన్స్ హాగెన్ చిచ్చు..ఫేస్బుక్పై బాంబు పేల్చిన ఆస్ట్రేలియా ?!
యూజర్ల భద్రత కంటే డబ్బుకే ప్రాధాన్యం ఇస్తుందంటూ మాజీ ఉద్యోగిని ఫ్రాన్సెన్స్ హాగెన్ పెట్టిన చిచ్చు ఫేస్ బుక్ను రోజుకో మలుపు తిప్పుతున్నాయి. ఈ ఆరోపణలే ఫేస్బుక్ పేరు సైతం మార్చే దిశగా జుకర్ బెర్గ్ ప్రయత్నాలు ప్రారంభించారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ తో పాటు ఇతర సోషల్ మీడియా సంస్థలకు ఆస్ట్రేలియా ప్రభుత్వం 10 మిలియన్ల జరిమానా విధించే యోచనలో ఉందని తెలుస్తోంది. తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం సోషల్ మీడియాపై కొత్త చట్టాల్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో ఉంది. చట్టాల ప్రకారం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సోషల్ మీడియా సంస్థలకు 10 మిలియన్ల వరకు జరిమాన విధించేందుకు ఆస్ట్రేలియా సిద్ధమైంది. అదే జరిగితే ముందుగా ఫేస్బుక్ జరిమానా కట్టాల్సి ఉంటుందనే అనే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల సోషల్ మీడియా చట్టాల్ని మరింత కఠిన తరం చేస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిపాదనల్ని సిద్ధం చేసింది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా అటార్నీ జనరల్ మైఖేలియా క్యాష్ మాట్లాడుతూ.. సోషల్ ఫోరమ్ సైట్ రెడ్డిట్తో పాటు బంబుల్ వంటి డేటింగ్ యాప్లను నిర్వహిస్తున్న సోషల్ మీడియా కంపెనీలు యూజర్ల వయస్సును నిర్ధారించడానికి డేటాను సేకరిస్తున్నాయి. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తాం. ముసాయిదా చట్టం ప్రకారం.. సోషల్ మీడియా కంపెనీలు 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యూజర్లు తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి, చట్టాల్ని ఉల్లంఘించిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలు 10 మిలియన్ జరిమానా విధించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం యోచిస్తుందని అన్నారు. మానసిక ఆరోగ్యం,ఆత్మహత్యల నివారణపై ఆస్ట్రేలియా సహాయ మంత్రి డేవిడ్ కోల్మాన్ మాట్లాడుతూ..ఫేస్బుక్ యువతీ యువకుల మానసిక ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతున్నాయని వ్యాఖ్యానించారు. ''ఆస్ట్రేలియన్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కార్యాలయం ప్రతినిధులు సోషల్ మీడియా సంస్థల చట్టాల ఉల్లంఘనపై విచారణ, జరిమానా విధించే అధికారం ఉందని తెలిపారు. విచారణలో ఉల్లంఘన నిజమైతే 10మిలియన్లు లేదా సంస్థల వార్షిక టర్నోవర్లో 10శాతం, ఆర్ధిక ప్రయోజనం కోసం ఉల్లంఘిస్తే మూడు రెట్లు జరిమానా విధించే అధికారం ఉందని స్పష్టం చేశారు. చదవండి: ఫేస్బుక్ సంచలన నిర్ణయం.. పేరు మార్పు! -
ఫేస్బుక్ను బద్నామ్ చేసింది అతడేనా..!
Facebook Whistleblower Frances Haugen Funded By Founder Of Ebay: గత కొద్ది రోజుల నుంచి ఫేస్బుక్పై అనేక ఆరోపణలు వస్తోన్న విషయం తెలిసిందే. కొంతమంది వ్యక్తుల కోసమే ఫేస్బుక్ పనిచేస్తుదంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ కంపెనీపై దుమ్మెతి పోసింది. కొంత మంది వీఐపీల ప్రైవసీ విషయంలో ఫేస్బుక్ వారిని అందలాలను ఎక్కిస్తోందని వాల్స్ట్రీట్ జర్నల్ ఆరోపణలు చేయగా... జర్నల్తో పాటుగా ఫేస్బుక్ విజిల్బ్లోయర్ ఫ్రాన్సెస్ హాగెన్ అనే మాజీ ఉద్యోగిని కూడా కంపెనీపై తీవ్ర ఆరోపణలను చేసింది. చదవండి: Facebook: నువ్వేం తోపు కాదు..! చట్టం ముందు అందరు సమానులే..! ఫేస్బుక్ విజిల్ బ్లోయర్ వెనుక..! ఫేస్బుక్ దృష్టిలో యూజర్ల‘భద్రత కంటే లాభాలే ముఖ్యం’ అంటూ యూఎస్ కాంగ్రెస్ వేదికగా పలు సంచలన రహస్య పత్రాలను ఫేస్బుక్ విజిల్బ్లోయర్ తెలిపింది. సంచలన విషయాలను బయటపెట్టిన ప్రాన్సెస్ హాగెన్ వెనుక ఎదో అదృశ్య శక్తి ఉండే ఉంటుందని పలువురు నిపుణులు భావించారు. ఇప్పుడు అదే నిజమైంది. యూఎస్ కాంగ్రెస్ ఎదుట ఫేస్బుక్ పరువు తీసిన ఫేస్బుక్ మాజీ ఉద్యోగి హాగెన్ వెనుక ఈబే వ్యవస్థాపకుడు పియరీ ఒమిడ్యార్ ఉన్నట్లు ప్రముఖ యూఎస్ మీడియా సంస్థ పొలిటికో వెల్లడించింది. గత ఏడాది ఈబే సంస్థ సుమారు 150000 లక్షల (సుమారు రూ. 1.12 కోట్లు)డాలర్లను ఫ్రాన్సెస్ హాగెన్ విరాళంగా ఇచ్చినట్లు పొలిటికో పేర్కొంది. పియరీ ఒమిడ్యార్కు చెందిన సంస్థ లూమినేట్ ఫ్రాన్సెస్ హాగెన్కు యూరప్లో కూడా పీఆర్ సేవలను అందించింది. కాగా పొలిటికో వెల్లడించిన పలు అంశాలపై హాగెన్, ఒమిడ్యార్ ఎలాంటి వ్యాఖ్యలను చేయలేదు. పియరీ టెక్ క్రిటిక్..! పియరీ ఓమిడ్యార్ సుప్రసిద్థ టెక్ క్రిటిక్. పలు దిగ్గజ టెక్ కంపెనీలను విమర్శించడంలో పియరీ ఎప్పుడు ముందుంటారు. గతంలో హవాయిలో స్వతంత్ర జర్నలిజం కోసం తన వంతుగా న్యాయవాద ప్రయత్నాలను, కంపెనీల గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా అనేక ప్రచారాలు, పలు కంపెనీల్లోని ఉద్యోగులకు క్రియాశీల మద్దతును పియరీ అందించారు. చదవండి: ఫేస్బుక్ పేరు మార్పు..! కొత్త పేరు ఇదేనా...! -
ఫేస్బుక్ పేరు మార్పు..! కొత్త పేరు ఇదేనా...!
ప్రముఖ సోషల్మీడియా దిగ్గజం ఫేస్బుక్ కంపెనీ పేరును మార్చనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో నెట్టింట్లో ఫేస్బుక్ పేరు మార్పుపై నెటిజన్లు రకరకాలుగా గెస్ చేస్తున్నారు. ఫేస్బుక్ కొత్త పేరు ఇదేనంటూ నెటిజన్లు గోలగోల చేస్తున్నారు. కొత్తపేరు ఇదేనంటూ.. ఫేస్బుక్ కంపెనీ పేరును మార్చనున్నట్లు తెలియడంతో నెటిజన్లు ట్విటర్లో పలు సూచనలను చేస్తున్నారు. వీరిలో సామాన్య నెటిజన్లే కాకుండా టెక్ ఇండస్ట్రీ దిగ్గజ వ్యక్తులు కూడా ఉండడం విశేషం. కొంత మంది నెటిజన్లు ఎఫ్బీ(FB)గా పేరు పెట్టాలంటూ సూచనలు చేస్తున్నారు. మరికొంత మంది నెటిజన్లు మేటా(Meta), హరిజన్ (Horizon),ది ఫేస్బుక్ అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరోవైపు ఫేస్బుక్ మాజీ సివిక్ ఛీఫ్ సమిద్ చక్రవర్తి ఒక అడుగు ముందుకేసి ఫేస్బుక్ను ‘మెటా’ పేరుతో మారుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా మరికొద్ది రోజుల్లోనే ఫేస్బుక్ మెటావర్స్ను రిలీజ్ చేస్తున్న తరుణంలో ఫేస్బుక్ కొత్త పేరు మెటా అయి ఉండోచ్చనే భావన అందరిలో వస్తోంది. ఇదిలా ఉండగా..ఈ నెల అక్టోబర్ 28 లోపే ఫేస్బుక్ కొత్త పేరును ప్రకటించనుంది. వరుస ఆరోపణలను ఎదుర్కొంటున్న ఫేస్బుక్..! గత కొద్ది రోజుల నుంచి ఫేస్బుక్పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఫేస్బుక్ కొంతమంది వ్యక్తుల కోసమే పనిచేస్తుదంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఫేస్బుక్పై దుమ్మెతి పోసింది. కొంత మంది వీఐపీల ప్రైవసీ విషయంలో ఫేస్బుక్ వారిని అందలాలను ఎక్కిస్తోందని వాల్స్ట్రీట్ జర్నల్ ఆరోపణలు చేసింది. వాల్స్ట్రీట్ జర్నల్ ఒక్కటే కాదు ఫ్రాన్సెస్ హాగెన్ అనే మాజీ ఉద్యోగిని కూడా ఫేస్బుక్పై తీవ్ర ఆరోపణలను చేసింది. ఫేస్బుక్ దృష్టిలో యూజర్ల‘భద్రత కంటే లాభాలే ముఖ్యం’ అంటూ యూఎస్ కాంగ్రెస్ వేదికగా పలు సంచలన రహస్య పత్రాలను బయటపెట్టిన విషయం తెలిసిందే. My best guess for the new name: "Meta" But I'd prefer something more classic like simply "A Mark Zuckerberg Production" — Samidh (@samidh) October 20, 2021 drop the book, just Face — Danny Trinh (@dtrinh) October 20, 2021 చదవండి: టీవీ ప్రేక్షకులకు షాకింగ్ న్యూస్...!వారికి మాత్రం పండగే..! -
ఫేస్బుక్ సంచలన నిర్ణయం.. పేరు మార్పు!
Facebook Name Change Says Verge: సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ సంచలన నిర్ణయం తీసుకోనుందా? ఫేస్బుక్ పేరు మారబోతోందా? ప్రముఖ టెక్ బ్లాగ్ ది వెర్జ్ అవుననే అంటోంది. ఈ మేరకు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ కీలక నిర్ణయం ప్రకటించబోతున్నాడంటూ తాజాగా తన వెబ్సైట్లో వెర్జ్ ఓ కథనం ప్రచురించింది. అక్టోబర్ 28న జరగబోయే కంపెనీ వార్షిక సమావేశంలో ఈ మేరకు ఫేస్బుక్ పేరు మార్చే అంశంపై జుకర్ బెర్గ్ స్పందించనున్నట్లు ది వెర్జ్ కథనం పేర్కొంది. ఒకవేళ అది జరిగినా.. ఇన్స్ట్రాగ్రామ్, వాట్సాప్, ఓకులస్లను తదితర ఫేస్బుక్ సంబంధిత సర్వీసులు మాత్రం పేరెంట్ కంపెనీ(ఫేస్బుక్ కంపెనీ) కిందనే నడుస్తాయి. మెటావర్స్ లాంటి భారీ ప్రాజెక్టు దిశగా పేస్బుక్ అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో పేరు మార్చడం ద్వారా రిఫ్రెష్నెస్ ఉంటుందని జుకర్బర్గ్ అండ్ కో భావిస్తున్నట్లు వెర్జ్ తన కథనంలో పేర్కొంది. అయితే కొత్త పేరు ఏంటన్న విషయంపై మాత్రం ఆ కథనం స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ఫేస్బుక్ కూడా ఈ పేరుమార్పు కథనంపై స్పందించేందుకు నిరాకరించడంతో .. ఇదొక రూమర్గానే భావించాల్సి ఉంటుంది.ఇక కంపెనీలు ఇలా పేర్లు మార్చుకోవడం కొత్తేం కాదు. అమెరికా టెక్ దిగ్గజం ఆల్ఫాబెట్ కంపెనీ(గూగుల్ పేరెంట్ కంపెనీ) నుంచి గూగుల్ ఇలాగే పేరు మార్చుకుని కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఫేస్బుక్ అధినేత ఉక్కిరి బిక్కిరి గత కొద్ది రోజులుగా వస్తున్న ఆరోపణులు మార్క్ జుకర్ బెర్గ్కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మాజీ ఎంప్లాయి ఫ్రానెస్స్ హాగెన్ ఆరోపణలు, అక్టోబర్ 4 రాత్రి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్కు అనుసంధానంగా ఉన్న వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ దాదాపు 7 గంటల పాటు స్తంభించిపోవడం, దీంతో అసౌకర్యానికి గురైన 2.7 బిలియన్ యూజర్లు ప్రత్యామ్నాయ సోషల్ నెట్ వర్క్లను వినియోగించుకునేందుకు మొగ్గు చూపడం, ఆ సర్వీసుల విఘాతం వల్ల రూ.50 వేల కోట్ల నష్టం వాటిల్లడం, ఉద్యోగుల విషయంలో వివక్షతో పాటు ఫెడరల్ రిక్రూట్మెంట్ రూల్స్ను ఉల్లంఘించిందంటూ ఫేస్బుక్ కు రూ.107 కోట్ల ఫైన్ విధించడం..ఆ ఫైన్ కట్టేందుకు జుకర్ బెర్గ్ ఒప్పుకోవడం, ఫేస్బుక్ సీఈఓగా మార్క్ జుకర్ బెర్గ్ రాజీనామా చేస్తున్నారంటూ బ్రిటన్కు చెందిన ఓ ప్రముఖ టాబ్లాయిడ్ సంచలన కథనాలు వెలుగులోకి రావడం జుకర్ బెర్గ్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అందుకే ప్రస్తుతం ఈ విపత్తు నుంచి బయట పడేందుకు ఫేస్బుక్ పేరు మారిస్తే ఎలా ఉంటుందనే కోణంలోనూ జుకర్బెర్గ్ ఫేస్బుక్ బోర్డుతో సమాలోచనలు జరుపుతున్నట్లు ది వెర్జ్ తన కథనంలో పేర్కొంది. ఫేస్బుక్ పేరు మార్చడం వల్ల న్యాయపరమైన ఇబ్బందుల నుంచి బయటపడొచ్చనేది మరి కొందరి వాదన. అయితే ఫేస్బుక్ పేరు మారిస్తే..ఫేస్బుక్కు పెట్టబోయే కొత్త పేరేంటీ? పేరు మార్పును ఎప్పుడు ప్రకటిస్తారని అంశంపై కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది. వాట్ నెక్ట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సైట్లతో బిజీగా ఉన్న జుకర్ బెర్గ్..భవిష్యత్ టెక్నాలజీ 'మెటావర్స్'ను డెవలప్ చేసే పనిలో ఉన్నారు. ఇందుకోసం యూరప్లో 10వేల మందిని నియమించుకోబోతున్నట్లు ప్రకటించారు. మెటావర్స్ అనేది వర్చువల్ రియాలిటీ స్పేస్. ఇటీవల ఫేస్బుక్, వర్క్ప్లేస్ అనే వర్చువల్ రియాల్టీ మీటింగ్స్ యాప్, హారిజన్స్ అనే సోషల్ స్పేస్తో ప్రయోగాలు చేస్తోంది. పనిచేసే ప్రదేశాల కోసమే కాకుండా, వాస్తవికతలో సంభాషించేందుకు అవసరమైన వర్చువల్ రియాలిటీ యాప్లను ఫేస్బుక్ రూపొందిస్తోంది. ఇందుకోసం 50 మిలియన్ డాలర్ల (సుమారు రూ.375 కోట్లు)ను ఫేస్బుక్ పెట్టుబడిగా కేటాయించింది. అయితే ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో వినియోగం రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుందని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఉద్యోగాల్లో వివక్ష.. భారీ మూల్యం చెల్లించనున్న ఫేస్బుక్ -
Mark Zuckerberg: ఫేస్బుక్కు జుకర్బర్గ్ రాజీనామా?
Mark Zuckerberg resign from Facebook Says UK Media: ఫేస్బుక్ వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈవో మార్క్ జుకర్బర్గ్ (37) రాజీనామాకు సిద్ధమయ్యాడా? బోర్డులో మెజార్టీ సభ్యులు వద్దని వారిస్తున్నా.. మొండిగా నిర్ణయం తీసుకోనున్నాడా? సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఈమధ్య కాలంలో వినిపిస్తున్న సంచలన ఆరోపణలు, జుకర్బర్గ్ నేతృత్వంపై వినిపిస్తున్న తీవ్ర విమర్శల నేపథ్యంలో ఇది నిజం కాబోతోందని బ్రిటన్కు చెందిన ఓ ప్రముఖ టాబ్లాయిడ్ సంచలన కథనం ప్రచురించింది. డిజిటల్ ప్రపంచంలో ‘మెటావర్స్’ ద్వారా అద్భుతాల్ని సృష్టించాలని ఫేస్బుక్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఈయూ వ్యాప్తంగా 10వేల మంది అధిక నైపుణ్యం ఉన్న ఉద్యోగుల్ని వచ్చే ఐదేళ్లలో ఫేస్బుక్ నియమించుకోబోతోంది. అయితే ఈ నియామకాల కోసం జరిగిన కీలక సమావేశంలో సీఈవో మార్క్ జుకర్బర్గ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. సమీప భవిష్యత్తులో తాను వ్యవహారాల్ని పర్యవేక్షించినా.. లేకున్నా ఫేస్బుక్ను సమర్థవంతంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత ప్రతీఒక్కరి మీదా ఉందంటూ జుకర్బర్గ్ వ్యాఖ్యలు చేశాడట. ఈ మేరకు ఫేస్బుక్ అంతర్జాతీయ వ్యవహారాలు చూసుకునే ఓ కీలక ఉద్యోగి ఇచ్చిన సమాచారం మేరకు కథనం ప్రచురించినట్లు సదరు టాబ్లాయిడ్ పేర్కొంది. బోర్డు వద్దన్నా.. యూజర్ల డాటా లీకేజీ గురించి ఫేస్బుక్ ఎప్పటి నుంచో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇదీగాక ఇన్స్టాగ్రామ్తో మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందంటూ ఫేస్బుక్ మాజీ ఉద్యోగిణి ఫ్రాన్సెస్ హౌగెన్ సంచలన ఆరోపణలు చేస్తూ వస్తోంది. యూజర్ భద్రత కంటే లాభాలే ఫేస్బుక్కు పరమావధిగా మారిందని ఆమె తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో ఫేస్బుక్ కంపెనీలో సంస్కరణల దిశగా అడుగువేయాలని కోరుతూనే.. కంపెనీ సీఈవో మార్క్ జుకర్బర్గ్ను ఆ పదవి నుంచి తొలగించాలని పెద్ద ఎత్తున్న ఉద్యమం నడుస్తోంది. అంతేకాదు నవంబర్ 10న ‘క్విట్ ఫేస్బుక్’ పేరుతో ఒక్కరోజు ఫేస్బుక్, దాని అనుబంధ యాప్లను వాడొద్దంటూ పెద్ద ఎత్తున్న క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. ఈ క్రమంలో యూజర్ల అసంతృప్తి బయటపడింది. ఈ వరుస పరిణామాలన్నింటితో ఫేస్బుక్ కంపెనీ బోర్డులో కొందరు సభ్యులు జుకర్బర్గ్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నట్లు సదరు కథనం ప్రచురించింది. ఈ క్రమంలోనే ఓటింగ్ కంటే ముందే స్వచ్చందంగా సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోవాలని జుకర్బర్గ్ భావిస్తున్నట్లు, ఇందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులు సైతం జుకర్బర్గ్ ప్రొత్సహించినట్లు ఆ కథనం సారాంశం. అయితే మెజార్టీ బోర్డు సభ్యులు మాత్రం జుకర్బర్గ్ నాయకత్వం వైపే మొగ్గు చూపిస్తుండడం విశేషం. భార్య ప్రిసిల్లా చాన్తో.. యంగ్ బిలియనీర్.. సోషల్ మీడియా, సోషల్ నెట్వర్కింగ్ సర్వీస్గా మొదలైన ఫేస్బుక్ కంపెనీని 2004లో ఇంటర్నెట్ ఎంట్రప్రెన్యూర్ మార్క్జుకర్బర్గ్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. హార్వర్డ్ కాలేజీలో తన తోటి స్నేహితులు, రూమ్మేట్స్ అయిన కొంతమందితో కలిసి ఫేస్బుక్ను తీసుకొచ్చాడు. 2006 నుంచి 13 ఏళ్లు పైబడిన వాళ్లు ఎవరైనా సరే ఫేస్బుక్ వాడేలా నిబంధనను తీసుకొచ్చారు. ప్రస్తుతం గ్లోబల్ ఇంటర్నెట్ యూసేజ్లో ఏడో స్థానంలో ఉన్న ఫేస్బుక్కు.. నెలకు 300 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉంటున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఫేస్బుక్లో జుకర్బర్గ్కు 29 శాతం వాటా ఉండగా (ఇప్పుడది 14 శాతానికి పడిపోయినట్లు తాజా గణాంకాలు చెప్తున్నాయి).. ప్రపంచ కుబేరులా జాబితాలో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు జుకర్బర్గ్. మెటావర్స్ రాజ్యం.. మెటావర్స్ అనేది డిజిటల్ వరల్డ్. త్రీడీ ఎన్విరాన్మెంట్లో కార్యకలాపాలను నడిపించొచ్చు. రాబోయే రోజుల్లో టెక్నాలజీని శాసించేది ఇదేనని నిపుణుల నమ్మకం. ఈ మేరకు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ ఈ జులైలోనే ఓ ప్రకటన సైతం చేశాడు. ఇక ఫేస్బుక్ మేజర్ సక్సెస్లో భాగమైన యూరోపియన్ యూనియన్ నుంచే ఈ ప్రయత్నాల్ని మొదలుపెట్టబోతోంది. వ్యాప్తంగా పదివేల మంది ఉద్యోగుల్ని రానున్న ఐదేళ్లలో నియమించే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, పోలాండ్, నెదర్లాండ్స్, ఐర్లాండ్ నుంచి రిక్రూట్మెంట్ ప్రాసెస్ను మొదలుపెట్టింది. మరోవైపు మైక్రోసాఫ్ట్, రోబ్లోక్స్, ఎపిక్ గేమ్స్ సైతం సొంత వెర్షన్ మెటావర్స్ కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. చదవండి: కాసుల కోసమే ఫేస్బుక్ కక్కర్తి.. జుకర్బర్గ్ రియాక్షన్ ఇది -
'ఐ కాంట్ బ్రీత్':ఫేస్బుక్ కు మరో ముప్పు..జూకర్ ఏం చేస్తారో?
ఫేస్ బుక్ అధినేత మార్క్ జూకర్ బెర్గ్ ప్రతిష్ట రోజురోజుకీ మసకబారిపోతుంది. 'భద్రత కంటే లాభాలే ముఖ్యం' అనే మచ్చ జూకర్కు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. ముఖ్యంగా ఫేస్బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హాగెన్ చేసిన ఆరోపణలు, వెలుగులోకి తెచ్చి ఆధారాలు ఆయన్ను మరింత అష్ట దిగ్భందనం చేస్తున్నాయి.'ఐ కాంట్ బ్రీత్' అనే తరహాలో అవి చాలవన్నట్లు తాజాగా ఐర్లాండ్ డేటా ప్రొటెకమిషన్ భారీ జరిమానా విధించింది. యూరోపియన్ కమిషన్ ప్రకారం.. అండర్ యురేపియన్ యూనియన్ - 2018 డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం..ఫేస్బుక్పై ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ అధికారులు 36 మిలియన్ల యూరోల (ఇండియన్ కరెన్సీలో రూ.3,14,62,56,000.00) ఫైన్ విధించారు. యూరోపియన్ కమిషన్ ప్రకారం.. మొత్తం 44 యూరోపియన్ యూనియన్ దేశాల్లో బిజినెస్ వ్యవహారాల్ని సులభతరం చేసేందుకు 'వన్ స్టాప్ షాప్'తో ఓ యూనియన్ కమిషన్ను ఏర్పాటు చేశారు. యూరోపియన్ దేశాల్లో బిజినెస్ వ్యవహరాలు నిర్వహించాలంటే ఆ కమిషన్ సభ్యులు చెప్పినట్లుగా వ్యవహరించాలి. లేదంటే కఠిన చర్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే తాజాగా వన్ స్టాప్ షాప్ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఫేస్బుక్పై ఐర్లాండ్ కమిషన్ చర్యలకు ఉపక్రమించింది. ఆస్ట్రియన్ యాక్టివిస్ట్ ఆస్ట్రియాకు చెందిన ప్రముఖ న్యాయవాది, సామాజిక వేత్త మాక్స్ స్క్రెమ్స్ ఫేస్బుక్ ప్రైవసీ వయోలేషన్ పై ఫైట్ చేస్తున్నారు. తాజాగా ఈయన ఫేస్బుక్పై డజన్ల కొద్ది ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులపై విచారణ చేపట్టిన డీపీసీ సభ్యులు ఫేస్బుక్ పై 28 మిలియన్ల యూరోల నుంచి 36 మిలియన్ల యూరోల వరకు జరిమానా విధించారు. మరి ఈ ఫైన్తో పాటు ఫేస్బుక్పై పడిన ఆరోపణలనే తుపాన్లను, సునామీలను తట్టుకొని ఏటికి ఎదురీది తన సంస్థను కాపాడుకుంటారో లేదంటే ఇంకేం చేస్తారో వేచి చూడాల్సి ఉంది. చదవండి: 'టీ కప్పులో తుఫాను' కాదు..ఫేస్ బుక్ను ముంచే విధ్వంసం -
ఫేస్బుక్లోనే బ్లాక్ షీప్స్.. విచిత్ర పరిణామాలు!
సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫేస్బుక్ కంపెనీలో విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. యూజర్ భద్రత కంటే డబ్బుకే ప్రాధాన్యం ఇస్తోందని సోషల్ మీడియా దిగ్గజ కంపెనీపై మాజీ ఉద్యోగి ఒకరు ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆరోపణలకు సంబంధించిన రుజువు పత్రాలతో సైతం ఆమె మీడియా ముందుకు సైతం వచ్చారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చాక దిద్దుబాటు చర్యలకు దిగింది ఫేస్బుక్. కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగుల కదలికలపై నిఘా పెంచింది. బ్లాక్ షీప్స్ లిస్ట్ తయారు చేసి.. అనుమానం ఉన్నవాళ్లపై వేటుకి సిద్ధమైంది. ఈ తరుణంలో న్యూస్ ఫీడ్ను డిలీట్ చేసే యాప్ను కనిపెట్టినందుకు ఓ డెవలపర్పై శాశ్వత నిషేధం విధించింది. యూకేకు చెందిన లూయిస్ బార్క్లే అనే డెవలపర్.. ‘అన్ఫాలో ఎవ్రీథింగ్’ అనే బ్రౌజర్ ద్వారా ఆటోమేటిక్గా ఫ్రెండ్లిస్ట్ను, పేజీలకు అన్ఫాలో అయ్యే వెసులుబాటు అందిస్తోంది. అంతేకాదు న్యూస్ ఫీడ్ను సైతం ఖాళీ చేసేస్తోంది. అయితే తనపై వస్తున్న ఆరోపణల్ని లూయిస్ ఖండిస్తున్నాడు. ఇది కేవలం ఎక్స్టెన్షన్ సర్వీస్ మాత్రమేనని, అన్ఫాలోకి సంబంధించింది ఏమాత్రం కాదని, న్యూస్ఫీడ్ క్లియరెన్స్ వల్ల యూజర్ మానసిక స్థితి మెరుగుపడడంతో పాటు(పదే పదే ఫేస్బుక్లో గడిపే పని తగ్గుతుంది), కుటుంబంతో సంతోషంగా గడుపుతారని చెప్తున్నాడు. అయినప్పటికీ ఫేస్బుక్ ఈ వివరణతో సంతృప్తి చెందలేదు. బార్క్లేను ఫేస్బుక్, దాని అనుబంధ సంస్థ అయిన ఇన్స్టాగ్రామ్ నుంచి శాశ్వతంగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఈ వేటు వెనుక.. ఫ్రాన్సెస్ హౌగెన్కు బార్క్లే అందించిన సాయమే కారణం అయ్యి ఉండొచ్చన్న! అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉద్యోగులను బతిమాలుతూ.. ఫేస్బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్, విజిల్బ్లోయ(వ)ర్గా మారిపోయి.. ఫేస్బుక్ మీద సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆపై ఈ పంచాయితీ అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్) దగ్గరికి చేరింది. ఈ క్రమంలో ఫేస్బుక్ గురించి పాజిటివ్ ప్రచారం చేయాలని ఉద్యోగులను బతిమాలుతోంది యాజమాన్యం. ఆరోపణల్ని ఖండించడం, ఫేస్బుక్ గురించి ఇంట్లోవాళ్లతో, ఇతరులతో మంచిగా చెప్పడం లాంటివి చేయాలంటూ క్లాసులు తీసుకుంటోంది. ఇక కిందిస్థాయి ఉద్యోగులకు ఈ అంశాలతో కూడిన మెమోలను ఉద్యోగులకు జారీ చేసిందని ది టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. అంతేకాదు హౌగెన్ను ఎవరూ విమర్శించకూడదనే కఠిన ఆదేశాలు ఉద్యోగులకు జారీ చేసిందట. ఆమెను కలవనున్న బోర్డ్ ఫేస్ బుక్ మీద సంచలన ఆరోపణలతో ప్రపంచం ముందుకు వచ్చారు మాజీ ప్రొడక్ట్ ఇంజినీర్ ఫ్రాన్సెస్ హౌగెన్. ‘ప్రొటెక్టింగ్ కిడ్స్ ఆన్లైన్’ పేరిట ఆమె సమర్పించిన నివేదిక ఓ ప్రముఖ పత్రిక ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్తో టీనేజర్ల మానసిక స్థితి ఎంత దారుణంగా దెబ్బతింటుందో అనే విషయంతో పాటు వివిధ దేశాల్లో రకరకాల రాజకీయ పార్టీలు, వాటి అనుబంధ విభాగాల ప్రయోజనాల కోసం ఫేస్బుక్ ఏ విధంగా పని చేసిందనే విషయాల్ని సైతం అందులో క్షుణ్ణంగా వివరించినట్లు చెబుతున్నారామె. ఈ తరుణంలో వ్యక్తిగత భద్రత కోసం ఆమె సెనెటర్లను సైతం ఆశ్రయించారు. అయితే ఆమె ఆరోపణలను బహిరంగంగా ఖండించిన ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్.. ఇప్పుడు రాజీ కోసం ప్రయత్నిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఫేస్బుక్ కంపెనీలో స్వతంత్ర్య దర్యాప్తు సంస్థగా పేరున్న ఓవర్సైట్ బోర్డ్.. త్వరలో ఫ్రాన్సెస్ హౌగెన్ను స్వయంగా కలవబోతుందట. తద్వారా ఆరోపణలపై నిజనిర్ధారణ చేయనున్నట్లు సోమవారం ఒక ప్రకటన చేసింది బోర్డు. అయితే ఇదంతా రాజీ చర్యల్లో భాగమేనని ది టైమ్స్ అనుమానం వ్యక్తం చేస్తూ మరో కథనం ప్రచురించింది. చదవండి: TIME Cover Ft. Zuckerberg: 11 ఏళ్లకు అంతా ఉల్టా పల్టా? చదవండి: పైసల కోసమే ఫేస్బుక్ కక్కుర్తి! చదవండి: నవంబర్ 10న.. ఏం జరగబోతోంది? -
11 ఏళ్లకు అంతా ఉల్టా పల్టా? ఫేస్బుక్ డిలీట్ అంటూ కవర్ పేజీ
TIME Cover Ft. Zuckerberg: మార్క్ జుకమ్బర్గ్ ఈ పేరు అందరికీ సుపరిచతమైనదే. ఫేస్బుక్తో సోషల్మీడియా ప్రస్థానానికి నాంది పలికాడు మార్క్. ఫేస్బుక్ను స్థాపించడంలో జుకమ్బర్డ్ కీలకపాత్రను పోషించాడు. ఫేస్బుక్ స్థాపనతో అంచెలచెలుగా జుకమ్బర్గ్ ప్రపంచంలోనే సంపన్నుల జాబితాలో చేరాడు. ఫేస్బుక్ ఒక్కటే కాకుండా...వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, వంటి సోషల్ మీడియా యాప్స్ను కూడా శాసించే రేంజ్కు జుకమ్బర్గ్ వెళ్లాడు. ఫేస్బుక్పై భారీ ఎత్తున ఆరోపణలు...! గత కొద్ది రోజుల నుంచి ఫేస్బుక్పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఫేస్బుక్ కొంతమంది వ్యక్తుల కోసమే పనిచేస్తుదంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఫేస్బుక్పై దుమ్మెతి పోసింది. కొంత మంది వీఐపీల ప్రైవసీ విషయంలో ఫేస్బుక్ వారిని అందలాలను ఎక్కిస్తోందని వాల్స్ట్రీట్ జర్నల్ ఆరోపణలు చేసింది. వాల్స్ట్రీట్ జర్నల్ ఒక్కటే కాదు ఫ్రాన్సెస్ హాగెన్ అనే మాజీ ఉద్యోగిని కూడా ఫేస్బుక్పై తీవ్ర ఆరోపణలను చేసింది. ఫేస్బుక్ దృష్టిలో యూజర్ల‘భద్రత కంటే లాభాలే ముఖ్యం’ అంటూ యూఎస్ కాంగ్రెస్ వేదికగా పలు సంచలన రహస్య పత్రాలను బయటపెట్టింది. దీంతో ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకమ్బర్గ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. మార్క్ జుకమ్బర్గ్పై ప్రపంచవ్యాప్తంగా అనేక విమర్శలు వెలువెత్తుతున్నాయి. పర్సన్ ఆఫ్ ది ఇయర్ నుంచి...డిలీట్ వరకు...! తాజాగా ఫేస్బుక్ అధినేత మార్క్ జుకమ్ బర్గ్ ఫోటోను ప్రముఖ అమెరికన్ మ్యాగజీన్ టైమ్స్ మ్యాగజీన్ కవర్ మీద ప్రచురించింది. ఇప్పుడు ఈ ఫోటోపై సర్వత్రా చర్చ జరుగుతుంది. టైమ్స్ మ్యాగజీన్ జుకమ్బర్గ్ ఫోటోపై...‘డిలీట్ ఫేస్బుక్..క్యాన్సల్...డిలీట్... ’అంటూ మ్యాగజీన్ కవర్ను రూపోందించింది. ఫేస్బుక్ మాజీ ఉద్యోగిని ఫ్రాన్సెస్ హాగెన్ ఫేస్బుక్పై బయటపెట్టిన రహస్య పత్రాలను ఉద్దేశించి టైమ్స్ మ్యాగజీన్ జుకమ్బర్గ్ కవర్ఫోటోను ప్రచురించింది. ఇక్కడ విషయమేమిటంటే ఇదే టైమ్స్ మ్యాగజీన్ 2010లో పర్సన్ ఆఫ్ ది ఇయర్గా మార్క్ జుకమ్బర్గ్ ఫోటోను కవర్పేజీపై ప్రచురించింది. ఆ సమయంలో మార్క్ ఏవిధంగా ఎదిగాడనే అంశాలను టైమ్స్ తన మ్యాగజీన్లో పేర్కొంది. ప్రస్తుతం ఈ రెండు ఫోటోలు సోషల్మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మార్క్ ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారాడని సోషల్మీడియాలో చర్చించుకుంటున్నారు. చదవండి: Jeff Bezos and Elon Musk: వీళ్లిద్దరూ ఏక్ నెంబర్ 'పిసినారులు' -
ఫేస్... బుక్ అయ్యిందా?
కాలం కలసిరాకపోవడమంటే ఇదేనేమో! కొద్ది రోజులుగా ఫేస్బుక్ సంస్థకు తగులుతున్న వరుస ఎదురుదెబ్బలు చూస్తే అంతే అనిపిస్తోంది. ఒకప్పుడు తాను పని చేసిన ఈ సంస్థ దృష్టిలో యూజర్ల ‘‘భద్రత కన్నా లాభమే ముఖ్యం’’ అంటూ ఫ్రాన్సెస్ హాగెన్ అనే మాజీ ఉద్యోగిని నుంచి ఈ ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తూ ఆమె బయటపెడుతున్న వేలాది రహస్యపత్రాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. అది చాలదన్నట్టు సోమవారం 6 గంటలపైగా ఫేస్బుక్, దాని సేవలైన వాట్సప్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్లు సాంకేతిక సమస్యలతో ఆగిపోయాయి. దీనిపై రకరకాల ఊహాగానాలొచ్చినా, కమ్యూనికేషన్ టూల్స్లో లోపాలతో పాటు కాన్ఫిగరేషన్ మార్పు వల్లే ఇది తలెత్తిందని నిపుణుల మాట. 2008 తర్వాతెన్నడూ లేనంతటి ప్రపంచవ్యాప్త స్తంభన, తాజా ఆరోపణలతో సంస్థకు గట్టి దెబ్బే తగిలింది. ట్విట్టర్, టిక్టాక్, టెలిగ్రామ్లకి చాలామంది మారిపోవడంతో, ఫేస్బుక్ షేర్లు 4.9 శాతం పడిపోయాయి. 6 గంటల్లో ఫేస్బుక్ 10 కోట్ల డాలర్ల ఆదాయం నష్టపోయినట్లు అంచనా. వీటికన్నా జనం ఫేస్బుక్లో ఎక్కువసేపు గడపడానికి విద్వేషపోస్టుల్ని ప్రోత్సహిస్తోందన్న వివాదం మరింత నష్టాన్ని కలిగించనుంది. ఫేస్బుక్ నైతికతపై ఆరోపణలు చేసింది హార్వర్డ్లో ఎంబీఏ చేసిన మంచి వక్త, అల్గారిథమ్స్లో దిట్ట, పేటెంట్లు పొందిన స్త్రీ. గూగుల్, పిన్రెస్ట్లలో పనిచేసిన ఆమెకు ఫేస్బుక్లో జనం ఏ చూడాలనేది కంప్యూటర్ కోడ్ ఎలా ఎంపిక చేస్తుందో, లోతుపాతులేమిటో బాగా తెలుసు. అందుకే, ఫేస్బుక్ తప్పులను ప్రపంచానికి చాటిన ఈ 37 ఏళ్ళ మాజీ ఉద్యోగిని మంగళవారం అమెరికన్ సెనేట్ కామర్స్ సబ్ కమిటీ ముందు చెప్పిన మాటలు, చేసిన ఆరోపణలకు అంత విలువ. ప్రోడక్ట్ మేనేజర్గా ఫేస్బుక్లో పనిచేసి, మే నెలలో బయటకొచ్చిన ఆమె కొన్ని వేల అంతర్గత పత్రాలను ప్రసిద్ధ పత్రిక ‘వాల్స్ట్రీట్ జర్నల్’తో కొన్నాళ్ళుగా అజ్ఞాతంగా పంచుకుంటూ వచ్చారు. వాటి ఆధారంగా ఫేస్బుక్ హాని గురించి ఆ పత్రిక వరుస కథనాలు వేస్తూ వచ్చింది. ఇక, ఆదివారం హాగెన్ తన పేరు, రూపం బయటపెడుతూ ఇచ్చిన ‘60 మినిట్స్’ టీవీ భేటీ దానికి పరాకాష్ఠ. ఫేస్బుక్కు 289 కోట్ల మంది, వాట్సప్కు 200 కోట్ల పైచిలుకు మంది యూజర్లున్నారని ఓ లెక్క. ఈ ఏడాది మొదట్లో వాట్సప్ కోసం ఫేస్బుక్ తీసుకొచ్చిన సరికొత్త ప్రైవసీ విధానం ఇప్పటికే వివాదాస్పదమైంది. ఇంటిగుట్టు బయటపెట్టిన పత్రాలను బట్టి చూస్తే, ఇప్పటి దాకా అందరూ అనుమానిస్తున్న అనేక అంశాలు నిజమే అనిపిస్తోంది. లక్షలాది ఉన్నత వర్గాల యూజర్ల కోసం మాత్రం ఫేస్బుక్ కొంత సడలింపులతో కూడిన రహస్య నిబంధనలు పాటిస్తోంది. అలాగే, టీనేజ్ అమ్మాయిల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు ఇన్స్టాగ్రామ్ వ్యవహారంతో తమ శరీరాకృతి పట్ల నిరాశకు లోనైన దుఃస్థితి. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్న పరిస్థితి. 2018లో అల్గారిథమ్లో మార్పు ద్వారా ఫేస్బుక్ విద్వేషాలకు తావిచ్చింది. తాజా అమెరికా అధ్యక్ష ఎన్నికలవేళ తప్పనిసరై, పోస్టింగులపై కొన్ని అడ్డుకట్టలు పెట్టింది. తీరా ఎన్నికలవగానే వాటిని ఎత్తేయడమే ఈ జనవరి 6న అమెరికా అధ్యక్ష భవనంపై మూకదాడికి దారితీసింది. 34 కోట్ల మంది ఫేస్బుక్ యూజర్లున్న మనదేశంలో బీజేపీ, ఆరెస్సెస్లవి, లేదా వాటితో అనుబంధమున్నవీ అయిన ఫేస్బుక్ ఖాతాలు, గ్రూపులు, పేజీలు భయాన్ని పెంచేలా, ముస్లిమ్ వ్యతిరేక కథనాలను ప్రమోట్ చేస్తున్నాయట. రాజకీయ సందేశాలకు అడ్డాగా మారిన ఆ సంగతి హాగెన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇవన్నీ దిగ్భ్రాంతికరం. అందరికీ ముఖపుస్తకమన్నట్టు పేరు పెట్టుకున్న సంస్థ ఇలా ముఖం చాటేసే పనులు చేయడం విడ్డూరమే. తాజా వివాదంపై ఫేస్బుక్ సీఈఓ జుకెర్బెర్గ్ మొదట్లో మౌనంగా ఉన్నా, చివరికి ఖండించక తప్పలేదు. వాదనల మాటెలా ఉన్నా, ఇప్పటికే అనేక వివాదాలకు లోనై, ఏకస్వామ్య పోకడలకు జరిమానాల పాలై, నిశిత పరిశీలనలో ఉన్న కంపెనీ ఫేస్బుక్. ఉద్యోగులే బయటకొచ్చి, ఆరోపణలు చేయడమూ దానికి కొత్త కాదు. కానీ, ఇలాంటి వేదికలు ప్రపంచాన్ని శాసించేంత శక్తి మంతం కావడం, ఈ సామాజిక వేదిక ఆగితే కమ్యూనికేషన్ ఆగే పరిస్థితి రావడం అభిలషణీయం కానే కాదు. ప్రపంచం ప్రతి క్షణం సెర్చింగ్కు వాడే గూగుల్, ప్రపంచంలోని అతిపెద్ద క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడరైన అమెజాన్ వెబ్ సర్వీసెస్ లాంటివి కూడా రేపు ఇలా అనుకోని స్తంభనకు గురైతే ప్రపంచ సమాచారప్రసారం, వాణిజ్యాల పరిస్థితేమిటన్నది సీరియస్గా ఆలోచించాల్సిందే. అయితే, ప్రపంచమొక కుగ్రామమై, సమాచారమే అత్యంత శక్తిమంతమైనదిగా మారిన వర్తమానంలో ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా వేదికలే వద్దనగలమా? ఫేస్బుక్పై ఇన్ని ఆరోపణలు చేసిన హాగెన్ సైతం ఆ సామాజిక వేదికను నిషేధించమనడం లేదు. దాని పనితీరును పర్యవేక్షిస్తూ, రోజూ 160 కోట్ల పైచిలుకు మందికి అది చూపించే సమాచారంపై మార్గదర్శనం చేయమని సూచిస్తున్నారు. ఈ విషయంపై మనమే కాదు, ప్రపంచ దేశాలన్నీ దృష్టి సారించాల్సి ఉంది. అదే సమయంలో మార్కెట్ దిగ్గజాలు చేసే తప్పొప్పుల్ని నిర్భయంగా బయటపెడుతూ, సమాజానికి కావలి కాస్తున్న హాగెన్ లాంటి వారిని కాపాడుకోవాల్సిన అవసరమూ ఉంది. ఇంత విషం నిండిన సంస్థలో పనిచేస్తున్నామా అనిపిస్తే, రేపు మరింత మంది ఉద్యోగులు ఆమె లాగా అలారమ్ మోగించవచ్చు. దాచేస్తే దాగని ఆ సత్యాలన్నీ బయటకు రావాలి. బెదిరింపులతో వారి నోరు నొక్కేస్తే – సత్యం వధింపబడుతుంది. ధర్మం చెరలోనే మగ్గుతుంది. పారాహుషార్! -
మాట్లాడితే మీనింగ్ ఉండాలి: జుకర్బర్గ్ ఆగ్రహం
ఫేస్బుక్ పంచాయితీ సెనెట్కు చేరిన క్రమంలో మాటల తుటాలు పేలుతున్నాయి. ఫేస్బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్ విజిల్ బ్లోవర్గా మారిపోయి.. ఫేస్బుక్ మీద సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ సైతం ఘాటుగా స్పందిస్తున్నారు. నెలకు మూడు బిలియన్ల మంది యూజర్లు ఉపయోగించుకునే ఫేస్బుక్ మీద మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. యూజర్ భద్రత కంటే లాభాలే ఫేస్బుక్కు పరమావధిగా మారిందని ఆమె తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. ఫ్రాన్సెస్ హౌగెన్, ఇతరత్ర మీడియా కథనాలను కొట్టిపడేస్తున్నారాయన. ఏమైనా అర్థం ఉందా? లాభం కోసం ప్రజలను రెచ్చగొట్టే కంటెంట్ని మేం ఉద్దేశపూర్వకంగా ముందుకు తెస్తామనే వాదన చాలా అవాస్తవికమైనంటూ జుకర్బర్గ్ పేర్కొన్నాడు. ఈ మేరకు ఫేస్బుక్లో ఓ సుదీర్ఘమైన పోస్ట్ చేశారాయన. ‘‘ ఆమె(ఫ్రాన్సెస్ హౌగెన్) మాట్లాడేదాంట్లో అర్థం లేదు. కంటెంట్ ద్వారా ప్రజలను రెచ్చగొట్టడం, వాళ్లను నిరాశలోకి నెట్టేయడమా? బహుశా ఏ టెక్ కంపెనీ చేయదేమో. నైతిక విలువలు, వ్యాపారం.. పరస్సర విరుద్ధ అంశాలు. వాటిని ముడిపెట్టి విమర్శలు చేయడం లాజిక్గా అనిపించడం లేదు. ఫేస్బుక్ అనేది యాడ్స్ నుంచి డబ్బు సంపాదిస్తోందని ముందు నుంచి చెబుతున్నాం. అలాగే తమ యాడ్స్ జనాల్ని రెచ్చగొట్టేవిగానో, కోపం తెప్పించేవిగానో, వాళ్లకు హాని చేసివిగానో ఉండవని అడ్వటైజర్స్ సైతం చెప్తున్నారు. అలాంటప్పుడు ఆమె ఆరోపణలు.. ఆ ఆరోపణల ఆధారంగా వచ్చిన కథనాలు ఎలా నిజం అవుతాయి’’ అని మార్క్ ప్రశ్నిస్తున్నాడు. కాంగ్రెస్ ముందర వివరణ ఇదిలా ఉంటే ఫేస్బుక్లో తప్పుడు సమాచారం నిరోధించే విభాగంలో మేనేజర్గా(ప్రొడక్ట్ ఇంజినీర్)గా గతంలో పని చేసిన ఫ్రాన్సెస్ హౌగెన్.. సంచలన ఆరోపణలతో తెర ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇన్స్టాగ్రామ్ టీనేజీ అమ్మాయిలపై ఎలాంటి చెడు పరిణామాలు చూపిస్తుందో సవివరింగా వివరిస్తూ.. ఫ్రాన్సెస్ హౌగెన్ ‘ప్రొటెక్టింగ్ కిడ్స్ ఆన్లైన్’ పేరుతో సమగ్ర నివేదికను రూపొందించారు. అది ఓ ప్రముఖ పత్రికలో ప్రచురితం అయ్యింది కూడా. ఆ తర్వాత ఓ టీవీ ఛానెల్ ద్వారా కెమెరా ముందుకు వచ్చిన ఫ్రాన్సెస్.. మంగళవారం తాను రూపొందించిన నివేదికను సెనెట్ సభ్యులకు సైతం అంచారు. ‘‘ఫేస్బుక్ పిల్లలకు హాని చేస్తోందని, లాభం కోసమే ప్రయత్నాలు చేస్తోందని నియంత్రించాల్సిన అవసరం ఉంద’ని ఆమె చాలా బలంగా ఆరోపిస్తోంది. తప్పులు కప్పి పుచ్చుకునేందుకు ఫేస్బుక్ ప్రయత్నిస్తోందంటూ సెనెటర్ల ముందు ఆమె వివరణ కూడా ఇచ్చారు. ఇక ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో తప్పుడు సమాచారం, సమాజంపై చెడు ప్రభావం చూపుతున్న వైనంతో పాటు పొరపాటు సరిదిద్దుకోకుండా మరిన్ని తప్పులు చేస్తోందని, అందుకే కంపెనీ నుంచి బయటకు వచ్చినట్టు వెల్లడించారు. ఫ్రాన్సెస్ హౌగెన్ ఆరోపణలతో ఫేస్బుక్ వివాదం కొత్త మలుపు తీసుకుంది.ఇందులో వివరాలు కనుక పక్కా ఆధారాలతో రుజువైతే ఫేస్బుక్ చిక్కులు ఎదుర్కొనడం ఖాయం. కొసమెరుపు: భారత కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి ఆరు నుంచి ఏడు గంటలపాటు ఫేస్బుక్ అండ్ కో సేవలకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. పైకి ఇది టెక్నికల్ ప్రాబ్లం అని చర్చ జరుగుతున్నప్పటికీ.. కొందరు మేధావులు మాత్రం ఫ్రాన్సెస్ హౌగెన్ ఆరోపణలు వెలుగులోకి వచ్చాకే ఇది జరగడంతో ఫేస్బుక్ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా కోట్ల మంది యూజర్ల డాటా అమ్ముకుందనే ఆరోపణల్ని ఫేస్బుక్పై గుప్పిస్తున్నారు. చదవండి: ఆరు గంటల్లో.. ఫేస్బుక్లో ఇది జరిగింది -
అనుసంధాన లోపాలతో అంతరాయం
వాషింగ్టన్, న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్ట్రాగామ్ల సేవలు స్తంభించిన ఏడు గంటల తర్వాత పునరుద్ధరించారు. ఫేస్బుక్ చరిత్రలో ఈ మధ్య కాలంలో జరిగిన అతి పెద్ద అంతరాయం ఇదే. భారతకాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నిలిచిపోయిన సేవలు మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకి తిరిగి అందుబాటులోకి రావడంతో నెటిజన్లు ఊపిరిపీల్చుకున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్ట్రాగామ్ సేవలు అన్ని గంటల సేపు నిలిచిపోవడానికి అంతర్గతంగా నెలకొన్న కమ్యూనికేషన్ టూల్స్లో లోపాలే కారణమని వెల్లడైంది. కన్ఫిగరేషన్ మార్పుల్లో తలెత్తిన లోపాల వల్ల సర్వీసులకి అంతరాయం ఏర్పడింది ఆ సంస్థ ఇంజినీర్ల బృందం తన బ్లాగ్లో వెల్లడించింది. ‘మనం సామాజిక మాధ్యమాల్లో వాడే భాషని కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో మార్చడానికి వీలు కల్పించే కమ్యూనికేషన్ టూల్స్లో లోపం కారణంగా వాటి సర్వీసులు స్తంభించాయి. ఈ లోపం వల్ల అంతరాయం ఏర్పడిందని అనిపిస్తుంది కానీ మనం అనుసంధానం కావడంలో సమస్యలు తలెత్తడమే అసలు కారణం’ అని ఫేస్బుక్ ఇంజనీర్ల బృందం వివరించింది. బిలియనీర్ల జాబితాలో ఐదో స్థానానికి జుకర్బర్గ్ ఫేస్బుక్కి చెందిన మూడు సామాజిక మాధ్యమాల సేవలు చాలా గంటలపాటు ఒకేసారి పనిచేయకపోవడం, ఫేస్బుక్ ప్రజాసంక్షేమం కంటే.. ఆదాయార్జనకే అధిక ప్రాధాన్యమిస్తోందని మాజీ ఉన్నతోద్యోగి ఒకరు ఆరోపించడంతో ఫేస్బుక్ షేర్లు స్టాక్మార్కెట్లో 5 శాతం మేరకు పతనమయ్యాయి. ఫేస్బుక్ నుంచి ఎన్నో సంస్థలు తమ ప్రకటనలు తొలగించడంతో మార్క్ జుకర్బర్గ్ సంపద ఏకంగా 700 కోట్ల డాలర్లు తగ్గిపోయింది. దీంతో ఆయన బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ జాబితాలో మూడో స్థానం నుంచి అయిదో స్థానానికి పడిపోయారు. -
ఫేస్బుక్, వాట్సాప్ డౌన్.. జుకర్బర్గ్ పుట్టి ముంచిన ఆ ఒక్కడు!
WhatsApp, Facebook, Instagram restore services after 6-hours of outage: ఫేస్బుక్ స్థాపించినప్పటికీ ఇప్పటిదాకా చూసుకుంటే.. సోమవారం(అక్టోబర్ 4న) తలెత్తిన సమస్య ఆ సంస్థకు భారీ నష్టాన్ని చేసింది. ఆరు గంటలపాటు ఆగిపోయిన ఫేస్బుక్ దాని అనుబంధ యాప్ సర్వీస్లు ఫేస్బుక్ మెసేంజర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సేవలను సైతం స్తంభింపజేసింది. తిరిగి సర్వీసులు ప్రారంభమైనప్పటికీ.. మొదట్లో మొండికేశాయి కూడా. ఈ ప్రభావం ఇంటర్నెట్పై పడగా.. ట్విటర్, టిక్టాక్, స్నాప్ఛాట్ సేవలు సైతం కాసేపు నెమ్మదించాయి. ఏది ఏమైనా ఈ బ్రేక్డౌన్ ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్కు మాత్రం కోలుకోలేని నష్టాన్ని మిగిల్చినట్లు తెలుస్తోంది. ఫేస్బుక్, దాని అనుబంధ సేవల సర్వీసుల విఘాతం వల్ల మార్క్ జుకర్బర్గ్ భారీ నష్టం వాటిల్లింది. సుమారు ఏడు బిలియన్ల డాలర్ల(మన కరెన్సీలో దాదాపు 50 వేల కోట్ల రూపాయలకు పైనే) నష్టం వాటిల్లింది. ఫేస్బుక్ స్థాపించినప్పటి నుంచి ప్రపంచం మొత్తం మీద ఇంత సమయం పాటు సర్వీసులు నిలిచిపోవడం, ఈ రేంజ్లో డ్యామేజ్ జరగడం ఇదే మొదటిసారి. అంతేకాదు ఈ దెబ్బతో జుకర్బర్గ్ స్థానం అపర కుబేరుల జాబితా నుంచి కిందకి పడిపోయింది. సెప్టెంబర్ మధ్య నుంచి ఫేస్బుక్ స్టాక్ 15 శాతం పడిపోగా.. ఒక్క సోమవారమే ఫేస్బుక్ సర్వీసుల విఘాతం ప్రభావంతో 5 శాతం పడిపోయిందని బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. దీంతో ఐదో స్థానం నుంచి కిందకి జారిపోయాడు జుకర్బర్గ్. ప్రస్తుతం 120.9 బిలియన్ డాలర్లతో బిల్గేట్స్ తర్వాత రిచ్ పర్సన్స్ లిస్ట్లో ఆరో ప్లేస్లో నిలిచాడు మార్క్ జుకర్బర్గ్. అతని వల్లే.. ఇక ఫేస్బుక్ అనుబంధ సర్వీసులు ఆగిపోవడంపై యూజర్ల అసహనం, ఇంటర్నెట్లో సరదా మీమ్స్తో పాటు రకరకాల ప్రచారాలు సైతం తెర మీదకు వచ్చాయి. ది వాల్ స్ట్రీట్ జర్నల్ ‘నెగెటివ్’ కథనాల ప్రభావం వల్లే ఇలా జరిగి ఉంటుందని, కాదు కాదు ఇది హ్యాకర్ల పని రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఇది సాంకేతికపరమైన సమస్యే అని తెలుస్తోంది. డొమైన్ నేమ్ సిస్టమ్(డీఎన్ఎస్).. ఇంటర్నెట్కు ఫోన్ బుక్ లాంటిది. ఇందులో సమస్య తలెత్తడం వల్ల సమస్య తలెత్తవచ్చని మొదట భావించారు. ఆ అనుమానాల నడుమే.. బీజీపీ (బార్డర్ గేట్వే ప్రోటోకాల్)ను ఓ ఉద్యోగి మ్యానువల్గా అప్లోడ్ చేయడం కారణంగానే ఈ భారీ సమస్య తలెత్తినట్లు సమాచారం. అయితే ఆ ఉద్యోగి ఎవరు? అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? కావాలనే చేశాడా? పొరపాటున జరిగిందా? తదితర వివరాలపై స్పష్టత రావాల్సింది ఉంది. సర్వీసులు ఎందుకు నిలిచిపోయాయనేదానిపై ఫేస్బుక్ నుంచి స్పష్టమైన, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బీజీపీ రూట్స్లో సర్వీసులకు విఘాతం కలగడం వల్ల ఫేస్బుక్, దానికి సంబంధించిన ప్రతీ వ్యాపారం ఘోరంగా దెబ్బతిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు కొద్దిగంటల పాటు ఫేస్బుక్ ఉద్యోగుల యాక్సెస్ కార్డులు పని చేయకుండా పోయాయట. దీంతో వాళ్లంతా కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్ హెడ్ ఆఫీస్ బయటే ఉండిపోయారు. ఇక బోర్డర్ గేట్వే ప్రోటోకాల్ (BGP) అనేది గేట్వే ప్రోటోకాల్ను సూచిస్తుంది, ఇది స్వయంప్రతిపత్త వ్యవస్థల మధ్య రూటింగ్ సమాచారాన్ని మార్పిడి చేయడానికి ఇంటర్నెట్ని అనుమతిస్తుంది. Seeing @Facebook's BGP announcements getting published again. Likely means service is on a path to getting restored. — Matthew Prince 🌥 (@eastdakota) October 4, 2021 చదవండి: వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ సేవలు పునరుద్ధరణ చదవండి: ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలకు విఘాతం -
తీవ్ర విమర్శలు.. వెనక్కి తగ్గిన జుకర్బర్గ్
Instagram Kids Version: ఇన్స్టాగ్రామ్ యాప్ టీనేజర్ల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపెడుతుందన్న ఆరోపణలు ఖండించిన ఓనర్ కంపెనీ ఫేస్బుక్.. ఇప్పుడు అనూహ్య నిర్ణయం తీసుకుంది. పిల్లల కోసం ప్రత్యేకంగా ఇన్స్టా వెర్షన్ను తీసుకురావాలనే ప్రయత్నాల్ని తాత్కాలికంగా పక్కనపెట్టేయాలని నిర్ణయించుకుంది. ఇన్స్టాగ్రామ్ కిడ్స్ పేరిట ప్రత్యేక యాప్ను తీసుకొచ్చేందుకు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ గతకాలంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆల్రెడీ యాప్ డెవలప్మెంట్ పనులు ఎప్పుడో పూర్తికాగా.. నేడో రేపో అది లాంచ్ కావాల్సి ఉంది. అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫేస్బుక్ వికృతమైన అడ్డాగా మారుతోందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఈమధ్య వరుస కథనాలు ప్రచురిస్తోంది. ఇందులో భాగంగా ఇన్స్టాగ్రామ్ వల్ల యువత మానసికంగా కుంగిపోతోందని, ఆత్మహత్యలకు పాల్పడుతోందని, ఇదంతా తెలిసి కూడా ఫేస్బుక్-ఇన్స్టాగ్రామ్లు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని కథనాలు ప్రచురించింది. అయితే ఈ కథనాల్ని ఖండించిన ఇన్స్టాగ్రామ్ హెడ్ ‘ఆడమ్ మోసెరి’.. తాజాగా కిడ్స్ ఇన్స్టాగ్రామ్ ప్రయత్నాలపై స్పందించారు. చాలా అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు, మేధావులు, విశ్లేషకులు, పాలసీ మేకర్స్, నియంత్రణ విభాగాల నుంచి పూర్తి స్థాయి ఫీడ్బ్యాక్ తీసుకున్నాకే.. కిడ్స్ ఇన్స్టాగ్రామ్ను తీసుకొస్తామని వెల్లడించారు. ఈ వెర్షన్లో పేరెంటింగ్ టూల్ ఉంటుందని, పిల్లల యాక్టివిటీస్ను నిరంతరం పెద్దలు పర్యవేక్షించవచ్చని, త్వరలో ఈ టూల్కు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని మోసెరి అన్నారు. ప్రస్తుతం 13 ఏళ్లు పైబడిన పిల్లలు మాత్రమే ఇన్స్టాగ్రామ్ ఉపయోగించాలని, ఒకవేళ పిల్లల పేరిట అకౌంట్లు ఉన్నా పర్యవేక్షకులు ఆ అకౌంట్ను నిర్వర్తించొచ్చని గైడ్లైన్స్ ఉన్నాయి. అయితే 13 ఏళ్ల లోబడిన పిల్లల కోసం ఫేస్బుక్.. కొత్త ఇన్స్టా వెర్షన్ను తీసుకురావాలని చూస్తోంది. ఈ ఏడాది మార్చి నెలలో ఈ కిడ్స్ ఇన్స్టాగ్రామ్ వెర్షన్ గురించి అధికారిక ప్రకటన చేశాడు మార్క్ జుకర్బర్గ్. మే నెలలో ఇది వస్తుందనే అంచనాలు ఉండగా.. ఆ టైంలో 44 మంది అటార్నీ జనరల్స్ ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలంటూ జుకర్బర్గ్కు ఓ లేఖ రాశారు. ఇది సైబర్ వేధింపులకు దారితీస్తుందని, లైంగిక వేధింపులకూ ఆస్కారం ఉండొచ్చని పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అభ్యంతరాలపై ఫేస్బుక్ నుంచి స్పందన కరువైంది. మరో విశేషం ఏంటంటే.. 2017లో ఫేస్బుక్లోనూ మెసేంజర్ కిడ్ యాప్ తీసుకురాగా.. దానిపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. చదవండి: అమ్మాయిలూ సోషల్ మీడియాలో ఆ ఆలోచనలు ప్రమాదకరం!! -
నవంబర్ 10న.. ఏం జరగబోతోంది?
సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ ఫేస్బుక్కు వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన ఉద్యమం గురించి.. ఇప్పుడు అదే ప్లాట్ఫామ్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఒక్కరోజు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను లాగ్ అవుట్ చేసి.. దూరంగా ఉండాలని కోరుతున్నారు. పనిలో పనిగా సంస్కరణల దిశగా అడుగువేయాలని ఫేస్బుక్ను కోరుతూనే.. కంపెనీ సీఈవో మార్క్ జుకర్బర్గ్ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. బాయ్కాట్ ఫేస్బుక్ ట్రెండ్. 2021 నవంబర్ 10న ఒక్కరోజు ఫేస్బుక్, దాని అనుబంధ యాప్ ఇన్స్టాగ్రామ్ను సైతం లాగ్ అవుట్ చేయాలని, ఆ ఒక్కరోజు వాటిని దూరంగా ఉండాలని యూజర్లను కోరుతున్నాయి సోషల్ జస్టిస్, అంతర్జాతీయ పౌర హక్కుల సంఘాలు. అమెరికా వేదిక నుంచి ఇస్తున్న ఈ పిలుపును.. ప్రపంచం మొత్తం పాటించాలని, ఆ దెబ్బకు సోషల్ మీడియాలో సంస్కరణలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయవి. గతంలో 2018 టైంలో కేంబ్రిడ్జి అనలిటికా స్కాండల్ వెలుగుచూడడంతో.. డిలీట్ఫేస్బుక్ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ నడిచింది. ఇది యూజర్లను తగ్గించకపోయినప్పటికీ.. కంపెనీ స్టాక్ ప్రైస్ అమాంతం పడిపోయేలా చేసింది. ఆతర్వాత పుంజుకోవడానికి ఫేస్బుక్కు కొన్ని నెలల టైం పట్టింది. నవంబర్ 10న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లను లాగ్ అవుట్ చేయాలని అంతర్జాతీయ పౌరహక్కుల సంఘాలు కోరుతున్నాయి. అందుకు వాళ్లు చెప్తున్న కారణాలివే.. ► ఇంటర్నెట్లో ఫేస్బుక్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం ► రేసిజం, మతపరమైన విద్వేషాలు పెరిగిపోవడానికి ఫేస్బుక్ ప్రధాన కారణం ► ఫేక్, తప్పుదోవ పట్టించే సమాచారం వ్యాప్తి.. ఫేస్బుక్ ద్వారానే ఎక్కువ జరుగుతోందన్న ఆరోపణ ► యూజర్ భద్రత విషయంలో ఫేస్బుక్ పూర్తిగా వైఫల్యం ► కోట్లమంది వాట్సాప్ యూజర్ల డేటాపై నిఘా వేసిందన్న ఆరోపణలు ► ఇక ఫొటో ఫీచర్ యాప్ ఇన్స్టాగ్రామ్పై సైతం నిరసన ► టీనేజర్లపై మానసికంగా దుష్ప్రభావం చూపెడుతుందని తెలిసి కూడా తగిన చర్యలు ఇన్స్టాగ్రామ్ చేపట్టకపోవడం ► మార్క్ జుకర్బర్గ్ను సీఈవో పదవి నుంచి తొలగించాలని.. ► అంతేకాదు ఇన్స్టాగ్రామ్ ఫర్ కిడ్స్ ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్. కాపిటోల్పై దాడి ఘటనతో సహా.. కొన్ని దేశాల్లో జరిగిన ప్రజావ్యతిరేక అంశాలను పరిగణనలోకి తీసుకుని కైరోస్ అనే సంస్థ ఈ క్యాంపెయిన్ను మొదలుపెట్టింది. మొన్న బుధవారం నుంచి మొదలైన ఈ క్యాంపెయిన్.. ఫేస్బుక్ ద్వారానే పుంజుకుంటోంది. సెన్సేషనలిజం కోసం పాకులాడుతూ.. వైషమ్యాలను రెచ్చగొడుతోంది. అందుకే నవంబర్ 10న.. 24 గంటలపాటు ఫేస్బుక్, ఇన్స్టాగగ్రామ్ను లాగ్ అవుట్ చేయాలని కోరుతున్నారు. ఫేస్బుక్ సంపాదన 98.5 శాతం వాటా యాడ్స్తోనే వస్తోంది. అందునా యూజర్లకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో.. సెర్చింగ్ డేటా ద్వారా ఆధారంగా నిఘా వేసి.. సోషల్ మీడియాలో యాడ్స్ రూపంలో ప్రదర్శించడం తెలిసిందే. అంటే.. డాటా దుర్వినియోగం ద్వారానే ఇదంతా జరుగుతున్నట్లు స్పష్టం అవుతోందని పౌర హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. సోషల్ మీడియాలో మార్పు కోసం ఆ ఒక్కరోజు కమ్యూనికేషన్ వ్యవస్థను నిలిపివేసి.. ఫేస్బుక్కు బుద్ధి చెప్పాలని పిలుపు ఇస్తున్నారు.